breaking news
wife
-
నితిన్ భార్య షాలినీ దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అత్యంత అరుదైన కేసు.. 23 ఏళ్ల తర్వాత ఆమెకు పరిహారం
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక చొరవ తీసుకుని.. బాధితురాలిని వెతికించి మరీ పరిహారం ఇప్పించిన ఘటన ఇది. రైలు ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు 23 ఏళ్ల తర్వాత పరిహారం అందింది. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. .. విజయ్ సింగ్ అనే వ్యక్తి 2002 మార్చి 21న భాగల్పూర్–దానాపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ కంపార్టుమెంట్ నుంచి హఠాత్తుగా జారిపడ్డారు. తీవ్రంగా గాయపడి మృతిచెందారు. పరిహారం కోసం ఆయన భార్య సంయుక్త దేవి న్యాయ పోరాటం ప్రారంభించారు. ప్రమాదం వెనుక రైల్వేశాఖ నిర్లక్ష్యం లేదని, అతడికి మతిస్థిమితం లేదని, ఎవరో అతడిని నెట్టివేయడం వల్లే రైలు నుంచి కిందపడ్డాడని, పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు తేల్చిచెప్పాయి. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఆదేశాలను 2023లో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ కొనసాగించింది. విజయ్ సింగ్కు మతిస్థిమితం లేకపోతే రైలు టికెట్ ఎలా కొనుగోలు చేశాడని, రైలు ఎలా ఎక్కాడని? ప్రశ్నించింది. అసంబద్ధమై కారణాలతో పరిహారాన్ని తిరస్కరించడం సరైంది కాదని తేల్చిచెప్పింది. బాధితురాలు సంయుక్త దేవికి రూ.4 లక్షల పరిహారాన్ని ఏటా 6 శాతం వడ్డీతో కలిపి రెండు నెలల్లోగా చెల్లించాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ పరిహారం అందజేయడానికి సంయుక్తి దేవి చిరునామా అందుబాటులో లేకుండాపోయింది. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియరాలేదు. జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దాంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. సంయుక్తి దేవి కోసం పబ్లిక్ నోటీసు జారీ చేయాలని, మీడియాలో ప్రకటన ఇవ్వాలని రైల్వే శాఖకు సూచించింది. ఈ ప్రయత్నం ఫలించింది. సంయుక్త దేవి ఆచూకీ లభించింది. పరిహారాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘జూదం’ కేసు విచారణకు సహకరించండిదేశవ్యాప్తంగా ఆన్లైన్ జూదాన్ని, బెట్టింగ్ వేదికలను నిషేధించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అకౌంటబిలిటీ అండ్ సిస్టమిక్ ఛేంజ్(సీఎఎస్సీ) అనే సంస్థ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సోషల్ గేమ్స్, ఈ–స్పోర్ట్స్ ముసుగులో ఆన్లైన్ జూదం కొనసాగుతోందని పిటిషనర్ తరఫు లాయర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. పిటిషన్కు సంబంధించి కాపీని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వి.సి.భారతికి అందజేయాలని పిటిషనర్కు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో తమకు సహకరించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టంచేసింది. ఇదీ చదవండి: సీన్లోకి సిద్ధూ తనయుడు! డీకే ఏమన్నారంటే.. -
పిల్లలతో తారకరత్న సతీమణి అలేఖ్య దీపావళి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వేరుపడిన భార్య వస్తువుల్ని 24 గంటల్లోగా అప్పగించాలి
న్యూడిల్లీ: వేరుగా ఉంటున్న భార్యను ఆమె దుస్తులు, ఇతర వస్తువుల్ని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్న ఓ భర్తపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమని పేర్కొంది. ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులను 24 గంటల్లోగా అప్పగించాలని అతడిని ఆదేశించింది. దీపావళి పండుగ జరుపుకునేందుకు తన కుమారుడిని తనతో ఇంటికి పంపించేలా భార్యను ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, ఆమె కుమారుడిని భర్తతో పంపేందుకు నిరాకరించింది.2022 నుంచి అత్తింట్లో ఉన్న తన వస్తువులను అతడు తీసుకెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది. స్పందించిన ధర్మాసనం ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించింది. ‘వివాహాలు కొన్ని విఫలమవుతుంటాయి. కానీ, భార్య తన దుస్తులు తీసుకోవడానికి కూడా భర్త అనుమతించనంత స్థాయికి దిగజారకూడదు. కలిసి ఉండలేని పరిస్థితి వేరు. ఆమె వస్తువులను 24 గంటల్లో తిరిగి అప్పగించాలని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా, తల్లి, తండ్రి కలిసి తమ కుమారుడిని దగ్గర్లోని గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలని, కావాలనుకుంటే అమ్మమ్మ, తాతయ్యలు కూడా వారితో వెళ్లవచ్చని ధర్మాసనం పేర్కొంది. -
పక్కా ప్లాన్ తోనే నా భర్తను చంపారు
-
Bihar Election: ఎన్నికల బరిలో ప్రముఖ గాయకుని భార్య?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ నేతలతో పాటు పలువురు గాయనీగాయకులు, నటులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా భోజ్పురి గాయకుడు, నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఈ ఎన్నికల్లో తన పాత్రపై ఏమిటనేది వెల్లడించారు. తాను ఆర్జేడీ తరపున ప్రచారం చేయనున్నానని, తన భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నానని తెలిపారు. #WATCH | Patna: On the Bihar Assembly elections, Bhojpuri singer and actor Khesari Lal Yadav says, "I want my wife to contest the election, I have been trying to convince her for the last 4 days. If she agrees, we will file the nomination; otherwise, I will only campaign and try… pic.twitter.com/EjzOgdduS3— ANI (@ANI) October 15, 2025భోజ్పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన భార్య చేత పోటీ చేయించాలని అనుకుంటున్నానని, ఇందుకోసం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఒకవేళ ఆమె ఇందుకు అంగీకరిస్తే, తమ నామినేషన్ దాఖలు చేస్తామని, లేనిపక్షంలో తాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటు తేజస్వి యాదవ్, అటు అఖిలేష్ యాదవ్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పోటీ చేసే విషయంలో రెండు పార్టీల నుండి తనపై ఒత్తిడి ఉన్నదని ఖేసరి లాల్ యాదవ్ పేర్కొన్నారు. తన భార్య అంగీకరిస్తే, ఆమె చేత ఖచ్చితంగా పోటీ చేయిస్తానని తెలిపారు. -
భారీ ఎత్తున భరణం గుంజి, అతడితో పెళ్లి.. నా మాజీ భార్య భర్తపై కేసు వేయొచ్చా?
నా భార్య మరొకరితో సంబంధం పెట్టుకొని నా నుంచి విడాకులు తీసుకుంది. విడాకుల కేసులో నేను తనకు ఫలానా వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది అని పేరుతో సహా చెప్పినప్పటికీ, తనకు అలాంటివేమీ లేవని కోర్టును నమ్మించింది. దాంతో నేను పదిలక్షల రూపాయలు భరణంగా చెల్లించవలసి వచ్చింది. మా విడాకులు అయిన 7 నెలలకే తను అదే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తను నా భార్యగా ఉన్నప్పుడు వారు కలిసి తీసుకున్న ఫోటోలు కొన్ని పెళ్లి వీడియోలో పెట్టి ఇంటర్నెట్లో కూడా పెట్టుకున్నారు. నన్ను మానసిక క్షోభకి గురి చేసినందుకు నేను నా మాజీ భార్య ప్రస్తుత భర్తపై కేసు వేయవచ్చా? ఎందుకంటే, ఇటీవలే పేపర్లో తైవాన్లో భార్య ప్రియుడిపై భర్త కోర్టులో దావా వేయగా కోర్టు అతనికి పరిహారం కూడా చెల్లించమని చెప్పిందని ఒక వార్త చదివాను. మనదేశంలో కూడా అలా చేసే వీలుందా? – సంపత్, హైదరాబాద్ రెండు వారాల క్రితం ఇలాంటి ఒక కేసు గురించి మన పత్రికలో కూడా సమాధాన రూపంగా చె΄్పాను. వివాహేతర సంబంధాలు చట్టరీత్యా నేరాలుగా పరిగణించక పోయినప్పటికీ, సివిల్ దావాలు/పరిహారాలు కోరడానికి భారతీయ చట్టాలలో ఎటువంటి అడ్డంకీ లేదు. మారుతున్న సామాజిక పరిణామాల దృష్ట్యా, వివాహేతర సంబంధాలు ఇకపై సివిల్ కోర్టుకు చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మీ మాజీ భార్య ప్రియుడి మీద (ప్రస్తుతం ఆమె భర్త) ఖచ్చితంగా కేసు వేయవచ్చు. పరిహారం కూడా కోరవచ్చు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో ఒక భార్య తన భర్త ప్రియురాలిపై వేసిన దావా చెల్లుతుంది అని పేర్కొంది. అయితే మీరు కేసు వేసిన తర్వాత, మీ మాజీ భార్యకి, తన భర్తకి సంబంధం ఉండేదనే విషయాన్ని ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో రుజువు చేయవలసి ఉంటుంది. కోర్టును ఎవరు ఆశ్రయిస్తే వారే తమ పక్షం వాదనని వాస్తవాలేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది! కేవలం గతంలో వారిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని ఫొటోల ఆధారంగా మాత్రమే మీరు కేసు గెలవడం కొంత కష్టమే! అయితే, అసలు మీ మాజీ భార్యకు అతనితో పెళ్లికి ముందు పరిచయమే లేదు అతను ఎవరో నాకు తెలియదు’’ వంటి సమాధానాలు చెప్పి ఉన్నట్లయితే, మీ డైవర్స్ కేసులో జరిగిన వాదోపవాదాలను ఆధారంగా తీసుకొని మీ తరఫు సాక్ష్యాలుగా కూడా కోర్టు ముందు ఉంచవచ్చు. చదవండి: ఆ టైంలో హెల్ప్ అడగడం తప్పుకాదు, మీకోసం మీరు ఏడ్వండి : సారాఇవన్నీ ఒకవేళ రుజువు అయినట్లయితే మీకు మానసిక క్షోభ కలిగించినందుకు గాను, ఆర్థికంగా కూడా మీరు నష్టపోయినందుకు గాను, మీరు తగిన పరిహారం పొందే అవకాశం లేకపోలేదు. మీరు కేసు వేయాలి, తగిన సాక్ష్యాధారాలతో రుజువు చేయగలను అనుకుంటే, మీ మాజీ భార్యని కూడా కేసులో పార్టీ చేయండి. ఇంతవరకు ఇలాంటి కేసులు లేకపోయినప్పటికీ, ఇటీవలే మన భారతీయ కోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా మీ కేసు విచారణకు మాత్రం అర్హత సాధించింది. కేసు గెలవడం ఓడిపోవడం తర్వాత సంగతి. అన్ని సాక్ష్యాధారాలు, ముఖ్యంగా మీ డైవర్స్ కేసులో మీ మాజీ భార్య ఇచ్చిన వాంగ్మూలాలు/ క్రాస్ ఎగ్జామినేషన్లో తను చెప్పిన సమాధానాలు వంటివి నిక్షిప్తపరిచి ఒక లాయర్ను సంప్రదిస్తే మీకు ఉపశమనం లభించవచ్చు. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించి..
కొరాపుట్(ఒడిషా): భార్యను చంపేసి.. ప్రమాదంగా చిత్రించాడో ప్రబుద్ధుడు. ఆయన పోలీసు కావడం విశేషం. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఎంపీ కాలనీలో ఐఆర్బీ జవాన్ శివ శంకర్ పాత్రో నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి అతని భార్య ప్రియాంక పండా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. అందరూ ఇది ప్రమాదమే అని అనుకున్నారు. కానీ ప్రియాంక తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కొరాపుట్లో సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కేసు మలుపు తిరిగింది. వారు తమ కుమార్తె మృతదేహం చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధికి చెందిన తరణి పండా తన కుమార్తె ప్రియాంకని నబరంగ్పూర్ జిల్లా డాబుగాంకి చెందిన ఐఆర్బీ కానిస్టేబుల్ శివ శంకర్ పాత్రోకి ఇచ్చి గత ఏడాది జులై 11న టెక్కలిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో 12 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు వరకట్నంగా ఇచ్చారు. నూతన దంపతులు కొరాపుట్ ఓఎంపీ కాలనీ నివాసం ఉండడంతో వారికి అవసరమైన సారె కింద ఇంటి సామగ్రి ఇచ్చారు. కానీ పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం ప్రియాంకపై భర్త భౌతిక దాడులు చేసేవాడు. ఇది తెలిసి కన్నవారు తమ శక్తి మేరకు అదనపు కట్నం పంపుతుండేవారు. భర్త వేధింపులతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి సెప్టెంబర్ 4న తిరిగి కొరాపుట్ వచ్చింది. కానీ వేధింపులు ఆగలేదు. పుట్టింట తండ్రి ఆరోగ్య రీత్యా గత కొద్ది రోజులుగా వేధింపులు కన్నవారికి చెప్పలేదు. బుధవారం రాత్రి 8 గంటలకు వీడియో కాల్ ద్వారా ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడింది. 9 గంటలకు శివ శంకర్ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే రమ్మని టెక్కలికి ఫోన్ చేశాడు. వెంటనే వీరందరూ కొరాపుట్ చేరుకొని అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతురాలి తలపై ఇనుప రాడ్డుతో మోది చంపినట్లు తెలిసింది. దీంతో వెంటనే శివ శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక చనిపోయాక శివశంకర్ తన తల్లిని, ఏడు నెలల కుమార్తెను ఇంటి బయట కూర్చోబెట్టాడు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి ఇంటికి నిప్పంటించాడు. మొదటి అంతా ఇది అగ్ని ప్రమాదమే అనుకున్నారు. కానీ మృతురాలి తల్లిదండ్రులు రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో శివ శంకర్ తన నేరం అంగీకరించారు. -
భర్త మానసిక క్షోభకు రూ. 37 లక్షలు : ప్రియుడికి భారీ షాకిచ్చిన కోర్టు
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, విడాకులు, భరణానికి సంబంధించిన వార్తలు చాలానే వింటున్నాం. సాధారణంగా భార్యకు భర్త భరణం ఇవ్వడం కామన్. కానీ ఒక కేసులో భర్తకు రూ. 37 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు భార్య ప్రియుడిని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.తైవాన్కు చెందిన వీ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి తన భార్య జీ (మారుపేరు) ప్రేమికుడి (యోంగ్)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా, వారిపై చట్టపరమైన చర్య తీసుకున్నాడు. తాను అనుభవించిన మానసిక క్షోభ వైవాహిక హక్కుల ఉల్లంఘనకు పరిహారంగా దాదాపు కోటి రూపాయలను డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.విచారణ సమయంలో వీ మానసిక క్షోభకు గురైనట్లు కనిపించాడని కోర్టు గుర్తించింది. అలాగే వీ కంటే ప్రియుడు యోంగ్ సంపాదన ఎక్కువ అని కూడా గమనించింది. అందుకే మోసపోయిన భర్తకు పరిహారంగా భర్తకు 300,000 యువాన్లు (సుమారు రూ. 37 లక్షలు) చెల్లించాలని తీర్పు చెప్పింది.2000లొ వీ- జీకి పెళ్లైంది. దాదాపు 15 సంవత్సరా సంసారిక జీవితం తరువాత 2022 నుంచి జీ తన కొలిగ్ యోంగ్తో సంబంధం పెట్టుకుంది. జీ,యోంగ్ ఒకేచోట పనిచేస్తారు. యోంగ్ అకౌంటింగ్ డైరెక్టర్గా ఉండగా, జీ ఒక ఉపాధ్యాయురాలిగా ఉంది. అయితే ఏడాది తరువాత 2023 నవంబరులో తన భార్య జీ యోంగ్తో రిలేషన్లో వున్నట్టు ఫోన్ ద్వారా గుర్తించాడు. వారిద్దరి మధ్య మెసేజ్లు కంటపడ్డాయి. ఇద్దరూ తరచుగా హోటళ్లలో కలుసుకోవడం, అక్రమంగా శారీరక సంబంధంలో ఉన్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు "భార్యభర్త" లుగానే వ్యవహరిస్తున్నారని కూడా గమనించి షాక్ అయ్యాడు. దీనితో తన ఎమోషన్స్ని హర్ట్ చేశారంటూ యోంగ్ పై దావా వేశాడు. అయితే జీకి పెళ్లి అయిందన్న విషయం తనకు తెలియదంటే బుకాయించాడు యోంగ్. కానీ వీ వాదనలను విశ్వసించిన కోర్టు ప్రియుడికి భారీ షాకే ఇచ్చింది. అయితే అతను డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు కాకుండా, రూ. 37 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. మరోవైపు ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం యోంగ్కి ఇచ్చింది కోర్టు -
అత్తపై మోజుతో..
వివాహేతర సంబంధాలు ఎంతటి నేరాలకు దారి తీస్తున్నాయో నిత్యం ఏదో ఒక ఘటన ద్వారా చూస్తున్నదే. అయితే ప్రేమ పేరిట, శారీరక సుఖం కోసం అనైతిక సంబంధంలోనూ మునిగిపోతున్నారు కొందరు. అలాంటి ఘటనే ఇక్కడ.. మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం పోవడానికి కారణమైంది.ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయం తెలిసింది. తన అత్తతో అనైతిక సంబంధం(Illicit Relationship) పెట్టుకున్న ఆమె భర్తే హంతకుడని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు.. ఆ అత్తాఅల్లుళ్లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేపింది.ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) కాస్గాని జిల్లా సిధ్పుర గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో చనిపోయిందంటూ పోలీసులకు కబురు వెళ్లింది. మృతురాలిని శివాని(20)గా గుర్తించిన పోలీసులు.. హత్య జరిగి రెండు అప్పటికే రెండు రోజులు అయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె తరఫు బంధువులను విచారించగా.. భర్త ప్రమోదే ఆమెను హత్య చేసి పారిపోయాడని వాళ్లు పోలీసుల వద్ద వాపోయారు.2018లో శివాని, ప్రమోద్ల వివాహం జరిగింది. ఈ జంటకు రెండున్నరేళ్ల బాబు, ఆరు నెలల ఓ పాప ఉన్నారు. అయితే.. గత ఆరు నెలలుగా శివాని తల్లి ప్రేమావతితో అనైతిక సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసి శివాని భర్తను నిలదీయడంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మరోవైపు ప్రేమావతిని కూర్చోబెట్టి పెద్దలు పంచాయితీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదు.ఈ క్రమంలో.. అక్టోబర్ 6వ తేదీన ఆ భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ శివానిని హతమార్చి.. కుటుంబంతో సహా పరారయ్యాడు. మరోవైపు ప్రేమావతి కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా వాళ్ల వెంటే పారిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శివాని తండ్రి నారాయణ సింగ్ ఫిర్యాదుతో పరారీలో ఉన్న ప్రమోద్ కుటుంబ సభ్యుల కోసం, శివానీ తల్లి ప్రేమావతి కోసం గాలింపు చేపట్టారు. ఈలోపు.. ప్రేమావతి, ప్రమోద్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. అత్తపై మోజుతో భార్యను కడతేరచిన భర్త ఉదంతంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిందక్కడ.ఇదీ చదవండి: పరుపు కింద భార్య శవాన్ని కుక్కి.. -
భార్య శవాన్ని పరుపు కింద దాచి, ఆపై..
