wife
-
హిందూమహిళ వారసత్వ ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు
సాక్షి, అమరావతి: హిందూమహిళకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ సంతానం లేకుండా చనిపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని చెప్పింది. తన సోదరి శ్రీవిరిత మరణం నేపథ్యంలో ఆమెకు వారసత్వంగా తమ నాయనమ్మ నుంచి సంక్రమించిన భూమి తాలూకు రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయాలని కోరుతూ దేవిక మానస దాఖలు చేసిన అప్పీల్ను అనుమతిస్తూ రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది. ఆర్డీవో ఉత్తర్వులను రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టింది. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను రద్దుచేసింది. రికార్డుల్లో దేవిక మానస పేరు చేర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు చెప్పారు. మనుమరాళ్లకు ఆస్తి ఇచ్చిన నాయనమ్మ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మ తన మనుమరాలు (కుమారుడు దత్తాత్రేయ కుమార్తె) శ్రీవిరితకు 1.50 ఎకరాల భూమిని 2002లో గిఫ్ట్డీడ్ కింద ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో శ్రీవిరిత పేరు మీద మార్పులు చేశారు. 2005లో శ్రీవిరిత మరణించడంతో ఆ గిఫ్ట్డీడ్ను వెంకాయమ్మ 2007లో రద్దుచేశారు. ఆ భూమిని 2011లో మరో మనుమరాలు దేవిక మానసకు గిఫ్ట్డీడ్ ద్వారా ఇచ్చిన వెంకాయమ్మ 2012లో కన్నుమూశారు. అనంతరం ఆ 1.50 ఎకరాల భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తనపేరు చేర్చాలని దేవిక మానస తహసీల్దార్ను కోరారు. దీనికి శ్రీవిరిత భర్త బదిరెడ్డి నాగవీరవెంకట శ్రీరామదొర అభ్యంతరం తెలిపారు.ఆ భూమి తన భార్యదని, దానిపై తనకే హక్కులున్నాయని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాలు చేస్తూ దేవిక మానస రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్డీవో.. తహసీల్దార్ ఉత్తర్వులను తప్పుబట్టి, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని 2017లో ఆదేశించారు. దీనిపై శ్రీరామదొర జాయింట్ కలెక్టర్ (జేసీ) ముందు రివిజన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2017లో ఆర్డీవో జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టారు. ఒకసారి గిఫ్ట్డీడ్ ఇచ్చిన తరువాత దాన్ని రద్దుచేయడానికి వీల్లేదని, సివిల్ కోర్టు ద్వారా మాత్రమే ఆ డీడ్ను రద్దుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య
బెంగళూరులో పెను విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన యువ టెకీ దంపతులు బెంగళూరులో విషాదకరమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32), సోమవారం తన అపార్ట్మెంట్లోని ఒక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాను చందర్ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పనిచేస్తున్నాడు. అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) తమ ఇంటి తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆమె పదేపదే తలుపు తట్టినా లోపల ఉన్న భర్త స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భద్రతా సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారు బలవంతంగా తలుపు తెరిచి చూడగా, భాను మృతదేహం కనిపించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకొన్ని నిమిషాల తర్వాత, షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదంలో మునిగి పోయాయి. తెలంగాణలో కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా రెండు వేర్వేరు బలవంతపు మరణాలు కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాలనుపోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. వీరి మరణాలకు ప్రేరేపించిన అంశాలు ఆరోగ్య సమస్యలా? మానసిక క్షోభ? ఇతర కారణాలపై ఆరాతీస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు! -
పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో జరిగిన ఒక దిగ్భ్రాంతికర ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేయ లేదన్న కోపంతో, ఒక భర్త తన భార్యను నడుస్తున్న బైక్ మీద నుండి నెట్టివేశాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలోరికార్డైనాయి. నిందితుడు, భార్యతో కలిసి బర్త్డే పార్టీకి వెళ్లొస్తూ గొడవ పడ్డారు. అక్కడ పార్టీలో డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో భార్యపై ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. వేడుక ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా దారిలో ఆమెతో మళ్లీ గొడవకు దిగాడు. బైక్ వేగంగా వెళ్తుండగాగానే భర్త భార్యను కిందకు నెట్టివేశాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యంకుటుంబ సభ్యుల ఆరోపణలుఅయితే ఈఘటనపై మృతురాలి పుట్టింటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది కోపంతో జరిగింది కాదనీ, పథకం ప్రకారమే తన కూతుర్ని హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయినప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆమెను హతమార్చారని వారు కన్నీరు పెట్టుకున్నారు.ఇదీ చదవండి: పింక్ ఏనుగు ఫోటోషూట్, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్ चलती बाइक से पति ने पत्नी को दिया धक्का, महिला की हुई मौत यूपी के रामपुर में पति-पत्नी एक बर्थडे पार्टी से लौट रहे थे. पार्टी में पत्नी ने डांस नहीं किया. इससे पति नाराज हो गया. इसी बात को लेकर दोनों के बीच रास्ते में कहासुनी शुरू हो गई, गुस्से में आकर पति ने चलती बाइक से पत्नी… pic.twitter.com/TDkcZ0wY03— Priya singh (@priyarajputlive) March 30, 2026 -
భర్త బతికుండగానే వితంతు పింఛన్ తీసుకున్న భార్య..!
బెంగళూరు: బతికున్న వ్యక్తి చనిపోయాడని పాలికె అధికారులు డెత్ సరి్టఫికెట్ ఇచ్చారు. ఆ పత్రం ద్వారా అతని భార్య రేషన్ కార్డు, ఇతరత్రా ప్రయోజనాల కోసం కిద్వాయి ఆస్పత్రిని మోసం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన మహబూబ్ బాషా (39), షబానా దంపతులు గొడవలు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. నా భర్త చనిపోయాడంటూ షబానా ప్రచారం చేసుకుని గతేడాది ఏప్రిల్ 23న డెత్ సర్టిఫికెట్ను తెచ్చుకుంది. వితంతు మహిళగా ప్రభుత్వం నుంచి వస్తున్న అన్నీ సౌకర్యాలను తీసుకుంటోంది.ఇది తెలిసి మహబూబ్ బాషా లబోదిబోమంటూ కోర్టుకెళ్లారు. చిక్కపేటలోని జనన–మరణ రిజి్రస్టార్ ఈ డెత్ సర్టిఫికెట్ను జారీ చేశారని తేలింది. కోర్టు ఆదేశాల మేరకు బీబీఎంపీ అధికారులు విచారణ చేశారు. షబానా తన భర్త పేరుపై ఉన్న బీపీఎల్, ఆధార్ కార్డును ఉపయోగించి కిద్వాయి ఆస్పత్రిలో మరో వ్యక్తికి చికిత్సలు చేయించింది. అయితే అతడు చనిపోయాడు. అతడు తన భర్తేనని సిబ్బందికి తెలిపింది. అతని పత్రాలన్నీ బాషా పేరుపైనే ఉన్నాయి. దీనితో ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రాలతో ఆమె సులభంగా డెత్ సర్టిఫికెట్ను సంపాదించింది. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని అక్కసుతో భర్తనే కడతేర్చింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లానికి మెహ్రాజ్. తాపీ పనిచేసేవాడు. ఇతని భార్య రూహి. తన సొంత సోదరి బావ ఫర్మాన్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ జంట కలిసి జీవించాలని కోరుకున్నారు.దీనిని మెహ్రాజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. మెహ్రాజ్ ఆహారంలో మత్తుమందు కలిపి, ఆ తర్వాత రాత్రి సమయంలో ఫర్మాన్, అతని స్నేహితుడు అద్నాన్లను ఇంటికి పిలిపించింది.అందరూ కలిసి మెహ్రాజ్ కాళ్లను తాడుతో కట్టివేసి, పదునైన కత్తితో అతని గొంతు కోసి హత్య చేశారు. ఆ ఘోరమైన కృత్యం చేసిన తర్వాత, రూహి తన భర్త శవం పక్కనే ఉన్న మంచం మీద రాత్రంతా నిద్రపోయింది. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ జరిగిందని కట్టుకథ అల్లింది.ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్మరుసటి రోజు ఉదయం మెహ్రాజ్ తండ్రి తన కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, అతని చేతులు, కాళ్లు ఇంకా కట్టేసి ఉన్న స్థితిలో, వరండాలోని మంచం మీద పడి ఉండటాన్ని చూశాడు. దీంతో ఇదంతా దొంగల పని అని, ఎవరో దుండగులు వచ్చి తనపై దాడి చేశారని మొసలి కన్నీళ్లు కార్చింది. కానీ కోడలి మాటలపై అనుమానం వచ్చిన మెహ్రాజ్ తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది.పోలీసులు నిందితులైన రూహి, ఫర్మాన్ , అద్నాన్ను అరెస్ట్ చేశారు. హత్యకు పయోగించిన రెండు కత్తులతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ జైలుకు పంపారు, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి : ట్రంప్కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం -
భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు
పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని, ఇలా అ నేక కోరికలు నెరవేర్చమని దేవుడికి మొక్కుకోవడం, ఆ తరువాత మొక్కులు చెల్లించుకోవడం చాలా కామన్. దయచేసి భార్య నుంచి కాపాడు తల్లీ అని మొక్కుకున్న 25 ఏళ్ల యువకుడి మొర ఆలకించిందట అమ్మవారు. అందుకే వినూత్న రీతిలో ఆ దేవికి కృతజ్ఞతలు తెలిపాడు. అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.విడాకులను వేడుకగా జరుపుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఉత్తర ప్రదేశలోని బస్తీ జిల్లా, సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. భార్యతో ఇబ్బందుల పడిన భర్త, ఆమెనుంచి తన విముక్తి కల్పనించమని దేవుడికి మొక్కుకున్నాడు. ఆ మొక్కు నెరవేరడంతో, వైవాహిక బంధానికి ముగింపు పలికిన సందర్భంగా స్థానిక ఆలయానికి 9 కిలోమీటర్ల 'దండావత్ యాత్ర'ను చేపట్టిన వైనం, చుట్టు పక్కల గ్రామాల్లో చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: ట్రంప్కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశంనార్ఖోరియా గ్రామంలోని మైనిహవాన్ టోలా నివాసి జోగేష్. 2022లో సమీప గ్రామానికి చెందిన పూజను వివాహం చేసుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు గ్రామంలోనే నివసిస్తున్నారు. జోగేష్ తండ్రి జగదీష్ ఒక రైతు. అతనేమో ఢిల్లీలోని పిఓపి (POP) ఫ్యాక్టరీలలో పనిచేసేవాడు. పెళ్లైన రెండేళ్లకే వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. నిరంతరం ఏదో ఒక గొడవ. ఈ ఘర్షణలు, మానసిక ఒత్తిడితో విసిగి పోయిన భర్త, కోర్టును ఆశ్రయించాడు. అదే సమయంలో భార్య బారి నుండి విముక్తి లభిస్తే, తన ఇంటి నుండి ఆలయం వరకు దండావత్ యాత్ర చేస్తానని ‘మా బైదా సమయ్ మాతా’ ఆలయంలో మొక్కుకున్నాడు. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత, ఈ ఏడాది జనవరిలో అతనికి విడాకులు మంజూరైనాయి. దీంతో అతనితో పాటు,అతని కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. అయిత జోగేష్ ఉండేది ఢిల్లీలో ఉన్నందున మొక్కు తీర్చుకోవడం ఆలస్యమైంది.అయితే, పవిత్ర నవరాత్రులు సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు మార్చి 27వ తేదీన, దండావత్ యాత్ర చేయడానికి భాన్పూర్ ఎస్డిఎం హిమాంశు కుమార్నుంచి అనుమతి తీసుకుని మరీ మాతా ఆలయం వరకు 12 గంటల్లో 9 కిలోమీటర్ల దండవత్ యాత్రను పూర్తి చేశాడు.చట్టపరంగా, సామాజికంగా తన భార్య నుండి విముక్తి లభించడంతో మొక్కును తీర్చుకోవాలని ఉదయాన్నే అన్నపానీయాలు ముట్టుకోకుండా, తన గ్రామం నుండి భాన్పూర్లోని అమ్మవారి ఆలయానికి పొర్లు దండాలు పెడుతూ ఆలయానికి చేరుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రయాణంలో అతని తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామానికి చెందిన అనేకమంది ప్రజలు డప్పులు వాయిస్తూ, అమ్మవారి నామాన్ని జపిస్తూ ఊరేగింపుగా వెళ్లారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా వారితో పాటు ఉన్నారు.సాయంత్రం 6 గంటలకు, రక్తసిక్తమైన మోకాళ్లతో, అలసిపోయిన శరీరంతో గుడికి చేరుకున్న అతను, అమ్మవారి దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. వైవాహిక జీవిత నరకం నుండి బయటపడ్డాక ఇప్పుడు తనకు ప్రశాంతంగా ఉందని అతను మీడియాతో చెప్పాడు. -
ఫ్రెండ్స్ గ్యాంగ్తో నమ్రత (ఫోటోలు)
-
భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
భార్యకు యూజ్డ్ కార్ స్పెషల్ గిప్ట్ ఇచ్చిన దర్శకుడు, ధర?
ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.ఫీచర్లుఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్తో ఇది లభ్యం. 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్తో ఎలక్ట్రిక్ వెర్షన్లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.ధర ఎంత?భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు. -
పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)
-
భార్య జీవిత భాగస్వామి.. పనిమనిషి కాదు!
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. -
పేరేంట్స్గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)
-
టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)
-
కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య
కరీంనగర్క్రైం: కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుందని వన్టౌన్ సీఐ రాంచందర్రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్నగర్లో నివాసం ఉంటూ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్ చంద్రశేఖర్ భార్య దివ్య(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాధ భరించలేక మంగళవారం మధ్యాహ్నం గన్నేరుపువ్వుల రసం తాగింది. ఈ విషయం పోలీసుస్టేషన్కు వెళ్లిన చంద్రశేఖర్కు ఫోన్చేసి చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. దివ్య తండ్రి తెడ్ల చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు -
భార్య, మామను హత్య చేసి పెట్రోల్తో తగలబెట్టిన అల్లుడు
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లాలోని కడిపికొండ రాజీవ్ గృహాకల్పలో ఒక వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు ప్రవీణ్కు, అతని భార్య రాజశ్రీకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. చిన్నపాటి మనస్పర్థలు కాస్తా ముదిరి పెద్ద గొడవలకు దారితీశాయి. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్, తన భార్య రాజశ్రీతో పాటు మామ రాజశేఖర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత, పక్కా పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్ను వారిపై పోసి నిప్పంటించాడు.ఈ ఘటనలో ఇద్దరూ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారినట్లు సమాచారం.అనంతరం నిందితుడు తన కుమారుడు, కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
భార్య మాట... బంగారు బాట!
టి20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా అడుగు పెట్టడం... సొంతగడ్డపై విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండా వరల్డ్కప్ ఆడటం... మెగా టోర్నమెంట్కు ముందు అనూహ్యంగా ఇషాన్ కిషన్పై భరోసా పెట్టడం... కీలక మ్యాచ్ల్లో సంజూ సామ్సన్కు అండగా నిలవడం నుంచి మొదలుకొని... భార్య సలహాలతో ఆలోచన విధానాన్నే మార్చుకొని టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే వరకు... టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్లోని పలు కీలక దశలపై ‘పీటీఐ’ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఐపీఎల్తోనే సరిపెట్టుకోవాలనుకున్న తాను... భార్య సూచనలతో భారత జట్టు కెప్టెన్గా ఎదగడం... తరగతి గదిలో సాధించలేనిది మైదానంలో చేసి చూపడం ఇలా సూర్యకుమార్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్రైడర్స్కు ఆడుతున్న సమయంలో దివిశతో నా వివాహం జరిగింది. జీవితం సాఫీగా సాగిపోతున్నట్లే అనిపించింది. రెండేళ్ల తర్వాత 2018లో ముంబై ఇండియన్స్తో జతకట్టా. అదే సమయంలో నా భార్య ఒక ప్రశ్న వేసింది. ‘ఏజ్ గ్రూప్ క్రికెట్లో నీతో కలిసి ఆడిన వాళ్లు చాలా మంది ఇప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నీ మనసులో ఏం ఉంది’ అని సీరియస్గా అడిగింది. ఆ సమయంలో నాకు కూడా టీమిండియా తరఫున ఆడాలని ఉంది అని చెప్పా. అయితే అందుకు నీ ప్రయత్నాలు ఏవి అని నేరుగా ప్రశ్నించింది. ఇలా ఇద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ నా ఆలోచన ధోరణి ని మార్చింది. అప్పటి నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించే విషయంపై మరింత దృష్టి సారించా. ఆలోచనల నుంచి ఆహారం వరకు మొత్తం మార్చేశా. సినిమాలు, షికార్లు అన్నీ పక్కన పెట్టి తీవ్రంగా శ్రమించా. ఆ ఫలితం త్వరలోనే కనిపించింది. 2018లో ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబర్చా... అలాగే దేశవాళీల్లోనూ భారీగా పరుగులు చేశా. అలా వరుసగా మూడేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో మంచి ఇన్నింగ్స్లు ఆడా. 2020లో ఫినిషర్గా బాగా రాణించా... దీంతో మరుసటి ఏడాది టీమిండియా తరఫున పిలుపు వచ్చింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మరవలేను. భార్య అడిగిన చిన్న ప్రశ్న నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అలా అని తను నా కెరీర్లో జోక్యం చేసుకోదు. ఎలా ఆడాలి అనే విషయాల గురించి అసలు మాట్లాడదు. కానీ నా ఆలోచన విధానాల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అందుకే నా విజయాల్లో అగ్రభాగం ఆమెకే దక్కుతుంది. అలా అని ఇంట్లో ఎప్పుడూ క్రికెట్ చర్చే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. ఆటను గేటు బయటే పట్టి ఇంట్లోకి రమ్మని అంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు సూర్యకుమార్ యాదవ్ కాదు... కేవలం సూర్య మాత్రమే అంటూ చమత్కరిస్తుంది. అప్పటికి ఇప్పటికి అదే తేడా... 2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో... తాజాగా ట్రోఫీ చేజిక్కించుకున్న జట్టులో చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయి. 2024 టీమ్లో అనుభవంతో కూడిన జోరు ఉండేది... ఇప్పుడు జట్టులో యువరక్తం ఉరకలు వేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రూపంలో జట్టులో అనుభవజు్ఞలు ఉండేవారు. ఎవరి బాధ్యతలు వారికి పక్కాగా ఉండేవి. ప్రస్తుత జట్టులో అనుభవం ఎక్కువగా లేకున్నా... ఉత్సాహం మాత్రం కావల్సినంత ఉంది. స్వదేశంలో ఆడటంపై... ప్రపంచకప్ అంటే అంచనాలు భారీగా ఉండటం సహజం. ద్వైపాక్షిక సిరీస్ల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తుండటంతో పాటు... డిఫెండింగ్ చాంపియన్గా మాపై విపరీతమైన అంచనాలు ఉంటాయని మాకూ తెలుసు. టీమిండియాపై అది ఎప్పుడైనా సహజమే. భావోద్వేగాల విషయంలో గత టోర్నీకి ఇప్పటకీ పెద్ద తేడా లేదు. కానీ... సొంతగడ్డపై మ్యాచ్లు ఆడుతుండటంతో అది మరి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. టి20ల్లో చేయితిరిగిపోయింది జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. దేశవాళీల్లో 10–12 ఏళ్లు ఆడాను. ముంబైలో క్రికెట్ ప్రారంభించిన వాళ్లు ఎవరైనా... ఎర్ర బంతితోనే ప్రాక్టీస్ చేస్తారు. నేను అంతే! అయితే టీమిండియా తరఫున ఏకైక టెస్టు మ్యాచ్ ఆడా. వన్డేల్లో నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ అదీ సాధ్యపడలేదు. టి20 ఫార్మాట్లో మాత్రం చేయితిరిగిపోయింది. టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జితేశ్ శర్మను కాదని ఇషాన్ను ఎంపిక చేశాం. అప్పుడే అతడితో ట్రోఫీ గెలిపిస్తావా అని అడిగాను. ముందు నమ్ము అని అన్నాడు. అదే జరిగింది. సామ్సన్ను తుది జట్టులోకి తీసుకున్న తర్వాత టోర్నమెంట్లో మా జట్టు ఆటతీరే మారిపోయింది. -
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రాజంపేట: ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్సార్ కడప జిల్లా మన్నూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలెట్ శ్రీరాం శ్రీనివాస్ 2017లో కృష్ణవేణి(30)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరు బోయనపల్లెలోని శ్రీరామ్నగర్లో నివాసం ఉండేవారు. శ్రీరాం మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈనెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరాం శ్రీనివాస్ కృష్ణవేణిని బెల్టుతో కొట్టాడు. ఆమెను చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదనకు గురైన మృతురాలు బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకొని ఉరి వేసుకుంటుండగా, నిందితుడు ఆమెను కాపాడకపోగా , ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్ఫోన్లోనే వీడియో తీశాడు. ఉరి అలా కాదు.. కృష్ణా.. సరిగ్గా వేసుకో అంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరివేసుకుని మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి, మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచి్చన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్ 108 బీఎన్ఎస్ కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరాం శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
భార్య వేధింపులకు మరో భర్త బలి
-
అతడు c/o ఆమె
