Yadadri District News
-
చిన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించండి
భువనగిరిటౌన్ : రాజీపడదగిన కేసుల్లో సంబంధిత కక్షిదారులకు నోటీసులు ఇవ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. ఈనెల 8న జరిగే జాతీయ లోక్అదాలత్ నేపథ్యంలో సోమవారం జిల్లాలోని న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులతో సమావేశమై పెండింగ్ కేసులపై సమీక్షించారు. చిన్నచిన్న కేసులను రాజీమార్గంలో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కా ర్యదర్శి మాధవిలత, జిల్లా కోర్టు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీని యర్ సివిల్ జడ్జి శ్యామ్సుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఓడినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం
ఫ అలుగుబెల్లి నర్సిరెడ్డి నల్లగొండ: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఉపాధ్యాయులు రెండోసారి వద్దనుకున్నారు.. కాబట్టి ఓడిపోయాను.. అయినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తాను’ అని టీఎస్ యూటీఎఫ్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఓటమి అనేది సహజమని గతంలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఇప్పుడు శ్రీపాల్రెడ్డికి ఇచ్చారని చెప్పారు. మరోసారి తనకు ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, వైద్యం వ్యాపారీకరణ కావద్దన్న డిమాండ్తో పోరాటం చేస్తానన్నారు. తాను గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికీ ఓటర్లు శ్రీపాల్రెడ్డికి అవకాశం ఇచ్చారని దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. -
నృసింహుడికి అలంకార వైభవం
ఉదయం మత్స్యరూపుడై, సాయంత్రం స్వర్ణ శేషవాహనంపై దివ్యదర్శనం యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచనారసింహుడి అలంకార, వాహనా సేవలకు అర్చకులు సోమవారం శ్రీకారం చుట్టారు. ఉదయం స్వామివారు మత్య్సవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం దక్షిణ ప్రాకార మండపంలోని నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపజేసి పట్టువస్త్రాలు, బంగారు, వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ముగ్ధమనోహరంగా అలంకరించారు. అనంతరం వేదపండితులు, రుత్వికులు, పారాయణీకుల వేదమంత్రోచ్ఛరణతో మంగళవాయిద్యాలు మోగుతుండగా, భక్తజనులు గోవిందనామస్మరణ చేస్తుండగా తిరు, మాడ వీధుల్లో అలంకార సేవను ఊరేగించారు. ఆలయంలో సాయంత్రం సాయంత్రం శ్రీస్వామివారిని స్వర్ణ శేష వాహనంపై ఊరేగించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీస్వామివారిని వటపత్రశాయిగా అలంకరిస్తారు. సాయంత్రం హంసవాహన సేవపై ఊరేగిస్తారు. -
శిక్షణతో బోధనపై పట్టు
భువనగిరి: నూతన ఉపాధ్యాయులు బోధనపై పట్టు పెంచుకునేందుకు శిక్షణ తరగతులు దోహపడుతాయని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. డీఎస్సీ– 2024 ద్వారా గత అక్టోబర్లో నియామకమైన 133 మంది స్కూల్ సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) టీచర్లకు భువనగిరిలోని శ్రీసాయికృప డిగ్రీ కళాశాలలో మార్చి 28నుంచి ఇస్తున్న వృత్తి శిక్షణ సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. తరగతి గది నిర్వహణ, అభ్యసన ప్రక్రియలపై శిక్షణలో నేర్చుకున్న విషయాలను బోధనలో అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు చదువులో సామర్థ్యాలను చాటేలా తీర్చిదిద్దాలని కోరారు. శిక్షణలో నేర్చుకున్న విషయాల గురించి డీఈఓ వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జె.శ్రీనివాస్, రిసోర్స్పర్సన్లు యాదిరెడ్డి, వెంకటేశ్వర్లు, సంధ్య, లావణ్య, లత, శ్రీశైలం, వెంకన్న, రహీం, ఉదయ్ కుమార్, టెక్నికల్ పర్సన్ సునీల్ పాల్గొన్నారు. ఫ డీఈఓ సత్యనారాయణ -
పలకరించి.. సమస్యలు తెలుసుకొని..
రామన్నపేట : పల్లెబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హనుమంతరావు సోమవారం రామన్నపేట మండలం ఇస్కిళ్లలో పర్యటించారు. ఉదయం 5.30 గంటలకే గ్రామానికి చేరుకున్నారు. స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ గంగాధర్, డీపీఓ సునంద, డీఆర్డీఓ నాగిరెడ్డితో కలిసి సుమారు నాలుగు గంటలు గ్రామంలో పర్యటించారు. సంక్షేమ పథకాల అమలుపై నేరుగా ప్రజలతో మాట్లాడారు. రేషన్ కార్డులో పిల్లలు, కోడళ్ల పేర్లు లేవని, గ్యాస్ సబ్సిడీ రావడం లేదని, గ్యాస్ కనెక్షన్ లేదని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని అక్కడికక్కడే అధికా రులను ఆదేశించారు. రైతుభరోసా రాలేదని ఒక రైతు తెలియజేయగా.. వ్యవసాయ అధికారి యాప్ లో పరిశీలించి ప్రాసెస్లో ఉందని తెలిపారు. ఉపాధి పథకం సిబ్బంది పనితీరు, వేతనాల చెల్లింపుపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాను పరిశీలించారు. బోధకాలతో బాధపడుతున్న వలీ మాబేగంకు పింఛన్ మంజూరు చేయాలని డీఆర్డీఓను ఆదేశించారు. సుమధుర పౌండేషన్వారు రూ.2 కోట్లతో నిర్మించిన పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి వసతులు, ల్యాబ్ను చూశారు. అలాగే బాలింతలు, గర్భిణులకు అందజేస్తున్న సేవలపై ఆరా తీశారు. నర్సరీని సందర్శించారు. గ్రామస్తుల విన్నపం మేరకు ప్రాథమికోన్నత పాఠశాల అప్గ్రేడ్కు అవసరమైన ప్రతి పాదనలు పంపించాలని ఎంఈఓను ఆదేశించారు. విద్యాసంస్థల సమయా నికి బస్సులు నడపాలని ఆర్ఎంను ఆదేశించారు. వీటితో పాటు మరికొన్ని ఆహామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్బహదూర్, ఎంపీడీఓ యాకుబ్నాయక్, ఏఓ తదితరులు ఉన్నారు.పెద్దమ్మా.. పింఛన్ వస్తుందా గుండా పుష్పమ్మ ఇంటికి వెళ్లి పెద్దమ్మా.. పింఛన్ వస్తుందా అని కలెక్టర్ ఆప్యాయంగా పల కరించారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీళ్లు వస్తున్నాయా, ఉచిత కరెంట్ బిల్లు కడుతున్నావా? గ్యాస్ సబ్సిడీ వస్తుందా అని అడిగారు. భగీరథ నీళ్లను వేడిచేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆమెకు సూచించారు. ఫ ఇస్కిళ్లలో కలెక్టర్ పల్లెబాట ఫ నాలుగు గంటలు గ్రామంలో పర్యటించి సమస్యలపై ఆరా.. -
మాడు పగిలే ఎండలు
భువనగిరిటౌన్ : జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం సంస్థాన్నారాయణపురం, బీబీనగర్, బొమ్మలరామారం మండలాల్లో 39 డిగ్రీలు, మరో నాలుగు మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండడం, ఎండవేడిమికి ఉక్కపోత తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజులు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో జిల్లాను ఎల్లో జోన్గా వాతావరణ శాఖ ప్రకటించింది. బయటకు బయటికెళ్లేటప్పుడు నీళ్లు, చల్లని ద్రవపదార్థాలు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. సోమవారం ఇలా.. మండలం ఉష్ణోగ్రత నారాయణపురం 39.0బీబీనగర్ 39.0బి.రామారం 39.0మోటకొండూరు 38.4చౌటుప్పుల్ 38.3రాజాపేట 38.1ఆత్మకూరు 38.1ఆలేరు 37.9భువనగిరి 37.0మోత్కూరు 37.0రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఫ మూడు మండలాల్లో 39 డిగ్రీలు నమోదు ఫ జిల్లాను ఎల్లో జోన్గా ప్రకటించిన వాతావరణ శాఖ -
బైక్ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి
● అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలుమంచాల, మర్రిగూడ: నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన మైలారం జంగయ్య(27) మృతిచెందాడు. అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జంగయ్యకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పని నిమిత్తం భార్య పార్వతమ్మ, కుమార్తె అశ్వితతో కలిసి స్వగ్రామం యరగండ్లపల్లికి వచ్చిన జంగయ్య సోమవారం తిరిగి బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి సమీపంలోని జేబీ వెంచర్ వద్ద వీరి బైక్ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. పార్వతమ్మ, అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జంగయ్య మృతితో యరగండ్లపల్లి విషాదఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో వ్యక్తి బలవన్మరణంఆత్మకూరు(ఎం): అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన ఆత్మకూరు(ఎం) మండలంలోని కొరటికల్ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన పల్ల్లపు విజయేందర్(38) గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది నుంచి విజయేందర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లోనే గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య సౌందర్య, కుమారుడు రాకేష్, కుమార్తె శృతి ఉన్నారు. -
శ్రీపాల్కే గురువుల పట్టం
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్రెడ్డి గెలుపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. అయితే నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్రెడ్డికి కూడా లేకపోవడంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. దీంతో శ్రీపాల్రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోల్ కాగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్రెడ్డి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత కోటా రాకున్నా శ్రీపాల్రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగలి శ్రీపాల్రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 , సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్రెడ్డికి అప్పటి వరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్రెడ్డికి కూడా ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్రెడ్డి 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్రెడ్డికి 1348 ఓట్లు పెరిగి, 9021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. . ● హర్షవర్ధన్రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఫ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం ఫ సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ ఫ ప్రధాన అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ కౌంటింగ్ సాగింది ఇలా..నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రకియ నల్లగొండలోని ఆర్జాలబావి గోదాముల్లో సోమవారం పూర్తయింది. ఉదయం 7 గంటలకు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు తీసుకొచ్చారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి 25 చొప్పున బ్యాలెట్ బాక్సులను 8 రౌండ్లలో కౌంటింగ్ హాల్కు తీసుకొచ్చారు. 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ హాల్లో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి 25 బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టారు. ఈ ప్రక్రియ ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత కట్టలన్నింటినీ డ్రమ్ములో వేసి కలిపారు. ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం 3 గంటలకు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కూడా గెలుపు కోటా రాలేదు. శ్రీపాల్రెడ్డి అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలువగా అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండవస్థానంలో, హర్షవర్ధన్రెడ్డి మూడవ స్థానంలో నిలిచారు. సాయంత్రం 4 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రాత్రి 9 గంటలకు 17వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. శ్రీపాల్రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి మిగిలారు. హర్షవర్ధన్రెడ్డిని ఎలిమినేషన్ చేసి 18వ రౌండ్ ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత ఓటమిని అంగీకరిస్తూ అలుగుబెల్లి నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. శ్రీపాల్రెడ్డి విజయ సంకేతం చూపించి మీడియా పాయింట్కు వచ్చారు. శ్రీపాల్రెడ్డి విజయం సాధించినట్లు రిట ర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. -
అనుమానంతో భార్యను కొట్టిన భర్త
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతితిప్పర్తి: భార్యపై అనుమానంతో భర్త ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన తిప్పర్తి మండలం సర్వా రం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్వారం గ్రామానికి చెందిన బండారి మహేశ్వరీ(23) కేతేపల్లి మండలం బండకిందిగూడెం గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్ను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి మహేశ్వరీపై అనుమానం పెంచుకున్న శ్రీకాంత్ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్దిచెప్పడంతో ఏడాది క్రితం వారి కాపురాన్ని సర్వారం గ్రామానికి మార్చారు. అయినప్పటికీ శ్రీకాంత్లో ఎలాంటి మార్పురాలేదు. శనివారం శ్రీకాంత్ మహేశ్వరీతో గొడవపడి ఆమె తీవ్రంగా కొట్టాడు. ఇరుగుపొరుగు వారు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి మైనం లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్యచింతపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్నగర్లో సోమవారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన బాణాల స్వాతి(38) కుటుంబంతో కలిసి చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్నగర్లో నివాసం ఉంటోంది. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వాతి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి మాల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు ఆత్మకూర్(ఎస్): తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బత్తుల రమేష్ రోజుమాదిరిగా సోమవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమేష్ను గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు తదితరులు ఆస్పత్రిలో పరామర్శించారు. -
మొదటి ప్రాధాన్యతలో తేలని ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా గెలుపు కోటా సాధించలేకపోయారు. 25,797 ఓట్లకుగాను 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అందులో సగానికంటే ఒక ఓటు ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లను గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. పోటీలో ఉన్న19 అభ్యర్థుల్లో ఎవరూ మొదటి ప్రాధాన్యతలో గెలుపు కోటా ఓట్లను సాధించలేకపోయారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ప్రధాన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డికి 4,437 ఓట్లు రాగా, బీసీ సంఘాలు, ఎస్టీయూ బలపరిచిన పూల రవీందర్కు 3,115 ఓట్లు, టీపీయూఎస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి 2,289 ఓట్లు, ప్రైవేట్ విద్యా సంస్థల యజమాని ఎస్.సుందర్రాజు 2,040 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు ఒక్క ఓటు మొదలుకొని వేయిలోపే ఓట్లు రావడం గమనార్హం. మధ్యాహ్నం తరువాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదటి ప్రాధాన్యతలో ఎవరికి గెలుపు కోటా ఓట్లు రాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 3.30 గంటల సమయంలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. 19 మందిలో అతి తక్కువగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రాత్రి 7 గంటల వరకు 14 మంది ఎలిమినేషన్ తరువాత 15వ రౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఎవరికీ కోటా ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియతో కౌంటింగ్ కొనసాగించారు. ఇలా రాత్రి 11 గంటల వరకు కౌంటింగ్ కొనసాగింది. చివరకు పీఆర్టీయూటీ–టీఎస్ బలపరచిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్రెడ్డి తన సమీప ప్రత్యర్థి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలుపు కోటాగా 11,821 ఓట్లు మధ్యాహ్నం తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 5,521 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన శ్రీపాల్రెడ్డి -
వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
మోత్కూరు: ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మోత్కూరు మండల కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మోత్కూరుకు చెందిన కందుకూరి మున్నాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. డిసెంబర్ 30వ తేదీన సదరు బాలిక కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి మోత్కూరుకు చేరుకుంది. అప్పటి నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆ బాలిక, మున్నా సహజీవనం చేస్తున్నారు. బాలిక ఫోన్లో తన తల్లితో అప్పుడప్పుడు మాట్లాడుతూ తాను బాగానే ఉన్నానని, తాను మున్నా అనే యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడిని వివాహం చేసుకునేందుకు వచ్చానని తెలియజేసేది. కానీ తాను ఉంటున్న చిరునామాను మాత్రం తల్లిదండ్రులకు వెల్లడించలేదు. ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సదరు బాలిక తన తల్లికి వీడియో కాల్ చేసి రూ.15వేలు కావాలని ఏడుస్తూ అడిగింది. ఎందుకమ్మా అని కూతురుని తల్లి ప్రశ్నించగా.. ‘మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకురావాలని మున్నా తనను కొట్టాడని తల్లికి వివరించింది’. ఈ క్రమంలో అదే రోజు రాత్రి 8గంటల సమయంలో తాము అద్దెకు ఉంటున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకుంది. తనను మున్నా వేధిస్తున్న విషయాలన్నీ బాలిక సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మున్నా అనే యువకుడు తన కుమార్తెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని, ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బుల కోసం తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు చౌటుప్పల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన చీకూరు అనిల్కుమార్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భద్రాచలం నుంచి పేపర్ లోడ్తో హైదరాబాద్కు బయల్దేరాడు. మార్గమధ్యలో ఆదివారం అర్ధరాత్రి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో గల వంశీ రబ్బర్ కంపెనీ వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిల్కుమార్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్ను కారు ఢీకొట్టడంతో.. చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు బైక్పై వెళ్తున్న వ్యక్తిని అదే మార్గంలో ఖమ్మం పట్టణానికి వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమదానికి కారణమని తెలుస్తోంది. రైలు కింద పడి వ్యక్తి మృతిబీబీనగర్: బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. భువనగిరి రైల్వే హెడ్కానిస్టేబుల్ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ రైల్వే స్టేషన్ నుంచి పగిడిపల్లి వెళ్లే రైల్వే మార్గంలో సోమవారం తెల్లవారుజామున రైలు కింద పడి సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడు నలుపు రంగు టీషర్టు, తెలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని రైల్వే హెడ్కానిస్టేబుల్ పేర్కొన్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9848222169, 8712568454 నంబర్లను సంప్రదించాల ని సూచించారు. -
