Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Govt Frauds in Super Six1
బాబు ష్యూరిటీ బాండు.. మోసం గ్యారంటీకి బ్రాండ్‌

సాక్షి, అమరావతి:‘చంద్రబాబునాయుడు అనే నేను రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘‘భవిష్యత్తుకు గ్యారెంటీ’’లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ ఇదీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీ పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతకంతో ఆ పార్టీ జారీ చేసిన ష్యూరిటీ బాండ్‌. ఇందులో పథకాలను 2024 జూన్‌ (ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల) నుంచే అమలు చేస్తామని కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ బాండ్‌ పేపర్లతో ఇంటింటికీ వెళ్లిన టీడీపీ క్యాడర్‌... ఆ ఇంటిలో మొత్తం ఎందరు ఉన్నారు...? మహిళలు, విద్యార్థులు, నిరు­ద్యోగులు ఎంతమంది ఉన్నారు? అనే వివరాలు, వారి పేర్లు తీసుకుని... వీరికి ఏ పథకం కింద ఎంతెంత వస్తుంది..? అని లెక్కలేసి మరీ చెప్పారు. బాండ్‌ పేపర్లను మొబైల్‌ ఫోన్లకూ పంపారు. వీటిని నమ్మి ప్రజలు ఓట్లేయడంతో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైంది. కానీ, సూపర్‌ సిక్స్‌ సహా వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదు. దీంతో ప్రతి ఇంట ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులను ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఇచ్చిన బాండ్లు మోసాలకు నకళ్లుగా మారిన వైనాన్ని ఏకరవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, సీఎం చంద్రబాబు మాత్రం ‘‘సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు చేసేశా.. ఎవరైనా సూపర్‌ సిక్స్‌ హామీల అమలు గురించి ప్రశ్నిõ­Ü్త వారి నాలుక మందం తప్ప మరోటి కాదంటూ’’ ముందుగానే బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్‌ జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తానని, అంతకు రెండింతలు సంక్షేమం సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ఇస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నమ్మబలికారు. వైఎస్‌ జగన్‌ కంటే ఎంత ఎక్కువ ఇస్తాం అనేది రసీదు రూపంలో చెప్పారు. ఇక ఈ హామీల అమలు పూచీ నాదంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గ్యారంటీ ఇచ్చారు. చంద్రబాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీలపై విస్తృత ప్రచారం చేసింది. అప్పటికీ చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపినట్లేనంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలను హెచ్చరించారు. కానీ.. చంద్రబాబు మాటలు, పవన్‌ కళ్యాణ్‌ గ్యారంటీలు.. ఎల్లో మీడియా కథనాలు నమ్మి ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది.. సూపర్‌ సిక్స్‌ అతీగతీ లేదు.. పైగా హామీల అమలుపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పు.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా’ అంటూ దబాయిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన మెహరాజ్‌ బేగం షేక్‌కు ఐదేళ్లలో జరగబోయే లబ్ధికి సంబంధించి ఇచ్చిన హామీ ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు.. సూపర్‌ సిక్స్, ఎన్నికల హామీల అమలుపై ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు సంతకంతో ఉన్న బాండ్‌ పేపర్లు పంపిణీ చేసి వివరాలు నమోదు చేశారు టీడీపీ నేతలు. టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. వారి ఫోన్‌ నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్‌ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్‌ వెబ్‌సైట్‌లోకి ఎక్కించారు. ఎన్నికల సభల్లోనూ భారీగా ఊదరగొట్టారు. అధికా­రం­లోకి వచ్చాక ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు. ఈ మోసంపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలను ప్రశ్నించేందుకు ప్రతి గడప ఎదురుచూస్తోంది.మహానాడు నుంచే మహా మోసానికి నాంది సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే.. అంటే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్‌ సిక్స్‌ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటితోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి, తద్వారా ఒక కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం చేశారు. మహానాడు అనంతరం ఎన్నికల ప్రచారం ముగిసేవరకు నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబసభ్యుల పేర్లు ఆరా తీసి, ‘‘టీడీపీ మేనిఫెస్టో.కామ్‌’’ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ యజమాని లేదా ఆయన భార్య ఫోన్‌ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీని టీడీపీ మేనిఫెస్టో.కామ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్‌ సిక్స్‌ సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి... ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనం ఎంతనో వివరించారు. తర్వాత టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్లు వెబ్‌సైట్‌కు మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్‌ నంబర్‌కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. బాండ్లను కుటుంబ సభ్యుల ఎదుటే డౌన్‌లోడ్‌ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఈ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్‌ సిక్స్‌ సహా హామీలన్నీ 2024 జూన్‌ నుంచే అమలు ప్రారంభమవుతుందని బాండ్లలో తేల్చిచెప్పారు.ఇది కాదా మోసం..? 2024 జూన్‌ నుంచే పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు... కూటమి ప్రభుత్వం వచ్చిన సరిగ్గా ఏడాది తర్వాత తల్లికి వందనం పథకం అమలు చేశారు. కానీ, ఇందులో 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతిని అనుసంధానం చేశానని... 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం చూస్తే.. చంద్రబాబు మాటల్లోనే సూపర్‌ సిక్స్‌ సూపర్‌ మోసంగా మారిందని స్పష్టమవుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దొరకొట్టాల గ్రామానికి చెందిన పసాది సాలమ్మకు జరగబోయే లబ్ధికి సంబంధించి కూటమి నేతలు ఇచ్చిన బాండ్‌ ఆ బాండ్లు... మోసాలకు సాక్ష్యాలు ఏడాదిలో రూ.81,397.83 కోట్లు ఎగవేత ⇒ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ బాండ్లలో గ్యారంటీ ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపో­వడంతో ‘మోసపోయాం’ అంటూ ప్రతి ఇంట ప్రజలు నిట్టూర్చుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లు.. ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న బాండ్లను తీసుకుని.. ఏడాదిలో సూపర్‌ సిక్స్ పథకాల కింద తమ కుటుంబానికి ఎంతమేరకు ప్రభుత్వం ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ⇒ సూపర్‌ సిక్స్‌లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు బాకీ పడ్డారు. ⇒ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ, తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ⇒ సూపర్‌ సిక్స్‌లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18ృ59 ఏళ్ల మధ్య వయసు వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. మహిళలకు రూ.32,400 కోట్లు బాకీపడ్డారు. ⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్‌ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రకారం రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.⇒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనేది మరో హామీ. దీనికోసం నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది ఈ హామీ అమలు చేయలేదు. అంటే... ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ 50 ఏళ్ల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పింఛను ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పింఛనుగా ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఇది ఇవ్వలేదు. రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమందికి రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని బాబు వాగ్దానం చేశారు. యూడీఐఎస్‌ఈ (యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ యూడైస్‌) ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. రూ.15 వేల చొప్పున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ⇒ పంటల బీమా పరిహారం ఇవ్వకుండా రాష్ట్రంలోని 53 లక్షల మంది రైతులకు టోపీ పెట్టిన మొత్తం రూ.1,385 కోట్లు. ఇక మత్స్యకా­రులకు వేట నిషేధ భృతి కింద ఎగ్గొట్టిన మొత్తం రూ.265 కోట్లు. ఇలా ఏడాది కాలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.81,397.83 కోట్లు బకాయి పడిందని ప్రజలు లెక్కలు వేస్తున్నారు. బాకీపడిన ఈ మొత్తంతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సినవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.బాబూ... ఇదిగో మీరిచ్చిన బాండు..! ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల నిలదీతకు ప్రజలు సిద్ధం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమలును 2024 జూన్‌ నుంచే ప్రారంభిస్తామంటూ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట ప్రతి ఇంటా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో ఇంటింటా ఆగ్రహం పెల్లుబుకుతోంది. బాండ్లు చూపి చంద్రబాబును నిలదీయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపుపై ఇప్పుడు ప్రతి ఇంట చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు ఇచ్చిన బాండు ప్రకారం తమ ఇంటికి గత ఏడాది కాలంలో రావాల్సిన మొత్తంపై లెక్క వేసుకుని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తమ ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.

