ప్రధాన వార్తలు

రష్యా చమురుకి భారత్ దూరమైంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్న్యూస్కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్పై ట్రంప్ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ 50 శాతం సుంకాలను భారత్ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్ 50 శాతం టారిఫ్ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్ ఆయిల్ను స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం.

మైమరచిన పచ్చమీడియా!
1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆ పార్టీ అభిమానులు కొంతమంది కనిపించిన ఈనాడు జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. ఇదెక్కడి గొడవ! ఎంత టీడీపీకి సపోర్టు చేసినా, ఇలా మెడలో బొమికలు వేసుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడిందేమిటా అని కొందరు సీనియర్ జర్నలిస్టులు బాధపడేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నకలలో టీడీపీకి చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాలలో స్వీట్స్ కూడా పంచుకుని ఉంటారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అదో రకం. కాని రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఇంత సంబరపడాలా అని టీడీపీ క్యాడరే విస్తుపోతోంది. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ అధికారులన్నది ప్రజలందరికి తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా .. ఇలా అందరికి తెలుసు వాస్తవం ఏమిటో! అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారనిపిస్తుంది. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు ఇచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది. ముప్పై ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒకరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేశారు. ఈ ముప్పై ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దానిని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు. కాని పులివెందులలో రాక్షసులు ఉంటారన్నట్లుగా ప్రచారం చేసి ఒక ప్రాంత ప్రజలను అవమానించడానికి టీడీపీతోపాటు ఈ మీడియా వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి దొంగ ఓట్లు వేయిస్తుంటారని చెబుతారు. గతంలో అక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి అనే దివంగత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి ఎంత ప్రయత్నించినా, సాధ్యపడలేదని అనేవారు. దాని గురించి ఎన్నడైనా ఈ మీడియా ఒక్క వార్త రాసిందా? కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలావరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది మళ్లీ ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం? స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురి అవుతోంది. పోలింగ్ బూత్ లను మార్చేయడం, వైఎస్సార్సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్సార్సీపీ వారిపై దాడులకు తెగపడడం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీస్ అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానించినా తప్పు ఉండకపోవచ్చు.స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పని చేసింది తెలిసిపోతుంది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఫోటోలతోసహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కాని, అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదే. ఇలాంటి అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ నేతలు రుణపడి ఉండవచ్చు. వైఎస్సార్సీపీ వారి ఎన్నికల ప్రచారాన్ని పత్తాపారం అంటూ పోల్చి, టీడీపీ వారి దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ పోలీస్ అధికారులను బహుశా టీడీపీ అధినాయకత్వం శహభాష్ అని మెచ్చుకుని ఉండాలి.ఇలాంటి వారందరికి డబుల్ ప్రమోషన్ లు కూడా వస్తాయోమే చూడాలని టీడీపీ నేతలే కొందరు చమత్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివితక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వ ఫీల్ అవుతోందట. వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజార్టీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్సార్సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్సార్సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయట పడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైఎస్సార్సీపీకి దిమ్మతిరిగే ఫలితం అని మరో టీడీపీ మీడియా రాసింది. అవును..అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని,అరాచకం చేస్తే వైఎస్సార్సీపీకి కాదు దిమ్మతిరిగేది.. రాష్ట్ర ప్రజలకు.ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికి అర్థమైపోయింది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటికి జగన్పై ద్వేషం ఉంటే ఉండవచ్చు. కాని ఆయనపై కోపంతో ఈ మీడియా సంస్థల అధినేతలు తమ దుస్తులు తామే ఊడదీసుకుని నగ్నంగా బజారులో నిలబడి నవ్వులపాలవుతున్న సంగతిని విస్మరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వాటి పని అవి చేయకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో, ప్రజలలో ఎంత అపనమ్మకం ఏర్పడుతుందో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాటి చెప్పాయి.ప్రభుత్వ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ, ఒక వర్గం మీడియా వ్యవస్థ అన్ని కుమ్మక్కై ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందని భావించిన న్యాయ వ్యవస్థ కూడా అలా చేయలేకపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది.ప్రభుత్వం నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చేది.అయినా బుల్ డోజ్ చేసి తమ ఎల్లో మీడియా మద్దతుతో ఏమి చేసినా జనం నమ్ముతారులే అనుకుంటే అది భ్రమే అవుతుంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఇలాగే చంద్రబాబు అరాచాకాలు చేయించి గెలిచారు. కాని సాధారణ ఎన్నికలలో టీడీపీ అంతకు రెట్టింపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ ప్రమేయం ఈ ఎన్నికలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన సంబరపడిపోతే అది ఆయన అమాయకత్వమే అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి వంతపాడి ఆయన ఎంత దీన పరిస్థితిలో ఉంది తెలియచేసినట్లయింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కోరిన వెంటనే కేవలం ఈ రెండిటికే ఎన్నికలు పెట్టడం, అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్లుమూసుకుని కూర్చోవడం, కనీసం అధికార యంత్రాంగాన్ని మందలిచే ధైర్యం చేయకపోవడం వల్ల, ప్రభుత్వంలోని వారెవరైనా ఎన్నికల కమిషనర్ను బెదిరించారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయడం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్చనివ్వడం ద్వారా, పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నిటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా, అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో! ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓటమికి కారణం అయ్యాయనుకోవాలి.ఇది దేశానికి మంచిదా?కాదా?అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్ రూమ్లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దానికి పుతిన్ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్ కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్స్టాప్ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్ పీస్ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్-పుతిన్లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్మీట్లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్ మీడియా చానెల్స్ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్ చాలా టఫ్, స్ట్రాంగ్ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది.

ఉగ్ర లింకులతో ఉలిక్కిపడ్డ ధర్మవరం
సాక్షి, అనంతపురం: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) స్థానికంగా ఓ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పట్టణం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు. ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్(40).. స్థానికంగా ఓ హోటల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతని కదలికలు అనుమానంగా ఉండ సాగాయి. ఉగ్రవాదులతో అతను వాట్సాప్ కాల్ మాట్లాడినట్లు ఎన్ఐఏ అధికారులు ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో అతని సోషల్ మీడియా అకౌంట్లనూ తనిఖీ చేశారు. వీటి ఆధారంగా.. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు.. నూర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు.. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్లకు నో ఛాన్స్!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ముగించుకున్న భారత క్రికెట్ జట్టు తదుపరి ఆసియా కప్-2025 (Asia Cup)కి సన్నద్ధం కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 మధ్య టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ను నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగష్టు ఆఖరి వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.గిల్, జైసూ, శ్రేయస్ రైట్ రైట్ఈ నేపథ్యంలో.. వరల్డ్కప్ చాంపియన్, టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసియా కప్ టోర్నీకి తన జట్టును ప్రకటించాడు. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్నే సారథిగా కొనసాగించాలన్న భజ్జీ.. టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gil)తో పాటు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను కూడా ఈ టోర్నీలో ఆడించాలని బీసీసీఐకి సూచించాడు.సంజూ వద్దు.. రిషభ్ ముద్దుఅదే విధంగా.. వీరితో పాటు శ్రేయస్ అయ్యర్ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇక ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్గా ప్రధాన పాత్ర పోషిస్తున్న సంజూ శాంసన్ను భజ్జీ పక్కనపెట్టాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ మంచి ఆప్షన్ అని.. అయితే, తాను మాత్రం రిషభ్ పంత్కే ఓటు వేస్తానని హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు.రియాన్ పరాగ్కు చోటు.. రింకూకు మొండిచేయిఇక పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లకు భజ్జీ స్థానం ఇచ్చాడు. అదే విధంగా ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్లను హర్భజన్ ఎంపిక చేశాడు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కూడా భజ్జీ తన జట్టులో చోటిచ్చాడు.ఓపెనర్గా అభిషేక్ శర్మను కొనసాగించాలన్న భజ్జీ.. అతడికి జోడీగా సంజూను కాదని యశస్వి జైస్వాల్ను ఎంచుకున్నాడు. ఇక మూడో స్థానంలో తిలక్ వర్మను కాదని శుబ్మన్ గిల్కు ఓటేశాడు. ఇక నయా ఫినిషర్గా పేరొందిన రింకూ సింగ్కు కూడా భజ్జీ మొండిచేయి చూపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ హర్భజన్ సింగ్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా కఠినమైన సౌతాఫ్రికా పిచ్లపై వరుస శతకాలు బాదిన కేరళ బ్యాటర్ సంజూ శాంసన్, హైదరాబాదీ తిలక్ వర్మలను భజ్జీ పక్కన పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. గిల్, జైసూల టీమిండియా టీ20 రీ ఎంట్రీ కోసం సౌత్ ప్లేయర్లపై వేటు వేయాలనడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.ఆసియా కప్-2025కి హర్భజన్ సింగ్ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్/కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!

అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్బాస్ వాయిస్ తేడాగా ఉందే!
ప్రతి ఏడాది బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) వస్తుంది. అది కామన్.. కానీ, ఈసారి బిగ్బాస్ కంటే ముందు అగ్నిపరీక్ష వస్తోంది. సామాన్యులను సెలక్ట్ చేసే ప్రోగ్రామ్ ఇది. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంతో ఘనంగా ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ను జరిపించనున్నారు. దీనికి బిగ్బాస్ మాజీ విన్నర్స్ అభిజిత్ (Abhijeet), బిందు మాధవి, బిగ్బాస్ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు.నా తడాఖా చూపిస్తా!తాజాగా పెద్దపులి అభిజిత్ మళ్లీ వచ్చాడంటూ హాట్స్టార్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. అందులో అభిజిత్ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్గా వచ్చిన నన్ను.. ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారు.. థాంక్యూ! ఇప్పటిదాకా నన్ను స్వీట్ చాక్లెట్ బాయ్గానే చూశారుకదా.. ఈ ఆగస్టు 22 నుంచి నా జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్బాస్తో సహా వాళ్లకూ (కంటెస్టెంట్స్కు) చూపిస్తా.. అన్నాడు. అయితే ఈ వీడియోలో బిగ్బాస్ వాయిస్ మారింది. గంభీరంగా వినిపించే బిగ్బాస్ గొంతుక పేలవంగా మారిపోయింది. గొంతు మారిపోయిందిమరి ఇది ప్రోమో వరకేనా? లేదా అగ్నిపరీక్ష షోలో, బిగ్బాస్ 9వ సీజన్లో కూడా ఇదే గొంతు వినిపిస్తుందా? అని చాలామంది డౌట్ పడ్డారు. దీంతో హాట్స్టార్ ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్ కోసమే ఈ కొత్త వాయిస్ వాడామని, బిగ్బాస్ షోలో పాత గొంతే వినిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఇకపోతే అగ్నిపరీక్ష.. ఆగస్టు 22 నుంచి హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఈ అగ్నిపరీక్షలో సెలక్ట్ అయిన కంటెస్టెంట్లు బిగ్బాస్ 9లో కామనర్స్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. The Peddha Puli @Abijeet roars Back! 🦁This time, not as a contestant, but as the formidable Judge of Bigg Boss Agnipariksha! A true test to crack. ⌛#BiggbossTelugu9 Agnipariksha starts from August 22nd exclusively on JioHotstar #BiggbossTelugu9#BiggbossAgnipariksha… pic.twitter.com/IXOzs4xyzZ— JioHotstar Telugu (@JioHotstarTel_) August 16, 2025 చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్