ఆ జంటకు పెళ్లై.. నాలుగు నెలలే అయ్యింది. బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె మృతదేహంగా మంచం కింద కనిపించింది. భర్త జాడ లేకుండా పోయాడు. అతని తల్లే ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు(Belagavi Husband Kills Wife). ఈ జంటకు ఈ ఏడాది మే నెలలోనే వివాహం జరిగింది.పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లికి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూడగా.. పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఆకాశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని సాక్షి కుటుంబం ఆరోపిస్తోంది(Dowry Harassment). అయితే ఆకాశ్ తల్లి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో ఓ గర్భవతిని ఆమె భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం చితక్కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) ప్రకారం.. వరకట్న వేధింపుల ఘటనలు, ఆ వేధింపుల కారణంగా మరణిస్తున్న కేసులూ దేశంలో అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ జాబితాలో యూపీ, బీహార్ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఇదీ చదవండి: సీనియర్లు వేధించారనే ఐపీఎస్ సూసైడ్! -
పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్
మొన్న అసోం గాయకుడు జుబీన్ గార్డ్ అకాల మరణం వార్తను ఇంకా మర్చిపోకముందే పంజాబ్కు చెందిన మరో ప్రముఖ గాయకుడి మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా(Rajvir Jawanda) విషాద మరణం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో దిగ్భ్రాంతి రేపింది. ఈసెప్టెంబర్ 27న తీవ్రమైన ప్రమాదానికి గురైన గాయకుడు 11 రోజులు వెంటిలేటర్పై చికిత్స పొందాడు. చివరికి అవయవాలు ఫెయిల్ కావడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని అభిమానులు, స్నేహితులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.రాజ్వీర్ జవాండా ప్రమాదానికి కారణం ఏమిటి?తన కెంతో ఇష్టమైన 1300సీసీ బైక్పై విహార యాత్రకు వెళ్లిన రాజ్వార్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డొచ్చిన పశువులను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. రాజ్వీర్ 5-6గురు స్నేహితులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని స్నేహితులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయడపిన రాజ్వీర్ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. తీవ్ర గాయాలు, ప్రమాదంలో వెన్నెముక రెండచోట్ల విరిపోయిందనీ, ఇంకా పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. మెడ విరిగిపోయింది. దీంతో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లైఫ్ సపోర్ట్మీద ఉంచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్గాన్ పెయిల్యూర్, గుండెపోటు కారణంగా రాజ్వీర్ చివరకు అక్టోబర్ 8న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్తను ప్రముఖ పంజాబీ గాయని జస్బీర్ జస్సీ ధృవీకరించారు.2014లో తన సంగీత జీవితాన్ని ప్రారంభించి అనతిలోకాలంలో పాపులారీటీ సాధించాడు. అయితే రాజ్వీర్ జవాంద మొదట్లో పోలీసు అధికారి కావాలని భావించాడు. కానీ అనుకోకుండా సింగింగ్ కరియర్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు. కానీ దాన్ని పూర్తిగా అనుభవించకముందే .. చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోవడం విషాదం. అయితే అతని సక్సెస్ వెనుక అతని భార్య కృషి ఉన్నట్టు తెలుస్తోంది. (జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్)రాజ్వీర్ జవాండా భార్య హెచ్చరికరాజ్వీర్ జవాండా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన నేపథ్యంలో, అతని భార్య కూడా ఎవరికీ తెలియదు. కానీ భర్తను ఆమె ఎప్పుడూ తెరవెనుక ఉండి నడిపించేదని సన్నిహితులు చెబుతున్న మాట.. ప్రమాదం జరిగిన రోజు తమ ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది రాజ్వీర్ భార్య. రాబోయే కీడును ఊహించే ఆమె అలా హెచ్చరించిందట. భద్రత గురించి తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసిందట. కానీ రాజ్వీర్ పట్టించు కోలేదని రాజ్వీర్ సన్నిహితులు అంటున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు -
కామాఖ్య ఆలయాన్ని దర్శించిన మనోజ్ దంపతులు (ఫొటోలు)
-
హైదరాబాద్ బోరబండలో దారుణం
-
ఆస్తి కోసం భర్త హత్య
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య, ఆమె ప్రియుడు, స్నేహితుడ్ని మేడికొండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు.. గుంటూరు పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్ చెన్నంశెట్టి గోవిందరాజుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని నాగన్నకుంటకు చెందిన లక్ష్మీతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. భార్య, భర్త మధ్య గొడవలు చెలరేగడంతో.. ఆరేళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం లక్ష్మీకి సత్తెనపల్లికి చెందిన పేర్నేపాటి వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ నేపథ్యంలో గోవిందరాజు కుటుంబానికి సంబంధించిన రూ.1.5 కోట్ల ఆస్తి గురించి తెలుసుకున్న లక్ష్మి భర్తను హత్య చేసి.. ఎలాగైనా ఆస్తిలో వాటా దక్కించుకోవాలని భావించింది. ఇందుకు వెంకటేశ్వర్లుతో కలిసి కుట్ర పన్నింది. ఆ ప్రకారం.. వెంకటేశ్వర్లు, అతని స్నేహితుడు షేక్ ఖాసిం సైదా సెపె్టంబర్ 18న ఆటోలో గోవిందరాజు ఇంటికి వెళ్లారు. వెంకటేశ్వర్లు, గోవిందరాజుకు గతంలో పరిచయం ఉంది. దీంతో ముగ్గురూ కలసి ఆటోలో తిరుగుతూ మద్యం తాగారు. ఈ క్రమంలో సాతులూరు, పెదరెడ్డిపాలెం గ్రామాల మధ్య.. గోవిందరాజుతో వెంకటేశ్వర్లు గొడవ పడ్డాడు.పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోవిందరాజును.. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు తీసుకెళ్లి ఇనుప రాడ్డుతో మోది హత్య చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీకి తెలియజేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని 19వ తేదీన పెదపలకలూరు తేజ గార్డెన్స్ సమీపంలో పడేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐ నాగూర్మీరాసాహెబ్, సిబ్బంది దర్యాప్తు చేసి.. వెంకటేశ్వర్లు, అతని మిత్రుడు షేక్ ఖాసింసైదాను అరెస్టు చేశారు. -
నెలల కొడుకుతో రహస్య దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య
తిరువొత్తియూరు: కోయంబత్తూరు పీలమేడు సమీపంలోని వి.కె.రోడ్, చేరన్ నగర్, 4వ బస్టాప్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జయపాల్(47). ఇతని భార్య వాలెంటినా(40). వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలెంటినా తన కొడుకుతో కలిసి మధురైలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సంఘటన జరిగిన రాత్రి జయపాల్ తన భార్యకు సెల్ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అప్పుడు, అతను తన భార్యతో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా వీడియో కాల్లో భార్యతో మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న తన భార్య చుడీదార్ ప్యాంటు తీసుకుని ఫ్యాన్కు తగిలించి ఉరి వేసుకున్నాడు. వీడియో కాల్లో ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన అతని భార్య, వెంటనే కోయంబత్తూరులోని తమ ఇంటి సమీపంలో నివశిస్తున్న బంధువులకు ఫోన్ చేసి, తమ ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి జయపాల్ను రక్షించడానికి ప్రయత్నించారు. అతను ఉన్న గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఉరి వేసుకున్న అతన్ని కిందకు దించారు. ఆ తర్వాత అంబులెన్స్లో సింగనల్లూరు ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అతను ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మరణించినట్లు తెలిపారు. భర్త ఉరి వేసుకుని వేలాడుతుండడం చూసిన వాలెంటీనా వెంటనే కోయంబత్తూరుకు తిరిగి వచ్చింది. ఆమె కుమారుడితో కలసి మరణించిన జయపాల్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై వాలెంటినా కోయంబత్తూరు పీళమేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
50 కోట్ల బీమా కోసం భార్య, తల్లిదండ్రుల హత్య.. నాలుగో భార్య ఫిర్యాదుతో బీమా స్కామ్ వెల్లడి
మీరట్: ఉత్తరప్రదేశ్లో రూ. 50 కోట్ల బీమా కోసం ఒక వ్యక్తి తన మొదటి భార్య, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చాడు. అయితే అతని నాల్గవ భార్య ఈ మరణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు సాగించిన భారీ బీమా స్కామ్ వెలుగుచూసింది.ఒక పథకం ప్రకారం హత్యలుఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన విశాల్ సింఘాల్(37) తన మొదటి భార్య, తల్లిదండ్రులను హత్య చేసినందుకు హాపూర్లో అరెస్టు చేశారు. అతని నాల్గవ భార్య.. విశాల్ సింఘాల్ ఇంటిలో జరిగిన అనుమానాస్పద మరణాలపై పోలీసులను అప్రమత్తం చేశారు. సింఘాల్ తండ్రి ముఖేష్ పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి. వీటిపై కన్నేసిన విశాల్ ఒక పథకం ప్రకారం తండ్రిని హత్య చేసి, ఇప్పటికే రూ.1.5 కోట్ల క్లెయిమ్లను అందుకున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించిన దరిమిలా నివ్వెరపోయే పలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.నాల్గవ భార్యపై పాలసీ కోసం ఒత్తిడిపోలీసుల దర్యాప్తులో విశాల్ సింఘాల్.. తన రెండవ, మూడవ భార్యలు తనను విడిచిపెట్టివెళ్లిపోయారని తెలిపాడు. అయితే పోలీసులు ఈ మాటపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరట్లోని గంగానగర్కు చెందిన సింఘాల్, తన నాల్గవ భార్య శ్రేయను అధిక విలువ కలిగిన జీవిత బీమా పాలసీలపై సంతకం చేసేందుకు ఒప్పించాడు. అయితే సంభాల్లో దర్యాప్తు జరుగుతున్న బీమా స్కామ్ గురించి తెలుసుకున్న శ్రేయ అనుమానంతో.. తన భర్త బీమా పాలసీ కోసం తనపై చేస్తున్న ఒత్తిడి గురించి పోలీసులకు తెలిపారు. ‘విశాల్ పాలసీలపై సంతకం చేయమని తనను నిరంతరం ఒత్తిడి చేస్తూ వచ్చాడని, ఇదే సమయంలో అతని కుటుంబంలో గతంలో చోటుచేసుకున్న మరణాలపై తనకు అనుమానాలు వచ్చాయని శ్రేయ పోలీసులకు తెలిపారు.భారీ బీమా స్కామ్లో ఎందరున్నారో.. విశాల్ తండ్రి కూడా తన సహాయం కోరాడని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పారన్నారు. విశాల్ తండ్రి చనిపోయిన తర్వాత, తాను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయానని శ్రేయ పోలీసులకు వివరించారు. శ్రేయ ఫిర్యాదును పరిశీలించిన సంభాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కృష్ణకాంత్ బిష్ణోయ్ తాము ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న భారీ బీమా స్కామ్లో ఇది ఒక భాగమేనని గుర్తించామని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. ఇంటిలోని వారిని హత్య చేసిన దరిమిలా విశాల్ సింఘాల్ వారిపైనున్న బీమా మొత్తాన్ని పొందేందుకు వారు పలు ప్రమాదాల్లో మరణించినట్లు ఆధారాలు సృష్టించాడు. వీటి ఆధారంగా ఇప్పటికే రూ. 1.5 కోట్లు క్లెయిమ్ అందుకున్నాడని బిష్ణోయ్ తెలిపారు.ఆస్పత్రి యాజమాన్యంపై అనుమానాలుసింఘాల్ తన ఇంటిలోని వారి పేరుతో పలు జీవిత బీమా పాలసీలను తీసుకొని, వారిని రోడ్డు ప్రమాదానికి బలిచేసి, బాధితులను మీరట్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేవాడు. తరువాత బీమా చెల్లింపును క్లెయిమ్ చేసేవాడు. సింఘాల్ భార్య, అతని తండ్రి ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో మృతి చెందారు. ఇది అనుమానాలకు తావిస్తున్నదని, ఈ విషయంలో ఆస్పత్రి యాజమాన్యం పాత్రను పరిశీలిస్తున్నామని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. సింఘాల్ తండ్రి ముఖేష్ మరణించే సమయంలో అతని పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి.రికార్డులపై అనుమానంతో ఫిర్యాదు2024 మార్చిలో హాపూర్ పోలీస్ స్టేషన్లో సింఘాల్ తండ్రికి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదయ్యింది. దీనిలో అతను గర్హ్ముక్తేశ్వర్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడని పేర్కొన్నారు. అయితే అతని బీమా క్లెయిమ్ పత్రాలలో 2023, మార్చి 27న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని ఉంది. అయితే అతను అడ్మిట్ అయిన నవజీవన్ ఆసుపత్రి రికార్డులతో అతను రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చారని నమోదయ్యింది. దీంతో అనుమానం తెలెత్తిన ఒక బీమా సంస్థ ప్రతినిధి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘విశాల్ సింఘాల్ తెలిపిన వివరాలకు.. ఆసుపత్రి వర్గాలు అందించిన సింఘాల్ తండ్రి పోస్ట్మార్టం రిపోర్టుతో సరిపోలలేదు సంజయ్ కుమార్ పోలీసులకు తెలిపాడు.తండ్రి మరణించాక వాహన రుణాలు తీర్చేసిన నిందితుడుకాగా విశాల్ సింఘాల్ సమర్పించిన పత్రాలలో తండ్రి వయస్సు,ఐడీ వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయని, వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించడంలో విశాల్ విఫలమయ్యాడని హాపూర్ ఎస్పీ కున్వర్ జ్ఞానేందర్ సింగ్ తెలిపారు. ఈ కేసు మూసివేశామని, అయితే ఇప్పుడు కేసును తిరిగి తెరవడానికి కోర్టు అనుమతి లభించిందని తెలిపారు. భారీ బీమా స్కామ్ దర్యాప్తుకు సారధ్యం వహిస్తున్న సంభాల్ అదనపు ఎస్పీ అనుకృతి శర్మ మాట్లాడుతూ తండ్రి మరణానికి రెండు నెలల ముందు విశాల్ సింఘాల్ పేరుమీద టయోటా లెజెండర్, నిస్సాన్ మాగ్నైట్, బ్రెజ్జా, రాయల్ ఎన్ఫీల్డ్కు సంబంధించిన రుణాలు ఉన్నాయని, అయితే అవి అతని తండ్రి మరణం తర్వాత క్లియర్ అయ్యాయని అనుకృతి శర్మ తెలిపారు. విశాల్ సింఘాల్పై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. -
Gurugram: భార్యను హతమార్చి.. ఫ్రెండ్కు వీడియో సందేశం పంపి..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో క్షణికావేశంలో అఘాయిత్యాలకు, దారుణాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత తనను తాను అదుపు చేసుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక జీవితంలో ప్రశాంతత కరువై, తగిన నిర్ణయాలు తీసుకోలేక పలువురు ఆత్మహత్యలనే మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. గురుగ్రామ్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ తన భార్య స్వీటీ శర్మతో ఏదో విషయమై గొడవపడ్డాడు. తరువాత ఆవేశంతో ఆమె గొంతు కోసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. భార్యపై దాడిచేసిన అనంతరం నిందితుడు అజయ్ కుమార్ (30), తన స్నేహితునికి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియో సందేశం పంపాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నివాసి కుమార్కు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కు చెందిన స్వీటీ శర్మ(28)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.కాగా తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకోబోతున్నానని తనకు వీడియో సందేశం పంపాడని కుమార్ స్నేహితుడు పోలీసులు తెలిపాడు. కుమార్ పంపిన వీడియో సందేశంలో అతను భార్యతో గొడవ పడుతున్న దృశ్యాలున్నాయి. విషయం తెలియగానే పోలీసులు సెక్టార్ 37లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలో కుమార్ దంపతులుంటున్న ఫ్లాట్కు చేరుకున్నారు. స్వీటీ శర్మశర్మ మృతదేహం నేలపై పడి ఉండటాన్ని వారు గమనించారు. అక్కడ వారికి పదునైన కత్తి కూడా లభ్యమయ్యింది. కుమార్ సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు బావిస్తున్నారు. కాగా ఈ ఘటన వెనుక గల కారణం ఇంకా వెల్లడికాలేదు. అయితే స్వీటీ శర్మ కుటుంబ సభ్యులు కుమార్పై పలు ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'కాంతార' రిలీజ్కి రెడీ.. ప్రముఖ దేవాలయంలో రిషభ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
పెళ్లయి 3 ఏళ్లు.. పిల్లల్లేరని భర్తతో గొడవ
హైదరాబాద్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిన వివరాల ప్రకారం జనగాం జిల్లా మొండ్రాయి గ్రామానికి చెందిన ధరావత్ రాజేష్, శిరీష దంపతులు బోడుప్పల్ శ్రీలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లయి మూడేళ్లయినా సంతానం కలగలేదు. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన రాజేష్ ఈ నెల 20న ఉదయం భార్య బయటకు వెళ్లగానే..ఇంట్లోనుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో, తెలిసిన వారివద్ద వెతికినా ఫలితం కన్పించలేదు. ఈ మేరకు మంగళవారం భార్య శిరీష తన భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేరని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు. -
భర్త కంపెనీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అనురాధ
కొన్ని దశాబ్దాల క్రితం మారుతి వినాయక్ గోకర్ణ అనే యువ ఇంజినీర్ ఎన్నో కలలతో చిన్న కంపెనీ ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత వినాయక్ చనిపోవడంతో కంపెనీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వినాయక్ భార్య అనురాధ (Anuradha M Gokarn) కు వ్యాపార వ్యవహారాల గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు.‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన అనురాధ కంపెనీ నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకుంది. పాఠాలు చెప్పినంత తేలిక కాదు’ అన్నారు విమర్శకులు. అయితే కంపెనీ బాధ్యతలు తీసుకున్న తరువాత తానే ఒక గెలుపు పాఠం అయింది. అప్పుల బారిన పడిన కంపెనీని ఆరు సంవత్సరాల వ్యవధిలో లాభాల బాట పట్టించింది.కట్ చేస్తే...ఆ కంపెనీ పేరు... ట్రిటాన్ వాల్వ్(Triton Valves Ltd) మన దేశంలో ఆటోమోటివ్ టైర్ వాల్వ్లు, ఉపకరణాల తయారీలో అతి పెద్ద సంస్థ. వాహన పరిశ్రమకు అవసరమైన అత్యున్నతమైన టైర్ వాల్వ్లను అందించే ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది.‘నిన్న చేసిన పొరపాటు నేడు పాఠం అవుతుంది. నా వ్యాపార ప్రస్థానంలో అలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను’ అని తన సక్సెస్మంత్రా గురించి చెప్పింది అనురాధ గోకర్ణ.చదవండి: నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ బాలుడు -
భార్య చికెన్ వండలేదని యువకుడి ఆత్మహత్య
యర్రగొండపాలెం: భార్య చికెన్ వండలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్లలక్ష్మీనారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని చెప్పినా ఆమె చికెన్ వండకపోవడంతో లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురై పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
Kerala: భార్యను హతమార్చి.. ఫేస్బుక్ లైవ్లో..
కొల్లం: కేరళలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను ఆమె భర్తే హత్య చేసి, అనంతరం ఫేస్బుక్ లైవ్లో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన పునలూర్ సమీపంలోని కూతనాడిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలిని కొల్లం నివాసి షాలినిగా గుర్తించారు.భార్య షాలినిని హత్యచేసిన అనంతరం భర్త ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం షాలిని, ఐజాక్ దంపతుల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలున్నాయి. సోమవారం షాలిని స్నానం చేసేందుకు వెళుతున్నప్పుడు ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేసి, ఆమె మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు ఐజాక్ ఫేస్బుక్ లైవ్లో తన నేరాన్ని అంగీకరించాడు. షాలినిపై అపనమ్మకం ఏర్పడిందని ఆరోపించాడు.తరువాత ఐజాక్ నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని, తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే నిందితుని ఇంటికి చేరుకుని, షాలిని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. షాలిని, ఐజాక్ల 19 ఏళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుని, దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని, మృతురాలు, నిందితుని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుషాయిగూడలో దారుణం.. అర్ధరాత్రి అక్కఇంట్లోనే భార్యను...
కుషాయిగూడ(హైదరాబాద్): భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి నిద్రిస్తున్న ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అణుపురంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుధాకర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా, అడ్డగూడురు గ్రామానికి చెందిన బోడ శంకర్కు అదే మండలం గోవిందపురం గ్రామానికి చెందిన మంజులతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శంకర్ పెళ్లికి ముందు నుంచే ముంబైలోని అక్క ఇంట్లో ఉంటూ ఫ్లంబర్గా పనిచేసేవాడు. వివాహం అనంతరం భార్య మంజులను ముంబై తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై శంకర్ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ తరచూ భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక మంజుల ఈ నెల 14న ముంబై నుంచి ఏఎస్రావునగర్, అణుపురం కాలనీలో ఉంటున్న అక్క రాణి ఇంటికి వచి్చంది. దీంతో శంకర్ కూడా తన చిన్న కొడుకును వెంట తీసుకొని ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చి భార్యను కలిశాడు. శుక్రవారం రాత్రి మంజులకు వరుసకు సోదరుడైన తోటకూర నగేష్ ఇంట్లో పంచాయతీ చేసిన పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పారు. అనంతరం అందరూ కలిసి రాణి ఇంటికి తిరిగి వెళ్లారు. అందరూ నిద్రిస్తుండగా శంకర్ తన పక్కనే పడుకున్న మంజులపై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. మంజుల కేకలు విని కుటుంబ సభ్యులు మేల్కొనడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతురాలి సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా హత్య అనంతరం నిందితుడు ఇంటి నుంచి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పరారీలో ఉన్న నిందితుడు శంకర్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
భార్య కోసం 175కి.మీ. దాటి, చివరకు..
అన్యోన్యంగా ఉన్న ఆ ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే.. భార్య అతన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆ భర్త ఊర్లు దాటి వెళ్లాడు. పశ్చాత్తాపంతో.. బతిమాలైనా సరే ఆమెను వెనక్కి తీసుకువద్దామని అతను అనుకున్నాడేమో అని మీరు పొరపడేరు!. కానే కాదు.. షేక్ అంజాద్కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో.. ఆమె భర్తను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న ఆ భర్త.. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె దగ్గరకు చేరాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ.. బతిమాల సాగాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాడో ఏమో.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్ల గొడవను ఫోన్లో రికార్డు చేశాడు. అయితే.. భార్యతో సరదాగా మాట్లాడుతూనే ప్యాంట్ జేబులో ఉన్న కత్తిని అంజాద్ బయటకు తీశాడు. బతిమాలుతున్నట్లు కనిపిస్తూనే.. హఠాత్తుగా ఆమె గొంతు కోశాడు. ఆపై కోపంతో జుట్టు పట్టి లాగి నడిరోడ్డు మీదకు విసిరేశాడు. ఆ పరిణామంతో ఆ వీడియో రికార్డు చేసే వ్యక్తి సహా అక్కడున్నవాళ్లంతా అంతా హాహాకారాలు చేశారు. ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పారిపోయే ప్రయత్నం చేసిన ఆంజాద్ను పట్టుకుని పోలీసులకు అప్పప్పించారు. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నాం ఒడిశా బాలాసోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దంపతుల స్వస్థలం కటక్గా పోలీసులు ధృవీకరించుకున్నారు. మనస్పర్థలతోనే అతను అలా చేశాడని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు అంటున్నారు. ఆ భర్త గొంతు కోసిన వీడియో నెట్టింటకు చేరింది. -
కూరగాయలు కోసే కత్తితో భర్తను పొడిచిన భార్య
మణికొండ: తనను తరచూ వేధిస్తున్నాడనే కోపంతో భర్తను కూరగాయలు కోసే కత్తితో పొడిచి చంపేసింది ఓ భార్య. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి కోకాపేటలో జరిగింది. నార్సింగి ఇన్చార్జి సీఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన కృష్ణంజ్యోతి బోరా (30), బర్క బోరా భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కోకాపేటలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం భార్యను కొట్టి ఆమెతో గొడవ పడి ఇంట్లోంచి కృష్ణంజ్యోతి వెళ్లిపోయాడు. గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో వచ్చి తలుపులు కొట్టినా ఆమె తీయలేదు. తలుపులను కృష్ణంజ్యోతి బలంగా తన్నటంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. బర్క బోరాను కర్రతో కొట్టేందుకు యతి్నంచగా.. ఆమె పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతనిపై దాడి చేసింది. తల, మెడ, కుడి భుజంపై కత్తితో పొడవటంతో కృష్ణంజ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు వినిపించడటంతో లేబర్ క్యాంపులో ఉన్న చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికి అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నిందితురాలు బర్క బోరాని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పారిస్లో ఫుల్ రొమాంటిక్గా ఆది-నిక్కీ జోడీ (ఫొటోలు)
-
భార్య చేతులు కట్టేసి బెల్టుతో చితకబాదిన భర్త
ప్రకాశం జిల్లా: ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించడంతో స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచూ తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలను వదిలేసి వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. శనివారం రాత్రి కలుజువ్వలపాడు గ్రామానికి వచ్చిన బాలాజీ.. స్థానికంగా ఉండే బేకరీలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న భార్య భాగ్యలక్ష్మిని అటకాయించాడు.మద్యానికి డబ్బులు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె నిరాకరించడంతో బాలాజీలోని రాక్షసుడు నిద్ర లేచాడు. తన అక్క రమణ, మేనల్లుడు విష్ణు, బాలాజీ మరో భార్య కలిసి భాగ్యలక్ష్మిని బైకుపై బలవంతంగా ఎక్కించుకొని.. అక్క ఇంటికి తీసుకువెళ్లి తాళ్లతో నిర్బంధించాడు. రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు చిత్రహింసలకు గురిచేసి విడిచిపెట్టారు. మళ్లీ సోమవారం రాత్రి చిత్రహింసలు పెట్టేందుకు బాలాజీ యత్నించగా ఆమె తప్పించుకొని ఎస్సీ కాలనీలోకి పరుగెత్తింది. స్థానిక చర్చి వద్ద ఉన్న కొందరు యువకులు బాలాజీని, అతని మేనల్లుడిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక యువకులు 112కు ఫోన్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన పోలీసులు బాధిత మహిళను ఫొటో తీసుకుని బాలాజీ మేనల్లుడు విష్ణును బైక్పై ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వదిలేసినట్లు సమాచారం. శనివారం చేసిన చిత్రహింసను బాలాజీ రెండో భార్య వీడియో తీయగా అది మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కాగా మహిళను చిత్రహింసలకు గురిచేయడంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై విలేకరులతో తెలిపారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో ప్రచురితం కావడంతో దర్శి సీఐ, తర్లపాడు ఎస్సై కలుజువ్వలపాడు గ్రామానికి చేరుకున్నారు. బాధిత మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ప్రకాశం తర్లుపాడు మండలంలో కలుజువ్వలపాడు ఎస్సీ కాలనీలో దారుణం భార్యను కట్టేసి బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నిన భర్త#prakasham #tharlupadu #husbandkickswife #andhrapradesh #uanow pic.twitter.com/vqiLth1eOd— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 16, 2025 -
రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భర్త ఆస్తిలో వాటా వస్తుందా?