BRS MLA Kaushik Reddy Arrest2
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎ‍మ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్‌రెడ్డిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. గ్రానైట్‌ వ్యాపారి మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. మనోజ్ రెడ్డి కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. తమను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్‌ రెడ్డి బెదిరించారని ఫిర్యాదు పేర్కొన్నారు. మనోజ్ భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో కౌశిక్‌ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. శనివారం తెల్లవారుజామున కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.పాడి కౌశిక్‌ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4) మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కౌశిక్‌ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కక్షపూరితంగానే తనను అరెస్ట్‌ చేస్తున్నట్టు ఘాటు విమర్శలు చేశారు. ఇక, ఈరోజు ఉదయం కౌశిక్‌ రెడ్డిని పోలీసులు.. కోర్టులో హాజరు పరుచునున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025

Rasi Phalalu: Daily Horoscope On 21-06-2025 In Telugu3
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. స్థిరాస్తివృద్ధి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం; తిథి: బ.ఏకాదశి రా.1.43 వరకు, తదుపరి ద్వాదశి; నక్షత్రం: అశ్విని సా.5.38 వరకు, తదుపరి భరణి; వర్జ్యం: ప.1.48 నుండి 3.17 వరకు, తదుపరి రా.2.34 నుండి 4.03 వరకు; దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.13 వరకు; అమృత ఘడియలు: ఉ.10.54 నుండి 12.21 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు; యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు; సూర్యోదయం: 5.30; సూర్యాస్తమయం: 6.33; స్మార్త ఏకాదశి. మేషం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.వృషభం...అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. కొన్ని పనులలో ఆటంకాలు. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.మిథునం...శుభవర్తమానాలు. రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కర్కాటకం...సోదరుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.సింహం....వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు రద్దు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కన్య....సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో నిరాశ.తుల....నూతన పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలు సంతృప్తినిస్తాయి.వృశ్చికం...సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.ధనుస్సు....వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.మకరం......శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.కుంభం...పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.మీనం...వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

Chhattisgarh ready for maximum utilization of Godavari tributary waters4
ఇంద్రావతికి కట్టడి!

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉప నది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్‌గఢ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజా రిటీ జలాలను వినియోగించుకునేలా బోద్‌ఘాట్‌ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటినే నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులు చేపడుతుండటం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి–కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట.. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్‌గఢ్‌లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన, సమ్మక్క–సారక్క బరాజ్‌ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్‌ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన, గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ.. దేవాదుల (38 టీఎంసీలు), సీతారామ (70 టీఎంసీలు), సమ్మక్క–సారక్క (50 టీఎంసీలు మొత్తంగా 158 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇలావుండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్‌గఢ్‌ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడంతో.. ఈ నీటిని మిగులు జలాలుగా గుర్తించిన కేంద్రం.. నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్‌ (అప్పటి మధ్యప్రదేశ్‌)కు గోదావరి ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిలో వాడుకోని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాలను జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌–సోమశిల మీదుగా కావేరి గ్రాండ్‌ ఆనకట్ట వరకు తరలించేలా నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే గోదావరిలో మిగులు, వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చేవరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలనే గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. చెప్పినట్టే చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్‌గఢ్‌ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం బోద్‌ఘాట్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. ఈ ప్రాజెక్టు కింద ఇందావ్రతి నీటిని ఒడిసిపట్టేలా రూ.29 వేల కోట్లతో బోద్‌ఘాట్‌ ఆనకట్టని, అదనంగా మరో రూ.20 వేల కోట్లతో మహానది–ఇంద్రావతి లింక్‌ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లోని 359 గ్రామాల పరిధిలోని 3.78 లక్షల హెక్టార్లకు (9.45 లక్షల ఎకరాలకు) సాగునీటిని అందించాలని నిర్ణయించింది. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమే..! ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటి పారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. కాగా దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Sakshi Editorial On Air India flights5
ఎయిరిండియా రద్దుల పద్దు!

చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్‌లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్‌ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్‌ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు రేటింగ్‌ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్‌లైన్‌ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్‌ జెట్‌ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. ఇక బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్‌ జార్జి బార్నెట్‌ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్‌లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్‌ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.టాటా ఎయిర్‌లైన్స్‌గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఆవిర్భవించింది. ఈ రెండూ పబ్లిక్‌ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. టాటా సన్స్‌ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు. సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్‌ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. నిరుడు ఢిల్లీ–శాన్‌ఫ్రాన్సిస్కో సర్వీస్‌ విమానం ఇంజన్‌ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్‌కు మార్కెట్‌లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. నిరుడు మే నెలలో ముంబై–లండన్‌ సర్వీసు బోయింగ్‌ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్‌ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్‌ ఫ్లయిట్‌ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి.