కబ్జాసురుల పాపం పండేలా..
కుమార్ తన ఫ్యామిలీతో కలిసి వరంగల్లో ఉండేవాడు. తన తండ్రి ఓ చిన్న సంస్థలో పని చేస్తుండేవాడు. తల్లి హౌస్ వైఫ్. వారి కుటుంబ సంపాదన చాలా తక్కువగా ఉన్నా కుమార్ భవిష్యత్తు బాగుండాలని పేరెంట్స్ ఇద్దరు కొన్నిసార్లు పస్తులున్నా కుమార్ను బాగా చదివించారు. కుమార్ కూడా పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకొని బాగా చదివి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తాను జాబ్లో చేరిన తర్వాత స్కిల్ సెట్ బావుండడంతో కెరియర్లో ఎదిగాడు. కుమార్కు చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది.. తన బాల్యం మొత్తం కేవలం రెండు గదుల ఇంటిలోనే ఉన్నాడు. ఇప్పటికీ తన పేరెంట్స్ అందులోనే ఉంటున్నారు. దాంతో వారిని వీలైనంత త్వరగా హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టి అందులోకి తీసుకురావాలని అనుకున్నాడు. తన నెలసరి సంపాదనలో ఖర్చులు పోగా పేరెంట్స్కు కొంత డబ్బు పంపించి మిగులు జీతాన్ని క్రమశిక్షణతో పొదుపు చేస్తూ వచ్చాడు. ఆరేళ్లపాటు చాలా మంచి కార్పస్ను సృష్టించాడు.ఈలోపు కుమార్ పని చేస్తున్న కంపెనీ తన కష్టాన్ని గుర్తించి ఆన్సైట్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ వల్ల తన సంపాదన మరింత పెరుగుతుంది. ఒకరోజు ప్లాట్స్ సేల్ అనే యాడ్ చూశాడు. వెంటనే వెళ్లి తన దగ్గర ఉన్న సేవింగ్స్తో ప్లాట్ కొనేద్దాం అనుకున్నాడు. ఆన్సైట్కి వెళ్లి బాగా డబ్బు సంపాదించి తిరిగి వచ్చాక ఆ సైట్లో ఇల్లు కట్టి తన పేరెంట్స్ను హైదరాబాద్ తీసుకొద్దాం అనుకున్నాడు. దాంతో ఒకరోజు ఆ ల్యాండ్ చూడడానికి వెళ్లాడు. తనకి అది నచ్చి దాన్ని కొనుగోలు చేశాడు. కుమార్ ఆన్సైట్ వెళ్లేముందు వరంగల్లోని తన పేరెంట్స్ వద్దకు వెళ్లి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వారి చేతిలో పెడుతూ ‘నాన్న ఇప్పటివరకు సేవ్ చేసిన డబ్బుతో మంచి ప్లాట్ ఒకటి కొన్నాను. నేను యూఎస్ నుంచి తిరిగి రాగానే అందులో కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెడదాం. త్వరలోనే మన సొంత ఇంటి కల నెరవేరబోతుంది నాన్న’ అన్నాడు.యూఎస్ వెళ్లిన కుమార్ వృథా ఖర్చులకు పోకుండా, డబ్బు బాగా సంపాదించి క్రమశిక్షణతో సేవ్ చేశాడు. తాను ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత గతంలో తీసుకున్న ల్యాండ్లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలనుకుని కుమార్, తన తండ్రి హైదరాబాద్లోని ప్లాట్ వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారి ప్లాట్లో ఇప్పటికే ఎవరో కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. ఆ నిర్మాణం చేస్తున్న వారిని నిలదీయడంతో అది తమ ప్లాట్ అని, అందుకే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినట్లు చెప్పారు. కుమార్కు తన ప్లాట్ కబ్జాకు గురైందని అర్థమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇది సివిల్ కేసు.. కోర్టులో కేసు ఫైల్ చేయాలని చెప్పడంతో తగిన డాక్యుమెంట్స్తో కోర్టుకు వెళ్లాడు. ఆ అక్రమ కన్స్ట్రక్షన్ ఆపాలని, న్యాయబద్ధంగా తన ప్లాట్ పొజిషన్ తనకి ఇప్పించాలని వేడుకున్నాడు. ఆ కన్స్ట్రక్షన్ ఆపేందుకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ను జారీ చేసింది. కుమార్ ఆ నిర్మాణాన్ని అయితే ఆపగలిగాడు కానీ, తన పొజిషన్ పొందాలంటే అది వెంటనే అయ్యే పనికాదు. సివిల్ కోర్టులో ఇలాంటి కేసులు కొన్ని సంవత్సరాల పాటు నడుస్తాయని అందిరికీ తెలిసిన విషయమే.ఆ కుటుంబం సొంత ఇంటికలా చెల్లాచెదురైంది. కుమార్కు జరిగిన మోసం కొంతమందికే జరుగుతుందని అనుకుంటున్నారేమో.. రీసెంట్ టైమ్లో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ప్రాపర్టీ ధరలు అధికమవుతుంటే ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ప్లాట్లని, ఖాళీ స్థలాలను మాత్రమే కబ్జా చేస్తారని కొందరు భావిస్తుంటారు. కన్స్ట్రక్షన్ పూర్తయి ఖాళీగా ఉన్న ఇల్లుని కూడా కొట్టేయడానికి కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. అంతవరకు ఎందుకు మనం సరైన నిబంధనలు పాటించకుండా ఇల్లు అద్దెకి ఇస్తే కొందరు టెనెంట్లు ఆ ప్రాపర్టీని కొట్టేయడానికి యత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. మొత్తంగా కోటి పది లక్షల సివిల్ కేసులు రిజిస్టర్ అయితే సంవత్సరంపైగా పెండింగ్లో ఉన్న కేసులు 73% పైనే. తెలుగు రాష్ట్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్లో 4,23,000కు పైగా సివిల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణలో 3,49,000కు పైగా సివిల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అన్ని ప్రాపర్టీ రిలేటెడ్ కేసులు అవ్వకపోయినా అధిక భాగం అవే ఉన్నాయి.ప్లాట్ కొన్న తర్వాత ఏం చేయాలంటే..ఓపెన్ ప్లాట్ కొన్నప్పుడు అందులో రాళ్లు పాతిపెట్టి ఉండడం గమనిస్తాం. సాధారణంగా ఆ స్థలాన్ని అలాగే వదిలేస్తాం. అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కబ్జాదారులకి, ఎంక్రోచ్మెంట్కు మనమే అవకాశం ఇచ్చినవారమవుతాం. దీన్ని కట్టడి చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.ఎవరైతే తరచూ తమ ల్యాండ్ను గమనిస్తుంటారో వారు ఓపెన్ప్లాట్లు తీసుకోవచ్చు. కొన్న తర్వాత రెగ్యులర్గా దాన్ని చెక్ చేస్తుండాలి.నిత్యం ల్యాండ్ను పరిశీలించాలంటే కొందరికి కుదరకపోవచ్చు. అలాంటివారు మాత్రం ఓపెన్ ప్లాట్ కొనే దానికన్నా గేటెడ్ కమ్యూనిటీలోని ప్లాట్స్ తీసుకుంటే కొంతవరకు మేలు.ఎక్కడ ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేసినా దాన్ని కాపాడుకునేందుకు కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లాట్ చుట్టూ సరిహద్దులను ప్రాపర్గా చెక్ చేసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ వేయాలి.ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయగలిగితే కాంపౌండ్ గోడ కట్టి చిన్న గేట్ పెట్టుకోవచ్చు. ఇది కబ్జాల నుంచి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది.భూకబ్జాలో ఎంక్రోచ్మెంట్ మరో రకమైన విధానం. అంటే పక్కవారు మీ ల్యాండ్ను కొంచెంకొంచెంగా ఆక్యుపై చేసేస్తుంటారు. అలాంటి వారి నుంచి కంపౌండ్ గోడ ప్రొటెక్ట్ చేస్తుంది.ఫెన్స్ వేసి గేట్ పెట్టిన తర్వాత సైన్ బోర్డ్స్ పెడితే మరింత బెటర్. చాలా ప్రాపర్టీస్ ముందు ‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దిస్ పర్సన్. ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్’ అని కాంటాక్ట్ నంబర్ ఉండేలా సైన్ బోర్డ్స్ చూస్తూనే ఉంటాం. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి విధానం చాలా ముఖ్యం.ఇలాంటి సైన్బోర్డ్ పెడితే 100 శాతం మన ల్యాండ్ను ఎవరూ కబ్జా చేయరా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఇది అవతలి వారి ప్రాపర్టీని బలవంతంగా కొట్టేద్దామని ప్రయత్నించేవారికి హెచ్చరికలా మాత్రం పని చేస్తుంది.చివరగా మనం ఆస్తులు సంపాదించడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించుకోవడం అంతే ముఖ్యమని గమనించాలి. బయట ఎక్కడో యాడ్ చూసి ప్రాపర్టీ కొనేముందు.. డేట్ కనిపించేలా ఆ యాడ్ వివరాలు రికార్డు చేసి పెట్టుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా ఇష్యూ వస్తే ఆ తేదీ వరకు సదరు ల్యాండ్ కబ్జా కాలేదని నిరూపించేందుకు ఒక ప్రూఫ్లా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబన

కోహ్లీ కొత్త క్యాంపెయిన్.. ఎందుకంటే..
ఇంట్లో గోడలకు సాధారణంగా మరకలు పడుతుంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటిని శుభ్రం చేసేందుకు ఎక్కవ కష్టపడాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఏషియన్ పెయింట్స్ కొత్త టెక్నాలజీ ఉపయోగించి నూతన రంగులను తయారు చేస్తున్నట్లు తెలిపింది. తన రంగుల్లో లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో పని చేసే ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ అనే సరికొత్త ఆవిష్కరణను పరిచయం చేస్తున్నట్లు ఏషియన్ పెయింట్స్ చెప్పింది.ఈ అత్యాధునిక ప్రీమియం ఇంటీరియర్ పెయింట్స్ మెరుగైన స్టెయిన్ రిపెల్లెన్సీ, ఫ్లేమ్ రెసిస్టెన్స్, మెరుగైన సౌందర్యాన్ని అందిస్తాయని ఏషియన్ పెయింట్స్ తెలిపింది. దీన్ని వినియోగదారుల ఆధునిక జీవనం కోసం రూపొందించిన్నట్లు పేర్కొంది. గతంలో ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రోటెక్ట్ ద్వారా గోడల లామినేషన్ ప్రొటెక్షన్ కోసం గ్రాఫీన్ను ఉపయోగించింది. రాయల్ వేరియంట్లో టెఫ్లాన్ ఆధారిత స్టెయిన్ రెసిస్టెన్స్ను ప్రవేశపెట్టింది. తాజాగా ఏషియన్ పెయింట్స్ ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్లో అధునాతన లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని ఆవిష్కరించినట్లు తెలిపింది.సహజంగా శుభ్రపరుచుకునే సామర్థ్యాలు కలిగిన తామర ఆకు నుంచి ప్రేరణ పొంది లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని రూపొందించినట్లు ఏషియన్ పెయింట్స్ తెలిపింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇంటి గోడలకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. రోజువారీ మరకలు కనిపించకుండా లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీ పని చేస్తుంది. కాఫీ, సాస్, క్రేయాన్లు.. వంటి మరకలు గోడపై ఉన్నప్పుడు చాలా తక్కువ శ్రమతోనే వాటిని శుభ్రం చేసేందుకు ఎంతో తోడ్పడుతుంది. ఇది సమకాలీన భారతీయ గృహాలకు అనువైన పరిష్కారంగా ఉంది. ఈ పెయింట్ ఫ్లేమ్ రెసిస్టెన్స్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ఇంట్లో సువాసనలను సైతం వ్యాపింపజేస్తుంది. మాట్, షైన్ ఫినిషింగ్ రెండింటిలోనూ ఈ రంగులు లభిస్తాయి. ఆరు సంవత్సరాల వారంటీతోపాటు మన్నిక, సంరక్షణ అత్యున్నత ప్రమాణాలను అందిస్తుంది.ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ..‘ఏషియన్ పెయింట్స్లో గృహాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి మేము చాలా సమయం వెచ్చిస్తాం. నేటి వినియోగదారులకు నిజంగా అవసరమైన వాటి చుట్టే మా ఆవిష్కరణలు ఉంటాయి. వేడుకలు, పిల్లలు, పెంపుడు జంతువులు, దైనందిన కార్యక్రమాలతో నేడు ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ దాని లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో మేము ఈ వాస్తవికతకు సరిపోయే పరిష్కారాన్ని సృష్టించాం. ఇది గోడలను శుభ్రంగా ఉంచి ఒత్తిడిని తొలగిస్తుంది. దాని ఉత్తమ స్టెయిన్ రిపెల్లెన్సీకి ధన్యవాదాలు. ఇది తెలివైన, మరింత అప్రయత్నమైన జీవనం వైపు సాగే అడుగు. ఇక్కడ గృహాలు సొగసైనవి. రోజువారీ దుస్తులను సులభంగా హ్యాండిల్ చేస్తాయి’ అని చెప్పారు.ఏషియన్ పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ దీనికి మద్దతు ఇస్తుంది. ఈ యాడ్లో అతను ఉత్పత్తుల ఆకర్షణ, శక్తితో జీవం పోస్తాడు. ఈ యాడ్ ఉల్లాసకరమైన, సాపేక్షమైన సెట్టింగ్ను చూపిస్తుంది. ఇక్కడ కోహ్లీ అందంగా డిజైన్ చేసిన ఇంటిని జ్యూస్, మిల్క్ షేక్స్ మరెన్నో పదార్థాలతో ఒక పిల్లవాడిలా పరీక్షిస్తాడు. ప్రతి పరీక్షలో ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ థీమ్స్ను సులభంగా నిర్వహిస్తుంది. ఆ పదార్థాల మరకలు స్థిరపడకముందే నిలుపుదల చేస్తుంది. ఈ లాంచ్తో ఏషియన్ పెయింట్స్ సూపర్ ప్రీమియం ఇంటీరియర్ పెయింట్ విభాగంలో మరోసారి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. పెయింట్స్, అలంకరణ విషయానికి వస్తే బ్రాండ్ పరిశ్రమలో పాల్గొనడమే కాకుండా దాని భవిష్యత్తును రూపొందిస్తోందని చూపిస్తుంది.

సృష్టి కేసులో మరో ట్విస్ట్.. అసలు పేరు నీరజ.. 1988 బ్యాచ్తో కలిసి..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. వందల మంది పిల్లలను సరోగసితో పుట్టారని బాధిత దంపతులకు ఇచ్చినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించారు.సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. డాక్టర్ నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ అని విచారణలో వెల్లడైంది. డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ సరోగసి వ్యవహారాలన్నీ నడిపించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆమె మెడిసిన్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే కాలేజీలో 1988 బ్యాచ్ మేట్స్తో సైతం ఆమె సరోగసి దందా చేయించినట్లుగా బహిర్గమైంది. నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. 2007లో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించినట్టు తెలిపారు.ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. తమ దగ్గరికి వచ్చిన దంపతుల వద్ద సరోగసి పేరిట రూ.30 లక్షల వరకు వసూలు చేశామని స్టేట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా అబార్షన్ కోసం వచ్చే గర్భిణులను డబ్బు ఆశ చూపామని.. ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా తెలిపింది. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని.. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది. పిల్లల కొనుగోలులో సంజయ్తో పాటు.. సంతోషీ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలిపింది. తన రెండో కుమారుడు లీగల్గా సహకరించే వాడని నమ్రత వెల్లడించింది. విశాఖపట్నంలో ఆసుపత్రి ప్రారంభించి పిల్లలు లేని దంపతుల నుండి 20-30 లక్షలు వసూళ్లు చేసినట్లు అంగీకరించారు.అయితే, ఇప్పటికే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి నార్త్ జోన్ పోలీసులు బదిలీ చేసిన విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే అట్లూరి నీరజ అలియాస్ నమ్రతపై 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జన్మాష్టమి ఎలా ఆచరించాలి? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం
శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన దివ్య ధామం నుండి భూమిపై అవతరించిన పవిత్రమైన రోజు. ఈ పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. భగవంతుని అలౌకికమైన ఆవిర్భావం, దివ్య లీలలను అర్థం చేసుకోవడం ద్వారా జీవులు ముక్తిని పొంది, భగవద్దామాన్ని చేరగలరని భగవద్గీత బోధిస్తోంది. శ్రీ కృష్ణుడి జననం మానవ జీవిత సార్థకతకు అవసరమైన అనేక వరాలను లోకానికి అందించింది. మధురలోని కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు చతుర్భుజ విష్ణువుగా అవతరించటం, ఆపై సామాన్య బాలకుడిగా రూపాంతరం చెందటం, పసిపిల్లాడిగానే అనేక అసురులను మట్టుపెట్టడం, చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరిని ఎత్తి పట్టడం తదితర అసాధారణమైన లీలలన్నీ శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని చాటిచెబుతున్నవే.శ్రీకృష్ణుని అవతార లక్ష్యంశ్రీకృష్ణుని జననం సాధారణ శిశువుల వలె సంభవించినది కాదు. వాస్తవానికి ఆయన పుట్టుక లేనివాడైనప్పటికీ, తన అంతరంగిక శక్తిచేతనే ఈ లోకాన అవతరించి మన మధ్య జన్మించడం ఆయన దివ్య లీలల్లో ఒకటి. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని పునఃస్థాపించడం వారి అవతార ప్రయోజనాలలో మరొకటి. మనమంతా ఈ భౌతిక దేహాలు కాదని, శాశ్వత ఆత్మ స్వరూపులమని, నిరంతర ఆనందం మన సహజ స్థితి అని తెలుపుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం మన సనాతన సంస్కృతికి మూల స్థంభం. మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవంతునితో మన ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన పరమ సందేశం "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" (సమస్త ధర్మాలను త్యజించి నన్నే శరణు పొందుము). ఇది మోక్షాన్ని పొందే అత్యంత సరళమైన మార్గం.జన్మాష్టమిని ఎలా ఆచరించాలి?కృష్ణాష్టమి నాడు భక్తులు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం సహకరించనివారు పండ్లు, పాలు వంటి అనుకల్ప ప్రసాదం తీసుకోవచ్చు. మీకు సమీపంలోని శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని సేవల్లో పాల్గొనండి. ముఖ్యంగా, ఆ రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం (కనీసం 108 సార్లు) చాలా శ్రేష్ఠం. పలు కారణాల రీత్యా దేవాలయానికి వెళ్లలేని భక్తులు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందగలరు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు తన నామ రూపంలో అవతరించి వున్నారు. హరే కృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించి శ్రద్ధగా వినడం ద్వారా హృదయంలోని కల్మషాలు తొలగి, భగవత్ప్రేమ పెంపొంది, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలము. ఈ రోజు భగవద్గీత, శ్రీమద్భాగవతం వంటి గ్రంథాల నుండి శ్రీకృష్ణుని లీలలు, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రదం.విశ్వవ్యాప్తమైన శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమిని విశ్వవ్యాప్త పండుగగా నిలపడంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల కృషి అపారం. 70 ఏళ్ల వయసులో తమ గురువు ఆదేశంతో పాశాత్య దేశాలకు వెళ్లి భగవద్గీత బోధనలను, పవిత్ర కృష్ణ నామాన్ని వ్యాప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలను స్థాపించి, జగన్నాథ రథయాత్రలను ప్రారంభించారు. 70కి పైగా గ్రంథాలను రచించి, వాటిని 25కు పైగా భాషల్లోకి అనువదించి పంపిణీ చేశారు. సామాన్య జీవన శైలితో అత్యున్నత తాత్త్విక చింతనను గలిగి జీవించే విధానాన్ని బోధించి ఎందరో శిష్యులకు మార్గనిర్దేశం చేశారు. యుగధర్మమైన హరినామ సంకీర్తనను ప్రపంచంలోని నగర గ్రామాలకూ వ్యాప్తి గావించి శ్రీచైతన్య మహాప్రభువుల భవిష్యవాణిని సార్థకం చేసిన మహనీయులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద.హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామ రామ రామ హరే హరేహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలుహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. భక్తులు రాధా గోవిందుల దర్శనం చేసుకోవచ్చు, చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో ఊపవచ్చు (ఊంజల సేవ). భగవన్నామ జపం చేయటం, నామ సంకీర్తనల్లో పాల్గొనడం, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా దివ్య అనుభూతిని పొందవచ్చు. ఈ రోజు దేవాలయంలో వేలాది మందికి ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తారు. అంతేగాక ఈ ఏడాది నార్సింగిలో నిర్మితమవుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్, మరియు కందిలోని హరే కృష్ణ కల్చరల్ సెంటర్ వద్ద కూడా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించబడతాయి.భక్తులందరూ కుటుంబంతో సహా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయం ఆహ్వానిస్తోంది. పాఠకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! హరే కృష్ణ.-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఎం.టెక్ (ఐఐటి మద్రాస్) అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్మెంట్ – హైదరాబాద్
మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్
నెలసరిలో పర్యటనలు.. వాష్రూమ్కి వెళ్లలేకపోతున్నాం: కంగనా రనౌత్
‘అమెరికా’ బాయ్కాట్ ప్రచారం
రష్యా చమురుకి భారత్ దూరమైంది: ట్రంప్
నువ్విచ్చిన కాఫీలో షుగర్ తక్కువైంది! భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తా!
కృష్ణాష్టమి సెలబ్రేషన్స్: గోపికలుగా మారిపోయిన తారలు
మమా బర్త్డే పార్టీ .. 37 మంది మహిళలు అరెస్ట్..!
రెంటల్ అగ్రిమెంట్.. ఇలా సేఫ్..
ఖజానా జ్యువెలరీ కేసును చేధించిన పోలీసులు.. డీసీపీ మీడియా సమావేశం
ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్లకు నో ఛాన్స్!
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
సచిన్కు కాబోయే కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది.. సంఘంలో విశేష గౌరవం
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జాం
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
‘వార్ 2 ’మూవీ రివ్యూ
మామూలు సమయంలోనే కనపడరు.. ఇక ఇప్పుడొచ్చి ఎలా ఆదుకుంటారనుకుంటున్నావ్!
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
టాలీవుడ్ యాంకర్ లాస్య వరలక్ష్మీ వ్రతం.. ఫోటోలు
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం
శారీలో హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్
నెలసరిలో పర్యటనలు.. వాష్రూమ్కి వెళ్లలేకపోతున్నాం: కంగనా రనౌత్
‘అమెరికా’ బాయ్కాట్ ప్రచారం
రష్యా చమురుకి భారత్ దూరమైంది: ట్రంప్
నువ్విచ్చిన కాఫీలో షుగర్ తక్కువైంది! భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తా!
కృష్ణాష్టమి సెలబ్రేషన్స్: గోపికలుగా మారిపోయిన తారలు
మమా బర్త్డే పార్టీ .. 37 మంది మహిళలు అరెస్ట్..!
రెంటల్ అగ్రిమెంట్.. ఇలా సేఫ్..
ఖజానా జ్యువెలరీ కేసును చేధించిన పోలీసులు.. డీసీపీ మీడియా సమావేశం
ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్లకు నో ఛాన్స్!
జియో కొత్త ప్లాన్ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ
ఉచిత బస్సు పథకం.. అసలు రంగు ఇదే!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కాల్చిపడేస్తా ఖబడ్దార్!
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
సచిన్కు కాబోయే కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
మళ్లీ సెలవులొచ్చాయ్.. ఈ శుక్రవారం ఓటీటీల్లో 26 సినిమాలు!
ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది.. సంఘంలో విశేష గౌరవం
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జాం
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
‘వార్ 2 ’మూవీ రివ్యూ
మామూలు సమయంలోనే కనపడరు.. ఇక ఇప్పుడొచ్చి ఎలా ఆదుకుంటారనుకుంటున్నావ్!
దేశ ప్రజలకు శుభవార్త.. ట్యాక్స్పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
కెప్టెన్గా రుతురాజ్పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం
బుడమేరులో బోగస్ ఆపరేషన్!
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
సినిమా

అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్
కష్టాలు చుట్టాల్లా వస్తూ పోతుంటాయంటుంటారు. కానీ బిగ్బాస్ బ్యూటీ, కన్నడ నటి కీర్తి భట్ (Keerthi Bhat) జీవితంలో మాత్రం అవి ఫ్యామిలీ మెంబర్స్లా తిష్ట వేశాయి. యాక్సిడెంట్లో కన్నవాళ్లను పోగొట్టుకుంది. అదే ప్రమాదంలో చావు చివరి అంచుల వరకు వెళ్లొచ్చింది. జీవితంలో తల్లయ్యే అదృష్టాన్ని పోగొట్టుకుంది. తనొక అనాధ అని ప్రియుడు వదిలేయడంతో కుంగిపోయింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసింది. వాటిన్నింటినీ దాటుకుని సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. నన్ను పిలవలేదుతెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ ఫైనలిస్టుగా నిలిచింది. తాజాగా ఆమె టీవీ ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి ఓపెన్ అయింది. బిగ్బాస్ 6 అయిపోయాక BB అవార్డ్స్ అని ఓ కార్యక్రమం చేశారు. అందులో టాప్ 3లో ఉన్న నేను, టాప్ 5లో ఉన్న రోహిత్ లేము. కానీ, టాప్ 10లో, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవాళ్లందరూ ఉన్నారు. మమ్మల్నెందుకు పిలవలేదో అర్థం కాలేదు.కలర్ చూస్తున్నారువాళ్లు పిలిస్తే వెళ్తాం కానీ, అడిగి మరీ వెళ్లలేం కదా! తర్వాత నాకర్థమైన విషయం ఏంటంటే.. ఇక్కడ మూడు రూల్స్ కచ్చితంగా ఫాలో కావాలి. ఒకటి.. నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. రెండు.. మోడ్రన్గా ఉండాలి, ఎక్స్పోజ్ చేయాలి. మూడు.. కలర్ బాగుండాలి. ఈ మూడు క్వాలిటీస్ ఉంటే షోలతో బిజీగా ఉండొచ్చు. అవి నా వల్ల కాదు అని కీర్తి చెప్పుకొచ్చింది.చదవండి: చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్

అందుకే నో కిస్ నిబంధనలను వదిలేశాను: తమన్నా
సినిమా ఆశల పల్లకి, గ్లామర్ వలయం. అంతకు మించి ప్రతిభతోపాటు అదృష్టం కూడా ఉండాల్సిన రంగం. ఈ అన్నింటిని అందిపుచ్చుకున్న బ్యూటీ తమన్నా. ఈ ఉత్తరాది భామ కథానాయకిగా దక్షిణాదిలోనే సాధించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. అంతే కాదు ఐటమ్ సాంగ్స్ తనకు తానే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ.. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా రాణించారు. అయితే, తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇందుకు వ్యక్తిగత విషయాలు కూడా ఒక కారణం కావచ్చు. మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అందు కోసం కసరత్తు చేస్తూ స్లిమ్గా తయారవుతున్నారు. ఇటీవల ఒక భేటీలో తమన్నా మాట్లాడుతూ తాను కసరత్తు చేయడం ప్రారంభించి చాలా కాలం అయ్యిందన్నారు. అయితే ఆహారం, పని, లేక వ్యక్తిగత ఇష్టాలు ఏవైనా తన ఏం చెబుతుందో అదే చేస్తానని చెప్పారు. ఏదీ బలవంతంగా చేయనని అన్నారు. తనకు అలసటగా ఉన్నా.. సరిగ్గా నిద్ర లేకపోయినా, కసరత్తులు చేయకుండా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తానని చెప్పారు. విరామ సమయాల్లో ఏదైనా ప్రశాంత ప్రదేశానికి వెళ్తానని, అక్కడ అన్నీ మరిచి ధ్యానం చేస్తానని చెప్పారు. అదే విధంగా దేవాలయాలకు వెళ్లడానికి ఇష్టపడతానన్నారు. అది మనసుకు ప్రశాంతతను ఇవ్వడంతోపాటు మంచి అనుభవాన్నిస్తుందన్నారు. సమీప కాలంలో కాశీ పయనాన్ని మరచిపోలేనన్నారు. కాశీ గొప్ప ఆధ్యాత్మిక నగరం అని పేర్కొన్నారు. అది తన మనసును ఎంతగానో ఆకట్టుకుందన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా కుటుంబంతో కలిసే వెళ్లతానన్నారు. దేవాలయాలకు మెట్ల దారి ద్వారా పయనించడంతో చరిత్రను తెలుచుకోగలుగుతామన్నారు. కాశీలో వివరించలేని ప్రశాంతత ఉంటుందన్నారు. తనకు గ్లామరస్ నటిగా ముద్ర వేశారని, అయితే ఆరంభంలో నటిగా కొన్ని కట్టుబాట్టు విధించుకోవడంతో ఛాలెంజ్తో కూడిన, శక్తివంతమైన కథా చిత్రాలను కోల్పోయాననే భావన కలిగిందన్నారు. అందువల్ల తనకు తానే విధించుకున్న నో కిస్ నిభంధనలను పక్కన పెట్టేశానన్నారు. ఆ తరువాతనే గ్లామరస్ పాత్రల్లో నటించడం మొదలెట్టానని నటి తమన్నా చెప్పారు.

చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో విడుదలైన కూలీ సినిమాకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ మూవీలో కన్నడ నటి రచితా రామ్ 'కల్యాణి' అనే పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. వాస్తవంగా ఆమె కన్నడ సినిమాలో హీరోయిన్.. అయితే, రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ రావడంతో కూలీలో విలన్ పాత్ర చేసింది. ఇందులో ఆమె పాత్రను విక్రమ్ సినిమాలో కనిపించిన ఏజెంట్ 'టీనా' పాత్రకు 'రివర్స్ వెర్షన్'గా ఉంటుందని చెప్పవచ్చు.కూలీ సినిమాలో కల్యాణిగా నటించిన రచితా రామ్ ఎవరంటూ టాలీవుడ్ షోషల్మీడియాలో పలు పోస్ట్లు కనిపిస్తున్నాయి. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి. “సర్ప్రైజ్ ప్యాకేజ్” అని అభిమానులు అభివర్ణించారు. ఆమె పాత్రతో కథలో ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. కూలీలో రచితా రామ్ పాత్ర ఉపేంద్ర కన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ పొందిందంటూ కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా కన్నడలో ఆమె పేరు భారీగా వైరల్ అవుతుంది.రచితా రామ్ 2013లో మొదటిసారి దర్శన్తో 'బుల్ బుల్' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఈ మూవీ భారీ విజయం కావడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఈ మూవీ తర్వాత 'డింపుల్ క్వీన్'గా కన్నడలో గుర్తింపు పొందింది. ఆపై తన నటనకు గాను ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మూడు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, ఆమె పాఠశాల విద్య వరకు మాత్రమే చదువుకుంది. ఆమె ఇప్పటి వరకు పునీత్ రాజ్కుమార్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్ వివేక్ ఒబేరాయ్ వంటి స్టార్స్తో నటించింది.తెలుగులో చిరు మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్తో సినిమా2022లో తెలుగులో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్గా నటించింది. 'సూపర్ మచ్చి' చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. హిట్ అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని ఆమె ఆశించింది. కానీ, ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఆమె కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో తెలుగులో ఆమెకు మరో సినిమా ఛాన్స్ దక్కలేదు.రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్కు మద్ధతుగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్కు మద్ధతుగా రచితా రామ్ గతంలో పలు వ్యాఖ్యలు చేసింది. ' నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది దర్శన్.. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు.ప్రెస్మీట్లో బోల్డ్ కామెంట్కన్నడ సినిమా ప్రెస్మీట్లో ఆమె ఒకసారి నోరు జారి వివాదాల్లో చిక్కుకుంది. ఆమె నటించిన కన్నడ సినిమా ‘లవ్ యూ రచ్చు’ ప్రమోషన్స్లో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమెను చిక్కుల్లో పడేసింది 'బోల్డ్ కంటెంట్తో ఉన్న ఇలాంటి సినిమాలో మీరు నటించడానికి గల కారణం ఏమిటి..?' అనే ప్రశ్నకు ‘‘ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వారందరూ పెళ్లైన వారే అనుకుంటున్నాను. భార్యాభర్తల మధ్య ఉండే రొమాన్స్నే మేము ఈ సినిమాలో చూపించాం. బోల్డ్ సీన్స్కీ ఓ కారణం ఉంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడండి..’’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.

చిరంజీవి బర్త్డే గిఫ్ట్స్.. అభిమానులకు పండగే
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వంభర’ నుంచి మరో టీజర్ విడుదల కానుంది. ఈమేరకు షోషల్మీడియాలో వైరల్ అవుతుంది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. అయితే, ఈ మూవీకి సంబంధించి విడుదలై మొదటి టీజర్ గ్రాఫిక్స్ వర్క్పై విమర్శలు వచ్చాయి. ఆ సమయం నుంచి పెద్దగా అప్డేట్స్ మాత్రం బయటకు రావడం లేదు.విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్పై విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠి పలు జాగ్రత్తలు తీసుకున్నారట. మరింత సమయం తీసుకున్నా సరే సినిమా హిట్ కావాలనే సంకల్పంతో పనిచేశాడట. ఈ క్రమంలోనే ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు వస్తుండటంతో అభిమానులు విశ్వంభర నుంచి ఏదైనా గిఫ్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్ను సిద్ధం చేసింది చిత్ర బృందం. ఆపై విడుదల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు అనిల్ రావిపూడి కూడా చిరు పుట్టినరోజుకు కానుక ఇవ్వాలని చూస్తున్నారట. సినిమా టైటిల్ ప్రకటించాలని ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.విశ్వంభర అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్గా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.
క్రీడలు