నా భర్త చనిపోయిన తరువాత భార్యను కోల్పోయిన ఒకతన్ని రెండవ పెళ్లి చేసుకున్నాను. మొదటి భర్తతో నాకు పదేళ్ల పాప, ఏడేళ్ల బాబూ ఉన్నారు. నా రెండవ భర్తకు కూడా 12 సంవత్సరాల పాప ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నా మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు రెండవ భర్తకు సహజ సంతానంగా లేదా దత్తత సంతానం అయిపోతారా? నా మొదటి భర్త ఆస్తిలో నాకు, నా ఇద్దరు పిల్లలకు వాటా వస్తుందా? నా మొదటి భర్తకి వారసత్వపు ఆస్తితోపాటు – స్వార్జితం ద్వారా కూడా ఆస్తులు ఉన్నాయి. రెండవ భర్త ఆస్తిలో నా సంతానానికి హక్కు ఉంటుందా? నా మొదటి భర్త అమ్మగారు అంటే మా అత్తయ్యగారు బతికే ఉన్నారు. ఆవిడది కూడా మా మామయ్యగారితో రెండవ వివాహమే! కానీ ఆమెకి మొదటి భర్తతో పిల్లలు లేరు. రెండవ వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో వాటా రాదు అని చట్టం ఉంది కాబట్టే ఆవిడకి కూడా తన మొదటి భర్త నుంచి ఆస్తి రాలేదని, నాకు కూడా అలాగే రాదని చెబుతోంది. అది నిజమేనా?– ఒక సోదరి, ఖమ్మం జిల్లాబహుశా మీ అత్తయ్యగారి మొదటి భర్త చనిపోయిన కాలంలో అది నిజం కావచ్చు. పూర్వం ’హిందూ వితంతు వివాహ చట్టం, 1856’ అని ఉండేది. అప్పట్లో అది చాలా విప్లవాత్మక చట్టం అయినప్పటికీ ఆ చట్టం ప్రకారం రెండవ పెళ్లి చేసుకున్న వితంతు మహిళకు మొదటి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండేది కాదు. కానీ ఈ చట్టం 1983లో రద్దు అయింది. ప్రస్తుత చట్టంలో వితంతు వివాహం/లేదా పునర్వివాహం చేసుకున్న స్త్రీకి మొదటి భర్త ఆస్తిపై ఉన్న హక్కులు తొలగిపోవు! అలా తొలగిస్తే అది రాజ్యాంగ స్పూర్తికే వ్యతిరేకం. కాబట్టి మీకు మాత్రం మీ మొదటి భర్త ఆస్తిలో ఒక భాగం వాటా ఉంటుంది. ఇక మీ పిల్లల విషయానికి వస్తే... మీరు రెండవ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం రెండవ భర్తకు చెందరు. ఒకవేళ రెండవ భర్త నిజమైన తండ్రిగా వ్యవహరించాలి అని మీరు అనుకుంటే, మీరు మీ పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వవలసి వస్తుంది. అయితే దత్తత ఇచ్చేసిన తర్వాత సాధారణ పరిస్థితిలో అయితే దత్తత ఇవ్వబడ్డ పిల్లలకు వారి సహజ తల్లిదండ్రుల ఆస్తులలో (పూర్వీకుల ఆస్తిలోనైనా లేక స్వార్జితంలో అయినా) ఎటువంటి హక్కు ఉండదు. కానీ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిలో మాత్రం దత్తపుత్రులకు/దత్త పుత్రికకు వారి సహజ సంతానంతో సమానంగా హక్కు ఉంటుంది. అంటే మీ రెండవ భర్తకి మీరు దత్తత ఇస్తే ఆయన తదనంతరం (వీలునామా రాయకుండా మరణిస్తే) ఆస్తిలో తన సొంత కూతురితో సమానంగా మీ పిల్లలకు కూడా చెరొక వాటా వస్తుంది. దత్తత ఇచ్చే సమయానికి ఒకవేళ మీ మొదటి భర్త ఆస్తిలో పంపకాలు జరిగి మీ పిల్లలకి ఆ ఆస్తి ఇప్పటికే వచ్చి ఉన్నట్లయితే, వారిని దత్తత ఇచ్చేసినప్పటికీ కూడా వారి ఆస్తి వారి వద్దనే ఉంటుంది. అంటే మీరు ముందుగా మీ మొదటి భర్త నుండి సంక్రమించే ఆస్తిని పంచుకుని తర్వాత పిల్లల్ని దత్తత ఇస్తే పిల్లలకి నష్టం వుండదు. ఎందుకంటే మీ రెండవ భర్త తన ఆస్తిని తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మీ పిల్లలకి ఇవ్వకపోతే వారు చేయని తప్పుకి పిల్లలు బలయ్యే అవకాశం ఉంది కదా! ఈ విషయాలు అన్నింటిని మీ మొదటి భర్త తల్లిగారికి వివరించండి. ఒప్పుకోని పక్షంలో మీరు పార్టిషన్ సూట్ ద్వారా మీ హక్కును అలాగే మీ పిల్లల హక్కును కూడా కాపాడుకోవచ్చు. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే పైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసులలో పూర్తి పత్రాలతో, సమాచారంతో దగ్గరలోని లాయర్ని కలవడం అవసరం. -
మాస్క్ మ్యాన్ చాలా సాఫ్ట్ ..! నన్ను నిజంగానే కొట్టాడు కానీ..! మాస్క్ వెనుక అసలు కథ!
-
Hyderabad: అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసిన భర్త
-
నాగోల్లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం జరిగింది. భర్త తన భార్య గొంతును కోసిన ఘటన నాగోల్లో చోటు చేసుకుంది. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.గత యాడాది క్రితమే మహాలక్ష్మి(20)కి వేణుగోపాల్తో వివాహమైంది. అదనపు కట్నం తేవాలంటూ పెళ్ళైన నెల నుండే భార్యపై భర్త పలుమార్లు దాడి చేశాడు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా భర్త తీర మారలేదు. వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను’.. చార్లీ కిర్క్ భార్య భావోద్వేగ ప్రసంగం..
వాషింగ్టన్: ‘నీ ఆశయాన్ని అంతం కానివ్వను..ఈ దేశం ఇప్పటివరకు చూడని గొప్ప విషయంగా దానిని మారుస్తాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తన భర్తను గుర్తుచేసుకుంటూ భావోద్వేగంతో అన్నారు. బుధవారం యుటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరైన రైట్ వింగ్ కార్యకర్త, డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. చార్లీ కిర్క్ హత్య అనంతరం అతని భార్య ఎరికా కిర్క్ తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు.తన భర్త పాడ్కాస్ట్ను హోస్ట్ చేసే కార్యాలయం నుండి ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. తాను అమెరికాను, ఇక్కడి ప్రకృతిని, చికాగో కబ్స్ను అమితంగా ప్రేమిస్తున్నానని అన్నారు. తన భర్త చార్లీ తనను, పిల్లలను హృదయపూర్వకంగా ప్రేమించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తను హత్య చేసినవారిని పట్టుకున్న చట్ట అమలు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడు టైలర్ రాబిన్సన్ ను ఉద్దేశిస్తూ ఆమె ‘నాలో రగులుతున్న అగ్ని గురించి నీకు తెలియదు. ఈ వితంతువు రోదనలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ నాదాలుగా ప్రతిధ్వనిస్తాయి’ అంటూ ఎరికా కిర్క్ కన్నీరు పెట్టుకున్నారు.ఎరికా 2021లో చార్లీ కిర్క్ను వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. తన భర్త ట్రంప్ను అమితంగా ఇష్టపడేవారని, తన భర్త అందించిన రేడియో షో, పాడ్కాస్ట్ను కొనసాగిస్తూ, తన భర్త ఆశయాలను సజీవంగా ఉంచుతానని ఆమె పేర్కొంటూ, ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఆయనకు అండగా నిలిచారు. ఆయన కూడా మీ కోసం పనిచేశారు అని ఎరిక్ అధ్యక్షుడు ట్రంప్తో అన్నారు. -
భార్యతో వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న జవాన్ డైరెక్టర్ అట్లీ (ఫొటోలు)
-
ముహూర్తం కోసం వచ్చి అనంతలోకాలకు..
ఎర్రుపాలెం/కంచికచర్ల: కుమారుడి వివాహానికి ముందు ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజల తేదీ ఖరారు చేసేందుకు గురువు వద్దకు వచ్చి ఆనందంతో తిరిగి వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బైక్ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి దామినేని కుమారి(45), శ్రీనివాసరావు(54) భార్యాభర్తలు. శ్రీనివాసరావు వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె ఉమాదేవి, కుమారుడు చంద్రశేఖర్ ఉన్నారు. కుమార్తె వివాహం తమ గ్రామానికే చెందిన సాయితో జరిపించారు. ఇక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్కు ఇటీవల వివాహం కుదిరింది. కుమారుడి వివాహానికి ముందు తమ ఇంట్లో వెలసిన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు శ్రీనివాసరావు, కుమారి దంపతులు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో ఉన్న ఓ పూజారి వద్దకు వచ్చి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆపై బైక్పై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఎర్రుపాలెం – తక్కెళ్లపాడు మధ్య ఎదురుగా వచ్చిన కోళ్ల లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతుల తలలకు తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారా అంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది. కాగా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ గని ఆత్కూరులో శ్రీనివాసరావు, కుమారి మృతదేహాల వద్ద నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
శృతిమించిన ‘జెన్జీ’ నిరసనలు.. మాజీ ప్రధాని భార్యను చంపేశారు
కాఠ్మాండు: నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగిన ఘోర ఘటన కలకలం రేపుతోంది. ఆందోళన కారులు నేపాల్ రాజధాని కాఠ్మాండూలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ ఆందోళనకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా,అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ చేపట్టిన ఉద్యమంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. మాజీ ప్రధాని కేపీఓలీతో పాటు పలువురు మంత్రులు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కాఠ్మాండూలోని డల్లూ ప్రాంతంలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ ఇంటిని ముట్టడించారు. ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ను ఇంట్లో బంధించి, ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న రాజ్యలక్ష్మిని కిర్తిపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జెనరేషన్ జెడ్ ఆందోళనలతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో పలువురు జెనరేషన్ జెడ్ ఆందోళనల్ని సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై ‘మానవత్వానికి మాయన మచ్చ’అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
భార్య అశ్లీల వీడియో ఫోన్లో పెట్టుకున్నాడని సహచరుడిని చంపేశాడు..!
కర్ణాటక: తన భార్య అశ్లీల వీడియోను సేకరించిన సహ కార్మికున్ని ఇనుప రాడ్ కొట్టి చంపాడో వలస కార్మికుడు. మంగళూరు నగరంలో సూరత్కల్లో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్ చెందిన ముఖేశ్ మండల్ (27) హతుడు. ఇతడు లక్ష్మణ్ అలియాస్ లఖన్ (30) భార్య అశ్లీల వీడియోను తీసుకొని తన ముబైల్ ఫోన్లో పెట్టుకున్నాడు. ఈ విషయం లక్ష్మణ్కు తెలిసింది. ' దీంతో జూన్ 24న రాత్రి ఇద్దరూ బాగా మద్యం తాగారు. మత్తులో ఉండగా ఇనుప రాడ్ బాది హత్య చేసి, శవాన్ని ఓ సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. ఆగస్ట్ 21న మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. హంతకుడు లక్ష్మణ్ తమిళనాడులో దాగి ఉండగా సూరత్కల్ పోలీసులు వెతికి పట్టుకున్నారు. -
భర్తను హత్య చేసిన మూడో భార్య.. కంగుతిన్న రెండో భార్య!
బోపాల్: మూడో భార్య చేతిలో హత్య గురయ్యాడు 60 ఏళ్ల వృద్ధుడు. వివాహేతర సంబంధం కారణంగా భర్తను వదిలించుకోవాలనే ప్రణాళిక చేసిన మూడో భార్య దాన్ని ప్రియుడితో కలిసి అమలు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలోని సకారియా గ్రామంలో చోటు చేసుకుంది. 60 ఏళ్ల భయాలాల్ రజాక్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య అతని నుంచి విడిపోతే రెండో భార్యగా గుడ్డి బాయ్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వారికి సంతానం కలగకపోవడంతో సొంత చెల్లినిచ్చి భర్తకు మూడో వివాహం చేసింది రెండో భార్య. మూడో భార్యగా మున్ని( విమ్లా) వచ్చింది. వీరి మధ్య కొన్నాళ్ల వివాహ సంబంధం బాగానే సాగింది. ఈ క్రమంలోనే వారికి పిల్లలు కూడా కలిగారు. కానీ మూడో భార్య మున్ని.. స్థానిక ప్రాపర్టీ డీలర్ నారాయణ దాస్ కుష్వాహ్(లల్లూ)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి భర్త భయాలాల్ రజాక్ను అంతమొందించాలని ప్రణాళిక రచించారు. దీనిలో భాగంగా ఆగస్టు 30వ తేదీ అర్థరాత్రి దాటక లల్లూ.. రజాక్ను హత్య చేశాడు. కిరాయి మాట్లాడుకున్న 25 ఏళ్ల ధీరజ్ కోల్తో కలిసి రజాక్ను తలపై బలంగా కొట్టి హత్య చేశారు. ఆపై శారీలో కట్టి ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉన్న బావిలో పడేశారు. అయితే భర్త కనిపించడం లేదని రెండో భార్య గుడ్డి భాయ్ వెతకడం ప్రారంభించిన క్రమంలో ఒక బావిలో శారీలో కట్టేసిన మూట కనిపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చెల్లి మున్నీనే చేసి ఉంటుందని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటకొచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. -
భార్యతో కలిసి ‘ఓనం’ సెలబ్రేట్ చేసుకున్న సంజూ శాంసన్ (ఫొటోలు)
-
దూకమన్న భర్త! ఆ భార్య ఏం చేసిందంటే..
ఆ భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో.. ఆమెను అతగాడు చితకబాదేశాడు. దీంతో ఏడుస్తూ ఆ భార్య ఇంటి మేడ మీదకు చేరింది. అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించింది. దమ్ముంటే దూకమంటూ ఆ భర్త ఆమెకు చాలెంజ్ చేస్తూ పదే పదే చెప్పసాగాడు. కట్ చేస్తే.. ఆమె అన్నంత పని చేసింది. ఉత్తర ప్రదేశ్ అలీబాగ్లో దారుణం జరిగింది. గోండా ఏరియా దాకౌలి గ్రామంలో రెండతస్తుల మేడ మీద నుంచి దూకిన ఓ మహిళ.. ఆస్పత్రి పాలైంది. భార్యభర్తల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. భర్త కొట్టడంతో ఆమె ఏడుస్తూ మిద్దెపైకి చేరిందని, అక్కడి నుంచి దూకుతానని బెదిరించిందని, దూకి చావమని భర్త అనడంతో ఆమె అన్నంత పని చేసిందని, భూమిని బలంగా తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే కిందపడిన తర్వాత కూడా ఆమెపై భర్త దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ చిన్నారి మమ్మీ.. మమ్మీ.. అంటూ ఏడుస్తూ కనిపించాడు. మహిళ తరఫు బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై కేసు నమోదైంది.अलीगढ़ : महिला छत से कूदी, परिजनों का आरोप उकसाकर कूदने पर किया मजबूर। कूदने का वीडियो वायरल, महिला गंभीर घायल। ससुराल पक्ष के खिलाफ थाने में दी तहरीर, थाना गोंडा इलाके के दमकोली गांव की घटना। #Aligarh pic.twitter.com/twWG6yKtuq— Akash Savita (@AkashSa57363793) September 3, 2025 -
'హ్యూమన్ స్కిల్స్' లేవన్న నాగచైతన్య.. వంటమాస్టర్లా శోభిత (ఫోటోలు)
-
16ఏళ్ల ముచ్చటైన కాపురం...రీల్స్ పిచ్చితో ఏడాదిలో సర్వ నాశనం
ఒకప్పుడు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టడానికి చుట్టాలో, చుట్టుపక్కల వారో కారణమయేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా సోషల్ మీడియానే తీసుకుంది. హాయిగా సాగిపోతున్న ఓ చక్కని కాపురంలో రీల్స్ పేరిట చిచ్చు రాజుకుంది. చివరకు భర్తను హత్య చేసేందుకు సైతం తెగించేలా ఓ భార్యను ప్రేరేపించింది.ఈ ఘటన గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియా బాద్లో ఉన్న పారిశ్రామిక వాడ లోనీలో నివసిస్తూ, తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు 29 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆ కేసుకు సాక్ష్యంగా నిలిచిన 16 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉండగా, ఆ మహిళ అతనిపై కత్తితో దాడి చేస్తోంది. అక్కడే ఉన్న మరో చిన్నారి ఆమెని అడ్డుకుంటూ నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.బతుకు జీవుడా అంటూ భార్య కత్తి దాడి నుంచి తప్పించుకున్న అశోక్ విహార్ నివాసి అయిన అనీస్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇష్రాత్ను 2009లో వివాహం చేసుకున్నానని, అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామని, తమకు తొమ్మిది, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన భార్య 2024లో ఇన్స్ట్రాగామ్ను డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి తమ ఇంట్లోని పరిస్థితులు డౌన్ కావడం మొదలయ్యాయని వెల్లడించాడు. భార్య వ్లాగర్గా మారడంతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయయని , రీల్స్ షూట్ చేయడానికి కొత్త ఉపాయాలను కనుగొనే క్రమంలో తరచుగా తమ దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు వాదనలను కూడా ఆమె పోస్ట్ చేసేదని తెలిపాడు. కాలక్రమేణా తన భార్యకు సోషల్ మీడియా ఫాలోయింగ్పై వ్యామోహం బాగా పెరిగిపోయిందని, ఆ క్రమంలో ఇంటి పనులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై అడిగినందుకు తరచుగా తన వంటిపై తానే గ్యాసోలిన్ పోసుకుని ఛస్తానని బెదిరించడం, అలాగే గోడకు తల కొట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టిందని వివరించాడు.కొన్నిసార్లు, ఆమె అకస్మాత్తుగా విద్యుత్ తీగను పట్టుకునేదని, గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేదని అతను వెల్లడించాడు. తన భార్య గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి రీల్స్ చేస్తోందని అది సరికాదని తాను దానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వారు తనను చంపేస్తామని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా, మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లోనీ ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు. -
భార్యపై యాసిడ్ దాడి.. భర్తకు మరణ శిక్ష
ఉదయపూర్: భార్యను పలు రకాలుగా వేధిస్తూ, ఆమెపై కర్కశంగా యాసిడ్ దాడి చేసిన భర్తకు కోర్టు మరణశిక్ష విధించింది. భార్య శరీరపు రంగును తూలనాడుతూ, ఆమె స్థూలకాయాన్ని హేళన చేస్తూ, హీనంగా ప్రవర్తించిన భర్త కోర్టు తీర్పు మేరకు ఉరికంబం ఎక్కనున్నాడు.రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన లక్ష్మి అనే మహిళను రంగు తక్కువ ఉన్నావంటూ, ఆమె భర్త కిషన్ తరచు ఎగతాళి చేసేవాడు. ఒక రోజు రాత్రి కిషన్ ఏదో ద్రావకం(యాసిడ్) తెచ్చి.. భార్యతో శరీరమంతా పూసుకోవాలని చెప్పాడు. ఆమె దానిని రాసుకుంది. అయితే ఏదో దుర్వాసన వస్తున్నదని భర్తకు చెప్పింది. తరువాత భర్త ఆమె కడుపుపై అగరుబత్తిని వెలిగించాడు. దీంతో ఆమె శరీరం అంతటా మంటలు వ్యాపించాయి. తరువాత మరికొంత యాసిడ్ను ఆమె శరీరంపై పోశాడు. దీంతో ఆమె మంటల్లో కాలి బూడిదయ్యింది.ఈ ఘటనకు సంబంధించి ఉదయ్పూర్లోని వల్లభ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. నిందితుడు కిషన్ను అరెస్టు చేసిన పోలీసులు అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ పలివాల్ మాట్లాడుతూ ‘నిందితుడు తన భార్య నల్లగా ఉన్న కారణంగా, ఆమెను వేధించేవాడని, ఈ క్రమంలోనే ఆమెపై యాసిడ్ పోసి నిప్పంటించాడని అన్నారు. తీవ్ర గాయాలతో ఆమె మరణించిందన్నారు. ఈ ఘటనలో నిందితునికి కోర్టు న్యాయమూర్తి మరణశిక్ష విధించారు. -
విడాకులపై క్లారిటీ ఇచ్చిన గౌతమీ.. టాలీవుడ్ హీరోపై భార్య సంచలన ఆరోపణలు..!
-
బర్త్ డే గిఫ్ట్ కోసం గొడవ..భార్యను హత్య చేసిన భర్త!
చిన్నపాటి గొడవలు.. ఆపై క్షణికావేశ హత్యలు. దీనికి అన్నింటికీ కారణం అహం. మనలోని అహం మనల్ని మనిషిగా నాశనం చేయడమే కాదు.. మన కోసం వచ్చిన వారిని కూడా దూరం చేస్తుంది. సర్దుకుపోదాం.. ఉన్నంతలో బతుకుదాం అనే ఆలోచన నేటి తరంలో చాలా అరుదుగా కనిపిస్తున్నట్లే ఉంది. భర్త చెప్పిన మాట వినలేదని భార్య, తన మాట భర్త వినలేదని భార్య.. ఇలా ఏదొక సందర్భాన్ని ఆసరాగా ఘర్షణలు పడటం జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది.ఇలా భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఊచలు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అర్థం పర్థం లేని గొడవ. కొడుకు బర్త్ డే గిఫ్ట్ విషయంలో గొడంపడ్డ భర్త.. భార్యను హత్య చేశాడు. ఆపై తన అత్తను కూడా పొట్టనుపెట్టుకున్నాడు.ఢిల్లీలోని రోహిణి సెక్టార్-17లో యోగేష్ సెహగాల్ అనే వ్యక్తి.. తన కుమారుడు బర్త్ డే విషయంలో భార్య ప్రియా సెహగాల్(34)తో గొడవ పడ్డాడు. కుమారుడు బర్త్ డే ముందస్తు ఏర్పాట్లులో భాగంగా భార్యతో ఘర్షణ పడ్డాడు. దాన్ని సర్దిచెప్పడానికి అత్త కుసుమ్ సిన్హా(63) కూతురి ఇంటికి వచ్చింది. ఆమెతో పాటు కొడుకు, అంటే యోగేష్కు బావమరిది మేఘ్ సిన్హా కూడా వచ్చాడు. అక్కడ అల్లుడిని ఏదో రకంగా ఒప్పించింది అత్త. అయితే అక్కడ మేఘ్ ఉండటంతో ఆ సమయంలో యోగేష్ పెద్దగా ఏమీ మాట్లాడకుండానే రాజీ పడ్డాడు. మనసులో మాత్రం అక్కసును పెట్టుకున్నాడు. మేఘ్ సిన్హా వెళ్లిపోవడంతో మళ్లీ గొడవ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే భార్య కూడా తల్లిని వెనకేసుకొచ్చింది. దాంతో భార్యను, అత్తను చంపేశాడు. మేఘ్.. తల్లితో మాట్లాడదామని ఫోన్ చేశాడు. తల్లి ఫోన్ ఎత్త లేదు.. అక్కకు చేశాడు.. అక్క కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన మేఘ్.. తిరిగి మళ్లీ ఘటనా స్థలికి వచ్చేసరికి తలుపులు లాక్ చేసి ఉన్నాయి. అనుమానంతో పోలీసులకు కాల్ చేయడంతో వారు డోర్స్ ఓపెన్ చేశారు. తల్లి, అక్క ఒక రూమ్లో పడి ఉండటంతో బావ హత్య చేశాడనే విషయం అర్థమైంది. దీనిపై ఫిర్యాదుతో యోగేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నపాటి బర్త్ డే గొడవతో ఇలా జంట హత్యలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం యోగేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. -
హైదరాబాద్లో మరో దారుణం.. లవర్తో కలిసి భర్తను చంపేసింది
సాక్షి, హైదరాబాద్: సరూర్నగర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భార్య.. భర్తను హతమార్చింది. కోదండరాంనగర్ రోడ్డు నెం.7లో ఈ ఘటన జరిగింది. మృతుడు జెల్లెల శేఖర్ (40)గా పోలీసులు గుర్తించారు. భార్య చిట్టి(33)ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. శేఖర్ మృతదేహం ఉస్మానియా మార్చురీకి తరలించారు.భర్తను చంపిన తర్వాత నిద్రలోనే చనిపోయాడంటూ 100 నంబర్కు భార్య డయల్ చేయగా.. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. మృతుడి భార్యను పోలీసులు పలు ప్రశ్నలు వేశారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. -
భార్యతో కలిసి ఇన్వెస్ట్ చేసే పోస్టాఫీసు ప్రత్యేక స్కీమ్..