Yellow Media Routine Fake Propaganda On YS Jagan6
చంద్రబాబు సమర్పించు.. ‘రప్పా రప్పా’ డైవర్షన్‌

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ రెండు గంటల తన సుదీర్ఘ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నల్లో ఏ ఒక్క దానికి సమాధానం చెప్పే ధైర్యం లేని చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్‌ రాజకీయానికి తెరలేపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి చంద్రబాబు చేతిలో మోసపోయారని జననేత వైఎస్‌ జగన్‌ చెబుతూ శాంతిభద్రతల వైఫల్యం, ఏడాదిలోనే రాష్ట్రం అప్పులపాలైన పరిస్థితి, సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకపోవడం, తాను అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేయడం, ఇసుక మాఫియా, అవినీతి, మద్యం... వంటి అనేక అంశాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు.దానికి కౌంటర్‌గా చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించినా.. జగన్‌ అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఆయనలో కనిపించలేదు. అందుకే ఎప్పుడూ చేసే మాదిరిగానే టాపిక్‌ డైవర్షన్‌ గేమ్‌ మొదలుపెట్టారు. నిజానికి గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి.. టీడీపీ కార్యకర్త ‘రప్పా రప్పా’ డైలాగు రాసి ప్లకార్డు పట్టుకున్న విషయాన్ని ప్రస్తావించగా.. జగన్‌ దానిపై స్పందిస్తూ అసలు ఆ ప్లకార్డులో ఏం రాసి ఉందో తనను ప్రశ్నించిన విలేకరులనే అడిగారు. ‘అది సినిమా డైలాగ్‌ కదా?’ అని మాట్లాడితే జగనే ‘రప్పా రప్పా నరికేస్తా’ అన్నట్లు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఐ–టీడీపీ ఒక ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. జగన్‌ ప్రశ్నించిన అంశాల్లో ఒక్క దానిపైనా మాట్లాడని చంద్రబాబు రప్పా రప్పా డైలాగు గురించే మాట్లాడి టాపిక్‌ డైవర్షన్‌ మొదలుపెట్టడం గమనార్హం.దేశం కార్యకర్త నుంచే వ్యతిరేకత వాస్తవానికి జగన్‌ పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘రప్పా రప్పా’ అనే పుష్ప సినిమా డైలాగు రాసిన ఒక ప్లకార్డును పట్టుకున్నాడు. చంద్రబాబు పాలనలో మోసపోయానని కడుపుమండి ఒక టీడీపీ కార్యకర్త వైఎస్సార్‌సీపీ ర్యాలీలోకి వచ్చి అలా ప్లకార్డు పట్టుకున్నాడంటే చంద్రబాబు సిగ్గుపడాలి. కానీ వక్రీకరణలో ఆరితేరిన చంద్రబాబు ఆ విషయాన్ని నిస్సిగ్గుగా వక్రీకరించేశారు. ఆ వాదనకు మద్దతుగా ఎల్లో మీడియా, ఆయన సోషల్‌ మీడియా, పవన్‌ కళ్యాణ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్‌ వంటి కొన్ని పాత్రలను రంగంలోకి దింపారు. ఏడాదిలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జగన్‌ అడిగిన వాటికి సమాధానం చెప్పలేక ఇలాంటి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఫేక్‌ ప్రచారాలు చంద్రబాబు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌లు, 143 హామీల అమలు వైఫల్యం గురించి, ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్లకు దాటిపోయిన అప్పుల గురించి, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులు.. చేస్తున్న దాడులు, దౌర్జన్యాల గురించి.. అనేక ప్రజా సమస్యల గురించి వైఎస్‌ జగన్‌ ప్రశి్నస్తే వాటిపై స్పందించకుండా కేవలం ఆయన అనని మాటలను వక్రీకరిస్తూ విష ప్రచారానికి దిగడాన్ని బట్టి వారికి చెప్పుకోవడానికి ఏమీ లేదని స్పష్టమైంది.అమరావతి పేరుతో అవినీతి, ఇసుక, మద్యం దోపిడీ, ఎమ్మెల్యేల అవినీతితోపాటు మొత్తంగా చంద్రబాబు పాలనపై ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తాజా ఘటనలతో స్పష్టమవుతోంది. మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు తరలివస్తున్న జనాన్ని చూసి కళ్లల్లో విషం నింపుకున్న కూటమి నేతలు తమకు అలవాటైన రీతిలో డైవర్షన్‌ రాజకీయానికి మరింత పదునుపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ, ప్రతి వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానని ఇటీవలే నోరుపారేసుకున్న చంద్రబాబు ‘డైలాగులు సినిమాలకే సరిపోతాయంటూ’ చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ల బిజీలోనూ స్పందించారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు ‘కొడకల్లారా.. తోలు తీస్తాం.. తొక్క తీస్తాం’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటూ పూనకం వచ్చినట్లు మాట్లాడింది ఆయనే. అంతెందుకు ఇటీవలే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు.. జగన్‌ను భూస్థాపితం చేస్తానని అన్నారు. సీఎం స్థాయిలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి.. ఒక మాజీ సీఎంను, ప్రతిపక్ష నేతను ఆ మాట అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారు? ఎన్నికలకు ముందు అంగళ్లు సభలో చంద్రబాబు స్వయంగా అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడులు చేయించారు.ఈ దాడిలో రణ«దీర్‌ అనే కానిస్టేబుల్‌పై దాడి చేసి కన్ను పోగొట్టారు. జగన్‌ను గాజుగ్లాసుతో పొడవండి.. రాళ్లతో కొట్టండి.. సీసం పోసి చంపండి అని రెచ్చిపోయి మాట్లాడింది చంద్రబాబే. ఇప్పుడు హోం మంత్రిగా ఉన్న అనిత అప్పట్లో జగన్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు జగన్‌ను భౌతికంగా లేకుండా చేయాలని అన్న వీడియో బయటకు వచ్చింది.అంత బరితెగించి మాట్లాడిన వారికి ఏం శిక్ష పడాలి? ఇప్పుడు కూడా డైవర్షన్‌ రాజకీయాలు చేస్తూ, అందులో భాగంగా జగన్‌ తల నరికేయవచ్చు కదా? అసలు ఆయనకు జీవించే హక్కు ఉందా? అని టీడీసీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో చంద్రబాబు తన కడుపులోని విషాన్నంతా కక్కించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, నిర్భంధాలు, నోరెత్తితే అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్న వైనంపై జగన్‌ మాట్లాడితే బుచ్చయ్యచౌదరి దాన్ని వక్రీకరించి నక్సలైట్లను తయారు చేస్తావా? అంటూ తన నోటికి అడ్డూఅదుపూ లేదని నిరూపించారు.