ఆమె నా బాబా భవానీ: డా.గురవారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులుబాగా అరిగిపోయిన ఓ రొటీన్ సూక్తితోనే మొదలుపెట్టాలంటే ‘ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ హస్తం తప్పక ఉంటుంద’ంటారు. నా విజయాలూ, ఉత్థానాలూ, జీవితమూ అన్నింటి వెనక నా లైఫ్ పార్ట్నర్ భవానీవి రెండు హస్తాలూ, పాదాలూ... ఆ మాటకొస్తే మొత్తంగా తానే ఉంటుంది. జోక్స్ అపార్ట్... భవానీ నా పట్ల తన ప్రేమను ప్రకటించేనాటికి నేనో మామూలు మెడికల్ స్టూడెంట్ని. వాళ్లది ఆర్థికంగా, సామాజికంగా చాలా ఎత్తున ఉన్న కుటుంబం. ఆ టైమ్లో ఆమె నా గురించి వాళ్ల నాన్నకు ఓ లెటర్ రాసింది. ‘ఇవాళ అతడో మామూలు వ్యక్తి కావచ్చు.కానీ రేపు తన జీవితంలో ఓ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. చాలా ఎత్తులకు ఎదుగుతాడు. అంతకు మించి మంచివాడు. నా భాగస్వామిగా చాలా కరెక్ట్’ అంటూ తన లేఖలో నా గురించి చెప్పింది. నా మీద నాకూ ఆత్మవిశ్వాసం ఉండేది. అయితే భవానీకి మాత్రం నా మీద నాకు ఉన్న దాని కంటే కూడా నా సామర్థ్యాల మీద ఆమెకు ఉన్న నమ్మకం చాలా చాలా ఎక్కువ. మామూలుగానైతే ఫలానావాడు నాకు తగినవాడా కాదా అంటూ అమ్మాయిలు ప్రేమపరీక్షలు పెడుతుంటారు. తమ గీటురాయి మీద ఒకటికి నాలుగుసార్లు పరీక్షించి చూస్తూ ఉంటారు. కానీ నా విషయంలో అంతా డిఫరెంట్. నేను భవానీకి ప్రేమ పరీక్షలు పెట్టాను. కారుల్లో తిరిగే అమ్మాయిని సిటీబస్సుల్లో ఇరికిస్తే ఎలా తట్టుకుంటుందో తెలుసుకోడానికి గుంటూరు శ్రీనివాసకాలనీ నుంచి నాజ్ సెంటర్ వరకు సిటీబస్సుల్లో తిప్పేవాణ్ణి. అలా మా సిటీబస్సు టైర్ల జాడల్లో పయనించగలదా లేదా అని ఆమెనుటెస్ట్ చేస్తూ ఉండేవాణ్ణి. తనకున్న ఆర్థిక సామాజిక నేపథ్యం కారణంగా భవానీకి అన్ని సదుపాయాలూ సమకూరి ఉండేవి. ఓ చిన్నకూతురుగా ఆమె ఆ ఇంటి గారాలపట్టి. నేను అప్పట్లో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాణ్ణి. అలాంటిది తాను తన ప్రివిలేజెస్ అన్నింటినీ వదులుకొని ఓ పెద్దకోడలు హోదాలో ఇంటి బాధ్యతలన్నింటినీ తలకెత్తుకుంది. వాటిని ఎంతో బాధ్యతాయుతంగా నిభాయించింది కూడా. ఆ సమయంలో నా ఆర్థికలేమిని ఏమాత్రం లెక్కచేయకుండా నా వెంటనడిచింది. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నానంటే... నా చదువు పూర్తయ్యాక పూణేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా జీతం కేవలం రూ.1,800 మాత్రమే! అలాంటి మా ఇంటికి వచ్చిన భవాని ఇంటి పెద్దకోడలుగా నా పెద్ద ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుని మా తమ్ముళ్లకు వదినగా... మా అమ్మనూ, నాన్ననూ చూసుకుంటూ వాళ్ల కూతురిగా ఉండిపోయింది. ఇంగ్లాండ్లో నేను ఉద్యోగాల కోసం పరుగెత్తుతూ ఉన్నప్పుడు నా కుటుంబం పర్యవేక్షణ ఆమె కనుసన్నల్లోనే సాగింది. నేనెక్కడో సుదూరతీరాల్లో ఉన్నప్పుడు ఇంటి పెద్ద్దకొడుకు స్థానాన్నీ ఆమే భర్తీ చేసింది. అలా నా కలలను తరుముతూ వాటిని అందుకునేందుకు వాటి వెంట నేను పరుగెత్తుతున్నప్పుడు నా వెన్నంటే ఉంది. అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ!!నేను ఆమెను సరదాగా ‘బాబా భవానీ’ అంటూ పిలుస్తుంటా. ఈమాట ఎందుకు చె΄్పాల్సి వస్తుందంటే ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఏరోజూ తనని ఆనందంలో ఎగరడం గానీ... దిగులులో తరగడంగానీ చూడలేదు. ఎప్పుడూ ఒకేలా ఉండటం మహర్షులకే కదా సాధ్యమయ్యేది. అందుకే నాకెప్పుడూ ఆమె మా ‘బాబా భవానీ’యే! నేను తీసుకునే నిర్ణయాలను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. నా తప్పులను విమర్శనాత్మకంగా చూస్తుంది. ఎక్కడైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని పెద్దమనసుతో భరిస్తుందీ... సరిచేస్తుంది. నా ఆనందాలూ, నా అభిరుచులూ, నాకు నచ్చే విషయాలూ ఆమెకు నచ్చకపోయినా నా స్పేస్లో నన్ను ఉండనిస్తుంది. అలా ఉండనిచ్చినంత సేపూ ఉండనిచ్చి... తాను ముందుకెళ్తూ నన్నూ తీసుకెళ్తుంది.తీరని రుణం: చంద్రబోస్, ప్రముఖ గీతరచయితమన వెనకాల నిశ్శబ్దంగా కొంతమంది శ్రమిస్తూ ఉంటారు. అది ప్రపంచానికి తెలియదు. మనం మన వెలుగులో ఉంటాం. రాణిస్తుంటాం. గుర్తింపునకు నోచుకుంటాం. అందరి అభినందనలూ, సన్మానాలు మనం పొందుతుంటాం కానీ.. మనం ఇంత దూరం రావడానికి వెనకాల నిశ్శబ్దంగా, నిరంతరం పని చేస్తూనే ఉంటారు. శ్రమిస్తుంటారు. వారే ఇంటి ఇల్లాళ్లు. మా ఆవిడ (ప్రముఖ కొరియోగ్రాఫర్–డైరెక్టర్ సుచిత్ర) నిరంతరం తెర వెనకాల పని చేస్తూ, కష్టపడుతూ నా గురించి ఆలోచిస్తూ నన్ను ఇంకా బాగా రాసే విధంగా ప్రోత్సహిస్తూ ఉండటం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. దీని వెనకాల ఉన్నదంతా ఒక స్త్రీ మూర్తి, స్త్రీ శక్తి. తనను గుర్తు చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందం. నిజానికి తను ఎన్నో సాధించింది. ఎన్నో వందల సినిమాల్లో వేల పాటలు కంపోజ్ చేసింది. ఎంతో గుర్తింపు పొందింది. తను ఒక పెద్ద టెక్నీషియన్ అయినా, తను నా కన్నా సీనియర్ అయినా నా జీవితంలోకి వచ్చాక నా జీవితం కోసం, నా భవిష్యత్తు కోసం పాటు పడిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో అనుబంధం కాదు... రుణానుబంధమే అయ్యుంటుంది. ఎందుకంటే ఎక్కడో చెన్నైలో పుట్టిన తను, వరంగల్లో పుట్టిన నేను.. మేమిద్దరం కలిసేలాగా చేసింది విధి. ఇదంతా కూడా భగవంతుడి లీలేమో అనుకుంటుంటాను. ఈ మహిళా దినోత్సవం రోజు మన జీవితంలోని మహిళలు... వాళ్లెంత గొప్పవాళ్లు, మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారు, మన క్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ఆనందం కోసం, మన విజయం కోసం ఎంత శ్రమిస్తారు, ఎంత చెమటోడుస్తారు, ఎన్ని కన్నీళ్లు కూడా కారుస్తారు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్లకు మనం ఏమిచ్చినా ఆ రుణానుబంధం రుణం తీర్చుకోలేం. స్త్రీలు మొత్తం ఉన్నదంతా మనకిచ్చేసి తిరిగి వాయిదాల పద్ధతిలో చిన్నచిన్నగా కొంత కొంత అడుగుతారు. మనం ఇవ్వాల్సింది ప్రేమ, గౌరవం, గుర్తింపు, కాస్త మన సమయం, తనకు కావలసిన సమయం ఇచ్చి, ఎప్పుడు వెనకాల ఉంటూ వాళ్లు మన విజయాలను చూసి ఆనందించేలాగా మనం విజయపథంలో నడవడం వాళ్లకు నిజంగా గొప్ప బహుమతి అని భావిస్తున్నాను.నాలో మార్పు తీసుకొచ్చిందిచాలా విషయాల్లో నాలో మార్పు తీసుకువచ్చింది మా ఆవిడ సుచిత్ర. చాలా విషయాల్లో అంటే నా అలవాట్లు, నా వ్యసనాలు, తరువాత నా పద్ధతులు ఇవన్నీ మారడానికి ప్రధాన కారణం నా భార్య. నాకు 21 ఏళ్ల క్రితం కొన్ని చెడు అలవాట్లుండేవి. పాట రాసేపుడు ఒక చెడు అలవాటుతో కూర్చొని రాసేవాణ్ణి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది హానికరం అని చాలా విధాలుగా చెప్పినా నేను వినలేదు. కానీ తను ఓపిగ్గా చెబుతూ చెబుతూ ఇంతకాలంగా చెబుతోందని దృష్టి పెట్టేలాగా చేసింది. అపుడు ఆ అలవాటు నుంచి పక్కకొచ్చాను. చాలా చాలా మంచి జీవితానికి అపుడు శ్రీకారం చుట్టాను. అట్లాగే ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబాన్ని పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకోవడం. పిల్లలు గానీ, మా కుటుంబ సభ్యులు గానీ, మా వైపువాళ్లు, మా స్నేహితులు, ఇంకా ఇంటికొచ్చేవాళ్ల ఆదరణ అంతా తాను చూసుకోవడం. కుటుంబం కోసం నా సమయాన్ని వెచ్చించనివ్వకుండా పూర్తిగా నా వృత్తి మీద, నా పాటల మీద మాత్రమే పెట్టేలాగా అంత సమయాన్ని నాకిచ్చింది. వేరే ఏమీ ఉండదు పాట.. పాట.. లేదంటే చదవడం చదవడం. ఈ రెండే... అంటే సృజించడం... అధ్యయనం చేయడం ఈ రెండే .. వీటి మీదే మనసు లగ్నం చేసేలాగా నన్ను సిద్ధం చేసిందన్నమాట. ఇంకొకటి ఏంటంటే... అసలు ఆస్కార్ వస్తుందని ముందు ఊహించిందే నా భార్య. ఆస్కార్ కంటే ముందు ఆస్కార్ తను నాకిచ్చింది. 2022 డిసెంబర్ 22న నాకు ఒక ఉత్తరం రాసిచ్చింది – మీరు ఆస్కార్ అవార్డు సాధించబోతున్నారని. అప్పటికి నామినేషన్స్కు కూడా ప్రక్రియ మొదలవ్వలేదు. ఊరికే నామినేషన్కి పంపించామంతే! అప్పుడు తను నాకు ఉత్తరం రాసిస్తే ఇది ఎలా... అన్నాను. మీరు చూడండని చెప్పి దృఢమైన విశ్వాసంతో దేవుడికి పూజలు చేయడం మొదలు పెట్టింది. నేను అసలు నమ్మలేదు. నామినేషన్ 35 నుంచి 15 లోకి; 15 నుంచి 5 లోకి వచ్చింది మనది. అప్పుడు నమ్మడం మొదలెట్టాను. అవును... మా ఆవిడ చెప్పింది ముందే అని. ఏంటంటే నమ్మకం అనేది ఒక పక్షి లాంటిదని. పక్షి సూర్యోదయాన్ని అందరికంటే ముందే, లోకం కంటే ముందే పసిగడుతుంది. అట్లా మా ఆవిడ ఒక నమ్మకంతో ముందుకెళ్లింది. ఆ నమ్మకాన్ని నాలో కూడా నింపింది. నాలో కూడా ఆ నమ్మకం కలిగేలాగ చేసింది.ఒక కవిగా నేను చెడు అలవాట్లతో చెడు పద్ధతులతో ఉంటూ మంచి మాట చెప్పినా దాంట్లో నిజాయితీ లోపిస్తుందని నా భావన. అందువల్ల మనం మంచి దారిలో ఉండి మంచి మాట చెబితే అది సరైన పద్ధతి. అలా ఆ సరైన పద్ధతిలోకి తీసుకువచ్చింది నా భార్య. నేను రాత్రిపూట రాసేవాణ్ణి. పగటిపూట రాసేలా నన్ను ప్రోత్సహించి నాలో నమ్మకాన్ని నింపింది. ఇప్పుడు హాయిగా రాత్రి పడుకోవడం... పగలు రాయడం.బెటర్ ఫుల్: మల్లాది వెంకట కృష్ణమూర్తి, ప్రముఖ రచయితనా జీవిత కథలోని ప్రధాన పాత్ర పద్మజ. పద్మజ నా భార్య. మాకు ఎలా పరిచయమైంది? 1982లో ఓ వారపత్రిక సంపాదకుడు ఏదైనా మంచి శీర్షిక సజెస్ట్ చేయండి అని అడిగితే ‘మీ భార్యని మీరు ఎలా ఎప్పుడు కలుసుకున్నారు?’ అనే శీర్షికని సూచించాను. ‘పెళ్లిచూపులు లేదా పార్క్ అంతేగా?’ అని ఆయన దాన్ని స్వీకరించలేదు. కానీ అందరూ తమ భార్యలని అలాగే కలుసుకుంటారా? పద్మజ స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చింతలపూడి. అభిమాన రచయితగా నాకు అక్కడ నుంచి రాసిన ఉత్తరాల ద్వారా మా పరిచయం. నన్ను చూడాలని ఉందంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేయమని ఆఫీస్ నంబర్ ఇచ్చాను. అలా 1983లో నిమ్స్ హాస్పిటల్లో కలిశాను. కొద్దిసేపట్లో ఆమెకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. నేను అమెరికన్ హాఫ్డాలర్ కాయిన్ని ప్రెసెంట్ చేశాను. లాస్ట్ మినిట్లో సర్జన్ సర్జరీ అవసరం లేదని చెప్పడంతో అది లక్కీచామ్గా పద్మజ భావించింది. ఈ రోజుకి అది తన దగ్గర భద్రంగా ఉంది.పద్మజలో సాహిత్యం మీద చక్కటి అభిరుచి ఉంది. అందరికి తెలిసిందే... సోక్రటీస్ భార్య కోపంగా అతని మీద కడవలో తెచ్చిన నీళ్లు కుమ్మరించింది. ఆయన ప్రశాంతంగా ‘ఈ రోజు వాన, ఉరుములు కలిసి వచ్చాయి’ అని శిష్యులతో చె΄్పాడు. ‘ఆమె ఎందుకు కుమ్మరించింది?’ అనే కోణంలోంచి ఆలోచించి తను రాసిన మొదటి కథ ‘సోక్రటీస్ భార్య’ నాకు బాగా నచ్చింది. పద్మజ పురుష ద్వేషి కాకపోయినా ఆ కథలో స్త్రీవాదం స్పష్టంగా ఉంది. ఆమె స్త్రీవాది అనే చె΄్పాలి. పద్మజ చక్కటి ఇల్లాలు. ముందు నేను, తర్వాత పిల్లలు ముఖ్యం. ఆ తర్వాతే మరేదైనా. 1989లో నేను యూరప్ వెళ్తూ తనని కూడా రమ్మంటే ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలి రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆ జాబితాలో మనవరాలు, మనవడు కూడా చేరారు. తనకి నా మీద ఎంత శ్రద్ధ అంటే ఏ రోజు నేను వేసుకోవాల్సిన బట్టలు ఆరోజు తనే ఇస్తుంది. ఏ కారణంగానైనా అన్నం కొంచెం తక్కువ తింటే తను రుచిగా వండలేదని బాధపడుతుంది. అది కాదని చెప్పినా నమ్మదు. మా ముగ్గురు పిల్లలు కావ్య, ఊహ, లిపి తల్లిని స్నేహితురాలుగా భావిస్తారు. అన్ని మనసు విప్పి ఫ్రీగా చర్చిస్తారు. నాతో మాత్రం అలా కాదు.తమస్విని అనే కలం పేరుతో కౌముది డాట్ నెట్లో ‘సంసారంలో సరిగమలు’ అనే శీర్షికతో 10 ఏళ్ళుగా 100కి పైగా కథలు రాసింది. ఇవన్నీ మన మధ్య కనపడే మధ్యతరగతి మనుషులకి చెందిన కథలే. నా మొదటి పాఠకురాలు పద్మజ. నా రచనలను పత్రికకి పంపే ముందు తనే తప్పులను దిద్దుతుంది– ఈ వ్యాసంతో సహా. ప్రూఫ్రీడింగ్, పుస్తకాలకి పేజ్ మేకప్ తనే చేస్తుంది. పద్మజ తండ్రి ఎం.ఎ. సాంస్క్రిట్ పండిట్గా పని చేసేవారు. ఆయన పిల్లలకి తెలుగుని బాగా నేర్పించారు. ళ ని ల గా, ణ ని న గా పలికితే తను చాలా బాధపడుతుంది. అలాగే, నేను సెన్సిటివ్ కానీ కవిత్వాలు రాయలేను. తను నా అంత సెన్సిటివ్ కాదు కానీ టచింగ్గా ఉండే కవిత్వాలు రాయగలదు. పద్మజకూ నాకూ వయసులో పదహారేళ్ల తారతమ్యం ఉన్నా పద్మజకి నాతో సమానమైన మెచ్యూరిటీ ఉంది. సమానం అన్నానా? తప్పు. ఇంకాస్త ఎక్కువ మెచ్యూరిటీ ఉంది.1996లో తను పీజీ చేయాలని అనుకుంది. నేను అందుకు అభ్యంతరం చెప్పలేదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ లో పీజీ చేసింది. తనకి రాజకీయాల మీద అవగాహన ఉంది. నిత్యం దినపత్రిక చదువుతుంది. కాఫీ తాగే టైంలో దినపత్రిక చదివేప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది. 2000వ సంవత్సరం నుంచి పద్మజే ఆర్థిక వ్యవహారాలు, ఇంటి విషయాలు చూసుకుంటోంది. ఎప్పుడైనా అనుమానం వచ్చినా, సలహా అవసరమైనా నాతో సంప్రదిస్తుంది. పెద్దయ్యాక పిల్లలు ముగ్గురు విదేశాలకు వెళ్లాక మేము ఇప్పుడు ఇద్దరమే ఒంటరిగా ఇంట్లో. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి వంట చేయడం ఓ సరదా. మా అమ్మ చివరి దశలో ఆఖరి పదేళ్లు నా దగ్గర ఉన్నప్పుడు ఓపెన్గా పద్మజతో ఆవిడ చెప్తూ ఉండేది ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని. అయినా చివరిదాకా మా అమ్మని పద్మజ ఎంతో సహనంగా శ్రద్ధగా చూసుకుంది. మా అమ్మలో ఆ ద్వేషం పోకుండానే వెళ్ళిపోయింది. కారణం శాఖాభేదం!పద్మజకి వంట చేసుకుని తినడమే ఇష్టం. బయటి భోజనం ఇష్టం ఉండదు. సాధ్యమైనంత వరకు రెస్టారెంట్స్కి వెళ్లడానికి అవాయిడ్ చేస్తుంటుంది ముఖ్యంగా పిల్లల దగ్గరికి విదేశాలకు వెళ్ళినప్పుడు అనేక దేశాలకు చెందిన రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం పీజా, న్యూడిల్స్ లాంటివి తనకి ఇష్టం ఉండదు. అన్నం మాత్రమే ఇష్టం. నేను చాలా తరచూ మా పిల్లలకి చెప్పే జోకు ‘నాకు ఇది వద్దు’ అంటే చిన్నప్పుడు మీ అమ్మ అది తినలేదు కాబట్టి వద్దు అంటుంది. చిన్నప్పడు ఏం తిన్నదో అదే తింటుంది. కొత్తవి ఏమి తినదు. రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఒక్కోసారి ఇంటికి వెళ్లి అన్నం వండుకొని తినే సందర్భాలు కూడా ఉన్నాయి. మల్లాది ముచ్చట్లు అనే టోరీ రేడియో కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:30 నుంచి 11:30 దాకా వస్తుంది. ఆ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మేమిద్దరం కలిసి నిర్వహిస్తున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంటుంది, పద్మజని కాక నేను మరొకరిని ఎవరినైనా చేసుకుని ఉంటే బహుశా విడిపోయి, ఈరోజు ఒంటరిగా ఉండేవాడినేమో అని. మేమిద్దరం కలిసి కొనసాగడానికి కారణం పూర్తిగా పద్మజే.మా ఇద్దరిలో నవ్వని వ్యక్తి నేను. ఎప్పుడూ నవ్వే వ్యక్తి పద్మజ. తను మాటకారి. నేను ముభావిని. తను లగ్జరీలని ఇష్టపడుతుంది. నేను మినిమలిస్ట్ని. నేను ఇంగ్లీషు పాత సినిమాలు చూడడానికి ఇష్టపడతాను. తను కొత్తగా వచ్చే సిరీస్ని చూడడానికి ఇష్టపడుతుంది. ఇలా మేము చాలా విషయాల్లో ఉత్తర దక్షిణ ధ్రువాలైనా మా మధ్య ఎలాంటి ఇబ్బందీ లేదు. కారణం ఒకరి పట్ల మరొకరికి గల సహనం.ప్రతి కష్టంలోనూ నాతో...: బాబీ, ప్రముఖ సినీ దర్శకుడునా లైఫ్లో నా వెనకాలే కాదు ముందు కూడా స్త్రీనే ఉంది. ముందు ఉండే స్త్రీ అమ్మ అయితే, వెనకాల ఉండే స్త్రీ నా భార్య అనూష. ఎక్కడో గుంటూరులో ఉండే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలకి వెళ్ళడానికి డబ్బులిచ్చి ఎంకరేజ్ చేసింది మా అమ్మ. అయితే ప్రేమలో ఉన్నప్పుడు నేను సినిమాలలోకి వెళ్ళి దర్శకుడిని అవుతా అంటే నా వెనక ఉండి నా వెన్ను తట్టింది నా భార్య. నాకు ముందు... వెనక వీళ్ళు ఉండటం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను.అనూషతో ప్రేమలో ఉన్నప్పుడు నేను ఇంట్లో చెప్పుకోలేని సీక్రెట్స్ అన్నీ తనతో చెప్పుకునే వాడిని. ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నాక నేను మనసులో అనుకునే అబద్ధాన్ని కూడా తను ముందే గెస్ చేసి ‘మీ అమ్మానాన్నకి చెప్పినట్టు నాకు చెప్పలేవు’ అని హెచ్చరిస్తుంది. తనకి నేనొక తెరిచిన పుస్తకం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అంటారు కదా. అలా నేను నా కథలన్ని మొదట తనతోనే చెబుతాను. వంద శాతం నిర్మొహమాటంగా బాగుంటే బాగుంది అని బాలేకపోతే బాలేదని చెబుతుంది. కథలే కాదు... ట్యూన్స్, టీజర్స్, ప్రోమోస్ అన్నీ చూపిస్తాను. ఎందుకంటే నా భార్యకి ఏ ఫిల్టర్స్ ఉండవు. ఏదైనా నిజాయితీగా చెబుతుంది. నా క్రియేటివిటీని ఫస్ట్ జడ్జ్ చేసేది తనే. చిరంజీవిగారితో ‘వాల్తేరు వీరయ్య’ మూవీ షూటింగ్ చేస్తుంటే మా నాన్నగారు కాలం చేశారు. మా నాన్న చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమాని. ఆ టైమ్ నాకు మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్. మా నాన్న లేని లోటు నా భార్య తీర్చింది. నన్ను ముందుకు నడిపింది. ప్రతి రోజు షూటింగే నా గోల్ కింద గుర్తు చేసేది. మీ నాన్నకి చిరంజీవిగారి పై ఉన్న ప్రేమ అందరికీ తెలిసేలా ఒక బ్లాక్ బస్టర్ సినిమా తియ్యమని నన్ను రోజూ మోటివేట్ చేసేది. తన మోటివేషన్ వల్లే నేను అంత పెద్ద సినిమా (‘వాల్తేరు వీరయ్య’) తియ్యగలిగాను. నాన్నకి చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమ, నాకు నాన్న మీద ఉన్న ప్రేమే ‘వాల్తేరు వీరయ్య’. అది మా నాన్నకి నేను ఇచ్చిన ట్రిబ్యూట్ అవ్వాలి అంటూ నన్ను ప్రోత్సహించింది నా వైఫ్. నేను ఇంట్లో ఎక్కువసేపు ఉంటే ఆఫీస్ లేదా? అని గుర్తు చేస్తూ ఉంటుంది. వెళ్ళి పని చేసుకో అని ఇండైరెక్ట్ సెటైర్స్ వేస్తుంటుంది,. మోస్ట్ ఆఫ్ ది టైమ్ షూటింగ్ లేనప్పుడు నేను గడిపేది ఇంట్లోనే. నేను, నా కూతురు వైష్ణవి, నా భార్య ఇదే నా ప్రపంచం. నా భార్య ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ్రపొఫెసర్గా కూడా చేసింది. నా కోసం, మా కూతురి కోసం తన కెరియర్ శాక్రిఫైస్ చేసి, మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఇల్లు మ్యానేజ్ చేయడం అంటే ఈజీ కాదు. మా అమ్మని చూశాను, మా అక్కని చూశాను. మా అత్తగారిని చూశాను, తరువాత అనూషని చూస్తున్నాను. వీళ్లందరిని చూసిన తరువాత ఇల్లు మెయింటెయిన్ చేసుకోవటంలో ఆడవాళ్ళ తరువాతే ఎవరయినా అని నాకు అర్థం అయ్యింది.నా ప్రతి కష్టంలోనూ నా భార్య అనూష నాతో ఉంది. నేను అయిదు వందలు సంపాదిస్తున్న టైమ్ నుండి నా సంపాదన ఆమెకు తెలుసు. ఘోస్ట్ రైటర్గా నా పేరు పడని దగ్గర్నుంచి నా గ్రోత్ తెలుసు. నేను డైరెక్టర్ అవక ముందే పెళ్లి చేసుకున్నాం. అద్దె ఇళ్ల కోసం ఓనర్ల చుట్టూ తిరగడం, కారు ఈఎంఐ వస్తుంటే భయపడడం, గోల్డ్ లోన్లు పెట్టి రెంట్లు కట్టడం, ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ రోజూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలి అనే మెంటాలిటీతో ఉంటుంది. నా సక్సెస్ వెనకాల ఉండే ప్రశాంతానికి తనే కారణం. -
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
తిరుమలాయపాలెం: కిడ్నీ సంబంధిత సమస్యతో నరకయాతన పడుతున్న ఓ వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు. కానీ కుటుంబంలో విషాదం నింపొద్దని అడ్డు తగలడమే ఆయన భార్యకు శాపమైంది. ఈక్రమంలో సదరు వ్యక్తి భార్యపై పెట్రోల్ పోసి మంట అంటించాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై జగదీశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం(65) రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ సందర్భంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది. నానాటికీ సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను ముందు చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కాగా, నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.వీరి కుమారుడు మండల కేంద్రంలోనే మరోచోట ఉంటున్నాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చి భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
భర్తను హత్య చేసిన భార్యకు పదేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా: భర్తను హత్య చేసిన భార్యకు ఎల్బీనగర్ కోర్డు పది సంత్సరాల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించింది. మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పద్మశాలిపురంలో నివాసం ఉండే ప్రభుగౌడ్, భార్య లక్ష్మి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. భార్య లక్ష్మి కల్లు తాగి వస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. 2017 ఏప్రిల్ 6వ తేదీన సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం రవి వంట చేయాలని భార్యను కోరాడు. ఇందుకు నిరాకరించిన ఆమె తాను పుట్టింటికి వెళ్లిపోతానని బట్టలను సిద్ధం చేసుకొని బయలుదేరింది. అదే సమయంలో మళ్లీ గొడవ పడ్డారు. దీంతో లక్ష్మి కోపంతో రగిలిపోయి రవిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. కేకలు పెడుతూ మంటలతో బయటకు పరుగులు తీసిన రవిని స్థానికులు రక్షించారు. మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్లో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న అతడు చనిపోయాడు. ఇప్పటి మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టగర్ పి.జగదీశ్వర్ ఆదారాలను ఎల్బీనగర్లోని కోర్టుకు సమరి్పంచారు. విచారణ అనంతరం లక్ష్మికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వై.సత్యేంద్ర తీర్పునిచ్చారు. గృహ హింస కేసులో ఏడాది.. సిటీ కోర్టులు: గృహహింస కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి మనోరంజన్లోని 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలు.. మలక్పేట్కు చెందిన తౌఫిక్ ఖాన్ అదే ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ బేగంను 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ మద్యం తాగి ఇంటికి వచ్చి విపరీతంగా కొడుతున్నాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని 2018లో సీసీఎస్ ఉమెన్ పోలీస్స్టేషన్లో ఇర్ఫాన్ బేగం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చార్జిషీట్తో పాటు మనోరంజన్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.అజయ్ కుమార్ తీర్పు వెల్లడించారు. -
‘జీతం తక్కువ… భరణం ఎక్కువ!’.. ‘సుప్రీం’లో భర్త వాదనలు హాట్ టాపిక్!