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సోమవారం భజన కార్యక్రమాలు, పోతన భాగవత అంతర్గత రహస్యాలు, నవ విధ భక్తి తత్త్వంపై ఉపన్యాసం, పాల రామాంజనేయ హరికథ, శాసీ్త్రయ సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. సాయంత్రం గరికపాటి నరసింహరావు శ్రీనృసింహ వైభవం గురించి ప్రవచించారు. కొండ కింద గల దీక్షపరుల మండపంలో భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. ఆలయ సన్నిధిలో మేడ్చల్–మలా్క్జ్గిరి జిల్లా ఘట్కేసర్లోని నీలిమ ఆస్పత్రి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. -
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
భువనగిరి: బంధువుల ఇంట్లో పండుగకు వచ్చిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఒంటెద్దు అచ్చయ్య ఈ నెల 1వ తేదీన భువనగిరి మండలం నందనం గ్రామంలో తమ బంధువులు బాలమ్మ పండుగ చేస్తే వచ్చాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి స్వగ్రామానికి బయల్దేరిన అచ్చయ్యను భువనగిరికి వెళ్లే ఆటోలో బంధువులు ఎక్కించారు. కానీ అచ్చయ్య ఇంటికి చేరుకోలేదు. అచ్చయ్య కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అచ్చయ్య గోధుమ రంగు షర్ట్, ప్యాంట్ ధరించాడని, అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అచ్చయ్య కుమార్తె అఖిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపారు -
యాదాద్రి భువనగిరి
ఇఫ్తార్ 6–29 (మంగళవారం సాశ్రీశ్రీ) సహర్ 5–10 (బుధవారం ఉశ్రీశ్రీ)7అక్రమాల కట్టడికి ‘జన్మన్రే’గా ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జన్మరేగా యాప్ను తీసుకువచ్చింది. - 9లోమంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.- 8లో -
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
నకిరేకల్: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు, యువతి మృతిచెందారు. ఈ ఘటన నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం తెల్ల వారుజామున జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి నల్గొండ ప్రభు(27) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుకు వివాహం కాగా.. భార్యాభర్తల మధ్య తగాదాలతో విడిపోయారు. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికే చెందిన పూలుగుజ్జు నరేష్ సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన వైష్ణవి(25)ని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నరేష్, వైష్ణవిల మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్ల నుంచి వైష్ణవి తన తల్లిగారి ఊరైన టేకుమట్లలో పిల్లలతో కలిసి ఉంటుంది. చెర్వుగట్టుకు వెళ్లి వస్తూ.. వైష్ణవితో ఉన్న పరిచయం మేరకు టేకుమట్ల నుంచి ఆమెను తీసుకుని ప్రభు ఆదివారం రాత్రి నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయానికి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున వారు చెర్వుగట్టు నుంచి బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. వయా నల్ల గొండ, తాటికల్ మీదుగా నకిరేకల్కు చేరుకున్నారు. అనంతరం వీరు నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ మీదకు రాంగ్ రూట్లో ఎక్కి సూర్యాపేట వైపు కొద్దిదూరం వెళ్లగానే ఎదురుగా గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభు, వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ప్రభు సోదరుడు ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానం వచ్చి పోస్టుమార్టం.. నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి ఆస్పత్రి వద్దకు చేరకుని మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అనుమానంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఫోన్సిక్ నిపుణులచే పోస్టుమార్టం చేయించాలని డాక్టర్లు తెలిపారు. దీంతో ప్రభు, వైష్ణవి మృతదేహాలను నల్లగొండ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్టులో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నిర్ధారణ కావడంతో పోలీసులు వారిద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు, యువతి దుర్మరణం నకిరేకల్ పట్టణ శివారులో భైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం -
యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజీలో నేడు టెక్ ఫెస్ట్
యాదగిరిగుట్ట : 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల సృజన టెక్ ఫెస్ట్కు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వేదిక కానుంది. మంగళవారం ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే టెక్ ఫెస్ట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగం విద్యార్థులు స్టాల్స్ ఏర్పాటు చేసి ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు.ఉత్తమ ప్రాజెక్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ టెక్ ఫెస్ట్ నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గుట్ట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కోరారు. సాగునీటిపై సమీక్ష భువనగిరిటౌన్ : రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సాగునీటి సరఫరా, నీటిపారుదల శాఖ పని తీరుపై సమీక్షించారు. పంటలకు రానున్న పది రోజులు కీలకమని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. నల్ల గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు చోట్ల సాగునీటి సమస్య ఉందని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పొలాలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కాలువలకు విడుదల చేసి నీటిని చివరి ఆయకట్టుకు అందేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హనుమంతరావు, విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్చరీలో సత్తాచాటిన సర్వేల్ గురుకులం విద్యార్థి సంస్థాన్ నారాయణపురం : సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఈనెల 2వ తేదీన నిర్వహించిన బాలబాలికల రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాల తన్వీత్ప్రేమ్చంద్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. అండర్–15 విభాగంలో తృతీయ స్థానంలో నిలిచాడు. తన్వీత్ప్రేమ్చంద్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అతన్ని ప్రిన్సిపాల్ సతీష్కుమార్, పీడీ రామకృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీలోని అంతర్జాతీయ ప్రమాదాలతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. సోమవారం ఎంజీయూలో 2,160 చదరపు మీటర్ల ఇండోర్ స్టేడియం ఫ్లోరింగ్, 400 మీటర్ల ఎనిమిది లేన్ల ట్రాక్ను సింథటిక్ ట్రాక్గా మార్చేందుకు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, కబడ్డీ వంటి క్రీడల్లో విద్యార్థులకు అధునాతన సింథటిక్ ట్రాక్ మై దానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈపీఐ ప్రతినిధి నారాయణనాయక్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం వరకు క్రీడాప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హరీష్కుమార్, ప్రొఫెసర్ ఆకుల రవి, స్పెషల్ ఆఫీసర్ సోమలింగం తదితరులు పాల్గొన్నారు. ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలి ఆత్మకూరు(ఎం): గడువు లోపు వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని డీపీఓ ఆర్.సునంద అధికారులకు సూచించారు. ఆత్మకూర్(ఎం) గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సో మవారం ఆమె తనిఖీ చేసి రికార్డులను పరి శీలించారు. పన్నుల వసూళ్లలో వేగం పెంచా లని గడువులోపు లక్ష్యాన్ని చేరుకోవాలని సూ చించారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. -
అభ్యర్థులకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇవీ..
రెండో ‘సారి’ అంతే..● ఒకసారి గెలిపించిన వారిని తిరిగి గెలిపించని ఓటర్లు ● విలక్షణ తీర్పు ఇస్తున్న ఉపాధ్యాయులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు గత నాలుగు పర్యాయాయలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని/సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు. 2007 నుంచి నలుగురుదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 2013లో రెండోసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు పీఆర్టీయూ–టీఎస్ తరఫున పోటీ చేసిన పూల రవీందర్ గెలుపొందారు. 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరిగింది. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. ఇలా నాలుగుసార్లు వేర్వేరు అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. ఉపాధ్యాయులకు ఓటేయడం తెలియలే ! ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 494 చెల్లని ఓట్లు నల్లగొండ: కొంతమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు వేయడం తెలియలేదు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గత నెల 27న జరిగింది. బ్యాలెట్ పద్ధతిన నిర్వహించిన ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. 19 మంది పోటీలో ఉంటే 19 మందికి కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు వేయడం తెలియక వారు వేసిన ఓట్లు చెల్లలేదు. మొత్తం 24,135 ఓట్లు పోలైతే 494 మంది ఓట్లు చెల్లకపోవడం గమనార్హం. విద్యార్థులకు విద్యాబోధన చేసి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులు.. వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్సీకి వేసే ఓటు ఏవిధంగా వేయాలో కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో కవిత్వంనల్లగొండ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కొందరు బ్యాలెట్ పేపర్పై కవితలు రాయగా.. మరి కొందరు ఓటు వేసి పేపర్ మొత్తాన్ని కోట్టేశారు. బ్యాలెట్ పేపర్తోపాటు కవిత్వాన్ని కూడా బాక్సులో వేశారు. మరికొందరైతే అభ్యర్థుల ఫొటోలకు రౌండ్లు పెట్టారు. ఇలా బ్యాలెట్ బాక్సులో చిత్ర విచిత్రాలు వెలుగు చూశాయి. ‘ఏక్’ నిరంజన్! ● ఆ అభ్యర్థికి కేవలం ఒక్కటే ఓటు పడిందినల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఒక్కటే ఓటు సాధించాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ముగ్గురు సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితం కాగా.. మరో ఆరుగురు డబుల్ డిజిట్లతో సరిపెట్టుకున్నారు. ఆ సింగిల్ డిజిట్ ఓట్లలో ఒక అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థిని పది మంది ఉపాధ్యాయులు బలపరచాలి. అయితే, బలపర్చిన వారు సైతం ఆ అభ్యర్థికి ఓటు వేయకపోవడం గమనార్హం.పీఆర్టీయూలో శ్రీపాల్రెడ్డి ప్రస్థానం ఇదీ..విద్యారణ్యపురి(వరంగల్) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పింగిలి శ్రీపాల్రెడ్డిది ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామం. శ్రీపాల్రెడ్డి 1996లో ఎస్జీటీగా నెక్కొండ మండలం గొల్లిపెల్లి యూపీఎస్లో పనిచేశారు. 2003 సంవత్సరంలో స్కూల్అసిస్టెంట్ (మ్యాథ్స్)గా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో యూపీఎస్లో చేరారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పీఆర్టీయూలో సభ్యుడిగా చేరిన పింగిలి శ్రీపాల్రెడ్డి 2000 సంవత్సరంలో నెక్కొండ మండల జనరల్ సెక్రటరీగా ఆ తరువాత 2002లో నెక్కొండ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 నుంచి 2012వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా, 2015లో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2016, 2017లో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికయ్యాక ఇప్పటివరకు కొనసాగుతున్నారు. తొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉండగానే.. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీపాల్రెడ్డి కొంతకాలం క్రితమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలో ఉండేందుకు పావులు కదిపారు. తొమ్మిది సంవత్సరాల సర్వీస్ను వదులుకొని చివరికి పీఆర్టీయూ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచి ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఆరేళ్ల తరువాత మళ్లీ పీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది. పేరు ఓట్లు పులి సరోత్తంరెడ్డి 2,289 లింగిడి వెంకటేశ్వర్లు 15 అర్వ స్వాతి 19 అలుగుబెల్లి నర్సిరెడ్డి 4,820 కంటె సాయన్న 4 కొలిపాక వెంకటస్వామి 421 గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి 4,437 గోపాల్రెడ్డి పన్నాల 24 చంద్రమోహన్ ఏలె 100 చాలిక చంద్రశేఖర్ 1 జంగిటి కై లాసం 26 జె.శంకర్ 113 పురుషోత్తంరెడ్డి తలకోల 11 తాటికొండ వెంకటరాజయ్య 36 దామెర బాబురావు 128 శ్రీపాల్రెడ్డి పింగిలి 6,035 పూల రవీందర్ 3,115 బంకరాజు 7 ఎస్.సుందర్రాజు 2,040 -
హాలియాలో దొంగల బీభత్సం
హాలియా: హాలియా పట్టణంలోని వీరయ్యనగర్ కాలనీలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరయ్యనగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ వెటర్నరీ ఉద్యోగి తుమ్మరుగొట్టి రామలింగయ్య, అతడి భార్య కళావతి ఇంటికి తాళం వేసి సోమవారం ఉదయం నల్లగొండకు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 4.75 తులాల బంగారు గొలుసు, బంగారు ఉంగరాలు అపహరించారు. అదే ఇంటిపైన నివాసముంటున్న శాగం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంట్లోకి కూడా చొరబడి బీరువాలో దాచిన 15తులాల వెండి పట్టా గొలుసులు, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే ఇంటి పక్కన నివాసముంటున్న అలుగుబెల్లి ఇంద్రారెడ్డి ఇంట్లోనూ చోరీకి యత్నించి విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్రెడ్డి తెలిపారు. మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, నగదు చోరీ -
పట్టు వస్త్రాలు అందజేత
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీస్వామి, అమ్మవార్లకు హైదరాబాద్కు చెందిన గడ్డమీది యాదగిరిగౌడ్– భారతి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదివారం గర్భాలయంలో స్వయంభూల చెంత పట్టు వస్త్రాలకు పూజలు చేయించారు. అనంతరం డీఈఓ భాస్కర్శర్మ, ఆలయ అధికారి గజివెల్లి రఘు సమక్షంలో అర్చకులకు పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ లోకల్ అడ్బయిజరీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్, గడ్డమీది శ్రావణ్గౌడ్ పాల్గొన్నారు. గుట్ట ఆలయ అర్చకుడు, అధికారులకు పట్టువస్త్రాలు అందజేస్తున్న భక్తుడు గడ్డమీది యాదగిరిగౌడ్ దంపతులు -
ఇంద్రియాలలో మద్యపాన నిషేధం
భూదాన్పోచంపల్లి : గ్రామంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండడంతో ఊరి జనమంతా ఒక్కటయ్యారు. గ్రామంలో బెల్టుషాపులను నిషేధిస్తూ ఆదివారం ఏకగీవ్ర తీర్మానం చేశారు. బెల్ట్ దుకాణాలు ఉండకూడదని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. మద్యం విక్రయిస్తే రూ.25 వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.5,000 బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ బండి కృష్ణగౌడ్ మాట్లాడుతూ బెల్ట్ షాపుల వల్ల గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసలు అవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా మహిళల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యం అమ్మకాలను నిషేధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.యాదగిరి, అఖిలపక్ష నాయకులు పబ్బు యాద య్య, బీమగాని నర్సింహ, ఎర్ర చిన్న శంకరయ్య, ఉడుతల సాయిరాం, పానుగంటి లింగస్వామి, బద్దం రాజేశ్వర్, గరిసె జంగయ్య, షేక్ ఇబ్రహీం, చింతల రామకృష్ణ, మహిపాల్నాయక్, శ్రీహరి, శ్రీకాంత్, వంగేటి జంగారెడ్డి, శంకరయ్య, సురేశ్, గోపాల్, ఎర్ర లక్ష్మణ్, శెట్టి మల్లేశ్, గడ్డం శెట్టి, భిక్షపతి, విక్రమ్, రాజు, సత్తయ్య, సుర్వి బాలరాజు, రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఫ విక్రయిస్తే రూ.25వేలు జరిమానా, గ్రామస్తుల తీర్మానం -
యాదాద్రి భువనగిరి
ఇఫ్తార్ 6–28 (సోమవారం సాశ్రీశ్రీ) సహర్ 5–10 (మంగళవారం ఉశ్రీశ్రీ)నిర్మించారు.. పడావుపెట్టారు యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల మధ్య కంపచెట్లు అధ్వానంగా మారాయి. 7-9లోసోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025నంబర్ ప్లేట్లు మారుస్తూ.. కారు నంబర్ ప్లేట్లను మారుస్తూ గంజాయి తరలిస్తున్న ముఠాను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. - 8లో -
దేవతలకు ఆహ్వానం
ఫ రెండో రోజూ వైభవంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఆదివారం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు.లోకకల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతలు ఆహుతులుగా సాగే బ్రహ్మోత్సవానికి యాదగిరి క్షేత్రం సిద్ధమైంది. ఆదివారం ఉదయం అగ్నిదేవుడికి ఆరాధన, హవనం, గరుడ ఆళ్వారుడికి ఇష్ట నైవేద్యం, ధ్వజపూజ, రాత్రి దేవతాహ్వాన వేడుకలు నిర్వహించారు. ధ్వజపటం ఊరేగింపు ప్రధానాలయంలో ఆదివారం ఉదయం నిత్యారాధనలు పూర్తయిన అనంతరం ఉత్తరమాడ వీధిలో ఏర్పాటు చేసిన యాగశాలలో యాజ్ఞికులు హోమాధి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వస్త్రంపై తీర్చిదిద్దిన గరుడ ఆళ్వారుడి పటాన్ని ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా ఉత్తరద్వారం నుంచి ప్రధానాలయ ముఖమండపంలోని ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభం వద్ద గరుడ ఆళ్వారుడి పటానికి ప్రత్యేక పూజలు చేశారు. రామానుజ కూటము నుంచి భాజాభజంత్రీలు, మేళ తాళాలతో గరుడ ముద్దలు తీసుకుచ్చి మొదటగా స్వయంభూలు, ఉత్సవమూర్తుల వద్ద, ఆ తరువాత గరుత్మంతుడి వద్ద పూజలు చేశారు. అనంతరం ధ్వజపటానికి హారతినిచ్చి, గరుడ ముద్దలను ధ్వజ స్తంభంపైకి ఎగురవేశారు. భేరీ మోగించి.. ప్రధానాలయంలో సాయంత్రం నిత్యారాధనల తర్వాత భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ నిర్వహించారు. భేరీ మోగించి ముప్పై మూడు కోట్ల దేవతలను భువికి ఆహ్వానించే వేడుక వైభవంగా చేపట్టారు. ఆలయంలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అలంకార సేవలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం మత్స్య అలంకరా, వేద పారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తారు. -
సన్డే@ 38.2
భువనగిరిటౌన్ : సన్డే మండిపోయింది. ఎండలు మళ్లీ ఒక్కసారిగా పెరడగంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం జిల్లాలో అత్యధికంగా సంస్థాన్నారాయణపురం మండలంలో 38.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. సగం మండలాల్లో 37 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలుకావడంతో సాయంత్రం 4 గంటల వరకు రహదారులపై జనసంచారం తక్కువగా కనిపించింది. ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. వచ్చినా తలపై టోపీ లేదా గొడుగు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
స్కాన్ చేయ్.. మార్కులు వేయ్!