Sakshi Guest Column On Iran and Israel Issues7
అణు ఉపద్రవం

‘‘ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా (అమెరికా) పరిస్థితిని నిరంతరం మదింపు చేస్తోంది. (ఇరాన్‌) 2003 లో పక్కనపెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు సర్వోన్నత నాయకుడు ఖొమేనీ ఆదేశించలేదు’’ అని అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబార్డ్‌ ఈ ఏడాది మార్చి 26న చెప్పారు. అయినా, ఇరాన్‌ అణ్వాయుధాల నిర్మాణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ‘ముందస్తు’ చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్‌ ఈ జూన్‌ 13న దాడులు ప్రారంభించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చర్యను నిర్లక్ష్యపూరిత దుందుడుకు చర్య. ఇరాన్‌లో ఉన్న ప్రభుత్వం అక్కడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని చెప్పలేం. ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే. అయినా ఇరాన్‌పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అణ్వాయుధాన్ని నిర్మించగలిగిన స్థితికి ఇరాన్‌ చాలా దగ్గరలో ఉందనే ఇజ్రాయెల్‌ అభిప్రాయం ట్రంప్‌ మనసులో నాటుకుంది. దాంతో ఆయన ఇంటెలిజెన్స్‌ అంచనాను పక్కనపెట్టేశారు. చేయాలనుకుంటే ఆపగలరా?ఇరాన్‌ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అక్కడ అధికారం చేతులు మారేటట్లు చూడటం ఇజ్రాయెల్‌ ఆశయాలు. ఆ రెంటిలో ఏదీ తేలికైనది కాదు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్‌ సొంతం ఏమీ కాదని ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌ ఈమధ్య అన్నారు. ‘‘బహుశా కొన్ని వారాలు ఆపగలం... ఓ నెల ఆపగలం... అమెరికా కూడా దాన్ని కొద్ది నెలలపాటే అడ్డుకోగలదేమో’’ అన్నారాయన. ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థతోపాటు నటాంజ్‌లో ఉన్న ముఖ్యమైన యురేనియం శుద్ధి సదుపాయాన్ని, ఇస్‌ఫహాన్‌ న్యూక్లియర్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఇజ్రాయెల్‌ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుత మదింపులు సూచిస్తున్నాయి. కానీ అరాక్‌ న్యూక్లియర్‌ కాంప్లెక్స్‌ చాలా వరకు చెక్కుచెదరకుండానే ఉందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఫర్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇంతవరకు వాటిల్లిన నష్టం ఏమీ లేదు. ఈ సదుపాయం చాలా కీలకమైంది. ఎందుకంటే, ఇరాన్‌ వద్ద 60 శాతం శుద్ధి అయిన యురేనియం ఉంది. అణ్వాయుధాన్ని నిర్మించడానికి 90 శాతం శుద్ధి అయిన యురేనియం అవసరం. ఆ పనిని ఫర్దో సదుపాయం వారం రోజుల్లో చేసిపెట్టగలదు. ఇరాన్‌ వద్ద 2025 మే నాటికి 408.6 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా. దానిని మరింత శుద్ధి చేస్తే, రానున్న వారాల్లో తొమ్మిది అణ్వాయుధాల తయారీకి సరిపోతుంది. అమెరికా భాగస్వామ్యం ఎంత?