ఢిల్లీ: యువర్ హానర్. నేను కార్మికుడిని. నా జీతం నెలకు రూ.9వేలు. అలాంటిది భరణం కింద నా భార్యకు నెలకు రూ.12వేలు ఎలా ఇవ్వాలి. మీరే నాకు న్యాయం చేయాలి అంటూ ఓ భర్త సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. అయితే, భర్త వాదనలపై ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకేసులో భార్య, భర్తకు కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో భరణం కింద భర్త.. భార్యకు రూ.6 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై భార్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.నా భర్త నుంచి విడాకులు కోరుకుంటున్నాను. కానీ నాకు ఇచ్చే భరణం సరిపోదు. పోషణ నిమిత్తం జీవితాంతం నెలకు రూ.12,000 భరణంతో పాటు ప్రతి సంవత్సరం ఐదు శాతం, ఆరు శాతం పెంచాలి. లేదంటే ఒకేసారి రూ.30 లక్షలు చెల్లించాలి’ అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం భర్త వాదనలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఇంత తక్కువ వేతనం పొందడం నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించింది. కనీస వేతనానికి తగ్గకుండా చెల్లించే పరిస్థితి ఉండగా.. ఒక సంస్థ ఇంత తక్కువ వేతనం ఇస్తుందా అని ప్రశ్నించింది. భర్త తరఫు న్యాయవాది జార్జ్ పోథన్,తన క్లయింట్ నిజాయితీగా ఆదాయాన్ని వెల్లడిస్తున్నాడని, దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని వాదించారు. బెంచ్ ఆ వాదనను ఖండించింది. భర్తకు భరణం చెల్లించే స్థోమత లేకపోతే భార్యను తనతో ఉంచుకుని, ఆమెకు వంట చేసి కుటుంబాన్ని చూసుకోవాలని హితువు పలికింది. అందుకు స్పందించిన భర్త.. భార్య తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిందని వాపోయారు. భర్త వ్యాఖ్యలపై జస్టిస్ మెహతా కఠినంగా స్పందించారు. భార్యకు పోషణ ఖర్చు ఇవ్వడం భర్త బాధ్యత. అవసరమైతే అప్పు చేయాలి. సహాయం తీసుకుని బాధ్యతను నెరవేర్చాలని స్పష్టం చేశారు. తన సంస్థ తనకు అంతే జీతం ఇస్తుందని భర్త చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసననం పరిశీలిస్తుంది. ఉద్యోగులకు చెల్లించే జీతాలపై తమకు స్పష్టత ఇవ్వాలని సదరు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. -
ఈరోజు నేనిలా ఉండటానికి నువ్వే కారణం: విరానిక ఎమోషనల్ (ఫోటోలు)
-
ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్కు విడాకుల నోటీసులు
చెన్నై: తమిళ నటుడు, టీవీకే చీఫ్కు విజయ్కు భారీ షాక్ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో విజయ్ వివాహేతర సంబంధమే విడాకులకు కారణమంటూ పిటిషన్లో పేర్కొనడం సంచలనం రేపుతోంది.సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నాడని సంగీత ఆరోపించింది. 2021లో ప్రతివాదికి నటితో అక్రమ సంబంధం ఉందని ఆమె పేర్కొంది. అయితే సంబంధాన్ని ముగించాలని హామీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్లో మార్పులేదని పాత ధోరణే కొన సాగుతోందనేది సంగీత ప్రధాన అరోపణ. అదే భర్తనుంచి చట్టబద్ధంగా విడిపోవాలనే తన నిర్ణయానికి పునాది వేసింది. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంలో ఉన్నట్టు లేదా అవతలి వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు తేలితే, ప్రత్యేక వివాహ చట్టం, 1954 విడాకులకు అనుమతిస్తుంది. సంగీత పిటిషన్ ఈ రెండు చట్టపరమైన కారణాలను విచారిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం జిల్లా కోర్టు ముందు ఉంది. కాగా విజయ్,సంగీత తమ విభేదాలను బహిరంగంగా అంగీకరించనప్పటికీ గత రెండేళ్లుగా విజయ్ నుండి విడిగా నివసిస్తున్న సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు మహిళా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించి కేసును కుటుంబ సంక్షేమ కమిటీకి బదిలీ చేసింది.వారి సుదీర్ఘ మౌనం అభిమానులు, మీడియాలో నిరంతర ఊహాగానాలకు ఆజ్యం పోసింది. 1999 ఆగస్టులో ప్రేమవివాహం చేసుకున్న ఈ జంటకు జాసన్ సంజయ్ (25) , దివ్య షాషా (20) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమా నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ఇటీవల తమిళగ వెట్రి కజగం(TVK) పార్టీని ప్రారంభించిన విజయ్ కెరీర్, ప్రజా జీవితంలో ఈ పరిణామం కీలకమైంది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు విజయ్ బృందం లేదా సంగీత ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియో -
ఇండియాతో బంధం ఎంతో ప్రత్యేకం.. నెతన్యాహూ
ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయోల్ పర్యటన ముగిసింది. ఆ దేశంలో ఘనంగా అతిథ్యం స్వీకరించడంతో పాటు రెండు దేశాలు కీలకమైన పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత్తో తనకు వ్యక్తిగతంగా ఎంతో కనెక్టివీటి ఉందని తెలిపారు. తన వైఫ్ సారా నెతన్యాహుని మెుదటి సారి కలిసింది ఇండియన్ రెస్టారెంట్లోనే అని తెలిపారు.భారత్ -ఇజ్రాయెల్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా కాకుండా వ్యక్తిగతంగానూ భారత్ అంటే ఇజ్రాయెల్కు ఎంతో అభిమానం. ప్రపంచంలో చాలా దేశాలు యూదులపై దాడులు చేస్తున్న సమయంలో ఇండియా వారికి అండగా నిలిచింది. అందుకు భారత్తో ఇజ్రాయిలీలకు ఆత్మీయ అనుబంధం. ఇదిలా ఉండగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు వ్యక్తిగతంగానూ భారత్ తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.ఆయన మాట్లాడుతూ" నాకు వ్యక్తిగతంగా భారత్ ఎంతో ప్రత్యేకం. నా మెదటి,లేదా రెండవ సారి నా వైప్ సారాను ఇండియన్ రెస్టారెంట్లోనూ కలిసాను. ఆఫుడ్ మాత్రమే కాదు. ఆ డేట్ ఎంతో అద్భుతంగా సాగింది." అన్నారు. ఆ రెస్టారెంట్ను రీనా పుష్కర్నా అనే భారతీయురాలు నడిపిస్తుంది. ఆమె కర్రీ క్వీన్గా ఎంతో ఫేమస్ అన్నారు. భారతీయ వంటకాలను ఇజ్రాయెల్కు పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.భారత్-ఇజ్రాయెల్ మధ్య సాంస్కృతిక రాయభారిగా తను పనిచేస్తుందన్నారు. గతంలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వచ్చినప్పుడు ఆ రెస్టారెంట్లోనూ విందు ఇచ్చామని భోజనం అద్భుతమని మోదీ ప్రశంసించారని తెలిపారు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన మోదీకి ఇజ్రాయెల్లో ఘన స్వాగతం లభించింది. -
తాతా.. అమ్మ ఉరి వేసుకుంది
అనంతపురం సెంట్రల్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఎంత వేదన అనుభవించిందో తెలియదు కానీ.. కన్న కుమారుడు వద్దని వారిస్తున్నా... వినకుండా ఆ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనతో బాలుడి ఒక్కసారిగా చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. విషాదకరమైన ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన సాయిప్రసాద్ కుమార్తె లలిత (30)కు ఆత్మకూరు మండలానికి చెందిన మోహన్కృష్ణతో పదేళ్ల క్రితం వివాహమైంది. పోలీసు కానిస్టేబుల్ కావడంతో అప్పట్లో 15 తులాల బంగారం, రూ.5 లక్షలు నగదును వరకట్నంగా ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న కుమారుడు ధర్మయోగి ఉన్నాడు. మోహన్ కృష్ణ ప్రస్తుతం నగరంలోని నివాసముంటూ వన్టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఎస్పీ దృష్టికి వేధింపులు పైళ్లైన తొలినాళ్లలో వీరి సంసారం సజావుగా సాగినా... ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఆజాద్ నగర్లోని సొంతమింట్లో కుమారుడితో కలసి లలిత నివాసముంటోంది. అదే ఇంట్లో వేరే గదిలో మోహన్ కృష్ణ నివాసముండేవాడు. పలుమార్లు పోలీసు స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇచ్చినా మోహన్ కృష్ణ తీరు మారలేదు. తాజాగా డీపీఓలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీస్ను లలిత కలసి తన దీన స్థితిని విన్నవించుకుంది. న్యాయం చేయాలని వేడుకుంది. అదే రోజు సాయంత్రం దిశ పీఎస్లో దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరినీ ఇంటికి పంపారు. లలిత తల్లిదండ్రులు కూడా రాత్రి కుమార్తె నివాసంలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు మార్గమధ్యంలో ఉండగానే ఉదయం 8 గంటల సమయంలో మనవడు ధర్మయోగి ఫోన్ చేసి తాతా.. అమ్మ ఉరి వేసుకుందని తెలిపాడు. వారొచ్చే సమయానికి ఉరికి విగతజీవిగా వేలాడుతూ లలిత కనిపించింది. మనిషి కాదు రాక్షసుడు ‘తొమ్మిదేళ్లుగా తమ కుమార్తెకు నరకం చూపించాడు. వాడు మనిషి కాదు.. రాక్షసుడు’ అంటూ లలిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహేతర సంబంధాల మోజులో తమ కుమార్తెను నిత్యం వేధించాడని వాపోయారు. అతన్ని ఉరి తీస్తేనే తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని విజప్తి చేశారు. అదనపు కట్నం కోసం వేధించేవాడని, తనకు లవర్ ఉందని, ఆమెతోనే జీవిస్తానంటూ మాటలతోనే హింసించేవాడని వివరించారు. తనకు అందుతున్న పింఛన్ సొమ్ముతోనే కుమార్తె, మనవడిని పోషిస్తున్నట్లు తెలిపారు. మోహన్కృష్ణపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ జగదీష్ మాట్లాడుతూ.. దంపతుల మద్య మనస్పర్థలు ఉన్నాయని, ఇరువురూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. -
భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త
రంగారెడ్డి: మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం నోములలో జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అమృత, బాబులు.. భార్యా భర్తలు. అయితే మద్యానికి బానిసైన భర్త బాబు.. పదే పదే భార్య అమృతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తరుచు గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా, అమృత నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త బాబు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
చేవెళ్లలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..
-
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
-
నడిరోడ్డుపై భార్యను చంపిన TDP కార్యకర్త
-
దారుణానికి ఒడిగట్టిన ఇస్రో మాజీ సైంటిస్ట్
బెంగళూరు: డిప్రెషన్. ఈ డిప్రెషన్లో తాను మరణిస్తే.. తన భార్య ఒంటరైపోతుందని, ఆమెను చూసుకునేవారు ఎవరూ ఉండరని భావించిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో తువ్వాలతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు. అప్రమత్తమైన ఆ వ్యక్తి వెంటనే అవలహಳ್ಳಿ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంధ్య శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.ప్రాథమిక దర్యాప్తులో నాగేశ్వరరావు తన భార్యను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, డిప్రెషన్కు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది. సంధ్య శ్రీ కూడా ఇస్రోలో పనిచేశారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఈ ఘటన గురించి సమాచారం అందించబడింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై హత్య కేసు నమోదు చేసి, అతని మానసిక స్థితి, వైద్య చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
భార్య, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి
-
మా ఆయనకు చాలా మంది అమ్మాయిలతో..
బనశంకరి(బెంగళూరు): విదేశాల్లో కూర్చుని యువతులకు గాలం వేస్తున్న భర్త బండారాన్ని భార్యనే రట్టు చేసింది. భర్త కామకలాపాలపై మంగళూరు మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మనీశ్ అనే వ్యక్తి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసి వివాహం చేసుకున్నాడు. డబ్బులేదని వివాహానికి ముందు ఆత్మహత్య నాటకమాడాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులే పెళ్లి ఖర్చులు భరించారు. ఉద్యోగం కోసం భార్యనే రూ.2 లక్షలు ఇచ్చింది. దుబాయ్ వెళ్లిన అతను బహరాన్లో మరో మహిళతో ప్రేమకలాపాలు సాగించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతని వ్యవహారంపై నిఘా పెట్టగా వివాహానికి ముందు అనేకమంది యువతులతో సంబంధాలు ఉన్నట్లు తెలుసుకుంది. వారి వద్ద కూడా అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగిట్లు తేలింది. టిక్టాక్తో యువతులకు గాలం వేసే మనీశ్నుంచి ఎవరూ మోసపోవద్దని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
భార్య ఎఫైర్.. ప్రియుడి ఇంటిని తగలబెట్టిన భర్త
మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు కారణంగా ఆగ్రహంతో మహిళ భర్త, బంధువుల చేతిలో ఒకరికి చెందిన రూ.20 లక్షల విలువగల ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ దహనమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం గుండాలగడ్డ తండా∙గ్రామానికి చెందిన ఓ వివాహితతో అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి పద్ధతి మార్చుకోవాలని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోలేదు. ఆ వివాహిత భర్త, బంధువులు ఆగ్రహంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి చెందిన ఇల్లు, ఇంట్లోని వస్తుసామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ (హార్వెస్టర్) విలువైన సామగ్రిని దహనం చేశారు. తండావాసులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై దీపిక, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భార్య ఎఫైర్.. చివరికి ఎంత దారుణం జరిగిందంటే..
బ్రెజిల్లో ఇటుంబియారాలో దారుణం జరిగింది. భార్య అక్రమ సంబంధం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటుంబియారా ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే, భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెపై నిఘా పెట్టాడు.ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ను సైతం నియమించి పకడ్బందీగా ప్లాన్ చేశాడు.. భార్య తన ప్రియుడిని కలిసినప్పుడు వీడియో ఆధారాలు కూడా సంపాదించాడు. అక్రమసంబంధం నిజమేనని నిర్థారణ కావడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ దారుణానికి కొన్ని గంటల ముందు ఆ వ్యక్తి.. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, "దేవుడు నా పిల్లలను ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక, నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు" అనే క్యాప్షన్ను రాశారు. చూడముచ్చటగా ఉన్న వీరి ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భార్యా భర్తల జంట ఎంతో అందంగా ఉండటం.. పిల్లలు సైతం క్యూట్గా ఉండటంతో వీరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి,.. క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. -
ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..!
వివాహం అనేది అత్యంత పవిత్రమైన బంధం. వేరు వేరు నేపథ్యాల మనుషులు పెళ్లి అను బంధంతో ఒక్కటై..ప్రతి విషయంలోనూ తోడు నీడగా ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేసుకునే పవిత్రమైన కార్యం అది. అలాంటి వైవాహిక వ్యవస్థనే అపహాస్యం పాలుచేస్తున్నారు నేడు చాలామంది యువతీయువకులు. అలాంటి వాళ్లకు కనువిప్పు నెట్టింట రెడ్డిట్లో వైరల్ అవుతున్న పోస్ట్. అది ఆ గొప్పబంధానికి ఉన్న పవిత్రతను హైలెట్ చేసింది. అంతేగాదు ఒకరికొకరుగా ఉండటం అంటే అవగతమవుతుంది. ఆలుమగలు బంధం అనే మాటకు అసలైన అర్థం చెబుతూ ఆలోచింపచేస్తున్న పోస్ట్ అందర్నీ తెగ ఆకర్షిస్తుంది. పైగా నెటిజన్లు ఆ జంటను 'మేడ్ ఫర్ఈచ్ అదర్' అంటూ కితాబిస్తున్నారు. అసలేం జరిగిందంటే..ఆ పోస్ట్లో ఒక మహిళ ఏ ఉద్యోగం లేని తన భర్త ఇచ్చిన గిఫ్ట్ని చూసి కన్నీళ్లు పెట్టుకుందామె. తన భర్తకు కొన్ని నెలలుగా ఉద్యోగం లేదని, తాను కాపీ రైటర్గా పనిచేస్తూ ఇంటిని నెట్టుకొస్తున్నట్లు తెలిపింది. అతడు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడని, అతడి ఖర్చలు, పాకెట్ మనీ అన్ని తానే చూస్తుంటానని రాసుకొచ్చింది పోస్ట్లో. అయితే తన భర్త ఆ డబ్బుని పెట్రోల్ కోసం, స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు మాత్రమే ఖర్చు చేస్తాడని తెలిపింది. పైగా తన భర్త పెద్దగా ఖర్చులు కూడా చేయడని, ఎప్పుడైనా స్నేహితులు ఫుడ్ ఆర్డర్ చేస్తే తన వంతుగా రూ. 200 నుంచి రూ. 300లే ఇస్తాడని తెలిపింది. అలాగే తాను తనకు ఉద్యోగం లేదని అతడి స్నేహితుల ముందు నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదని కూడా పేర్కొంది. అయితే ఉద్యోగం లేకపోయినా..తన భర్త ఈ వాలెంటైన్స్డేకి బహుమతి ఇవ్వడం తనని ఆశ్చర్యంలో ముంచెత్తిందని అంటోంది. తాను ఇచ్చిన పాకెట్ మనీలోనే కొంత తనకు గిఫ్ట్ ఇచ్చేందుకు కొని సర్ఫైజ్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టించేసిందని భావోద్వేగంగా రాసుకొచ్చింది పోస్ట్లో. అంతేగాదు తన భర్త ఇచ్చిన వాలెంటెన్స్డేకి ఇచ్చిన గిఫ్ట్లను తెలియజేస్తూ..ఆయన ఇచ్చన పెంగ్విన్ ప్లషీ, చాక్లెట్ బార్ చూసి ఆనందంతో ఉంబ్బితబ్బిబైంది. ఈ కష్టసమయంలోనూ తన గురించి ఆలోచించినందుకు కంటనీళ్లు ఆగడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది. తాము విదేశీ పర్యటనలకు వెళ్లిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కష్టసమయం తమ మధ్య నెలకొన్న బలమైన బంధం కారణంగా ఇట్టే గడిచిపోతుందని ఉద్విగ్నింగా చెబుతూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు కూడా ఆ ఆలుమగల మధ్య ఉన్న బలమైన బంధానికి ఫిదా అవ్వడమే గాక ప్రశంసల వర్షం కురిపిస్తు పోస్టులు పెట్టారు.(చదవండి: టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్కి వచ్చేశా..!) -
నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా?
కర్ణాటక: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూరులో ఆలయం సమీపంలోని ఎస్ఎల్ఎన్ కళ్యాణ మండపంలో పెద్ద రచ్చ జరిగింది. నేను ఉండగా, మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంటావా? అని పెళ్లికొడుకును మొదటి భార్య నిలదీయడంతో సినిమాలో మాదిరిగా కోలాహలం నెలకొంది. వివరాలు.. ఆదివారం ఈ మండపంలో బెంగళూరులోని ఆర్ఆర్ నగర నివాసి హరీష్ ప్రసాద్కు, మండ్యకు చెందిన పుణ్యశ్రీ అనే యువతితో పెళ్లి జరుగుతోంది. సరిగ్గా తాళి కట్టే సమయంలో మొదటి భార్య లేపాక్షి, పోలీసులు, కుటుంబ సభ్యులతో వచ్చింది. తామిద్దరూ ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నామని, శృంగేరిలో కాపురం ఉంన్నామని లేపాక్షి తెలిపింది. తాను ప్రైవేటు టీచరునని, తరచూ వేధింపులకు పాల్పడడంతో పాటు గర్భస్రావం చేయించేవాడని ఆమె ఆరోపించింది. రూ.2 వేలు పంపి... మూడు రోజుల క్రితం భర్త నాకు ఫోన్ చేసి రెండు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పి ఫోన్పేలో రూ.2 వేలు పంపాడని, పెళ్లి జరుగుతోందని తెలిసి అడ్డుకోవడానికి వచ్చానని లేపాక్షి వివరించింది. లేపాక్షి మాటలతో వధూవరులు షాక్కు గురయ్యారు. వధువు తల్లిదండ్రులు ఈ పెళ్లిని రద్దు చేసుకుని, వరున్ని దండించారు. వారు కూడా పోలీసుస్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఇదేం గొడవ అని అతిథులందరూ వెళ్లిపోయారు. పెళ్ళి విందు కోసం వండిన వంటకాలు అలాగే మిగిలిపోయాయి. -
క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)
-
కట్టుకున్న భార్యపై ఖాకీ దాష్టీకం
మంచిర్యాల క్రైం: క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ శాఖకు మచ్చతెచ్చాడు. కట్టుకున్న భార్యను రోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదాడు. మంచిర్యాల రెడ్డికాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై వీడియో సోమవారం వైరల్గా మారింది. స్థానిక పోలీసు స్టేషన్లోని కానిస్టేబుల్ రవిప్రసాద్ ఆదివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. నాలుగు గోడల నడుమ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్తా అర్ధరాత్రి రోడ్డుపైకి చేరింది. అర్ధనగ్నంగా ఉన్న అతడు భార్యతోపాటు కూతురిని కూడా రోడ్డుపై చితకబాదాడు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న పోలీసు శాఖలోని వ్యక్తి ఇలాంటి ఘటనలకు పాల్పడటం, కట్టుకున్న భార్యపై కాఠిన్యాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. రవిప్రసాద్ కానిస్టేబుల్గా పని చేస్తుండగా.. ఆయన భార్య పోలీసుశాఖలోని మరో విభాగంలో సూపరింటెండెంట్గా పని చేస్తోంది. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసు.. భార్యను రోడ్డుపైకీడ్చిన దాష్టికాన్ని నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై స్థానిక సీఐ ప్రమోద్రావును సంప్రదించగా విషయం తెలిసిందని, కుటుంబ సమస్య అయినందున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని వెల్లడించారు. -
భర్తను చితకబాదేసిన భార్య, వైరల్ వీడియో
భర్తపై భార్య దారుణంగా దాడిచేసిన వీడియో ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నప్పటికీ ,అతనిపై హింసకు పాల్పడిన వైనం నెట్టింట భర్తలపై భార్యల హింసగురించి చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.సోషల్ మీడియా పోస్ట్ల ప్రకారం, సీసీ కెమెరాలో బాధితుడ్ని కొడుతున్న దృశ్యలు నమోదయ్యాయి. తన భార్య నిర్వాకాన్ని రికార్డు చేసేందుకు,ఆధారాలు సేకరించడానికి బాధితుడు తన భార్యపై గదిలో రహస్య కెమెరాను అమర్చాడట. ఈ వీడియోను క్లిప్లో, ఆ మహిళ ఆ వ్యక్తిని మంచంపైకి విసిరి, అతనిపైకి ఎగిరి దూకి, రెండు చేతులతోనూ పిడి గుద్దుల వర్షం కురిపించింది. ఇంతలో మహిళ గదిలోకి వెళ్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఫలించలేదు. ఒక బిడ్డను ఎత్తుకుని ఉన్న మరో వ్యక్తి కూడా గదిలోకి వెళ్లాడు. అయినా బాధితుడిపై దాడి కొనసాగుతూనే ఉంది.దీంతో నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భార్యల వేధింపులు తాళలేక తనువు చాలించిన అతుల్ సుభాష్,మానవ్ శర్మ ఉదంతాన్ని గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు. 2025లో ఏప్రిల్లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన ఎక్కడిది, బాధితుడు ఎవరు? అనే వివరాలపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?నెటిజనుల స్పందనఆమెపై కేసు నమోదు చేయాలని కొంతమంది కోరగా, గృహ హింస నుండి పురుషులను రక్షించడానికి, అలాంటి మహిళలను శిక్షించడానికి ఎటువంటి చట్టాలు లేవని వాపోయారు. అదే పురుషుడు మహిళపై దాడిచేస్తే పదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.పేలవమైన చట్టాలు, అవినీతి న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ బాధితుడిగా మారుతున్న ప్రతి పురుషుడికి మనం అధికారం ఇవ్వాలి.అలాగే ప్రతి పురుషుడిని ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్న ఇలాంటి మహిళలకు గుణపాఠం నేర్పాలి. వేధింపులకు గురవుతున్న వివాహిత పురుషుడు అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడాలి. అంతకానీ ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు అని ఒక నెటిజన్ కోరడం గమనార్హం.అయితే వీడియో రికార్డు చేస్తున్నాడు కాబట్టి అతను కావాలనే ప్రతిఘటించడం లేదని కమెంట్ కూడా కనిపించింది. ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?Video source @mishrag47 . There is no domestic violence laws to protect men, no laws to severely punish such women. If man raise his hands on women simp men at once oppose him. #MenToo #GenderBiasedlaws #RejectWaqfBill #WaqfAmendmentBill #MuskanRastogi #IPL2025 #ToxicFeminism pic.twitter.com/KFoR0Ikf1Z— Saurabh Bahuguna46 (@bahuguna46) April 2, 2025 -
మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు
-
తొమ్మిదేళ్ల ప్రేమ.. పెళ్లి.. రెండు నెలలకే.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే!
బరేలీ: తొమ్మిదేళ్ల ప్రేమ.. తర్వాత పెళ్లి.. రెండు నెలలకే విషాదంగా మిగిలింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జితేంద్ర కుమార్ యాదవ్(33) తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించడం కలకలం రేపింది. మొదట ఆత్మహత్యగా అంతా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. జితేంద్రను భార్య జ్యోతి గొంతు నులిమి చంపినట్లు తేలిపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా సహకరించారు. ఆ సమయంలో వారు అతడిని గట్టిగా పట్టుకోగా.. జ్యోతి గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.అసలేం ఏం జరిగిందంటే..మృతుడు జితేంద్ర, జ్యోతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ 25న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది వారాలకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్యోతి బ్యాంకు ఖాతా నుండి జితేంద్ర రూ.20 వేలు డ్రా చేసి ఆన్లైన్ జూదంలో పోగొట్టడమే వారి మధ్య వివాదాలకు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. జనవరి 26న ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. దాడికి దారితీసింది. ఆ సమయంలో జ్యోతి తన తండ్రి కాళీచరణ్, తల్లి చమేలి, సోదరుడు దీపక్లను ఇంటికి పిలిచింది.కాళ్లు, చేతులు కదలకుండా..వారందరూ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా పట్టుకోగా, జ్యోతి అతని గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మఫ్లర్తో కిటికీ గ్రిల్కు మృతదేహాన్ని వేలాడదీశారు. అనంతరం తమ అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినా, జితేంద్ర సోదరుడు అజయ్ కుమార్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో అది ఉరి వల్ల జరిగిన మరణం కాదని.. గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. దీంతో పోలీసులు సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్గా పనిచేస్తోంది. ఆర్థిక వివాదాలు కారణంగానే హత్యకు ఒడిగట్టినట్లు ఆమె పేర్కొంది. -
ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మహిళ
నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. నగేష్తో సుజాత అనే మహిళకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నగేష్ ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య మమతను పక్కకు తప్పించేందుకు హత్య చేయాలని సుజాత, నగేష్ ప్లాన్ వేశారు. మమతపై పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. తీవ్ర గాయాలతో మమత మరణించింది. మంటలు అంటుకుని ఐదు నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. -
పోలీస్ కమెండోపై దారుణం.. డంబెల్తో దాడి చేసి..
న్యూఢ్లిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. పోలీస్ స్పెషల్ సెల్లో స్వాత్ (SWAT) కమెండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి(27) భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఘజియాబాద్లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఆమె కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త అంకుర్ చౌదరి.. కాజల్పై డంబెల్తో దాడి చేసి, ఆమె తలను తలుపు ఫ్రేమ్కు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడని తర్వాత అంకుర్ స్వయంగా తన బావ నిఖిల్కు ఫోన్ చేసి, ‘నీ అక్కను చంపేశాను, వచ్చి శవాన్ని తీసుకెళ్లు’ అని చెప్పడం కలకలం రేపుతోంది.కాజల్, అంకుర్ 2022లో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కాజల్ 2023లో ఢిల్లీ పోలీసు విభాగంలో కమెండోగా ఎంపికయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖలో అంకుర్ క్లర్క్గా ఉద్యోగం సంపాదించాడు. అయితే పెళ్లయిన 15 రోజుల నుండే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కారు ఇవ్వాలని, నగదు తేవాలని అంకుర్ కుటుంబం కాజల్ను శారీరకంగా, మానసికగా హింసించినట్లు సమాచారం.కాజల్ తండ్రి రాకేష్ తన కుమార్తె మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాజల్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ అని, అంకుర్ కేవలం తన కూతురుని మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డను కూడా చంపి, రెండు హత్యలు చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. గణౌర్లో అత్తమామల వేధింపులు భరించలేక వారు ఢిల్లీలోని మోహన్ గార్డెన్కు మారినప్పటికీ, అంకుర్ తన ప్రవర్తన మార్చుకోలేదన్నారు. నిరంతరం డబ్బు కోసం వేధిస్తూనే ఉండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.జనవరి 22న జరిగిన ఈ దాడి ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తొలుత హత్యాయత్నం కేసుగా నమోదు చేసినప్పటికీ, కాజల్ మరణించడంతో దానిని హత్య కేసుగా (సెక్షన్ 302 కింద) మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అంకుర్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, ఆ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: వందే భారత్ మెనూలో అదిరిపోయే మార్పులు -
ఆ ఆస్తిలో వారికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది!
నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లలు నా మాజీ భార్య వద్దనే ఉంటారు. అయితే మా నాన్న గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా?– కృష్ణమూర్తి, విశాఖపట్నంమీ తండ్రిగారి దగ్గర నుంచి మీకు సంక్రమించిన ఆస్తి మీ తండ్రి గారి స్వార్జితమైవుండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి వుంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కు ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే అది మీ పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది వుంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అది మీ తండ్రి గారికి కూడా వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయివుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేదా విడిపోయిన మీ మాజీ భార్య వద్ద ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం వున్నారో మీరు చెప్పలేదు. ఒకవేళ మీతోపాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ తల్లిగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాన్నమ్మ) ఉంటే వారికి కూడా మీతోపాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటాను వారు అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ పోందే హక్కు వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comమెయిల్ చేయవచ్చు. -
మద్యం తీసుకురాలేదని.. భార్య ఎంత పని చేసిందంటే..!
హైదరాబాద్: మద్యానికి బానిసైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. శివకుమార్, రాజేశ్వరి(45) దంపతు లు. వారు యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమా రులు ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఆమె మద్యం సేవించింది. తనకు ఇంకా మద్యం కావాలని భర్తకు తెలిపింది. భర్త మద్యం తీసుకురానని చెప్పాడు. దాంతో అతనితో గొడవ పెట్టుకుని ఇంటి లోపలికి వెళ్లి చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత చిన్న కుమారుడు గౌతమ్కుమార్ తల్లి కోసం వెదికాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి ఉరి వేసుకుని కనిపించింది. తలుపులు పగలకొట్టి ఆమెను కిందకు దించారు. ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు రాజేశ్వరి సోదరుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో దారుణం.. కుటుంబసభ్యులను కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
-
తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)
-
బోరబండ మర్డర్ కేస్.. భార్యను చంపి వాట్సాప్ లో స్టేటస్
-
అక్రమ సంబంధానికి అడ్డు.. భర్తను చంపిన భార్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో ప్రసన్న అనే వివాహిత తన భర్త సుధీర్రెడ్డిని చంపింది. చున్నీతో గొంతు నులిమి చంపినట్లు పోలీసుల ఎదుట ప్రసన్న అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య మారథాన్ రన్, ప్రముఖ వ్యాపారవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్
జెరోధా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ తన భార్య క్యాన్సర్ సోకడం, చికిత్స, కోలుకోవడం గురించి మరోసారి సోషల్ మీడియాద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా టాటా ముంబై మారథాన్లో వైకల్యాన్ని చేర్చడంపై సంతోషాన్ని ప్రకటించారు. టాటా ముంబై మారథాన్లో పరుగెత్తిన దివ్యాంగులలో ఉన్న ఉత్సాహం, ఉద్వేగం మాటల్లో చెప్పలేనిదని ఆయన ప్రశంసించారు. అన్నీ సవ్యంగా ఉన్నా జీవితంలో ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసే ముందు ఆలోచించేలా చేస్తుందన్నారు. అదే సమయంలో తన భార్య క్యాన్సర్ కోలుకున్న తీరు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 57 నిమిషాల్లో 10 కి.మీ పరిగెత్తారని వివరించారు. అలాగే మారథాన్లో పాల్గొన్న తన భార్య సీమా కామత్ ఫోటోలతో పాటు, ఆమె రాసిన వ్యక్తిగత బ్లాగుకు వ్యాఖ్యలలో లింక్ను పంచుకున్నారు.ఇదీ చదవండి: నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం The excitement and enthusiasm among people with disabilities running the Tata Mumbai Marathon today were beyond words. Makes you think about what right you have to complain about anything in life.On a personal note, Seema (wife, see the link in comments) ran 10km in ~57… pic.twitter.com/8YEDVwf0WE— Nithin Kamath (@Nithin0dha) January 18, 2026సీమా కామత్ తన బ్లాగులో అందించిన వివరాలు ప్రకారం 2021 నవంబరులో స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ. ఎలాంటి లక్షణాలు, ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే, చాలా క్రమశిక్షణగా, ఫిట్గా చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె కేన్సర్ బారిన పడ్డారు. సాధారణంగా చేసుకునే ఫుల్ బాడీ టెస్ట్లో భాగంగా జరిగిన మమోగ్రామ్ టెస్ట్లో ఆమె కుడి రొమ్ములో గడ్డను గుర్తించారు. ఆ తరువాత బయాప్సీ, PET స్కాన్ లాంటి పరీక్షల ద్వారా ఆమెకు క్యాన్సర్ సోకిందని నిర్ధారించారు.దీంతో తాను షాక్కు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు , కొంతమంది స్నేహితులతో తప్ప మిగతా ఎవ్వరితోనూ దీని గురించి చర్చించలేదు. అదేదో తప్పు అనే భావం ఉండటం వల్లే ఇది జరిగిందనీ, "మానసిక అనారోగ్యంలాగే, క్యాన్సర్ కూడా మన దేశంలో నిషిద్ధం" అని చెప్పుకొచ్చారు. కానీ అవగాహనతో ఉండి, ముందస్తు పరీక్షలతో దీన్ని జయించవచ్చు అన్నారామె.ఇదీ చదవండి: మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియోమాస్టెక్టమీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లతో "ఎమోషనల్ రోలర్ కోస్టర్" లా గడించిందన్నారు. ఈ రోజుల్లో క్యేన్సర్ను ముందుగా గుర్తిస్తే నివారణే సాధ్యమే అన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండే వారు కూడా వైద్యులు రొటీన్ స్క్రీనింగ్ చాలా అవసరమని సీమా రాశారు. తీవ్రమైన అనారోగ్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతీవవారికి ఆరోగ్య బీమా అవసరమన్నారు. చికిత్స సమయంలో కుటుంబ, సామాజిక మద్దతు ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు మనం చేయాల్సిందంతా చేయాలని సూచించారు. గతంలో తన క్సేన్సర్ రికవరీ జర్నీగురించి మాట్లాడిన సీమ జుట్టు ఊడిపోవడం లాంటి కీమో థెరపీ కష్టాలను పంచుకున్నారు. ఆ బాధలు భరించలేక చనిపోతే మేలు అనుకునేదాన్నని చెప్పారు. ఈ సమయంలో భర్త నితిన్, తన కొడుకు గుండు చేయించుకొనిధైర్యాన్ని నింపారన్నారు. చికిత్సతోపాటు, ఆహారం, వ్యాయామంతో క్యాన్సర్ను జయించానని వెల్లడించారు. వ్యాధినుంచి కోలుకున్న తరువాత క్యాన్సర్పై అవగాహన కల్పించడం, ప్రపంచ పర్యటనలు, మారథాన్రన్ లాంటి కార్యకల్లాపాలతో బిజీగా ఉంటున్నారు సీమ. -
ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేసిన భర్త
-
‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటా’
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్లో కలకలం రేపింది. సార్… నేను నా భార్యను గొంతు నులిమి చంపేశా. ఆమె శరీరం ఇంట్లో దుప్పటిలో చుట్టి ఉంది” అని చెప్పాడు.భార్యను హత్య చేసిన తర్వాత సచిన్ నాలుగు గంటల పాటు నగరంలో తిరిగాడు.. పారిపోవాలనుకున్నాడు. చివరికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.. సంఘటనా స్థలానికి అతని భార్య శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫతేహ్పూర్ జిల్లా మోహన్పూర్ గ్రామానికి చెందిన సచిన్, శ్వేత ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. మొదట సూరత్లో నివసిస్తూ సచిన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. నెలరోజుల తర్వాత కాన్పూర్కి వచ్చి గది అద్దెకు తీసుకుని, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై సచిన్కు అనుమానం కలిగింది. శ్వేత ఖాతాలో తరచూ డబ్బు జమ అవుతుండటంపై సచిన్ నిలదీశాడు. ఆమె తన అమ్మమ్మ పంపిందని చెప్పింది. ఎదురింట్లో ఉండే యువకులపై కూడా భర్తకు అనుమానం కలిగింది.భార్య ప్రవర్తనపై నిగ్గు తేల్చడానికి సచిన్.. స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని.. ఇంటికి రానంటూ భార్యకు తెలిపాడు. కానీ తిరిగి వచ్చి గది తలుపు తెరిచి ఉండగా, భార్యతో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. స్థానికులు 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్కి కాల్ చేయడంతో పోలీసులు వారిని స్టేషన్కి తీసుకెళ్లారు. దంపతులను పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.ఇంటికి చేరుకున్న తర్వాత సచిన్కు భార్యతో గొడవ మరింత ముదిరింది. ‘‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటాను” అంటూ శ్వేత బెదిరించిందని సచిన్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. “మేము ఒకరికి ఒకరం మాత్రమే ఉన్నాం. పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆమెకు ఎవరూ లేరు. నాకు కూడా ఎవరూ లేరు. అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాను” అని చెప్పాడు. శ్వేత మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టం కోసం పంపించారు. -
మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)
-
భార్య కాలిపోతుంటే... వీడియో తీశాడు!
సూరత్: వారిద్దరూ భార్యాభర్తలు. కొన్నాళ్లుగా తరచూ కీచులాడుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఒక రోజు వారి నడుమ మాటామాటా పెరిగింది. ఆవేశంలో భార్య ఒంటిపై డీజిల్ గుమ్మరించుకుని నిప్పంటించుకుంది. మంటల్లో చిక్కి హాహాకారాలు చేస్తుంటే కాపాడాల్సింది పోయి, ఆ ప్రబుద్ధుడు ఆమె మరణయాతనను తీరిగ్గా వీడియో తీస్తూ కూచున్నాడు! అంతేగాక, డీజిల్ పోసుకునేలా ఆమెను కావాలనే రెచ్చగొట్టినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది!! జనవరి 4న గుజరాత్లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బిహార్కు చెందిన రంజిత్ సాహా (33), ప్రతిమాదేవి (31) 2013లో ఇంటినుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం సూరత్లోని ఇచ్ఛాపూర్లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పిల్లలు, వారి చదువులు తదితరాల విషయమై కొంతకాలంగా దంపతులు తరచూ ఘర్షణ పడుతూ వస్తున్నారు. జనవరి 4న వారి మధ్య గొడవ పెద్దదైంది. ఆ క్రమంలో, చేతనైతే ఒంటిపై ఏమన్నా పోసుకుని అంటించుకోవాల్సిందిగా రంజిత్ రెచ్చగొట్టాడు. దాంతో ఆవేశానికి లోనైన ప్రతిమ, అతను అప్పటికే గ్యారేజీ నుంచి తెచ్చి ఉంచిన డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను వారించేందుకు గానీ, నిప్పింటించుకున్నాక కాపాడేందుకు గానీ రంజిత్ ఏమాత్రమూ ప్రయతి్నంచలేదు. పైగా, ఈ ఘటనలో తన ప్రమేయం లేదని నిరూపించుకునేందుకు ఆమె డీజిల్ పోసుకోవడం మొదలుకుని నిప్పంటించుకుని హాహాకారాలు చేయడం దాకా మొత్తం ఘటనను తన మొబైల్లో వీడియో తీస్తూ కూచుకున్నాడు! కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రతిమ వారం తర్వాత స్పృహలోకి వచి్చంది. తానే డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నానంటూ వాంగ్మూలమిచ్చి మరణించింది. కానీ ఆమె సోదరుడు మాత్రం రంజిత్ తీరుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంజిత్ను అదుపులోకి తీసుకుని అతని మొబైల్ను పరిశీలించగా ఈ వీడియో నిర్వాకం వెలుగులోకి వచి్చంది. ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఫినాయిల్లో కలిపేందుకంటూ రంజిత్ గ్యారేజీ నుంచి డీజిల్ తెచ్చి ఇంట్లో పెట్టినట్టు విచారణలో తేలింది. బహుశా పక్కా ప్లాన్ ప్రకారమే అతను ఇదంతా చేసినట్టు వారు అనుమానిస్తున్నారు. అతనిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
బూతు దంపతుల బాగోతం.. భార్యను పడుకోబెట్టి భర్త వీడియోలు
-
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం(జనవరి 12) కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమీర్పేట్ ధరంకరం రోడ్డులోని నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కేఎస్ సుబ్బారావు, కె.త్రివిక్రమరావు, కేఎస్ఎస్ మూర్తి కుమారులు, కుమార్తె రమాదేవి ఉన్నారు.గతేడాది డిసెంబర్ 20వ తేదీన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆమె కొన్నిరోజులు చికిత్స పొంది కోలుకున్నారు. తిరిగి ఆరో గ్యం క్షీణించి సోమవారం ఉదయం మృతి చెందారు. మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంపల్లి సమీపంలోని దేవరయాంజల్ వ్యవసాయ క్షేత్రంలో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. -
పోలీస్ స్టేషన్లోనే భార్యను కాల్చి చంపాడు
హర్దోయి: భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి..పోలీస్స్టేషన్ ఆవరణలోనే ఆమెను తుపాకీ కాల్చి చంపాడు. ఈ ఘటన యూపీలోని హర్దోయిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్పూర్ అతారియా వాసి అనూప్. ఇతడి భార్య సోనీ(35) వారం క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. నగలతోపాటు రూ.35 వేల నగదును ఆమె పట్టుకెళ్లిందంటూ అనూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, పోలీసులు సోనీని ఆదివారం పట్టుకొచ్చి, స్టేషన్లో ఉంచారు. సోమవారం అనూప్ను పిలిపించారు. సోనీని కోర్టులో హాజరు పర్చే రాత పనులు జరుగుతున్నాయి. పోలీస్స్టేషన్ ఆవరణలోనే ఉన్న క్యాంటిన్లోకి సోనీని ఓ మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్తుండగా, అనూప్ అడ్డుకున్నాడు. వెంటతెచ్చుకున్న తుపాకీతో సోనీపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సోనీ అక్కడికక్కడే చనిపోయింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన అనూప్ను పోలీసులు పట్టుకుని, తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. -
మాకు న్యాయం చేయాలి
హైదరాబాద్: న్యాయం కోసం పిల్లలతో కలిసి భర్త ఇంటి వద్ద భార్య నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని అహ్మద్గూడలో చోటుచేసుకుంది. సాయిచరణ్ అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మద్య పలుమార్లు గొడవలు జరిగేవి. దీంతో 2020 సంవత్సరం నుండి దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి సాయిచరణ్ కనిపించకుండా తిరుగుతుండేవాడు. సాయిచరణ్ కీసర అహ్మద్గూడలోని హిడెన్ గార్డెన్ అపార్టుమెంట్లో ఉంటున్నాడని తెలుసుకొని పిల్లలతో కలిసి భార్య శిల్ప తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అనంతరం కీసర పోలీసులు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు, తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుకూర్చుంది. -
భార్య బర్త్డే సెలబ్రేట్ చేసిన నితిన్ (ఫోటోలు)
-
సైబర్ వలలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సతీమణి ఊర్మిళ సైబర్ నేరస్తుల వలలో చిక్కారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీ లాభాలు ఆర్జించవచ్చన్న నేరస్తుల మాయమాటలను నమ్మి ఏకంగా రూ.2.58 కోట్లు మోసపోయారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలోని స్రవంతి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న లక్ష్మీ నారాయణ భార్య ఊర్మిళకు గత నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్లో సందేశం వచ్చింది.స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కు చిట్కాలు ఇస్తామని, అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆ సందేశం సారాంశం. అయితే ఆమెకు ట్రేడింగ్లో అనుభవం లేకపోయేసరికి.. తన భర్తను వాట్సాప్ గ్రూప్లో చేరమని సలహా ఇచ్చారు. దీంతో లక్ష్మీ నారాయణ నవంబర్ 29న ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్సే్ఛంజ్ గ్రూప్–20’అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేరారు. ఇందులో 167 మంది సభ్యులు ఉన్నారు. అమెరికాలో పీహెచ్డీ అంటూ.. దినేష్ సింగ్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సలహాలు ఇస్తూ మెసేజ్లు చేసేవాడు. ‘స్టాక్ మార్కెట్ ట్రెజరీ హంటింగ్ సీక్రెట్స్’ పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించనున్నానని, ఈనెల 23న ముంబైలో ఈ కార్యక్రమం ఉంటుందని దినేష్ గ్రూప్ సభ్యులకు కల్లబొల్లి మాటలు చెప్పాడు. తాను ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ని అని, అమెరికాలోని వార్టన్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశానని, జేపీ మోర్గాన్లో 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను నిర్వహించిన ఈక్విటీ అనలిస్ట్నని చెబుతూ ఓ నకిలీ లింక్ను పంపించాడు. అది చూసిన గ్రూప్ సభ్యులు నిందితుడిని గుడ్డిగా నమ్మారు.ఇదే సమయంలో దినేష్ ‘ది వెల్త్ అలయెన్స్’ అనే కాన్సెప్్టను గ్రూప్ సభ్యులకు పరిచయం చేశాడు. ఒకేరకమైన ఆలోచనలు, లక్ష్యాలు ఉన్న గ్రూప్ సభ్యులు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే 500 శాతం రాబడులు వస్తాయని.. అదే అలయెన్స్ లక్ష్యమని నమ్మించాడు. 5–6 వారాల్లో 200 శాతం లాభాలు అందిస్తానని హామీ ఇచ్చాడు. సభ్యులతో ఏకీకృత బ్రోకరేజ్ ఖాతాను తెరిచాడు. మెకన్లీ బ్రోకరేజ్ సర్విసెస్ ద్వారా మాత్రమే ఇండియన్ మార్కెట్ క్యూఐబీ ట్రేడింగ్, యూఎస్ మార్కెట్ క్యూఐబీ ట్రేడింగ్, ఐపీఓ సబ్స్రి్కప్షన్లను నిర్వహించాలని సూచించాడు. ఇందుకు కస్టమర్ సర్విసెస్ మేనేజర్ అంటూ ఖైతీ అనే మహిళను పరిచయం చేశాడు. సెబీ రిజిస్టర్డ్ సంస్థ అని నకిలీ గుర్తింపు పత్రాలను చూపాడు. భారత్తోపాటు అమెరికా, హాంకాంగ్లలో ట్రేడింగ్ చేయడానికి అధికారం ఉందని వివరించాడు. బంగారం మీద రుణం తీసుకొని మరీ.. గ్రూప్ సభ్యులను మూడు శ్రేణులుగా విభజించిన దినేష్.. రూ.20 లక్షల కంటే తక్కువ పెట్టుబడులు ఉన్నవారికి విక్టరీ వాన్ గార్డ్స్ టీమ్–1 అని, రూ.20 లక్షల కంటే ఎక్కువ పెట్టేవారిని విక్టరీ వాన్ గార్డ్స్ టీమ్–2 అని, అత్యధిక పెట్టుబడులు పెట్టేవారిని క్లోజ్డ్ డోర్ డిస్ప్లే టీమ్ అని పేర్లు పెట్టాడు. గ్రూప్ సభ్యులకు వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు మార్గదర్శకత్వం అందిస్తామని మాయమాటలు చెప్పాడు. గ్రూప్ సభ్యులు అధిక లాభాలు పొందేందుకు పెట్టుబడులు పెంచాలని.. లేకపోతే లాభాలు కోల్పోతారని భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఊర్మిళ పెట్టుబడుల మొత్తాన్ని పెంచారు. ఈ2ఈ రైల్, గాబియన్ టెక్నాలజీస్ ఐపీఓలలో పాల్గొనాలని, పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలని సూచించాడు. 300 శాతం లాభాలు వస్తాయని నమ్మించాడు.దీంతో గుడ్డిగా నమ్మిన ఊర్మిళ.. బంగారం మీద రుణం తీసుకొని మరీ పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు అత్యాశ వద్దని భర్త హెచ్చరించినా పట్టించుకోకుండా ఆమె పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం గమనార్హం. పెట్టుబడుల కోసం నిందితులు పశి్చమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన కరెంట్ ఖాతా నంబర్లను అందించారు. దీంతో అనుమానం కలిగిన ఊర్మిళ.. ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు. వాట్సాప్ ఆధారిత పెట్టుబడి మోసాల గురించి పలు నివేదికలను చూశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 6న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 111(2)(బీ), 318(4), 319(2), 336(3), 338, 340(2)లతో పాటు ఐటీ చట్టంలోని 66–సీ,డీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఒక్క రోజే రూ.38 లక్షలు..ఊర్మిళ తన భర్త పేరు, వివరాలతో ‘మెక్కీ సీఎం’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ట్రేడింగ్ ఖాతాను ప్రారంభించారు. గ్రూప్లో ఇచ్చిన సూచనల మేరకు మెకిన్లీ ట్రేడింగ్ ఖాతాలోకి సొమ్మును బదిలీ చేశారు. గత డిసెంబర్ 24న తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. అప్పట్నుంచి ఈనెల 5 వరకు 19 దఫాలుగా మొత్తం రూ.2.58 కోట్లు పెట్టారు. డిసెంబర్ 26న ఒక్క రోజే ఏకంగా రూ.38 లక్షలు పెట్టారు. బాధితురాలి యాక్సిస్ బ్యాంక్ ఖాతా నుంచి నిందితులకు చెందిన సీబీఐ బ్యాంక్లోని కంపాకోలా బెవరేజెస్ ఖాతాకు ఈ సొమ్మును బదిలీ చేశారు. నిందితులు మాతారా ఎంటర్ప్రైజెస్, రిసోర్స్ గ్లోబల్ సర్వీసెస్, సమ్మిట్ ఆటోమేషన్ కంట్రోల్ సిస్టమ్ పేరుతో కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. -
భర్త వివాహేతర సంబంధం.. కత్తితో వివాహిత హల్చల్
రామన్నపేట: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగా తనకు, తన పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని భర్త దుకాణం ఎదుట భార్య కత్తితో హల్చల్ చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలో బుధవారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన జ్యోత్స్నకు మెరుగు శ్రీకాంత్ అనే వ్యక్తితో 20 ఏళ్లక్రితం వివాహమైంది. భర్తకు వరంగల్ చౌరస్తాలో జ్యువెలరీ దుకాణం ఉంది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 8 ఏళ్ల కిత్రం విడిపోయారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం కోర్టు వాయిదా ఉండగా జ్యోత్స్న హాజరు కాలేదు. బుధవారం తన భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ చేసింది. తన భర్త వేరే మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇంతెజార్గంజ్ పోలీసులు అక్కడికి చేరుకుని సదరు వివాహితకు నచ్చజెప్పి పోలీస్స్టేషన్కు తరలించారు. ఆనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించగా, ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని వారు తెలపడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ మహిళను కుటుంబ సభ్యులతో పంపించారు. -
ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య
-
2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన భార్య
-
ఖతర్నాక్ విగ్గురాజా
బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్స్టైల్పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు.. బట్టతల భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు.. నా ఫోన్ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్ భాగ్లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె. సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్ పీఎస్ అధికారి మనోజ్కుమార్ చెబుతున్నారు. -
నిజామాబాద్ సౌమ్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నిజామాబాద్: భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా.. బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు.ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గుండె పోటు అంటూ చిత్రీకరించారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్గా భార్య నమ్మించింది. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఒప్పుకున్నారు.పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్తో ఆమెకు పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా మందలించాడు.దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్తో కలిసి రమేష్ను ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియల సమయంలో రమేష్ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫ్రెంచ్ అధ్యక్షుడి భార్యపై ట్రోల్స్.. జైలుశిక్ష
పారిస్: ఫ్రెంచ్ అధ్యక్షుడి సతీమణిని ట్రోల్ చేసినందుకు గాను అక్కడి పారిస్ కోర్టు పదిమందికి జైలుశిక్ష విధించింది. బ్రిగెట్టి మేక్రాన్ పురుషుడు అంటూ కొంతమంది ఆన్లైన్లో వేదింపులకు గురిచేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేయగా తాజాగా ఆకేసును విచారించిన పారిస్ కోర్టు వారికి శిక్ష విధిస్తూ తీర్పుఇచ్చింది.ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్ను 2024లో కొంతమంది ఆకతాయిలు ఆన్లైన్లో ట్రోల్ చేశారు. వాస్తవానికి బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడని ఆయన అసలు పేరు జీన్- మిచెల్-ట్రోగిక్స్ అని ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్పై కలత చెందిన మాక్రాన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పుకార్ల వల్ల తమ కుటుంబం ఎంతో బాధపడిందని ఆమె కుమార్తె తెలిపింది.తాజాగా దీనిపై విచారించిన కోర్డు నిందితులు పదిమందికి ఎనిమిది నెలల జైలుశిక్షతో పాటు రూ. 63 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే వీరిలో కొంతమంది తాము కేవలం సరదాకు మాత్రమే అలా అన్నామని అనగా.. దేశ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని న్యాయమూర్తి వారిని హెచ్చరించారు.అమెరికాలో కూడా ట్రంప్ అనుకూల జర్నలిస్టులు కాండేస్ ఓవెన్స్, టక్కర్ గ్రావెన్స్ అనే ఇద్దరు జర్నలిస్టులు బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడే అని వ్యాఖ్యలు చేశారు. బ్రిగిట్టే తన సోదరుడు జీన్-మిచెల్-ట్రోగన్స్ వాస్తవానికి ఒక్కరేనని మిచెల్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని బ్రిగిట్టేగా మారిందన్నారు. అయితే ఇవన్ని అసత్యపుకార్లని చాలా మంది కొట్టిపారేశారు. -
ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి
సాక్షి,విజయవాడ: ఐఏఎస్ అధికారి కిషోర్ సతీమణి సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారి కిషోర్ భార్య సత్య దీపిక గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత వారం ఐఏఎస్ అధికారి కిషోర్ తన భార్యను ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే,ఈ ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.సత్య దీపిక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సత్యదీపిక మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా సేకరిస్తున్నారు. -
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
-
భార్య వివాహేతర సంబంధం.. భర్తకు నరకయాత!