భువనగిరిటౌన్ : జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 సర్వే మొదలైంది. స్వచ్ఛ భారత్ మిషన్, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏటా మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో సర్వే నిర్వహిస్తారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలపై ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేవి. కానీ, కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈసారి ప్రజాభిప్రాయ సేకరణను సులభతరం చేశారు.ఇందుకోసం ఆన్న్లైన్ విధానం తీసుకువచ్చింది.జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలకు క్యూ ఆర్ కోడ్లను జారీ చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ద్వారా అభిప్రాయం తెలియజేసేందుకు మున్సిపల్ యంత్రాంగం వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్నివాసికి పది ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు శుభ్రతపై ఉంటాయి. అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎవరైనా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు.అప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ప్రారంభించండి అని చెప్పే మొదటి పేజీ ద్వారా ఒకరు పలకరిస్తారు. నివాసి తర్వాత ఓటీపీ పంపబడే ఫోన్ నంబర్ అడుగుతారు. నమోదు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. నివాసి ఇష్టపడే భాషను ఎంచుకుని కొనసాగించవచ్చు. సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవీ.. రాష్ట్రం, జిల్లా, తాము నివాసం ఉండే మున్సిపాలిటీని ఎంచుకోవాలి. మీరు ఈ పట్టణ సంస్థ, నగరంలో నివాసిగా ఉన్నారా.. లింగం, వయస్సు కూడా అడుగుతుంది. ఆపై ‘సర్వే ప్రారంభించు’ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. పది ప్రశ్నలు అప్పుడు మొదలవుతాయి. ● రోజూ చెత్త సేకరణకు మీ ఇంటికి, దుకాణానికి పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారా.. ● మీ ప్రాంతాన్ని రోజూ ఊడ్చి పరిశుభ్రంగా ఉంచుతున్నారా ● మీ ప్రాంతానికి దగ్గర చెత్త కుప్పలు పేరుకుపోయాయా ● ఇంట్లోని చెత్తను తడి, పొడిగా వేరు చేసి బుట్టల్లో అందేస్తున్నారా ● స్వచ్ఛ ఆటో, ట్రాక్టర్ వారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారా.. కలిపి తీసుకెళ్తున్నారా.. ● మార్కెట్లు, బజార్లు, పార్కులు, ఉద్యానవనాలు, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ఎంత ప్రభావవంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు ● మీ పట్టణంలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్(ఆర్ఆర్ఆర్) చెత్త కేంద్రాల గురించి మీకు తెలుసా ● మున్సిపాలిటీ పరిధిలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి లైసెన్స్ పొందిన ఆపరేటర్లను మాత్రమే నియమించుకోవాలని మీకు తెలుసా ● మీ ప్రాంతాల్లోని పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత, నిర్వహణపై ఎంత వరకు సంతృప్తి చెందారు ● మీరు ఎప్పుడైనా పారిశుద్ధ్య సమస్యను స్థానిక అధికారులకు రిపోర్టు చేశారా.. దాన్ని ఎలా పరిష్కరించారు ప్రజలు సహకరించాలి స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మున్సిపాలిటీలు అందజేస్తున్న సేవలపై ప్రజలు ఆన్లైన్ ద్వారా సర్వేలో పాల్గొనాలి. పలు రకాల సేవలపై ప్రజలిచ్చిన అభిప్రాయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మున్సిపాలిటీకి ర్యాంకులు కేటాయిస్తుంది. మున్సిపాలిటీల్లో ప్రజలంతా పాల్గొంటేనే ఈ విభాగంలో మంచి మార్కులొస్తాయి. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా అభిప్రాయాన్ని తెలియజేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అభిప్రాయం తెలియజేసి ఉత్తమ ర్యాంకు సాధనకు సహకరించాలి. –రామలింగం, భువనగిరి మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీల్లో పరిశుభ్రతపై సర్వే ఫ మార్కుల ఆధారంగా ర్యాంకు ఫ ప్రజాభిప్రాయ సేకరణకు ఈసారి నూతన విధానం ఫ అందుబాటులోకి క్యూ ఆర్ కోడ్ ఫ స్కాన్ చేసి అభిప్రాయం తెలియజేయాలని మున్సిపల్ యంత్రాంగం ప్రచారం మొత్తం మార్కులు 12,500ఓడీఎఫ్, మంచినీరు 1,200గార్బేజ్ ఫ్రీ సిటీ 1,300మిగిలిన అంశాలకు 10,000 -
ఫలితం తేలేది నేడే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం ఫ చెల్లిన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా.. వారే విజేత ఫ మధ్యాహ్నం వరకు పూర్తి కానున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఫ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలువకపోతే ఎలిమినేషన్ ఫ రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్సాక్షి ప్రతినిది, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయింది. రిహార్సల్స్ కూడా నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మొత్తం చెల్లిన ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. 25 టేబుళ్లపై కౌంటింగ్ 3వ తేదీ ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ హాల్కు తీసుకురానున్నారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు.. 25 బ్యాలెట్లను ఒక బండిల్ చొప్పున కట్టలు కట్టి డ్రమ్ములో వేస్తారు. 8 గంటలు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపు కూడా 25 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్కు వేయి బ్యాలెట్ పేపర్ల చొప్పున లెక్కించనున్నారు. దీంతో మొదటి రౌండ్లోనే మొత్తం పోలైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. పోలైన ఓట్లు 24,139 నియోజవర్గం పరిధిలో మొత్తం 25,797 ఓట్లు ఉండగా.. అందులో 24,139 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.57 శాతం పోలింగ్ నమోదైంది. చెల్లిన ఓట్లలో సగం ఓట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలకపోతే ఎలిమినేషన్.. అభ్యర్థులు ఎవరూ మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించలేకపోతే.. అప్పుడు ఎన్నికల అధికారులు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటించి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించనున్నారు. పోటీ చేసిన 19 మంది అభ్యర్థుల్లో ఎవరికై తే అతి తక్కువగా ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసారో చూసి ఆ అభ్యర్థులకు కలుపుతారు. అలా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక ఓటును ఎవరు సాధిస్తారో.. అప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం చివరి ఫలితం అర్ధరాత్రి వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. కేటాయించిన సిబ్బంది వీరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 25 టేబుళ్లపై నిర్వహిస్తారు. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 150 మంది టేబుళ్లపై కౌంటింగ్ కోసం ఉండగా, 20 శాతం రిజర్వు సిబ్బంది ఉంటారు. మరో 200 మంది కౌంటింగ్ సమయంలో సహకరించనున్నారు. 250 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ బందోబస్తులో పాల్గొననున్నారు. -
టెన్త్ విద్యార్థులకు 6నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
భువనగిరి : పదో తరగతి విద్యార్థులకు ఈనెల 6నుంచి 13వ తేదీ వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే ఫ్రీ ఫైనల్ ప్రాక్టీస్ పరీక్ష – 1,2 పూర్తయ్యింది. ఈ పరీక్షలను మధ్యాహ్నం 1.15నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహించారు. కాగా 6నుంచి జరిగే ఫ్రీ ఫైనల్ పరీక్షల వేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులు 8,631 మంది విద్యార్థులు ఉన్నారు. ఫ్రీ ఫైనల్ పరీక్షల వేళల్లో మార్పుల కారణంగా ఉర్దూ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నాయి. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి భువనగిరిటౌన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక మోటకొండూర్ : మండల కేంద్రానికి చెందిన చామల భానుచందర్రెడ్డి – అర్చన దంపతుల కూతురు చామల లక్ష్మీఅభయారెడ్డి జాతీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై ంది. ఆదివారం హైదరాబాద్ కొల్లూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అండర్–10 విభాగంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో లక్ష్మీఅభయారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈనెల 22వ తేదీన విజయవాడలో జరిగే జాతీ యస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననుంది. లక్ష్మీఅభయారెడ్డి హైదరాబాద్ ఉప్పల్లోని మెరిడియన్ స్కూల్లో నాలుగో తరగతి చదువు తుంది. రాష్ట్ర అర్చరీ అసోషియేషన్ చైర్మన్ టి. రాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూర్ బ్రాంచ్ చైర్మన్ ఎండీ పవన్కళ్యాణ్, మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రామారావు చేతుల మీదుగా బంగారు పతకం అందజేశారు. లక్ష్మీ అభయారెడ్డికి, కోచ్ వరికుప్పల స్రవంతికి పలువురు అభినందనలు తెలిపారు. రెండో విడత సర్వేపూర్తి భువనగిరిటౌన్ : పట్టణంలో సమగ్ర కుటుంబ రెండో విడత సర్వే పూర్తయినట్లు భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేలో పాల్గొనని కుటుంబాల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 16నుంచి 28 వ తేదీ వరకు 12 రోజుల పాటు సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో పాల్గొనని 18 కుటుంబాలు రెండో దశ సర్వేలో పాల్గొన్నాయని వెల్లడించారు. ప్రజాపాలన సేవా కేంద్రాలు, టోల్ ఫ్రీనంబర్ ద్వారా, ఆన్లైన్లో ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. -
శ్రీలక్ష్మీనరసింహుడికి గొడుగులు బహూకరణ
యాదగిరిగుట్ట : సికింద్రాబాద్లోని పద్మారావునగర్కు చెందిన కందుల సురేందర్రావు–తిరుమలదేవి దంపతులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి రూ.60 వేలు విలువ చేసే గొడుగులు, కర్రలు బహూకరించారు. వీటిని ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డీఈఓ భాస్కర్శర్మకు ఆదివారం అందజేశారు. స్వామివారి నిత్యారాధనల్లో భాగంగా నిర్వహించే జోడు సేవకు గొడుగు, కర్రలను వినియోగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీస్వామి వారి అలంకార, వాహన సేవల్లోనూ వాటిని వినియోగించాలని అధికారులను కోరారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, డీఈఓ భాస్కర్శర్మకు గొడుగులు అందజేస్తున్న సురేందర్రావు దంపతులు -
కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
భువనగిరి : విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమ సంయుక్త సంచాలకుడు డాక్టర్ మోతీలాల్నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ సూచించారు. శనివారం భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న నేత్ర పరీక్షలను వారు పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 34,400 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయగా 2,785 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రీస్క్రీనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రీ స్క్రీనింగ్లోనూ దృష్టిలోపం ఉన్నట్లు తేలితే వారికి శస్త్ర చికిత్సకు రెఫర్ చేయడంతో పాటు కళ్ల అద్దాలు అందజేస్తామని చెప్పారు. పాఠశాలల్లో నిర్వహించే కంటి పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి : వేసవిలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ సీజీఎం చక్రపాణి సూచించారు. శనివారం భువనగిరిలోని ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమావేశమైన వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రూపొందించిన యాక్షన్ప్లాన్ను సమీక్షించారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని, కొత్తగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సరఫరాలో ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సుధీకర్కుమార్, భువనగిరి, చౌటుప్పల్ డీఈలు వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, డీఈ టెక్నికల్ శ్రీనివాసచారి, డీఈఎంఎల్టీ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘గుట్ట’కు చేరిన అఖండజ్యోతి
భువనగిరి, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన అఖండజ్యోతి యాత్ర శనివారం రాత్రి యాదగిరిగుట్టకు చేరింది. గత నెల 26వ హైదరాబాద్ బర్కత్పురలోని యాదగిరి భవన్నుంచి ప్రారంభమైన అఖండజ్యోతి యాత్ర.. ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్ మీదుగా శుక్రవారం రాత్రి భువనగిరిలోని పాత వివేరా హోటల్ వద్దకు చేరుకుంది. శనివారం ఉదయం వివేరా హోట్ల నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకుంది. భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, యాదగిరిగుట్టలో ఏసీపీ రమేష్ పూజలు నిర్వహించారు. యాత్ర భువనగిరి పట్టణ అధ్యక్షుడు ఫక్కీర్ కొండల్రెడ్డి, చైర్మన్ సద్ది వెంకట్రెడ్డి, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కూర వెంకటేశం, సభ్యులు దేవరకొండ నర్సింహాచారి, ఉపేందర్రావు, బాలాజీ, యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు, హిందూ సంఘాల నాయకులు అఖండజ్యోతికి ఘన స్వాగతం పలికారు. -
మూసీ శుద్ధీకరణకు డీపీఆర్ తయారు చేయాలి
భూదాన్పోచంపల్లి : మూసీ శుద్ధీకరణను సీపీఎం స్వాగతిస్తుందని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి డీపీఆర్ తయారు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్.వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భూదాన్పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన సీపీఎం జిల్లా నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. మూసీ కలుషిత జలాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, పంటలు పండడం లేదని, పాడిపరిశ్రమపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ మూసీ శుద్ధీకరణలో ఈటీపీలు, ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పార్టీ జెండావిష్కరించి అమరవీరులకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, భట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, గూడూరు అంజిరెడ్డి, శ్రీనివాసచారి, మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, ఎంపీ పాష, బొడ్డుపల్లి వెంకటేశ్, గుండు వెంకటనర్సు, సైదులు, యాదిరెడ్డి, అవ్వారు రామేశ్వర్, ఎంఏ ఇక్భాల్, వనం ఉపేందర్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేశం, రాగీరు కిష్టయ్య, కరుణాకర్, గణపతిరెడ్డి, అంజయ్య, శ్రీశైలం, జహాంగీర్, జగన్, అనిల్, మధు, భిక్షపతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్. వీరయ్య -
రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్
ఓట్ల లెక్కింపునకు సహకరించాలిఫ నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ఆమె కలెక్టరేట్లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కౌంటింగ్ టేబుళ్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లని ఓట్ల గుర్తింపు తదితర అంశాలను వివరించారు. సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 25 టేబుల్స్పై ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ఫ మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఫ గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ విధానం ఫ ఆ తరువాత రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్.. ఫ సోమవారం అర్ధరాత్రి తర్వాత తేలనున్న ఫలితంసాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్లగొండకు తరలించి ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. 3వ తేదీ ఉదయం వాటికి బయటకు తీసి అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల్లో 25,797 ఓట్లకు 24,139 ఓట్లు (93.57 శాతం) పోల్ అయ్యాయి. కౌంటింగ్ టేబుల్స్, సిబ్బంది ఇలా..25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రోఅబ్జర్వర్ ఉంటారు. మొత్తంగా 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించారు. మరో 250 మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి, కౌంటింగ్లో ఇతర పనులకు వినియోగించేందుకు నియమించారు. 250 మంది పోలీసులు భద్రతలో పాలుపంచుకోనున్నారు. ఉదయం 7గంటలకు స్ట్రాంగ్రూంలు ఓపెన్ లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేస్తారు. మొదటి రౌండ్లో 25 పోలింగ్ బూత్లకు చెందిన బాక్సులు ఓపెన్ చేస్తారు. వాటిలో ప్రతి 25 ఓట్లను బండిల్ కట్టి డ్రమ్ములో వేస్తారు. ఆ తర్వాత మళ్లీ స్ట్రాంగ్ రూమ్ల నుంచి మరో 25 పోలింగ్ బూత్లకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తారు. అలా ఎనిమిదిసార్లు 200 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బండిల్స్గా కడతారు. ప్రక్రియ అంతా గంటలో పూర్తవుతుంది. పోలైన ఓట్లలో సగానికి పైగా వస్తేనే.. మొత్తం పోలైన ఓట్లలో ఎన్ని ఓట్లు చెల్లుబాటు అవుతాయో, ఆ చెల్లిన ఓట్లలో సగం ఓట్లకు మించి ఒక ఓటును కలిపి గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో పోలైన ఓట్లలో ఎవరికై తే సగానికి మించి ఒక ఓటు అధికంగా వస్తుందో వారిని మొద టి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలుపు కోటా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 24,139 పోల్ అయ్యాయి. అందులో సగానికి మించి 12,070 ఓట్లు సాధించిన అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడ కోటా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎలిమినేట్.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవ్వరు గెలవకపోయినా ఎలిమినేషన్ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. 19 మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు వస్తాయో, అతన్ని ఎలిమినేట్చేస్తారు. ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఏయే అభ్యర్థులకు వేశారో, వాటిని వారికి కలుపుతారు. అప్పటికి కూడా గెలుపుకు కోటా రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి వేశారో ఆయా అభ్యర్థులకు ఓ ఓట్లను కలుపుతారు. అప్పుడు మళ్లీ కోటా వచ్చిందా రాలేదా చూస్తారు. ఎవరికైనా గెలుపు కోటా వస్తే దాంతో గెలిచినట్లుగా భావిస్తా రు. ఒక వేళ కోటా రాకపోతే అదే తరహాలో చివరి అభ్యర్థి వరకు తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వస్తారు. అలా గెలుపు కోటా వచ్చేంత వరకు లెక్కిస్తుంటారు. ఒక వేళ చివరికి 19 మందిలో 17 మంది ఎలిమిట్ అయినప్పటికీ గెలుపు కోటా రాకపోతే చివరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయో వారిని ఎలిమినేట్ చేసి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను 19వ అభ్యర్థికి కలుపుతారు. అప్పటికి కోటా వస్తే సరి. కోటా రాకపోయినా ఎవరైతే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటారో ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఆర్థరాత్రివరకు సమ యం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. -
సమ్మర్.. ఫ ుల్ పవర్