‘చెత్త ప్రవర్తన.. పద్ధతి లేనివాడు.. నా గురించి తప్పుగా మాట్లాడాడు’
పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి పద్ధతులు తెలియవని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అన్నాడు. ఎదుటి వ్యక్తులను కించపరిచే సంకుచిత స్వభావం కలవాడంటూ ఘాటు విమర్శలు చేశాడు. తనకైతే షాహిద్ ఆఫ్రిది పట్ల సదభిప్రాయం లేదని.. ఇందుకు అతడి చెత్త ప్రవర్తనే కారణమంటూ కుండబద్దలు కొట్టాడు.కాగా ఆల్రౌండర్గా షాహిద్ మెరుగ్గా రాణించినా.. మైదానంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లతో అతడి ప్రవర్తన ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో అతడికి క్షణం పడేది కాదు. వీలు చిక్కినప్పుడల్లా భారత ఆటగాళ్లను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు షాహిద్.నా గురించి తప్పుగా మాట్లాడాడుఈ క్రమంలోనే ఓసారి మైదానం వెలుపల కూడా తనను కించపరిచేలా షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యలు చేశాడని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. లలన్టాప్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో షాహిద్ ఆఫ్రిదిని 11 సార్లు అవుట్ చేశాను. ఓసారి హర్షా భోగ్లేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు నా గురించి తప్పుగా మాట్లాడాడు.తనకు తాను నిజమైన పఠాన్గా చెప్పుకొన్న షాహిద్.. నేను రియల్ పఠాన్ కాదంటూ చెత్తగా మాట్లాడాడు. అక్కడ అతడు కేవలం నన్ను మాత్రమే కాదు.. నా తల్లిదండ్రులను కూడా కించపరిచాడు. నిజానికి అతడు అలా మాట్లాడి ఉండకపోతే.. తనతో నాకసలు ఎలాంటి గొడవా లేదు.చెత్త ప్రవర్తనకానీ ఎప్పుడైతే వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ తప్పుగా మాట్లాడాడో అప్పుడే.. అతడిని ఎప్పుడైనా, ఎక్కడైనా అవుట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. సిరీస్ విజేతను తేల్చే కీలక మ్యాచ్లలో.. వరల్డ్కప్ ఫైనల్లో.. ఇలా మేజర్ ఈవెంట్లలో అతడి వికెట్ తీశాను.అయితే, అతడితో నేరుగా మాట్లాడేందుకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతడి వికెట్ ఎంత త్వరగా.. వీలైతే అంత త్వరగా తీయడం మాత్రమే నాకు తెలుసు. అయితే, ఓసారి కరాచి నుంచి లాహోర్కు వెళ్తున్న విమానంలో అతడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు.అప్పుడు కూడా నా వెనుక నుంచి వచ్చి.. నా జట్టులోకి వేళ్లు పోనిచ్చి.. ‘ఎలా ఉన్నావు పిల్లోడా’ అంటూ పలకరించాడు. అప్పుడు కూడా షాహిద్కు హుందాగా మాట్లాడటం చేతకాలేదు’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ షాహిద్ ఆఫ్రిది ప్రవర్తనను విమర్శించాడు.బరోడా ఆల్రౌండర్కాగా 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం బ్యాటర్. టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో 2003- 2012 వరకు క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్లు ఆడిన ఇర్ఫాన్ పఠాన్.. ఆయా ఫార్మాట్లలో 100, 173, 28 వికెట్లు తీశాడు. అదే విధంగా.. టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 172 పరుగులు సాధించాడు.వన్డేల్లో అత్యుత్తమంగామరోవైపు.. షాహిద్ ఆఫ్రిది 1996- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఈ బౌలింగ్ ఆల్రౌండర్ తన కెరీర్లో 27 టెస్టుల్లో 48 వికెట్లు, 1716 పరుగులు చేశాడు. 99 టీ20 మ్యాచ్లలో 98 వికెట్లు తీయడంతో పాటు 91 పరుగులు సాధించాడు.అయితే, వన్డేల్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో 398 వన్డేలు ఆడిన షాహిద్ ఆఫ్రిది.. 395 వికెట్లు పడగొట్టడంతో పాటు.. 8064 పరుగులు సాధించాడు.చదవండి: టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికేశాడు..?

ఇంగ్లండ్ ‘టీ20’ జట్టు కెప్టెన్గా జేకబ్ బెతెల్.. ప్రకటన విడుదల
టీమిండియాతో ప్రతిష్టాత్మక ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ తర్వాత ఇంగ్లండ్.. సౌతాఫ్రికా (ENG vs SA)తో పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమైంది. భారత్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో సమం చేసుకున్న ఇంగ్లిష్ జట్టు.. తదుపరి ప్రొటిస్ టీమ్తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.సొంతగడ్డపై జరిగే ఈ వైట్బాల్ సిరీస్లకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తాజాగా వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) సారథ్యంలోని ఈ జట్లలో ఆల్రౌండర్ రెహాన్ చోటు దక్కించుకున్నాడు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.తొలిసారి జాతీయ జట్టులో..మరోవైపు.. పేసర్ సోనీ బేకర్ (Sonny Baker) తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియాతో టెస్టు సిరీస్తో పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా సౌతాఫ్రికాతో సిరీస్లలో పాల్గొననున్నాడు.వీరితో పాటు ల్యూక్ వుడ్, లియామ్ డాసన్ను కూడా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక ప్రొటిస్ జట్టుతో సిరీస్లు ముగిసిన అనంతరం.. ఇంగ్లండ్ ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టుకు యువ సంచలనం జేకబ్ బెతెల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.హ్యారీ బ్రూక్కు విశ్రాంతి.. కెప్టెన్గా జేకబ్రెగ్యులర్ కెప్టెన్ హ్యారీ బ్రూక్కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. సారథ్య బాధ్యతలను జేకబ్కు అప్పగించారు. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీతో పాటు మాథ్యూ పాట్స్కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా ఐర్లాండ్తో సిరీస్ నేపథ్యంలో మార్కస్ ట్రెస్కోతిక్ ఇంగ్లండ్ జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టుహ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్.సౌతాఫ్రికాతో టీ20లకు ఇంగ్లండ్ జట్టుహ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జేకబ్ బెతెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, ల్యూక్ వుడ్.ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ఇంగ్లండ్ జట్టుజేకబ్ బెతెల్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, లియామ్ డాసన్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్.సౌతాఫ్రికాతో ఇంగ్లండ్ వన్డే, టీ20 సిరీస్ల షెడ్యూల్వన్డే సిరీస్👉సెప్టెంబరు 2- తొలి వన్డే (లీడ్స్)👉సెప్టెంబరు 4- రెండో వన్డే (లార్డ్స్, లండన్)👉సెప్టెంబరు 7- మూడో వన్డే (సౌతాంప్టన్)టీ20 సిరీస్👉సెప్టెంబరు 10- తొలి టీ20 (కార్డిఫ్)👉సెప్టెంబరు 12- రెండో టీ20 (మాంచెస్టర్)👉సెప్టెంబరు 14- మూడో టీ20 (నాటింగ్హామ్).చదవండి: టీమిండియాకు మరో సెహ్వాగ్ దొరికేశాడు..?

‘మహిళలు ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలి’
చెన్నై: మహిళల చెస్లో భారత క్రీడాకారిణులు ముందంజ వేయాలంటే ఎక్కువ సంఖ్యలో ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలని సీనియర్ ప్లేయర్, ఉమెన్ గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) తానియా సచ్దేవ్ అభిప్రాయపడింది. మహిళల టోర్నీలకు పూర్తిగా దూరం కావద్దని... అయితే పురుషులతో ఓపెన్ కేటగిరీలో పోటీ పడితే ఆట ఎంతో మెరుగవుతుందని ఆమె వ్యాఖ్యానించింది. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన తానియా... ప్రస్తుతం చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ‘చెస్ కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అమ్మాయిలు సాధ్యమైనన్ని ఎక్కువ ఓపెన్ టోర్నమెంట్లలో ఆడాలి. కేవలం మహిళల టోర్నీలకే పరిమితం కాకుండా పురుషులతో కలిసి శిక్షణ పొందడంతో పాటు వారితో పోటీ పడాలి. అప్పుడే వారి ఆట మరింత పదునెక్కుతుంది’ అని తానియా పేర్కొంది. అయితే పెద్ద స్థాయికి చేరే ముందు మహిళా టోర్నీల్లో విజయాలు సాధించడం కూడా ముఖ్యమని, అవి కెరీర్లో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ప్రేరణను అందిస్తాయని తానియా చెప్పింది. ‘మహిళల విభాగంలో సాధించే విజయాలను కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొత్త తరం అమ్మాయిలు చెస్ను ఎంచుకునేందుకు కావాల్సిన స్ఫూర్తిని ఇస్తాయి. ఓపెన్ టోర్నీల్లో పాల్గొనడం, మహిళల టోర్నీల్లో టైటిల్స్ గెలవడం రెండూ కూడా ముఖ్యమే. ఏదీ తక్కువ కాదు. సరిగ్గా చెప్పాలంటే కెరీర్లో ఎదిగే సమయంలో ఇది మధ్యేమార్గంలాంటిది. అయితే కేవలం మహిళల టోర్నీల్లోనే పాల్గొంటే వారు తమ స్థాయిని తగ్గించుకున్నట్లే. పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని వారు కోల్పోతారు’ అని 38 ఏళ్ల తానియా విశ్లేషించింది. అంతర్జాతీయ స్థాయిలో మన మహిళా చెస్ క్రీడాకారిణుల తాజా ప్రదర్శన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్లపై ఆమె ప్రశంసలు కురిపించింది. ‘మన దేశానికి సంబంధించి ఇప్పుడు చెస్లో స్వర్ణ యుగం నడుస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో మేమేం తక్కువ కాదన్నట్లుగా మహిళలు నిరూపించుకుంటున్నారు. ఒక మెగా టోర్నీ ఫైనల్లో రెండు వేర్వేరు తరాలకు చెందిన భారత ప్లేయర్లు పోటీ పడటం మామూలు విషయం కాదు. చెస్ను చూసి ఈ ఆటను ఎంచుకోవాలనుకునే అమ్మాయిలకు ఇది కావాల్సినంత స్ఫూర్తిని అందిస్తుంది’ అని తానియా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నా తనలో ఇంకా సత్తా ఉందన్న తానియా... ఏడాదికి ఒకటి లేదా రెండు చొప్పున టోర్నీలు ఆడుతూ చెస్ వ్యాఖ్యానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది.

భారత్లో రొనాల్డో ఆట!
చెన్నై: అంతా అనుకున్నట్లు జరిగితే... పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆటను భారత అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. ఆసియా ఫుట్బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) చాంపియన్స్ లీగ్–2లో భాగంగా రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నాసర్ జట్టుతో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తలపడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్లో పాల్గొనేందుకు పోర్చుగల్ స్టార్ భారత్కు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్ నాసర్ క్లబ్తో కాంట్రాక్ట్ ప్రకారం విదేశీ వేదికలపై జరిగే మ్యాచ్ల్లో రొనాల్డో పాల్గొనే అంశంలో కొన్ని సడలింపులు ఉన్నాయి. మరి రొనాల్డో గోవా ఎఫ్సీతో మ్యాచ్ కోసం భారత్కు వస్తాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్2కు సంబంధించిన ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి గోవా ఎఫ్సీతో పాటు మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు పాల్గొననుంది. వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొననుండగా... వాటిని ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లు ఉన్నాయి. గ్రూప్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించనున్నాయి. గత సీజన్లో లీగ్ షీల్డ్ దక్కించుకోవడం ద్వారా మోహన్ బగాన్ జట్టు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించగా... ‘సూపర్ కప్’ గెలవడం ద్వారా గోవా ఎఫ్సీ ముందంజ వేసింది. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్లో గోవా జట్టు పాల్గొనడం ఇది రెండోసారి. 2021లోనూ గోవా జట్టు ఈ టోర్నీలో ఆడింది. సెపె్టంబర్ 16న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్... వచ్చే ఏడాది మే 16న జరగనున్న ఫైనల్తో ముగియనుంది. లీగ్లో భాగంగా... ఇంటాబయట మ్యాచ్లు జరగడం పరిపాటి కావడంతో గోవా ఎఫ్సీతో తలపడేందుకు అల్ నాసర్ తరఫున రొనాల్డో భారత్కు వస్తాడనే వార్తలు వ్యాపించాయి. గ్రూప్ ‘సి’లో ఫూలద్ మొబారకేశ్ సెపాహన్ ఎస్సీ (ఇరాన్), అల్ హుసేన్ (జోర్డాన్), అహల్ ఎఫ్సీ (తుర్క్మెనిస్తాన్)తో కలిసి మోహన్ బగాన్ పోటీ పడనుంది. గ్రూప్ ‘డి’లో గోవా ఎఫ్సీతో పాటు అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా), అల్ జవ్రా ఎస్సీ (ఇరాక్), ఇస్తిక్లోల్ ఎఫ్సీ (తజకిస్తాన్) ఉన్నాయి.
బిజినెస్

ఒకే స్కూల్కు రూ.300 కోట్లు విరాళం ఇచ్చిన సీఈఓలు
విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధి కోసం రూ.వందలు, రూ.వేలు, రూ.లక్షల్లో.. విరాళం ఇవ్వడం సహజంగా చూస్తూంటాం. కానీ తమను అంతటివారిని చేసిన బడి కోసం ఏకంగా రూ.300 కోట్లు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారా.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఛైర్మన్ ప్రేమ్ వత్స. ఇంతకీ వారు విరాళం ఇచ్చిన, వారు చదివిన పాఠశాల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్).హెచ్పీఎస్లోని మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, ఉన్న సదుపాయాలను మరింత విస్తరించడానికి ఈ విరాళం ప్రకటించారు. ఈ సహకారం పూర్వ విద్యార్థుల నేతృత్వంలో భారతదేశంలోని అతిపెద్ద విద్యా విరాళాల్లో ఒకటిగా నిలిచింది. క్రెడాయ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విరాళానికి సంబంధించిన వివరాలు పంచుకుంటూ సదరు సీఈఓలను ప్రశంసించారు. తాము చదువుకున్న నగరానికి, పాఠశాలకు తిరిగి సాయం చేయాలనుకుంటున్నట్లు సీఎం చెప్పారు.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబనఈ నిధులను కొత్త అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి, ఇప్పటికే ఉన్న కొన్ని తరగతి గదులను పునరుద్ధరించడానికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రణాళిక పాఠశాల విస్తృత విజన్ 2050కు అనుగుణంగా ఉందని చెప్పారు. ఈ శతాబ్దం మధ్య కాలం నాటికి హెచ్పీఎస్ను ప్రపంచంలోని టాప్-10 పాఠశాలల్లో ఒకటిగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈమేరకు రెండు సంవత్సరాల క్రితం జరిగిన శతాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రూ.150 కోట్లతో రూపొందించిన విజన్ 2050 బ్లూప్రింట్లో అకడమిక్ అప్గ్రేడ్స్, గ్లోబల్ పార్టనర్షిప్స్, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. 1923లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ను స్థాపించారు.

అడ్డగోలుగా డ్రోన్ల రిజిస్ట్రేషన్..
నిబంధనలను విరుద్ధంగా రిజిస్టర్ అయిన వేలాది డ్రోన్లు, వాటి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డ్రోన్ రిజిస్ట్రేషన్లపై విస్తృత సమీక్ష చేపట్టింది. దిగుమతి నిషేధాలు, తప్పనిసరి నిబంధనలను పాటించకుండా చాలా డ్రోన్లు రిజిస్టర్ అయ్యాయని నివేదికలు వెల్లడైన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రధానంగా చైనా సంస్థలకు చెందిన డ్రోన్లు దేశీయంగా తప్పుడు కారణాలతో నమోదయ్యాయనే వాదనలున్నట్లు తెలిపింది.2021 నుంచి దిగుమతిలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ 8,700కి పైగా చైనా డ్రోన్లు భారతదేశంలో నమోదయ్యాయని జులై 29న ఓ వార్తా సంస్థ కోరిక మేరకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. డ్రోన్ అనుమతులు పొందడానికి తప్పుడు డిక్లరేషన్లను ఉపయోగించే సంస్థలు అధికారిక రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్లైన డిజిటల్ స్కై, ఈ-జీసీఏలను దుర్వినియోగం చేస్తున్నాయని డీజీసీఏ ఇటీవల జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కొంతమంది ఆపరేటర్లు తప్పుడు కేటగిరీల కింద యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను (యూఐఎన్) జనరేట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ప్రక్రియను దాటవేయడంతో తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నట్లు నోటీసు ఎత్తిచూపింది.ముఖ్యంగా చాలా మంది దరఖాస్తుదారులు కఠినమైన కమర్షియల్ నిబంధనలను పాటించకుండా ఉండడానికి తమ డ్రోన్లను ‘మోడల్ ఆర్పీఏఎస్’ సబ్కేటగిరీ కింద తప్పుగా వర్గీకరించారు. ఇవి విద్య, పరిశోధన, పరీక్ష లేదా వినోద ఉపయోగం కోసం ఉద్దేశించినవి. కానీ వాటిని ఇతర అవసరాల కోసం వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది నిబంధనల ఉల్లంఘనేనని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దుర్వినియోగం పౌర విమానయాన వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడమే కాకుండా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబనడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి అవసరమైన దిగుమతి అనుమతులు లేకుండానే పలు డ్రోన్లను విదేశాల్లో తయారు చేసి భారత్లోకి తీసుకువచ్చినట్లు డీజీసీఏ వెల్లడించింది. 2022 డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం రక్షణ, పరిశోధన, అభివృద్ధి, భద్రతకు సంబంధించిన ప్రయోజనాలు మినహా డ్రోన్ల దిగుమతులు నిషిద్ధం. కొనుగోలు ఇన్వాయిస్లు, దిగుమతి అనుమతులు, డ్రోన్ ఛాయాచిత్రాలు వంటి మద్దతు పత్రాలతో పాటు లిఖితపూర్వక వివరణ ఇవ్వడానికి బాధిత డ్రోన్ కంపెనీలకు ఏవియేషన్ రెగ్యులేటర్ సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ను సమర్థించడంలో విఫలమైతే యూఐఎన్లను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. వాటితోపాటు చట్టపరమైన చర్యలు ఉంటాయి.

బీఎండబ్ల్యూ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెంచింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల మోడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీ ఆటుపోట్లు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఒత్తిళ్లు, పెరిగిన రవాణా వ్యయాల కారణంగా ధరలు పెంచాల్సి వచి్చందని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పవాహ్ తెలిపారు. ప్రస్తుత పండుగ సీజన్లో మరిన్ని నూతన మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. ఈ జనవరి 1, ఏప్రిల్ 1 తర్వాత 2025లో కంపెనీ కార్ల ధరలు పెంచడం ఇది మూడోసారి. బీఎండబ్ల్యూ ఇండియా రూ.46.9 లక్షలు మొదలుకొని రూ.2.6 కోట్ల లోపు ధర కలిగిన మోడళ్లు విక్రయిస్తుంది.

గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ అమ్మకాల జోరు..
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో మెరుగ్గా ఉన్నట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ఐక్యూ వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 4.6 శాతం పెరగ్గా.. దీనికి రెట్టింపు స్థాయిలో 8.4 శాతం మేర గ్రామీణ మార్కెట్లలో వృద్ధి నమోదైనట్టు తన తాజా నివేదికలో తెలిపింది. వరుసగా ఆరో త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి (పరిణామం పరంగా) పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం జూన్ క్వార్టర్లో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య వృద్ధి పరమైన అంతరం తగ్గినట్టు వెల్లడించింది. మొత్తం మీద జూన్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ అమ్మకాల్లో (విలువ పరంగా) 13.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. పట్టణాల్లో స్థిరమైన వినియోగానికి తోడు, గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్న వినియోగం ఇందుకు మద్దతుగా నిలిచాయి. అమ్మకాల్లో 6%, ధరల పెంపు రూపంలో 7.4% చొప్పున వృద్ధిని సాధించినట్టు, చిన్న ప్యాకెట్లకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాల్లో అమ్మకాలు పుంజుకుంటున్నట్టు పేర్కొంది.
ఫ్యామిలీ

సెలబ్రిటీల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, రాంచరణ్, ప్రగ్యా, ఇంకా..!
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను భారత దేశం ఘనం నిర్వహించుకుంటోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతీ భారతీయుడు దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండాను ఎగుర వేసి వేడుకలను చేసుకుంటున్నారు. పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు, సెలబ్రిటీలు ఇండిపెండెన్స్ డే వేడుకల వివరాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు, అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. అలాంటివాటిలో కొన్నింటిని చూద్దాం.టాలీవుడ్ హీరో రాంచరణ్ తన కుమార్తె క్లింకారాతో కలిసి వేడుకలను నిర్వహించారు. తిరంగా జెండాకు సెల్యూట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు.. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)నటి ప్రగ్వాజైశ్వాల్ అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా,మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు, అందుకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన లెక్కలేనన్ని ప్రాణాలకు కృతజ్ఞత తెలుపుదాంఅంటూ పోస్ట్ చేసింది. అలాగే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్లో అసమాన ధైర్యాన్ని ప్రదర్శించిన ధైర్యవంతులను గుర్తు చేసుకున్నారు.. మన ప్రశాంత జీవనానికి తోడ్పడుతున్న ప్రతి సైనికుడికి. మన సాయుధ దళాలకు, లక్షలాది మందికి సెల్యూట్ చేసింది. View this post on Instagram A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial) ప్రముఖ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా ఇన్స్టాలో ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో ఒక ఫోటోను షేర్ చేశారు.

విమెన్ వారియర్స్ ఆర్మీ అధికారులతో ఫెమినా ఇండియా వీడియోవైరల్
ఫెమినా ఇండియా ( Femina India )అంటే అందాల పోటీలు మాత్రమే కాదు. అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత క్లిష్టమైన సమయాల్లో దేశానికి సేవచేసే ధీర వనితలను గౌరవించుకోవడం కూడా. ఫెమినా ఇండియా ఆగస్టు 2025 కవర్ పది మంది భారత ఆర్మీ మహిళా అధికారులతో రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. “ప్రతి వందనం వెనుక ఒక ప్రయాణం ఉంటుంది. దేశంలోని వివిధ మూలల నుండి విభిన్నమైన, అద్భుతమైన కథలు. వారి గ్లామర్ కోసం కాదు అత్యంత ధైర్యసాహసాలకోసం..అంటూ సాగే ఈవీడియోను విశేషంగా నిలుస్తోంది.వారియర్ ఉమెన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ శీర్షికతో 1997-బ్యాచ్ IRAS అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేసిన శక్తివంతమైన వీడియోను ఫెమినా ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కేవలం ఫ్యాషన్ షూట్ కాదు-యూనిఫాంలో అధికారులుగా దేశాన్ని రక్షించే మహిళలకు ఒక బోల్డ్ సెల్యూట్. ఇండియన్ ఆర్మీలో మహిళల ఇమేజ్ను ముఖ్యంగా, పది మంది విశిష్ట మహిళా అధికారులకు గొప్ప గౌరవ సూచకంగా దీన్ని రూపొందించింది. ఈ శక్తివంతమైన వీడియోలో, మ్యాగజైన్ కవర్ షూట్ దేశంలోని మహిళా యోధులకు సెల్యూట్ చేసింది. కల్నల్ల నుండి లాన్స్ నాయక్ వరకు పది మంది భారతీయ ఆర్మీ అధికారులు తమ ఆలివ్-గ్రీన్ యూనిఫామ్లలో సగర్వంగా ఇందులో కనిపిస్తారు. ప్రతీ ఫ్రేమ్లో వారి ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్నో అడ్డంకులను ఛేదించి, ఈ స్థాయికి చేరి దేశానికి గౌరవంగా సేవ చేస్తూ అచంచలమైన దేశభక్తి నిదర్శనంగా ఉన్నారు. అంతేకాదు ఎంతోమంది మహిళలకు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రేరణనిచ్చేట్టుగా, దేశ సేవ ద్వారా తమ ధైర్యాన్ని పట్టుదలను నూరిపోసేట్టుగా ఉందీ వీడియో. View this post on Instagram A post shared by Femina (@feminaindia) ఈ వీడియోలో కల్నల్ సోఫియా ఖురేషి, కల్నల్ మేఘనా డేవ్, కల్నల్ పోనుంగ్ డోమింగ్, SM, కల్నల్ అన్షు జామ్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ కృతికా పాటిల్, మేజర్ ద్విపన్నిత కలిత, కెప్టెన్ ఓజస్విత శ్రీ, కెప్టెన్ శ్రద్ధా శివదావ్కర్, లాన్స్ నాయక్ ఆషిక, లాన్స్ నాయక్ మంజును చూడవచ్చు.కల్నల్ సోఫియా ఖురేషి: సోఫియా ఖురేషి భారత సైన్యంలో సీనియర్ అధికారి ఆపరేషన్ సిందూర్ సమయంలో అధికారిక ప్రెస్ బ్రీఫింగ్కు నాయకత్వం వహించి వార్తల్లోనిలిచిన ధీర.మేజర్ డాక్టర్ దీపన్విత (ద్విపన్నిత) కలిత: అస్సాం మొట్టమొదటి మహిళా పారాట్రూపర్, ఆగ్రాలో శిక్షణ పొంది 2023లో ధేకియాజులి నుండి ఫెమినా ఇండియా కవర్ వరకు ఆమె ప్రయాణం ప్రేరణ యొక్క స్మారక చిహ్నంగా మారింది. ల్నల్ పోనుంగ్ డోమింగ్: అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన మొదటి మహిళా కల్నల్.

"నిశ్శబ్ద సంక్షోభం"గా ఊబకాయం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు. అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు. వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు. జీవనశైలిపై దృష్టి సారించాలి..ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.ఎందకు ఈ హెచ్చరికలు అంటే..ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..టైప్ 2 డయాబెటిస్రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులురొమ్ము, పెద్దప్రేగు కేన్సర్తో సహా కొన్ని రకాల కేన్సర్లుకీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు. ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..)

షేరెంటింగ్ ముప్పు...పేరెంట్స్ పారాహుషార్
సోషల్ మీడియా రాక ముందు, పిల్లల గారాలు ఇంటి గడప దాటేవి కావు. మహా అయితే స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి, బంధువులకు.. పిల్లల ఘనకార్యాల గురించి చెప్పుకొని మురిసిపోయేవారు తల్లిదండ్రులు. పుట్టినరోజు వేడుకల వంటివి చేసినప్పుడు ఆ ఫొటోలు ఉన్న ఆల్బమ్ను ఇంటికి వచ్చిన వారికి చూపించేవారు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ మురిపాలు ఖండాలు దాటుతున్నాయి! పిల్లల ఫొటోలను ఆన్లైన్లో పంచుకోవాలనే సంతోషం సహజమే అయినప్పటికీ, అందువల్ల రాబోయే ప్రమాదాల గురించి కూడా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి విస్తృతి కలిగిన సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక.. పిల్లలకు సంబంధించిన ప్రతి సంతోషాన్ని తల్లిదండ్రులు ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే అలా షేర్ చేయటం ఆ చిన్నారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఆన్లైన్లో కొన్ని సంఘటనలు జరిగే వరకు తల్లిదండ్రులు గ్రహించ లేకపోతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్ఫింగ్తో మహా ప్రమాదంపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటా న్ని ‘షేరెంటింగ్’ అంటున్నారు. దీనివల్ల పిల్లల గురించిన పూర్తి సమాచారం ఇంటర్నెట్లోకి వెళ్లిపోతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఫొటోలపై ఎమోజీలు పెట్టి.. ముఖం కనిపించలేదు, ఇక సేఫ్ అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరోటి లేదు. ఇది ఏఐ యుగం అని మరిచిపోతే ఎలా? వారి ఫొటోలను మార్ఫింగ్ చేసేవాళ్లు, వారి వివ రాలను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్లు ఉంటారు. పిల్లలపై ఆన్లైన్ వేధింపులూ జరగొచ్చు. తమకసలు సంబంధమే లేకుండా పిల్లలు నలుగురు నోళ్లలోనూ నానుతారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రుల అత్యుత్సాహమే.అన్నీ చెప్పేసుకుంటే ముప్పుపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతేనని సోషల్ మీడియా ధోరణుల అధ్యయన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. పిల్లల వివరాలన్నీ బయటికి వెళ్లిపోతే, ఏ వైపు నుంచైనా హాని, లేదా నష్టం సంభవించవచ్చని చెబుతున్నారు.దొంగచేతికి తాళం ఇచ్చినట్లే!పిల్లల ఫొటోలు.. ముఖ్యంగా వారి పేర్లు, పుట్టిన తేదీలు లేదా వారి లొకేషన్ను బహిర్గతం చేసే వివరాలతో ఉన్న పోస్టులను సైబర్ నేరస్థులు ఊహించని విధంగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు షేర్ చేసిన పోస్టుల ఆధారంగా దొంగిలించిన సమాచారాన్ని తప్పుడు బ్యాంకు ఖాతాలను తెరవడానికి, అప్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, లేదా ఈ పిల్లల్ని వేరే పిల్లలుగా నమ్మించి ఎవరినైనా మోసం చేయటానికి వాడుకో వచ్చు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి.పేరెంట్స్.. పారాహుషార్కడుపున పుట్టిన పిల్లలే అయినా వారి సమ్మతి లేకుండా వారి ఫొటోలను, వీడియోలను తల్లిదండ్రులు షేర్ చేయటానికి లేదు. ఒకవేళ పిల్లలు తెలియక సమ్మతించినా పెద్దలు ఆలోచించాలి. పిల్లల గోప్యతకు గౌరవం ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక, తమ తల్లిదండ్రులు షేర్ చేసిన తమ చిన్ననాటి ఫొటోల గురించి తెలిసి ఇబ్బంది పడవచ్చు. బాల్యంలోని ఫొటోలను స్నేహితులు చూసి.. లావుగా ఉన్నారనో, నల్లగా ఉన్నారనో వ్యాఖ్యలు చేయవచ్చు. అవి వారిని చాలా బాధిస్తాయి. ఎప్పటివో ఫొటోలు సోషల్ మీడియా సముద్రంలో పడి.. ఇప్పుడు సమస్యల సుడిగుండాలు సృష్టిస్తాయి.భవిష్యత్తుపై ప్రభావం : కాలేజ్ అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తుల సమయంలో వారి భవిష్యత్ అవకాశాలను ఏ రూపంలోనైనా అవి ప్రభావితం చేయవచ్చు. మామూలు ఫొటోకు కథనం అల్లి, ఇంటర్నెట్లో తిప్పేవారు ఉంటారు. చదువు, ఉద్యోగాలలోనే కాదు, పెళ్లి సంబంధాల విషయంలోనూ అవాంతరాలు రావచ్చు. (Independence day ఫ్యాషన్ క్లిక్.. మువ్వన్నెల వస్త్రాలు)వేటాడే కళ్లకు చిక్కినట్లే! పిల్లలు స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు, బట్టలు మార్చుకుంటున్నప్పటి ఫొటోలు కూడా కొన్ని సార్లు షేర్ అవుతుంటాయి. సైబర్ క్రిమినల్స్లోని వేటగాళ్ల కంట్లో ఆ ఫొ టోలు పడితే.. ఇక వాటిని వాళ్లు అసభ్య కరమైన వెబ్సైట్లకు షేర్ చేసే ప్రమాదం ఉంటుంది.ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో పిల్లల ఫొటోలను చూడలేని విధంగా మా ర్చి, నకిలీ ప్రొఫై ల్ను సృష్టించి అన్లైన్లో మోసపూరి తమైన లావా దేవీలను కొన సాగించే వారికి కూడా కొదవ లేదు. వేధింపులు – బెదిరింపులు!ఆన్ లైన్లో : షేర్ చేసిన ఫొటోలను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్ప లేం. మార్ఫింగ్ చేయవచ్చు. మరెవరికైనా షేర్ చేయవచ్చు. ఏడిపించటానికి, బెదిరించ టానికి, వేధించటానికి ఆ వివరాలు తోడ్పడ వచ్చు.అమాయకంగా కనిపించే పిల్లల ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు చేసేవా రుంటారు. కొందరు మీమ్స్ కూడా సృష్టించి వైరల్ చేస్తుంటారు. ఆ సంగతి అటు తిరిగి ఇటు తిరిగి ఈ పిల్లల్ని చేరిందంటే.. వారు ఆ దారుణాలను తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడి, లోలోపలే మానసిక వ్యథను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు తెలిసినా వారిదీ ఇదే పరిస్థితి. పోస్ట్లోని వివరాలను బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని బ్లాక్మెయిల్ చేసేవారూ ఉంటారు. ఇదీ చదవండి: జన్మాంతర సాఫల్యం అంటే ఎంటో తెలుసా?
ఫొటోలు
అంతర్జాతీయం

చర్చలు విఫలమైతే మరిన్ని టారిఫ్లు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య అలస్కాలో శుక్రవారం జరిగే చర్చలు విఫలమైతే భారత్పై అదనపు టారిఫ్లు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ తేల్చిచెప్పారు. ట్రంప్, పుతిన్ చర్చల ద్వారా ఫలితంపైనే టారిఫ్లపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే భారత్పై సుంకాల మోత తప్పదని వెల్లడించారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు ఇండియాపై సెకండరీ టారిఫ్లు విధిస్తామన్నారు. అప్పటికీ రష్యా దారికి రాకపోతే సెకెంటరీ టారిఫ్లు మరింత పెరుగు తాయని స్పష్టంచేశారు. భారత్ గనుక ముడి చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగు తుందని అమెరికా అంచనా వేస్తోంది. భారత్ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే.