= తన భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ...అతనితో కలిసి తనపై దాడి చేస్తోందని పుట్టపర్తి మండలం జగరాజుపల్లికి చెందిన ఓ యువకుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనకు విడాకులు కావాలని అడిగినా... ఆమె ఒప్పుకోవడం లేదని... కాపురం చేస్తానని చెబుతూనే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోయాడు. పైగా తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తోందని, పోలీసులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ తనకే కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. = ముదిగుబ్బ మండలానికి చెందిన ఓ యువతి తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి రెండు వారాల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చింది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తనను ఇబ్బందులు పెడుతున్నాడని కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదు చేయాలని, లేదంటే తనతో విడాకులకు ఒప్పుకునేలా అతడిని మార్చాలని కోరింది. లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయింది....ఇలా ప్రతి వారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు కుటుంబ సమస్యల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా అందే అర్జీల్లో 20 శాతానికి పైగా కుటుంబ కలహాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఏ కేసును పరిశీలించినా.. దంపతుల మధ్యలోకి మరో వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. బంధం భారమనుకుంటున్న వారు వీలైనంత త్వరగా బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.సాక్షి, పుట్టపర్తి: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండాలని వేద మంత్రాల సాక్షిగా వివాహం చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఏడడుగులు నడిచి.. ఏడాది గడవక ముందే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. పెళ్లయిన మొదటి రోజు నుంచే విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఉన్నారు. మరికొందరు పిల్లలు పుట్టినా.. కలిసి ఉండలేక వేర్వేరుగా జీవితం వెళ్లదీస్తున్నారు. దంపతుల మధ్య తలెత్తుతున్న వివాదాలు చిన్నారుల భవితను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలతోనే.. దంపతుల మధ్య సయోధ్య కుదరక.. సర్దుకుపోయే గుణంలేక.. పెద్దల మాట లెక్క చేయక.. ప్రతి వారం కనీసం పది జంటలు పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని.. కలిసి ఉండలేమని.. వేరుగా జీవించేందుకు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇందులో వివాహేతర సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. భార్య లేదా భర్త.. అవతలి వ్యక్తిపై చేసే ఫిర్యాదులో కచ్చితంగా మరొకరితో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో దంపతుల మధ్య విభేదాలకు సంబంధించి కొందరు ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు విడాకులు కోరుతూ న్యాయవాదుల వద్దకు వెళ్తున్నారు. సర్దుకుపోయే తత్వంలేక నిత్యం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. అనాలోచిత నిర్ణయంతో. ఆకర్షణో.. ప్రేమో అర్థం చేసుకోలేక, ఆలోచించే పరిపక్వత లేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొత్త దాంపత్య జీవితంలో ఇష్టంగా అడుగు పెట్టినా.. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకుని గొడవ పడుతున్నారు. ఆలోచన లేని ఆవేశంతో విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దలలు జోక్యం చేసుకుని సర్దిచెప్పినా పరిస్థితి చక్కబడటం లేదు.సర్దుకుపోతే మంచిది ప్రతి మనిషికీ తోడు ఎంతో అవసరం. మంచి, చెడులను వివరించి చెప్పగలిగే స్నేహితుడు దొరికితే వారు చాలా అదృష్టవంతులు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్నేహితులుగా భావించాలి. అప్పుడే వారికి కలిగే చిన్న చిన్న సమస్యలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఏదైనా సమస్య తలెత్తితే కుటుంబ పెద్దలకు చెప్పి.. ఇంట్లోనే సర్దుకుంటే మంచిది. – సతీష్ కుమార్, ఎస్పీ, శ్రీసత్యసాయి జిల్లా -
నా భర్త అశ్లీల వీడియోలు చూస్తూ.. నరకం చూపిస్తున్నాడు..!
బెంగళూరు: భర్త విచిత్ర ప్రవర్తన, లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. హెచ్ఆర్గా ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయమై అనంతరం ప్రేమకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించిన అనంతరం 2025 సెపె్టంబరు 3 తేదీన కుటుంబ సభ్యులు చింతామణిలో మంజునాథ్తో వివాహం జరిపించారు.వివాహమైన అనంతరం భర్త సైకోలా ప్రవర్తిస్తుండగా ఫోన్ చూసి లైంగిక ప్రక్రియకు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లో వారి ముందు నగ్నంగా తిరుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ప్రస్తుతం సైకో భర్త వేధింపులకు భార్య హడలిపోయింది. నేను వివాహం చేసుకుంది ఇలాంటి సైకో వ్యక్తినా అని మదనపడుతోంది. వివాహమైన కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉన్న భర్త ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తుండటంతో భార్య బెంబేలెత్తిపోతోంది. అత్తమామల ముందు కూడా నగ్నంగా సంచరిస్తుండటంతో పాటు ప్యాసేజ్లోకి వెళ్లి చుట్టుపక్కల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. భర్త విచిత్ర ప్రవర్తన, వేధింపులతో పాటు తనను భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా దూషించి దాడికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కేంద్ర విభాగం మహిళా స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య గొంతు కోసిన భర్త
ఆత్మకూరు: భార్యపై అనుమానం పెంచుకు న్న ఓ భర్త ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హనుమ కొండ జిల్లా ఆత్మకూ రు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రా నికి చెందిన అనూష, మంద రవి 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమా ర్తెలు. పెళ్లైన నాలుగేళ్లనుంచి రవి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అనూష ఓ గురుకుల పాఠశాలలో అటెండర్గా పనిచేస్తుండగా రవి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనపై శారీరక, మానసిక వేధింపులు ఎక్కువ కావడంతో రెండు నెలల క్రితం అనూ ష మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలే దు. గురువారం రాత్రి రవి భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పిడిగుద్దులు గుద్దుతూ ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు, మెడ, పొట్ట, కుడిచేతిపై ఇష్టానుసారంగా పొడిచాడు. అనూష కేకలు వేయడంతో పక్కగదిలో ఉన్న అత్త, కూతుళ్లు వచ్చి అడ్డుకున్నారు. చుట్టుపక్కలవారి సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. -
భార్యపై అనుమానంతో నిప్పు పెట్టిన భర్త
-
దారి కాచి మరీ భువనేశ్వరిని కాల్చి చంపిన భర్త
నీతో కలిసి జీవించలేను విడాకులు ఇవ్వమని నోటీసులిచ్చిన భార్యను అత్యంత దారుణంగా కాల్చి చంపాడో భర్త. వైవాహిక విభేదాలతో ఆమె భర్తను విడాకులు అడిగింది. అదే ఆమె చేసిన నేరం. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.బాధితురాలిని భువనేశ్వరి (39)గా గుర్తించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వర నగర్ బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. ఈమె భర్త, నిందితుడు బాలమురుగన్ (40) ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక పనిచేసేవాడు. వీళ్లిద్దరూ తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారు. వీరికి 2011లో వివాహమైంది. 2018లో బెంగళూరుకు మకాం మార్చారు. వీరికిద్దరు సంతానం. అయితే గత నాలుగేళ్లుగా బాలమురుగన్కు ఉద్యోగం లేదు. నెమ్మదిగా తగాదాలు మొదలయ్యాయి. దీంతో భార్యపై అనుమానం మొదలైంది. భువనేశ్వరి చట్టబద్ధంగా విడిపోవాలని కోరింది, దానిని బాల మురుగన్ వ్యతిరేకించాడు దీంతో వేరే బ్రాంచ్కు ఉద్యోగాన్ని బదిలీ చేయించుకున్న భువనేశ్వరి గత ఏడాదికాలంగా 12 ఏళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురితో కలిసి రాజాజీ నగర్లో వేరుగా నివాసముంటోంది. బాలమురుగన్ కేపీ అగ్రహారలో ఒంటరిగా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం భువనేశ్వరి బాలమురుగన్కు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్అటు ఉద్యోగం లేదు, ఇటు భార్యతో గొడవలు, అనుమానం, విడాకుల నోటీసులు దీంతో భార్యపై ఆగ్రహం పెంచుకున్న బాలమురుగన్ ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నారు. భార్య కదలికలను పసిగట్టి, సరిగ్గా ఆమె ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయంలో కాపుగాసి ఆమెను అడ్డుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో, రాజాజీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 1వ ప్రధాన రోడ్డులో చాలా సమీపంనుంచి ఆమెపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పిస్టల్తో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.హొయసల పెట్రోల్ సిబ్బంది గాయపడిన భువనేశ్వరిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అప్పటికేఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా వినిపించిన కాల్పులను భయాందోళనలు రేకెత్తించాయి. జనం పరుగులు తీశారు. రెండు బుల్లెట్లు భువనేశ్వరి తలపై దూసుకుపోగా, మిగిలిన రెండు బుల్లెట్లు ఆమె చేతికి తగిలాయి. నిందితుడు తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడని, ఇదే గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, అతనికి ఆయుధం ఎలా వచ్చింది, దానికి లైసెన్స్ ఉందా? తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
చపాతి లేట్ అయిందనీ, భార్య, నాలుగేళ్ల కొడుకుపై పెనంతో దాడి
గోరఖ్పూర్(యూపీ): ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు.. తాగుబోతుల నిర్వాకాలు ఎటు పోతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రి పూట హాయిగా పిల్లాడితో కలిసి నచ్చింది వండుకుని తిందామనుకున్న ఆ ఇల్లాలికి పిడుగులా మీద పడ్డాడు తాగుబోతు భర్త. డ్రైవర్గా సంపాదించిందంతా తాగుడుకే నీళ్లగా ఖర్చయిపోగా ఆగమేఘాల మీద క్షణాల్లో చపాతి కావాలంటూ భీష్మించుకు కూర్చుని భార్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు. మెరుపువేగంతో చపాతి చేయకపోతే పిడిగు ద్దులు ఖాయమని హెచ్చరించి చివరకు అనుకున్నంత పనీ చేశాడు. భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడి రక్తం కళ్లజూశాడు. తాగుబోతు డ్రైవర్ నిర్వాకంపై ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లోని గోరఖ్ నాథ్ పోలీస్స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్లో ఒక్కటే చర్చ జరుగుతోంది. చపాతి ఆలస్యంగా చేసిందన్న చితకబాదుతాడా అంటూ అతడిని తిట్టిపోయని వాళ్లు లేరు. 30 ఏళ్ల భార్యామణి రాధికా సహానీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భార్యాభర్తల చపాతి గొడవ ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు, బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో లాల్చంద్ సహానీ పూటుగా తాగి ఇంటికొచ్చాడు. లక్నోలో డ్రైవర్గా పనిచేయడం వచ్చిన డబ్బులు తాగుడకు తగలేయడం అతనికి దినచర్యగా తయారైంది. శనివారం రాత్రి ఇంటికి రాగానే ‘రోటీ రెడీ చెయ్’ అని హోటల్లో సర్వర్కు ఆర్డర్ వేసినట్లు ఆర్డర్ వేశాడు. ఇంట్లో అంట్లు తోమడం వంటి ఇంటి పనులు ముగించుకుని రోటీలు చేసి ఇచ్చింది. రోటీ చేయడానికి ఇంత సమయం పడుతుందా? ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా? అంటూ లాల్చంద్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. అప్పటికే వంటగదిలో పొయ్యి మీద వేడిమీదున్న పెనం తీసుకుని భార్యను చితక్కొట్టాడు. గొడవతో భయపడి అటుగా వచ్చిన తమ నాలుగేళ్ల కుమారుడి తల మీదా లాల్ చంద్ పెనంతో దాడి చేయడంతో తలకు గాయమై రక్తం ధారగా కారింది. దీంతో భయపడిపోయిన లాల్ చంద్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెల్సిన ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పిల్లాడిని ఆస్పత్రిలో చేర్పించాడు. పారిపోతూ లాల్చంద్ భార్యను ‘నిన్ను చంపేస్తా’’ అంటూ అరుస్తూ పరుగెత్తాడని పొరుగువాళ్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు తాగుబోతు భర్త కోసం గాలింపు మొదలెట్టారు. లాల్చంద్ను వెంటనే పట్టుకుని తగిన బుద్ధి చెప్తామని గోరఖ్నాథ్ పోలీస్స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శశిభూషణ్ రాయ్ చెప్పారు.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
బిడ్డను చూపాలంటే రూ.30 లక్షలు ఇవ్వు
మైసూరు: భార్య వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మైసూరు ఆలనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జిల్లా టి. నరసిపుర తాలూకా నివాసి, ప్రైవేటు కంపెనీ ఇంజనీర్ ఉమేష్ (34), మైసూరులోని సిద్ధార్థ బరంగే నివాసి చన్నబసవేగౌడ కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. ప్రారంభంలో బాగానే ఉన్న భార్యాభర్తలు తరువాత తరచుగా గొడవ పడుతుండేవారని ఉమేష్ తండ్రి గురుమల్లెగౌడ తన ఫిర్యాదులో తెలిపాడు. గత 2 సంవత్సరాలుగా, ఉమేష్ తన చిన్నారి కూతురిని చూడలేక పోయాడు. భార్య బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బిడ్డను చూడాలనుకుంటే డబ్బులు ఇవ్వాలని ఆమె వేధించేది. ఇది తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేవాడు. డిసెంబర్ 19న, భార్యకు వీడియో కాల్ చేసి, తన కూతురిని చూపించమని అడిగాడు. అయితే, రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్చేసింది. దీంతో ఆవేదన చెందిన ఉమేష్ తన బాడుగ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. భార్య రమ్య, అతని తల్లిదండ్రులపై చన్నబసవేగౌడపై అలనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని..
హవేళిఘణాపూర్(మెదక్): ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండటంతో భరించలేని ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తిరిగి కాపురానికి రావ డం లేదనే అక్కసుతో అతను తన కుమారుడిని హత్య చేశాడు. మెదక్ జిలాల్లోని మెదక్ మండలంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద బాయి తండాకు చెందిన భాస్కర్ తన భార్య అమీనాపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈనెల 19న సాయంత్రం భాస్కర్ తన భార్యను కొట్టడంతో ఆమె పిల్లలను వదిలివేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తిరిగి కాపురం చేసేందుకు రావడంలేదనే కోపంతో అతను శనివారం రాత్రి నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు లక్కీ(3)ని గొంతు నొలిమి చంపాడు. ఈ ఘటనపై తల్లి అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ రూరల్ ఎస్ఐ లింగం తెలిపారు. ప్రస్తుతం చిన్నారి లక్కీ మృతదేహాన్ని మెదక్జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు న్యాయస్థానం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తోషాఖానా-2 అవినీతి కేసులో విచారణ జరిపిన కోర్టు, శనివారం (డిసెంబర్ 20) వీరికి చెరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పు ప్రకారం, పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడేళ్ల శిక్షతో పాటు, దంపతులిద్దరికీ చెరో రూ. 10 మిలియన్ల భారీ జరిమానా విధించారు.సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి 2021లో అందిన విలాసవంతమైన బహుమతులను వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. విదేశీ ప్రముఖులు ఇచ్చే విలువైన ఆభరణాలు, విలాసవంతమైన గడియారాలను ప్రభుత్వ నిధికి (తోషాఖానా) అప్పగించకుండా, తక్కువ విలువ చూపించి కొనుగోలు చేశారని ప్రాసిక్యూటర్లు నిరూపించారు. ఆ తర్వాత ఆ వస్తువులను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి, కోట్లాది రూపాయల లాభం పొందారని దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇమ్రాన్ ఖాన్ 2022లో అధికారం కోల్పోయినప్పటి నుండి ఎదుర్కొంటున్న సుమారు 200 పైగా కేసుల్లో ఇది అత్యంత కీలకమైనది. గతంలో తోషాఖానా-1 కేసులో పడిన 14 ఏళ్ల శిక్షకు ఇది అదనం. దీంతో ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు మరింత జటిలమయ్యాయి. అయితే ఈ తీర్పులను ఇమ్రాన్ పార్టీ అయిన 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' (పీటీఐ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఒక న్యాయ హత్య అని, రాబోయే ఎన్నికల నుండి ఇమ్రాన్ను దూరం చేయడానికి సైన్యం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు.ఈ తాజా తీర్పు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో, ఈ శిక్ష పీటీఐ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తీర్పు నేపధ్యంలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పించేందుకే ఇన్ని కేసులు పెడుతున్నారని ఇమ్రాన్ వాదిస్తుండగా, ఇది అవినీతిపై చట్టం సాధించిన విజయమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు పీటీఐ నేతలు ప్రకటించారు. Pakistan's Dawn reports - "A special court of the Federal Investigation Agency (FIA) on Saturday sentenced PTI founder Imran Khan and his wife Bushra Bibi to 17 years imprisonment in the Toshakhana-2 case. The case pertains to the purchase of an expensive Bulgari jewellery set,… pic.twitter.com/LOtVNMr9pq— ANI (@ANI) December 20, 2025 -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు (ఫోటోలు)
-
భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్గా గుర్తించారు. పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్ తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.Shamli, Uttar Pradesh: A husband allegedly killed his wife and two daughters and buried their bodies in a 9-foot-deep pit at homeSP N.P. Singh says, “On Tuesday evening around 5 PM, the village head of Gaungori Daulat under Kandhla police station informed us that a man named… pic.twitter.com/RITXJLfsCY— IANS (@ians_india) December 17, 2025 -
ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం
కర్ణాటక: కళ్ల ముందే ప్రాణం పోతున్నా.. గుండెపోటుతో రోడ్డుపై విలవిల్లాడుతున్నా.. సాయం కోసం అతని భార్య చేతులు జోడించి వేడుకుంటున్నా.. జనం పట్టించుకోలేదు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. బనశంకరి మూడో స్టేజ్ బాలాజీనగర్కు చెందిన వెంకటరామన్(34) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళనకు గురైన భార్య రూప అతనిని వెంటనే స్కూటీపై సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెపోటు అని నిర్ధారించారు. ప్రథమ చికిత్స చేసి.. జయదేవ హృద్రోగ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ అంబులెన్సు లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రూప.. భర్తను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మళ్లీ స్కూటీపైనే బయలుదేరింది. కదిరేనహళ్లి బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి.. వెంకటరామన్ స్కూటీపై నుంచి కిందపడిపోయాడు. దీంతో రూప రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి సాయం కోసం వేడుకుంది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికి వెంకటరామన్ సోదరి అక్కడకు చేరుకుంది. చివరకు ఇద్దరూ కలిసి క్యాబ్లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే వెంకటరామన్ మరణించాడు. సమయానికి ఎవరూ మానవత్వం చూపకపోయినా.. రూప పెద్ద మనసుతో తన భర్త కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచింది. #Heartbreaking incident in Bengaluru has left many shaken and questioning humanity. Thirty-four-year-old Venkataramanan suffered a sudden cardiac arrest while riding a bike with his wife. Near Kadrihalli Bridge, he collapsed on the road, gasping for life. His wife screamed for… pic.twitter.com/VXSUDWDq8Z— Bharathirajan (@bharathircc) December 17, 2025 -
భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)
-
భార్యను హత్య చేసి బైక్ పై మృతదేహాన్ని..
-
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
-
బాత్రూమ్ కడితేనే సంసారానికి వస్తా!
కర్నూలు జిల్లా: బాత్రూమ్ సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు. -
భార్యతో విహారయాత్రకు వెళ్లిన కీరవాణి కొడుకు హీరో సింహా (ఫొటోలు)
-
పెళ్లయిన 24 గంటలకే... ఎంత దారుణం..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వరకట్న వేధింపుల దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్లోని జుహి ప్రాంతానికి చెందిన లుబ్నా, మొహమ్మద్ ఇమ్రాన్లకు నవంబర్ 29న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. కోటి కలలతో లుబ్నా మరుసటి రోజు తన అత్తమామల ఇంటిలో అడుగుపెట్టింది. అయితే ఆమె కలలు 24 గంటలు ముగియకుండానే కల్లలయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమెను వేధించి, భర్త ఇమ్రాత్తో పాటు అతని కుటుంబ సభ్యులు లుబ్నాను బయటకు గెంటేశారు.లుబ్నా తన అత్తమామల ఇంటికి వచ్చిన వెంటనే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ లేదా దానికి బదులుగా రెండు లక్షల నగదు ఇవ్వాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. ‘నేను ఇంటికి వచ్చిన వెంటనే గొడవ మొదలైంది. మాకు బుల్లెట్ బైక్ ఇవ్వలేదు.. వెంటనే ఇంటికి వెళ్లి రూ. రెండు లక్షలు తీసుకురా అంటూ వారు తనను కొట్టడం ప్రారంభించారు’ అని లుబ్నా పోలీసులకు వివరించింది. అత్తామామలు తనను కొట్టడమే కాకుండా, తమ పుట్టింటివారు పెట్టిన నగలు, నగదును కూడా వారు బలవంతంగా తీసేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది.లుబ్నా తల్లి మెహతాబ్ మాట్లాడుతూ తమ కుమార్తె వివాహానికి లక్షలు ఖర్చు చేశామని, తమ శక్తి మేరకు సోఫా సెట్, టీవీ, వాషింగ్ మెషిన్, కిచెన్ సామాగ్రి తదితర విలువైన బహుమతులు ఇచ్చామని తెలిపారు. పెళ్లికి ముందు బైక్ డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదని, ఒకవేళ ముందే అడిగి ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకోమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తమ కుమార్తె కన్నీటితో ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని వివరించిందని మెహతాబ్ తెలిపారు.ఈ ఘటనపై లుబ్నా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మొహమ్మద్ ఇమ్రాన్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, పెళ్లికి ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని లుబ్నా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వరకట్న దాహంతో పెళ్లైన మరుసటి రోజే కొత్త కోడలిని వేధింపులకు గురిచేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా.. -
వాట్సాప్ స్టేటస్గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఉంటూ టౌన్ హాల్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. -
నీ కుక్క నా పిల్లిపై దాడి చేసింది..!
అక్కడ పిల్లాడి పేరు విషయంలో ఏకాభిప్రాయం లేక ఆ జంట విడాకులకు వెళ్లగా.. ఇక్కడ తమ పెంపుడు జంతువుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల మరో జంట విడిపోవాలని నిర్ణయించుకుంది. భోపాల్కు చెందిన ఓ యువతీయువకుడు జంతు ప్రేమికులు. అదే వారిద్దరినీ తొలుత స్నేహితులుగా.. ఆపై భార్యాభర్తలుగా మారేలా చేసింది. చివరకు అదే వారిద్దరూ విడిపోవాలనుకోవడానికీ కారణమైంది. భర్త దగ్గర కుక్క ఉంది.. భార్య పిల్లిని పెంచుకుంటోంది. ఆ రెండింటినీ కలపడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో తాము కూడా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కుక్క తన పిల్లిపై చాలాసార్లు దాడి చేసిందని ఆమె ఆరోపించగా.. ఆ పిల్లి ఇంట్లో అక్వేరియంపై పదేపదే తిరగడం చాలా ఆందోళనకు గురిచేసిందని అతడు పేర్కొన్నాడు. కుటుంబ పెద్దలు రంగంలోకి దిగినా.. వైద్యులు కౌన్సెలింగ్ చేసినా ఇరువురి తీరూ మారలేదు. ముందే అనుకున్నాం కదా.. విడిపోవడానికి కారణాలు కోకొల్లలు అని..! -
Sobhita Dhulipala : స్పెషల్ ఏజెంట్లా మారిపోయిన శోభిత! (ఫొటోలు)
-
ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య
బెంగళూరు: తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య ఉదంతం బెంగళూరు ఉత్తర తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదగిరికి చెందిన బసవరాజు(28), శరణమ్మలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉపాధి కోసం బెంగళూరు వచ్చి తిగళరపాళ్యలో నివసిస్తున్నారు. ఈక్రమంలో శరణమ్మకు వీరభద్ర అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తమ ఆనందానికి బసవరాజు ఎప్పటికైనా అడ్డు వస్తాడని భావించిన శరణమ్మ వీరభద్రతో కలిసి భర్తను కడతేర్చేందుకు ప్రణాళిక రచించింది. ఇంట్లో పడుకున్న బసవరాజు తలపై పెద్ద బండరాయి వేసి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని తీసికెళ్లి గంగొండనహళ్లి వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. శరణమ్మతోపాటు ఆమె ప్రియుడు వీరభద్ర, అనిల్ అనే నిందితులను అరెస్టు చేశారు. -
దుబాయి మ్యూజియంలో అల్లు స్నేహ (ఫొటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్ రస్తోగి
బ్లూ డ్రమ్.. ఈ పేరు వింటేనే భర్తల వెన్నులో వణకు పుడుతోంది. అందుకు కారణం.. మీరట్లో జరిగిన ఓ ఘటన. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను ప్రియుడి సాయంతో గంజాయి మత్తులో కిరాకతంగా హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే.. భర్త సౌరభ్ రాజ్పుత్ (మర్చంట్ నేవీ ఆఫీసర్)ను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ముస్కాన్ రస్తోగి మళ్లీ తల్లైంది. ఆదివారం సాయంత్రం మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సయమంలో ముస్కాన్ ప్రియుడు, ఈ కేసు సహ నిందితుడు సాహిల్ శుక్లా కూడా పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలితే.. తమ మనవడిగా స్వీకరిస్తామని సౌరబ్ కుటుంబం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.మీరట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ డ్రమ్ హత్యకేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ముస్కాన్ రస్తోగి, ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆమె.. ఆదివారం సాయంత్రం జైలు అధికారుల పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ప్రియుడు సాహిల్ శుక్లా మోజులో పడి భర్త సౌరభ్ గుప్తను హత్య చేయించిన కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ముస్కాన్ రస్తోగి అరెస్టు సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. గర్భధారణ చివరి దశకు చేరుకోవడంతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు.ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రసవం అనంతరం, భద్రతా కారణాల వల్ల వారిని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ కేసు 2024లో వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్పుత్ హత్య అనంతరం, అతని శవాన్ని బ్లూ డ్రమ్లో నింపి మాయం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు విచారణలో ముస్కాన్ రస్తోగి, ఆమె స్నేహితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. శిశువు భవిష్యత్తుపై చర్చ ముస్కాన్ జైలులో శిశువుకు జన్మనివ్వడంతో, బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టం ప్రకారం, మహిళా ఖైదీలు తమ పిల్లలను ఆరు సంవత్సరాల వయస్సు వరకు జైలులోనే ఉంచుకునే అవకాశం ఉంది. ముస్కాన్ రస్తోగిపై హత్య, శవాన్ని మాయం చేయడం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రసవం అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు. -
భార్యపై ప్రేమ: నాణేలు కూడబెట్టి..
ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని అహిర్వాన్ ప్రాంతానికి చెందిన 22ఏళ్ల అభిషేక్ యాదవ్.. పాన్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు. ఇతడు ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత తన భార్యకు బంగారు గొలుసు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి కారణంగా ఒకేసారి గొలుసు కొనలేడు. కాబట్టి డబ్బు కూడబెట్టాలనుకున్నాడు. అప్పటి నుంచి నాణేలను పోగు చేయడం ప్రారంభించాడు. ఏడాది పొడువునా రూ.10, రూ. 20నాణేలను కూడబెట్టాడు.మొత్తం కూడబెట్టిన నాణేల బస్తాలను.. బంగారు ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లాడు. బస్తాలను కౌంటర్లో దగ్గర పెట్టాడు. ఇది చూసిన షాప్ యజమాని మహేష్ వర్మ మొదట ఆశ్చర్యపోయాడు. ఇన్ని నాణేలను బ్యాంకు కూడా తీసుకోదని వర్మ.. అభిషేక్తో చెప్పాడు. కానీ కొంతసేపటి తరువాత అంగీకరించాడు. మొత్తం నాణేలను లెక్కపెడితే.. రూ. 1.05 లక్షలు ఉన్నాయి. దీనిని లెక్కపెట్టడానికి రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షఫాలీ వర్మ కొత్త స్పోర్ట్స్ కారు: ధర ఎంతో తెలుసా?అభిషేక్ యాదవ్ తన భార్య కోసం కొన్న గొలుసు రూ. 1.25 లక్షలు. కానీ అతడు తెచ్చిన డబ్బును మహేష్ వర్మ తీసుకుని, మిగిలిన డబ్బును వాయిదాల పద్దతిలో కట్టించుకోవడానికి అంగీకరించాడు. మొత్తానికి యాదవ్ తన భార్య కోసం.. బంగారు గొలుసు కొనేసాడు.A Kanpur Paan sellar saves ₹20 Coins daily to buy ₹1 Lakh Gold Chain as a surprise Gift for his Wife.JEWELLER : I was SHOCKED. It took more than two hours to count all the coins 😳MAN : I’ll present it to her when she returns from her Maayka ♥️ pic.twitter.com/Dr0nMX6htj— News Algebra (@NewsAlgebraIND) November 23, 2025 -
తండ్రి అయ్యే వేళ.. వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమన్న మేనేజర్
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా.. వర్క్ చేయాలని పట్టుబడుతున్నాయి. తాజాగా ఒక ఉద్యోగికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మేనేజర్పై తీవ్రంగా మండిపడుతున్నారు.నా భార్య ప్రసవ వేదనలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా.. మేనేజర్ వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమని అన్నారు. ఉద్యోగి ఆ విషయాన్ని రెడ్డిట్లో పోస్ట్ చేశారు. ''నా భార్య మా మొదటి బిడ్డ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. నేను మేనేజర్కు ఈ విషయం గురించి చెప్పి రెండు రోజులు మాత్రమే సెలవు అడిగాను. అయితే మేనేజర్ సానుభూతి చూపించడానికి బదులు, ఆసుపత్రి నుంచే వర్క్ చేయమని అన్నారు. మా బిడ్డపై ద్రుష్టి పెట్టాల్సిన సమయంలో నేను ఆసుపత్రి గదిలో నా ల్యాప్టాప్తో కూర్చోవడం సరైంది కాదు. నేను ఉద్యోగాన్ని వదులుకోలేను, ఎందుకంటే.. నా బాధ్యతలు పెరుగుతూనే ఉన్నాయి, నేను వాళ్లకు వ్యతిరేఖంగా మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారేమో అని భయంగా ఉందని'' అన్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు మేనేజర్పై ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ పని ఉంటుంది. ముందు మీ భార్యను చూడండి అని ఒకరు, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. నేను ఇండియాలో పనిచేయకపోవడం మంచిది అయిందని ఇంకొకరు అన్నారు. భార్య, బిడ్డ జీవితంలో చాలా కీలకం.. ఆ దిశగా ఆలోచించు అని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం! -
LB నగర్ మన్సురాబాద్ వాంబే కాలనీలో దారుణం
-
బతికున్నట్లు నిరూపించుకునేందుకు మూడేళ్లు
అలీగఢ్: అధికారిక రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 58 ఏళ్ల సరోజ్ దేవి మూడేళ్ల క్రితమే చనిపోయింది..! అసలు చనిపోయింది నా భర్త..నేను కాదు మొర్రో.. అని అప్పటి నుంచి ఆమె అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటూనే ఉంది. ఎవరూ ఆమె గోడును పట్టించుకున్న పాపాన పోలేదు. చమర్ నగారియా గ్రామానికి చెందిన జగదీశ్ ప్రసాద్ 2020లో చనిపోయాడు. స్థానిక క్లర్కు ఒకరు మృతుల జాబితాలో జగదీశ్ ప్రసాద్ బదులుగా అతడి భార్య సరోజ్ దేవి చనిపోయినట్లుగా 2022 జనవరి ఒకటో తేదీన నమోదు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. సరోజ్ దేవి ఆధార్ నంబర్ను డీయాక్టివేట్ అయ్యింది. గుర్తింపునకు సంబంధించిన ఇతర ఆధారలేవీ ఆమెకు లేకుండాపోయాయి. అప్పటి నుంచి ఆమె అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. మూడేళ్లయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. చివరికి ఈ నెల 15వ తేదీన ఖైర్ సబ్ విడిజనల్ మేజి్రస్టేట్ శిశిర్ కుమార్కు తెహశీల్ దివస్ సందర్భంగా సరోజ్ దేవి తన సమస్యను వివరించింది. తన గుర్తింపును పునరుద్ధరించాలని, తనను తిరిగి బతికించాలని కోరింది. ఎట్టకేలకు ఆయన స్పందించారు. ప్రాధా న్యం కలిగిన అంశంగా భావించి, పరిష్కా రానికి అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. రికార్డుల్లో ఇందుకు అవసరమైన దిద్దుబాట్లు చేపట్టామని శిశిర్ కుమార్ తెలిపారు. సమస్య పరిష్కారమై సరోజ్ దేవి త్వరలోనే ప్రభుత్వ రికార్డుల్లో సజీవురాలు అవ్వాలని ఆశిద్దాం.! -
రూ.6 లక్షల జాబ్ ఔట్.. వెంటనే డైవోర్స్!
బంధాలు, ప్రేమానురాగాలు అంతా ఒక బూటకం అన్నాడో సినీ కవి. కానీ చైనాకు చెందిన ఈ భార్యా బాధితుడి వేదన వింటే అది అక్షర సత్యం అనిపించక మానదు. నెలకు రూ. లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగం అలా పోయిందో లేదో ఇలా తన భార్య తనకు విడాలిచ్చి వెళ్లిపోయిందని గోడు వెళ్లబోసుకోవడంతో ఇటీవల చైనా అంతటా వైరల్గా మారాడు.163.కామ్ ప్రకారం.. కియాన్ కియాన్ అనే 43 ఏళ్ల లా గ్రాడ్యుయేట్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలో పనిచేసేవాడు. నెలకు 50,000 యువాన్లు అంటే రూ.6.23 లక్షలు జీతం. కానీ వివాహం తన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందంటున్నాడు.ఆమె విలాసవంతమైన ఖర్చుల కోసం పాపం ఉన్న ఒక్క ఫ్లాటునూ అమ్ముకోవాల్సి వచ్చింది. విడాకుల సమయానికి తనకంటూ ఎలాంటి ఆస్తి లేకుండా పోయిందని వాపోయాడు. పాపం మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తమ ఏడేళ్ల సహవాసంలో వాళ్లు దగ్గరైంది 7-8 సార్లు మాత్రమే అంటే ఎవరూ నమ్మరేమో..కియాన్ తన సంపాదనలో ఎక్కువ భాగం తన భార్య కోసమే ఖర్చు చేశాడు. కారణాలు తెలియదు కానీ, పాపం కియాన్ భారీ జీతమొచ్చే ఉద్యోగాన్ని ఐదేళ్ల క్రితం పోగొట్టుకున్నాడు.అప్పటి నుండి డెలివరీ రైడర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడతడి జీతం నెలకు 10,000 యువాన్లు అంటే రూ.1.24 లక్షలే.తన భార్య చాలా సౌందర్యవతి అని చెప్పుకొచ్చిన కియాన్.. తన జీతం తగ్గిపోగానే ఆమె విడాకులు కోరిందని ఘొల్లుమన్నాడు. ‘నేను ప్రేమిస్తున్నది నీ డబ్బునే కానీ, నిన్ను కాదు’ అని ఆమె తెగేసి చెప్పిందని వాపోయాడు.ఇంతా చేస్తున్న ఆమె ఏదైనా పనిచేస్తుందా అంటే అదీ లేదు. కియాన్ కియాన్ సంపాందించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ వచ్చేది.వామ్మో ఇవేమీ ఖర్చులుఆమె పెట్టే ఖర్చుల గురించి వింటే అవాక్కవాల్సిందే. ఆమె దుస్తులు కొన్నప్పుడల్లా ఒక్కోటి మూడు రంగులలో కొనేదట. ఒకసారి ఆమె ఒక్కొక్కటి 15,000 యువాన్లు (రూ.1.87 లక్షలు) పెట్టి రెండు డిజైనర్ బ్యాగులను కొనిందని వాపోయాడు కియాన్.మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. కియాన్ భార్య చేతులు, కాళ్ళకు కూడా ఖరీదైన ఫేషియల్ క్రీములను వాడేదట. ఇక సన్నగా ఉండటానికి ఖరీదైన సప్లిమెంట్లను తీసుకునే ఆమె చాలాసార్లు కాస్మొటిక్ చికిత్సలూ చేయించుకుందట. ఇంత చేసినా ఇప్పటికీ తన మాజీ భార్య అంటే తనకు ద్వేషం లేదంటున్నాడు అమాయక కియాన్కియాన్. -
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
-
నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుందిప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు. -
ప్రియుడి కోసం... భర్త ఖతం
మీరట్: ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది. ఒక ప్లాన్ ప్రకారం భర్త అడ్డు తొలగించుకుంది. అయితే ఆ తర్వాత చట్టం ఏం చేసింది?ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఒక యువకుని మృతదేహం అతను ఉంటున్న గ్రామం వెలుపలి పొలంలో పోలీసులకు కనిపించింది. మృతదేహంపై మూడు బుల్లెట్ల గుర్తులు కనిపించాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత దీనిని దోపిడీ కోసం చేసిన హత్యగా భావించారు. అయితే తదుపరి దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పోలీసులు అగ్వాన్పూర్ గ్రామంలో ఉంటున్న మృతుడి భార్య అంజలి విచారించేందుకు ఉపక్రమించగా, ఆమె ఇంటి నుంచి పరారైనట్లు తేలింది. అయితే అంజలికి అదే గ్రామానికి చెందిన అజయ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు కనుగొన్నారు.దీంతో పోలీసులు అజయ్ను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే అతను కూడా ఇంట్లో లేడని తెలిసింది. ఈ జంట అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరువాత పోలీసులు వారికోసం వెదుకులాట సాగించి, ఎట్టకేలకు అదుపులోనికి తీసుకున్నారు. విచారణ సమయంలో అజయ్ నిజం వెల్లడించాడు. అంజలి భర్త రాహుల్ తమ సంబంధం గురించి తెలుసుకున్నాడని, దీంతో అంజలి కలత చెందిందని, తరువాత ఆమె భర్తను చంపేందుకు ఒక ప్లాన్ చేసిందని అతను చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అజయ్ స్వయంగా రాహుల్ను పొలాల దగ్గర కలుసుకుందామని చెప్పాడు. అతను రాగానే అతనిపై రాహుల్ మూడుసార్లు తుపాకీ కాల్పులు జరిపాడని దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ట్రంప్కు ‘శాంతి బహుమతి’?.. డిసెంబర్ ఐదున ప్రదానం -
బాడీషేమింగ్ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!
మామూలుగానైతే భార్య మొబైల్ నంబరును సేవ్ చేసుకోడానికి ‘జానూ’, ‘సోనా’ అనో లేదా ‘బంగారం’ అనో... ఇలా రకరకాల ముద్దు పేర్లు పెట్టుకుంటుంటారు. మరికొందరు శిరీషకు ‘సిరి’ అనీ, దీపికకు ‘దీపూ’ అంటూ షార్ట్కట్లో షార్ట్ పేర్లూ పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. కాపురంలో కొద్దికాలం గడిచాక ఆమెలో నచ్చని అంశాలేవైనా కనిపించినా సదరు ముద్దుపేర్లకు బదులుగా తన కోపాన్నీ, కసినీ సైలెంటుగా వెల్లడించుకునేలా ‘దెయ్యం’ అనో, ‘రాక్షసి’ అంటూ వయొలెంటు పేర్లు పెట్టుకోవాలనుకున్నా అలా చేయకపోవడమే మంచిదంటూ టర్కీలో జరిగిన ఓ ఉదంతం తెలుపుతోంది. టర్కీలో ఓ ప్రబుద్ధుడికి భార్య మీద కోపం వచ్చింది. ఆమె కాస్తంత లావుగా ఉండటంతో ఆమె పేరును ‘టాంబిక్’ అంటూ సేవ్ చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అంతే... ఆ అంశం మీద అతడికి జరిమానా విధిస్తూ... అతడి వల్ల తన భార్యకు కలిగిన మనోవేదనకు గాను పరిహారం, విడాకులూ మంజూరయ్యాయి. ఇంతకీ ‘టాంబిక్’ అంటే టర్కీలో స్థూలకాయాన్ని (ఛబ్బీ) తెలిపే పదం. ఇది కేవలం స్థూలకాయాన్ని సూచించే పదం మాత్రమే కాదు... ఏ ‘బండ’దనో, ‘మొద్దు’దనో, ‘లడ్డు’దనో... ఇలా కాస్తంత దురర్థమో, నిందార్థమో ఇచ్చేలాంటి వాడుక మాట కావడంతో... అలా సేవ్ చేసుకున్న ఆ భర్తకు కోర్టులో మొట్టికాయలు తప్పలేదు. పైగా ఓ అమ్మాయి స్థూలకాయాన్ని ఎగతాళి చేసేలా ఆమె పేరును అభ్యంతరకరమైన పదాలతో సేవ్ చేసుకున్నందుకు ఆ భర్తకు భారీ జరిమానా విధించింది అక్కడి కోర్టు. అంతేకాదు.. పరోక్ష దూషణే అయినా... ఫోన్లో అలాంటి అభ్యంతరకరమైన మాటతో భార్యపేరు సేవ్ చేసుకున్నందున ఆమెకు కలిగిన మనోవేదనను పరిగణనలోకి తీసుకుని వెంటనే విడాకులు సైతం మంజూరు చేసింది టర్కీ కోర్టు. (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!) -
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చారిత్రాత్మక విజయం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆది నుంచి చురుకైన ఉపన్యాసాలు, పదునైన విమర్శలతో దూసుకుపోయిన మామ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టించాడు. అయితే ఆయన ఈ విజయం వెనుక ప్రముఖంగా నిలిచింది ఎవరో తెలుసా?జోహ్రాన్ మమ్దానీ భార్య కళాకారిణి, యానిమేటర్, రైటర్ రమా దువాజీ (Rama Duwaji). భర్త విజయంలో తన వంతు ప్రచారంలో కీలక భూమిక నిర్వహించారు. ప్రచార లోగోలు, ప్రచారం మొత్తాన్ని ఆకర్షణీయంగా రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. లోగోలో బోల్డ్ ఎల్లో, నారింజ, నీలం రంగుల్లో బ్రాండింగ్ అనేది ఆయన ఉద్యమానికి పర్యాయపదంగా మారిందని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: మేయర్గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందనతాను ఎక్కువగా వెలుగులోకి రాకుండానే రమా దువాజీ నిశ్శబ్దంగా తెర వెనుక ఉంటూనే భర్త విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. డెమొక్రాటిక్ సోషలిస్ట్ విలక్షణమైన ప్రచార గుర్తింపు, సోషల్ మీడియా ఉనికిని రూపొందించడంలో తన ఘనతను చాటుకున్నారు. ఎన్నికల రోజు వరకు జరిగే చర్చలు, ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండేవారు.. అలాగే మేయర్ రేసు గురించి ఆన్లైన్లో అరుదుగా పోస్ట్ చేసేవారు. అయితే మమ్దానీ ఆశ్చర్యకరమైన ప్రాథమిక విజయం తర్వాత జూన్లో ఆమె ఎన్నికలకు సంబంధించిన ఏకైక సోషల్ మీడియా పోస్ట్ విశేషంగా నిలిచింది. “ఇంతకంటే గర్వం కారణం ఏముంటుంది.” ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. చదవండి: పనస కాయ చిప్స్తో ఏడాదికి రూ. 12 లక్షలుతాజాగా మంగళవారం నాటి ఓటింగ్ సమయంలో మమ్దానీ తన ఓటు వేసే క్రమంలో భర్తకు అండగా నిలిచారు. ది డైలీ షోలో కనిపించినప్పుడు భర్త పక్కనే కొండంత అండగా ఉండటంతోపాటు, క్వీన్స్లోని ఫారెస్ట్ హిల్స్ స్టేడియంలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, సెనేటర్ బెర్నీ సాండర్స్తో కలిసి మమ్దానీ తన చివరి ర్యాలీ ప్రసంగం సమయంలో కూడా 10వేల మంది మద్దతుదారులతో పాటు ఆమె కూడా కనిపించింది. దువాజీ న్యూయార్క్ కు చెందిన సిరియన్-అమెరికన్ ఆర్టిస్ట్ దువాజీ. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్కు వెళ్లినా ఆమె డల్లాస్లో పెరిగారు. దుబాయ్లో చదివారు. ఆమె అనేక జర్నల్స్ను కూడా ప్రచురించారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి మమ్దానీ ఎన్నికైనపుడు 2021లో దువాజీ, మమ్దానీ డేటింగ్ యాప్ హింజ్లో కలుసుకున్నారు. వారి మొదటి డేట్ బ్రూక్లిన్లోని యెమెన్ కేఫ్ అయిన క్వాహ్వా హౌస్లో జరిగింది. మమ్దానీ తన మేయర్ ప్రచారాన్ని ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2024లో వారు నిశ్చితార్థం చేసుకున్నారు. గత డిసెంబర్లో దుబాయ్లో వేడుకలు జరుపుకున్న తర్వాత, ఫిబ్రవరిలో లోయర్ మాన్హట్టన్లోని ఒక సాధారణ కోర్టు హౌస్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. దువాజీ సోషల్ మీడియా ఫీడ్ అంతా సిరామిక్, ఇలస్ట్రేషన్ వర్క్స్తో నిండి ఉంటాయి. పాలస్తీనాతో సంఘీభావాన్ని వ్యక్త పరిచే అనేక రచనలు కూడా చూడొచ్చు. ఆమెకు పెరుగుతున్న ప్రజా ఆకర్షణ, ఆదరణపై స్పందించిన స్నేహితులు మెడ్రన్ డే ప్రిన్సెస్ డయానా అంటూ ముద్దుగా పిలుచుకోవడం విశేషం. -
బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్
కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చిన బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి కేసులో మరో కీలక సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. చర్మవ్యాధి నిపుణురాలైన భార్య డాక్టర్ కృతిక రెడ్డిని మత్తుమందిచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నమహేంద్ర రెడ్డి నేరం చేసిన కొద్దిసేపటికే "నీకోసమే నా భార్యను చంపేశాను" అనే సందేశాన్ని ప్రియురాలికి పంపించిన వైనం కలకలం రేపుతోంది.దర్యాప్తు అధికారుల ప్రకారం, డిజిటల్ చెల్లింపు యాప్లో పనిచేసే మహిళతో రిలేషన్షిప్లో ఉన్నాడు మహేంద్ర రెడ్డి. భార్య చనిపోయిన వెంటనే ఆమెకు వాట్సాప్ ద్వారా నీకోసమే భార్యను చంపేశాననే మెసేజ్ను పంపించాడు. నిందితుడు ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ సమయంలో పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆ మహిళను విచారించి ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ ఎవరు? ఏంటి? అనే విషయాలను ఇంకా వెల్లడించలేదు.కాగా బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో జనరల్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ మహేంద్ర రెడ్డి, డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతిక రెడ్డికి గత ఏడాది మే 26న వివాహం జరిగింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 21న మున్నెకొల్లాల్లోని వారి నివాసంలో కృతిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై మరాఠహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతని ఇంట్లో సోదాలు చేసినపుడు కాన్యులా సెట్, ఇంజెక్షన్ ట్యూబ్ ,ఇతర వైద్య వస్తువులతో సహా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి అంతర్గత అవయవాల నమూనాలను కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ నివేదిక అసలు నిజాన్ని బయటపెట్టడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కృతిక శరీరంలో 'ప్రోపోఫాల్' అనే శక్తిమంతమైన అనస్థీషియా ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఇది హత్యేనని నిర్ధారణ కావడంతో మృతురాలి తండ్రి అక్టోబర్ 13న తన అల్లుడే మత్తుమందు ఇచ్చి కూతురిని హత్య చేశాడని ఫిర్యాదు నమోదు చేశారు. తన భార్య మరణాన్ని సహజంగా చూపించడానికి అతను తన వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 14న కర్ణాటకలోని మణిపాల్లో ఉన్న నిందితుడు మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. -
మా నాన్న ఎలా చంపాడంటే..
-
భర్త ఎంపీడీవో.. భార్య మాత్రం ఇలా.. బస్టాండ్లో ఏం జరిగిందంటే?
సాక్షి, విజయవాడ: తన భర్త ప్రభుత్వ ఉద్యోగి.. భార్య మాత్రం తన స్థాయిని మర్చిపోయింది. చిల్లర పనులకు దిగజారింది. బస్టాండ్లో తోటి ప్రయాణికురాలి వద్ద ఎంపీడీవో భార్య.. పర్సును దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్లో ఈ ఘటన జరిగింది. బస్సు ఎక్కే క్రమంలో ఒక నర్సు నుంచి పర్సు దొంగతనం చేసింది. ఈ విషయం తెలిసినా కూడా దొంగతనాన్ని దాచిపెట్టి భార్యను ఎంపీడీవో ప్రోత్సహించారు.బాధిత నర్సు ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్లను కృష్ణలంక పోలీసులు పరిశీలించారు. నర్సు చేతిలో ఉన్న బ్యాగ్ను ఎంపీడీవో భార్య అదే పనిగా చూస్తుండటం.. బస్సు ఎక్కే సమయంలో నర్సు వెనుకే ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూనిఫాం ఆధారంగా కుమార్తె చదివే కళాశాలకు వెళ్లి విచారణ చేసిన పోలీసులు.. గుంటూరులో ఎంపీడీవోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నారు. -
నీకు భార్య, పిల్లలు ఉన్నారు కదా.. జోగి రమేష్ అరెస్ట్ పై భార్య ఎమోషనల్..
-
మా ఆయన ప్రతీ అమ్మాయిని అదోలా చూస్తాడు? ఎందుకలా..?
నాకు పెళ్లి అయి 12 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త మంచివాడే, ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తనలో ఉన్న ఒక చిత్రమైన అలవాటు నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. అదేమంటే అతను రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని అదోలా చూస్తుంటాడు. వారికి ఏదో ఒక పేరు పెడతాడు. తర్వాత నాతో వారి శరీర సౌష్టవం గురించి కామెంట్స్ చేస్తాడు. మా ఏకాంత సమయంలో ఆ పేర్లు కలవరిస్తూ ఉంటాడు. మొదట్లో అంతగా అనిపించలేదు కానీ పోను పోనూ ఆయన ప్రవర్తన నాకు కంపరంగా తయారైంది. దాంతో అతని మీద ఒకవిధమైన విముఖత ఏర్పడింది. ఒక్కోసారి అతన్ని వదిలేసి వెళ్ళి పోవాలనిపిస్తుంది కూడా! గట్టిగా అడిగితే అలా ఊహించుకోకుండా ఉండలేక పోతున్నానంటారు. ఇదేమైనా మానసిక సమస్య అంటారా! ‘మా సమస్యకేదైనా పరిష్కారముందా? – ఒక సోదరి, నంద్యాలమీ ఉత్తరం చదివి మీరు పడే క్షోభను అర్థం చేసుకోగలను. ఊహ అనేది మనిషికి మాత్రమే ఉన్న ఒక అద్భుత శక్తి. ఒక విజయం సాధిస్తానని ఊహించడం మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అలాగే భార్యా భర్తల బంధం కొంచెం రొటీన్గా మారినప్పుడు ఇలా ‘ఫాంటసైజ్’ చేయడం కొందరికి కొత్త ఉత్సాహన్ని ఇస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఊహించుకోవడం మామూలే! ఇది పురుషుల్లో అధికంగా చూసినప్పటికీ, స్త్రీలు కూడా ఇలా ‘ఫాంటసైజ్’ చేసుకుంటారని పరిశోధనల్లో తేలిన విషయం. అమెరికాలో 90వ దశకంలో జరిపిన ఒక పరిశోధన ప్రకారం కొందరు స్త్రీ, పురుషులు తమ భాగస్వామితో ఉన్నప్పుడు, వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. మనదేశంలో జరిపిన పరిశోధన లో కూడా కనీసం 35 శాతం మంది ఇలా వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. పురుషులు ఎక్కువగా తెలియని వారిని, సెలబ్రిటీలను ఊహించుకుంటే, స్త్రీలు తమకు తెలిసిన వారినే ఎక్కువ ఊహించుకుంటారని తెలిసింది. దీనికి ప్రధానమైన కారణం మెదడులో, ‘డోపమిన్’ అనే రసాయనం చాలా తొందరగా తగ్గిపోడం, అలాంటప్పుడు ఇతర స్త్రీల మీద పురుషులు మోహం పెంచుకుంటారు. లేదా వాళ్ళని ఫాంటసైజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ‘సెవెన్ ఇయర్ ఇచ్’ అని కూడా అంటారు. మామూలుగా చాలామంది మగవారు వారి భాగస్వామికి తెలియకుండా ఇలా చేస్తారు. కొంతకాలానికి అదే సర్దుకుంటుంది. అయితే మీవారి విషయంలో ఈ ప్రవర్తన హద్దులు మీరిందంటే అది ఒక మానసిక సమస్యను సూచిస్తుంది. కాబట్టి తనకి పారాఫిలియా’ లేదా ‘కంపల్సివ్ సెక్యువల్ బిహేవియరల్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మీరు బాధపడతారని కొంచెం కూడా తను ఎంపతీ చూపలేకపోతున్నాడు. కాబట్టి, పర్సనాలిటీ సమస్యలు కూడా ఉండి ఉండచ్చు. ఏమైనా మీరు సహనాన్ని కోల్పోకండి. అలాగని ఇంకా ఆలస్యం చేయకండి. ఇద్దరూ కలిసి ఒక మంచి సైకియాట్రిస్టుని లేదా అనుభవం కలిగిన క్లినికల్ సైకాలజిస్టుని సంప్రదించండి. వారు మీ ఇద్దరితోనూ వివరంగా మాట్లాడి, కూలంకషంగా ఆయన్ని పరీక్షించి ఆయనకు ఉన్న సమస్య ఏమిటనేదానిపై ఒక నిర్థారణకు వస్తారు. అప్పుడు అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్, మందులు, ఇతరత్రా సలహాలు ఇస్తారు. తప్పకుండా ఆయనలో మంచి మార్పు వస్తుంది. విష్ యు ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్లీ ఫొటోలు
-
నితిన్ భార్య షాలినీ దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అత్యంత అరుదైన కేసు.. 23 ఏళ్ల తర్వాత ఆమెకు పరిహారం
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక చొరవ తీసుకుని.. బాధితురాలిని వెతికించి మరీ పరిహారం ఇప్పించిన ఘటన ఇది. రైలు ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు 23 ఏళ్ల తర్వాత పరిహారం అందింది. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. .. విజయ్ సింగ్ అనే వ్యక్తి 2002 మార్చి 21న భాగల్పూర్–దానాపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ కంపార్టుమెంట్ నుంచి హఠాత్తుగా జారిపడ్డారు. తీవ్రంగా గాయపడి మృతిచెందారు. పరిహారం కోసం ఆయన భార్య సంయుక్త దేవి న్యాయ పోరాటం ప్రారంభించారు. ప్రమాదం వెనుక రైల్వేశాఖ నిర్లక్ష్యం లేదని, అతడికి మతిస్థిమితం లేదని, ఎవరో అతడిని నెట్టివేయడం వల్లే రైలు నుంచి కిందపడ్డాడని, పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు తేల్చిచెప్పాయి. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఆదేశాలను 2023లో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ కొనసాగించింది. విజయ్ సింగ్కు మతిస్థిమితం లేకపోతే రైలు టికెట్ ఎలా కొనుగోలు చేశాడని, రైలు ఎలా ఎక్కాడని? ప్రశ్నించింది. అసంబద్ధమై కారణాలతో పరిహారాన్ని తిరస్కరించడం సరైంది కాదని తేల్చిచెప్పింది. బాధితురాలు సంయుక్త దేవికి రూ.4 లక్షల పరిహారాన్ని ఏటా 6 శాతం వడ్డీతో కలిపి రెండు నెలల్లోగా చెల్లించాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ పరిహారం అందజేయడానికి సంయుక్తి దేవి చిరునామా అందుబాటులో లేకుండాపోయింది. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియరాలేదు. జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దాంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. సంయుక్తి దేవి కోసం పబ్లిక్ నోటీసు జారీ చేయాలని, మీడియాలో ప్రకటన ఇవ్వాలని రైల్వే శాఖకు సూచించింది. ఈ ప్రయత్నం ఫలించింది. సంయుక్త దేవి ఆచూకీ లభించింది. పరిహారాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘జూదం’ కేసు విచారణకు సహకరించండిదేశవ్యాప్తంగా ఆన్లైన్ జూదాన్ని, బెట్టింగ్ వేదికలను నిషేధించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అకౌంటబిలిటీ అండ్ సిస్టమిక్ ఛేంజ్(సీఎఎస్సీ) అనే సంస్థ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సోషల్ గేమ్స్, ఈ–స్పోర్ట్స్ ముసుగులో ఆన్లైన్ జూదం కొనసాగుతోందని పిటిషనర్ తరఫు లాయర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. పిటిషన్కు సంబంధించి కాపీని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వి.సి.భారతికి అందజేయాలని పిటిషనర్కు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో తమకు సహకరించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టంచేసింది. ఇదీ చదవండి: సీన్లోకి సిద్ధూ తనయుడు! డీకే ఏమన్నారంటే.. -
పిల్లలతో తారకరత్న సతీమణి అలేఖ్య దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వేరుపడిన భార్య వస్తువుల్ని 24 గంటల్లోగా అప్పగించాలి
న్యూడిల్లీ: వేరుగా ఉంటున్న భార్యను ఆమె దుస్తులు, ఇతర వస్తువుల్ని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్న ఓ భర్తపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమని పేర్కొంది. ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులను 24 గంటల్లోగా అప్పగించాలని అతడిని ఆదేశించింది. దీపావళి పండుగ జరుపుకునేందుకు తన కుమారుడిని తనతో ఇంటికి పంపించేలా భార్యను ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఆమె కుమారుడిని భర్తతో పంపేందుకు నిరాకరించింది.2022 నుంచి అత్తింట్లో ఉన్న తన వస్తువులను అతడు తీసుకెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది. స్పందించిన ధర్మాసనం ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించింది. ‘వివాహాలు కొన్ని విఫలమవుతుంటాయి. కానీ, భార్య తన దుస్తులు తీసుకోవడానికి కూడా భర్త అనుమతించనంత స్థాయికి దిగజారకూడదు. కలిసి ఉండలేని పరిస్థితి వేరు. ఆమె వస్తువులను 24 గంటల్లో తిరిగి అప్పగించాలని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా, తల్లి, తండ్రి కలిసి తమ కుమారుడిని దగ్గర్లోని గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలని, కావాలనుకుంటే అమ్మమ్మ, తాతయ్యలు కూడా వారితో వెళ్లవచ్చని ధర్మాసనం పేర్కొంది. -
పక్కా ప్లాన్ తోనే నా భర్తను చంపారు
-
Bihar Election: ఎన్నికల బరిలో ప్రముఖ గాయకుని భార్య?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ నేతలతో పాటు పలువురు గాయనీగాయకులు, నటులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా భోజ్పురి గాయకుడు, నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఈ ఎన్నికల్లో తన పాత్రపై ఏమిటనేది వెల్లడించారు. తాను ఆర్జేడీ తరపున ప్రచారం చేయనున్నానని, తన భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నానని తెలిపారు. #WATCH | Patna: On the Bihar Assembly elections, Bhojpuri singer and actor Khesari Lal Yadav says, "I want my wife to contest the election, I have been trying to convince her for the last 4 days. If she agrees, we will file the nomination; otherwise, I will only campaign and try… pic.twitter.com/EjzOgdduS3— ANI (@ANI) October 15, 2025భోజ్పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన భార్య చేత పోటీ చేయించాలని అనుకుంటున్నానని, ఇందుకోసం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఒకవేళ ఆమె ఇందుకు అంగీకరిస్తే, తమ నామినేషన్ దాఖలు చేస్తామని, లేనిపక్షంలో తాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటు తేజస్వి యాదవ్, అటు అఖిలేష్ యాదవ్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పోటీ చేసే విషయంలో రెండు పార్టీల నుండి తనపై ఒత్తిడి ఉన్నదని ఖేసరి లాల్ యాదవ్ పేర్కొన్నారు. తన భార్య అంగీకరిస్తే, ఆమె చేత ఖచ్చితంగా పోటీ చేయిస్తానని తెలిపారు. -
భారీ ఎత్తున భరణం గుంజి, అతడితో పెళ్లి.. నా మాజీ భార్య భర్తపై కేసు వేయొచ్చా?