ప్రస్తుతం 8.5 మిలియన్ యూనిట్లు.. ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఇళ్లలో ప్యాన్లు, ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది, మరోవైపు వరి చేలు పొట్టదశలో ఉండడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం అధికమైంది. ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ వినియోగం రోజూ 8.5 మిలియన్ యూనిట్లు ఉండగా మున్ముందు 9.5 మిలియన్ యూనిట్లకు చేరనుందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా యాక్షన్ ప్లాన్భువనగిరి : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం అధికమవుతోంది. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, మీటర్లు కాలిపోవడం, లైన్లలో లోపం తదితర అంశాలు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో విద్యుత్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వేసవిలో కోతలు లేని కరెంట్ సరఫరా చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇందులో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని తుది దశలో ఉన్నాయి. అదనంగా వీటిని ఏర్పాటు చేశారు జనవరి నెలలో జిల్లాలో విద్యుత్ వినియోగం 7.9 మిలియన్ యూనిట్లు ఉండగా ఫిబ్రవరి రెండో వారం నాటికి 8.2 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఎండలు ముదరడంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో లో ఓల్టేజీ, బ్రేక్డౌన్లు, లైన్లలో లోపాలు తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యలను అధిగమించి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా అదనంగా నూతన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నారు. మూడుసబ్ స్టేషన్లకు గాను రెండు పూర్తికాగా మరొకటి తుదిదశలో పనులు ఉన్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏడు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 101, 11 కేవీ ఫీడర్లు 26, 33 కేవీ ఫీడర్లు ఒకటి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను 101 ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా అన్నీ పూర్తయ్యాయి. మరమ్మతులకు గురైతే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఫీడర్లను వేరు చేసేలా 10 చోట్ల వీసీబీలను బిగించారు. రోజూ టీసీలు, ప్రతి సోమవారం వీసీలు ఎస్ఈ, డీఈలు, రక్షేత సిబ్బందితో విద్యుత్ శాఖ సీఎండీ రోజూ టెలీకాన్ఫరెన్స్(టీసీ), ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించి విద్యుత్ సరఫరా, సమస్యలపై సమీక్షిస్తున్నారు. దీంతో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 9491065938విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేయడానికి ప్రజల సౌకర్యార్థం ట్రాన్స్కో జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్రూంలో 9491065938 నంబర్ కూడా అందుబాటులో ఉంచారు. వినియోగదారులు నేరుగా లేదా ఫోన్ నంబర్కు కాల చేసి సమస్యను తెలియజేస్తున్నారు. సిబ్బంది తక్షణమే అప్రమత్తమై సమస్యలను పరిష్కరిస్తున్నారు.ఫ డిమాండ్కు అనుగుణంగా కరెంట్ సరఫరా చేసేందుకు చర్యలు ఫ అదనంగా సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు ఏర్పాటు ఫ ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనేపరిష్కరించేందుకు కంట్రోల్ రూం ఫ టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న సీఎండీఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాం వేసవిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తున్నాం. ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా ఉన్నాం. బ్రేక్డౌన్లు, లో ఓల్టేజీ, మరమ్మతులు.. ఏ సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా ఫిర్యాదు చేసేందుకు జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాం. కంట్రోల్ రూంకు నేరుగా, సెల్ నంబర్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. –ఆర్.సుధీకర్కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ కొత్తగా ఏర్పాటు చేసినవి సబ్స్టేషన్లు 02పవర్ ట్రాన్స్ఫార్మర్లు 07డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 10111 కేవీ ఫీడర్లు 2633 కేవీ ఫీడర్లు 01వీసీబీలు 10విద్యుత్ కనెక్షన్లు ఇలా.. మొత్తం 4,46,443వ్యవసాయ 1,17,476గృహ 2,76,045 పరిశ్రమలు 603 (హైటెన్షన్) పరిశ్రమలు 3,210(లోటెన్షన్ ) ఇతర 50 వేలకు పైగా.. -
లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవం
విశ్వక్సేనుడికి తొలిపూజ, స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం యాదగిరిగుట్ట : భక్తజనబాంధవుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలకు మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వేదపండితులు శనివారం వైభవంగా శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలోని మూలవర్యుల ఆజ్ఞ (అనుమతి)తో పూజలు ప్రారంభించి 10.15కు విశ్వక్సేన ఆరాధన, 10.50గంటలకు స్వస్తివాచన పూజలు చేసి ఉత్సవాలకు తెరలేపారు. విశ్వక్సేనుడికి తొలిపూజ : ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగడానికి నిర్దేశించిన మంత్రోచ్ఛరణలతో విశ్వక్సే నుడికి తొలిపూజ నిర్వహించారు. స్వస్తివాచనం, రక్షాబంధనం : విశ్వశాంతి, లోకకల్యాణం కోసం, ప్రాణికోటి, ఇతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకొనుట స్వస్తివాచనం విశిష్టత. అనంతరం లోకకల్యాణార్థం సమర్పించబడిన రక్షాబంధనాన్ని స్వీకరించే వేడుక నిర్వహించారు. శాస్త్రోక్తంగా మృత్సంగ్రహణం, అంకురారోపణం సాయంత్రం నిత్య పూజల అనంతరం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి పాల్గొన్నారు. ఉత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజలు ఉంటాయి. -
21న భువనగిరి మీదుగా టూరిస్టు రైలు
భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరి మీదుగా ఈ నెల 21న భారత్ గౌరవ స్పెషల్ టూరిస్టు రైలు వెళ్తుందని సౌత్ సెంట్రల్ జోన్ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య శనివారం ఒక ప్రకటలో తెలిపారు. భువనగిరి స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై జనగాం, కాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడుకు చేరుకుంటుందన్నారు. ప్యాకేజీ రూ.14,250తో ప్రారంభమై కేటగిరీని బట్టి అత్యధికంగా రూ.28,440 వరకు ఉంటుందన్నారు. భారత్ స్పెషల్ టూరిస్టు రైలు ద్వారా రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, శ్రీరంగం, తంజావూర్ ప్రదేశాలకు వెళ్లవచ్చన్నారు. ప్రతి కోచ్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఈ అవకాశాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 97013 60701, 92810 30711 నంబర్లను సంప్రదించాలని కోరారు. టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శుల నియామకం భువనగిరి : వైద్యారోగ్యశాఖ టీఎన్జీఓ(తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం) జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగింది. హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల ఫోరం సెంట్రల్ కమిటీ సమావేశంలో వారిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొనిరెడ్డి వెంకటరమణారెడ్డి, జనరల్ సెక్రటరీగా బోనగిరి సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మానం జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. తమ నియామకానికి సహకరించిన సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సూపరింటెండెంట్గా చిన్నానాయక్ రామన్నపేట : రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్గా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ చిన్నానాయక్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ఈశ్వర్ ఉన్నత చదువుల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ ఈశ్వర్ను వైద్యసిబ్బంది సన్మానించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చిన్నానాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బి.వీరన్న, శ్రీనివాస్, విజయలక్ష్మి, మాధవాచారి పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్గా భిక్షపతి మోత్కూరు : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) జిల్లా చైర్మన్గా మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన ముక్కెర్ల భిక్షపతి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా అడ్డగూడూరుకు మందుల శ్రీకాంత్, అధికార ప్రతినిధిగా భువనగిరికి చెందిన బొల్లెద్దు ప్రవీణ్ను నియమించారు. -
యాదాద్రి భువనగిరి
ఇఫ్తార్ 6–28 (ఆదివారం సాశ్రీశ్రీ) సహర్ 5–11 (సోమవారం ఉశ్రీశ్రీ)ఎండుతున్న వరి పొలాలు రామన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో పొట్టకొచ్చిన వరి పొలాలు నీరందకపోవడంతో ఎండిపోతున్నాయి. 7- 9లోఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025కనులపండువగా కల్యాణం దంతూరులోని శ్రీబస్వలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 9లో -
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి : డీఈఓ
చౌటుప్పల్ : కంప్యూటర్ పరిజ్ఞానం మనిషి జీవితంలో తప్పనిసరి అవసరంగా మారిపోయిందని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. చౌటుప్పల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన ఐడీబీఐ బ్యాంకు సమకూర్చిన కంప్యూటర్లను శుక్రవారం పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో కంప్యూటర్ భాగమైందన్నారు. అదే విధంగా ఇంగ్లిష్ భాషపైనా ప్రావీ ణ్యం సంపాదించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ స్పూర్తి, ప్రధానోపాధ్యాయుడు శివకుమార్, బ్యాంకు అధికారులు గీత, వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి టౌన్ : నెలసరి అద్దె చెల్లింపు ప్రాతిపదికన సొంతకారు కారు కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 2, 500 కిలో మీటర్ల వరకు తిరగవలసి ఉంటుందని, నెలకు రూ.33,000 అద్దె చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 8న జాతీయ లోక్ అదాలత్ రామన్నపేట : మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి ఎస్.ఉషశ్రీ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష తెలిపారు. శుక్రవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. లోక్అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. రాజీపడి కేసులను పరిష్కరించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించాలని కోరారు. అనంతరంపోలీస్స్టేషన్ల వారీగా రాజీకి అవకాశం ఉన్న కేసుల గురించి చర్చించారు. సమావేశంలో ఎస్ఐలు పి.మల్లయ్య, యుగేందర్, నాగరాజు న్యాయవాదులు ఎం. వెంకట్రెడ్డి, డి.సత్తయ్య, ఎన్.స్వామి తదితరులు పాల్గొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి యాదగిరిగుట్ట : రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. శనివారం యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం స్టేజీ వద్ద జరిగే అఖిలభారత తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మహాసభల కరపత్రాలను యాదగిరిగుట్టలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, వాటిని రద్దు చేయాలన్నారు. మూసీ పునరుజ్జీవం, గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు బండి జంగమ్మ, కల్లెపల్లి మహేందర్, పేరబోయిన మహేందర్, గోరేటి రాములు, పేరబోయిన బంగారు, గోపగాని రాజు, మాటూరు మల్లయ్య, పాకలపాటి రాజు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
భువనగిరి : ఇంటర్ పరీక్షలకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని, లోపాలకు తావుండవద్దని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సీఎస్, డీఓలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలకు శుక్రవారం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై వారికి సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాల్లో 12,558 విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని.. ఇందులో ప్రథమ సంవత్సరం 6,208, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,350 మంది ఉన్నారని తెలిపారు. కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. కేంద్రాలకు ప్రశ్న పత్రాలను తరలించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల బండిళ్లకు సీల్ తొలగించడం, సమాధాన పత్రాలను ప్యాకింగ్ చేసే ప్రక్రియ సీసీ కెమెరాల నిఘాలోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఐఈఓ రమణి తదితరులు పాల్గొన్నారు. అధిక మార్కులు సాధించిన 70 మంది విద్యార్థులకు సైకిళ్లు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన 70మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో సిద్ధంగా ఉంచిన సైకిళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. జిల్లాలోని 192 ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6,074 మంది ఉన్నట్లు తెలిపారు. కష్టపడి చదవి మంచి మార్కులు సాధించాలని కోరారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఈఓ సత్యనారాయణ, ఐఓసీఎల్, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
యాదాద్రి భువనగిరి
పరిహారం చెల్లించాలి సాగు నీరందక ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ కోరారు. 7 28బిఎన్జి68 : శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025- 9లోపట్టువస్త్రాల పరిశీలన గుట్ట బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలను ఆలయ డిప్యూటీ ఈఓ పరిశీలించారు. - 8లోముగిసిన బ్రహ్మోత్సవాలు భువనగిరిలోని స్వర్ణగిరి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అష్టోత్తర శతఘటా భిషేకంతో ముగిశాయి.- 8లో -
కొత్త టీచర్లకు పాఠాలు
భువనగిరి : డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన 248 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వృత్యంతర శిక్షణ ఇస్తున్నారు. మూడు విడతల్లో భాగంగా తొలుత ఫిబ్రవరి 28న ఎస్జీటీలకు భువనగిరిలోని సాయికృప డిగ్రీ కళాశాలలో శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. శిక్షణ ఈ నెల 1,3 తేదీల్లో కొనసాగనుంది. రెండో విడతలో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు 4, 5, 6వ తేదీల్లో నల్లగొండలో, స్పెషల్ ఎడ్యుకేషన్, పీఈటీలకు హైదరాబాద్లో 10, 11, 12వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీటిపై శిక్షణ పాఠ్యపుస్తకాల సద్వినియోగం, తరగతి గది నిర్వహణ, విద్య, అభ్యసన, ప్రమాణాల పెంపు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, విధానాలు, ఐసీటీ, ఐఎఫ్పీ, డిజిటల్ బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు డీఎస్సీ–2024 ద్వారా జిల్లాలో 251మందికి గాను 248 మంది ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకం అయ్యారు. వీరిలో ఎస్జీటీలు 133, పీఈటీలు ఇద్దరు, మిగిలిన వారు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 133 మంది ఎస్జీటీలు, ఎనిమిది మంది ఆర్పీలకు భువనగిరిలోని సాయికృప డిగ్రీ కళాశాలలో శిక్షణ మొదలైంది. వీరికి టీఏతో పాటు భోజన వసతి కల్పిస్తున్నారు. అభ్యసన ప్రక్రియలపై తర్ఫీదు ఫ మూడు దశల్లో శిక్షణ ఫ తొలుత ఎస్జీటీలకు, రెండు, మూడో విడతలో స్కూల్ అసిస్టెంట్లు,భాషా పండితులు, పీఈటీలకు ఫ డీఎస్సీ–2024 ద్వారా 248 మంది ఉపాధ్యాయుల నియామకం సద్వినియోగం చేసుకోవాలి కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు వృత్తిపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నాం. విడుతల వారీగా శిక్షణ ఇస్తున్నాం. ఎస్జీలకు మాత్రమే భువనగిరిలో శిక్షణ ఇస్తున్నారు. మిగతా వారికి నల్లగొండ, హైదరాబాద్లో ఉంటుంది. శిక్షణ ద్వారా తరగతి గది నిర్వహణ, విద్యా ప్రమాణాల పెంపు, బోధన, అభ్యసన ప్రక్రియలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని కొత్త టీచర్లు సద్వినియోగం చేసుకోవాలి. –సత్యనారాయణ, డీఈఓ -
యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ
నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉత్తర మాడ వీధిలో కల్యాణం శ్రీస్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో కల్యాణవేడుక నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు రూ.3,000 టికెట్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. యాదగిరిగుట్ట : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట పంచనారసింహుడి దివ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మంగళవారం విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో మొదలై శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారంగా, సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణా లు, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు స్వ ర్ణ విమాన గోపురం కొత్త అనుభూతి పంచనుంది. 11 రోజులు జరిగే కార్యక్రమాలు ఇవీ.. ● 1వ తేదీన ఉదయం 10గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ ఉంటుంది. ● 2న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ ● 3న ఉదయం 9 గంటలకు మత్స్యవతార అలంకార సేవ, వేద పారాయణం, రాత్రి 7గంటలకు శేష వాహన సేవ. ● 4న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకారం, రాత్రి 7గంటలకు హంసవాహన సేవ. ● 5న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణ (మురళీకృష్ణుడు) అలంకారం, రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ. ● 6న ఉదయం 9గంటలకు గోవర్థనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7గంటలకు సింహవాహన సేవ. ● 7న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకారం, రాత్రి 8గంటలకు అశ్వవాహన సేవ, ఆ తరువాత శ్రీస్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం. ● 8న ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామి వారిని ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు గజవాహన సేవ, 8.45 గంటలకు శ్రీస్వామి,అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం. ● 9న ఉదయం 9గంటలకు శ్రీమహావిష్ణు అలంకార సేవలో గరుఢ వాహనం సేవపై శ్రీస్వామివారి ఊరేగింపు, రాత్రి 8గంటలకు ఆలయ తిరు, మాఢ వీధుల్లో దివ్యవిమాన రథోత్సవం. ● 10న ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థస్నానం వేడు, రాత్రి 7 గంటలకు పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం ● 11న ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం, దోపు ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ప్రథమ ప్రాకార మండపంలో అలంకార, వాహన సేవలు శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనవి అలంకార, వాహనసేవలు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీస్వామి వారిని అలంకరించి సేవలను తిరు, మాడ వీధుల్లో ఊరేగిస్తారు. తూర్పు మాడ వీధిలో శ్రీస్వామి వారి అలంకార సేవలను వేంచేపు చేసి.. అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు పారాయణాలు పఠిస్తారు. అలంకార సేవలను భక్తులకు దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.రూ.3.15 కోట్లు కేటాయించాం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం రూ.3.15 కోట్ల బడ్జెట్ కేటాయించాం. రోజూ 2,500 మంది భక్తులకు అన్న ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, బస్సులు, టాయిలెట్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డితో పాటు పలువురు మంత్రులకు ఆహ్వానపత్రికలు అందజేశాం. –భాస్కర్రావు, యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓఫ విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం ఫ 7న ఎదుర్కోలు, 8న తిరుకల్యాణం ఫ విద్యుత్ దీపాలతో ఆలయం కనువిందు ఫ భక్తులకు ఈసారి స్వర్ణవిమాన గోపురంతో కొత్త అనుభూతి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. అలంకార, వాహన సేవలు 3వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలు ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ఎదుట, కల్యాణోత్సవం ఉత్తర మాడ వీధిలో నిర్వహిస్తాం. ఆలయ తిరు, మాడ వీధుల్లో రథోత్సవం ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలి. –కాండూరి వెంకటచార్యులు, ప్రధానార్చకులు -
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
భువనగిరి : విద్యార్థులు పోషకాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 89 ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.భువనగిరిలోని ఆర్బీ నగర్లో గల ఎస్సీ బాలికల హాస్టల్ను డీఎంహెచ్ఓ సందర్శించి వైద్యపరీక్షలను పరి శీలించారు. విద్యార్థులకు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సుమన్ కళ్యాణ్, వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
భువనగిరికి చేరిన అఖండ జ్యోతి రథయాత్ర
బీబీనగర్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ బర్కత్పురలోని యాదగిరి భవన్ నుంచి బయలుదేరిన స్వామివారి అఖండజ్యోతి రథయాత్రకు బీబీనగర్లో అఖండజ్యోతి కమిటీ సభ్యులు, భక్తులు, రాజకీయ నాయకులు ఘన స్వాగతం పలికారు. బాంబినో వర్మిసెల్లీ పరిశ్రమ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రణీతాపింగళ్రెడ్డి, మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, నాయకులు శ్యాంగౌడ్, అంజనేయులు, సత్యనారాయణగౌడ్ బాంబినో కంపెనీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, మేనేజర్ శాస్త్రి, పీఆర్ రఫిక్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి : అఖండజ్యోతి రథయాత్రకు భువనగిరి పట్టణంలో యాత్ర చైర్మన్ సద్ది వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు ఘన స్వాగతం పలికారు. హైదరా బాద్, నల్లగొండ, జంకానగూడెం చౌరస్తాల మీదుగా బస్టాండ్ సమీపం నుంచి వినాయక చౌరస్తా, పాత బస్టాండ్ మీదగా పాత వివేరా హోటల్ వద్దకు రథయాత్ర చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపల్ల బుచ్చిరెడ్డి, జ్ఞాన ప్రకాష్రెడ్డి, ఫక్కీర్ కొండల్రెడ్డి, శెట్టి బాలయ్యయాదవ్, మంచి కంటి వెంకటేశం, దిడ్డి బాలాజీ, దేవరకొండ నర్సింహాచారి, చీకటి మల్ల రాములు, బండారు శ్రీనివాస్, చందా మహేందర్ గుప్తా, మల్లేశం, నర్సింగ్రావు పాల్గొన్నారు. శనివా రం ఉదయం రథయాత్ర యాదగిరిగుట్టకు బయ లుదేరనుందని నిర్వాహకులు తెలిపారు. -
ఎవరి లెక్కలు వారివే!
స్ట్రాంగ్ రూమ్కు ీసీల్ నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. అనంతరం 12 జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను ఆర్జాలబావి సమీపంలోని గోదాం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో శుక్రవారం భద్రపరిచారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ దగ్గరుండి.. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్కు సీల్ వేయించారు. ఫ అంచనాలు వేసుకుంటున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫ తామంటే.. తామే గెలుస్తామని ధీమా ఫ ఐదుగురి మధ్యే గట్టి పోటీ ఉంటుందని చెబుతున్న నేతలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ –ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న అంచనాల్లో అభ్యర్థులు తనమునకలయ్యారు. జిల్లాలు, మండలాల వారీగా పోలింగ్ సరళిని బట్టి గెలుపు తమదంటే.. తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బరిలో 19 మంది ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఐదుగురి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు అంచనా వేస్తున్నాయి. పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, యూటీఎఫ్ బలపరిచిన, ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ, కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్న హర్షవర్ధన్రెడ్డి, బీసీ వాదంతో బరిలో ఉన్న పూల రవీందర్, టీపీయూఎస్ బలపరిచిన, బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా మారుతున్న బలాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఒక్కో జిల్లాలో ఒక్కో అభ్యర్థి తమకు అనుకూలంగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో తమకు మొదటి ప్రాధాన్య ఓట్లు అధికంగా వస్తాయని పీఆర్టీయూ, బీజేపీ, టీచర్స్ జేఏసీ అభ్యర్థులతోపాటు వారి అనుచరులు చెబుతుండగా, ఖమ్మం జిల్లాలో తమ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తాయని యూటీఎఫ్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, వ్యాయామ, భాషా పండితులు, ఆదర్శ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీల ఉపాధ్యాయ ఓట్లలో తమకే గణనీయంగా వచ్చాయని టీచర్స్ జేఏసీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్దన్రెడ్డి అనుచరులు చెబుతున్నారు. వరంగల్తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండలో తనకు ఎక్కువ ఓట్లు వస్తాయని టీచర్స్ జేఏసీ అభ్యర్థి అంచనా వేసుకుంటున్నారు. అయితే బహుజన, బీసీ వాదంతో పాటు అంసతృప్తి ఓట్లు తమకే వచ్చాయని, మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలువబో తున్నామని పూల రవీందర్ అనుచరులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంఘాలపై వ్యతిరేక ఓట్లతోపాటు జాతీయవాద భావజాలమున్న ఉపాధ్యాయులంతా తమకే ఓటేశారని బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి అనుచరులు పేర్కొంటున్నారు. గెలుపోటములు నిర్ణయించేది ద్వితీయ ప్రాధాన్య ఓట్లే? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో మొదటి ప్రాధా న్య ఓట్లతో కోటా ఓటు సాధ్యం కాదని, ద్వి తీయ ప్రాధాన్య ఓట్లే గెలుపును నిర్ణయిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దాదాపుగా మొదటి ప్రాధాన్య ఓట్లు ఆయా సంఘాలు బలపరిచిన అభ్యర్థులకే పడతాయని చెబుతున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలుస్తామని, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు చెబుతున్నారు. మిగితా అభ్యర్థులను బలపరిచిన టీచర్స్ జేఏసీ, టీ పీయూఎస్, బీజేపీ మాత్రం రెండో ప్రాధాన్య ఓట్ల తోనే తుది ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నాయి. -
అవగాహన సదస్సుకు నిధులు విడుదల
నల్లగొండ టూటౌన్ : జాతీయ సేవా పథకం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇటీవల రెండు రోజుల పాటు రెడ్ రిబ్బన్ క్లబ్, పీర్ లీడర్స్ కన్వెనషన్ ఆధ్వర్యంలో ఎయిడ్స్పై నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. దీంతో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి నిధులు విడుదలైనట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హేస్సేన్ గురువారం తెలిపారు. నిధులు విడుదల ఉత్తర్వులను డాక్టర్ మద్దిలేటికి అందజేశారు. ఒక రోజు ఉమ్మడి జిల్లాలోని రెడ్రిబ్బన్ కాలేజీల్లో ఎయిడ్స్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించాలని వీసీ సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, ప్రొఫెసర్ ఆకుల రవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, హరికిషన్రావు పాల్గొన్నారు. -
అమెండ్మెంట్ బిల్లుతో హక్కులకు భంగం
భువనగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లు–2025’ న్యాయవాదుల హక్కులను హరించే విధంగా ఉందని, వెంటనే బిల్లును రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు)రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం భువనగిరిలో ఏర్పాటు చేసిన ఐలు సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో కేంద్రం అమెండ్మెంట్ బిల్లు తీసుకువచ్చిందని ఆరోపించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ముగ్గురు కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తులే ఉండాలనే సవరణ బార్ కౌన్సిల్పై అజమాయిషీ కిందకే వస్తుంది. ఏదైనా కేసులో న్యాయవాదికి మూడేళ్ల శిక్షపడి దాన్ని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఖరారు చేసినట్లయితే అతని బార్ కౌన్సిల్ సభ్యత్వం రద్దవుతుందన్న నిబంధన కఠినంగా ఉందన్నారు. అంతేకాకుండా ఏదైనా విషయంలో న్యాయవాదులు బాయ్కాట్ చేయవద్దనడం ప్రజాస్యామ్యానికి విరుద్ధమన్నారు. బిల్లులోని కఠిన నిబంధనలను తొలగించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు కుక్క దువ్వ సోమయ్య, పాల్వంచ జగితయ్య, తడక మోహన్, సహాయ కార్యదర్శి బొల్లేపల్లి జీసస్, శ్రీనివాస్కుమార్, చింతల రాజశేఖర్రెడ్డి, కోశాధికారి బొడ్డు కిషన్, సభ్యులు నిహాల్ పాల్గొన్నారు. ఫ ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి -
రమణీయం.. శివపార్వతుల రథోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేద పండితులు నిత్య హవనములు, శివ పంచాక్షరి జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనాలు చేపట్టారు. అనంతరం గర్భాలయంలో మహాశివుడికి, స్పటిక లింగానికి లక్ష బిల్వార్చన, అభిషేకం తదితర పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సాయంత్రం నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కల్యాణమూర్తులైన శివపార్వతులను రథంలోకి వేంచేపు చేసి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అర్ధనా రీశ్వర రూపంలో పార్వతీ పరమేశ్వరులను ఏకరూపంలో దర్శనం కలిగించు రథోత్సవ వేడుక ఎంతో మహత్తరమైందని, అద్వైత జ్ఞాన ప్రకాశమని శివ పురాణం తెలియజేస్తుందని అర్చకులు వెల్లడించారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నేటితో ఉత్సవాలు పరిసమాప్తం శివాలయంలో ఈనెల 23వ తేదీన మొదలైన మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం పరిసమాప్తం కానున్నాయి. మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి స్వామి, అమ్మవారికి డోలోత్సవంతో ఉత్సవాలకు అర్చకులు ముగింపు పలకనున్నారు. ఫ యాదగిరిగుట్ట శివాలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఫ శివుడికి అభిషేకం, లక్ష బిల్వార్చన -
పన్నుల వసూళ్లలో వేగం పెంచండి
భూదాన్పోచంపల్లి : పన్నుల వసూళ్లలో వేగం పెంచి గడువులోపు లక్ష్యాన్ని చేరుకోవాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం సాయంత్రం భూదాన్పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలోని అన్ని చాంబర్లలో కలియదిరిగారు.అనంతరం రికార్డులను పరిశీలించారు.ఆస్తిపన్నుపై ఆరా తీశారు.డిమాండ్ ఎంత, ఇప్పటి వరకు ఎంత వసూలైంది, వార్డు ఆఫీసర్లు రోజుకు ఎంత వసూలు చేస్తున్నారు, బకాయిదారులకు నోటీసులు జారీ చేశారా.. అని తెలుసుకున్నారు. వసూలైన పన్నును ఏరోజుకారోజు బ్యాంకులో జమ చేయాలని మున్సిపల్ కమిషనర్ అంజిరెడ్డికి సూచించారు. గ్రీన్ బడ్జెట్ ఎంత ఉందని అడిగారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదే విధంగా సమీకృత మార్కెట్, అర్బన్పార్కు, పబ్లిక్ టాయిలెట్లు, నర్సరీలు, బృహత్ పట్టణ ప్రకృతి వనాల ప్రగతిపై ఆరా తీశారు. అర్బన్ పార్కు పనులు మొదలు కాలేదని తెలుసుకుని పబ్లిక్ హెల్త్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే రీటెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ లేఅవుట్ల రిజిస్టర్ నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. ఆయన వెంట ఇంచార్జి తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఆర్ఐ వెంకట్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఆదిత్య, రాజేశ్, వార్డు ఆఫీసర్లు ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
హాల్టికెట్పై క్యూఆర్ కోడ్
భువనగిరి : ఇంటర్ వార్షికపరీక్షలు రాయబోతున్నారా? పరీక్ష కేంద్రం అడ్రస్ తెలియకపోయినా, దారితప్పినా ఇబ్బంది పడవద్దు. సమస్యలు, సందేహాలు తీర్చేందుకు ఇంటర్బోర్డు క్యూఆర్కోడ్తో హాల్టికెట్లు జారీచేస్తోంది. క్యూఆర్ కోడ్ను స్కాన్చేయగానే పరీక్ష కేంద్రం అడ్రస్, మీరు ఉన్న ప్రాంతం నుంచి సెంటర్ ఎంత దూరం ఉంది.. ఎన్ని నిమిషాల్లో చేరుకోగలరో కూడా తెలిసిపోతోంది. తొలిసారి నూతన విధానం విద్యార్థుల కోసం ఇంటర్బోర్డు ఈ విద్యా సంవత్సరం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీ వరకు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలను మొదటిసారిగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించింది. తాజాగా మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వార్షిక పరీక్షల కోసం నూతన విధానం అమలు చేస్తోంది. హాల్టికెట్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్థుల సెల్ నంబర్లకు మెసేజ్లు పంపడం, పరీక్ష కేంద్రాల వివరాలను తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్, పరీక్షలకు సంబంధించిన సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు హాల్ టికెట్పై టోల్ ఫ్రీ, కంట్రోల్ రూం నంబర్ ఏర్పాటు చేశారు. నూతన విధానం వల్ల విద్యార్థులు కేంద్రాల అడ్రస్, హాల్టికెట్ విషయంలో ఇబ్బందులు పడవల్సిన పరిస్థితి ఉండదు. 12 వేల మంది విద్యార్థులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో 12,371 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 6,244. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,127 మంది ఉన్నారు. వీరంతా మార్చి 5నుంచి 22వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రం అడ్రస్ సులువుగా తెలుసుకోవచ్చు విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్బోర్డు తొలిసారిగా క్యూఆర్ కోడ్తో హాల్టికెట్లు జారీ చేస్తుంది. క్యూఆర్ కోడ్తో పాటు టోల్ ఫ్రీనంబర్, జిల్లా కంట్రోల్ రూం నంబర్ ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి సమస్య, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూం నంబర్ను సంప్రదించాలి. విద్యార్థులు పరీక్ష కేంద్రం అడ్రస్ సులువుగా తెలుసుకుని, సమయానికి పరీక్షకు హాజరయ్యేందుకు క్యూఆర్ కోడ్ దోహదపడుతుంది. –రమణి, డీఐఈఓ విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్బోర్డు నూతన విధానం ఫ పరీక్ష కేంద్రం అడ్రస్, దూరం, ఇతర వివరాలు క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం ఫ హాల్టికెట్పై టోల్ ఫ్రీ, కంట్రోల్ రూం నంబర్లు ఫ విద్యార్థులకు తప్పనున్న ఇబ్బందులు ఫ మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు కంట్రోల్ రూం నంబర్: 98664 64361టోల్ ఫ్రీ నంబర్: 914024 600110మరికొన్ని ఉపయోగాలు.. హాల్ టికెట్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే రూట్మ్యాప్ ఆధారంగా సులువుగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు. అదే విధంగా గత కొన్నేళ్లుగా హాల్ టికెట్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఇంటర్బోర్డు కల్పించింది. కానీ, డౌన్లోడ్ చేసుకునే విధానంపై సరైన అవగాహన లేకపోవడతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇకనుంచి ఆ సమస్య ఉండదు. హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యే తేదీ, హాల్ టికెట్ నంబర్లు విద్యార్థుల సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో రానున్నాయి. దీంతో విద్యార్థులు సులువుగా హాల్టికెట్ పోందే అవకాశం ఏర్పడింది. నూతన విధానం ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు వర్తించనుంది. -
యాదాద్రి భువనగిరి
ప్రయాణం.. నరకప్రాయం కాటేపల్లి రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఐదేళ్లయినా పనులు పూర్తి కావడం లేదు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీనుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. 7- 8లోశుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 9లోభళా.. బాల మేధావులు ఉమ్మడి జిల్లా విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికై ప్రశంసలు పొందాయి.- 8లో -
ఓటెత్తిన ఉపాధ్యాయులు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉమ్మడి జిల్లాలో 94.98 శాతం పోలింగ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 10 గంటల వరకు మందకొడిగా వచ్చిన ఓటర్లు ఆ తరువాత అధిక సంఖ్యలో వచ్చారు. గంట గంటకు ఓటర్ల రాక పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ భారీగా నమోదైంది. మొత్తానికి నిర్దిష్ట సమయానికే సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 94.98 శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ కేంద్రాల వద్ద సంఘాల హడావుడి గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం సాగించిన ఉపాధ్యాయ సంఘాలు.. పోలింగ్ రోజు కూడా హడావుడి చేశాయి. భువనగిరిలో ఓ అభ్యర్థి మద్దతుదారులు ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. ముఖ్యంగా బీజేపీ, పీఆర్టీయూ, పలువురు ఇండిపెండెంట్ తరపున వారి ప్రతినిధులు ప్రచారం చేయడం కనిపించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, నాయకులు గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, ఊట్కూరి అశోక్గౌడ్ భువనగిరిలో స్థానిక నాయకుల ద్వారా ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్ముడ్ రిజర్వు పోలీసులతో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.ఫ పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు ఫ మధ్యాహ్నం 2 గంటల వరకే 76 శాతం నమోదు ఫ 4 గంటల వరకు ముగిసిన పోలింగ్ ఫ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ హనుమంతరావు ఫ నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతం ఇలా.. జిల్లా ఓటర్లు పోలైన ఓట్లు శాతం యాదాద్రి 984 950 96.54సూర్యాపేట 2,664 2,530 94.97 నల్లగొండ 4,683 4,433 94.66 -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేవకుజామున సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభూవులు, ప్రతిష్టామూర్తులను అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. అనంతరం ప్రధానాలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం చేశారు. ఆతరువాత స్వామి, అమ్మవారిని గజవాహన సేవలో ఊరేగించి నిత్య తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ముగిసిన రాచకొండ పర్యాటక ఉత్సవాలు సంస్థాన్ నారాయణపురం : రాచప్ప సమితి ఆధ్వర్యలో నిర్వహిస్తున్న రాచకొండలో నిర్వహిస్తున్న పర్యాటక ఉత్సవాలు గురువారం ముగిశాయి. భక్తులు, పర్యాటకులు ఉత్సవాల్లో పాల్గొని ఆలయాల్లో పూజలు నిర్వహించినారు. రాచకొండ చరిత్రను తెలియజేసే ఫొటో గ్యాలరీతో పాటు పర్యాటక ప్రదేశాలను వీక్షించారు. రాచప్ప సమితి ఆధ్యక్షుడు మాట్లాడుతూ రాచకొండను అభివృద్ధి చేసి పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రాచప్ప సమితి ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, సలహాదారు, సభ్యులు కడారి అంజిరెడ్డి, దశరథ, గాలయ్య, యాదగిరిరెడ్డి, మాధవరెడ్డి, చంద్రారెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలి భువనగిరి : జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ప్రారంభించి, అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీఆర్డీఓ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంభం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించకపోవడంతో కొందరికే ఉపాధి లభిస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ జాబ్కార్డులు జారీ చేసి పని కల్పించాలని కోరారు. వేసవి దృష్ట్యా పని ప్రదేశాల్లో టెంట్లు, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం జిల్లా ఉప్యాక్షుడు పల్లెర్ల అంజయ్య, సభ్యులు కొండపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ‘ఫుడ్ సేఫ్టీ’తనిఖీలు భూదాన్పోచంపల్లి : పట్టణంలోని పలు కిరాణ దుకాణాల్లో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కందిపప్పు, టీ పొడి, బెల్లం తదితర పదార్థాలను పరిశీలించారు. ఓ షాపులో కందిపప్పు, టీపొడి నాణ్యతలో తేడా ఉండడంతో పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. సరుకులు లూజ్గా అమ్మవద్దని, బ్రాండెడ్ వస్తువులనే విక్రయించాలని దుకాణదారులకు ఫుడ్ కంట్రోలర్ జోనల్ అసిస్టెంట్ జ్యోతిర్మయి సూచించారు. టీపొడి, పప్పులు, పాలు ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు గుర్తించామని, అందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డైయిరీ, చికెన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి నాణ్యత పాటించని వారిపై కేసులు నమోదు చేశామని, షాపులను సీజ్ చేశామని చెప్పారు. కిరాణ షాపులకు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ ఉండాలన్నారు. ఆమె వెంట ఫుడ్ ఇనిస్పెక్టర్ స్వాతి, శాంపిల్టేకర్ రమేశ్, నర్సింహ తదితరులు ఉన్నారు. -
ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం
భువనగిరి : నేషనల్ ఇనిస్టిస్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన డాక్టర్ మీతా చౌదరి నేతృత్వంలో కేంద్ర అధికారుల బృందం గురువారం భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రిలో ఫార్మసీ, నర్సింగ్ సేవలపై తెలుసుకున్నారు. అనంతరం 15వ ఆర్థిక సంఘం, ఆరోగ్యశాఖ నిధులతో చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్యసేవలను బలో పేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపర్చడంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ పబ్లిక్ ఫైనాన్స్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఆరోగ్యసేవలు మెరుగుపర్చేందుకు 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆస్పత్రిలో రోగులకు అందజేస్తున్న వైద్యసేవలు, కార్యక్రమాల అమలుపై అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ చిన్ననాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు శిల్పిని, యశోద, ప్రోగ్రాం అధికా రులు సాయిశోభ, సుమన్కళ్యాణ్ పాల్గొన్నారు.ఫ మౌలిక వసతులు, వైద్య సేవలపై అధ్యయనం -
నిర్వాసితులకు పరిహారం చెల్లించేదెన్నడు?