భారీ మందుగుండు సామగ్రితో కూడిన ఎయిర్‌ బ్లాస్ట్‌ బాంబు (ఎంఓఏబి) మాత్రమే ఫర్దోను ధ్వంసం చేయగలదు. అది ఇజ్రాయెల్‌ వద్ద లేదు. అమెరికా రంగంలోకి దిగితేనే దాన్ని ధ్వంసం చేయడం సాధ్యం. అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్‌ ఇరవై ఏళ్ళ పైనుంచి కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని భూగర్భ సదుపాయాలను కూడా అది నిర్మించుకుంది. గగనతల దాడులొక్కటే ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిర్మూలించలేవు. పదాతి దళాలతో భూతల ఆక్రమణ కూడా అవసరమవుతుంది. అమెరికా పాత్ర ఇక్కడే అవసరం పడుతుంది. ఇరాన్‌ ‘బేషరతుగా లొంగిపోవడం’ ట్రంప్‌ డిమాండ్లలో ముఖ్యమైంది. వెనుతిరిగి చూస్తే, ఇరాన్‌పై యుద్ధం అమెరికా–ఇజ్రాయెల్‌ కలసి చేసిన పనేనేమో అనిపిస్తుంది. బేషరతుగా లొంగిపొమ్మనడం, ప్రభుత్వాన్ని మార్చుకొమ్మని చెప్పడం వల్ల, ఇరాన్‌ నిజంగానే అణ్వాయుధ నిర్మాణ దిశగా అడుగు వేయవచ్చు. ఇరాన్‌ అలాంటి ఆయుధాలను నియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు అణ్వాయుధాలను అమ్ములపొదుల నుంచి బయటకు తీయవలసి రావచ్చు. అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచాని కంతటికీ వినాశకరం. నిజానికి, ఇజ్రాయెల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇరాన్‌ అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇరాక్‌ కారణంగా ఆ పని చేసింది. ఇరాన్‌–ఇరాక్‌ల మధ్య 1980–88 వరకు సాగిన యుద్ధం అందుకు ప్రేరణగా నిలిచింది. అమెరికా సాయంతోనే ఇరాన్‌పై దాడికి ఇరాక్‌ ఉపక్రమించింది. ఇరాన్‌లోని నగరాలపై ఇరాక్‌ రసాయనిక ఆయుధాలు, క్షిపణులతో దాడులకు దిగినా ప్రపంచ దేశాలు చాలావరకు మిన్నకుండిపోయాయి. దాంతో 1980ల మధ్య నుంచి ఇరాన్‌ సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ఇరాక్‌పై 2003లో అమెరికా దాడి చేసిన తర్వాతనే, అణ్వాయుధాలు లేనిదే తన భద్రతకు పూచీ ఉండదని ఇరాన్‌ భావించడం మొదలుపెట్టింది. ఇరానియన్లకు చరిత్ర పట్ల చక్కని అవగాహనతోపాటు జాతీయతా భావాలు మెండు. ఇరాక్‌లో మాదిరిగానే ఇరాన్‌లో కూడా అపార విధ్వంసానికి పాల్పడటంలో, ఆ దేశాన్ని బలహీనపరచడంలో అమెరికా–ఇజ్రాయెల్‌ విజయం సాధించవచ్చు. ప్రభుత్వాన్ని మార్చడంలోనూ సఫలం కావచ్చు. కానీ, కథ అంతటితో కంచికి పోదు.మనోజ్‌ జోషీవ్యాసకర్త ఢిల్లీలోని అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌లో విశిష్ఠ సభ్యుడు