పాక్లో కొత్తగా ఆర్మీ రాకెట్ ఫోర్స్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ వేళ భారత క్షిపణుల ధాటికి పూర్తిగా చేతులెత్తేసిన పాకిస్తాన్కు నెమ్మదిగా తత్వం బోధపడింది. దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసుకోవాలని ఎట్టకేలకు నిర్ణయించుకుంది. అందులోభాగంగా నూతనంగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ పేరిట నూతన విభాగాన్ని ఏర్పాటుచేసుకుంటోంది. పాక్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సంప్రదాయక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేస్తున్న ట్లు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, త్రివిధ దళాధిపతుల సమక్షంలో షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భూతలం నుంచి ప్రయోగించే అణు, అణ్వస్త్రయేతర బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణులతో ఈ కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ను తీర్చిది ద్దనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్తో భారత్ తన క్షిపణుల సత్తాను పాక్కు రుచి చూపించాక ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం మేల్కొంది. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ బడ్జెట్ను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్

అదే జరిగితే భారత్కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్పై సెకండరీ టారిఫ్లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్పై అగ్రరాజ్యం టారిఫ్లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్న్యూస్తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి.
జాతీయం

కన్నుల పండువగా...
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన స్వాతంత్య్ర సమరయోధుల కలలు సాకారం చేయడానికి, ‘అభివృద్ధి చెందిన భారత్’నిర్మాణానికి పౌరులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. → ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరు కావడానికంటే ముందు ప్రధాని మోదీ తొలుత రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాం«దీకి ఘనంగా నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఎర్రకోటకు బయలుదేరి వెళ్లారు. → పంద్రాగస్టు వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. మోదీ ఈసారి కాషాయ రంగు తలపాగా ధరించారు. తెల్లరంగు కుర్తా, కాషాయ రంగు బంద్గలా జాకెట్ ధరించి, జాతీయ జెండా ఎగురవేశారు. ఆయన గత 12 ఏళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవాల్లో దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేర్వేరు రంగులు తలపాగాలు ధరిస్తున్నారు. → స్వాతంత్య్ర దినోత్సవాల ప్రసంగాల విషయంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును మోదీ తిరగరాశారు. మోదీ వరుసగా 12 ఏళ్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఈ విషయంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాతి స్థానం మోదీదే కావడం విశేషం. నెహ్రూ ఎర్రకోట నుంచి వరుసగా 17 సార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి హోదాలో మొత్తం 16 సార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించగా, ఇందులో వరుసగా ప్రతిఏటా చేసిన ప్రసంగాలు 11 మాత్రమే. → ఈసారి వేడుకలకు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ప్రజలకు విశిష్టమైన సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలు, సర్పంచ్లు, లఖ్పదీ దీదీలతోపాటు వినూత్న సాగు పద్ధతులతో గుర్తింపు పొందిన రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విజేతలుగా నిలిచివారికి కూడా ఆహా్వనం పలికింది. త్వరలో స్పెషల్ ఒలింపిక్స్లో పాల్గొన్నబోతున్న భారత క్రీడాకారులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సేవలందించిన వాలంటీర్లు, పారిశుధ్య కారి్మకులు సైతం హాజరయ్యారు. → వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1,500 మంది తమ సంప్రదాయ వ్రస్తాలు ధరించి రావడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. → ప్రధానమంత్రి ప్రసంగం ఏకంగా 103 నిమిషాల పాటు సాగింది. → మోదీ తన ప్రసంగంలో పలు కవితలను ప్రస్తావించారు. ‘సమృద్ధ భారత్’కోసం కృషి చేయాలని పిలుపునిస్తూ కష్టపడి పనిచేసేవారే చరిత్ర సృష్టిస్తారని కవిత రూపంలో చెప్పారు. ఉక్కు లాంటి రాళ్లను ముక్కలు చేసే సత్తా కలిగినవారికి కాలం కూడా సహకరిస్తుందని అన్నారు. కాలాన్ని మనకు అనువుగా మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని ఉద్ఘాటించారు. → రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఈసారి ఎర్రకోట వద్ద వేడుకులకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంది
న్యూఢిల్లీ: వెలుగులోకి వస్తున్న ఎన్నికల అక్రమాలను చూస్తే అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని అర్థమవుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జెండా ఎగురవేసిన అనంతరం నాయకులు, శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. జోరున వర్షం కురుస్తుండగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేతలు జెండా వందనం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..బిహార్లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) పేరుతో బతికున్న వారిని సైతం చనిపోయినట్లుగా ధ్రువీకరించడం ద్వారా ప్రతిపక్షాలకు పడే ఓట్లను తొలగించారని ఆరోపించారు. తొలగింపునకు గురైన 65 లక్షల ఓట్లకు సంబంధించి బీజేపీ ఒక్క అభ్యంతరం కూడా వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎస్ఐఆర్తో లాభం కలిగేది బీజేపీకి మాత్రమేనని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి అక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఏ ప్రాతిపదికన ఓట్లను రద్దు చేసిందో తెలిపేందుకు ఈసీ సైతం సిద్ధంగా లేదని ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ఆ పార్టీ ఎంత అనైతికతకయినా సిద్ధమవుతోందని దీంతో స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందే తప్ప, ఎన్నికల్లో విజయం కోసం కాదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు విభాగాలైన ఈడీ, సీబీఐలతోపాటు ఆదాయపన్ను శాఖను సైతం బీజేపీ సర్కార్ బాహాటంగా దుర్వినియోగం చేస్తోన్న విషయాన్ని ప్రత్యక్షంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన అన్నారు. అలీన విధానం ద్వారా కూడగట్టుకున్న ప్రతిçష్టను బీజేపీ సర్కార్ హయాంలో మన దేశం కోల్పోవాల్సి వచ్చిందని ఖర్గే విమర్శించారు.వర్షంలో తడుస్తూ రాహుల్ జెండా వందనంఇందిరా భవన్ ప్రాంగణంలో పార్టీ చీఫ్ ఖర్గే జెండా ఎగురవేస్తుండగా ఆయన పక్కనే అగ్రనేత రాహుల్ గాంధీ వర్షంలో మిగతా వారితో కలిసి తడుస్తూనే నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో షేర్ చేసింది. ‘ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. వీటి పరిరక్షణ కోసం ఇకపైనా పోరాడుతాం’అని ఆ పార్టీ పేర్కొంది. లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

గ్రేడ్ పేరెంట్స్ కాదు.. గ్రేట్ పేరెంట్స్!
పిల్లలు చక్కగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుని, పెద్ద ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం! నిజమే కానీ, కొన్నిసార్లు రేయింబవళ్లు కష్టపడి చదివినా కూడా పిల్లలు మంచి మార్కులు సాధించలేరు. అప్పుడు చూడాలి తల్లిదండ్రుల బాధ! ఆ బాధలో పిల్లల్ని కోప్పడతారు, అరుస్తారు. మాట్లాడ్డం మానేస్తారు. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడతారు. ఆ మాటకు పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించరు. కానీ ఇప్పుడీ పరిస్థితి క్రమంగా మారుతోంది! -సాక్షి, స్పెషల్ డెస్క్మార్కులు తగ్గినందుకో, పరీక్ష తప్పినందుకో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోవటం అన్నది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అయితే ఇప్పుడిప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల తరఫున ఆలోచిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలు విస్తృతంగా షేర్ చేస్తున్న తమ అనుభవాలను బట్టి తెలుస్తోంది. కర్ణాటకలోని ఒక కుటుంబం.. బోర్డు పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన తమ కుమారుడుని ప్రోత్సహించడానికి నలుగుర్నీ పిలిచి ‘కేక్ కటింగ్’ చేశారు. కొడుకుని అక్కున చేర్చుకున్నారు. ‘ఈసారి వస్తాయిలే..!’తక్కువ మార్కులు వచ్చినందుకు అమ్మానాన్న తమని కొట్టకుండా, తిట్టకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారో వెల్లడిస్తూ పిల్లలు సోషల్ మీడియాలో షేర్ చేసే కథనాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఎన్ని మార్కులు వచ్చాయో తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు.. పిల్లల కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. ‘ఈసారి మంచి మార్కులు వస్తాయిలే’ అని తల నిమురుతున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు అప్పటికీ అదేపనిగా బాధపడుతుంటే వారి ధ్యాసను మళ్లించటానికి బయటికి తీసుకెళుతున్నారు. ఇది మంచి పరిణామంబోర్డు పరీక్ష ఫలితాల సమయంలో తమ తల్లిదండ్రులు తమకు ఎంతలా మద్దతు ఇచ్చారో చెబుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న అనుభవాలు బాగా వైరల్ అవుతున్నాయి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు వహించవలసిన పాత్ర ఏమిటన్న దాని గురించి సంభాషణలు కూడా మొదలయ్యాయి. అవి మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆ సంభాషణల్లో సైకాలజిస్టులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. ‘ఇది చాలా మంచి పరిణామం’ అంటున్నారు మనో వైజ్ఞానిక నిపుణులు.‘కేక్, పిజ్జా తెప్పించారు’ఇటీవల, పరీక్షల్లో 83 శాతం మార్కులు స్కోర్ చేసిన సీబీఎస్సీ 10వ తరగతి విద్యార్థిని సోషల్ మీడియాలో తన పేరెంట్స్ గురించి ఇలా షేర్ చేసుకుంది. ‘‘ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగుండేదని.. మా అమ్మ మొదట నిరాశపడింది. ఆ వెంటనే, బాగా స్కోర్ చేశావ్ అని సంతోషపడింది. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని, ‘మార్కులకు, నిజ జీవితానికి సంబంధం ఉండదు. తక్కువ స్కోర్ చేసిన వారు కూడా గొప్ప జీవితాలను గడపొచ్చు’’ అని చెప్పారు. ఆ రోజు అమ్మానాన్న కేక్, నాకెంతో ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేశారు. నాకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ వారు నన్ను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను..’’ అని రాసింది. ‘ఇలాంటి చర్యలు పిల్లల్లో కాన్ఫిడెన్స్ను పెంచుతాయి’ అని ఆమె పోస్ట్ కింద ఒక సైకాలజిస్టు కామెంట్ పెట్టారు. ‘ముందే చెప్పేశా..’మరొక విద్యార్థిని, తక్కువ మార్కులు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తనను ఎలా ఓదార్చారో గుర్తుచేసుకుంది. ‘‘కోప్పడితే పడనివ్వమని నా పేరెంట్స్కి మొదటే చెప్పేశాను. క్వొశ్చన్ పేపర్స్ అన్నీ కష్టంగా వచ్చాయి, సరిగా రాయలేదు, ఫెయిల్ అవుతాను అని చెప్పాను. ఆ క్షణం నుంచి, ఫలితాలు వచ్చే వరకు వాళ్లు అనుక్షణం నన్ను గమనిస్తూనే ఉన్నారు. ‘పోతే పోయిందిలే’ అని ధైర్యం చెబుతూ వచ్చారు. మొత్తానికి 62 శాతంతో పాసయ్యాను. అప్పుడు నాన్న నిరాశగా చూస్తూ అన్న మాట నాకు భలే నవ్వు తెప్పించింది. ‘అదేంట్రా ఫెయిల్ అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇలా చేసేవేంటి!’ అన్నారు. అమ్మ కూడా నవ్వి నన్ను దగ్గరకు తీసుకుంది’ అని ఆ అమ్మాయి షేర్ చేసింది. ‘ఆంటీ, అంకుల్ సూపర్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ మీద కామెంట్లు!వెల్డన్ పేరెంట్స్» తల్లిదండ్రులలోని ఈ సానుకూల వైఖరిని విద్యావేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వాళ్లు ఇంకా ఏమంటున్నారంటే..» పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నా, తెచ్చుకోలేకపోయినా వారు తమ శక్తి మేరకు కష్టపడ్డారని తల్లి దండ్రులు గుర్తించటం, వారిలో నిరుత్సాహం తలెత్తకుండా దగ్గరకు తీసుకోవటం మంచి విషయం.» పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఒకసారి విఫలమైపోతే జీవితం అక్కడితో ఆగిపోదు. మార్చి పోతే సెప్టెంబర్ ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ రాయొచ్చు.. ఉత్తీర్ణులు కావచ్చు. కానీ, జీవితం పోతే.. మళ్లీ రాదు.» పిల్లల్లో ఆత్మవిశ్వాసం పోతే మళ్లీ అంకురించడం అంత సులభం కాదు. తల్లిదండ్రులు పిల్లలను తిట్టేశాక.. గాయపడిన లేత మనసు కోలుకోవడం చిటికెలో జరిగిపోదు. అది ఈ తరం తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు.» తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు విద్యార్థులే. వాళ్లూ.. ఈ మార్కులు తక్కువ రావడాలు, ఫెయిలవడాలు.. అన్నీ చూసే ఉంటారు. కానీ, వాళ్లు చదివేటప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పిల్లలకు తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, అంతంత డబ్బు వాళ్ల కోసం ఖర్చు చేస్తున్నా వారు రాణించకపోవడాన్ని చాలామంది తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మారాలి.» కొంతమంది మాత్రం.. ఫెయిల్యూర్ జీవితాలను ఎలా మార్చిందో ప్రముఖుల జీవితాలను ఉదాహరణలుగా తమ పిల్లలకు చెబుతున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా కాపాడుకుంటున్నారు.» తిట్టినంత మాత్రాన మార్కులు పెరగవు, ఫెయిలైనవారు పాసైపోరు అని తెలుసుకుంటున్నారు.» ఇతరులతో పోల్చినంత మాత్రాన.. ఉన్నపళంగా తమ బిడ్డలో మార్పు వచ్చేయదు. పిల్లలను మనమే నలుగురిలో చులకన చేస్తే వారు రేపు తలెత్తుకుని ఎలా తిరగగలరు అని ఆలోచిస్తున్నారు.

Independence Day 2025: దుస్సాహసానికి దిగారో ఖబడ్దార్!
ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా. ..: మోదీ :..న్యూఢిల్లీ: దాయాది గుండెలదిరేలా ప్రధాని నరేంద్ర మోదీ సింహనాదం చేశారు. పహల్గాం పాశవికత్వం వెనక పాక్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ పలుగు రాళ్లతో నలుగు పెట్టారు. ‘‘పహల్గాం ఉగ్రోన్మాదానికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన ‘సిందూర’ గర్జన తాలూకు భయంతో శత్రు దేశం నేటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. మన దళాలు పాక్ భూభాగంలో వందలాది కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర, సైనిక లక్ష్యాలను తుత్తునియలు చేశాయి. ఆ విధ్వంసానికి సంబంధించి నేటికీ రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగితే దాయాదికి జన్మలో మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం నేర్పి తీరతామంటూ ప్రతినబూనారు. అణు బెదిరింపులకు జడిసే రోజులు గతించాయంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి మతిలేని ఉన్మాదానికి దిగితే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘‘60 ఏళ్లుగా భారత రైతుల పొట్ట కొడుతూ పాక్ పొలాలను తడుపుతున్న ఏకపక్ష సింధూ నదీ జల ఒప్పందం శాశ్వతంగా కాలగర్భంలో కలిసినట్టే. నీరూ నెత్తురూ కలిసి పారడం జరగని పని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘భరత జాతి దశాబ్దాలుగా పదేపసదే ఉగ్ర భూతానికి బలవుతూ వస్తోంది. దాయాది దన్నుతో జాతి గుండెను ఉగ్ర పోట్లు పదేపదే చీలుస్తూ వచ్చాయి. అది ఇకపై సాగదు. ఉగ్రవాదానికి మహారాజ పోషకులుగా మారి దానికి జవసత్వాలు అందజేస్తున్న దేశాలు, శక్తులను కూడా ఇకపై విడిగా చూడబోం. వారినీ ఆ ముష్కరులతో సమానంగా శిక్షించి తీరతాం. ఇదే మా నయా మంత్రం’’ అంటూ పాక్కు పెను హెచ్చరికలు చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ మానవాళికి సమాన శత్రువులే’’ అని స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది 98 నిమిషాలు ప్రసంగించిన స్వీయ రికార్డును అధిగమించారు. అంతేగాక ఎర్రకోట నుంచి వరుసగా 12 వసారి పంద్రాగస్టు ప్రసంగం చేయడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డు (11)ను అధిగమించారు. వరుసగా 17సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భరత తాలూకు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో పదేపదే నొక్కిచెప్పారు. సెమీ కండక్టర్లు మొదలుకుని కీలక ఖనిజాలు, అణు ఇంధనం దాకా అన్నింట్లోనూ స్వయంసమృద్ధి సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తన వికసిత్ భారత్ కలలను సవివరంగా దేశ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నాయంటూ తూర్పారబట్టారు. అర్థం లేని డిమాండ్లతో పార్లమెంటును నిత్యం స్తంభింపజేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కీలక పథకాల అమలులో ఇప్పటికైనా కేంద్రంతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.బలగాలు సత్తా చాటాయి ‘‘రాజస్తాన్ ఎడారులు మొదలుకుని హిమ శిఖరాలు, సముద్ర తీరం, అత్యంత జనసమ్మర్ధ ప్రాంతాల దాకా ఇంటింటా నేడు త్రివర్ణ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కానీ గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్ర ముష్కరులు పిరికిదెబ్బ తీశారు. పిల్లల కళ్లముందు తండ్రులను పొట్టన పెట్టుకున్నారు. భార్యల సిందూరాన్ని కర్కశంగా తుడిపేశారు. ఆ దారుణాన్ని తలచుకుని జాతి యావత్తూ క్రోధావేశాలతో ఆక్రోశించింది. అందుకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సత్తా చాటాయి’’ అన్నారు.శ్రీకృష్ణుడే స్ఫూర్తిగా మిషన్ సుదర్శన చక్ర దేశ భద్రతకు ఛత్రం పదేళ్లలో అందుబాటులోకి దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరుతో 2035 నాటికి అత్యంత శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిద్వారా దేశ భద్రతా ఛత్రాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేసి ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘శనివారం శ్రీకృష్ణుని జన్మదినం. కచి్చతత్వంతో పని పూర్తి చేయడం, ఆ వెంటనే కృష్ణున్ని చేరుకోవడం సుదర్శన చక్రం ప్రత్యేకత. దాని స్ఫూర్తితో రూపొందే పూర్తి దేశీయ భద్రతా వ్యవస్థ కూడా అలాగే అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది’’ అన్నారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటివాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పని చేస్తుందన్నది నిపుణుల అంచనా.‘సింధూ’ ఇక భారత సొత్తే! ‘‘మన నేలపై పుట్టి పారే నదులు శత్రు దేశపు పొలాలను తడుపుతున్నాయి. మన రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. సింధూ ఒప్పందం 70 ఏళ్లుగా వారికి చేసిన నష్టం మాటలకందనిది. అది ఎంతటి ఏకపక్ష ఒప్పందమో ఇప్పుడు దేశవాసులందరికీ తెలిసొచ్చింది. దీన్నిక సహించేది లేదు. ఆ ఒప్పందానికి నూకలు చెల్లినట్టే. సింధూ జలాలన్నీ ఇక పూర్తిగా మన రైతులవే. టారిఫ్లతో మన రైతులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా’’.అక్రమ వలసలు... అతి పెద్ద కుట్ర! హై పవర్ మిషన్తో అడ్డుకట్ట అక్రమ వలసలు దేశానికి తలనొప్పిగా మారాయని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇది పక్కా పథకం ప్రకారం కొందరు పన్నిన కుట్ర. ఉద్దేశపూర్వకంగా చొరబాట్లను ప్రోత్సహిస్తూ పెను సంక్షోభానికి బీజం వేస్తున్నారు. దేశంలో జనాభా సమతౌల్యాన్నే దెబ్బతీయజూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇది జాతీయ భద్రత పాలిట పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. మన ఐక్యతకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. సామాజిక ఉద్రిక్తతల బీజాలు నాటుతోంది. చొరబాటుదార్లు అమాయక గిరిపుత్రులను మోగిస్తున్నారు. వారి అటవీ భూములను కాజేస్తున్నారు. ఈ ఘోరాలను ఇకపై సహించే ప్రసక్తే లేదు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రాఫిక్ మిషన్కు రూపకల్పన చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నారీ శక్తికి సలాం ‘‘స్త్రీ శక్తి ప్రతి రంగంలోనూ సత్తా చాటుతోంది. స్టార్టప్లు, క్రీడలు, సైన్యం మొదలుకుని అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) నుంచి తాజాగా తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న చరిత్రాత్మక క్షణాలను తలచుకుని జాతి యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది. లక్పతీ దీదీ పథకంతో కోట్లాది మంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు’’.స్వదేశీ సత్తా చాటుదాం-ఆ కలను నిజం చేయండి యువతకు మోదీ సవాలు వందేళ్ల పై చిలుకు దాస్యం మనలను నిరుపేదలుగా, పరాధీనులుగా మార్చిందని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ ఏ జాతి ఆత్మ గౌరవానికైనా ఆత్మ నిర్భరతే అతి పెద్ద తార్కాణమని నొక్కిచెప్పారు. స్వయం సమృద్ధ భారతే వికసిత భారత్కు పునాది అని స్పష్టం చేశారు. ‘‘ఇది ఎగుమతులు, దిగుమతులు, కరెన్సీలకే పరిమితం కారాదు. మేడిన్ ఇండియా ఆయుధాల తాలూకు గొప్పదనాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతటికీ ఘనంగా చాటాం. శత్రు లక్ష్యాలను రెప్పపాటులో తుత్తునియలు చేశాం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఇది సాధ్యపడేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. ‘స్వదేశీ వస్తువులే అమ్ముతాం’ అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలని, వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘దేశీయ జెట్ ఇంజన్లు, యుద్ధవిమానాలు మొదలుకుని సోషల్ మీడియా వేదికల దాకా తిరుగులేని రీతిలో డిజైన్ చేయాలి. మన యువతకు, ఇన్నొవేటర్లకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు, ప్రొఫెషనల్స్కు ఇదే నా సవాలు’’ అని పేర్కొన్నారు. తద్వారా దేశాన్ని బలోపతంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ‘‘అంతరిక్ష రంగంలోనూ ఆత్మ నిర్భరత అత్యవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా రికార్డు నెలకొల్పిన వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాన్షు శుక్లాను చూసి జాతి యావత్తూ పొంగిపోతోంది. తొలి దేశీయ మానవసహిత అంతరిక్ష గగన్యాన్కు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. అంతేకాదు, సొంత అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించుకోనున్నాం’’ అని చెప్పారు. అతి పెద్ద సేవాసంస్థ ఆరెస్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆవిర్భావానికి వందేళ్లవుతున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలిపా రు. దాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివరి్ణంచారు. ‘‘దేశానికే గర్వకారణమైన ప్రస్థానం ఆరెస్సెస్ది. అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కోట్లాది మంది ప్రజలు, సాధుసంతులు, సైంటిస్టులు, టీచర్లు, రైతులు, సైనికులు, శ్రామికులు, వ్యక్తులు, సంస్థల మొక్కవోని ప్రయత్నాల ఫలస్వరూపంగా ఆరెస్సెస్ ఎదిగింది. వ్యక్తి, జాతి నిర్మాణానికి, దేశ సంక్షేమానికి వందేళ్లుగా వారంతా తిరుగులేని త్యాగాలు చేస్తూ వస్తున్నారు. ఆ స్వయం సేవకులదరినీ ఎర్రకోట వేదికగా సగౌరవంగా గుర్తుచేసుకుంటున్నా’’ అన్నారు.తగ్గనున్న జీఎస్టీ శ్లాబులు-దివాలీ డబుల్ బొనాంజా ‘‘త్వరలో భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తేనున్నాం. జీఎస్టీ శ్లాబులను బాగా తగ్గించనున్నాం. తద్వారా పౌరులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ దీపావళికి వారికిది కేంద్రం తరఫున డబుల్ బొనాంజా. వార్షిక వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టాలను కూడా సరళీకరించాం’’. యువత కోసం... రూ.లక్ష కోట్లు ‘‘దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన్మంత్రీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. దీనికింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతీ యువకులందరికీ రూ.15 వేలు అందజేయనున్నాం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ప్రోత్సహకాలు అందుతా యి. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం’’. కీలక ఖనిజాలపై దృష్టి ‘‘ఇది టెక్నాలజీ ఆధారిత శతాబ్ది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలే అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గత ప్రభుత్వాలను విమర్శించడం నా లక్ష్యం కాదు. కానీ మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన ఫైళ్లు కదలడం 60 ఏళ్ల కిందే మొదలైంది. కానీ ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే! అలా మనం అతి విలువైన 50 ఏళ్లను కోల్పోతే మిగతా దేశాలు ఆ రంగంలో దూసుకెళ్లాయి. మేం అధికారంలోకి వచ్చాక సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నాం. ఇక కీలక ఖనిజాల అవసరాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకం. పరిశ్రమలు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కీలక ఖనిజాలే ప్రాణావసరంగా మారిన పరిస్థితి! ఈ అవసరాలను పూర్తిస్థాయిలో దేశీయంగానే తీర్చుకునేందుకు నేషనల్ క్రిటికల్ మిషన్కు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా ఏకంగా 1,200 చోట్ల కీలక ఖనిజాల అన్వేషణకు తెర తీశాం’’.పదింతలకు ‘అణు’ పాటవం ‘‘దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లను శరవేగంగా నిర్మిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. దేశ అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి పదింతలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు’’.
ఎన్ఆర్ఐ

వామ్మో.. మామూలు ఖర్చు కాదు!
తిరిగే కాలు, తిట్టే నోరు ఉరికే ఉండవని సామెత. కొంతమంది తెగ తిరుగుతుంటారు. నిరంతరం ప్రయాణిస్తుంటారు. కొత్త ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్నత చదువులు, ఉద్యోగాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు.15 లక్షల కోట్లు!ప్రపంచ యాత్రలు చేసేవాడు ప్రజ్ఞావంతుడౌతాడని పెద్దలు చెబుతుంటారు. దీన్నే ఫాలో అవుతున్నారు మనవాళ్లు. విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు భారీగానే ఖర్చుపెడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2009-10లో విదేశీ ప్రయాణాలకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) వెచ్చించారు. ఈ వ్యయం 2024-25 నాటికి దాదాపు వెయ్యి రెట్లు (975%) శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ లెక్కన చూసుకుంటే సగటు వార్షిక వృద్ధి రేటు 58.2 శాతంగా ఉంది.జర్నీలకే ఎక్కువ!గతంలో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రయాణాల కోసం కూడా అధికంగా వెచ్చిస్తున్నారు. ఈక్విటీ నుంచి రియల్ ఎస్టేట్ (Real Estate) వరకు ప్రతిదానికీ డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయితే విదేశీ ప్రయాణాలకు కూడా ఎక్కువ మొత్తంలో వ్యయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే విదేశాల్లో చదువు కంటే కూడా జర్నీలు చేయడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయం గత 15 ఏళ్లలో 1000 రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం.ఎక్కడికి వెళ్తున్నారు?తుర్కియే, ఫ్రాన్స్, మారిషస్, అమెరికా, బ్రెజిల్, చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను భారతీయులు చుట్టి వస్తున్నారు. 2009 సంవత్సరంలో 1.1 కోట్ల మంది ఇండియన్స్ విదేశాలు వెళ్లారు. కోవిడ్-19 (Covid-19) మహమ్మారికి ముందు ఈ సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. కరోనా సమయంలో ఈ సంఖ్య బాగా తగ్గింది. కానీ, కరోనా ముగిసిన తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో, 2022లో విదేశాలకు ప్రయాణించిన (travel abroad) భారతీయుల సంఖ్య మళ్లీ 2 కోట్లు దాటింది.చదువుకెంత ఖర్చు?భారతీయులు మెరుగైన జీవితాన్ని గడపడానికి విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని టీఓఐ నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య, మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. ఉపాధికి భరోసాయిచ్చే నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం 2024-25లో మనవాళ్లు చేసిన వ్యయం 9.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 2009-10లో ఈ వ్యయం 549 మిలియన్ డాలర్లు. ఏడాదికి 21 శాతం పెరుగుదల నమోదయింది. చదవండి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా?

ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్లో అమానుష ఘటన
విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నదే. తాజాగా ఐర్లాండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాత్యాంహకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఐర్లాండ్ వాటర్ఫోర్డ్ నగరంలో ఆగస్టు 4వ తేదీన దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యంహకార దాడి జరిగింది. భారత్కు తిరిగి వెళ్లిపో అంటూ తోటి పిల్లల్లో కొందరు ఆమెపై ఈ దాడికి తెగబడడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచినట్లు తల్లి మీడియాకు వివరించారు.సోమవారం సాయంత్రం కిల్బర్రీ ప్రాంతంలోని తన నివాసం బయట నియా నవీన్(6) తోటి పిల్లలలో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో 12-14 ఏళ్ల వయసున్న పిల్లలు కొందరు బాలిక వద్దకు వచ్చారు. అప్పటిదాకా అక్కడే ఉన్న బాలిక తల్లి.. మరో బిడ్డకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆ బ్యాచ్ సదరు బాలికపై దాడికి తెగబడింది. ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. సైకిల్తో ప్రైవేట్ భాగాలను గాయపరిచింది.బాలిక కేకలు విని బయటకు పరిగెత్తుకొచ్చింది ఆ తల్లి. ఆ సమయంలో వాళ్లంతా పారిపోగా.. నడవలేని స్థితిలో బాలిక భయంతో వణికిపోతూ కనిపించింది. డర్టీ ఇండియన్.. గో బ్యాక్ టూ ఇండియా అంటూ వాళ్లు అసభ్య పదజాలం ప్రయోగిస్తూ ఆ బాలికను వారించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.తాను ఎనిమిదేళ్లుగా ఇక్కడ నర్సుగా పని చేస్తున్నానని, ఈ మధ్యే ఐర్లాండ్ పౌరసత్వం దక్కిందని బాలిక తల్లి అనుపా అచ్యుతన్ ‘ఐరీష్ మిర్రర్’ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘మేం అధికారికంగానే ఇక్కడ వచ్చి ఉంటున్నాం.. మంచి వృత్తుల్లో స్థిరపడ్డాం. కానీ, ఇక్కడ భారతీయులెవరికీ భద్రత లేకుండా పోయింది. చివరికి ఇంట్లోనూ భయంతోనే గడపాల్సి వస్తోంది. నా బిడ్డను నేను దాడి నుంచి రక్షించుకోలేకపోయా. ఆమె ఇక నుంచి మునుపటిలా సరదాగా ఆడుకోలేదని నేను భావిస్తున్నా’’ అని జరిగిన ఘటన గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలిక తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పిల్లలపై కఠిన చర్యలు తీసుకోకుండా.. విషబీజాలను వాళ్ల మనసుల్లోంచి తొలగించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆమె కోరుకుంటోంది.ఐర్లాండ్లో భారతీయులపై జాత్యాంహకార దాడులు పెరిగిపోయాయి. గత జులై నుంచి ఇప్పటిదాకా ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. కిందటి నెలలోనూ ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. రాజధాని నగరం డబ్లిన్లోని టల్లాట్లో 40 ఏళ్ల వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి హింసించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను భారత రాయబారి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక కౌన్సిలర్ బాధితుడిని పరామర్శించి, బాసటగా నిలిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రెండు నెలల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఐర్లాండ్లోని భారతీయ రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యి.. హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది.Credits: irishmirror

భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?
ఈ ప్రశ్న వేసింది వాన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ ఖేటర్పాల్. తనను బాధ పెట్టిన సంఘటన గురించి తలుచుకుంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. కని, పెంచి ప్రయోజకులను చేసిన పేరెంట్స్ను చివరి రోజుల్లో ఒంటరిగా వదిలేస్తున్న వారు ఎందరో. కనీసం కన్నవారి చివరిచూపునకు కూడా నోచుకోకుండా కన్నుమూస్తున్న తల్లిదండ్రులు కోకోల్లలు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఖేటర్పాల్ ఎక్స్లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడొకరు.. తండ్రి చివరి రోజుల్లో వ్యవహరించిన తీరును తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.'15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న స్నేహితుడొకరు ఇటీవల తన తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో అతడి తండ్రి (84) జైపూర్లో ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల ముందు తెల్లవారుజామున 3 గంటలకు నాకొక ఫోన్ కాల్ (Phone Call) వచ్చింది. తన తండ్రి ఆరోగ్యం బాలేదని, వెళ్లి చూడమని అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్లో చెప్పాడు. కొంతమంది స్నేహితులతో కలిసి నేను వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. గుండెపోటు, అవయవాలు పనిచేయకుండా పోవడంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. సరైన సమయంతో మంచి వైద్యం అందిచడంతో ఆయన కోలుకుకున్నారు. బంధువులు ఆయన చూడటానికి వచ్చారు. కానీ ఎవరూ ఎటువంటి బిల్లులు చెల్లించలేదు సరికదా, ఆయన బాధ్యత భుజానికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇక పెద్దాయన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంటే కొడుకు మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం అమెరికాలోనే ఉన్నాడు. తండ్రిని చూడటానికి రాలేదు. గత వారమే పెద్దాయన ప్రాణాలు వదిలారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన కొడుకు మళ్లీ 3 రోజులకే తిరుగు పయనమయ్యాడు.నన్ను కదిలించినది ఏమిటంటే..అంతిమ గడియల్లో ఉన్న తండ్రి కంటే అమెరికా కలే అతడికి ముఖ్యమైంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడి భార్య, పిల్లలు రాలేదు. వాళ్లు అమెరికాలోనే ఉండిపోయారు. "ఆమెకు ఉద్యోగం ఉంది, పిల్లలకు చదువు ఉంది" అని అతడు అన్నాడు - నమ్మశక్యం కాదు!నేను, నా స్నేహితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి, ఖర్చులు చూసుకుంటూ, వంతులవారీగా ఆస్పత్రికి వెళుతూ అతడి తండ్రిని చివరి శ్వాస వరకు వెన్నంటే ఉన్నాం. కానీ నగరంలోని అతడి బంధువులెవరూ మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఎటువంటి సహాయం చేయలేదు.తండ్రి చనిపోయిన మూడో రోజునే నా స్నేహితుడు స్వదేశం విడిచి వెళ్లాడు. తండ్రి అస్థికలను నిమజ్జనం కూడా చేయకుండానే అతడు అమెరికా వెళ్లిపోయాడు.భారతీయ కుటుంబ విలువలు, మన ఆచారాలు, బంధాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా.. బలంగా ఉన్నాయని ఇప్పటివరకు నేను నమ్మాను. కానీ ఈ సంఘటన నన్ను పూర్తిగా కదిలించింది! భారతీయ సమాజం ఎటు పయనిస్తోంది, మన కుటుంబ విలువలు ఎక్కడ కనుమరుగవుతున్నాయ'ని గౌరవ్ ఖేటర్పాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విదేశాల్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తువారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మాత్రం విచ్ఛిన్నమవుతున్న భారతీయ కుటుంబ విలువల గురించే ఆందోళన చెందారు.స్నేహితుడిని బద్నాం చేస్తారా?మరికొందరైతే గౌరవ్పై విరుచుకుపడ్డారు. ట్వీట్ కోసం స్నేహితుడిని బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. 'కేవలం 3 రోజుల కోసమే అమెరికా (America) నుంచి ఎవరూ ఇండియాకు రారు. ప్రయాణానికే ఒక రోజు పడుతుంది. జెట్ లాగ్ ఎలాగూ ఉంటుంది. అతడి తండ్రికి అప్పటికే 84 ఏళ్లు, తన కొడుకుతో ఉండటానికి నిరాకరించి ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం, చలి వాతావరణం కారణంగా అమెరికాలో వృద్ధులు నివసించడం కష్టం. అతడు తన తండ్రిని చూసుకోవడానికి సహాయకులను నియమించుకునే ఏర్పాటు చేసి ఉండాలి. మీరు ఎటువంటి రుజువు ఇవ్వకుండానే ఇక్కడ మీ స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించారని కూడా మీరు పేర్కొన్నారు. మీరు నిజం చెబుతుంటే, ఆసుపత్రి పత్రాలు, బిల్లులతో పాటు వృద్ధుడు, అతడి కొడుకు వివరాలను వెల్లడించండి' అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. దీనిపై ఖేటర్పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మీ స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద.. 3 రోజుల కోసం ఎవరూ అమెరికా నుంచి భారతదేశానికి రారు అనే వాస్తవాన్ని మీరు ఇప్పుడే గమనించారు. మీ IQ వేరే స్థాయిలో ఉందంటూ' సమాధానమిచ్చారు.చదవండి: టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్యలో గతంలో చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరుగుతుండడంతో.. తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఎడబాటు తప్పడం లేదని మరో నెటిజన్ (Netizen) అభిప్రాయపడ్డారు. అఖరి గడియాల్లో పిల్లల కోసం వేచిచూసి తనువు చాలిస్తున్న పేరెంట్స్ సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. చాలా మంది పిల్లలకు.. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత, ఆస్తులన్నీ అమ్మేసి ముందుకు సాగడమే ఏకైక లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దాదాపు 2 లక్షల మంది భారతీయులు (Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు ఇటీవల వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.ఎవరీ గౌరవ్ ఖేటర్పాల్?రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు గౌరవ్ ఖేటర్పాల్ (Gaurav Kheterpal). గూగుల్ డెవలపర్ ఏఐ ఎక్స్పర్ట్ అయిన గౌరవ్కు ఐటీ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మల్టీ-క్లౌడ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్గానూ ఆయన పేరు గాంచారు. చాలా దేశాల్లో ఐటీపై ప్రసంగాలు ఇచ్చారు. గ్లోబల్ మొబైల్ డెవలపర్ చాలెంజ్, యాప్స్ హకథాన్ వంటి పలు రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు. Is the Indian family system dead?A friend (let's call him 'X') recently lost his father. He's been living in the US for the last 15 years while his father lived alone in Jaipur - his mother passed away 3 years back. Few days earlier, I received a frantic call from him at 3 AM…— Gaurav Kheterpal (@gauravkheterpal) August 3, 2025

దుబాయ్కి డ్రైవర్లు కావలెను.. జీతం ఎంతంటే?
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవ్ను నిర్వహిస్తోంది. దుబాయ్కి చెందిన త్రీస్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్పోర్టు, దుబాయ్పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10, 30వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో గణేష్కుమార్ తెలిపారు.కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో దుబాయ్ (Dubai) నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (Drivers) అత్యధికంగా ఉన్నారని, వారిని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. 24 నుంచి 48 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని, నెలకు రూ.35,000 నుంచి రూ.94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్ఎస్డీసీ తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆగస్టు 10న స్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్పోర్టు ఉద్యోగాలకు ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. లేదా skillinternational@apssdc.in ఈమెయిల్, 91–99888533 35, 8712655686, 8790118349, 8790117279 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరింది.చదవండి: స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు
క్రైమ్

మరో అక్రమ ‘సృష్టి’
కుత్బుల్లాపూర్: నగరంలో సంచలనం సృష్టించిన ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ సరోగసీ కేసు విషయం మరవకముందే మేడ్చల్ జిల్లాలో మరో అక్రమ సరోగసీ సెంటర్ బండారం బయట పడింది. శుక్రవారం మేడ్చల్ జిల్లా ఎస్ఓటీ పోలీసులు, జిల్లా వైద్యశాఖ అధికారుల సహాయంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రింగ్రోడ్డు సమీపంలోని సెంటర్పై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి మరో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులిద్దరూ తల్లీ కొడుకులే కావడం గమనార్హం. పేట్బషిరాబాద్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి, మేడ్చల్ డీఎంహెచ్ఓ ఉమాగౌరితో కలిసి వివరాలు వెల్లడించారు. ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన నారెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి తన కుమారుడు నరేందర్రెడ్డితో కలిసి కుత్బుల్లాపూర్, చింతల్లో ఉంటోంది. గతంలో లక్ష్మి అండం దాతగా, సరోగసీ తల్లిగా వ్యవహరించింది. దీంతో ఆమెకు పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. క్లినిక్ నిర్వాహకులతో పరిచయాలు పెంచుకుని సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అండం దానం, సరోగసీ తల్లిగా వ్యవహరించే వారిని గుర్తించి తానే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. దీంతో బీటెక్ పూర్తి చేసిన తన కొడుకు నరేందర్రెడ్డితో కలిసి వ్యూహ రచన చేసింది. సెంటర్పై దాడి.. విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ఓటీ, పేట్బషిరాబాద్ పోలీసులు వైద్యశాఖ అధికారుల సహాయంతో సెంటర్పై దాడి చేశారు. లక్ష్మి, నరేందర్రెడ్డిలను అరెస్ట్ చేసి అద్దె గర్భ మహిళలు కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన గోల్కొండ సాయిలీల, ఏపీలోని రంపచోడవరం ప్రాంతానికి చెందిన మల్లగల్ల వెంకటలలక్ష్మి, సాదల సత్యవతి, విజయనగరం నివాసులు పంటడ అపర్ణ, రమణమ్మ, అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన పి.సునీతలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.6.47 లక్షల నగదు, ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మిపై 2024లో ఇదే తరహాలో ముంబైలో కేసు నమోదైంది. విచారణ కొనసాగుతోందని, ఇందులో ప్రమేయమున్న ప్రైవేటు ఆస్పత్రులు, ఫెర్టిలిటీ క్లినిక్లను గుర్తించి వాటిపై పట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మేడ్చల్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ ఎ.విశ్వప్రసాద్, ఏసీపీ బాలగంగి రెడ్డి, ఎస్ఓటీ, పేట్బషిరాబాద్ పోలీసులు పాల్గొన్నారు.నిరుపేద మహిళలే లక్ష్యంగా.. లక్ష్మి పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్లతో బేరం కుదుర్చుకుని భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న, నిరుపేద మహిళలే లక్ష్యంగా మచి్చక చేసుకుటుంది. ఆపై వారికి డబ్బు ఆశ చూపించి అండం దానం, సరోగసీ తల్లిగా వ్యవహరించేలా ఒప్పందం చేసుకుంటుంది. ఈ క్రమంలో వారిని తన ఇంట్లోనే పెట్టుకుంది.

గుండెపోటుతో హెచ్ఎం మృతి
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని గోపీనగర్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.స్వప్న (45) గుండెపోటుతో గురువారం మృతి చెందారు. పని ఒత్తిడితోనే ఆమె చనిపోయారని సహోద్యోగులు చర్చించుకుంటున్నారు. బుధవారం విధులకు హాజరైన ఆమెకు అదే రోజు రాత్రి తీవ్ర గుండె నొప్పి రావడంతో రాజాంలో ఉన్న తన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. స్వప్నకు భర్త నాగరాజు, కుమార్తె హనీ ఉన్నారు. భర్త నాగరాజు శ్రీకాకుళం ఎస్బీఐ ఏడీబీలో మేనేజర్గా విధులు నిర్వహిస్తుండగా కుమార్తె ఇంటర్ చదువుతోంది. ఉపాధ్యాయురాలు 2023లో ఆమదాలవలస మండలానికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఒకరు వెళ్లిపోగా ఈమె ఒక్కరే పాఠశాలలో ఉన్నారు. పని ఒత్తిడి, యాప్లలో నిత్యం అప్లోడ్ చేయాల్సిన అంశాలు తదితర విషయాల్లో ఆమె ఒత్తిడికి గురైనట్లు తోటి ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.

ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్స్టేషన్లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.పక్కా పథకం ప్రకారం..మౌనిక, ఉదయ్కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్కుమార్ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బాటిల్ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్లను అభినందించి, రివార్డులను అందజేశారు.

ఉప్పల్లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై హత్యాచారం
హైదరాబాద్: అభమూ శుభమూ తెలియని ఐదేళ్ల బాలుడిపై ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం హత్య చేసిన దారుణ ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్లో నివసించే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న తన కుమారుడు (5) కనిపించడం లేదంటూ ఉప్పల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. అదే టింబర్ డిపోలో పని చేసే కమర్ అనే వ్యక్తి 12వ తేదీన బాలుడికి మాయమాటలు చెప్పి కేసీఆర్ నగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలుడు స్పృహ తప్పిపోగా.. గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. బిహార్కు చెందిన కమర్.. బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు చెప్పారు.