భువనగిరి : బస్వాపూర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏడుళ్లు కావస్తున్నా నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్లో భాగంగా భువనగిరి మండలం వడపర్తి పరిధిలో వాగు చెరువు, చోక్లతండా వద్ద నిర్మిస్తున్న కాల్వలను బుధవారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. నిర్వాసితుల కోసం తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బస్వాపూర్ ప్రాజెక్టు నుంచి వడపర్తి కత్వ వరకు కాల్వను పూర్తి చేసేందుకు రూ. 6 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇందుకోసం జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. వడపర్తి కత్వ నింపితే భువనగిరి, బీబీనగర్ మండలాల పరిధిలోని చెరువుల్లోకి నీరు చేరి వందలాది ఎకరాలు సాగవుతుందన్నారు. నిధులు విడుదల చేయని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నాయకులు ఏదునూరి మల్లేశం, మైసయ్య,అంజనేయులు, మాణిక్యం, రైతులు పాల్గొన్నారు. వైభవంగా రాచకొండ పర్యాటక ఉత్సవాలు సంస్థాన్ నారాయణపురం : మండలంలోని రాచకొండ పర్యాటక ఉత్సవాలు బుధవారం రాచప్ప కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమ య్యాయి. ఎస్ఐ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. రాచకొండ చ రిత్రను తెలియజేసే ఫొటో గ్యాలరీ, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సాగునీటికి ప్రాధాన్యం భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. భువనగిరిలోని దీప్తి హోటల్ సమీంలో బస్వాపురం రిజర్వాయర్ కాలువ పనులను బుధవారం రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. అందులో భాగంగా మూసీ ఆధారిత కాలువల సుందరీకరణకు రూ.500 కోట్లకు పైగా నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. బైపాస్ రోడ్డు కాలువ పనుల్లో జా ప్యాన్ని నివారించి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాలువ పనుల గురించి చర్చించారు. -
వాటర్ ట్యాంకర్ టైరు పగిలి వృద్ధురాలికి గాయాలు
భువనగిరి టౌన్: వాటర్ ట్యాంకర్ టైరు పగిలి దాని నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంట్లో కూర్చొని ఉన్న వృద్ధురాలి కాలికి తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన సత్యనారాయణరెడ్డి ఇటీవల మృతిచెందాడు. సత్యనారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు అతడి సోదరి రామలక్ష్మి ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామం నుంచి భువనగిరికి వచ్చింది. బుధవారం రామలక్ష్మి ఇంట్లో కూర్చొని ఉండగా.. నీటిని సరఫరా చేసే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ అటుగా వెళ్తుండగా దాని వెనుక టైరు పగిలింది. దీంతో టైరు నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంటి దర్వాజాను చీల్చుకొని లోపల మంచంపై కూర్చొని ఉన్న రామలక్ష్మికి వేగంగా తాకింది. దీంతో ఆమె కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లారు. వాటర్ ట్యాంకర్ ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు
ఫోన్ పే, గూగుల్ పే ద్వారా టికెట్లు తీసుకునే సౌకర్యం ఐదు డిపోలకు ఐ–టిమ్స్ వచ్చాయి నల్లగొండ రీజియన్ పరిధిలోని దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ డిపోలకు మొదటి విడతలో 310 ఐ– టిమ్స్ వచ్చాయి. సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్పల్లి డిపోలకు రెండవ విడతలో వస్తాయి. ఐ– టిమ్స్ను వచ్చే నెలలో అమలులోకి తెస్తాం. దూర ప్రాంతాలతో పాటు ప్రధాన కేంద్రాలకు ముందుగా అమలు చేస్తాం. ఆ తరువాత అన్ని బస్సుల్లో పూర్తిస్థాయిలో ఐ– టిమ్స్ను అందుబాటులోకి తెస్తాం. – కొణతం జాన్రెడ్డి, ఆర్ఎం నల్లగొండ మొదటి విడతలో వచ్చిన ఐ – టిమ్స్ డిపో ఐ – టిమ్స్ దేవరకొండ 80 మిర్యాలగూడ 50 నల్లగొండ 100 కోదాడ 80 మొత్తం 310 ●ఫ ఆన్లైన్ రిజర్వేషన్, స్వైపింగ్ సౌకర్యం కూడా.. ఫ తొలి విడతలో 310 ఐ – టిమ్స్ కొనుగోలు చేసిన సంస్థ ఫ మార్చి మూడవ వారం నుంచి ప్రవేశపెట్టే అవకాశం మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తేనుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ (ఐ– టిమ్స్)ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. బస్సుల్లో నగదు చెల్లించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బస్సు పాస్ కౌంటర్లల్లో మాత్రమే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి బస్సులతో పాటు టికెట్ రిజర్వేషన్ కేంద్రాలు, అదీకృత టికెట్ బుకింగ్ ఏజన్సీల్లోనూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించాలని సంస్థ భావిస్తోంది. 15 నిమిషాల ముందు వరకు ఆన్లైన్ రిజర్వేషన్ ప్రస్తుతం దూర ప్రాంతాలకు బయలుదేరే సర్వీసులకు బస్సులు బయలుదేరే గంట ముందు ఆన్లైన్ రిజర్వేషన్లు నిలిపివేస్తున్నారు. ఈ ఐ–టిమ్స్తో ఇక ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. బస్సు మొదటి స్టేజి నుంచి ప్రారంభమయ్యాక ఆ మార్గంలో తరువాత వచ్చే స్టాప్లో బస్సులు ఎక్కదలుచుకున్న ప్రయాణికులు ఆన్లైన్లో 15 నిమిషాల ముందు వరకు టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఎంత సమయంలో బస్సు వారి స్టాప్కు వస్తుందనే సమాచారం కూడా ఈ ఐ–టిమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐ – టీమ్స్లోని సాంకేతికత ఆధారంగా ఎప్పటికప్పుడు లోకేషన్ నిర్ధారణ అవుతుంది. ప్రయాణికులు బస్సెక్కిన వెంటనే రానున్న లోకేషన్కు అనుగుణంగా టికెట్ ఇష్యూ అవుతుంది. ఐ–టీమ్స్ (ఇది స్వైపింగ్ మిషన్లా కూడా పని చేస్తుంది) ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా చార్జి చెల్లించవచ్చు.పరిశీలనలో ఐ–టిమ్స్ నల్లగొండ రీజియన్ పరిధిలో యాదగిరిగుట్ట, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండలో డిపోలు ఉండగా.. మొదటి విడతలో 310 వరకు ఐ–టిమ్స్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం వాటి పరిశీలన తుది దశలో ఉంది. కొద్దిపాటి మార్పుల అనంతరం మార్చి మూడవ వారం నుంచి బస్సుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు. -
అఖండజ్యోతి యాత్ర ప్రారంభం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్పురలోని యాదగిరిభవన్ నుంచి అఖండజ్యోతి యాత్ర బుధవారం ప్రారంభమైంది. యాత్రను కేంద్రమంత్రి కిషన్రెడ్డి, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి ప్రారంభించారు.యాత్ర ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి మీదుగా మార్చి 1వ తేదీన యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్శర్మ, అఖండ జ్యోతి యాత్ర చైర్మన్ ఎస్.వెంకట్రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలు బుధవారం ఆగమశాస్త్రం ప్రకారం కొనసా గాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులకు మూర్తులకు అష్టోత్తర పూజలు, అష్టభుజి ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు సంప్రదాయ రీతిలో నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. వేద ఆశీర్వచనం, సువర్ణ పుష్పార్చన, నిత్యకల్యాణ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తులు
నార్కట్పల్లి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు దేవాలయంలో శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామివార్లకు అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సురేశ్శర్మ, సతీష్శర్మ, శ్రీక్రాంత్ శర్మ, శశిశర్మ ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేక, సహస్ర నామార్చనలు, హోమం, అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. శివరాత్రి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. -
యాదాద్రి భువనగిరి
స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాలు భువనగిరిలోని స్వర్ణగిరి క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహన సేవ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. 7చైన్ స్నాచర్ల అరెస్ట్ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న వ్యక్తులను బుధవారం నార్కట్పల్లిలో అరెస్ట్ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ తెలిపారు. - 8లోగురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025- 9లోమహాశివుడికి రుద్రాభిషేకం గుట్ట శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నాల్గో రోజుకు చేరాయి.- 8లో -
350 మందికి రెడ్ నోటీసులు
భువనగిరిటౌన్ : ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో మార్చి నెలాఖరుకు మరో రూ.14.46 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేస్తోంది. స్పందించని పక్షంలో ఆస్తులు సీజ్ చేయాలని నిర్ణయించారు. ఆస్తిపన్నే ప్రధాన ఆదాయ వనరు మున్సిపాలిటీలకు పట్టణవాసులు చెల్లించే పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఆస్తిపన్ను, భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు, నల్లా చార్జీలు, ట్రేడ్ లైసెన్స్, అద్దెలు తదితర రూపాల్లో ఆదాయం సమకూరుతుంది. వీటిలో ఆస్తిపన్నుదే ప్రధాన వాటా. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వందశాతం వసూలు లక్ష్యంగా యంత్రాంగాలు కృషి చేస్తుంటాయి. ఆర్థిక సంవత్సరం మరో నెల రోజుల్లో ముగియనుంది. కానీ, ఆశించిన స్థాయిలో పన్ను వసూలు జరగలేదు. జిల్లాలో భువనగిరి, ఆలేరు. మోత్కూరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో ఏ ఒక్క చోట వసూళ్లు ఆశాజనకంగా లేవు. రూ.12.01 కోట్లు వసూలు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను డిమాండ్ రూ.26.47 కోట్లు కాగా ఈనెల 22వ తేదీ నాటికి రూ.12.01కోట్లు (45.38 శాతం) వసూలైంది. మోత్కూరు, చౌటుప్పల్లో మాత్రమే 50 శాతం దాటగా.. మిగతా నాలుగు మున్సిపాలిటీల్లో 44 శాతానికి మించలేదు. పెద్ద మొత్తంలో బకాయి పడ్డవారికి నోటీసులు ఆస్తిపన్ను బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. ఆరు మున్సిపాలిటీల్లో బకాయిదారుల చిట్టాను సిద్ధం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తోంది. భువనగిరి మున్సిపాలిటీలో పెద్ద మొత్తంలో బకాయిపడ్డ 100 మందికి రెడ్ నోటీసులు జారీ చేశారు. మిగతా చోట్ల కూడా 250 మంది వరకు నోటీసులు అందజేశారు. పన్నుల వసూళ్ల కోసం ఆటోలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం, రెండో శనివారం, పండుగలు, ఇతర సెలవు రోజూల్లో కూడా ప్రజలు పన్నులు చెల్లించేలా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.ఫ ఆస్తిపన్ను బకాయిదారులపై సీరియస్ ఫ మార్చి 31నాటికి రూ.26.47 కోట్లు సమకూర్చుకోవడమే లక్ష్యం ఫ ఇంకా రూ.14.46 కోట్లు పెండింగ్మున్సిపాలిటీల వారీగా వసూలైన ఆస్తిపన్ను మున్సిపాలిటీ డిమాండ్ వసూలైంది శాతం (రూ. కోట్లు) (రూ. కోట్లు)భువనగిరి 10 4.20 42 యాదిగరిగుట్ట 3.25 1.44 44 పోచంపల్లి 2.12 0.78 37 మోత్కూర్ 1.52 0.81 54 చౌటుప్పల్ 7.29 3.84 52 ఆలేరు 2.27 0.93 41 సకాలంలో పన్ను చెల్లించాలి మోత్కూరు మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా కార్యాచ రణ రూపొందించాం. ఇప్పటికే 54 శాతం వసూలైంది. మార్చి 31నాటికి లక్ష్యాన్ని చేరుకుంటాం. అధిక బకాయి ఉన్నవారికి రెడ్ నో టీసులు జారీ చేశాం. ప్రజలు సకాలంలో పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి. –సతీష్, మోత్కూరు మున్సిపల్ కమిషనర్ -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే..
నల్లగొండ: ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19మంది పోటీలో నిలిచారు. వీరిలో కొందరు వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగుతుండగా.. మరికొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. పోటీలో 19మంది.. అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), శ్రీపాల్రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ–టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ, బీసీసంఘాల మద్దతు), ఎస్. సుందర్రాజు – స్వతంత్ర, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి – స్వతంత్ర, లింగిడి వెంకటేశ్వర్లు – ప్రజావాణి పార్టీ, అర్వ స్వాతి – స్వతంత్ర, కంటె సాయన్న – స్వతంత్ర, పన్నాల గోపాల్రెడ్డి – స్వతంత్ర, ఏలె చంద్రమోహన్ – స్వతంత్ర, చాలిక చంద్రశేఖర్ – స్వతంత్ర, జంకిటి కై లాసం – స్వతంత్ర, జి. శంకర్ – స్వతంత్ర, తలకోల పురుషోత్తంరెడ్డి – స్వతంత్ర, తాటికొండ వెంకట రాజయ్య – స్వతంత్ర, దామెర బాబురావు – స్వతంత్ర, బంక రాజు – స్వతంత్ర -
ఇలా ఐతే.. చూపు మాయం!
పోషకాహారలోపం, సెల్ఫోన్ల వాడకంతో దృష్టి లోపం భువనగిరి : ఒకప్పుడు వయస్సు మీరిన వారికి వచ్చే కంటి సమస్యలు ఇప్పుడు చిన్నారులకు సైతం వస్తున్నాయి. పోషకాహార లోపం, సెల్ఫోన్లు, టీవీలు ఎక్కువ సమయం చూడడంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల శ్రేయస్సు కోసం రా ష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్బీఎస్కే) కార్యక్రమం, జిల్లా అంధత్వ నివారణ, సంస్థ, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2,785 మందికి దృష్టి లోపం ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి, ఇంటర్ కళాశాలలో 36,351 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించి 34,400 మందికి పూర్తి చేశారు. ఇందులో 2,785 మంది విద్యార్థులు దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 722 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా అందులో 30మందిని శస్త్రచికిత్స కోసం హైదరాబాద్లోని సరోజనీదేవి ఆస్పత్రికి రెఫర్ చేశారు. మిగిలిన వారికి కళ్లద్దాలు ఇవ్వనున్నారు. కారణాలు ఇవీ.. ఖాళీ సమయంలో విద్యార్థులు సెల్ఫోన్లు, టీవీలు అధికంగా చూస్తుండడంతో కళ్లపై ప్రభావం పడి దృష్టి లోపం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పౌష్టికాహారం లోపం కూడా కారణమని అంటున్నారు. ఫ వందలో తొమ్మిది మందికి సమస్య ఫ ఆర్బీఎస్కే నివేదికలో వెల్లడి ఫ జిల్లాలో 34,400 మంది విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షలు ఫ 2,785 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తింపు దశలవారీగా కళ్లద్దాలు 2,785 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించాంవీరికి దశల వారీగా అద్దాలు అందజేస్తాం. చిన్నారులు పోషహకాహారం తీసుకోవాలి. సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. పిల్ల లు ఎక్కువ సమయం సెల్ఫోన్లు, టీవీలు చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. –డాక్టర్ ప్రశాంత్, ఆర్బీఎస్కే నోడల్ అధికారి -
నేడే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి : వరంగల్–ఖమ్మం–నలగొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి నల్ల గొండ జిల్లా పరిధిలో 77 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రం గేటు లోపల ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. నాలుగు గంటల తరువాత వచ్చే వారిని అనుమతించరు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది నల్లగొండలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను రెండు రోజులు ముందుగానే అధికారులు ఆయా జిల్లాలకు తీసుకెళ్లారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బుధవారం పోలింగ్ బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామగ్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పోలీసుల భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించారు. హన్మకొండలో అత్యధిక ఓటర్లు నియోజకవర్గవ్యాప్తంగా చూస్తే హన్మకొండ జిల్లాలో అత్యధిక ఓటర్లు (5215 మంది) ఉన్నారు. ఆ తరువాత స్థానంలో నల్లగొండ జిల్లాలో 4,683 మంది ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 2664 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 984 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. బాక్సులన్నీ నల్లగొండకే.. పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులన్నీ నల్లగొండలోని ఆర్జాలబావి రిసెప్షన్ సెంటర్కు తరలించనున్నారు. 27వ తేదీన రాత్రి 8 గంటల నుంచి పోలింగ్ బాక్సులు రిసెప్షన్ సెంటర్కు చేరుకుంటాయి. మరుసటి రోజు 28వ తేదీ ఉదయం వరకు వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కొన్ని పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్కు చేరే అవకాశం ఉంది. పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ బాక్సులను నల్లగొండకు తెప్పించనున్నారు. ఆర్జాలబావి గోదాములోని స్ట్రాంగ్ రూమ్ల్లో రాజకీయ ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లను భద్రపరచనున్నారు. వచ్చే నెల 3వ తేదీన నల్లగొండలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో 77 పోలింగ్ కేంద్రాలు ఫ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఫ 72 సాధారణ, 5 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఫ ఉమ్మడి జిల్లాలో ఓటర్లు 8,331 మందిఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఫ కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భువనగిరి మండలం రాయగిరిలోని విద్యాజ్యోతి హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి బుధవారం సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రి పంపిణీని దగ్గరుండి పర్యవేక్షించారు. ఎన్నికల నిబంధనలను అవగాహన చేసుకుని విధులు నిర్వర్తించాలని పోలింగ్ అధికారులకు సూచించారు. టింగ్ గోప్యతను ఖచ్చితంగా పాటించాలన్నారు. మండలానికి ఒకటి చొప్పున 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాను ఆరు రూట్లుగా విభజించామని పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ ఆఫీసర్లు 17, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 17, మైక్రో అబ్జర్వర్లు 17, సాధారణ సిబ్బంది 34 మందిని నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు ఒకరు చొప్పున ఆరుగురు సెక్టార్ ఆఫీసర్లను నియమించామని చెప్పారు. బొమ్మలరామారం పోలింగ్ బూత్లో ఆరుగురే ఓటర్లు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 984 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని తెలిపారు. బొమ్మలరామారం పోలింగ్ కేంద్రం నంబర్ 126లో ఆరుగురు ఓటర్లే ఉన్నారని , ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో వెబ్కాస్టింగ్ ద్వారా చిత్రీకరణ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి ఉన్నారు. -
వరంగల్లో నల్లగొండ విద్యార్థిని ఆత్మహత్య
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని వరంగల్ జిల్లా అరేపల్లి సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆవరణలోని వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ పట్టణానికి చెందిన గుంటోజు సత్యనారాయణ, రమ్య దంపతులు రాక్హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ పెద్దకాపర్తిలో బ్రాంచి పోస్ట్మాస్టర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. మూడవ సంతానం రేష్మిత(19)కు ఇటీవల వరంగల్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీలో సీటు వచ్చింది. నెల రోజుల క్రితం అడ్మిషన్ తీసుకుని హాస్టల్ ఉంటోంది. హాస్టల్లో చేరినప్పటి నుంచి చదువుతో ఒత్తిడికి గురవుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెబుతోంది. దీంతో ఇటీవల ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పి మళ్లీ వరంగల్ కాలేజీకి పంపించారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో రేష్మిత ఫోన్లో మాట్లాడింది. మంగళవారం హాస్టల్ గదిలో రేష్మిత్ మాత్రమే ఉంది. బుధవారం ఉదయం రేష్మిత ఉన్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా.. రేష్మిత గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంటి నుంచి వెళ్లిన వారంలోనే కుమార్తె హఠాన్మరణం చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లగొండకు తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హాస్టల్ సిబ్బంది, మేనేజ్మెంట్ పర్యవేక్షణ లోపం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సత్యనారాయణ ఏనుమాముల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న రేష్మిత ఫ నల్లగొండలోని రాక్హిల్స్ కాలనీలో విషాదఛాయలు -
పాముకాటుతో గీత కార్మికుడు మృతి
నార్కట్పల్లి: పాముకాటుతో గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్పల్లి మండలం తొండల్వాయి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండల్వాయి గ్రామానికి చెందిన గీత కార్మికుడు దంతూరి ఽశంకర్(30) బుధవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసింది. వెటనే చెట్టు పైనుంచి కిందకు దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం తెలియజేసి స్పృహతప్పి పడిపోయాడు. గ్రామస్తుల సహకారంతో కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్
నల్లగొండ: చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితులను బుధవారం నార్కట్పల్లిలో అరెస్ట్ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నార్కట్పల్లిలో నల్లగొండ ఎక్స్రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిట్యాల వైపు బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులపై అనుమానం రావడంతో వారిని పోలీసులు ఆపి విచారించగా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల్ల రఘు ప్రస్తుతం నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో ఉంటున్నాడని, మరొకరు మైనర్ అని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 1.5 తులాల బంగారు నల్లపూసల గొలుసు, బైక్ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ సోమ నర్సయ్య, నార్కట్పల్లి సీఐ కె. నాగరాజు, నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్, సీసీఎస్ ఏఎస్ఐ యాదగిరిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్, గిరి, రాంప్రసాద్, వాహిద్, అఖిల్, సాయికుమార్, హరిప్రసాద్ను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిసూర్యాపేటటౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజుగారి రుచులు హోటల్ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ నెల 13వ తేదనీ గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతుడి వివరాలు తెలిసిన వారు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో లేదా 8712686005 నంబర్ను సంప్రదించాలని సీఐ వీరరాఘవులు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్ల కేసులో మిర్యాలగూడ వాసి అరెస్ట్ఫ రిమాండ్కు తరలించిన గద్వాల పోలీసులు మిర్యాలగూడ అర్బన్: నకిలీ సర్టిఫికెట్ల కేసులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను గద్వాల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గద్వాలకు చెందిన వ్యక్తి అగ్రికల్చర్ చదవకుండా చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు చూపించి వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందగా.. అతడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని గతంలోనే పోలీసులను అరెస్టు చేయగా.. వారికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించిన బాలకృష్ణను కూడా బుధవారం మిర్యాలగూడ నుంచి తీసుకెళ్లిన గద్వాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై గద్వాల పోలీసులు బాలకృష్ణను పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేనున్నట్లు తెలిసింది. శివాలయంలో బయల్పడిన శివలింగం, వెండి కన్నుచండూరు: చండూరు మండలం చామలపల్లిలో గల పురాతన శివాలయం పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం గ్రామస్తులు పనులు చేస్తుండగా శివలింగంతో పాటు వెండి కన్ను బయల్పడ్డాయి. దీంతో గ్రామస్తులు ప్రముఖ చరిత్రకారుడు ఎస్. లింగమూర్తికి సమాచారం అందించగా.. ఆయన వచ్చి పురాతన శివాలయాన్ని పరిశీలించారు. 9వ శతాబ్దం ప్రారంభంలో దేవాలయం నిర్మించారని, ఆనాడు మత ఘర్షణల కారణంగా గర్భగుడిలోని విగ్రహాలపై కప్పును తీసి వేశారని లింగమూర్తి వివరించారు. అప్పటి వస్తువులే ఇప్పుడు లభించాయన్నారు. -
మహాశివుడికి శత రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని గర్భాలయంలోని మహాశివుడికి, ముఖ మండపంలోని స్పటిక లింగానికి అభిషేకాలు జరిపించారు. రాత్రి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిపించారు. మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నిత్య హవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనములు, మూలమంత్ర జపములు, వివిధ పారాయణములు గావించారు. రాత్రి స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం నిర్వహించారు. ఆయా పూజల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. శివాలయంలో గురువారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లక్ష బిల్వార్చన జరిపిస్తారు. రాత్రి ఆలయ మాడ వీధిలో శ్రీరామలింగేశ్వరస్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఫ యాదగిరిగుట్టలో కొనసాగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు -
అనారోగ్య సమస్యలతో రైతు బలవన్మరణం
కేతేపల్లి: అనారోగ్య సమస్యలతో మనోవేదనకు గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన కేతేపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు గుండిగ బాలరాజు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన అతడు బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నకిరేకల్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దకు కుమారులు ఉన్నారు. మతుడి భార్య జోస్పిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. వివాహిత అదృశ్యం చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన వివాహిత అదృశ్యమైనట్లు ఆమె భర్త బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన దేశగోని మల్లేష్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసస్తున్నాడు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో గల హెచ్ఎండీఏ వెంచర్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతడికి 16ఏళ్ల క్రితం లింగోజిగూడేనికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం పని నిమిత్తం మల్లేష్ నల్లగొండకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో అతడు తన భార్యకు ఫోన్ చేయగా కుమారుడు అర్జున్ మాట్లాడాడు. అమ్మ తనను లింగోజిగూడెం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద దింపి బ్యాంక్కు వెళ్లిందని తండ్రికి చెప్పాడు. సాయంత్రం మల్లేష్ ఇంటికి చేరుకున్నాక కూడా భార్య తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వంతెన పైనుంచి పడి వ్యక్తి మృతి రామన్నపేట: బైక్పై వెళ్తున్న వ్యక్తి వంతెన పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామ సమీపంలోని వంతెన వద్ద జరగగా.. బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన కొలగాని వెంకటేష్(58) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పని నిమిత్తం రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పాడు. కానీ ఇంటికి చేరుకోలేదు. బుధవారం ఉదయం మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన లక్ష్మాపురం గ్రామానికి చెందిన జోగుల నర్సింహ వంతెన కింద వ్యక్తి మృతదేహాన్ని గమనించాడు. బైక్పై ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా మృతుడి కుమారుడికి సమాచారం అందించాడు. వెంకటేష్ ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి పడైనా లేదా ఏదైనా వాహనం ఢీకొట్టడం వల్ల గాని మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. మల్లయ్య తెలిపారు. -
సాగర్ మధ్యన
శివ నామస్మరణనాగార్జునసాగర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగార్జునసాగర్ జలాశయం మధ్యన గల సింహపురి కొండపై శివ నామస్మరణ మార్మోగింది. బుధవారం సింహపురి కొండపై గల జరిగిన ఏలేశ్వరస్వామి జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, ప్రకాశం, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు ఏలేశ్వరం చేరుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్లోని హిల్కాలనీ నుంచి లాంచీలను నడిపారు. చందంపేట, నేరెడుగొమ్ము, దేవరకొండతో పాటు వైజాగ్ కాలనీ నుంచి మరబోట్లలో చాలామంది భక్తులు సింహపురి కొండకు చేరుకున్నారు. చందంపేట, దేవరకొండ, నేరెడుగొమ్ము పోలీసులు కొండపై బందోబస్తు నిర్వహించారు. హిల్కాలనీ నుంచి లాంచీల్లో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సాగర్ ఎస్ఐ సంపత్గౌడ్, పోలీసులు పలు సూచనలు చేశారు. సాగర్ జలాశయం తీరాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలు, తండాలవాసులు మరబోట్లు, పుట్టీలలో జాతరకు వచ్చారు. జాతరకు వచ్చిన పెద్దలు పలువురికి స్థల పురాణం గురించి వివరించారు. సంతానం లేనివారు కొండ దిగువన సాగర్ జలాశయంలో స్నానమాచరించి నోట్లో నువ్వులు వేసుకుని కొండ పైకి ఎక్కి అక్కడ బండపై ఉమ్మివేస్తే.. అందులో ఎన్ని మొలకలు వస్తే అంతమంది సంతానం కల్గుతారని శివసత్తులు చెప్పడంతో పలువురు భక్తులు వారు చెప్పిన విధంగా చేశారు. సంతానం కల్గిన వారు మొక్కులు చెల్లించుకున్నారు. సాగర్ జలాశయంలో ముంపునకు గురైన గ్రామాలకు చెందిన వారు తమ బంధువులను ఏలేశ్వరం గుట్టపై కలుసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన వారు మహాశివరాత్రి రోజున ఈ జాతర నిర్వహిస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత భోజన సౌకర్యంతో పాటు తాగునీరు అందుబాటులో ఉంచారు. -
మేళ్లచెర్వులో వైభవంగా మహాశివరాత్రి జాతర
మేళ్లచెరువు: మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దంపతులు బుధవారం తెల్లవారుజామున ప్రారంభించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూలమాల, శాలవాలతో ఘనంగా సత్కరించారు. కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయంలో సుప్రభాతం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ఔపాసన, బలిహరణ, రాత్రి లింగోద్భావకాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష పుష్పాలంకరణ, మహనివేదన, తీర్ధప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించడంతో పాటు అన్నదానం చేశారు. వారి వెంట కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్రావు, కృషి ఫౌండేషన్ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, నాయకులు భాస్కరరెడ్డి, సైదేశ్వరరావు, గోవిందరెడ్డి, రామకృష్ణారెడ్డి, దేవాలయ చైర్మన్ శంభిరెడ్డి, పాలకవర్గం సభ్యులు ఉన్నారు. ఎద్దుల పందేలు ప్రారంభం ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద జాతీయ స్థాయి ఎద్దుల పందేలు నిర్వహించారు. పాలపండ్ల విభాగం ఎద్దుల పోటీలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐరా రియాల్టీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, దేవాలయ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి పాల్గొన్నారు. ఫ ప్రారంభించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ఆలేరు రూరల్: ఆలేరు మండలం టంగుటూరు గ్రామ శివారులో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండాకు చెందిన బానోతు వెంకన్న(24) ఆలేరు మండలం టుంగుటూరు గ్రామ శివారులో తుమ్మ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం టంగుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న బైక్ నంబర్ ఆధారంగా మృతుడు వెంకన్నగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంకన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రజనీకాంత్ తెలిపారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వస్తున్న కారు ట్రాక్టర్ను ఢీకొట్టిఅదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ హైవేపై బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన షేక్ మక్సూద్, షేక్ రసూల్, షేక్ రఫీక్ కారులో విజయవాడకు వెళ్తుండగా.. మార్గమధ్యలో చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ శివారులో హైవేపై చెట్లకు నీరు పోస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా యూటర్న్ వద్ద అడ్డురావడంతో దానిని కారు ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు సూర్యాపేటకు తరలించారు. అతివేగమే ప్రమదానికి కారణమని తెలుస్తోంది. -
పూర్తి కాని బస్టాండ్
భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో కనీసం నీడ కూడా లేదు. వేలాది మంది భక్తులు సొంత వాహనాల్లో గుట్టకు వస్తున్నారు. పార్కింగ్ ప్రదేశంలో తమ వాహనాలను నిలిపి కొండపైకి వెళ్లే ఆర్టీసీ ఉచిత బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో మంచినీరు, నీడ, వాష్ రూంలు లేవు. పార్కింగ్ నుంచి పుష్కరిణి వరకు నీడనిచ్చే చెట్లు లేవు. రూ.7 కోట్లతో దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన 8 ప్లాట్ఫాంల బస్టాండ్ ఇంకా పూర్తి కాలేదు. బస్టాండ్ పూర్తయితే భక్తులకు వసతులు పెరుగుతాయి. -