Iran Deadly Cluster Bomb Attack On Israel8
పోటాపోటీగా దాడులు

టెల్‌ అవీవ్‌/టెహ్రాన్‌/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్‌లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్‌ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్‌ తన వద్ద పోగుబడిన క్లస్టర్‌ బాంబులను ప్రయోగించింది. ఇరాన్‌ క్లస్టర్‌ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, హైఫా, బీర్‌షెబా, రెహోవోట్‌ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్‌ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్‌ యొనా యాహవ్‌ చెప్పారు. రెహోవోట్‌లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్‌ పట్టణంలో షెల్టర్‌లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్‌ మిస్సైల్‌ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఇయాల్‌ జమీర్‌ చెప్పారు. ఇరాన్‌ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్‌లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్‌ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్‌లో బుషెహర్‌ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్‌ రఫేల్‌ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్‌లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్‌ నయీమ్‌ ఖాసిమ్‌ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్‌ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్‌లో హెబ్‌బొల్లా, యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్‌బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్‌లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్‌ బాంబులు వేసింది.ఇజ్రాయెల్‌ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్‌లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్‌ సిటీల్లో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ కొత్తగా ఇరాన్‌తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్‌ అవీవ్‌లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్‌లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్‌ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించారు. ఇరాన్‌లోని బ్యాంక్‌ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్‌ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్‌కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్‌ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్‌ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్‌వేర్‌లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్‌ నేతలుస్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్‌ యూనియన్‌ విదేశీవిధానాల చీఫ్‌తో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Primary school HM resigns: Andhra pradesh9
కూటమి సర్కారు తీరుకు నిరసనగా.. ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రాజీనామా

ఆత్మకూరు: గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన ఆధునిక పద్ధతుల్లో విద్యార్థులకు బెంచీలు, కంప్యూటర్లు, డిజిటల్‌ బోర్డులు, తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పాఠశాలలు పునర్నిర్మించారని.. కానీ, ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించిందంటూ ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సర్కారు తీరుపట్ల ఆయన నిరసన తెలుపుతూ శుక్రవారం తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం కోటితీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. మధుసూదన్‌రావు ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఈ రాజీనామా చేశారు. మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి రాజీనామా లేఖ అందజేశారు. రాజీనామా పత్రంలో మధుసూదన్‌రావు ఆవేదన ఆయన మాటల్లోనే.. నేను 29 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం కోటితీర్థం ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నా.టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైంది తప్ప విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాను. ఈ అనాలోచిత నిర్ణయాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు నిర్ణయించుకుని నా ఉపాధ్యాయ వృత్తి (హెచ్‌ఎం)కి రాజీనామా చేశాను. ఎంఈఓ, డీఈఓల పేరుతో స్వహస్తాలతో రాజీనామా పత్రం రాసి కార్యాలయంలో అందచేశాను. ఈ ప్రభుత్వం ఆచరణ యోగ్యం కాని విధంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉ.6 గంటలకే యోగా శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యేలా చూడమనడం కష్టంగా ఉంది.దీనికితోడు.. విద్యాశాఖ వింత పోకడలు, యాప్‌ల పేరుతో హాజరు, పాఠశాలకు హాజరయ్యే వేళలు నమోదు చేయడం.. నెట్‌వర్క్‌ సక్రమంగా లేని సమయంలో ఆలస్యం అవుతుండడంతో పై అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. 9.30 గంటలకు హాజరు పూర్తిచేయాల్సి ఉండగా నెట్‌వర్క్‌ సక్రమంగా లేక 11 గంటలకు పైగా దానితోనే సమయం సరిపోతోంది. ఈ విషయంలో ఉపాధ్యాయులది తప్పులేకున్నా వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులతో పనికిమాలిన పనులా? ఇక ఉ.6 గంటలకు మహిళా టీచర్లు యోగా తరగతులకు ఎలా వస్తారు? ఎలాంటి సౌకర్యాల్లేని పల్లెటూర్లలో నివసించడం కష్టంగా ఉండడంతో మండల, జిల్లా కేంద్రాల్లో ఉంటున్నారు. వీరు తెల్లవారుజామునే ఈ యోగా శిక్షణా తరగతుల కోసం పాఠశాలలకు ఎలా హాజరుకాగలరు? రెండునెలల క్రితం పాఠశాలల్లో బాత్‌రూమ్‌ల ఫొటోలు అడిగిన వెంటనే పంపలేదని పలువురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌ను కూడా భ్రష్టు పట్టించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.నా 29 ఏళ్ల సర్వీసులో ఇంతటి బానిసత్వం ఎప్పుడూ చూడలేదు. పిల్లల చదువులు గాలికొదిలేసేలా యాప్‌లు, ఫొటోలు పంపమంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదు. ఉపాధ్యాయుడిగా చదువులు చెప్పగలంగానీ, ఇలా ఇతర పనికిమాలిన పనులు ఉపాధ్యాయులతో చేయించడం మంచిది కాదన్న ఆవేదనతో రాజీనామా చేశాను. ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసరావును సంప్రదించగా.. హెచ్‌ఎం రాజీనామా విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేశానని పేర్కొన్నారు.