నా భార్య మరొకరితో సంబంధం పెట్టుకొని నా నుంచి విడాకులు తీసుకుంది. విడాకుల కేసులో నేను తనకు ఫలానా వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అని పేరుతో సహా చెప్పినప్పటికీ, తనకు అలాంటివేమీ లేవని కోర్టును నమ్మించింది. దాంతో నేను పదిలక్షల రూపాయలు భరణంగా చెల్లించవలసి వచ్చింది. మా విడాకులు అయిన 7 నెలలకే తను అదే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తను నా భార్యగా ఉన్నప్పుడు వారు కలిసి తీసుకున్న ఫోటోలు కొన్ని పెళ్లి వీడియోలో పెట్టి ఇంటర్నెట్లో కూడా పెట్టుకున్నారు. నన్ను మానసిక క్షోభకి గురి చేసినందుకు నేను నా మాజీ భార్య ప్రస్తుత భర్తపై కేసు వేయవచ్చా? ఎందుకంటే, ఇటీవలే పేపర్లో తైవాన్లో భార్య ప్రియుడిపై భర్త కోర్టులో దావా వేయగా కోర్టు అతనికి పరిహారం కూడా చెల్లించమని చెప్పిందని ఒక వార్త చదివాను. మనదేశంలో కూడా అలా చేసే వీలుందా? – సంపత్, హైదరాబాద్ రెండు వారాల క్రితం ఇలాంటి ఒక కేసు గురించి మన పత్రికలో కూడా సమాధాన రూపంగా చె΄్పాను. వివాహేతర సంబంధాలు చట్టరీత్యా నేరాలుగా పరిగణించక పోయినప్పటికీ, సివిల్ దావాలు/పరిహారాలు కోరడానికి భారతీయ చట్టాలలో ఎటువంటి అడ్డంకీ లేదు. మారుతున్న సామాజిక పరిణామాల దృష్ట్యా, వివాహేతర సంబంధాలు ఇకపై సివిల్ కోర్టుకు చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మీ మాజీ భార్య ప్రియుడి మీద (ప్రస్తుతం ఆమె భర్త) ఖచ్చితంగా కేసు వేయవచ్చు. పరిహారం కూడా కోరవచ్చు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో ఒక భార్య తన భర్త ప్రియురాలిపై వేసిన దావా చెల్లుతుంది అని పేర్కొంది. అయితే మీరు కేసు వేసిన తర్వాత, మీ మాజీ భార్యకి, తన భర్తకి సంబంధం ఉండేదనే విషయాన్ని ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో రుజువు చేయవలసి ఉంటుంది. కోర్టును ఎవరు ఆశ్రయిస్తే వారే తమ పక్షం వాదనని వాస్తవాలేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది! కేవలం గతంలో వారిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని ఫొటోల ఆధారంగా మాత్రమే మీరు కేసు గెలవడం కొంత కష్టమే! అయితే, అసలు మీ మాజీ భార్యకు అతనితో పెళ్లికి ముందు పరిచయమే లేదు అతను ఎవరో నాకు తెలియదు’’ వంటి సమాధానాలు చెప్పి ఉన్నట్లయితే, మీ డైవర్స్ కేసులో జరిగిన వాదోపవాదాలను ఆధారంగా తీసుకొని మీ తరఫు సాక్ష్యాలుగా కూడా కోర్టు ముందు ఉంచవచ్చు. చదవండి: ఆ టైంలో హెల్ప్ అడగడం తప్పుకాదు, మీకోసం మీరు ఏడ్వండి : సారాఇవన్నీ ఒకవేళ రుజువు అయినట్లయితే మీకు మానసిక క్షోభ కలిగించినందుకు గాను, ఆర్థికంగా కూడా మీరు నష్టపోయినందుకు గాను, మీరు తగిన పరిహారం పొందే అవకాశం లేకపోలేదు. మీరు కేసు వేయాలి, తగిన సాక్ష్యాధారాలతో రుజువు చేయగలను అనుకుంటే, మీ మాజీ భార్యని కూడా కేసులో పార్టీ చేయండి. ఇంతవరకు ఇలాంటి కేసులు లేకపోయినప్పటికీ, ఇటీవలే మన భారతీయ కోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా మీ కేసు విచారణకు మాత్రం అర్హత సాధించింది. కేసు గెలవడం ఓడిపోవడం తర్వాత సంగతి. అన్ని సాక్ష్యాధారాలు, ముఖ్యంగా మీ డైవర్స్ కేసులో మీ మాజీ భార్య ఇచ్చిన వాంగ్మూలాలు/ క్రాస్ ఎగ్జామినేషన్లో తను చెప్పిన సమాధానాలు వంటివి నిక్షిప్తపరిచి ఒక లాయర్ను సంప్రదిస్తే మీకు ఉపశమనం లభించవచ్చు. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించి..
కొరాపుట్(ఒడిషా): భార్యను చంపేసి.. ప్రమాదంగా చిత్రించాడో ప్రబుద్ధుడు. ఆయన పోలీసు కావడం విశేషం. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఎంపీ కాలనీలో ఐఆర్బీ జవాన్ శివ శంకర్ పాత్రో నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి అతని భార్య ప్రియాంక పండా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. అందరూ ఇది ప్రమాదమే అని అనుకున్నారు. కానీ ప్రియాంక తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కొరాపుట్లో సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కేసు మలుపు తిరిగింది. వారు తమ కుమార్తె మృతదేహం చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధికి చెందిన తరణి పండా తన కుమార్తె ప్రియాంకని నబరంగ్పూర్ జిల్లా డాబుగాంకి చెందిన ఐఆర్బీ కానిస్టేబుల్ శివ శంకర్ పాత్రోకి ఇచ్చి గత ఏడాది జులై 11న టెక్కలిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో 12 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు వరకట్నంగా ఇచ్చారు. నూతన దంపతులు కొరాపుట్ ఓఎంపీ కాలనీ నివాసం ఉండడంతో వారికి అవసరమైన సారె కింద ఇంటి సామగ్రి ఇచ్చారు. కానీ పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం ప్రియాంకపై భర్త భౌతిక దాడులు చేసేవాడు. ఇది తెలిసి కన్నవారు తమ శక్తి మేరకు అదనపు కట్నం పంపుతుండేవారు. భర్త వేధింపులతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి సెప్టెంబర్ 4న తిరిగి కొరాపుట్ వచ్చింది. కానీ వేధింపులు ఆగలేదు. పుట్టింట తండ్రి ఆరోగ్య రీత్యా గత కొద్ది రోజులుగా వేధింపులు కన్నవారికి చెప్పలేదు. బుధవారం రాత్రి 8 గంటలకు వీడియో కాల్ ద్వారా ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడింది. 9 గంటలకు శివ శంకర్ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే రమ్మని టెక్కలికి ఫోన్ చేశాడు. వెంటనే వీరందరూ కొరాపుట్ చేరుకొని అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతురాలి తలపై ఇనుప రాడ్డుతో మోది చంపినట్లు తెలిసింది. దీంతో వెంటనే శివ శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక చనిపోయాక శివశంకర్ తన తల్లిని, ఏడు నెలల కుమార్తెను ఇంటి బయట కూర్చోబెట్టాడు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి ఇంటికి నిప్పంటించాడు. మొదటి అంతా ఇది అగ్ని ప్రమాదమే అనుకున్నారు. కానీ మృతురాలి తల్లిదండ్రులు రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో శివ శంకర్ తన నేరం అంగీకరించారు. -
భర్త మానసిక క్షోభకు రూ. 37 లక్షలు : ప్రియుడికి భారీ షాకిచ్చిన కోర్టు
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, విడాకులు, భరణానికి సంబంధించిన వార్తలు చాలానే వింటున్నాం. సాధారణంగా భార్యకు భర్త భరణం ఇవ్వడం కామన్. కానీ ఒక కేసులో భర్తకు రూ. 37 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు భార్య ప్రియుడిని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.తైవాన్కు చెందిన వీ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి తన భార్య జీ (మారుపేరు) ప్రేమికుడి (యోంగ్)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా, వారిపై చట్టపరమైన చర్య తీసుకున్నాడు. తాను అనుభవించిన మానసిక క్షోభ వైవాహిక హక్కుల ఉల్లంఘనకు పరిహారంగా దాదాపు కోటి రూపాయలను డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.విచారణ సమయంలో వీ మానసిక క్షోభకు గురైనట్లు కనిపించాడని కోర్టు గుర్తించింది. అలాగే వీ కంటే ప్రియుడు యోంగ్ సంపాదన ఎక్కువ అని కూడా గమనించింది. అందుకే మోసపోయిన భర్తకు పరిహారంగా భర్తకు 300,000 యువాన్లు (సుమారు రూ. 37 లక్షలు) చెల్లించాలని తీర్పు చెప్పింది.2000లొ వీ- జీకి పెళ్లైంది. దాదాపు 15 సంవత్సరా సంసారిక జీవితం తరువాత 2022 నుంచి జీ తన కొలిగ్ యోంగ్తో సంబంధం పెట్టుకుంది. జీ,యోంగ్ ఒకేచోట పనిచేస్తారు. యోంగ్ అకౌంటింగ్ డైరెక్టర్గా ఉండగా, జీ ఒక ఉపాధ్యాయురాలిగా ఉంది. అయితే ఏడాది తరువాత 2023 నవంబరులో తన భార్య జీ యోంగ్తో రిలేషన్లో వున్నట్టు ఫోన్ ద్వారా గుర్తించాడు. వారిద్దరి మధ్య మెసేజ్లు కంటపడ్డాయి. ఇద్దరూ తరచుగా హోటళ్లలో కలుసుకోవడం, అక్రమంగా శారీరక సంబంధంలో ఉన్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు "భార్యభర్త" లుగానే వ్యవహరిస్తున్నారని కూడా గమనించి షాక్ అయ్యాడు. దీనితో తన ఎమోషన్స్ని హర్ట్ చేశారంటూ యోంగ్ పై దావా వేశాడు. అయితే జీకి పెళ్లి అయిందన్న విషయం తనకు తెలియదంటే బుకాయించాడు యోంగ్. కానీ వీ వాదనలను విశ్వసించిన కోర్టు ప్రియుడికి భారీ షాకే ఇచ్చింది. అయితే అతను డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు కాకుండా, రూ. 37 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. మరోవైపు ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం యోంగ్కి ఇచ్చింది కోర్టు -
అత్తపై మోజుతో..
వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒక ఘటన ద్వారా చూస్తున్నదే. అయితే ప్రేమ పేరిట, శారీరక సుఖం కోసం అనైతిక సంబంధంలోనూ మునిగిపోతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇక్కడ.. మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది.ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. తన అత్తతో అనైతిక సంబంధం(Illicit Relationship) పెట్టుకున్న ఆమె భర్తే హంతకుడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు.. ఆ అత్తాఅల్లుళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) కాస్గాని జిల్లా సిధ్పుర గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో చనిపోయిందంటూ పోలీసులకు కబురు వెళ్లింది. మృతురాలిని శివాని(20)గా గుర్తించిన పోలీసులు.. హత్య జరిగి రెండు అప్పటికే రెండు రోజులు అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె తరఫు బంధువులను విచారించగా.. భర్త ప్రమోదే ఆమెను హత్య చేసి పారిపోయాడని వాళ్లు పోలీసుల వద్ద వాపోయారు.2018లో శివాని, ప్రమోద్ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాబు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.ఈ క్రమంలో.. అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ శివానిని హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఈలోపు.. ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. అత్తపై మోజుతో భార్యను కడతేరచిన భర్త ఉదంతంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిందక్కడ.ఇదీ చదవండి: పరుపు కింద భార్య శవాన్ని కుక్కి.. -
భార్య శవాన్ని పరుపు కింద దాచి, ఆపై..
ఆ జంటకు పెళ్లై.. నాలుగు నెలలే అయ్యింది. బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె మృతదేహంగా మంచం కింద కనిపించింది. భర్త జాడ లేకుండా పోయాడు. అతని తల్లే ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు(Belagavi Husband Kills Wife). ఈ జంటకు ఈ ఏడాది మే నెలలోనే వివాహం జరిగింది.పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లికి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూడగా.. పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఆకాశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని సాక్షి కుటుంబం ఆరోపిస్తోంది(Dowry Harassment). అయితే ఆకాశ్ తల్లి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో ఓ గర్భవతిని ఆమె భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం చితక్కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) ప్రకారం.. వరకట్న వేధింపుల ఘటనలు, ఆ వేధింపుల కారణంగా మరణిస్తున్న కేసులూ దేశంలో అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ జాబితాలో యూపీ, బీహార్ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఇదీ చదవండి: సీనియర్లు వేధించారనే ఐపీఎస్ సూసైడ్! -
పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్
మొన్న అసోం గాయకుడు జుబీన్ గార్డ్ అకాల మరణం వార్తను ఇంకా మర్చిపోకముందే పంజాబ్కు చెందిన మరో ప్రముఖ గాయకుడి మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా(Rajvir Jawanda) విషాద మరణం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో దిగ్భ్రాంతి రేపింది. ఈసెప్టెంబర్ 27న తీవ్రమైన ప్రమాదానికి గురైన గాయకుడు 11 రోజులు వెంటిలేటర్పై చికిత్స పొందాడు. చివరికి అవయవాలు ఫెయిల్ కావడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని అభిమానులు, స్నేహితులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.రాజ్వీర్ జవాండా ప్రమాదానికి కారణం ఏమిటి?తన కెంతో ఇష్టమైన 1300సీసీ బైక్పై విహార యాత్రకు వెళ్లిన రాజ్వార్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డొచ్చిన పశువులను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. రాజ్వీర్ 5-6గురు స్నేహితులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని స్నేహితులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయడపిన రాజ్వీర్ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. తీవ్ర గాయాలు, ప్రమాదంలో వెన్నెముక రెండచోట్ల విరిపోయిందనీ, ఇంకా పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. మెడ విరిగిపోయింది. దీంతో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లైఫ్ సపోర్ట్మీద ఉంచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్గాన్ పెయిల్యూర్, గుండెపోటు కారణంగా రాజ్వీర్ చివరకు అక్టోబర్ 8న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్తను ప్రముఖ పంజాబీ గాయని జస్బీర్ జస్సీ ధృవీకరించారు.2014లో తన సంగీత జీవితాన్ని ప్రారంభించి అనతిలోకాలంలో పాపులారీటీ సాధించాడు. అయితే రాజ్వీర్ జవాంద మొదట్లో పోలీసు అధికారి కావాలని భావించాడు. కానీ అనుకోకుండా సింగింగ్ కరియర్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు. కానీ దాన్ని పూర్తిగా అనుభవించకముందే .. చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోవడం విషాదం. అయితే అతని సక్సెస్ వెనుక అతని భార్య కృషి ఉన్నట్టు తెలుస్తోంది. (జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్)రాజ్వీర్ జవాండా భార్య హెచ్చరికరాజ్వీర్ జవాండా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన నేపథ్యంలో, అతని భార్య కూడా ఎవరికీ తెలియదు. కానీ భర్తను ఆమె ఎప్పుడూ తెరవెనుక ఉండి నడిపించేదని సన్నిహితులు చెబుతున్న మాట.. ప్రమాదం జరిగిన రోజు తమ ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది రాజ్వీర్ భార్య. రాబోయే కీడును ఊహించే ఆమె అలా హెచ్చరించిందట. భద్రత గురించి తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసిందట. కానీ రాజ్వీర్ పట్టించు కోలేదని రాజ్వీర్ సన్నిహితులు అంటున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు -
కామాఖ్య ఆలయాన్ని దర్శించిన మనోజ్ దంపతులు (ఫొటోలు)
-
హైదరాబాద్ బోరబండలో దారుణం
-
ఆస్తి కోసం భర్త హత్య
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య, ఆమె ప్రియుడు, స్నేహితుడ్ని మేడికొండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు.. గుంటూరు పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ చెన్నంశెట్టి గోవిందరాజుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన లక్ష్మీతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. భార్య, భర్త మధ్య గొడవలు చెలరేగడంతో.. ఆరేళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం లక్ష్మీకి సత్తెనపల్లికి చెందిన పేర్నేపాటి వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ నేపథ్యంలో గోవిందరాజు కుటుంబానికి సంబంధించిన రూ.1.5 కోట్ల ఆస్తి గురించి తెలుసుకున్న లక్ష్మి భర్తను హత్య చేసి.. ఎలాగైనా ఆస్తిలో వాటా దక్కించుకోవాలని భావించింది. ఇందుకు వెంకటేశ్వర్లుతో కలిసి కుట్ర పన్నింది. ఆ ప్రకారం.. వెంకటేశ్వర్లు, అతని స్నేహితుడు షేక్ ఖాసిం సైదా సెపె్టంబర్ 18న ఆటోలో గోవిందరాజు ఇంటికి వెళ్లారు. వెంకటేశ్వర్లు, గోవిందరాజుకు గతంలో పరిచయం ఉంది. దీంతో ముగ్గురూ కలసి ఆటోలో తిరుగుతూ మద్యం తాగారు. ఈ క్రమంలో సాతులూరు, పెదరెడ్డిపాలెం గ్రామాల మధ్య.. గోవిందరాజుతో వెంకటేశ్వర్లు గొడవ పడ్డాడు.పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోవిందరాజును.. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు తీసుకెళ్లి ఇనుప రాడ్డుతో మోది హత్య చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీకి తెలియజేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని 19వ తేదీన పెదపలకలూరు తేజ గార్డెన్స్ సమీపంలో పడేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐ నాగూర్మీరాసాహెబ్, సిబ్బంది దర్యాప్తు చేసి.. వెంకటేశ్వర్లు, అతని మిత్రుడు షేక్ ఖాసింసైదాను అరెస్టు చేశారు. -
నెలల కొడుకుతో రహస్య దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య
తిరువొత్తియూరు: కోయంబత్తూరు పీలమేడు సమీపంలోని వి.కె.రోడ్, చేరన్ నగర్, 4వ బస్టాప్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జయపాల్(47). ఇతని భార్య వాలెంటినా(40). వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలెంటినా తన కొడుకుతో కలిసి మధురైలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సంఘటన జరిగిన రాత్రి జయపాల్ తన భార్యకు సెల్ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అప్పుడు, అతను తన భార్యతో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా వీడియో కాల్లో భార్యతో మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న తన భార్య చుడీదార్ ప్యాంటు తీసుకుని ఫ్యాన్కు తగిలించి ఉరి వేసుకున్నాడు. వీడియో కాల్లో ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన అతని భార్య, వెంటనే కోయంబత్తూరులోని తమ ఇంటి సమీపంలో నివశిస్తున్న బంధువులకు ఫోన్ చేసి, తమ ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి జయపాల్ను రక్షించడానికి ప్రయత్నించారు. అతను ఉన్న గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఉరి వేసుకున్న అతన్ని కిందకు దించారు. ఆ తర్వాత అంబులెన్స్లో సింగనల్లూరు ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అతను ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మరణించినట్లు తెలిపారు. భర్త ఉరి వేసుకుని వేలాడుతుండడం చూసిన వాలెంటీనా వెంటనే కోయంబత్తూరుకు తిరిగి వచ్చింది. ఆమె కుమారుడితో కలసి మరణించిన జయపాల్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై వాలెంటినా కోయంబత్తూరు పీళమేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
50 కోట్ల బీమా కోసం భార్య, తల్లిదండ్రుల హత్య.. నాలుగో భార్య ఫిర్యాదుతో బీమా స్కామ్ వెల్లడి
మీరట్: ఉత్తరప్రదేశ్లో రూ. 50 కోట్ల బీమా కోసం ఒక వ్యక్తి తన మొదటి భార్య, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చాడు. అయితే అతని నాల్గవ భార్య ఈ మరణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు సాగించిన భారీ బీమా స్కామ్ వెలుగుచూసింది.ఒక పథకం ప్రకారం హత్యలుఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన విశాల్ సింఘాల్(37) తన మొదటి భార్య, తల్లిదండ్రులను హత్య చేసినందుకు హాపూర్లో అరెస్టు చేశారు. అతని నాల్గవ భార్య.. విశాల్ సింఘాల్ ఇంటిలో జరిగిన అనుమానాస్పద మరణాలపై పోలీసులను అప్రమత్తం చేశారు. సింఘాల్ తండ్రి ముఖేష్ పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి. వీటిపై కన్నేసిన విశాల్ ఒక పథకం ప్రకారం తండ్రిని హత్య చేసి, ఇప్పటికే రూ.1.5 కోట్ల క్లెయిమ్లను అందుకున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించిన దరిమిలా నివ్వెరపోయే పలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.నాల్గవ భార్యపై పాలసీ కోసం ఒత్తిడిపోలీసుల దర్యాప్తులో విశాల్ సింఘాల్.. తన రెండవ, మూడవ భార్యలు తనను విడిచిపెట్టివెళ్లిపోయారని తెలిపాడు. అయితే పోలీసులు ఈ మాటపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరట్లోని గంగానగర్కు చెందిన సింఘాల్, తన నాల్గవ భార్య శ్రేయను అధిక విలువ కలిగిన జీవిత బీమా పాలసీలపై సంతకం చేసేందుకు ఒప్పించాడు. అయితే సంభాల్లో దర్యాప్తు జరుగుతున్న బీమా స్కామ్ గురించి తెలుసుకున్న శ్రేయ అనుమానంతో.. తన భర్త బీమా పాలసీ కోసం తనపై చేస్తున్న ఒత్తిడి గురించి పోలీసులకు తెలిపారు. ‘విశాల్ పాలసీలపై సంతకం చేయమని తనను నిరంతరం ఒత్తిడి చేస్తూ వచ్చాడని, ఇదే సమయంలో అతని కుటుంబంలో గతంలో చోటుచేసుకున్న మరణాలపై తనకు అనుమానాలు వచ్చాయని శ్రేయ పోలీసులకు తెలిపారు.భారీ బీమా స్కామ్లో ఎందరున్నారో.. విశాల్ తండ్రి కూడా తన సహాయం కోరాడని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పారన్నారు. విశాల్ తండ్రి చనిపోయిన తర్వాత, తాను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయానని శ్రేయ పోలీసులకు వివరించారు. శ్రేయ ఫిర్యాదును పరిశీలించిన సంభాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కృష్ణకాంత్ బిష్ణోయ్ తాము ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న భారీ బీమా స్కామ్లో ఇది ఒక భాగమేనని గుర్తించామని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. ఇంటిలోని వారిని హత్య చేసిన దరిమిలా విశాల్ సింఘాల్ వారిపైనున్న బీమా మొత్తాన్ని పొందేందుకు వారు పలు ప్రమాదాల్లో మరణించినట్లు ఆధారాలు సృష్టించాడు. వీటి ఆధారంగా ఇప్పటికే రూ. 1.5 కోట్లు క్లెయిమ్ అందుకున్నాడని బిష్ణోయ్ తెలిపారు.ఆస్పత్రి యాజమాన్యంపై అనుమానాలుసింఘాల్ తన ఇంటిలోని వారి పేరుతో పలు జీవిత బీమా పాలసీలను తీసుకొని, వారిని రోడ్డు ప్రమాదానికి బలిచేసి, బాధితులను మీరట్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేవాడు. తరువాత బీమా చెల్లింపును క్లెయిమ్ చేసేవాడు. సింఘాల్ భార్య, అతని తండ్రి ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో మృతి చెందారు. ఇది అనుమానాలకు తావిస్తున్నదని, ఈ విషయంలో ఆస్పత్రి యాజమాన్యం పాత్రను పరిశీలిస్తున్నామని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. సింఘాల్ తండ్రి ముఖేష్ మరణించే సమయంలో అతని పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి.రికార్డులపై అనుమానంతో ఫిర్యాదు2024 మార్చిలో హాపూర్ పోలీస్ స్టేషన్లో సింఘాల్ తండ్రికి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదయ్యింది. దీనిలో అతను గర్హ్ముక్తేశ్వర్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడని పేర్కొన్నారు. అయితే అతని బీమా క్లెయిమ్ పత్రాలలో 2023, మార్చి 27న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని ఉంది. అయితే అతను అడ్మిట్ అయిన నవజీవన్ ఆసుపత్రి రికార్డులతో అతను రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చారని నమోదయ్యింది. దీంతో అనుమానం తెలెత్తిన ఒక బీమా సంస్థ ప్రతినిధి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘విశాల్ సింఘాల్ తెలిపిన వివరాలకు.. ఆసుపత్రి వర్గాలు అందించిన సింఘాల్ తండ్రి పోస్ట్మార్టం రిపోర్టుతో సరిపోలలేదు సంజయ్ కుమార్ పోలీసులకు తెలిపాడు.తండ్రి మరణించాక వాహన రుణాలు తీర్చేసిన నిందితుడుకాగా విశాల్ సింఘాల్ సమర్పించిన పత్రాలలో తండ్రి వయస్సు,ఐడీ వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయని, వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించడంలో విశాల్ విఫలమయ్యాడని హాపూర్ ఎస్పీ కున్వర్ జ్ఞానేందర్ సింగ్ తెలిపారు. ఈ కేసు మూసివేశామని, అయితే ఇప్పుడు కేసును తిరిగి తెరవడానికి కోర్టు అనుమతి లభించిందని తెలిపారు. భారీ బీమా స్కామ్ దర్యాప్తుకు సారధ్యం వహిస్తున్న సంభాల్ అదనపు ఎస్పీ అనుకృతి శర్మ మాట్లాడుతూ తండ్రి మరణానికి రెండు నెలల ముందు విశాల్ సింఘాల్ పేరుమీద టయోటా లెజెండర్, నిస్సాన్ మాగ్నైట్, బ్రెజ్జా, రాయల్ ఎన్ఫీల్డ్కు సంబంధించిన రుణాలు ఉన్నాయని, అయితే అవి అతని తండ్రి మరణం తర్వాత క్లియర్ అయ్యాయని అనుకృతి శర్మ తెలిపారు. విశాల్ సింఘాల్పై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. -
Gurugram: భార్యను హతమార్చి.. ఫ్రెండ్కు వీడియో సందేశం పంపి..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో క్షణికావేశంలో అఘాయిత్యాలకు, దారుణాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత తనను తాను అదుపు చేసుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక జీవితంలో ప్రశాంతత కరువై, తగిన నిర్ణయాలు తీసుకోలేక పలువురు ఆత్మహత్యలనే మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. గురుగ్రామ్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ తన భార్య స్వీటీ శర్మతో ఏదో విషయమై గొడవపడ్డాడు. తరువాత ఆవేశంతో ఆమె గొంతు కోసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. భార్యపై దాడిచేసిన అనంతరం నిందితుడు అజయ్ కుమార్ (30), తన స్నేహితునికి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియో సందేశం పంపాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నివాసి కుమార్కు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కు చెందిన స్వీటీ శర్మ(28)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.కాగా తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకోబోతున్నానని తనకు వీడియో సందేశం పంపాడని కుమార్ స్నేహితుడు పోలీసులు తెలిపాడు. కుమార్ పంపిన వీడియో సందేశంలో అతను భార్యతో గొడవ పడుతున్న దృశ్యాలున్నాయి. విషయం తెలియగానే పోలీసులు సెక్టార్ 37లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలో కుమార్ దంపతులుంటున్న ఫ్లాట్కు చేరుకున్నారు. స్వీటీ శర్మశర్మ మృతదేహం నేలపై పడి ఉండటాన్ని వారు గమనించారు. అక్కడ వారికి పదునైన కత్తి కూడా లభ్యమయ్యింది. కుమార్ సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు బావిస్తున్నారు. కాగా ఈ ఘటన వెనుక గల కారణం ఇంకా వెల్లడికాలేదు. అయితే స్వీటీ శర్మ కుటుంబ సభ్యులు కుమార్పై పలు ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'కాంతార' రిలీజ్కి రెడీ.. ప్రముఖ దేవాలయంలో రిషభ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
పెళ్లయి 3 ఏళ్లు.. పిల్లల్లేరని భర్తతో గొడవ
హైదరాబాద్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిన వివరాల ప్రకారం జనగాం జిల్లా మొండ్రాయి గ్రామానికి చెందిన ధరావత్ రాజేష్, శిరీష దంపతులు బోడుప్పల్ శ్రీలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లయి మూడేళ్లయినా సంతానం కలగలేదు. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన రాజేష్ ఈ నెల 20న ఉదయం భార్య బయటకు వెళ్లగానే..ఇంట్లోనుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో, తెలిసిన వారివద్ద వెతికినా ఫలితం కన్పించలేదు. ఈ మేరకు మంగళవారం భార్య శిరీష తన భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేరని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు. -
భర్త కంపెనీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అనురాధ
కొన్ని దశాబ్దాల క్రితం మారుతి వినాయక్ గోకర్ణ అనే యువ ఇంజినీర్ ఎన్నో కలలతో చిన్న కంపెనీ ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత వినాయక్ చనిపోవడంతో కంపెనీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వినాయక్ భార్య అనురాధ (Anuradha M Gokarn) కు వ్యాపార వ్యవహారాల గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు.‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన అనురాధ కంపెనీ నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకుంది. పాఠాలు చెప్పినంత తేలిక కాదు’ అన్నారు విమర్శకులు. అయితే కంపెనీ బాధ్యతలు తీసుకున్న తరువాత తానే ఒక గెలుపు పాఠం అయింది. అప్పుల బారిన పడిన కంపెనీని ఆరు సంవత్సరాల వ్యవధిలో లాభాల బాట పట్టించింది.కట్ చేస్తే...ఆ కంపెనీ పేరు... ట్రిటాన్ వాల్వ్(Triton Valves Ltd) మన దేశంలో ఆటోమోటివ్ టైర్ వాల్వ్లు, ఉపకరణాల తయారీలో అతి పెద్ద సంస్థ. వాహన పరిశ్రమకు అవసరమైన అత్యున్నతమైన టైర్ వాల్వ్లను అందించే ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది.‘నిన్న చేసిన పొరపాటు నేడు పాఠం అవుతుంది. నా వ్యాపార ప్రస్థానంలో అలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను’ అని తన సక్సెస్మంత్రా గురించి చెప్పింది అనురాధ గోకర్ణ.చదవండి: నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ బాలుడు -
భార్య చికెన్ వండలేదని యువకుడి ఆత్మహత్య
యర్రగొండపాలెం: భార్య చికెన్ వండలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్లలక్ష్మీనారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని చెప్పినా ఆమె చికెన్ వండకపోవడంతో లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురై పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
Kerala: భార్యను హతమార్చి.. ఫేస్బుక్ లైవ్లో..
కొల్లం: కేరళలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను ఆమె భర్తే హత్య చేసి, అనంతరం ఫేస్బుక్ లైవ్లో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన పునలూర్ సమీపంలోని కూతనాడిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలిని కొల్లం నివాసి షాలినిగా గుర్తించారు.భార్య షాలినిని హత్యచేసిన అనంతరం భర్త ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం షాలిని, ఐజాక్ దంపతుల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలున్నాయి. సోమవారం షాలిని స్నానం చేసేందుకు వెళుతున్నప్పుడు ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేసి, ఆమె మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు ఐజాక్ ఫేస్బుక్ లైవ్లో తన నేరాన్ని అంగీకరించాడు. షాలినిపై అపనమ్మకం ఏర్పడిందని ఆరోపించాడు.తరువాత ఐజాక్ నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని, తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే నిందితుని ఇంటికి చేరుకుని, షాలిని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. షాలిని, ఐజాక్ల 19 ఏళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుని, దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని, మృతురాలు, నిందితుని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుషాయిగూడలో దారుణం.. అర్ధరాత్రి అక్కఇంట్లోనే భార్యను...
కుషాయిగూడ(హైదరాబాద్): భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి నిద్రిస్తున్న ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అణుపురంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా, అడ్డగూడురు గ్రామానికి చెందిన బోడ శంకర్కు అదే మండలం గోవిందపురం గ్రామానికి చెందిన మంజులతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శంకర్ పెళ్లికి ముందు నుంచే ముంబైలోని అక్క ఇంట్లో ఉంటూ ఫ్లంబర్గా పనిచేసేవాడు. వివాహం అనంతరం భార్య మంజులను ముంబై తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై శంకర్ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ తరచూ భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక మంజుల ఈ నెల 14న ముంబై నుంచి ఏఎస్రావునగర్, అణుపురం కాలనీలో ఉంటున్న అక్క రాణి ఇంటికి వచి్చంది. దీంతో శంకర్ కూడా తన చిన్న కొడుకును వెంట తీసుకొని ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చి భార్యను కలిశాడు. శుక్రవారం రాత్రి మంజులకు వరుసకు సోదరుడైన తోటకూర నగేష్ ఇంట్లో పంచాయతీ చేసిన పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పారు. అనంతరం అందరూ కలిసి రాణి ఇంటికి తిరిగి వెళ్లారు. అందరూ నిద్రిస్తుండగా శంకర్ తన పక్కనే పడుకున్న మంజులపై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. మంజుల కేకలు విని కుటుంబ సభ్యులు మేల్కొనడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతురాలి సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా హత్య అనంతరం నిందితుడు ఇంటి నుంచి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పరారీలో ఉన్న నిందితుడు శంకర్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
భార్య కోసం 175కి.మీ. దాటి, చివరకు..
అన్యోన్యంగా ఉన్న ఆ ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే.. భార్య అతన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆ భర్త ఊర్లు దాటి వెళ్లాడు. పశ్చాత్తాపంతో.. బతిమాలైనా సరే ఆమెను వెనక్కి తీసుకువద్దామని అతను అనుకున్నాడేమో అని మీరు పొరపడేరు!. కానే కాదు.. షేక్ అంజాద్కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో.. ఆమె భర్తను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న ఆ భర్త.. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె దగ్గరకు చేరాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ.. బతిమాల సాగాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాడో ఏమో.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్ల గొడవను ఫోన్లో రికార్డు చేశాడు. అయితే.. భార్యతో సరదాగా మాట్లాడుతూనే ప్యాంట్ జేబులో ఉన్న కత్తిని అంజాద్ బయటకు తీశాడు. బతిమాలుతున్నట్లు కనిపిస్తూనే.. హఠాత్తుగా ఆమె గొంతు కోశాడు. ఆపై కోపంతో జుట్టు పట్టి లాగి నడిరోడ్డు మీదకు విసిరేశాడు. ఆ పరిణామంతో ఆ వీడియో రికార్డు చేసే వ్యక్తి సహా అక్కడున్నవాళ్లంతా అంతా హాహాకారాలు చేశారు. ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పారిపోయే ప్రయత్నం చేసిన ఆంజాద్ను పట్టుకుని పోలీసులకు అప్పప్పించారు. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నాం ఒడిశా బాలాసోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దంపతుల స్వస్థలం కటక్గా పోలీసులు ధృవీకరించుకున్నారు. మనస్పర్థలతోనే అతను అలా చేశాడని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు అంటున్నారు. ఆ భర్త గొంతు కోసిన వీడియో నెట్టింటకు చేరింది. -
కూరగాయలు కోసే కత్తితో భర్తను పొడిచిన భార్య
మణికొండ: తనను తరచూ వేధిస్తున్నాడనే కోపంతో భర్తను కూరగాయలు కోసే కత్తితో పొడిచి చంపేసింది ఓ భార్య. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి కోకాపేటలో జరిగింది. నార్సింగి ఇన్చార్జి సీఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన కృష్ణంజ్యోతి బోరా (30), బర్క బోరా భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కోకాపేటలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం భార్యను కొట్టి ఆమెతో గొడవ పడి ఇంట్లోంచి కృష్ణంజ్యోతి వెళ్లిపోయాడు. గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో వచ్చి తలుపులు కొట్టినా ఆమె తీయలేదు. తలుపులను కృష్ణంజ్యోతి బలంగా తన్నటంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. బర్క బోరాను కర్రతో కొట్టేందుకు యతి్నంచగా.. ఆమె పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతనిపై దాడి చేసింది. తల, మెడ, కుడి భుజంపై కత్తితో పొడవటంతో కృష్ణంజ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు వినిపించడటంతో లేబర్ క్యాంపులో ఉన్న చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికి అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నిందితురాలు బర్క బోరాని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పారిస్లో ఫుల్ రొమాంటిక్గా ఆది-నిక్కీ జోడీ (ఫొటోలు)
-
భార్య చేతులు కట్టేసి బెల్టుతో చితకబాదిన భర్త
ప్రకాశం జిల్లా: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించడంతో స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచూ తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలను వదిలేసి వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. శనివారం రాత్రి కలుజువ్వలపాడు గ్రామానికి వచ్చిన బాలాజీ.. స్థానికంగా ఉండే బేకరీలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న భార్య భాగ్యలక్ష్మిని అటకాయించాడు.మద్యానికి డబ్బులు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో బాలాజీలోని రాక్షసుడు నిద్ర లేచాడు. తన అక్క రమణ, మేనల్లుడు విష్ణు, బాలాజీ మరో భార్య కలిసి భాగ్యలక్ష్మిని బైకుపై బలవంతంగా ఎక్కించుకొని.. అక్క ఇంటికి తీసుకువెళ్లి తాళ్లతో నిర్బంధించాడు. రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు చిత్రహింసలకు గురిచేసి విడిచిపెట్టారు. మళ్లీ సోమవారం రాత్రి చిత్రహింసలు పెట్టేందుకు బాలాజీ యత్నించగా ఆమె తప్పించుకొని ఎస్సీ కాలనీలోకి పరుగెత్తింది. స్థానిక చర్చి వద్ద ఉన్న కొందరు యువకులు బాలాజీని, అతని మేనల్లుడిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక యువకులు 112కు ఫోన్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన పోలీసులు బాధిత మహిళను ఫొటో తీసుకుని బాలాజీ మేనల్లుడు విష్ణును బైక్పై ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వదిలేసినట్లు సమాచారం. శనివారం చేసిన చిత్రహింసను బాలాజీ రెండో భార్య వీడియో తీయగా అది మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కాగా మహిళను చిత్రహింసలకు గురిచేయడంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై విలేకరులతో తెలిపారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో ప్రచురితం కావడంతో దర్శి సీఐ, తర్లపాడు ఎస్సై కలుజువ్వలపాడు గ్రామానికి చేరుకున్నారు. బాధిత మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ప్రకాశం తర్లుపాడు మండలంలో కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం భార్యను కట్టేసి బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నిన భర్త#prakasham #tharlupadu #husbandkickswife #andhrapradesh #uanow pic.twitter.com/vqiLth1eOd— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 16, 2025 -
రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భర్త ఆస్తిలో వాటా వస్తుందా?
నా భర్త చనిపోయిన తరువాత భార్యను కోల్పోయిన ఒకతన్ని రెండవ పెళ్లి చేసుకున్నాను. మొదటి భర్తతో నాకు పదేళ్ల పాప, ఏడేళ్ల బాబూ ఉన్నారు. నా రెండవ భర్తకు కూడా 12 సంవత్సరాల పాప ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నా మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు రెండవ భర్తకు సహజ సంతానంగా లేదా దత్తత సంతానం అయిపోతారా? నా మొదటి భర్త ఆస్తిలో నాకు, నా ఇద్దరు పిల్లలకు వాటా వస్తుందా? నా మొదటి భర్తకి వారసత్వపు ఆస్తితోపాటు – స్వార్జితం ద్వారా కూడా ఆస్తులు ఉన్నాయి. రెండవ భర్త ఆస్తిలో నా సంతానానికి హక్కు ఉంటుందా? నా మొదటి భర్త అమ్మగారు అంటే మా అత్తయ్యగారు బతికే ఉన్నారు. ఆవిడది కూడా మా మామయ్యగారితో రెండవ వివాహమే! కానీ ఆమెకి మొదటి భర్తతో పిల్లలు లేరు. రెండవ వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో వాటా రాదు అని చట్టం ఉంది కాబట్టే ఆవిడకి కూడా తన మొదటి భర్త నుంచి ఆస్తి రాలేదని, నాకు కూడా అలాగే రాదని చెబుతోంది. అది నిజమేనా?– ఒక సోదరి, ఖమ్మం జిల్లాబహుశా మీ అత్తయ్యగారి మొదటి భర్త చనిపోయిన కాలంలో అది నిజం కావచ్చు. పూర్వం ’హిందూ వితంతు వివాహ చట్టం, 1856’ అని ఉండేది. అప్పట్లో అది చాలా విప్లవాత్మక చట్టం అయినప్పటికీ ఆ చట్టం ప్రకారం రెండవ పెళ్లి చేసుకున్న వితంతు మహిళకు మొదటి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండేది కాదు. కానీ ఈ చట్టం 1983లో రద్దు అయింది. ప్రస్తుత చట్టంలో వితంతు వివాహం/లేదా పునర్వివాహం చేసుకున్న స్త్రీకి మొదటి భర్త ఆస్తిపై ఉన్న హక్కులు తొలగిపోవు! అలా తొలగిస్తే అది రాజ్యాంగ స్పూర్తికే వ్యతిరేకం. కాబట్టి మీకు మాత్రం మీ మొదటి భర్త ఆస్తిలో ఒక భాగం వాటా ఉంటుంది. ఇక మీ పిల్లల విషయానికి వస్తే... మీరు రెండవ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం రెండవ భర్తకు చెందరు. ఒకవేళ రెండవ భర్త నిజమైన తండ్రిగా వ్యవహరించాలి అని మీరు అనుకుంటే, మీరు మీ పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వవలసి వస్తుంది. అయితే దత్తత ఇచ్చేసిన తర్వాత సాధారణ పరిస్థితిలో అయితే దత్తత ఇవ్వబడ్డ పిల్లలకు వారి సహజ తల్లిదండ్రుల ఆస్తులలో (పూర్వీకుల ఆస్తిలోనైనా లేక స్వార్జితంలో అయినా) ఎటువంటి హక్కు ఉండదు. కానీ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిలో మాత్రం దత్తపుత్రులకు/దత్త పుత్రికకు వారి సహజ సంతానంతో సమానంగా హక్కు ఉంటుంది. అంటే మీ రెండవ భర్తకి మీరు దత్తత ఇస్తే ఆయన తదనంతరం (వీలునామా రాయకుండా మరణిస్తే) ఆస్తిలో తన సొంత కూతురితో సమానంగా మీ పిల్లలకు కూడా చెరొక వాటా వస్తుంది. దత్తత ఇచ్చే సమయానికి ఒకవేళ మీ మొదటి భర్త ఆస్తిలో పంపకాలు జరిగి మీ పిల్లలకి ఆ ఆస్తి ఇప్పటికే వచ్చి ఉన్నట్లయితే, వారిని దత్తత ఇచ్చేసినప్పటికీ కూడా వారి ఆస్తి వారి వద్దనే ఉంటుంది. అంటే మీరు ముందుగా మీ మొదటి భర్త నుండి సంక్రమించే ఆస్తిని పంచుకుని తర్వాత పిల్లల్ని దత్తత ఇస్తే పిల్లలకి నష్టం వుండదు. ఎందుకంటే మీ రెండవ భర్త తన ఆస్తిని తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మీ పిల్లలకి ఇవ్వకపోతే వారు చేయని తప్పుకి పిల్లలు బలయ్యే అవకాశం ఉంది కదా! ఈ విషయాలు అన్నింటిని మీ మొదటి భర్త తల్లిగారికి వివరించండి. ఒప్పుకోని పక్షంలో మీరు పార్టిషన్ సూట్ ద్వారా మీ హక్కును అలాగే మీ పిల్లల హక్కును కూడా కాపాడుకోవచ్చు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే పైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులలో పూర్తి పత్రాలతో, సమాచారంతో దగ్గరలోని లాయర్ని కలవడం అవసరం. -
మాస్క్ మ్యాన్ చాలా సాఫ్ట్ ..! నన్ను నిజంగానే కొట్టాడు కానీ..! మాస్క్ వెనుక అసలు కథ!
-
Hyderabad: అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసిన భర్త
-
నాగోల్లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం జరిగింది. భర్త తన భార్య గొంతును కోసిన ఘటన నాగోల్లో చోటు చేసుకుంది. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.గత యాడాది క్రితమే మహాలక్ష్మి(20)కి వేణుగోపాల్తో వివాహమైంది. అదనపు కట్నం తేవాలంటూ పెళ్ళైన నెల నుండే భార్యపై భర్త పలుమార్లు దాడి చేశాడు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా భర్త తీర మారలేదు. వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను’.. చార్లీ కిర్క్ భార్య భావోద్వేగ ప్రసంగం..
వాషింగ్టన్: ‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను..ఈ దేశం ఇప్పటివరకు చూడని గొప్ప విషయంగా దానిని మారుస్తాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తన భర్తను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో అన్నారు. బుధవారం యుటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరైన రైట్ వింగ్ కార్యకర్త, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. చార్లీ కిర్క్ హత్య అనంతరం అతని భార్య ఎరికా కిర్క్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు.తన భర్త పాడ్కాస్ట్ను హోస్ట్ చేసే కార్యాలయం నుండి ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. తాను అమెరికాను, ఇక్కడి ప్రకృతిని, చికాగో కబ్స్ను అమితంగా ప్రేమిస్తున్నానని అన్నారు. తన భర్త చార్లీ తనను, పిల్లలను హృదయపూర్వకంగా ప్రేమించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను హత్య చేసినవారిని పట్టుకున్న చట్ట అమలు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు టైలర్ రాబిన్సన్ ను ఉద్దేశిస్తూ ఆమె ‘నాలో రగులుతున్న అగ్ని గురించి నీకు తెలియదు. ఈ వితంతువు రోదనలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నాదాలుగా ప్రతిధ్వనిస్తాయి’ అంటూ ఎరికా కిర్క్ కన్నీరు పెట్టుకున్నారు.ఎరికా 2021లో చార్లీ కిర్క్ను వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. తన భర్త ట్రంప్ను అమితంగా ఇష్టపడేవారని, తన భర్త అందించిన రేడియో షో, పాడ్కాస్ట్ను కొనసాగిస్తూ, తన భర్త ఆశయాలను సజీవంగా ఉంచుతానని ఆమె పేర్కొంటూ, ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఆయనకు అండగా నిలిచారు. ఆయన కూడా మీ కోసం పనిచేశారు అని ఎరిక్ అధ్యక్షుడు ట్రంప్తో అన్నారు. -
భార్యతో వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న జవాన్ డైరెక్టర్ అట్లీ (ఫొటోలు)
-
ముహూర్తం కోసం వచ్చి అనంతలోకాలకు..
ఎర్రుపాలెం/కంచికచర్ల: కుమారుడి వివాహానికి ముందు ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజల తేదీ ఖరారు చేసేందుకు గురువు వద్దకు వచ్చి ఆనందంతో తిరిగి వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బైక్ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి దామినేని కుమారి(45), శ్రీనివాసరావు(54) భార్యాభర్తలు. శ్రీనివాసరావు వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె ఉమాదేవి, కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. కుమార్తె వివాహం తమ గ్రామానికే చెందిన సాయితో జరిపించారు. ఇక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్కు ఇటీవల వివాహం కుదిరింది. కుమారుడి వివాహానికి ముందు తమ ఇంట్లో వెలసిన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు శ్రీనివాసరావు, కుమారి దంపతులు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో ఉన్న ఓ పూజారి వద్దకు వచ్చి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆపై బైక్పై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఎర్రుపాలెం – తక్కెళ్లపాడు మధ్య ఎదురుగా వచ్చిన కోళ్ల లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతుల తలలకు తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారా అంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది. కాగా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ గని ఆత్కూరులో శ్రీనివాసరావు, కుమారి మృతదేహాల వద్ద నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
శృతిమించిన ‘జెన్జీ’ నిరసనలు.. మాజీ ప్రధాని భార్యను చంపేశారు
కాఠ్మాండు: నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగిన ఘోర ఘటన కలకలం రేపుతోంది. ఆందోళన కారులు నేపాల్ రాజధాని కాఠ్మాండూలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ ఆందోళనకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా,అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ చేపట్టిన ఉద్యమంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. మాజీ ప్రధాని కేపీఓలీతో పాటు పలువురు మంత్రులు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కాఠ్మాండూలోని డల్లూ ప్రాంతంలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ ఇంటిని ముట్టడించారు. ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ను ఇంట్లో బంధించి, ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న రాజ్యలక్ష్మిని కిర్తిపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జెనరేషన్ జెడ్ ఆందోళనలతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో పలువురు జెనరేషన్ జెడ్ ఆందోళనల్ని సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై ‘మానవత్వానికి మాయన మచ్చ’అంటూ కామెంట్లు చేస్తున్నారు.