భద్రత నడుమ బ్యాలెట్ బాక్సుల తరలింపు
పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి పోలీస్ భద్రత నడుమ నల్లగొండలోని రిసెప్షన్ సెంటర్కు బ్యాలెట్ బాక్స్లను తరలిస్తాం. పోలింగ్ కేంద్రాల ఎన్నికల సిబ్బంది 27వ తేదీ రాత్రి వరకు రిసెప్షన్ సెంటర్కు బ్యాలెట్ బాక్సులను తెస్తారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాజేడు తదితర దూర ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చేందుకు 28వ తేదీ ఉదయం వరకు సమయం పట్టవచ్చు. ఏ వాహనం కూడా పోలింగ్ స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత మధ్యలో ఆపడానికి వీల్లేదు. వాహనాల రాకను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశాం. -
మౌలిక వసతులు కల్పించండి
భువనగిరిటౌన్ : రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందున ఈద్గాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో శాంతి సంఘం సమావేశం కలెక్టరు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. నమాజ్ వేళల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు ఉంటుందని, సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్. ఏసీపీ రాహుల్రెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, మత పెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి భువనగిరి : విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిని అధిరోహించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 10వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు మంగళవారం భువనగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రేరణ అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ రాబోయే 23 రోజులు ప్రణాళిక ప్రకారం చదివి 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో టాపర్గా నిలిచిన విద్యార్థికి సైకిల్ బహుమతిగా ఇచ్చి తల్లిదండ్రులను జిల్లా అధికారుల సమక్షంలో సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఈఓ సత్యనారాయణ, డీఆర్డీఓ నాగిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఽఅధికారి యాదయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వసంతకుమారి, జేఏసీ చైర్మన్ ఉపేందర్రెడ్డి, ఏఎస్డబ్ల్యూఓ తారాబాయి, ఇమాన్యూయేల్, శైలజ, ఆనంద్, విజయశాంతి, రమాదేవి, సునిల్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ల పరిశీలన వలిగొండ : ఈ నెల 27న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వలిగొండ శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రికార్డులను పరిశీలించి రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సుచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతరావు -
అవిశ్వాస తీర్మానం సక్రమమే
మోత్కూరు : మోత్కూరు సింగిల్ విండో చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సక్రమమే అని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. వివరాలు.. మోత్కూరు నాగార్జున రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ కోఆపరేటీవ్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేశారు. తనను పదవి నుంచి అక్రమంగా తొలగించారని అప్పీలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోఆపరేటివ్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి.. అశోక్రెడ్డి వేసిన కేసును కొట్టివేశారు. డీసీఓ నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్గా పేలపూడి వెంకటేశ్వర్లు ఎన్నిక సక్రమమేనని న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొలగింపుయాదగిరిగుట్ట: ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదార్ గౌడ్ను పదవి నుంచి తొలగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి టీ.మాధవిదేవి మంగళవారం తీర్పు వెల్లడించారు. ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మదార్గౌడ్ ఆలేరు మార్కెట్ కమిటీ పరిధిలోని గ్రామాల్లో నివసించకుండా, మోత్కూర్ మార్కెట్ కమిటీ పరిధిలోని, మోటకొండూర్ మండలం, కాటేపల్లి గ్రామంలో నివసిస్తుండడంతో, ఆయనపై తుర్కపల్లి బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, గంధమల్ల మాజీ సర్పంచ్ శాగర్ల పరమేశ్ కోర్టులో కేసు వేశారు. ఈ విషయమై హైకోర్టులో వాదోపవాదాలు నడిచాయి. మదార్ గౌడ్ ఆలేరు మార్కెట్ కమిటీ ప్రాంతానికి చెందిన వాడు కాదని, ఇది చట్ట విరుద్ధమని, అనర్హత వేటు వేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. మార్కెట్ కమిటీ పరిధిలోని గ్రామస్తులు మాత్రమే పదవికి అర్హులని, స్థానికేతరుడు కావడంతో వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు జడ్జి తీర్పు ఇచ్చారు. సుదర్శన చక్రం చెంత పరంజా తొలగింపుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురంపై ఉన్న సుదర్శన చక్రం చుట్టూ వేసిన పరంజా(ఎత్తుగా కట్టిన కర్రలు) సిబ్బంది బుధవారం తొలగించారు. మహా కుంభాభిషేక సంప్రోక్షణ పూజలు పూర్తయిన నేపథ్యంలో దీనిని తొలగించారు. అంతే కాకుండా స్వర్ణ విమాన గోపురానికి ఉత్తర దిశలో ఉన్న కర్రలను సైతం సిబ్బంది తొలగించే పనులు చేపట్టారు. ఎస్టీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్భువనగిరి : పట్టణంలోని సింగన్నగూడెం వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్ను మంగళవారం రాత్రి కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వంట గదిని పరిశీలించారు. కాగా హాస్టల్లో మెనూ సక్రమంగా పాటించడం లేదని గతంలో వార్డెన్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వార్డెన్ తీరు మారలేదు. తనిఖీ సమయంలో వార్డెన్ మెనూ పాటించడం లేదని గుర్తించిన కలెక్టర్.. వార్డెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి..భువనగిరిటౌన్, బొమ్మలరామారం : విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బొమ్మలరామారం పంచాయతీ కార్యదర్శి పద్మను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎం.హనుమంతరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేయకపోవడం, తప్పుడు పన్ను రశీదులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతోపాటు, గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం, ఇంటి నిర్మాణ అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేయడంతో సస్పెండ్ చేశారు. హనుమంతుడికి ఆకుపూజ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ విశేషంగా నిర్వహించారు. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతోపాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. తమలపాకులతో అర్చించి హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు. -
పకడ్బందీగా పోలింగ్
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశాం ఫ విధులకు రెండు వేల మంది సిబ్బంది ఫ దూర ప్రాంతాల నుంచి బ్యాలెట్ బాక్సులు భద్రంగా తెచ్చేలా కార్యాచరణ ఫ వాహనాలకు నల్లగొండ జిల్లా పోలీసుల భద్రత ఫ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోండి ఫ ఉపాధ్యాయ ఓటర్లకు రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి సూచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రెండు వేల మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా.. 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. దాదాపు 1100 మందిని ఎన్నికల నిర్వహణ కోసం కేవలం పోలింగ్ కేంద్రాల్లోనే ఏర్పాటు చేశాం. దాదాపు వేయి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో వెళ్లేటప్పటి నుంచి తిరిగి రిసెప్షన్ సెంటర్కు వచ్చే వరకు పోలీసుల భద్రత ఉంటుంది. వాహనం వెంట సెక్యూరిటీ కూడా నల్లగొండ జిల్లా పోలీసులే ఉంటారు. ఆర్జాలబావి గోదాం వద్ద రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూం నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి వేర్హౌజింగ్ గోదాముల్లో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను పంపుతాం. 26వ తేదీన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సంబంధించిన అన్ని బ్యాలెట్ బాక్సులను నల్లగొండలోని రిసెప్షన్ సెంటర్కు తీసుకొస్తాం. అక్కడే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో భద్రపరుస్తాం. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. ప్రలోభాలకు గురికావద్దు..ఉపాధ్యాయులు ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనకు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైతే సేవ చేస్తారో అలాంటి సమర్థులైన, సేవా భావం కలిగిన వారిని ఎన్నుకోవాలి.27న ప్రత్యేక సెలవు..పోలింగ్ సమయం వరకు ఉండాల్సిందే.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 6 నుంచి 9 మంది వరకే ఓటర్లున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కనిష్టంగా ఆరుగురు ఓటర్లున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఒకటో పోలింగ్ స్టేషన్ ఉండగా నల్లగొండ జిల్లా గుడిపల్లిలో చివరి పోలింగ్ స్టేషన్ ఉంది. తక్కువ మంది ఓటర్లు ఉన్న కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం వరకే వంద శాతం పోలింగ్ పూర్తయినా సాయంత్రం 4 గంటల వరకు సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోనే ఉండాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన వారికి ఈ నెల 27న పోలింగ్ సందర్భంగా ప్రత్యేక సెలవు ఇస్తున్నాం. దాంతో పోలింగ్ స్టేషన్లు ఉన్న కళాశాలలు, పాఠశాలలు, కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాం. -
పనులు పూర్తయ్యేదెలా!
యాదగిరీశా..సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పెండింగ్ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మూడు మూడు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఇస్తామన్న నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆలయ ఉద్ఘాటన జరిగి రెండు సంవత్సరాలు కావొస్తున్నా గుట్ట పనులకు నిధుల కొరత వేధిస్తోంది. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే తప్ప.. ప్రస్తుతం చేపట్టిన పనులు ముందుకు సాగేలా లేవు. సీఎంఓలో ప్రతిపాదనలు పెండింగ్ గత సంవత్సరం నవంబర్ 8న సీఎం రేవంత్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టకు వచ్చారు. ఆ సమయంలో ఆలయ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండ ప్రాశస్త్యం, భక్తులకు వసతుల కోసం అధికారులు నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. భక్తులు రాత్రి కొండపైన నిద్ర చేయడానికి డార్మెటరీ హాల్, కల్యాణ మండపం, కళాభవన్, క్యూ లైన్లలో మరిన్ని వసతుల కల్పనకు రూపొందించిన ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. వీటితోపాటు చేసిన పనులకు బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. నిలిచిపోయిన ఘాట్ రోడ్డు పనులు వైశ్య సత్రం నుంచి తులసీ వనం మీదుగా కొండపైకి చేపట్టిన ఘాట్రోడ్డు పనులు నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట–తుర్కపల్లి రోడ్డుపై బ్రిడ్జి కోసం చేపట్టిన కేబుల్ వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఒకే రోడ్డు ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ప్రారంభం కాని సంగీత్ భవన్ పనులుకొండపైన బాలాలయం తొలగించిన స్థానంలో నిర్మిస్తామన్న సంగీత్ భవన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఆధ్యాత్మిక, ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యాపార సముదాయాల కేటాయింపుల్లో జాప్యంయాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వ్యాపార సముదాయాల కోసం నిర్మించిన కాంప్లెక్స్లో కొన్ని మడిగెలను వ్యాపారులకు కేటాయించారు. మరికొన్ని కేటాయించాల్సి ఉంది. 162 దేవస్థానం దుకాణాలు, 166 ఓనర్ షిప్ దుకాణాల నిర్మాణం పూర్తయ్యింది. కొన్ని కేటాయింపుల్లో జాప్యం జరుగుతోంది. దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ సత్రంరూ.11 కోట్ల దాతల నిధులతో చేపట్టిన అన్నప్రసాద వితరణ సత్రం పనులు పూర్తయ్యాయి. తాత్కాలికంగా దీక్షాపరుల మండపంలో ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాదం చేస్తున్నారు. నూతన భవనం పనులు 59 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇందులో ఫర్నిచర్, వంట సామగ్రి వసతులు పెండింగ్లో ఉన్నాయి. అన్నప్రసాద సత్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రతిరోజూ 2000 మందికి అన్నప్రసాద వితరణ చేయవచ్చు. రెండేళ్లుగా నిలిచిపోయిన నిధులు సీఎం పేషీలో కొత్త ప్రతిపాదనలు పెండింగ్లో బస్టాండ్ నిర్మాణం బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి కావడం కష్టమే! -
మూడుసార్లు టెండర్లు పిలిచినా..
భూదాన్పోచంపల్లి : ప్రమాదకరంగా మారిన భూదాన్పోచంపల్లి మండలంలోని జలాల్పురం చెరువు కట్ట మూలమలుపు సమీపంలో భద్రతా చర్యలు చేపట్టేందుకు నిధులు మంజూరైనా పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. నిధులు మంజూరై మూడు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం టెండర్ల దశలోనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ 7న జలాల్పురం చెరువు కట్ట మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో హైదరాబాద్లోని ఎల్బీనగర్కు చెందిన ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన మరువకముందే మరో వారం రోజుల్లో ఇంకో కారు చెరువులో పడిపోయింది. ఇలా గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో చెరువు కట్ట మూలమలుపు వద్ద పదుల కొద్ది ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, ఆస్థినష్టం వాటిల్లింది. పనులు నిల్..చెరువు కట్ట మూలమలుపు వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రదేశంలో భద్రతా చర్యల కోసం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఆర్అండ్బీ శాఖ నుంచి రూ.20 లక్షలు మంజూరు చేయించారు. డిసెంబర్ 31న ఆర్అండ్బీ అధికారులతో కలిసి చెరువు కట్టను ఎమ్మెల్యే సందర్శించి కట్ట మూలమలుపు వద్ద తీసుకోవాల్సి న రక్షణ చర్యలను పరిశీలించారు. స్థానికుల ధర్నాలు, ఆందోళనలతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ నిధులు మంజూరై మూడు నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు. టెండర్లు పిలిచినా..చెరువు కట్ట వద్ద భద్రతా చర్యల్లో భాగంగా మంజూరైన రూ.20 లక్షల నిధులతో చెరువు కట్టకు ఇరువైపులా 400 మీటర్ల మెటల్ బారికేడ్లు, మూలమలుపుల వద్ద మెయిన్ రోడ్డుపై రంబుల్ స్టిప్స్, రోడ్స్ స్టంట్, కాషన్ బోర్డులు, బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయడానికి అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటికీ మూడుమార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాకపోవడం, తాజాగా పనులు చేస్తే బిల్లులు వస్తాయో, రావో అనే అనుమానంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.ముందుకు రాని కాంట్రాక్టర్లు ఫ ప్రమాదకరంగా జలాల్పురం చెరువు కట్ట వద్ద మూలమలుపు ఫ భద్రతా చర్యలకు నిధులు మంజూరు ఫ ప్రారంభం కాని పనులు ఫ ఇబ్బందులు పడుతున్న వాహనదారులుకాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు జలాల్పురం చెరువు కట్ట మూలమలుపు వద్ద భద్రతా చర్యల నిమిత్తం ఆర్అండ్బీ శాఖ నుంచి రూ. 20 లక్షలు మంజూరయ్యాయి. గత నెలలో టెండర్లు పిలిచాం. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇప్పటికీ మూడుమార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టేలా కృషి చేస్తున్నాం. – లింగయ్య, ఆర్అండ్బీ ఏఈ, భూదాన్పోచంపల్లితాత్కాలిక చర్యలతోనే సరి.. చెరువు కట్ట మూలమలుపు వద్ద ప్రమాదాల నివారణకు గత నెలలో రాచకొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలికంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేలా కట్టకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని చెరువు కట్ట మూలమలుపు వద్ద భద్రతా చర్యలు త్వరగా చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. -
దేశంలోనే ఎత్తయిన విమాన గోపురం
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం దేశంలోని ఆలయాల్లో కెల్లా ఎత్తయినదని, అంత ఎత్తులో ఉన్న విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి చేయడం ఇదే ప్రథమమని ఆలయ అధికారులు, అర్చకులు చెబుతున్నారు.● విమాన గోపురం 50.5 అడుగుల ఎత్తు, 10,759 చదరపు అడుగుల వైశాల్యం● భక్తులు, దాతలు విరాళంగా సమర్పించిన బంగారం 68 కిలోలు● చైన్నెకి చెందిన ఎంఎస్ స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ 2024 డిసెంబర్ 1న స్వర్ణతాపడం పనులు ప్రారంభించింది.● తమిళనాడుకు చెందిన స్తపతి రవీంద్రన్ 50 మంది కార్మికులతో కలిసి విమానగోపురానికి తాపడం కవచాల బిగింపు పనులను ఈనెల 18న పూర్తి చేశారు.● బంగారు తాపడం బిగింపునకు రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా) ఖర్చు చేశారు. ఇందులో రాగి రేకుల తయారీకి రూ.12లక్షలు వెచ్చించారు.యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు, దాతలు సమర్పించిన బంగారంతో రూపుదిద్దుకున్న ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామితో కలిసి శ్రీలక్ష్మీనారసింహుడికి అంకితం ఇచ్చారు. స్వర్ణతాపడంతో దివ్య విమానగోపురం భక్తులను కనువిందు చేస్తోంది. ఇప్పటికే గర్భాలయ ద్వారాలు, ధ్వజ స్తంభం, రాజగోపురాల విమానాలు, అష్టభుజి ప్రాకారాలపై ఉన్న విమానాల కలశాలకు బంగారు తాపడం చేసి బిగించారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో శ్రీస్వామి వారి క్షేత్రం అద్భుతంగా కనిపించేలా బంగారు వర్ణంలో ఉండే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయమంతా స్వర్ణమయంతో కాంతులీనుతుంది.ఐదు రోజుల పాటు కొనసాగిన యాగంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా ఈ నెల 19వ తేదీన పంచకుండాత్మక యాగానికి శ్రీకారం చుట్టారు. ఐదు రోజుల పాటు సాగిన ఈ యాగంలో చివరి రోజు ఆదివారం మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో శ్రీస్వామి, అమ్మవార్లకు శాంతికల్యాణం పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించి పంచకుండాత్మక యాగాన్ని ముగించారు. అంతకుముందు స్వర్ణ విమాన గోపురం వద్ద శాస్త్రోక్తంగా వానమామలై రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్చకులు మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ వేడుక జరిపించి శ్రీస్వామి వారికి అంకితం ఇచ్చారు. శ్రీస్వామి వారి పంచకుండాత్మక యాగంలో, మహా కుంభాభిషేక సంప్రోక్షణ వేడుకలో కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎం సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యాలయ ఓఎస్డీ శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, కిరణ్కుమారాచార్యులు, దేవస్థానం ఈఓ ఏ.భాస్కర్రావు, దేవస్థాన అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, దేవరకొండ ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, బాలునాయక్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాచకొండ సీపీ సుధీర్బాబు, డీసీపీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ రాహుల్రెడ్డి, మహిళా అభివృద్ధి కార్పొరేషన్ బండ్రు శోభారాణి, వైటీడీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కిషన్రావు, విజయ డైయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, కె.గంగాధర్, గోల్డ్ ప్లేటింగ్ కమిటీ సభ్యులు గోవింద హరి, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.సీఎంకు ఘన స్వాగతంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విచ్చేసిన సీఎం రేవంత్రెడ్డికి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భాస్కర్రావు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి స్వాగతం పలికారు. వీరితో పాటు ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, బాలునాయక్ తదితర ప్రము ఖులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.