Narendra Modi will not rest, Modi will not sleep peacefully10
ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను 

సివాన్‌: నిత్యం ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాత్రి పగలు ప్రజల కోసమే పని చేస్తున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం బిహార్, ఓడిశాలో పర్యటించారు. తొలుత బిహార్‌లోని సివాన్‌ జిల్లాలో రూ.5,900 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. బిహార్‌లోని పాటలీపుత్ర జంక్షన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వరకు నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ), కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఆర్జేడీ అవమానించిందని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను అంబేడ్కర్‌ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అందుకే అంబేడ్కర్‌ అంటే ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు ఇష్టం లేదన్నారు. బాబాసాహెబ్‌ చిత్రపటాన్ని ఆర్జేడీ నేతలు పాదాలతో తొక్కేశారని, దీనిపై క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్‌ చేస్తే ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంబేడ్కర్‌ కంటే తామే గొప్పవాళ్లమని ఆర్జేడీ–కాంగ్రెస్‌ నాయకులు అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్‌ తన హృదయంలో ఉన్నాడని, ఆయన చిత్రపటాన్ని గుండెకు హత్తుకోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు కొల్లగొట్టడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌ కాచుకొని కూర్చున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం ‘‘భారతదేశ ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. నిన్ననే విదేశాల నుంచి తిరిగొచ్చా. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి నేతలు మన దేశ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేదల సాధికారతకు ఎదురవుతున్న అడ్డంకులను ఎన్డీయే ప్రభుత్వం తొలగిస్తోంది. గత 11 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. అభివృద్ధి కోసం అహోరాత్రులూ శ్రమిస్తున్నాం. బిహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్‌ రావొద్దంటే విపక్ష ఇండియా కూటమి ఓడించాలి. ఎన్డీయే నినాదం సబ్‌కా సాత్, సబ్‌కా విశ్వాస్‌. విపక్ష కూటమి నినాదం పరివార్‌కా సాత్, పరివార్‌కా వికాస్‌. సొంత కుటుంబాల అభివృద్ధి తప్ప ప్రజలంటే వారికి లెక్కలేదు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదా?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర ప్రధాని మోదీ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర, రోడ్‌షోలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి జనతా మైదాన్‌ వరకు 9 కిలోమీటర్ల మేర జరిగిన ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరంగా యాత్ర నిర్వహించారు. రూ.18,600 కోట్లకుపైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ట్రంప్‌ ఆహ్వానం తిరస్కరించా.. వాషింగ్టన్‌లో పర్యటించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించగా, తాను తిరస్కరించానని ప్రధాని మోదీ చెప్పారు. వాషింగ్టన్‌ పర్యటనకు బదులు ఒడిశాను ఎంచుకున్నానని తెలిపారు. భువనేశ్వర్‌ సభలో ఆయన మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. వాషింగ్టన్‌కు రావాలంటూ ఆహ్వానించారు. చర్చించుకుందామని, కలిసి భోజనం చేద్దామని అన్నారు. ఆహ్వానించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశా. జగన్నాథుడు కొలువుదీరిన ఒడిశాకు వెళ్లాల్సి ఉందని చెప్పా. వాషింగ్టన్‌కు రాలేనంటూ ట్రంప్‌ ఆహ్వానాన్ని తిరస్కరించా’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement