World Braille Day
-
అంధుల అక్షర శిల్పి
అంధులు సైతం సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందేనన్న ఆశయంతో వారి విద్యార్జన కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన అక్షర శిల్పి లూయీ బ్రెయిలీ. ఫ్రాన్స్లో ఒక మారుమూల గ్రామమైన కూప్వ్రేలో సైమన్, మోనిక్ దంపతులకు 1809 జనవరి 4న ఆయన జన్మించాడు. నలుగురు సంతానంలో చివరివాడు బ్రెయిలీ. ఆయన తల్లిదండ్రులు వృత్తి రీత్యా చర్మకారులు. లూయీ తన తండ్రితో కలిసి ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసే దుకాణానికి వెళ్లాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తూ ఉండగా చువ్వ ఎగిరి వచ్చి లూయీ కంటిలో గుచ్చుకుంది. పేదరికం కారణంగా మంచి వైద్యం అందించలేక పోవటంతో కంటిచూపు మొత్తం పోయింది. తర్వాత కొంతకాలానికే ఇన్ఫెక్షన్ ఎక్కువై రెండవ కంటిచూపు కూడా పోయింది. అప్పుడు పిల్లాడి వయసు ఐదేళ్లు. అయితే అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు తమ పెద్ద పిల్లలతో పాటుగా లూయీని గ్రామంలో ఉన్న పాఠశాలకు పంపించారు. అక్కడ కొడుకు కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తండ్రి... చెక్కపై మేకులను అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా అక్షర జ్ఞానం కలిగించాడు. అతడిలోని చదువుకోవాలనే పట్టుదలను, తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.1821లో చార్లెస్ బార్బియర్ అనే సైన్యాధికారి తన సైనికులకు 12 చుక్కలతో నిగూఢ లిపిలో శిక్షణ ఇచ్చేవాడు. దాన్ని లూయీ అభ్యసించాడు. దానితో సంతృప్తి చెందకుండా ఆ లిపిపై పరిశోధనలు ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల కృషి అనంతరం 1832లో సరళమైన విధానంలో చుక్కల లిపిని కనుగొన్నాడు. దానికి ఆయన పేరుమీదనే తర్వాత బ్రెయిలీ లిపి అని పేరొచ్చింది. ఇది ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా ఆనాడే రూపొందిందంటే ఆయన ముందుచూపు ఎంతో అర్థమవుతుంది. బ్రెయిలీని క్షయ మహమ్మారి పట్టి పీడించటంతో నాలుగు పదుల వయసులోనే 1852 జనవరి 6న కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎంతోమంది అంధ వికలాంగులను విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికాధిపతులుగా, సంగీత కళాకారులుగా, చిత్ర కారులుగా అనేక రంగాల్లో బ్రెయిలీ లిపితో అగ్రభాగాన నిలిచేట్లు చేసిన లూయీ బ్రెయిలీ అంధుల అక్షర ప్రదాతగా ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటారు.– పి. రాజశేఖర్ ‘ ఆలిండియా జనరల్ సెక్రెటరీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (నేడు లూయీ బ్రెయిలీ జయంతి; జనవరి 6న వర్ధంతి) -
World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది?
అంధులు.. దృష్టిదోషమున్నా మనసుతో లోకాన్ని చూసేవారు. ఊహలతో, ఊసులతో ప్రపంచాన్ని వీక్షించేవారు. వీరు సమాజంతో సంబంధాలు నెరవేర్చేందుకు ఏర్పడినదే బ్రెయిలీ లిపి. ఇది అంధులకు వరంలాంటిదని చెప్పుకోవచ్చు.ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతీఏటా జనవరి 4న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో జీవితం గడుపుతున్న వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. లూయిస్ బ్రెయిలీ అనే మహనీయుని పుట్టినరోజు సందర్భంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయనే బ్రెయిలీ లిపిని ఆవిష్కరించారు. బ్రెయిలీ లిపి అనేది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయోగించే భాష. పుట్టుకతోనో, లేదా ఇతరత్రా కారణాలతో కంటి చూపు కోల్పోయిన వారు చదువుకు దూరమవకుండా ఉండేందుకే ఈ బ్రెయిలీ లిపిని రూపొందించారు. అంధత్వంతో బాధపడుతున్న వారు తమ స్వశక్తితో సమాజంలో ఇతరులతో సమానంగా నిలిచేందుకు బ్రెయిలీ లిపి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో సతమతమవుతున్నవారికి లూయిస్ బ్రెయిలీ తన ఆవిష్కరణతో మార్గదర్శిగా నిలిచారు. లూయీస్ బ్రెయిలీ జీవించి ఉన్నప్పుడు దక్కని గౌరవం అతని మరణాంతరం దక్కింది. ఆయన పుట్టినరోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరపుకోవడమే ఆయనకు దక్కిన అత్యున్నత గౌరవం.లూయిస్ బ్రెయిలీ 1809, జనవరి 4న ఫ్రాన్స్లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు సైమన్ రాలీ బ్రెయిలీ. అతను నాటిరోజుల్లో రాజ గుర్రాలకు జీనులు తయారు చేసేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో లూయిస్ తన మూడేళ్ల వయసు నుండే తన తండ్రితో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక కత్తి అతని ఒక కన్నుకు గుచ్చుకుని, అతని చూపు దెబ్బతింది. కొద్దికాలానికి మరో కంటి చూపు కూడా పోయింది. సరైన వైద్యం అందక లూయీస్ ఎనిమిదేళ్ల వయసులోనే పూర్తిగా చూపు కోల్పోయాడు. తరువాత లూయిస్ బ్రెయిలీ అంధుల పాఠశాలలో చేరాడు. చీకట్లో కూడా మెసేజ్లను చదవడంలో సహాయపడే సైనిక కోడ్ గురించి లూయిస్కు బాగా తెలుసు. అంధుల కోసం అలాంటి స్క్రిప్ట్ రూపొందించాలనే ఆలోచన అతని మదిలో మెదిలింది. దీంతో అతను బ్రెయిలీ లిపిని రూపొందించారు. ఇది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయుక్తమయ్యే ఒక స్పర్శ కోడ్. ఈ లిపి కోసం ఎంబోస్డ్ పేపర్ను వినియోగిస్తారు. దానిపై ఉన్న చుక్కలను స్పర్శిస్తూ చదవవచ్చు. బ్రెయిలీ లిపిని టైప్రైటర్తో సమానమైన బ్రెయిల్రైటర్ ద్వారా రాయవచ్చు. ఇదేకాకుండా స్టైలస్, బ్రెయిలీ స్లేట్ ఉపయోగించి కూడా రాయవచ్చు. బ్రెయిలీ లిపిలో ఉపయోగించే చుక్కలను సెల్ అని అంటారు.ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. సుమారు 253 మిలియన్ల మంది దృష్టిలోపానికి గురయ్యారు. దీనిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018లో లూయిస్ బ్రెయిలీ జన్మదినమైన జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేసింది. అదిమొదలు ప్రతీయేటా జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Newton Birthday: ఆ మహాశాస్త్రవేత్తకు రెండు జననమరణాలు -
అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!
చదవడం, వ్రాయడం అనేవి రెండు కూడా ప్రజలు నేర్చుకోగల అత్యంత ఉపయోగకరమైన ముఖ్యమైన విషయాలు . అంతేకాదు ఇవి రెండే మానవులు విద్యనభ్యసించడానికి ఉపకరించే అత్యం తముఖ్యమైన సాధనాలు. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అంధులు ఉన్నారు. వారు విద్యనభ్యసంచాలంటే ఎలా అనేదానికి సమాధానమే ఈ బ్రెయిలీ లిపి. లక్షలాది మంది అంధులు మంచి విద్యనభ్యసించి వారు జీవితంలో విజయాలను సాధించేందుకు వీలు కల్పించిన పద్ధతి. బ్రెయిలీ అనేది అంధుల కోసం కనుగొన్న వ్రాతపూర్వక భాష రూపం. దీనిలో అక్షరాలను వేలికొనలతో గుర్తుపట్టేగలిగే విధంగా ఎత్తైన చుక్కల నమూనా. బ్రెయిలీ డే ప్రాముఖ్యత అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి కమ్యూనికేషన్ సాధనంగా ఉన్న బ్రెయిలీ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకే ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృష్టి లోపం ఉన్నవారు బ్రెయిలీలో చదివి వ్రాస్తారు. దృష్టి లోపం లేని వ్యక్తులు కళ్ళతో బ్రెయిలీని చదవగలరు. వివిధ భాషలలో వర్ణమాల క్రమాన్ని బట్టి విలువలు బ్రెయిలీ చిహ్నాలకు కేటాయించబడతాయి. చాలా బ్రెయిలీ వర్ణమాలలు 26 అక్షరాల లాటిన్ వర్ణమాలకు చెందిన ఫ్రెంచ్ సార్టింగ్ క్రమాన్ని అనుసరిస్తాయి. జపనీస్, కొరియన్ బ్రెయిలీ ఇతర బ్రెయిలీ ట్రాన్స్క్రిప్షన్ల నుండి చాలా భిన్నంగా ఉంటాయి. అంతేకాదు బ్యాంకులు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు వంటి అనేక సంస్థలు ఇప్పటికీ తమ ప్రింటెడ్ మెటీరియల్లో బ్రెయిలీ వెర్షన్లను అందించనందున ఈ రోజు దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు స్వేచ్చయుతం జీవించడానికి మన వంతుగా అందించాల్సిన సహాయ సహకారాలను గురించి వివరిస్తుంది. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు.... జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 2018లో ప్రకటించింది. మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి4, 2019న జరుపుకున్నారు. జనవరి 4న ఎందుకంటే.. 1809లో బ్రెయిలీని కనిపెట్టిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ జన్మదినం అయిన జనవరి 4న పురస్కరించుకుని బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. లూయిస్ బ్రెయిలీ ఎవరు? లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ విద్యావేత్త. అతను కనిపెట్టిన బ్రెయిలీ లిపి వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంధులకు చదవడానికి విస్తృతంగా ఉపయోగించే మాధ్యమంగా ఉంది. లూయిస్ బ్రెయిలీకి మూడేళ్ల వయసులో తన తండ్రి జీనులు తయారు చేసే దుకాణంలో కుట్టుపని చేస్తున్నప్పుడు ప్రమాదంలో ఒక కన్ను పోయింది. అయితే కొన్నాళ్లకు ఇన్ఫెక్షన్ ఏర్పడి రెండు కళ్లకు వ్యాపించి పూర్తిగా అంధత్వం ఏర్పడింది. కానీ అతను అన్ని సవాళ్లను అధిగమించి విద్యలో రాణించాడమే కాకుండా కొత్త పద్ధతిలో త్వరగా చదవడం, కమ్యూనికేట్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. అంతేకాదు అందుల కోసం బ్రెయిలీని కనిపెట్టాడు. బ్రెయిలిని అనేది నైట్ రైటింగ్ అనే స్పర్శ కోడ్... అయితే ఈ వ్యవస్థ రాత్రిపూట ఎటువంటి కాంతి వనరులు లేకుండా సైనికులు నిశ్శబ్దంగా కమ్యూనికేట్ చేయడానికి నెపోలియన్ ఆదేశాల మేరకు చార్లెస్ బార్బియర్ చేత అభివృద్ధి చేయబడిన నైట్ రైటింగ్ అనే స్పర్శ సైనిక కోడ్. అంతేకాదు లూయిస్ బార్బియర్ నైట్ రైటింగ్' గురించి తెలుసుకున్నాడు. దీన్ని ఆధారంగా చేసుకునే బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. అయితే లూయిస్ క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు గురువుగారి అంధుల లిపికి గుర్తింపునివ్వాలని పోరాటాలు చేయగా.. బ్రెయిలీ లిపికి గుర్తింపు నిచ్చి.. దేశ ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్. నేటికీ అంధులకు అన్నిరకాల పత్రికలు, పుస్తకాలు బ్రెయిలీ లిపిలోనే రూపొందిస్తున్నారు. లూయిస్ పేరు మీద స్టాంపులు బ్రెయిలీ కనిపెట్టిన అంధుల లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా రూపొందించబడిందంటే ఆయన ముందుచూపు ఏమిటో అర్థమవుతుంది. లూయిస్ చనిపోయాక ఆయన పేరు మీద స్టాంపులు, కరెన్సీ, విద్యాసంస్థలు, పట్టణాలు వెలిశాయి. భారతదేశం 2 రూపాయల నాణెం మీద, యుఎస్ డాలర్ మీద బ్రెయిలీ ముఖచిత్రాన్ని ప్రచురించారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంప్ను విడుదల చేశాయి. (చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!) -
వరల్డ్ బ్రెయిలీ డే
-
6న అంధుల ‘5కే వాక్’
సుల్తాన్బజార్, న్యూస్లైన్: ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మిణుగురులు’ సినిమా బ్యానర్ రెస్పెక్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 6న నెక్లెస్రోడ్డులో అంధుల ‘5కే వాక్’ నిర్వహించనున్నట్లు సినిమా నిర్మాత అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి తెలిపారు. గురువారం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెస్పెక్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో అంధులకు చేయూత అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు ట్యాంక్బండ్ నెక్లెస్ రోడ్డులో ఈ వాక్ ఉంటుందని, ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు హాజరవుతున్నట్టు ఆయన చెప్పారు. విశిష్ట అతిథులుగా హీరోయిన్ శ్రేయశరన్, దర్శకుడు శేఖర్కమ్ముల పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు అయోధ్యకుమార్ వివరించారు. ఈ సమావేశంలో శ్రవణ్ కుమార్, ఈవెంట్ కో ఆర్డినేటర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.