అసలుకు ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడినిచ్చే పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో ఎన్నో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది రెపో రేటును 1 శాతం తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో వరుసగా కోతలు విధించింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై వడ్డీని బ్యాంకులు తగ్గించాయి. కానీ పోస్టాఫీసుల్లో పథకాల వడ్డీ రేట్లు మాత్రం మారలేదు.సురక్షితమైన పెట్టుబడితో ప్రతి నెలా స్థిర ఆదాయం కోరుకునే వారి కోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకం ఉంది. అదే పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్) ఈ పథకంలో ఒకసారి ఏకమొత్తంలో మొత్తంలో పెట్టుబడి పెడితే దానిపై వడ్డీ ప్రతి నెలా వారి పొదుపు ఖాతాలో నేరుగా జమవుతుంది. ఈ పథకం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత అసలు మొత్తం తిరిగి లభిస్తుంది. ఈ స్కీమ్లో ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్ ద్వారా అయితే రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.వడ్డీ ఎంత వస్తుందంటే..పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ 7.4% వార్షిక వడ్డీని (ఆగస్టు 2025 నాటికి) అందిస్తుంది. పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ప్రతి నెలా గ్యారెంటీ వడ్డీని ఇస్తుంది. ఉదాహరణకు భార్యభర్తలిద్దరూ కలిసి ఉమ్మడి ఖాతాలో రూ .15 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా సుమారు రూ .9,250 వడ్డీ వస్తుంది. ఈ పథకం ప్రత్యేకమైనది ఎందుకంటే దాని వడ్డీ రేటు స్థిరంగా, బ్యాంకు కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి పెట్టుబడి చాలా సురక్షితం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందడం వల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది. -
కుటుంబ సమేతంగా గణపతి పూజలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
‘సమాజం కోసం రాజీ పడితే.. చివరికి మనిషే లేకుండా పోయింది’
న్యూఢిల్లీ: తన సోదరి నిక్కీ భాటి దారుణ హత్యకు గురి కావడంపై సోదరుడు రోహిత్ గుర్జార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరి నిక్కీ భాటిని శాశ్వతంగా తిరిగి పుట్టింటికి తీసుకొచ్చినట్లైతే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నాడు. తన సోదరి నిక్కీ భాటి విషయంలో తాము రాజీ పడే బ్రతికామని, అందుకు ఇంతటి దారుణం జరిగిపోయిందన్నాడు. సమాజానికి జడిసి తన సోదరిని పుట్టింటికి తీసుకురావడంలో వెనుకడుగు వేశామన్నాడు. సమాజంలో తమ పరువు పోతుందనే ఆలోచించాం కానీ సోదరీ పడే బాధను పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. ‘మేము మా సోదరీమణులు నిక్కీ, కాంచనాల కోసం రూ. 8 లక్షల ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించాం. ఆ పార్లర్లు పెట్టించి సుమారు ఏడాదిన్నర అవుతుంది. బావలు విపిన్, రోహిత్ భాటిలకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. వారి కుటుంబానికి చిన్న కిరాణా దుకాణం మాత్రమే ఉంది. కానీ మా చెల్లెళ్లు వారి స్వయం శక్తితో పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. భర్తల నుంచి ఎటువంటి నగదు అడగకుండానే కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మా చెల్లెళ్ల పార్లర్లను అత్త మామలు ధ్వంసం చేశారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు సోదరుడు గుర్జార్.భర్త విపిన్ భాటి బాధలు భరించలేక చాలాసార్లు తిరిగి పుట్టింటికి వచ్చేదని, కానీ వారు మళ్లీ బుజ్జగింపు మాటలు చెప్పి తిరిగి తీసుకెళ్లిపోయేవారని నిక్కీ భాటి కుటుంబం తెలిపింది. అతి దారుణంగా హత్య.. యూపీ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో పరిధిలో సిర్సా గ్రామంలో విపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు.మరో రూ. 35 లక్షలు కావాలని వేధింపులుమరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేసి చివరికి అతి దారుణంగా ఒంటికి నిప్పంటించి హత్య చేశారు.యాసిడ్ పోసి లైటర్తో అంటించి కన్నకొడుకు కళ్లముందే భార్యను తగలబెట్టాడు -
భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ!
శరీరంలో కీలకమైన ఏదైనా అవయవం పాడైపోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్నపుడు అవయవ మార్పిడి ఒక్కటే మార్గం. అలా దానం చేసే అవకాశం ఉన్న ఆవయవాల్లో ముఖ్యమైనవిగా కిడ్నీలు, లివర్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తమ అవయవాలను దానం చేయడంమంటే అవతలివ్యక్తికి ప్రాణ దానం చేయడమే. కానీ భర్తను కాపాడుకునేందుకు తన అవయవాన్ని దానం చేసిన సంతోషం.. అంతలోనే విషాదంగా మారింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోనిఒక ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.భర్తకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన ఒక మహిళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులకే మరణించింది. దీనితో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె ఆదివారం తెలిపారు. గ్రహీత, దాత వివరాలు, వారి వీడియో రికార్డింగ్లు, చికిత్స విధానం అన్నింటి వివరాలను అందించాలని ఆసుపత్రిని కోరామని చెప్పారు.ఈ కేసులో భర్త, రోగి బాపు కోమ్కర్, అతనికి లివర్ దానం చేసిన భార్య కామిని ఆగస్టు 15న ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కర్ ఆరోగ్యం క్షీణించి, ఆగస్టు 17న మరణించాడు. మరోవైపు ఇన్ఫెక్షన్ కారణంగా కామిని ఆగస్టు 21న కన్నుమూసింది. దీనికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బంధువులిద్దరి మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్ల ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి పేర్కొంది. దర్యాప్తులో అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని వివరించింది. అనేక సమస్యలతో బాపు కోమ్కర్ చాలా తీవ్రమైన పరిస్థితిలో తమ వద్దకు వచ్చాడని, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా క్లిష్టమైన ఆపరేషన్అని పేర్కొన్నారు. ఈ విషంలోవారికి పూర్తిగా అన్ని విషయాలు వివరించి కౌన్సెలింగ్ అందించామని ఆసుపత్రి పేర్కొంది. దురదృష్ట వశాత్తు, మార్పిడి తర్వాత గ్రహీతకు కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని తెలిపింది. అలాగే కామిని తొలుత బాగా కోలుకున్నప్పటికీ, సెప్టిక్షాక్ కారణంగా చనిపోయిందని వెల్లడించింది. కానీ ఈ కష్టకాలంలో బాధిత కుటుంబంపై తమకు సానుభూతి ఉందని తెలిపింది. నోట్ : ప్రస్తుత సమాజంలో అవయవ దానం ఆవశ్యకత బాగా పెరుగుతోంది. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా పూర్తి అవగాహనతో అవయదానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులోకు కుటుంబ సభ్యులు, ఇతర అర్హులైన వారు ముందుకు రావాలి. దాని కంటే ముందు అనారోగ్య పరిస్థితి మరింత ముదరకుండా జాగ్రత్త పడటం, చక్కటి జీవనశైలి అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
నోయిడా మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
భార్యను హత్య చేసి.. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి..!
న్యూఢిల్లీ: వరకట్న వేధింపులతో భార్యను హత్య చేసిన ఓ భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య నిక్కీ భాటిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భర్త విపిన్ భాటి పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భార్యను చంపినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేని అతను తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. దాంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయాలపాలయ్యాడు. అతన్ని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పరిధిలో గ్రేటర్ నోయిడాలోవిపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు. కాగా, మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధిస్తున్నారేది ప్రధాన ఆరోపణ. -
భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త
-
పుష్ప మూవీ ఫేమ్ జాలి రెడ్డి బర్త్ డే.. సతీమణి స్పెషల్ విషెస్ (ఫొటోలు)
-
భర్తను చంపిన భార్య
మొయినాబాద్: డెయిరీ ఫామ్లో పనిచేస్తున్న ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది. శవాన్ని బావి పక్కన పడేసి, సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో శనివారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. అజీజ్నగర్కు చెందిన సామ రాజిరెడ్డి రెండు నెలల క్రితం డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ఇక్కడ పనిచేసేందుకు ఓ జంట కావాలని బిహార్కు చెందిన పవన్ను సంప్రదించాడు. అతని ద్వారా నెల క్రితం రాజేశ్కుమార్, పూనందేవి దంపతులను పనికి కుదుర్చుకున్నాడు.గత గురువారం రాజిరెడ్డి డెయిరీ ఫామ్కు వెళ్లగా రాజేశ్కుమార్ దంపతులతోపాటు మరో వ్యక్తి కనిపించాడు. అతను తమ బంధువని చెప్పడంతో సరేనని ఊరుకున్నాడు. శుక్రవారం ఫామ్కు వెళ్లిన యజమానికి రాజేశ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడని పూనందేవిని అడగగా మద్యం తాగివచ్చి, తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లాడని చెప్పింది. సాయంత్రం ఫామ్ వద్దకు వెళ్లిన రాజిరెడ్డికి పనివాళ్లెవరూ కనిపించలేదు.ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో శనివారం ఏజెంట్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఫోన్ చేసిన పవన్.. పూనందేవి, మహేశ్సాని అలియాస్ గుడ్డు అనే వ్యక్తి కలిసి రాజేశ్ను చంపి, బావి వద్ద పడేశారని చెప్పాడు. రాజిరెడ్డి వెళ్లి చూడగా రాజేశ్కుమార్ మృతదేహం కనిపించింది. రాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ జబ్బుకి మందు కనిపెట్టండి ప్లీజ్!
భార్యను బాడీ షేమింగ్ చేయడంఎప్పటి నుంచో ఉంది. శరీర ఆకృతిని బట్టి పేర్లు పెట్టి పిలుస్తూ వేధిస్తారు భర్తలు. తాజాగా ఒక భర్త మరీ శృతి మించాడు. భార్యను నోరా ఫతేహీలా మారమని రోజుకు మూడు గంటలు జిమ్ చేయిస్తున్నాడు. జిమ్ చేయలేని రోజు పస్తు పెడుతున్నాడు. గర్భం వస్తే అబార్షన్కూ వెనుకాడటం లేదు. ఘజియాబాద్లో ఆ భార్య పోలీస్ స్టేషన్కు వచ్చి ‘ఈ భర్త నాకు వద్దు’ అని ఫిర్యాదు చేసింది.అంతా నచ్చి, అన్నీ చూసి వివాహం చేసుకున్నాక భర్తలకు వస్తున్న ఈ పాడు జబ్బుకు మందు వెతకాలి. భార్య పొట్టిగా ఉంటే ఒక నిక్నేమ్, సన్నగా ఉంటే మరొకటి, నల్లగా ఉంటే... లావుగా ఉంటే... పొడవుగా ఉంటే... పలు వరుస సరిగా లేకపోతే... జుట్టు పలుచగా ఉంటే... శరీర అంగాలు పెద్దవో చిన్నవో ఉంటే... భర్తలు వాటిని కేంద్రంగా చేసుకుని నిక్నేమ్స్తో పిలుస్తూ ఇంట్లో, పిల్లల ఎదుట, బంధువుల సమక్షంలో ఆట పట్టించడం ఆనవాయితీ. దీనికి అంగీకారం ఉండటం మన సంప్రదాయం. ఆ నిక్నేమ్స్ ఏదో సరదాగా పెట్టినట్టు అనిపించినా, భర్త అలా పిలవడంలో ఏదో గారాబం కనిపించినా, ఆ పేర్లన్నీ భార్యను బాడీ షేమింగ్ చేసేవే. భార్య తన భర్తకు నిక్నేమ్ పెట్టదు. పెట్టలేదు. పెట్టి నలుగురిలో పిలిస్తే పర్యవసానాలు మనకు తెలుసు. కాని భర్తలు మాత్రం భార్యలను బాడీ షేమింగ్ చేయడం తమ హక్కుగా భావిస్తూ ఉంటారు.ఫిట్నెస్ వేరు... అందం వేరుభార్యాభర్తలు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాల్సిందే. పిల్లలు పెరిగి ఒక వయసు వచ్చాక శారీరక మార్పులు స్త్రీ, పురుషుల్లో వస్తాయి. ఫిట్నెస్ కోసం కనీస వ్యాయామం, వాకింగ్, ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ఇరువురూ పాటించాల్సిందే. భార్య ఫిట్నెస్ కోసం భర్తలు సూచనలు చేయడం, వ్యాయామం కోసం ప్రోత్సహించడం మంచి విషయం. కాని సౌందర్యాభిలాషతో, ఇతర స్త్రీలతో పోలుస్తూ... ఈ విధంగా ఉంటే నువ్వు బాగుంటావు... లేకుంటే నచ్చవు అనే సందేశం ఇస్తున్నట్టుగా మాట్లాడటం ఆమెను హింసించడమే. జన్యువుల వల్ల, శరీర తత్వం వల్ల కొందరు స్త్రీల శరీరంలో వ్యాయామంతో తగ్గని బరువు ఉండొచ్చు. లేదా కాన్పుల వల్ల, మెనోపాజ్ వల్ల కూడా తీవ్రమైన మార్పులు రావచ్చు. వాటిని అర్థం చేసుకుని, భార్య ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి తప్ప అనునిత్యం కించ పరుస్తూ ఉంటే తప్పు,.. నేరం కూడా. కాని భర్తలు ఈ విషయంలో మారడం లేదు. సొంత పిల్లల ఎదుట కూడా భార్యను గేలి చేస్తూ పిల్లలు ఆమెను తేలిగ్గా తీసుకునేలా చూస్తున్నారు.నోరా ఫతేహీలా ఉండుకాని ఆగస్టు 20వ తేదీన ఒక భార్య ఆవేదన ఇలాంటి భర్తల స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఒక వివాహిత అక్కడి మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చి భర్త మీద కేసు పెట్టింది. ఆమె తన ఫిర్యాదులో– ‘నేను ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్నాను. నా భర్త ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. పెళ్లిలో మా వాళ్లు 6 లక్షల బంగారం, 24 లక్షల స్కార్పియో, 10 లక్షల రొక్కం ఇచ్చారు. కాని పెళ్లయి వచ్చినప్పటి నుంచి నన్ను నా భర్త నోరా ఫతేహీ ఫిగర్లాంటిది సాధించాలని వేధిస్తున్నాడు. ఇందుకోసం నాకు రోజుకు 3 గంటల వర్కవుట్ చెప్పి చేయిస్తున్నాడు. ఆ వర్కవుట్లు చేసి అలసి ఏ రోజైనా చేయకపోతే ఆ రోజు నాకు అన్నం పెట్టడం లేదు. అత్తామామలు కూడా అతనికి వంత పాడుతున్నారు. నేను చూడటానికి బాగానే ఉంటాను. కాని అతను అది చాలదని, పిల్లలు కూడా ఇప్పుడే వద్దని, గర్భం వస్తే అబార్షన్ చేయించుకోవాలని చెబుతూ నన్ను భయభ్రాంతం చేస్తున్నాడు. ఈ భర్త వద్దు’ అని ఫిర్యాదు చేసింది.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుఆరోగ్యం, అనురాగంభార్యాభర్తల మధ్య ఉండాల్సింది అనుబంధం, అనురాగం, గౌరవం. వారిరువురూ తమ బంధాన్ని బలపరుచుకుంటూ పరస్పరం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జీవిస్తే రూపం సమస్య కాబోదు. రూపదోషాల నిర్వచనం ఒకరి సొత్తు కాదు. కొలతలతో ఉండేదే ఆకృతి కాదు. సంతోషకర దాంపత్యమే అందం, ఆనందం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్
-
అతడొక దుర్మార్గుడు: ముసుగు మనిషి భార్య
కర్ణాటక : డబ్బుల కోసం ఆశపడి ఎవరో అన్నమాటలను పట్టుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఫిర్యాదిదారు, ముసుగుమనిషి ఒకప్పటి భార్య ఆరోపించింది. అతనితో విడాకులు తీసుకున్న మండ్య జిల్లా నాగమంగళకు చెందిన మహిళ తన మాజీ భర్త గురించి మీడియాతో మాట్లాడారు. అతనిది కూడా మండ్య జిల్లానే. 25 ఏళ్ల కిందట మేం పెళ్ళి చేసుకున్నాం, అతడు నేత్రావతి స్నానాల ఘాట్లను శుభ్రం చేసే పనిలో ఉండేవాడు. 7 సంవత్సరాలపాటు కలిసి ఉన్నాం, మాకు ఒక మగ, ఒక ఆడ పిల్ల ఉన్నారు, కుమార్తెకు పెళ్లయింది. నా మాజీ భర్త నా మీద నిత్యం అనుమానంతో గొడవపడేవాడు, అతని బాధలు పడలేక విడాకులు తీసుకున్నా. అతడు ధర్మస్థల గురించి చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడింది. ఆ మాటలే వినలేదు ధర్మస్థలలో అత్యాచారాలు జరిగేవని, నది పక్కన శవాలు పాతిపెట్టారని, నగలు దోచుకునేవారని నేను ఎప్పుడూ వినలేదు. నాతో భర్త ఎప్పుడూ అలా చెప్పలేదు. జరిగే ప్రచారమంతా అబద్ధం అని ఆమె పేర్కొంది. ఆ పుణ్యక్షేత్రం మీద ఏదో చేయడానికి కుట్రతో ఇలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తాము విడిపోయిన తరువాత అతడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. భరణం కోసం కోర్టుకు వెళ్తే, నాకు జీతమే రాదు, భోజనం మాత్రమే పెడతారు, ఏమీ ఇవ్వలేను అని కోర్టులో చెప్పాడన్నారు. పుట్టింటిలో తల్లి, పిల్లలతో కలిసి ఉంటున్నట్లు తెలిపింది. -
భార్య బాలీవుడ్ భామలా ఉండాలని.. విపరీతంగా వ్యాయామం చేయించి..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విచిత్ర వేధింపుల ఘటన చోటుచేసుకుంది. తన భర్త, అత్తామామలు తనను రోజూ మూడు గంటల పాటు వ్యాయామం చేయాలంటూ ఒత్తిడి తెస్తారని, కాదంటే తనకు ఆహారం పెట్టరని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది.ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన షాను(25) తన భర్త స్త్రీలోలుడని, ఇంటర్నెట్లో మహిళల అనుచిత వీడియోలను చూస్తుంటాడని ఆరోపించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహీలా ఉండాలంటూ తనను వేధిస్తుంటాడని తెలిపింది. అధిక వ్యాయామం కారణంగా తనకు గర్భస్రావం అయ్యిందని ఆమె వాపోయింది. 2025, మార్చి 6న షానుకు శివం ఉజ్జ్వల్ో వివాహం జరిగింది. షాను కుటుంబం ఈ వివాహం కోసం రూ. 76 లక్షలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేసింది. కట్నం కింద రూ. 16 లక్షల విలువైన నగలు, రూ. 24 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ. 10 లక్షల నగదు ఇచ్చారు.అత్తవారింటిలోకి అడుగుపెట్టిన షాను అక్కడ పలు ఇబ్బందులను ఎదుర్కొంది. షాను అత్త ఆమెను నిత్యం ఇంటి పనుల్లో బిజీగా ఉంచేది. శివంతో బయటకు వెళ్లేందుకు అనుమతించేదికాదు. ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయిన శివం ఒకరోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, షాను మంచానికి దోమతెర అమర్చకపోవడంతో షానును అక్కడే వదిలేసి తన తల్లిదండ్రుల గదిలోనికి వెళ్లిపోయాడు. తరువాత అత్తమామలు ఆమెను తీవ్రంగా నిందించగా, భర్త ఆమెను కొట్టాడు. తాను అందంగానే ఉన్నప్పటికీ బాడీ షేమింగ్కు గురయ్యానని అమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లోని మహిళల అభ్యంతరకరమైన వీడియోలను చూస్తుంటాడని ఆమె పేర్కొంది.బాలీవుడ్ భామ నోరా ఫతేహి లాంటి శరీరం కోసం తనచేత ప్రతిరోజూ మూడు గంటల పాటు వ్యాయామం చేయించేవాడని, ఏదైనా కారణంతో ఒక రోజు వ్యాయామం మానివేస్తే ఆహారం పెట్టేవారి కాదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. శివం అతని తల్లిదండ్రులు తరచూ నగదు, భూమి, నగలు డిమాండ్ చేస్తుంటారని షాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
వేములవాడ రాజన్న సన్నిధిలో కేసీఆర్ సతీమణి (ఫొటోలు)
-
hit and run: భార్య మృతదేహాన్ని బైక్కు కట్టి.. నిందితుల్ని ఆటకట్టించిన AI
ముంబై: కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో హృదయ విదారక వీడియో వైరల్గా మారింది. హిట్ అండ్ రన్ ఘటనలో భార్యను కోల్పోయిన భర్త, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని బైక్పై తాళ్లతో కట్టి తరలించాల్సి వచ్చింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ కేసులో నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషించింది. మహారాష్ట్ర పోలీసులకు 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకునే అవకాశం కల్పించింది.మహారాష్ట్ర నాగపూర్లో మోర్ఫాటా ప్రాంతానికి సమీపంలో నాగ్ పూర్-జబల్ పూర్ జాతీయ రహదారిపై ఓ ట్రక్కు అమిత్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య గ్యార్సితో కలిసి బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో,వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీ కొట్టింది. సంఘటన స్థలంలోనే గ్యార్సి మృతి చెందింది.అమిత్ తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారిని సాయం కోసం వేడుకున్నాడు. కానీ ఎవరూ స్పందించకపోవడంతో, తన భార్య మృతదేహాన్ని బైక్ వెనక భాగానికి తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్లోని తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది వైరల్ అయింది. పోలీసులు చివరకు అమిత్ను ఆపి, మృతదేహాన్ని నాగ్పూర్లోని మాయో ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం తరలించారు.ఈ హిట్ అండ్ రన్ ఘటనలో ఏఐ నిందితుల ఆటకట్టించింది. రక్షాబంధన్ రోజున (ఆగస్టు 9) తాను, తన భార్య గ్యార్సితో కలిసి బైక్పై వెళుతుండగా రెడ్ కలర్ ట్రక్.. తన బైక్ను ఢీకొట్టిందని, ట్రక్ తన భార్య గ్యార్సిని తొక్కుకుంటూ వెళ్లిందని అమిత్ యాదవ్ పోలీసులకు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ఏఐని వినియోగించారు. మూడు టోల్ ప్లాజాల నుంచి ఘటన జరిగిన 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సీసీ టీవీఫుటేజీ సేకరించారు. ఆ సీసీటీవీఫుటేజీని కంప్యూటర్ విజువల్ టెక్నాలజీ ఆధారంగా రెండు ఏఐ అల్గారిథమ్ను ఉపయోగించారు.ఏఐ మొదటిగా ఎరుపు గుర్తులు ఉన్న ట్రక్కులను గుర్తించింది. రెండవది ట్రక్కుల సగటు వేగాన్ని విశ్లేషించి అనుమానాస్పద ట్రక్కును గుర్తించింది. ఈ ఆధారంగా ఒక ట్రక్కును గుర్తించి, నాగ్పూర్ నుంచి 700 కిమీ దూరంలో గ్వాలియర్-కాన్పూర్ హైవే వద్ద దాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫలితంగా 36 గంటల్లో పోలీసులు.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కటకటాల్లోకి పంపించారు. A 35-year-old man tied his wife's lifeless body to his bike after she was run over by a speeding truck in #Nagpur and his cry for help went unnoticed by passersby.pic.twitter.com/CmuC3F9l9U— Hate Detector 🔍 (@HateDetectors) August 11, 2025 -
చీరలో మెరిసిపోతున్న జహీర్ ఖాన్ భార్య (ఫోటోలు)
-
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
ఢిల్లీ మెట్రో రైలు ఎక్కిన కేంద్ర మంత్రి బండి దంపతులు.. కారణం ఏంటంటే..
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు న్యూఢిల్లీలో మెట్రో రైలులో ప్రయాణించారు. వాస్తవానికి ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లోని తన నివాసం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంది. అయితే, భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీవల్ల ఢిల్లీలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రోటోకాల్ కాన్వాయ్ను పక్కన పెట్టి సతీమణి బండి అపర్ణతో కలిసి సమీపంలోని శివాజీ స్టేడియం వద్దనున్న మెట్రో స్టేషన్కు వెళ్లారు. అక్కడ టిక్కెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కి ఢిల్లీలోని ఏరో మెట్రో స్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టులోకి వెళ్లి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పయనమయ్యారు. -
నేను టీడీపీ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ని..!
సాక్షి, గుంటూరు: టీడీపీ జెండా పట్టుకుంటే చాలు.. ఎంతటి మోసం, అన్యాయం, అక్రమమైనా చేయొచ్చనే భావనతో పొన్నూరులో పచ్చ పార్టీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు కుడి భుజం(రైట్ హ్యాండ్) అని చెబుతూ తిరిగే తన భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఓ మహిళ వాపోయింది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు సార్లు, స్థానిక పొన్నూరు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ... పొన్నూరు మండలం అలూరు గ్రామానికి చెందిన తనకు సుమారు ఎనిమిదేళ్ల క్రితం పౌల్రాజుతో ప్రేమ వివాహమైందని చెప్పారు. భర్త పంచాయితీ పనులకెళ్తూ, ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు కుడి భుజమని చెబుతున్నాడని పేర్కొన్నారు. కట్నకానుకల కింద పాండ్రపాడులోని రెండెకరాల పొలం, పది తులాల బంగారం తమవారు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరేళ్ల క్రితం కొంత పొలాన్ని రూ.19 లక్షలకు విక్రయించి రాజకీయాల్లో తిరిగి ఖర్చు చేశాడని తెలిపారు. మరో ఎకరం విక్రయించేందుకు అంగీకరించకుంటే కాపురానికి రానివ్వ బోనని, తనను, తన బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఎవరికై నా దీనిపై ఫిర్యాదు చేసినా చంపేస్తానని, తర్వాత స్టేషన్లో లొంగిపోతానని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పేరు చెప్పి తీవ్రంగా బెదిరించేవాడని కన్నీరు మున్నీరయ్యారు. గత నెల 11వ తేదీన మరణాయుధంతో దాడికి పాల్పడగా, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. భర్త వద్దనే తమ కుమార్తె కూడా ఉందని పేర్కొన్నారు. తనకు కుమార్తెను అప్పగించాలని వేడుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భర్త, అతని కుటుంబ సభ్యుల నుంచి తనను, తన వారిని కాపాడి న్యాయం చేయాలని కోరారు.ఆస్తుల కోసమే తనను పెళ్లి చేసుకున్నట్లు భర్త పలుమార్లు చెప్పాడని బాధితురాలు వివరించారు. తక్కువ కులం దానినంటూ నోటికొచ్చినట్లు ధూషించేవాడని వాపోయారు. చిత్రహింసలకు గురిచేయడంతోపాటు, తన కుటుంబ సభ్యులను ఇంటికి రానిచ్చేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడటానికి కూడా అంగీకరించేవాడు కాదని వాపోయారు. స్నేహితులతో కలిసి నిత్యం మద్యం తాగొచ్చి, వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వేధించేవాడని తెలిపారు. -
వన్డే వరల్డ్కప్-2025కి సిద్ధమైన బుమ్రా సతీమణి సంజనా (ఫొటోలు)
-
భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు
భార్యామణికోసం, ఆమె ప్రేమకోసం అందమైన ప్రేమ మందిరాన్ని నిర్మించిన ఘనత మనది. ఉద్యోగం ఒక లెక్కా అనుకున్నాడో ఏమోగానీ తాజాగా గర్భవతి అయిన జీవిత భాగస్వామి కోసం కోటి రూపాయలిచ్చే ఉద్యోగాన్ని ఒక భారతీయుడు. కోటి రూపాయల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఘటన నెట్టింట సందడిగా మారింది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందించారు.గర్భవతిగా ఉన్న భార్యను చూసుకోవడానికి అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశానంటూ ఇండియన్ పెట్టిన రెడ్డిట్పోస్ట్ వైరల్గా మారింది. జయనగర్లో రూ. 1.2 కోట్ల జీతం, వర్క్ఫ్రం హోంఅ యినా భార్యకంటే ఇవేవీ ముఖ్యం కాదు అంటూ రాసుకొచ్చాడుఅతగాడు.. తన భార్య గర్భధారణ ప్రయాణంలో ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. గర్భం అని తెలియగానే మొదట ఉద్యోగం వదిలేయమని అడిగిన భార్య ఆ తరువాత ఉద్యోగం చేయాలని కోరిందని అయితే ఆమెను కంటికిరెప్పలా కాపాడుకునేందుకు తానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే తనకున్న పరిచయాలు, ,అనుభవంతో ఎప్పుడైనా మార్కెట్లోకి తిరిగి రాగలననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. లైఫ్లో సరైన సమయంలో సరైన ప్లేస్లో ఉండటం చాలా ముఖ్యమైందంటూ తన పోస్ట్ను ముగించాడు. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను కూడా కొన్ని పంచుకున్నాడు. ‘‘కాలేజీ డ్రాపౌట్, స్టార్టప్లలో పనిచేస్తూ 7 సంవత్సరాలలో 0 నుండి 7కోట్లకు చేరుకున్నా’’ అని తెలిపాడు.ఇదీ చదవండి: లండన్నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే అతని నిర్ణయాన్ని చాలామంది అభినందించినప్పటికీ, ఈ నిర్ణయం తీసుకునే స్థోమతలో అందరూ ఉండరని చాలామంది వ్యాఖ్యానించారు. “మీరు.. మీ భార్య అదృష్టవంతులు, కానీ అందరి స్టోరీ ఒకేలా ఉండదు. చాలామందికి ఉద్యోగాలను కోల్పోవడం చాలా దుర్భరం, “ చాలా బాగుంది, జీవిత ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఇది ఉత్తమ నిర్ణయం అని నేను భావిస్తున్నాను, జీవిత వాస్తవ అనుభవం లేదా కేవలం అనుభవానికి మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి అంటి కొందరు అభినందనలు తెలిపారు. “తెలివైన మనిషి!తక్కువ ఒత్తిడితో కూడిన సంపాదన అవకాశాలను అన్వేషించే వీలు చిక్కుతుంది. ఇది మీ బిడ్డను చూసుకుంటూ మీరు సంపాదించేలా చేస్తుంది.’’ అని మరొకరు విషెస్ తెలిపారు. -
భార్య మృతదేహాన్ని బైక్కు కట్టి... మానవత్వమా నీవెక్కడ?
నాగ్పూర్: రక్షాబంధన్ వేళ ఆ భార్యాభర్తలు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ, జాతీయ రహదారిపై బైక్పై వెళుతున్నారు. ఇంతలో ఊహించని విధంగా ఒక ట్రక్కు వారి బైక్ను బలంగా ఢీకొంది. సంఘటనా స్థలంలోనే భార్య కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు సాయం చేయాలంటూ ఆ మార్గంలో వెళుతున్నవారినందరినీ ఆమె భర్త సాయం కోసం అభ్యర్థించాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు, అతనికి సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అంతటి నిస్సహాయ స్థితిలో ఆ భర్త ఏం చేశాడు?ఈ దుర్ఘటన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మోర్ఫాటా ప్రాంతం సమీపంలోని నాగ్పూర్-జబల్పూర్ జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో గ్యార్సి అమిత్ యాదవ్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమె భర్త అమిత్ యాదవ్ నిశ్చేష్టుడైపోయాడు. సహాయం కోసం కనిపించిన అందరినీ ప్రాధేయపడ్డాడు. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అమిత్ తన భార్య మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనం వెనుక భాగానికి తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్లోని తమ స్వగ్రామానికి బయలుదేరాడు. అమిత్ జాతీయ రహదారిలో బైక్పై భార్య మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. A video showing Amit transporting his wife's body tied to his motorcycle has gone viral on social media.#Wife #Accident https://t.co/wNwuj33TJk— News18 (@CNNnews18) August 11, 2025మొదట్లో అమిత్కు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే అతను భార్య మృతదేహాన్ని మోటార్సైకిల్పై తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన చాలా మంది అతని బైక్ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అమిత్ అందుకు నిరాకరిస్తూ, బైక్ను ముందుకు పోనిచ్చాడు. హైవే పోలీసులు అమిత్ వాహనాన్ని గమనించి, ఆపమని కోరారు. అయినా అమిత్ వారి మాటను లేక్కచేయలేదు. కొంతదూరం వరకూ పోలీసులు అతని బైక్ను వెంబడిస్తూ ఎట్టకేలకు బైక్ను ఆపించారు. అనంతరం పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం నాగ్పూర్లోని మాయో ఆసుపత్రికి తరలించారు. అలాగే అమిత్కు తగిన సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఈ ఘటన ప్రస్తుత కాలంలో అడుగంటుతున్న మానవత్వాన్ని ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు. -
ప్రియుడ్ని ఇంటికి పిలిచి.. దారుణంగా హత్య చేసిన మహిళ!
సాంభాల్: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాంభాల్లో మరో హత్యోందంతం వెలుగుచూసింది. నైతికత మరిచి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ప్రియుడ్ని పక్కా పథకం ప్రకారం అడ్డు తొలగించుకునే యత్నం చేసింది ఓ మహిళ, ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్, ;పట్టకారు సాయంతో హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల అనిష్ అనే వ్యక్తికి సితార అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అతని వద్ద నుంచి రూ. 7 లక్షలను సితార తీసుకుంది. ఆ సొమ్మును ఇవ్వాలని అనిష్ పదే పదే అడగడంతో సితార ప్రణాళిక రచించింది. అప్పు తీసుకున్న విషయం భర్త రాయిస్ అహ్మద్కు కూడా తెలిసినదే కావడంతో హత్యా రచన అనేది ఇద్దరూ కలిసే చేశారు. ఈ క్రమంలోనే అనిష్ను ఇంటికి పిలిచింది సితార. ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కట్టేసి స్క్రూ డ్రైవర్, ఇంటిలోని ఇతర వస్తువుల సాయంతో అనిష్ను హత్య చేశారు. వివాహేతర సంబంధమే కారణం..ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆమె ఇంటికి తరుచు వస్తూ పోతూ ఉండే అనిష్ను అడ్డు తొలగించుకోవాలని సితార భావించింది. దీనిలో భాగంగానే ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం అనిష్ హత్య కేసులో నిందితులుగా ఉన్న భార్యా భర్తల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.రూ. 7 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకే..అయితే అనిష్ కుటుంబ సభ్యులు మాత్రం సితారతో వివాహేతర సంబంధం గురించి తమకు తెలియదని అంటున్నారు. ఆమె తమకు తెలుసున్న వ్యక్తి అని, ఆ క్రమంలోనే అనిష్ వద్ద నుంచి రూ. 7 లక్షలను అప్పుగా తీసుకుందని అంటున్నారు. ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడిగినందుకే తన కుమారుడు అనిష్ను పొట్టనపెట్టుకున్నారని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. చాలా దారుణంగా తన తనయుడ్ని హత్య చేశారని, డబ్బులు అడిగినందుకే ఇంత ఘోరానికి ఒడిగట్టారని, అంతకుమించి తనకు తెలియదని తండ్రి తెలిపారు. తన కుమారుడి పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఈ క్రమంలోనే ఇచ్చిన అప్పును అడగడానికి వెళుతున్నట్లు తమకు చెప్పాడని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. -
ఆలయంలో అజిత్ దంపతుల ప్రత్యేక పూజలు.. కాళ్లకు నమస్కరించిన భార్య!
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత సినిమాలకు కాస్తా విరామం ప్రకటించారు. ఈ సమయంలో ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా అజిత్ తన భార్య షాలినితో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తన భార్యకు నుదుట తిలకం దిద్దారు. ఆమె కూడా అజిత్ కాళ్లకు నమస్కరించి భర్త ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఈ వీడియోను అజిత్ భార్య తన షాలిని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. నా హదయాన్ని కరిగించిందంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అజిత్, షాలిని 1999లో అమర్కాలం అనే మూవీ సెట్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరు 2000 సంవత్సరంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు స్వస్తి పలికింది. ఈ ఏడాది రెండు హిట్ తన ఖాతాలో వేసుకున్న అజిత్.. మరో మూవీని ఇంకా ప్రకటించలేదు. విరామం దొరికితే చాలు కారు రేసింగ్లోనూ దూసుకెళ్తున్నారు మన స్టార్ హీరో. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) Made for each other ❤️ The cutest duo ever - Thala Ajith & #Shalini Mam 🥰#AjithKumar #ShaliniAjithKumar pic.twitter.com/QqBfYXQjx9— AJITH FANS COMMUNITY (@TFC_mass) August 9, 2025 -
విశాఖలో ఆటీన్ రాణులు
విశాఖ సిటీ: విశాఖ ఆటీన్ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగి్చకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లే్ల పేకాట డెన్లు ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భార్య పేకాటపై భర్త ఫిర్యాదు ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది.భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు. -
వంట బాగోలేదనడం వేధింపెలా అవుతుంది?
వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఈ మధ్య ఆసక్తికరమైన తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నదే. తాజాగా.. బాంబే హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ భార్య పెట్టిన క్రిమినల్ కేసును సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కొట్టేసింది. ఈ క్రమంలో భార్య వంట బాగా లేదని, సరైన దుస్తులు ధరించడం లేదని అనడం వేధింపుల కింద రాదని పేర్కొంది. 2022 మార్చిలో ఆ జంటకు వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. ఆమె భర్త నుంచి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ తరుణంలో తన భర్త, అత్తమామలు, భర్త తరఫు బంధువులపై 498A కింద కేసు పెట్టింది. ఈ కేసు చివరకు బాంబే హైకోర్టుకు చేరింది. వివాహం జరిగిన నెల నుంచే తాను అత్తింట్లో వేధింపులు ఎదుర్కొన్నానని.. తన భర్త తాను వంట బాగా చేయడం లేదని, దుస్తులు సరైనవి ధరించడం లేదని సూటిపోటి మాటలతో వేధించాడని ఆమె కోర్టులో వాపోయింది. పైగా భర్తకు శారీరక, మానసిక సమస్యలు ఉన్న విషయం తన దగ్గర దాచారని, ఇంటి కొనుగోలు కోసం రూ.15 లక్షలు తేవాలని అతని కుటుంబ సభ్యులు.. బంధువులు హింసించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ పిటిషన్ను విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్.. శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తనపై వేధింపులను ఆమె ఏరకంగానూ నిరూపించలేకపోయిందని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘భార్య దుస్తులు సరిగా వేసుకోలేదని.. వంట సరిగా చేయలేదని తిడుతుంటాడని కొందరు భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తుంటారు. అయితే వీటిని మేం తీవ్రమైన క్రూరత్వంగా, వేధింపులుగా పరిగణించలేం’’ అని జస్టిస్ విభా కంకన్వాడి, జస్టిస్ సంజయ్ ఏ. దేశ్ముఖ్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఆమెకు ఇది రెండో వివాహం. 2013లో విడాకులు తీసుకున్న పిటిషనర్.. 2022లో మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన నెలకే వైవాహిక జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె చెబుతున్నారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు "ఓమ్నిబస్" (సారవంతం లేని) విధంగా ఉన్నాయి. తగిన సాక్ష్యాలు లేకపోగా.. ఆమెవన్నీ అతిశయోక్తితో కూడిన ఆరోపణలనే అనే విషయం ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. వివాహానికి ముందు భర్త ఆరోగ్య స్థితి గురించి చెప్పలేదని ఈమె చెబుతోంది. కానీ, ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు అసలు విషయాన్ని బయటపెట్టాయి. అలాగే ఇల్లు కొనుగోలు కోసం డబ్బుకై వేధించారని చెబుతోంది. కానీ, అప్పటికే అతనికి ఓ ఇల్లు ఉంది. అలాంటప్పుడ ఇంటి కోసం వేధించాల్సిన అవసరం ఆ భర్తకు ఏముంది?.. వివాహ సంబంధం బలహీనపడినప్పుడే ‘వంట, దుస్తులు బాగోలేవనే..’ అతిశయోక్తులు జోడించబడతాయి. ఇలాంటి సందర్భాల్లో కేసులు వేయడం అంటే.. చట్టాన్ని అడ్డుపెట్టకుని భర్త, అతని కుటుంబాన్ని వేధించడమే అవుతుంది అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే సదరు భర్తపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
విశాఖలో ఆటీన్ రాణులు
విశాఖ సిటీ: విశాఖ ఆటీన్ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగి్చకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లే్ల పేకాట డెన్లు జూద క్రీడ అంటే టక్కున గుర్తొచ్చేది మగ మహరాజులే. ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భార్య పేకాటపై భర్త ఫిర్యాదు ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది. భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు. -
యూఎస్లో డైరెక్టర్ సుకుమార్ దంపతులు (ఫోటోలు)
-
భార్య పేకాట ఆడుతుందంటూ భర్త ఫిర్యాదు
సాక్షి,విశాఖ: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట ముఠా గుట్టు రట్టైంది. టాస్క్ ఫోర్స్, ఫోర్త్ టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా పేకాట ఆడుతున్న మహిళలు స్థానికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆగడాల్ని తట్టుకోలేని పేకాట ఆడుతున్న ఓ మహిళ భర్త సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయారు. పేకాట ఆడటం.వాగ్వాదానికి దిగడం.. అడ్డు చెప్పిన వారిపై దాడులకు తెగబడ్డారు.ఈ క్రమంలో స్థానికులు వరుస ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
జూలై రౌండప్.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బుమ్రా భార్య సంజనా (ఫొటోలు)
-
పోలీసులా రాక్షసులా వాళ్ళు.. చంద్రబాబుపై అశోక్ బాబు భార్య ఫైర్
-
లవర్ తో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
-
ఆ భార్య బారి నుంచి దేవుడే రక్షించాడేమో!
ఆ జంటకు పెళ్లై 16 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంతూరిలో ఇల్లు ఉండి కూడా.. సిటీలోనే కాపురం పెట్టాలన్న ఆమె కోరికను తీర్చాడా భర్త. అయినా ఎందుకనో ఆమె భర్తపై చంపేయాలన్నంత కసి పెంచుకుంది. భర్త హత్యకు గుండాలకు సుపారీ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో.. భర్త బతికిపోగా, ఆమె ప్లాన్ బయటపడింది.భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య ఉదంతంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ బరేలీలోని ఓ ఆస్పత్రిలో రాజీవ్ పని చేస్తున్నాడు. జులై 21వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అతనిపై గుంపుగా వచ్చిన 11 మంది దాడి చేసి చితకబాదారు. అతని కాళ్లు, చేతులు విరగొట్టి కార్లలో సీబీ గంజ్ ఏరియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. కనీసం సాయం కోసం అరవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు రాజీవ్. అక్కడే సజీవంగా పాతేయాలని గొయ్యి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు ఆ గుండాలు. ఇంతలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. ఆ బ్యాచ్ను చూసి గట్టి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. కంగారుపడిపోయిన ఆ దుండగులు రాజీవ్ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆపై ఆంబులెన్స్కు కాల్ చేసిన ఆ అపరిచితుడు.. రాజీవ్ను ఆస్పత్రిలో చేర్పించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజీవ్.. కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు. బహుశా.. దేవుడే ఆ ఆజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి తనను రక్షించి ఉంటాడని కన్నీటి పర్యంతం అవుతున్నాడు రాజీవ్.రాజీవ్ తండ్రి ఇజ్జత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాడి చేసిన 11 మందిలో రాజీవ్ సొంత బావమర్దులే ఐదుగురు ఉండడం విశేషం. రాజీవ్ భార్య సాధన ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. గత కొంతకాలంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే ఆమె భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలియాల్సి ఉంది. స్థానికులు ఆ భార్యభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధన, ఆమె సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదీ చదవండి: కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!ఇదీ చదవండి: పడక సుఖం ఇవ్వని భర్తను ఆ భార్య ఏం చేసిందంటే.. -
హీరో భార్య 'అనొద్దన్న సెలబ్రిటీ వైఫ్'.. మిగిలిన హీరోల భార్యలు..?
ఓ పెద్ద నటుడు, మరీ ముఖ్యంగా అగ్ర హీరోల భార్యలుగా మారడం చాలా మందికి అదృష్టం కావచ్చు అయితే కొందరు మాత్రం కేవలం వారి భార్యలుగా దక్కిన అదృష్టంతో మాత్రమే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించడంలో మన మాధ్యమాలు తరచుగా విఫలమవుతుంటాయి. ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వంటింటికి మాత్రమే పరిమితమైన గృహిణి ఆకాంక్షలు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత కూడా గడపదాటి తనను తాను నిరూపించుకుంటూ సాగిపోయే వివాహిత ఆకాంక్షలు మరోలా ఉంటాయి అనేది నిర్వివాదం. ఏ వ్యక్తి అయినా తాను సాధించిన విజయాలకు, ప్రత్యేకతలకు తగ్గ వ్యక్తిగత గుర్తింపును ఆశించడం సహజం. దీనికి మగ, ఆడ వ్యత్యాసం లేదు. ఈ నేపధ్యంలో తాజాగా మళయాళ నటుడు ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ తాజాగా ఇచ్చిన ఒక సంచలనాత్మక ప్రకటన ప్రస్తావనార్హం.ప్రసార మాధ్యమాలతో పాటు అనేక మంది తనను తరచుగా ప్రృధ్వీరాజ్ భార్యగా పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను కేవలం ఒక టాప్ హీరో, నటుడు, సినీ ప్రముఖుడు ‘పృథ్వీరాజ్ భార్య‘గా మాత్రమే పరిగణన పొందాలనే దానిని కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు తన స్వంత కెరీర్లో ఒక విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని ఆమె బహిరంగంగానే స్పష్టం చేశారు. ఆమె తనకంటూ స్వంత ఇమేజ్ సృష్టించుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. ఏ మగవాడికి సంబంధించి అయినా ‘అతని భార్య‘, ‘అతని తల్లి‘ లేదా ‘అతని కుమార్తె‘గా తగ్గిపోకూడదని ఆమె అంటున్నారు.పూర్వ జర్నలిస్ట్, ప్రస్తుత చిత్ర నిర్మాత, పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్కు సహ యజమాని అయిన సుప్రియా, ‘ఎల్2: ఎంపురాన్‘ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇవే కాక తన కంటూ స్వంత వృత్తిపరమైన విజయాలు ఉన్నప్పటికీ, నిరంతరం తన భర్త పేరుతోనే గుర్తించబడటం అనేది తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆమె ధైర్యంగా వెల్లడించడం హర్షణీయం.ఇలా ఒక అగ్రహీరో భార్య బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది నిజంగా ఒక గేమ్ ఛేంజర్ కావచ్చు. మహిళల స్వయం సాధికారత గురించి మాట్లాడే ఉపన్యాసాలు దంచే ఎందరో ప్రముఖులు వారి భార్యలు సాధిస్తున్న విజయాలను తమ సెలబ్రిటీ స్టేటస్ మాటున బలిచేస్తున్న పరిస్థితి ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు నటుల భార్యలు హీరోయిజం అనే షాడో మాటున తమని తాము కోల్పోకుండా వ్యక్తిగత విజయాల కోసం తపిస్తుండడం కనిపిస్తోంది. ఉదాహరణకు టాలీవుడ్ హీరో రామచరణ్ భార్య ఉపాసన, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ... వంటివారు వ్యక్తిగతంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటున్నారు. జీవిత భాగస్వామికి మాత్రమే కాదు తమ కష్టాల ఫలితంగా అందుకున్న తమ వ్యక్తిగత విజయాలకూ గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు.. అది.. మహిళ అయినా మగవారైనా.. -
కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!
వికారాబాద్: తనను వివాహం చేసుకుంటానని భర్త నుంచి దూరం చేసిన ప్రియుడు ఆ తర్వాత మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఈ విషయమై మంగళవారం తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని, తనకు న్యాయం చేయాలని కోరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఇదే ఊరికి చెందిన మరో యువకుడు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం ఆమెను కర్ణాటకకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన నెల రోజుల తర్వాత సదరు యువతి భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పాడు. దీంతో యువతిని ఆమె భర్త వదిలేశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన సదరు వ్యక్తి, కాలయాపన చేస్తూ మోసం చేశాడని యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. ఇదిలా ఉండగా యువతి పీఎస్కు వచి్చన మాట వాస్తవమేనని పోలీసులు తెలిపారు. బుధవారం వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వెళ్లిపోయారని చెప్పారు. -
పాకిస్తాన్ భార్యను తోడ్కొని రావాలి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో హాట్హాట్గా చర్చ జరిగింది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ హనుమాన్ బేణివాల్ సోమవారం రాత్రి సభలో వ్యాఖ్యలో పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కాసేపు హాయిగా నవ్వుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశానికి పాకిస్తాన్ భార్యగా మారిపోయిందని, ఆ భార్యను మన ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘భీకర దాడులతో పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం. ఈ ఆపరేషన్కు సిందూర్ పేరుపెట్టారు. అంటే పాకిస్తాన్ నుదుటిపైనా సిందూరం అద్దినట్లే. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు పవిత్ర సిందూరాన్ని తమ భర్తగా భావిస్తారు. పాకిస్తాన్పై భారత్పై సిందూరం పెట్టింది కాబట్టి పాకిస్తాన్ ధర్మపత్నిగా మారిపోయినట్లే. ఇక వధువును తోడ్కొనిరావడం ఒక్కటే మిగిలి ఉంది. దయచేసి మీరు(ప్రభుత్వం) వెళ్లి, పాకిస్తాన్ను ఇంటికి తీసుకురండి’’అని కోరారు. ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ సూచించగా, అర్ధరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఇచ్చారని, తన ప్రసంగం రేపు పత్రికలో ప్రచురితం కాదని, ఇక సోషల్ మీడియాను మేనేజ్ చేసుకోవాల్సిందే అని హనుమాన్ బేణివాల్ చెప్పగా సభలో మరోసారి నవ్వుల విరిశాయి. -
ముగ్గురు భర్తల ముద్దుల పెళ్లాం!
ఒక వ్యక్తికి పలువురు భార్యలున్న కథలు మనం చాలానే విని ఉంటాం.. ఈమధ్యే హిమాచల్ యువతి ఆచారం ప్రకారం అన్నదమ్ముల్ని మనువాడడం చూశాంమహాభారతంలోని ‘‘పాంచాలి.. పంచ భర్తుక’’ అన్నట్టు కాదు కానీ...ఒక మహిళకు ముగ్గురు భర్తలుండటం గురించి మీరెప్పుడైనా విన్నారా?విని ఉండరు లెండి. ఎందుకంటే ఆమె ఉండేది టాంజానియాలో మరి!. ఇక్కడో విశేషం ఏంటంటే.. ముగ్గురు భర్తలుండటం కాదు, వాళ్లందరి పోషణ బాధ్యత తనే తీసుకోవడం!. ఎంచక్కా.. ఎలాంటి కీచులాటలూ లేకుండా అందరూ ఒకే ఇంట్లో కాపురం కొనసాగిస్తూండటం!. ఆ విశేషాలేవో చూసేద్దాం రండి..నెల్లి... టాంజానియా సరిహద్దులోని ఒకానొక పట్టణంలో ఉంటోంది. కార్లు అమ్మడం, కొనడం వృత్తి. బాగా సక్సెస్ఫుల్ కూడా. ఎనిమిదేళ్ల కాలంలో ఈమె వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అంతకంటే ముందు కూడా ఒక భర్త ఉండేవాడు. కానీ.. ఓ కారు ప్రమాదంలో అతడు మరణించాడు. ఆ తరువాత ఒంటరిగానే ఉండాలని అనుకుంది. కానీ.. మరణించిన భర్త తమ్ముడు హసన్ ఆమె పంచన చేరాడు. మొదటి భర్తకు పుట్టిన పిల్లల పెంపకంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. కొంతకాలానికి ఈ వ్యవహారం కాస్తా ప్రేమకు ఆ తరువాత పెళ్లికి దారితీసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. కొన్నేళ్లు గడిచాయో లేదో.. ఆమె జీవితంలోకి ‘జిమ్మీ’ ఎంటరయ్యాడు. ఇతగాడు అప్పట్లో బాగా డిప్రెషన్లో ఉండేవాడట. తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్తో బాధపడేవాడు. పాపం అనుకుందేమో నెల్లీ అతడిని రెండో మొగుడిగా స్వీకరించింది. ఇది జరిగిన కొంత కాలానికి నెల్లీకి డానీ పరిచయమయ్యాడు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న డానీ ఉద్యోగం వేటలో ఉన్నాడు. దొరుకుతుందో లేదో అన్న బెంగ, దొరకదేమో అన్న అత్మనూన్యత భావం డానీని వెంటాడేవట. ఈ నేపథ్యంలో నెల్లీ అతడికి ధైర్యం చెప్పేది. ఆ తరువాత ఇతడిని మూడో భర్తగా స్వీకరించింది!అందరూ ఒకే ఇంట్లో..నెల్లీ, అమె ముగ్గురు భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకొక్కరికి ఒక్కో బెడ్రూమ్ కూడా ఉంది. ప్రస్తుత ముగ్గురు భర్తలూ నిరుద్యోగులు. దీంతో కార్ల డీలర్గా నెల్లీ సంపాదిస్తున్న దాంతోనే కుటుంబ నడుస్తోంది. ముగ్గురిలో ఎవరితో ఎంత సేపు గడపాలన్న విషయంలో నెల్లీ మాటే చెల్లుతుంది. వారానికి తగిన షెడ్యూల్ వేసుకుని ఆ ప్రకారం వారితో గడుపుతానంటోంది నెల్లీ. ‘‘ముగ్గురు భర్తలూ నాకు సమానమే. అందరినీ ఒకేలా చూసుకుంటా. వాళ్లు కూడా ఎంతో అనోన్యంగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు కూడా’’ అంటుంది నెల్లీ. హసన్, జిమ్మీ, డానీలు కూడా తమ ఉమ్మడి భార్య విషయంలో సంతోషంగానే ఉన్నారు. ఈ ఏర్పాటు బాగానే ఉందని చెబుతున్నారు. ‘‘మగాడికి ఎక్కువ మంది భార్యలున్నప్పుడు లేని అభ్యంతరం.. ఒక మహిళకు ఎక్కువమంది భర్తలుంటే ఎందుకుండాలి?’’ అని ఎదురు ప్రశ్నిస్తాడు జిమ్మీ. చిక్కులూ లేకపోలేదు..నెల్లీ వ్యవహారం టాంజానియాలో కొంతమేరకు చిక్కులు సృష్టించింది. చట్టం ప్రకారం ఈ దేశంలో బహుభార్యత్వం తప్పు కాదు కానీ.. బహుభర్తృత్వం(Polyandry) మాత్రం తప్పు. కేసు పెడితే నెల్లీకి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చునని టాంజానియా లాయర్ ఒకరు చెబుతున్నారు. అంతేకాదు.. నెల్లీ ఇరుగుపొరుగు కూడా ఈ వ్యవహారంపై చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. అయితే ఒక్కటైతే స్పష్టం. మానవ సంబంధాలన్నవి అంత సులువుగా అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అని!!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
తల్లా? పెళ్లామా?
తల్లా? పెళ్లామా? అనే పరిస్థితిలో.. ఎవరి మాటకు విలువ ఇవ్వాలో తెలియక మదనపడే వాళ్లే మన మధ్యే కనిపిస్తుంటారు. అయితే అలాంటి మానసిక సంఘర్షణలో నలిగిపోతున్న ఓ వ్యక్తికి.. భారత సర్వోన్నత న్యాయస్థానం హితబోధ చేసింది.ఆ భార్యభర్తలిద్దరూ.. మనస్పర్థలతో దూరంగా ఉంటున్నారు. భర్త అమెరికాలో ఉండగా.. పెద్ద కూతురు అతని తల్లి(నాన్నమ్మ) దగ్గర, మైనర్ కొడుకు మాత్రం భార్యతో ఉంటున్నాడు. ఈ తరుణంలో కలిసి ఉండడం కుదరని భావించిన ఆ జంట కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం.. జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్ ఈ పిటిషన్ను విచారించారు. ఈ క్రమంలో వర్చువల్ విచారణకు హాజరైన ఆ దంపతులు ధర్మాసనం సమక్షంలోనే వాదులాడుకున్నారు.తనపై తన భార్య తప్పుడు క్రిమినల్ కేసు పెట్టిందని ఆ భర్త, తన భర్త తనను పట్టించుకోవడం మానేశాడని ఆ భార్య పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ తరుణంలో బెంచ్ జోక్యం చేసుకుంది.మధ్యవర్తిత్వం ద్వారా మాట్లాడుకుని పిల్లల కోసం కలిసి జీవించాలని ధర్మాసనం ఆ జంటకు సూచించింది. అయితే పదే పదే ఆ వ్యక్తి తన తల్లి ప్రస్తావన తీసుకురావడాన్ని గమనించిన జస్టిస్ నాగరత్న.. కుటుంబాల్లో గొడవలు భార్యల మాటల్ని భర్తలు పెడచెవిన పెట్టినప్పుడే మొదలవుతాయని వ్యాఖ్యానించారు.‘‘తమ మాట కంటే తల్లుల మాటకు భర్తలు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అలాగని తల్లిని పక్కనపెట్టాలని మేం అనడం లేదు. భార్యలు చెప్పేది కూడా వినాలి. భర్తలు భార్యల భావాల్ని గౌరవించాల్సిందే’’ అని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భర్త తన కుమారుడిని చూడలేదని చెప్పడంతో, కోర్టు ఆ భార్య తీరును తప్పుబట్టింది. ఒక పిల్లవాడు తన తండ్రి, సోదరిని చూడకుండా ఉండడం సరికాదని అభిప్రాయపడింది. మధ్యవర్తిత్వ సమయంలోనైనా ఆ పిల్లాడి చూపించాలని, పిల్లల శ్రేయస్సు కోసం సమస్యలు పరిష్కరించుకుని కలిసి జీవించాలని మరోసారి ఆ జంటకు సూచిస్తూ కేసు వాయిదా వేసింది.మరో కేసులో.. విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగండని ఓ జంటకు సుప్రీం కోర్టు సూచించింది. భార్య, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న యుద్ధ విమాన పైలట్ ఒకరు కోర్టును ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరారాయన. అయితే.. జీవితం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదని, సర్దుకుపోయి ముందుకు సాగాలని ఆ జంటకు ధర్మాసనం సూచించింది. -
గర్భిణీ భార్య హత్య.. ఇంట్లో మృతదేహం.. బయట భర్త నాటకం
సాక్షి,బెంగళూరు: ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. నువ్వులేకపోతే నేను లేనన్నాడు. కాదూ కూడదు అంటే చచ్చిపోతున్నాడు. చివరికి ఆమెను లేకుండా చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను కడతేర్చాడు. ఆపై పరారయ్యాడు.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువకుడు శివం తన 22 ఏళ్ల గర్భవతి భార్య సుమనను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.శివం, సుమన ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం, బెంగళూరుకు పారిపోయి వచ్చారు. బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న శివమ్ పెయింటర్గా పనిచేస్తుండగా.. సుమన ఇంట్లోనే ఉంటుంది. ఆమె మూడు నెలల గర్భిణీ.ఐదేళ్ల పాటు ప్రేమ,దోమ అంటూ సుమన వెంటబడ్డ శివమ్ పెళ్లి తర్వాత తన రాక్షస బుద్ధిని బయటపెట్టాడు. అనుమానం పేరుతో సుమనను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇదే విషయమై సుమనపై శివమ్ చేయిచేసుకున్నాడు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఎవరికి వారు వేర్వేరు రూముల్లోకి వెళ్లి నిద్రించాడు. మరునాడు అంటే మంగళవారం ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో ఎప్పటిలాగే పనికెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. పూటగా మద్యం సేవించాడు. బుధవారం సైతం ఆమెను లేపేందుకు ప్రయత్నించగా అచేతనంగా పడి ఉండి.సుమన మరణించిందని నిర్ధారించుకొని ఇంటినుంచి పారిపోయాడు. అయితే,ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి సుమనపై అనుమానం పెంచుకున్న భర్త శివమ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. -
పడక సుఖం ఇవ్వని భర్తను..
భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చడం లేదన్న అసహనంతో ఓ భార్య పక్కదారి పట్టింది. భర్తను అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో కట్టుకథ అల్లింది. కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు ఊరుకుంటారా?.. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టింది.జులై 20వ తేదీన నీహాల్ విహార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫర్జానా ఖాన్(29) అనే మహిళ తన భర్త మొహమ్మద్ షాహిద్(32)ను హతమార్చింది. ఆపై ఏం ఎరగనట్లు భర్త మృతదేహంతో ఆస్పత్రికి వెళ్లింది. తన భర్త ఆన్లైన్ రమ్మీలో డబ్బు పొగొట్టుకున్నాడని, అప్పుల బాధ భరించలేక కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని కన్నీళ్లు పెట్టుకుంది.అయితే షాహిద్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు.. గాయాలపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె మొబైల్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.సల్పాస్ మందుతో హత్య చేయడం ఎలా?.. చాట్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా? అనే అంశాలను ఆమె సెర్చ్ చేసినట్లు ఉంది. వీటి ఆధారంగా ఆమెను ప్రశ్నించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చలేకపోతున్నాడని, ఈ క్రమంలోనే తాను మూడుసార్లు కత్తితో పొడిచి హతమార్చానని చెబుతోంది. అయితే ఆమె ఎవరితో, ఏం చాటింగ్ చేసిందనేది తేలాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తకు నిద్రమాత్రలిచ్చి, ఆపై కరెంట్ షాక్ పెట్టి హతమార్చింది. ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటకు రావడంతో ఈ కేసు వెలుగు చూసింది. అందుకు సంబంధించిన కథనం కింది లింక్లో చదవండి.👇ఇదీ చదవండి: నా భర్త బతికే ఉన్నాడు.. నిద్ర వస్తోంది.. నువ్వు రా -
సతీమణి పుట్టినరోజు స్పెషల్.. రచ్చ రవి ఎమోషనల్ పోస్ట్
-
ప్రతి రోజు రాత్రి నా భార్య కాళ్లు మొక్కిన తర్వాతే నిద్రపోతా: నటుడు
పేరుకే ఆడమగ సమానం అని చెప్పినప్పటికీ, సమాజంలో చాలా చోట్ల ఇప్పటికీ పురుషాధిక్యత కొనసాగుతోంది. కొన్ని పనులు, ముఖ్యంగా గృహసంబంధిత బాధ్యతలు, సంతాన సంరక్షణ వంటివి స్త్రీలు మాత్రమే చేయాలనే సాంప్రదాయ ఆలోచనలు ఇంకా బలంగా ఉన్నాయి. సంప్రదాయం పేరుతో వారిని అణచివేసే కార్యక్రమాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక నటుడు మాత్రం స్త్రీలను గౌరవించాలని మాటలు మాత్రమే చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాడు. ప్రతి రోజు రాత్రి తన సతీమణి పాదాలకు నమస్కరించిన తర్వాతే నిద్ర పోతాడట. తన కష్టసమయాల్లో తోడుగా నిలిచిన సతీమణికి ఇలా పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గర్వంగా చెబుతున్నాడు. ఆ నటుడు మరెవరో కాదు..‘రేసుగుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రవి కిషన్(Ravi Kishan). తాజాగా ఆయన ఓ సినిమా ప్రమోషన్ కోసం ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ‘రవి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు భార్య ప్రీతి కిషన్ పాదాలను నమస్కారం చేస్తాడు’ అని చెప్పగా.. దీనికి రవి నవ్వుతూ అంగీకరించాడు.‘మీరు చెప్పింది నిజమే. ప్రతి రోజు రాత్రి నా భార్య పాదాలకు నమస్కారం చేస్తా. ఆమెకు ఇలా చేయడం నచ్చదు. అందుకే నిద్రపోయిన తర్వాత ఆమె పాదాలను తాకుతా. నా జీవితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా భార్య ఎంతగానే అండగా నిలిచింది. డబ్బు, పలుకుబడి లేనప్పుడు కూడా నా పక్కనే నిలబడింది. ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం నా భార్య మాత్రమే. అంత చేసిన ఆమెకు నేను ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను. అందుకే కనీసం పాదాలను తాయి అయినా కృతజ్ఞతతలు తెలపాలనుకున్నా’ అని రవి కిషన్ ఎమోషనల్ అయ్యాడు. రవి కిషన్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం, ఆమె పట్ల చూపే గౌరవాన్ని చాటడం అందరినీ ఆకట్టుకుంది.కాగా, రవి, ప్రీతిల వివాహం 1993లో జరిగింది. వీరికి నలుగురు సంతానం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయంగానే దూసుకెళ్తున్నాడు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. రేసుగుర్రం సినిమాలో విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయయ్యాడు. బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలోనూ కీలక పాత్ర పోషించాడు. -
ఓ మహిళ పశ్చాత్తాప స్టోరీ : ‘భర్తలూ మిమ్మల్ని మీరే కాపాడుకోండయ్యా!’
ఇటీవలి కాలంలో భర్తలపై భార్యల హత్యాకాండలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అలాగే మహిళపై హింసకు వ్యతిరేకంగా, రక్షణకోసం తీసుకొచ్చిన గృహహింస చట్టం, 498ఏ చట్టాలు దుర్వినియోగ మవు తున్నాయనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు బాధితులుగానే ప్రపంచానికి తెలిసిన మహిళా లోకం ఎందుకు తిరగబడుతోంది? ఎందుకు ఇలా వికృతంగా మారుతోంది అనే చర్చ విస్తృతంగా నడుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఒక మహిళ స్టోరీ నెటిజన్లను తీవ్రంగా కదిలిస్తోంది. అదేంటో తెలుసుకుందామా!రెడ్డిట్లో మర మహిళ పోస్ట్ ప్రకారం ఈ స్టోరీలోని మహిళది ప్రేమ వివాహం , ఇద్దరు పిల్లలు. చక్కగా సజావుగా సాగుతున్న కాపురమే. కానీ ఆమె భర్తతో జరిగిన చిన్న గొడవ , ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆమె క్షణికావేశాన్ని తండ్రి , సోదరుడు వాడుకున్నారు. భర్త మీద వరకట్నం, గృహ హింస కింద కేసు నమోదు చేయమని ఆమెను బలవంతం చేశారు. ఈమె కూడా మరేమీ ఆలోచించకుండా భర్తపై తప్పుడు కేసు పెట్టింది. విచారణల అనంతరం నాలుగేళ్లకు ఇరువురూ విడి పోయారు. కానీ భర్తతో విడిపోయే దాకా ఆమెను రెచ్చగొట్టిన సొంత తల్లిదండ్రులు, సోదరుడు, భార్య ఇప్పుడు ఆమెతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అప్పడుగానీ ఆమెకు తత్త్వం బోధపడలేదు. అసలు విషయం తెలిసి వచ్చి.. తప్పు చేశానని పశ్చాత్తాపడింది. భర్తకు క్షమాపణ చెప్పాలని ఆలోచించింది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 37 ఏళ్ళ వయసులో ఆమె భర్త మళ్లీ వివాహం చేసుకున్నాడు. ఇదీ చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు“నా భర్త వద్దకు వెళ్లి అతనిపైనా, అతని కుటుంబంపైనా పెట్టిన అన్ని కేసులకుగాను క్షమాపణ చెప్పాలని అనుకున్నాను. కానీ అతను వివాహం చేసుకున్నాడు. జీవితంలో పూర్తిగా ఫెయిలయ్యాను” అని ఆ మహిళ రాసుకొచ్చింది. దీనిపై నెటిజనులు మిశ్రమంగా స్పందించారు. జరిగిన విషయంపై మహిళకు సానుభూతి తెలిపారు. ‘ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది, ధైర్యంగా ఉండండి’ అని ఒకరు ధైర్యం చెబితే, మరొకరు అన్యాయంగా కష్టాలు పడ్డ భర్తపై సానుభూతి వ్యక్తం చేశారు.‘మీకు తోడు నీడగా, కంఫర్ట్ జోన్గా ఉండాల్సిన భర్తను చాలా బాధపెట్టారు. గాయపరిచారు. పగవాళ్లకి కూడా మీ భర్తలాంటి కష్టం రాకూడదు’ అని మరొకరు కమెంట్ చేశారు. బంధువులు కాదు రాబందులు అంటూ ఒకరు, తల్లిదండ్రులు తోబుట్టువులను తప్పుబట్టారు. దగ్గరి బంధువులెవరైనా ఇంత మోసపూరితంగా ఎలా ఉంటారు అసలు? అంటూ మరి కొందరు వారి కుటుంబ సభ్యులను నిందించారు.చదవండి: షార్జాలో మరో విషాదం : బర్త్డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం“భారతీయ భర్తలూ/పురుషులూ : ఇటువంటి మోసగాళ్లనుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్న ఒక యూజర్ వ్యాఖ్య వైరల్గా మారింది.తప్పుడు కేసులు: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 మహిళలపై నేరాలను పోలీసుల డేటా ప్రకారం, మొత్తం 34,662 కేసులు తప్పుడు కేసులుగా తేల్చారు. ఇందులో భర్త లేదా అతని బంధువులు చేసిన క్రూరత్వం కింద 7,076 కేసులు, అత్యాచారం కేసులు 4,340 మరియు మహిళలపై దాడి కింద 6,821 కేసులు ఆమె నమ్రతను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఉన్నాయి. అలాగే, కిడ్నాప్ మరియు అపహరణ కింద 8,588 కేసులు కూడా తప్పుడు కేసులుగా ముగిశాయి.ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే! -
భర్త ఇంటికి మొదటి భార్య నిప్పు
కర్ణాటక: విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటికి మొదటి భార్య నిప్పంటించింది. ఈ విడ్డూరం దొడ్డ పట్టణ పరిధిలోని కొంగాడియప్ప కళాశాల వెనుక ఇంట్లో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికుడు గౌతమ్ అనే వ్యక్తి కలహాల కారణంగా భార్యతో విడిపోయాడు. ఇద్దరూ కోర్టులో విడాకుల కేసు వేసుకున్నారు. కేసు నడుస్తున్న క్రమంలో గౌతం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మొదటి భార్య వచ్చి, విడాకులు కాకుండానే ఎలా పెళ్లి చేసుకున్నావని అతనితో గొడవపడింది. ఇరువైపుల వారు మాట్లాడుతుండగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆగ్రహం పట్టలేని మొదటి భార్య ఇంటికి నిప్పంటించినట్టు అనుమానాలున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రాత్రి 11కి ఎవరితో మాట్లాడుతున్నావ్..!
వికారాబాద్: ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా వని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిందో భార్య. కూతురుకు మంచీచెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ నగేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాపూర్కు చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ (33)కు ఇదే మండలం కోత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఈశ్వర్ ప్రసాద్ (10), సుకుమార్ (7) కుమారులు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. ఇటీవలే నచ్చజెప్పిన ఇరుకుటుంబాల వారు దంపతులిద్దరినీ కలిపారు. జయశ్రీ తండ్రి పండరి సైతం వీరితో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11గంటల వరకు వెంకటేశ్ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగా భార్య ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం వెంకటేశ్ నిద్రపోయాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్, ఎస్ఐలు రాథోడ్ వినోద్, సాజిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. -
భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏంటంటే?
సాక్షి,బెంగళూరు: భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్పై వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గం మధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది.నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది.ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు.అయితే, ఇదే కేసులో భార్య మైనర్ కావడంతో భర్తపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చట్టపరంగా భర్తపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు. In #Karnataka's Yadagiri, a wife pushed her husband into the river on the pretext of taking a selfie.The couple got married 2 months ago, the husband had gone to his mother's house to pick up his wife, while returning,1/2 pic.twitter.com/u0N8xK8QLI— Siraj Noorani (@sirajnoorani) July 16, 2025 -
భర్తను చంపేసి ఇంట్లో టైల్స్ కింద పాతిపెట్టి..!
మనకు దృశ్యం సినిమా అనగానే ఠక్కున గుర్తొచ్చేది మాత్రం అందులో మర్డర్ సీన్ చుట్టూ తిరిగిన ఓవరాల్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చి సుమారు దశాబ్దకాలం పూర్తి కావొస్తున్నా.. ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోయి మరీ చూసేస్తూ ఉంటాం. అందులో హీరో చేసిన హత్య.. ఆపై ఆ శవాన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్ కిందే పాతిపెట్టడం సినిమాకే హైలైట్. అక్కడ తన కూతుర్ని వేధిస్తున్న వ్యక్తిని తండ్రి చంపి మొత్తం కేసునే తప్పుదోవ పట్టిస్తూ సీన్లు అల్లిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఇది సినిమా కాబట్టి ఆసక్తికరం అనిపిస్తోంది. మరి నిజ జీవితంతో జరిగితే వామ్మో అనే పరిస్థితి.మరి, ఇదే దృశ్యం సినిమాను ఫాలో అయినట్లుంది ఓ మహిళ. భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. లవర్తో కలిసి మరీ భర్తను హత్య చేసి టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. ఇది మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల విజయ్ చావన్, 28 ఏళ్ల కోమల చావన్లు భార్యా భర్తలు. ముంబైకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వీరి జీవితంలోకి ఒక ‘ లవర్’ వచ్చాడు. కోమలకు ప్రియుడు.. విజయ్కు యముడు మాదిరి వారి జీవితంలోకి ప్రవేశించాడు. అతని పేరు మోను. కోమల, మోను కలిసి విజయ్ను చంపేశారు. అంటే కోమల తన భర్త విజయ్ను మోనుతో కలిసి అంతమొందించింది. మరీ ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచన చేస్తే.. ఇంట్లోనే టైల్స్ కిందే శవాన్ని పూడ్చిపెట్టేందని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే చేసేశారు. ఆ తర్వాత కోమల, మోనులు కలిసి ‘లాంగ్ టర్మ్ హనీమూన్’( వేరే చోటకి పరార్) వెళ్లిపోయారు. అయితే విజయ్ సోదరునికి అనుమానం వచ్చి ఇంటికి రాగా, అక్కడ తాళం వేసి ఉంది. ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అన్నను చంపేసిన వదిన.. ఆ ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టందనే విషయాన్ని తెలుసుకుని షాక్ తిన్నాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేపట్టారు. -
లండన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా.. (ఫొటోలు)
-
నువ్వు రా.. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు!
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్షాక్కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.భర్త మృతిపై ఓ చానెల్తో మాట్లాడుతూ సుస్మిత కంటతడితన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం.. సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టుసుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?రాహుల్: టేప్తో కట్టేయ్సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోందిమృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. #WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ— ABP News (@ABPNews) July 19, 2025 -
‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్బాస్ ఫేం పోస్ట్ (ఫొటోలు)
-
రష్యన్ మహిళను వెతికి పట్టుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్కు చెందిన సైకత్ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రష్యన్ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించింది. ఎయిర్పోర్ట్, నావీ పోర్ట్ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..తన భార్య పారిపోవడానికి భారత్లో ఉన్న రష్యన్ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్లో ఉండగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు. అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండిరష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.విడాకుల కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్ బసూ కోర్టుకు తెలిపారు. -
భార్య రాసిన మరణ శాసనం.. ప్లాన్ చేసి కార్ తో గుద్ది..!
-
Nalgonda : సినిమా రేంజ్ లో మర్డర్ ప్లాన్
-
బామ్మర్ది భార్యతో బావ వివాహేతర సంబంధం..!
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతడిని కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఈ ఘటనపై అనుమానంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అసలు జరిగింది ఇదీ..ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేసేవాడు. స్వామి భార్య స్వాతి కూడా భువనగిరి హౌసింగ్బోర్డు కాలనీలో ఎస్ఎన్ మోటార్స్లో పనిచేసేది. ఆ పక్కనే మార్బుల్ దుకాణంలో పనిచేసే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్తో స్వాతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత స్వాతి పనిచేసే ఎస్ఎన్ మోటార్స్ మూతపడింది. ఈ క్రమంలో స్వాతి పల్లెర్ల గ్రామానికి వచ్చి ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల తర్వాత స్వామికి భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో స్వామి తన భార్య స్వాతిని తాను పనిచేసే ట్రాక్టర్ షోరూంలోనే ఉద్యోగంలో చేర్పించాడు. గొడవలు ఇలా..స్వాతి సోదరుడు మహేశ్కు ఇద్దరు భార్యలు. మహేష్ మొదటి భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహేష్కు తెలియడంతో తన బావ స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామికి వరుసకు సోదరి అయిన తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయాన్ని మహేష్ స్వాతితో చెప్పాడు. దీంతో స్వాతి తన భర్త స్వామిని నిలదీసింది. నన్నే నిలదీస్తావా అంటూ స్వామి స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో స్వామి, స్వాతి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఫిబ్రవరిలో పని నిమిత్తం మోత్కూరుకు వెళ్లిన సాయికుమార్కు అక్కడ స్వాతి కలిసింది. తన భర్త వేధిస్తున్న విషయాన్ని స్వాతి సాయికుమార్కు వివరించింది. సాయికుమార్ స్వాతిని ఓదార్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అక్క స్వాతి, సాయికుమార్ వివాహేతర సంబంధానికి మహేష్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్వాతి, మహేష్ నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటుస్వామిని హత్య చేయడానికి సాయికుమార్, స్వాతి, మహేష్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలుగా వాట్సాప్ గ్రూపులోనే మాట్లాడుకుని తర్వాత కాల్స్ డిలీట్ చేసేవారు. స్వాతి తన ప్రియుడు సాయికుమార్ నంబర్ను కూడా సెల్ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు. కారు అద్దెకు తీసుకుని..ఈ నెల 13న తన భర్త స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేష్కు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై భువనగిరిలో నిఘా పెట్టారు. స్వామిని హత్య చేయడానికి పథకం ప్రకారం సాయికుమార్.. తన స్నేహితుడైన భువనగిరి పట్టణంలోని తాతానగర్కు చెందిన చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును సెల్ప్ డ్రైవింగ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ తన స్నేహితుడు మద్దికుంట వీరబాబుతో కలిసి బైక్పై పల్లెర్ల గ్రామానికి బయల్దేరాడు. స్వామిని సాయికుమార్ కారులో వెంబడించాడు. రాత్రి 11.15 గంటల సమయంలో మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ శివారులోకి రాగానే కారుతో బైక్ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొట్డడంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్పై వెనుక కూర్చున్న వీరబాబుకు గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లి బైక్ను ఢీకొట్టిన అనంతరం కంట్రోల్ కాలేదు. రోడ్డు కిందకు 50 మీటర్ల వరకు దూసుకుపోయింది. అక్కడ ఫెన్సింగ్ కడీలకు తగిలి ముందుకు కదలకుండా ఆగిపోయింది. సాయికుమార్కు çస్వల్పంగా గాయాలయ్యాయి. స్వామిని హత్య చేసేందుకు ప్లాన్ అమలు చేస్తున్న సమయంలో మహేష్, స్వాతి, సాయికుమార్ వాట్సాప్ గ్రూప్ కాల్లో మాట్లాడుకున్నారు. వాట్సాప్ కాల్లో స్వామిని కారుతో ఢీకొట్టి చంపేశామన్న విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న స్వాతి తమ్ముడు మహేశ్ ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాయికుమార్, రామలింగస్వామిని బైక్పై ఎక్కించుకుని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. ఆస్పత్రికి వచ్చిన భార్య, బావమరిది ఘటనా స్థలంలో స్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా ఫోన్లో విషయం తెలుసుకున్న స్వాతి, మహేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.నిందితుల అరెస్ట్గుంటి సాయికుమార్, స్వాతి, పొట్టెపాక మహేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు భునగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ శంకర్గౌడ్, మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కారుతో.. కదిలిన డొంకరోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో ముందు భాగం దెబ్బతినడంతో కారు నంబర్ ఆధారంగా కారు యజమానికి ఫోన్ చేసి విచారించగా.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చాడు. దీంతో సాయికుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. సాయికుమార్ సెల్ఫోన్ చెక్ చేయగా స్వాతి నంబర్ కనిపించింది. దీంతో స్వాతిని తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నిందితులు స్వామి కాళ్లు, చేతులు విరిచి దివ్యాంగుడిని చేయాలనుకున్నారని తెలిసింది. అయితే అదికాస్త వికటించి అతడు మృతిచెందాడు. -
డల్లాస్ కన్సర్ట్లో దిల్రాజు దంపతులు సందడి (ఫొటోలు)
-
భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య
సాక్షి,పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన భార్య తరుపు కుటుంబ సభ్యులపై.. భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల వివరాల మేరకు.. సుగ్లాంపల్లి భార్యాభర్తల పెద్ద మనుషుల పంచాయితీలో కత్తిపోట్ల కలకలం సృష్టించాయి. భార్య,భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు పులిస్టాప్ పెట్టి వారిద్దరిని కలిపేందుకు ఆ ఊరి గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ జరుగుతున్న సమయంలో భర్త తరుపు కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో భార్య తరుపు కుటుంబ సభ్యులపై మారణాయుధాలతో దాడి చేశారు.అప్రమత్తమైన భార్య కుటుంబీకులు సైతం కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్కు చెందిన గాండ్ల గణేష్,ఓదెలకు చెందిన మోటం మల్లేష్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య వివాదాలలో జోక్యం చేసుకోవడం అనేది ఒక సున్నితమైన సమస్య. సాధారణంగా, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వారి మధ్య సామరస్యం కుదర్చడానికి ప్రయత్నించడం మంచిది. కానీ వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. -
నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు. -
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్ఘడ్, ప్రయాగ్రాజ్లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్హ్యాండెండ్గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం. -
భార్య విడాకులు.. పాలతో స్నానం చేసిన భర్త
-
పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించేసరికి..
కడప జిల్లా: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది.. అయితే తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని రెండవ భార్య అందరిని నమ్మించింది. భర్త మృతి విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారించారు. ఇది ఆత్మహత్య కాదు, రెండవ భార్య చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించి రెండో భార్యను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా..ఖాజీపేట మండలం అప్పనపల్లె గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసులు యాదవ్ (50)కు 30 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన నక్కా లక్ష్మిదేవితో వివాహమైంది. భార్యతో గొడవల కారణంగా ఆమెకు తెలియకుండా చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నక్కా సునీత (35)ను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని తప్పుడు ధ్రువ పత్రాలను చూపించాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య లక్ష్మి దేవి తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న శ్రీనివాసులు యాదవ్పై కేసు పెట్టింది. కోర్టులో ఈ కేసు నడుస్తోంది.మొదటి భార్య ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి..శ్రీనివాసులు యాదవ్ జూన్ 11వ తేదీన మృతి చెందాడు. తన భర్త మృతిపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ మొదటి భార్య లక్ష్మిదేవి జులై 1వ తేదీన ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఖాజీపేట సీఐ మోహన్ కేసు నమోదు చేశారు. జులై 2న శ్రీనివాసులు యాదవ్ మృతదేహాన్ని రిమ్స్ డాక్టర్లు, తహసీల్దార్ సమక్షంలో వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి తల వెనుక భాగంలో బలమైన గాయం ఉందని ఈ గాయం కారణంగా చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు అప్పనపల్లె గ్రామంలో లోతైన విచారణ జరిపారు.భర్త అసభ్యకరమైన ప్రవర్తన కారణంగానే హత్య..మృతుడు శ్రీనివాసులు యాదవ్ మద్యం మత్తులో పిల్లల ఎదుటే భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులు గుర్తించారు. దీంతో రెండవ భార్య విసుగు చెందేది. జూన్ 11న ఇద్దరు పిల్లలు బయట ఉండగానే ఇంట్లోకి తాగి వచ్చి భార్య పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. భార్య తోసేయడంతో మంచం కోడికి తల తగిలి కింద పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసులు తిరిగి పైకి లేచేందుకు ప్రయత్నించాడు. అతను పైకి లేస్తే తనను చంపుతాడని భావించిన భార్య సునీత మంచం కోడికి తల పట్టుకుని కొట్టింది. దీంతో అక్కడికక్కడే స్పహ తప్పి పడిపోయాడు.హత్యను ఆత్మహత్యగా..తన భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న భార్య సునీత తీవ్ర ఆందోళన చెందింది. దీంతో ఇంట్లో పిల్లలను ఊయల ఉపే తాడుతో మృతదేహానికి ఉరి వేసింది. ఆ తర్వాత ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వారు వచ్చి చూసే సరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అందరిని నమ్మించింది. శరీరంపై ఎలాంటి రక్తగాయాలు గానీ దెబ్బలు గానీ పెద్దగా లేకపోవడంతో అందరూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించారు. జూన్ 12న అంత్యక్రియలు పూర్తి చేశారు.నిందితురాలి అరెస్టుమొదటి భార్య ఫిర్యాదు మేరకు జులై 2న పోస్టుమార్టం నిర్వహించినప్పటి నుంచి రెండో భార్య సునీత పరారీలో ఉంది. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకుని అప్పనపల్లె పంచాయతీ సెక్రటరీ ద్వారా జులై 12న పోలీసుల ఎదుట లొంగిపోయింది. పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రెండవ భార్య సునీతను ఖాజీపేట సీఐ మోహన్ శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. -
ప్రియుడితో భార్య జంప్.. పాల స్నానంతో భర్త సంబరాలు
భార్య నుంచి విడాకులు పొందానన్న ఆనందంతో ఓ భర్త సంబరాలు చేసుకున్నాడు.. అక్కడితో ఆగలేదు.. ఇక తాను స్వేచ్ఛాజీవినంటూ 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. విడాకులను నాలుగు బకెట్ల పాల స్నానంతో వేడుక చేసుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన మాణిక్ అలీకి భార్యతో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ భార్యభర్తలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇంటికి చేరుకున్న భర్త.. పాలతో స్నానం చేసి సంతోషంతో ఎగిరి గంతేశాడు.తన భార్యకు ఓ ప్రియుడు ఉన్నాడంటూ చెప్పుకొచ్చిన మాణిక్ అలీ.. తనతో పెళ్లై ఓ బిడ్డ జన్మించినా కానీ.. ఆమె తీరు మారలేదని.. తన ప్రియుడితో వివాహేతర బంధం కొనసాగించిందని తెలిపాడు.. తనను, తన బిడ్డను వదిలేసి ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని.. ఇలా.. ఒక్కసారి కాదు రెండు సార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు.మొదటిసారి తప్పు చేసినప్పుడు తన బిడ్డ కోసం ఆమెను క్షమించానని చెప్పాడు. మా కుటుంబం శాంతి కోసం తాను మౌనంగా ఉన్నానని.. మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని మాణిక్ అలీ తెలిపారు. విడాకులు తీసుకున్నాక.. కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని.. ఈ రోజు నుండి తాను విముక్తి పొందానని.. కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానంటూ మాణిక్ అలీ చెప్పాడు. -
ఫొటో తీస్తానని.. నదిలోకి నెట్టేసి..
కృష్ణా: కొత్తగా పెళ్లయిన జంట.. బైక్పై వెళ్తూ మాంచి లొకేషన్ కనిపిస్తే ఫొటోలు తీసుకోవాలని ముచ్చటపడ్డారు. వారు వెళ్తున్న దారిలో కృష్ణానదిపై గుర్జాపూర్ బ్రిడ్జి వచి్చంది. అదే మంచి స్పాట్ అనుకొని ఫొటోలు దిగటానికి సిద్ధమయ్యారు. భర్త తన భార్యకు ఫోన్ ఇచ్చి.. తనను ఫొటోలు తీయాలని కోరి వెళ్లి బ్రిడ్జి అంచున నిలబడ్డాడు. భార్య కూడా ఫొటోలు తీస్తూనే భర్త వద్దకు వెళ్లి ఒక్కసారిగా అతన్ని నదిలోకి తోసేసింది. బిక్కచచ్చిపోయారు భర్త నీళ్లలో పడి కొట్టుకుపోతూ.. నదిలో ఓ రాయిని పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడి కేకలు విని జాలర్లు రక్షించి పైకి తీసుకొచ్చారు. అయితే, భార్యే తనను నదిలోకి తోసిందని భర్త చెబుతుండగా, లేదులేదు.. అతడే నదిలో పడిపోయాడని భార్య వాదిస్తోంది. ఏం చేయాలో తెలియని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో నారాయణపేట జిల్లాలో ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ప్రమాదమా? హత్యాయత్నమా? కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మ (20)తో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్పై వడిగేరికి వెళ్లి శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది. నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచి్చన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు. -
సెల్పీ దిగుదాం రా బావా..!
భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్ చల్ చేశారు. కర్ణాటక రాయ్చూర్లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు. తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.A newlywed man in #Raichur was allegedly pushed into the River by his wife during a photoshoot near Gurjapur Bridge.He clung to rocks & was rescued by fishermen.The wife claimed it was accidental but husband accused her of a deliberate act.Police are investigating the viral video pic.twitter.com/4Da9x8ShXx— Yasir Mushtaq (@path2shah) July 12, 2025 -
లవర్తో దిగిన ఫోటోలు భర్త ఫోన్లో ఉండిపోవడంతో.. భార్య ఏం చేసిందంటే..!
న్యూఢిల్లీ: రోజుకు ఎన్నో చిత్ర విచిత్రాలను చూస్తున్నాం. తాజా ఘటన కూడా చాలా చిత్రమైందే. ఓ భార్య తన లవర్తో దిగిన ఫోటోలు, వీడియోలు భర్త ఫోన్లో ఉన్నాయనే కారణంతో వాటి కోసం ఇద్దరు మనుషల్ని పురమాయించింది. భర్తన పట్టుకునైనా ఆ ఫోన్ తీసుకుని లవర్తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయాలనే ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఇద్దర్ని మాట్లాడుకుంది. భర్త రూట్ మ్యాప్ అంతా ఇచ్చింది. భర్త ఆఫీస్కు ఏ రూట్లో వెళతాడు.. ఎన్ని గంటలకు ఎక్కడకు చేరుకుంటాడు అనే వివరాల ఇచ్చింది. ఇందులో భర్త వర్క్ టైమింగ్స్ అన్ని షేర్ చేసింది. భర్త ఫోన్లో లవర్తో దిగిన ఫోటోలు కొంపముంచుతాయేమోనని భయపడి ఈ కుట్రకు తెరలేపింది భార్య. లవర్తో ఉన్నప్పుడు భర్త వాడే ప్రత్యామ్నాయ ఫోన్తో ఫోటోల దిగింది కానీ, ఆ ఫోన్ తిరిగి భర్త తీసుకోవడంతో భార్యకు కంగారు పట్టకుంది. ఎలాగైనా ఆ ఫోటోలు భర్త కంటపడకుండా చేయాలని భావించింది. ఇందుకు గాను ఇద్దరు వ్యక్తులను పురమాయించగా, ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. అంకిత్ గోహ్లత్ అనే 27 ఏళ్ల వ్యక్తి,, అద్దెకు ఒక స్కూటర్ తీసుకుని ప్రణాళిక అమలు చేశాడు.. ఫోన్ అయితే దొంగిలించారు కానీ, ఆ ఫోన్ దొంగిలించబడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిలో భాగంగా నిఘా ఉంచారు పోలీసులు. లవర్తో దిగిన ఫోటోలను డిలీట్ చేశారు కానీ విషయమైతే పోలీసులకు వెల్లడించాడు పట్టుబడిన వ్యక్తి.దాంతో అతన్ని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు పట్టుకోగా అసలు విసయం బయటపడింది. ఆతని భార్యే ఫోన్ దొంగిలించాడానికి తనను పురామాయించిందని అసలు విషయం చెప్పేశాడు సదరు ‘దొంగ’. ఈ విషయం తమ దర్యాప్తులో తేలినట్లు ఢిల్లీ(సౌత్) డీసీపీ అంకిత్ చౌహాన్ వెల్లడించారు. సినిమా తలపించే ట్విస్టులున్న ఈ ఘటన జూన్ 19వ తేదీన జరగ్గా, చివరకు ఆ ఫోన్ ఎక్కడుందో పోలీసులకు తమ ఛేదనలో దొరకడంతో భార్య బండారం బయటపడింది. -
భార్య ముక్కు కొరికేసిన భర్త.. అసలేం జరిగిందంటే?
బెంగళూరు: ఓ భర్త.. భార్య ముక్కును కొరికేసిన ఘటన కర్ణాటకలోని దేవనగరిలో కలకలం సృష్టించింది. అప్పు చెల్లింపు విషయంలో భార్య, భర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపంతో భార్య ముక్కును కొరికాడు. భార్య విద్య అప్పు తీసుకోగా, భర్త విజయ్ పూచీకత్తు ఇచ్చాడు. విద్య.. కిస్తీలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.మంగళవారం జరిగిన ఈ గొడవలో భార్యపై దాడి చేశాడు.. ఆమె నేలపై పడిపోగా.. తర్వాత విజయ్ ఆమె ముక్కును కొరికేశాడు. ఆమెను స్థానికులు వెంటనే చిన్నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ముక్కుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.విద్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటగా శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పరిధి ఆధారంగా దావణగేరె జిల్లా చిన్నగిరి పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేశారు. -
దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
జనగామ జిల్లా: అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ తోబుట్టువులే. తమ తల్లిని చంపాడన్న పగతో ఉన్న ఆ ఇద్దరూ భర్తను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్మ, గౌరమ్మలిద్దరూ భార్యలు. మే 18న కనకయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయిని (చొక్కమ్మ, గౌరమ్మల తల్లి) మామిడి తోటలో ఉండగా తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు. తెల్లవారుజామున విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటినుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిట్టలోనిగూడెం వచి్చన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మలు.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ చెప్పారు. పీడ విరగడైంది..: నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు. -
అడవిలోకి తీసుకెళ్లి.. ఆలిని హతమార్చాడు
ఆదిలాబాద్ టౌన్: అనుమానం పెనుభూతమై ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.ఆదిలాబాద్ పట్టణం సుందరయ్యనగర్కు చెందిన హింగోలి శంకర్కు ఇంద్రవెల్లిలోని నర్సాపూర్కు చెందిన వందన (45)తో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 20 ఏళ్లు పైబడిన ఇద్దరు కుమారులు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుండగా, ఆయన భార్య గృహిణి. సాఫీగా సాగిన వీరి సంసార జీవితంలో భార్యపై అనుమానం శంకర్లో అశాంతి రేపింది.టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఆరోగ్యం బాగాలేదని, క్షుద్రపూజలు చేయిస్తానని, ఆయుర్వేద మందు తాగిస్తానని చెప్పి ఈనెల 2న శంకర్ ఆదిలాబాద్ నుంచి వందనను బస్సులో తీసుకెళ్లాడు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతం (మహారాష్ట్ర సరిహద్దు)లోకి తీసుకెళ్లి చెట్లకు పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నట్లు నటించాడు. వెంట తెచ్చుకున్న కారంపొడిని వందన కళ్లలో చల్లాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా బండరాయితో తలపై బాదాడు. దీంతో రక్తపు మడుగులో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మ నాన్న తిరిగి రాకపోవడంతో పిల్లలు ఆందోళనకు గురయ్యారు.శనివారం రాత్రి కూతురు ప్రియాంక టూటౌన్లో ఫిర్యాదు చేయగా, అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డితో పాటు పోలీసులు వెళ్లి చూడగా ఆమె మృతదేహం కుళ్లిపోయి ఉంది. కాగా నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. -
జగన్ పేరు చెప్తే.. కోటి రూపాయలు..! బట్టబయలైన లోకేష్ కుట్ర
-
వంశీని చంపేందుకు కుట్ర.. పోలీసులకు భార్య పంకజశ్రీ లేఖ
-
సింగయ్య లేచి వచ్చి చెప్పిన.. అది కూడా మేనేజ్ అంటారేమో చంద్రబాబు
-
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
జూలూరుపాడు/ఖమ్మం క్రైం: భర్త పోలీసు శాఖలో ఎస్సై, బావ కూడా అదే ఉద్యోగం.. మామ సైతం రిటైర్డ్ పోలీసు అధికారి. సమాజంలో ప్రజల కష్టాలు తీర్చే ఉద్యోగుల ఇంటికి కుమార్తెను ఇస్తే బిడ్డ జీవితం బాగుంటుందని భావిస్తే వివాహేతర సంబంధాల పేరిటే కాక రకరకాల కారణాలతో వేధిస్తుండడంతో ఆమె తనువు చాలించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బానోతు రాణాప్రతాప్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన రాజేశ్వరి(34)కి 2018లో వివాహం జరిగింది. ఆ సమయాన రూ.40 లక్షలతో పాటు, 35 తులాల బంగారం, మరో రూ.4లక్షల విలువైన కానుకలను ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉండగా.. కొన్నాళ్ల నుంచి భర్తతో పాటు అత్తామామలు పుష్పరాణి – చంద్రం, బావ మహేష్ (ఎస్సై, మహబూబాబాద్ వీఆర్) రాజేశ్వరికి వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్నట్లు సమాచారం. కాగా, రాణాప్రతాప్కు ఖమ్మం జీఆర్పీ ఎస్సైగా పోస్టింగ్ రావడంతో భార్యాపిల్లలను జూలూరుపాడులోనే ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. అయితే, కుటుంబీకుల వేధింపులు తాళలేక రాజేశ్వరి జూలూరుపాడులోని అద్దె ఇంట్లో జూన్ 25న పురుగుల మందు తాగగా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందింది.మామపై దాడి..హైదరాబాద్ నుంచి రాజేశ్వరి మృతదేహాన్ని సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈక్రమాన రాణాప్రతాప్ తండ్రి చంద్రయ్య మార్చురీ వద్దకు రావడంతో తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ రాజేశ్వరి కుటుంబీకులు దాడి చేశారు. దీంతో జూలూరుపాడు, ఖమ్మం టూటౌన్ పోలీసులు అడ్డుకుని ఆయనను టూటౌన్కు తరలించారు. ఘటనపై మృతురాలు తండ్రి సోమ్లా ఫిర్యాదుతో రాణాప్రతాప్, పుష్పరాణి, చంద్రం, మహేష్పై కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు ఎస్ఐ రవి తెలిపారు. కాగా, రాణాప్రతాప్, ఆయన సోదరుడు మహేష్ మొదటి నుంచీ వివాదాస్పదులుగానే ఉన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపాన ఓ చెప్పుల షాపు యజమానిపై కొన్నాళ్ల క్రితం అకారణంగా దాడి చేసిన రాణాప్రతాప్ తుపాకీతో బెదిరించాడు. ప్రస్తుతం ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
నా భర్త నిర్దోషి.. పూర్ణ భార్య సంచలన వీడియో
-
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్లో న్యూస్రీడర్, యాంకర్గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
ముక్కలు చేస్తా అంటూ భర్తకు భార్య మాస్ వార్నింగ్
-
వివాహేతర సంబంధం వద్దన్నా వినలేదు!
అన్నానగర్: వివాహేతర సంబంధం నడుపుతుందన్న కోపంతో భార్యను భర్త కొట్టి, గొంతునులిమి చంపేశాడు. చెన్నై సమీపంలోని పెరుంబాక్కంలో ఉన్న హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అపార్ట్మెంట్లో నివసిస్తున్న జాహీర్ హుస్సేన్ (39)కు సుప్రియ భేగం(26) భార్య ఉంది. వీరు ఉత్తర రాష్ట్రానికి చెందినవారు. వీరిద్దరూ వేర్వేరు ప్రైవేట్ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. దీంతో ఆగ్రహించిన జాహీర్ హుస్సేన్, సుప్రియా బేగంపై దాడి చేసి, గొంతు నులిమాడు. అప్పుడు ఆమె స్పృహ తప్పింది. దీంతో వెంటనే ఆమెను రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, సుప్రియభేగం అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు జాహీర్ హూస్సెన్ను అరెస్టు చేసి, విచారించారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, మందలించిన వివాహేతర సంబంధాన్ని వదులకపోవడంతో ఆమెను కొట్టి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. -
పెళ్ళాం టార్చర్ కు మరో భర్త బలి
-
నాలోని దుష్టశక్తి పోవాలని నా భార్య అలా చేస్తుంది: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తెగ ప్రమోషన్లు చేస్తున్న విష్ణు.. ఒకటి రెండు రోజుల్లో శ్రీకాళహస్తిలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి చీఫ్ గెస్ట్గా ప్రభాస్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు భరద్వాజ రంగన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సినిమా అంటే నాకు ఇష్టం. 'కన్నప్ప' కూడా నా పరంగా అలాంటి మూవీనే. అలానే నేను హార్డ్ కోర్ హిందువుని.. నా భార్య క్రిస్టియన్. ఆమె రోజూ బైబిల్ చదువుతుంది. అలానే రోజూ నిద్రపోయేటప్పుడు నా తలగడ కింద బైబిల్ ఉంచుంది. నాలోని ఏవైనా దుష్టశక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఆమె నమ్మకం. దేవుడు అన్నిచోట్ల ఉంటాడు. కాకపోతే గుడికి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది' అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?) ఇప్పటివరకు వచ్చిన 'కన్నప్ప' సినిమాల్లో క్లైమాక్స్ ఒక్కటే అయినా.. అంతకు ముందు సన్నివేశాల్ని మాత్రం ఎవరికి వాళ్ల ఊహలకు తగ్గట్లు తెరకెక్కించారని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. దాదాపు 50 ఏళ్ల తర్వాత, ప్రస్తుత జనరేషన్కి చూపించేందుకు తాను 'కన్నప్ప' తీశానని, శివుడి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందని విష్ణు అన్నాడు.భారీ బడ్జెట్తో తీసిన 'కన్నప్ప'లో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా.. సినిమాపై కూడా కాస్తోకూస్తో అంచనాలు ఉన్నాయి. గతవారం థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' హిట్ కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఆ జోష్ని 'కన్నప్ప' కూడా కొనసాగిస్తుందా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష) " I'm a HARDCORE HINDU and my wife is a Christian.She reads the Bible and puts it under my head in the bed, because she believes that the devil in me will leave."- #VishnuManchu | #Kannappa pic.twitter.com/nT3cPqKtSS— Movies4u Official (@Movies4u_Officl) June 23, 2025 -
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలంటే కొన్ని చిట్కాలు పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలిఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి. నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా! -
‘కక్ష సాధింపునకే బాబు సర్కార్ తప్పుడు కేసులు’
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రగిరి క్లాక్ టవర్ సర్కిల్ వద్ద నిరసన నిర్వహించారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసనకు దిగారు. చెవిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామ్యమంటూ నినాదాలు చేశారు. ‘‘రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు- అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు" అంటూ బ్యానర్ ప్రదర్శించారు. ఈ ర్యాలీలో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏనాడు బయటకు రాని వాళ్లం మేము ఈరోజు మీడియా ముందుకు బాధతో రావాల్సిన పరిస్థితి...చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడమే మేము చేసిన తప్పా.. గత పదేళ్లు మేము చంద్రగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఏ ఒక్కరినీ అరెస్ట్ చేసింది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా కుటుంబంపైనే కక్ష సాధింపు చర్యలకు దిగింది’’ అని చెవిరెడ్డి సతీమణి లక్ష్మి పేర్కొన్నారు. -
ప్రియునితో పట్టుబడిన భార్య.. ముక్కు కొరికిన భర్త
హర్దోయ్: వివాహమైన తరువాత ఏర్పడే అక్రమ సంబంధాలు ఎటువంటి పరిస్థితులకైనా దారి తీస్తుంటాయి. భార్యాభర్తలలో ఏ ఒక్కరు దారితప్పి నడిచినా, వారి మధ్య కలహాలు ఏర్పడుతుంటాయి. యూపీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ పరిధిలో గల ఒక గ్రామానికి చెందిన రామ్ ఖిలావన్ తన భార్యను ఆమె ప్రియునితో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. తరువాత ఆగ్రహంతో ఆమె ముక్కును బలంగా కొరికివేశాడని హరియావన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనకు ముందు భార్యాభర్తల మధ్య తీవ్రవాగ్వాదం జరిగిందని, ఆమె ప్రియుని ముందు భర్త ఆమె ముక్కును కొరికాడని పోలీసులు తెలిపారు.ఆమె రోదనలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన మహిళను హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు లక్నోలోని వైద్య కేంద్రానికి తరలించారు. ఈ కేసులో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్ తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ఉద్రిక్తతల వేళ.. ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు -
పెళ్లైన 20 ఏళ్లకు.. మా ఆవిడ బెదిరిస్తోంది : కేసు అవుతుందా?
నాకు పెళ్లయి 20 ఏళ్లవుతోంది. ఒక పాప..16 ఏళ్లు. బాబు..14 ఏళ్లు. పెళ్లి నాటికి నాకు ఇరవై ఏళ్లు. నా భార్యకు పదహారేళ్లు. గత కొన్నేళ్లుగా మా ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. విడాకులు ఇచ్చి నాకున్న ఏకైక ఇంటిని తన పేర రాసివ్వాలని, లేకపోతే తన మైనార్టీ తీరకముందే లైంగికంగా లొంగదీసుకుని, బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు కేసు పెడతానంటూ బెదిరిస్తోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఏం చేయమంటారు? – శ్రీహరి, కర్నూలుబాల్యవివాహాల నిరోధక చట్టం, 2006 ప్రకారం ఒక మేజర్ పురుషుడు ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి చేసుకున్న పురుషుడికి అలాగే ఆ పెళ్లి జరిపించిన పెద్దలకు, ఆ పెళ్లి జరగాలని ్ర΄ోత్సహించిన వారికి కూడా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లక్ష రూ΄ాయల వరకు జరిమానా ఉంది. ఈ చట్టం ప్రకారం పెళ్లికి పురుషులకైతే చట్టబద్ధమైన వయసు 21, స్త్రీలకు 18 సంవత్సరాలు. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ వివాహ చట్టం ప్రకారమైనా, బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారమైనా.. బాల్య వివాహం జరిగితే సదరు అమ్మాయి తనకు ఇరవై ఏళ్లు నిండేలోపు కోర్టును ఆశ్రయించి తన వివాహం చెల్లదని దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మైనర్గా ఉన్నప్పుడు కూడా ఒక ప్రతినిధి ద్వారా, మిత్రుల సహాయంతో, బాల్యవివాహాల నిరోధక అధికారి ద్వారా కూడా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా? 20 ఏళ్లు నిండిన తర్వాత వివాహ రద్దుకు ప్రస్తుత చట్టం అంగీకరించదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వైవాహిక సంబంధం కొనసాగించిందని చట్టం భావిస్తుంది. ఇరవై ఏళ్ల వైవాహిక బంధం, సంతానం కూడా కలిగిన తర్వాత మీపై పోక్సో కేసు వేసే ఆస్కారం లేదు! వివాహం కాకుండా ఉండి ఉంటే అది వేరే సంగతి! బలవంతపు పెళ్లి చేశారనే ఆస్కారం కూడా లేదిప్పుడు. ఎందుకంటే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12 (2) ప్రకారం కూడా బలవంతపు పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామితో వైవాహిక సంబంధం కొనసాగిస్తే ఆ బలవంతం/మోసపూరితమైన అంగీకారం అనే కారణాలపై వివాహాన్ని రద్దు చేయడం కుదరదు. మీరిద్దరూ కలిసి ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ని కలవండి. సమస్యలు పరిష్కారం కాకపోతే సామరస్యంగా విడిపోయే ప్రయత్నం చేయండి. లాయర్ను సంప్రదించి మీకున్న అవకాశాలు, హక్కులను తెలుసుకోవడం కూడా మంచిదే! – శ్రీకాంత్ చింతల,హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. -
భర్తకు తుది వీడ్కోలు: కన్నీరుమున్నీరైన అంజలీ రూపానీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కడసారి దర్శించుకున్న భార్య అంజలి రూపానీ కన్నీంటి పర్యంత మయ్యారు. సోమవారం జరిగే అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని గౌరవ సూచికంగా త్రివర్ణ పతాకం కప్పి ఊరేగింపు నిర్వహించారు. ఆయనకు కడసారి నివాళులర్పిస్తున్న సమయంలో ఆయన భార్య అంజలి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిని అక్కడే ఉన్న ఆమె కుమారుడు ఆమెను ఓదార్చిన దృశ్యాలు చూసిన వారి కళ్లు చెమర్చకమానవు.విజయ్కుమారుడు రుషాభ్ రూపానీ తన తండ్రి అంత్యక్రియల సమయంలో దుఃఖిస్తున్న తల్లిని ఓదార్చిన హృదయ విదారకమైన దృశ్యాలు నెటిజన్లు, పార్టీ శ్రేణులను కంట కన్నీరుపెట్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, విజయ్ రూపానీ మరణం పట్ల గుజరాత్ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani's wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4— ANI (@ANI) June 16, 2025తండ్రి అకాలమరణంపై కుమారుడు రుషాభ్ రూపానీ మాట్లాడుతూ, ఇది తన కుటుంబానికి మాత్రమే కాదు, ఈ విషాదకరమైన సంఘటనలో ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి కూడా దుఃఖకరమైన సమయం అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి విజయ్ గురించి మాట్లాడుతూ, 50-55 సంవత్సరాలుగా, తన తండ్రి ప్రజల కోసం పనిచేశారని, వారందరూ తమ కష్ట సమయంలో తమకు అండగా వారి పక్కనే ఉన్నారని రుషాభ్ పేర్కొన్నారు.#WATCH | Former Gujarat CM Vijay Rupani's last rites begin with state honours in Rajkot. He died in the #AirIndiaPlaneCrash that occurred on June 12.. pic.twitter.com/mDIVSHQuoQ— ANI (@ANI) June 16, 2025 కాగ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ప్రమాదంలో మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఒకరు. ఆరు నెలల తర్వాత తన భార్య అంజలిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి లండన్కు వెళ్తున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్యవిజయ్ రూపానీ - అంజలి రూపానీ విజయ్ రూపానీ- అంజలి రూపానీ ఇద్దరూ తమ కెరీర్ ప్రారంభంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పనిచేశారు. ఈ పరిచయం నేపథ్యంలోనే అంజలి, విజయ్ 1980లో సాంప్రదాయ హిందూ వేడుకలో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.అంజలి అధికారికంగా ఎలాంటి బాధ్యతల్లో లేనప్పటికీ, బీజేపీ మహిళా మోర్చాకు సీనియర్ నాయకురాలిగా రాజకీయ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. వీరి చిన్న కుమారుడు పూజిత్ 3ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు. ఇపుడీ వయసులో భర్త దూరం కావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
విశాఖలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను డంబుల్తో కొట్టి చంపేశాడు.. భార్యను హతమార్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణమమని పోలీసులు అంటున్నారు.తమ్ముడి చేతిలో అన్న హతంమరో ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలా జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో అన్న కూన నర్సయ్యను కట్టెతో తలపై తమ్ముడు కూన రాములు విచక్షణారహితంగా కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వరంగల్లో దారుణం.. భర్త గొంతు కోసిన భార్య
సాక్షి, వరగల్: వరంగల్ నగరంలో దారుణ ఘటన జరిగింది. భర్త గొంతును భార్య కోసేసింది. దుబాయ్ వెళ్లి సంపాదించాలని భర్తపై ఒత్తిడి చేసింది. దుబాయ్ వెళ్లనందుకు భర్తపై హత్యాయత్నం చేసింది. భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఎంజీఎంలో మృత్యువుతో రెహమాన్ పోరాడుతున్నాడు. గత కొద్దిరోజులుగా రహమాన్ను భార్య కుటుంసభ్యులు వేధిస్తుండగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సమ్మర్ జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న బన్నీ భార్య (ఫొటోలు)
-
ఏపీలో ఘోరం: కడుపులో బిడ్డ ఉంది.. కొట్టొద్దన్నా..!
తాడేపల్లి రూరల్ : అసలే అర్ధరాత్రి.. ఆపై మద్యం మత్తు.. దీనికితోడు నేర చరిత్ర ఉన్న యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులుగా మారారు.. ఆమెపై దాడికి దిగారు.. గర్భంతో ఉన్నానని చెప్పినా వినకుండా పైశాచికంగా ప్రవర్తించారు..! తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధి పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఉండవల్లిలో ఉంటూ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలకంపాడు మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఐదు నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారు. ఆనందరావు, సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు వస్తున్న సంగతి తెలిసి యువకులు పరారయ్యారు. వీరిపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. -
పక్కా ప్లాన్ తో భర్తను హత్య చేసిన భార్య
-
భార్య తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన భర్త.. కారణం ఏంటంటే?
బెంగళూరు,సాక్షి: బెంగళూరు సమీపంలో ఒళ్లు గగూర్పొడిచే సంఘటన చోటు చేసుకుంది. అనేకల్ ప్రాంతంలోని హీలాలిగె గ్రామంలో నివసిస్తున్న ఓ యువకుడు తన భార్యను నరికి, ఆమె తలతో పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన ఘటన కలకలం రేపింది.28 ఏళ్ల శంకర్ అనే వ్యక్తి తన 26 ఏళ్ల భార్య మానసను తల నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్, మానస దంపతులు కొంతకాలంగా హీలాలిగె గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. జూన్ 3 రాత్రి శంకర్ తన పని ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మానస మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి శంకర్ తీవ్రంగా కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, మానస పుట్టింటికి వెళ్లింది.అయితే, ఆ తర్వాత కొన్ని రోజులు మానస తిరిగి ఇంటికి వచ్చి శంకర్ను వేధించినట్లు సమాచారం. హత్యకు ముందు రోజు కూడా ఆమె ఇంటికి వచ్చి గొడవ పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 6 రాత్రి శంకర్ తాను మానసను హత్య చేసి, ఆమె తల నరికి, నేరుగా సూర్యనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడే తాను హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శంకర్, తలను కూడా పోలీసులకు చూపించాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (బెంగళూరు రూరల్) సీకే బాబా మాట్లాడుతూ...రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో భార్యను తలను నరికి స్టేషన్కు తీసుకువచ్చాడు. మానసకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో గత వారం రోజులుగా ఈ దంపతులు తరచూ గొడవపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, శంకర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ మహేశ్ విట్టా (ఫొటోలు)
-
వైఎస్సార్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్కు తరలించారు. -
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి ప్రసవం
భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందేలా నిరంతరం పర్యవేక్షిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆ ఆస్పత్రులపై నమ్మకం పెరిగేలా అడుగు ముందుకేశారు. ఆయన భార్య శ్రద్ధ గర్భం దాల్చినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేరి్పంచగా సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్ నేతృత్వాన వైద్యులు సరళ, అనూష, హెడ్ నర్సు రేవతి బుధవారం ఉదయం 10.03 గంటలకు ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారు. కలెక్టర్ దంపతులకు ఇప్పటికే కుమారుడు ఉండగా, రెండో కాన్పులోనూ పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఆస్పత్రికి చేరుకున్న కలెక్టర్ తన కుమారుడిని ఎత్తుకుని మురిసిపోవడమే కాక వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉన్నందున ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. అభినందనలు తెలిపిన మంత్రులు కలెక్టర్ జితేష్ పాటిల్ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్విట్టర్లో ఆయనను ప్రశంసించారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కుటుంబీకులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. -
ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!
ఉద్యోగం మానేయమని చెప్పానని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది! తను ఉద్యోగం చేస్తే ఎవరిమాటా వినడం లేదనే ఉద్యోగం మానిపించాం. మళ్లీ తిరిగి వచ్చాక ఎలాగోలా మానిపిద్దాము అనుకుంటే నేను తాగుతున్నాను అనే వంకతో తిరిగి రానంటోంది. ఇప్పుడు నాకు కూడా తనంటే ఇష్టం పోయింది. ఏం చేయమంటారు? – పవన్ కుమార్, రాజమండ్రిమీరు వెంటనే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. మీలాంటి పురుషాధిక్య భావజాలం ఉన్న వ్యక్తితో ఎవరూ ఉండకూడదు. మీ నుంచి ఆవిడకి విముక్తి అవసరం. భర్తని తన తల్లిదండ్రుల నుంచి విడదీయాలి అనుకోవడం క్రూరత్వం అని చాలా సందర్భాలలో కోర్టులు ఎలాగైతే చెప్పాయో, భార్య చేస్తున్న ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనుకోవటం, భర్త – అత్తామామల ఆజ్ఞలు మాత్రమే పాటించాలి అనుకోవడం కూడా అలాగే ‘గృహ హింస’ కిందకి వస్తాయి. ఆవిడా మీరు వద్దని అంటోంది కాబట్టి సామరస్యంగా మాట్లాడుకొని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ (పరస్పర అంగీకార విడాకులు) తీసుకుని మిమ్మల్ని మీరు కేసులనుండి కాడుకోవటం మంచిది.నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు నెలసరి వడ్డీకి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద సంతకాలు, సాక్షుల సంతకాలు తీసుకున్నాను. అయితే అతను అసలు వడ్డీ కట్టకపోగా అసలు కూడా ఇవ్వడం లేదు. అతనికి, అతని భార్యకి, పిల్లలకి కూడా ఆస్తులు ఉన్నాయి. ఎంత అడిగినా ‘నేను చెక్కులు కూడా ఇవ్వలేదు కదా ఏం చేసుకుంటావో చేసుకో’ అంటున్నాడు. నా డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారమే లేదా? – ఎస్డీ. జహంగీర్, హైద్రాబాద్మీరు డబ్బులు ఇచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది అని చెప్తున్నారు కాబట్టి మీరు సివిల్ కోర్టును ఆశ్రయించి అతనిపై దావా వేయవచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతను మిమ్మల్ని మోసం చేశాడు అనడానికి ఏదైనా ఆధారం లేదా రుజువు చేసే పత్రాలు ఉంటే ΄ోలీసులను ఆశ్రయించి క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే వీలు ఉంది. మీ లేఖలో రాసిన దాని ప్రకారం మీ డబ్బులు మీకు తిరిగి రావు అని చెప్పలేము. అలాగే కచ్చితంగా వస్తాయి అని కూడా చెప్పలేము. మీ దగ్గర ఉన్న పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, మీ ఆర్థిక స్థితిగతులు చూపించడానికి వీలు ఉండే ఏదైనా ఆధారాలు తీసుకొని ఒక లాయర్ గారిని కలవండి. అన్నీ పరిశీలించిన తర్వాత మీ కేసులో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..) -
సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)
-
ప్రియుడితో కలిసి భర్త హత్య
యశవంతపుర)(కర్ణాటక): ప్రియునితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్ఆర్పుర తాలూకా కరగుంద వద్ద జరిగింది. ఎన్ఆర్పుర పోలీసుస్టేషన్లో మొదట అనుమానాస్పద కేసు నమోదైయింది. అయితే భార్య, ప్రియుని పనేనని బయట పడింది. ఎన్ఆర్ పుర పట్టణానికి చెందిన సుదర్శన్ మృతదేహం కడుహినబైలు గ్రామం కరుగుండ బస్టాండ్ సమీపంలో శనివారం బయట పడింది. ఆమె భార్య కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనేక అనుమానాలు రావడంతో పోలీసులు విచారణకు రెండు బృందాలను రచించారు. విచారణలో కమల హత్య చేయించిన్నట్లు బయట పడింది. కమల 10 ఏళ్లు క్రితం సుదర్శన్ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కమల, శివరాజ్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకొంది. దీనికి భర్త సుదర్శన్ అడ్డుచెప్పేవాడు, దీంతో భర్తని అడ్డు తొలగించాలని ప్లాన్ వేసుకొన్నారు. మద్యంలో నిద్రమాత్రాలను కలిపి ఇవ్వడంతో స్పృహ తప్పి పడిపోయాడు. శివరాజ్ అతని స్నేహితులు కలిసి గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్ను హ్యాక్ చేసి ఆమె డీప్ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!. -
900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్ దంపతులు.. లండన్ ప్రిన్సెస్తో డిన్నర్ (ఫోటోలు)
-
శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)
-
చనిపోయిన భార్యకు గుడి కట్టించిన భర్త
కొరుక్కుపేట(తమిళనాడు): అరియలూరుకి చెందిన ఓ ఎలక్ట్రీషియన్ తన భార్య జ్ఞాపకార్థం గుడి కట్టించి, పూజలు చేస్తున్నాడు. అరియలూర్కు చెందిన విజయకుమార్, కవిత అనే మహిళను 16 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారి వివాహం తర్వాత, అతను కవితను కాలేజీకి తీసుకెళ్లి, చదివించాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ, కవిత తన భర్త విజయకుమార్ను ‘ఆసియుమ్మ‘ (కోరిక) అని పిలుస్తూనే ఉంది. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ, వారి తల్లిదండ్రుల నుంచి కఠినమైన మాటలకు గురయ్యారు. ఒక సమయంలో ఆమె తన భర్త విజయకుమార్తో కలిసి తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్లారు. 2022లో, తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన కవిత, కృత్రిమ గర్భధారణ శస్త్రచికిత్స చేయించుకుంటున్న సమయంలో ఔషధం అధిక మోతాదు కారణంగా మరణించింది. రోజులు గడిచే కొద్దీ, భార్యపై అతనికి ప్రేమ తగ్గలేదు. ఆమెతో గడిపిన రోజులను లెక్కించుకుంటూ జీవిస్తున్న విజయకుమార్, తన ప్రియమైన భార్యకు గుడి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను ఇలంగేరి గ్రామంలో తన భార్య కవితకు ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. నాలుగు రోజులకొకసారి, విజయకుమార్ పనికి వెళ్లే ముందు, ఆమెకు పూజలు చేస్తున్నాడు. విజయకుమార్ ను అతని అత్తమామలు, బంధువులు మళ్లీ వివాహం చేసుకోమని చెప్పినప్పటికీ, తన భార్య కవితతో తన జీవితం ముగిసిందని, కానీ ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నానని చెబుతాడు. ఆయన మాట్లాడుతూ కవిత తనతో చాలా ప్రేమగా ఉండేదన్నారు. ఆ అభిమానానికి అవధులు లేవన్నారు. తనకు పిల్లలు లేకపోయినప్పటికీ, అది తమకు చాలా పెద్ద విషయం, తాము ఒకరికొకరు పిల్లలుగానే జీవించామని చెప్పారు. View this post on Instagram A post shared by Thanthi TV (@thanthitv) -
డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..!
మధిర: మధిరలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క మంగళవారం మామిడి పచ్చడి తయారు చేశారు. ఏటా బంధువులతో పాటు కార్యాలయ ఉద్యోగులు, గన్మన్ల కోసం ఆమె పచ్చడి తయారుచేసి అందించడం దశాబ్దకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం స్థానిక మహిళలతో కలిసి పచ్చడి సిద్ధం చేశారు. ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్ -
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్స్టేషన్లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి.


