ప్రధాన వార్తలు

తిరుమల తొక్కిసలాట ఘటన.. అసలు దోషులెక్కడా చంద్రబాబు
సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారుఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సమాన బాధ్యత ఇచ్చారులా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్ఎస్డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉంది: సీడీఎస్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనేది ఇంకా ఆన్లోనే ఉందని సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్కు హాజరైన అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్ సిందూర్ను భారత్ చేపట్టింది.మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఈఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. భారత్ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్.. భారత్ ఆర్మీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్.

ద్రవిడ్, కల్లిస్ను దాటేసిన రూట్.. మిగిలింది పాంటింగ్, సచిన్ మాత్రమే..!
ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్, జాక్ కల్లిస్ను అధిగమించాడు. మాంచెస్టర్ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లోఈ ఫీట్ను నమోదు చేశాడు. మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ద్రవిడ్ను.. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కల్లిస్ను అధిగమించాడు.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రూట్ ముందుంది రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే. భారత్తో జరుగుతున్న ఇదే సిరీస్లో రూట్ రికీ పాంటింగ్ను కూడా అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్తో పాటు ఐదో టెస్ట్లో మరో 89 పరుగులు చేస్తే పాంటింగ్ను అధిగమిస్తాడు. అప్పుడు రూట్ ముందు సచిన్ మాత్రమే ఉంటాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టడం రూట్కు అంత ఈజీ కాదు. రూట్ తన కెరీర్లో మరో 2500 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీట్ అసాధ్యమైతే కాదు. రూట్ ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే మరో 25 టెస్ట్ల్లో సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలవడం ఖాయం.టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..సచిన్ టెండూల్కర్- 15921రికీ పాంటింగ్- 13378జో రూట్- 13290*జాక్ కల్లిస్- 13289రాహుల్ ద్రవిడ్- 13288మ్యాచ్ విషయానికొస్తే.. 225/2 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్లో ఆచితూచి ఆడుతుంది. భారత బౌలర్లు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తుండటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నారు. పోప్ 32, రూట్ 31 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 261/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. క్రాలే వికెట్ జడేజాకు.. డకెట్ వికెట్ అన్షుల్ కంబోజ్కు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

ఉల్లూ, ఏఎల్టీటీ సహా 25 యాప్లపై బ్యాన్
అశ్లీల కంటెంట్ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతర కంటెంట్ను ప్రొత్సహిస్తున్న ఉల్లూ, ఏఎల్టీటీ సహా 25 వీడియో యాప్లు, వెబ్సైట్ల మీద నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.పోర్నోగ్రఫిక్ సహా అభ్యంతకర కంటెంట్ను ప్రదర్శిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఆయా యాప్ల, వెబ్సైట్ల లింకులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది.భారత్లో పోర్న్సైట్లపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్ల మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. అయితే.. కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్లు అధికారికంగానే పోర్న్, సాఫ్ట్ పోర్న్ను ప్రొత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో ఉల్లూ, ఏల్టీటీ(ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ టెలిఫిలింస్కు చెందిన యాప్, అశ్లీలంతో పాటు సాదారణ సినిమాలూ అందిస్తోంది) తదితరాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్లాట్ఫారమ్లు డబ్బులు తీసుకుని ఇంతకాలం యూజర్లకు అశ్లీల కంటెంట్ విచ్చలవిడిగా అందిస్తూ వచ్చాయి.అయితే రాను రాను.. ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఏకంగా పోర్న్ కంటెంట్ ఇదే తరహా యాప్ల ద్వారా ప్రమోట్ అయ్యింది. ఇది హద్దులు దాటి ‘ఎక్స్’(ట్విటర్) లాంటి పాపులర్ ఓపెన్ మాధ్యమానికి కూడా చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో కేంద్రం నిషేధం విధించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.తాజా నిషేధిత జాబితాలో.. ఉల్లూ, ఏఎల్టీటీ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లెక్స్, బూమెక్స్, నవరసా లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ప్రైమ్, ఫెనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ వీఐపీ, హల్చల్ యాప్, మూడ్ఎక్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, ఫూగీ, మోజ్ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ తదితరాలు ఉన్నాయి.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 67, 67 ఏ.. లాగే భారత న్యాయ సంహిత సెక్షన్ 294, మహిళలను అభ్యంతరకరంగా చూపించడం(The Indecent Representation of Women (Prohibition) Act, 1986 సెక్షన్ 4).. ఉల్లంఘనల కింద ఈ యాప్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఎవరీ లండన్ చాయ్వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్వాలా. అది కుడా లండన్లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. "చెకర్స్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్వాలాకు మరో చాయ్వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్వాలాకు మరో చాయ్వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్.

'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కొన్నాళ్ల క్రితం మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు దశావతారాలపై ఏడాదికో యానిమేటెడ్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి సినిమా 'మహావతార్: నరసింహ' నేడు(జులై 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యూనిమేటెడ్ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'మహావతార్: నరసింహ' కథేంటంటే..పురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి కథ గురించి తెలిసిందే. విష్ణువు మూర్తి నరసింహ అవతారం(సగం మనిషి, సగం సింహం) ఎత్తి, భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. ఇదే కథను యానిమేషన్లో చూస్తే.. అదే మహావతార్: నరసింహ సినిమా.విశ్లేషణభక్త ప్రహ్లాద కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద' బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ప్రహ్లాద కథ దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి తెలిసింది. ఇలాంటి కథలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా'మహావతార్: నరసింహ'. కథనం మొత్తం యానిమేషన్తో నడుస్తుంది. విజువల్ వండర్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పుట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. మహా విష్ణువుపై ద్వేషం పెంచుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు..తమకున్న శక్తులతో దేవతలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూదేవికి అపహరించి సముద్ర గర్భంలో బంధిస్తాడు. దీంతో విష్ణు మూర్తి వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు సంహరించి భూదేవిని తీసుకొస్తాడు. సోదరుడి మరణంతో విష్ణుపై హిరణ్యకశిపుడు మరింత పగను పెంచుకుంటాడు. తీవ్రమైన తప్పస్సు చేసి బ్రహ్మాదేవుడి నుంచి తనకు భూమి, అకాశం పైన,దేవతలతో గాని, పశువులతోగానీ, పగలు గానీ రాత్రి గానీ మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ శక్తులతో ఇంద్రలోకాన్ని సైతం తన ఆధీనంలోకి తెచ్చకుంటాడు. అతని కొడుకే ప్రహ్లాదుడు. పుట్టుకతోనే విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడు. తండ్రికేమో విష్ణువు అంటే పడదు.. కొడుకుకేమో విష్ణుమూర్తే సర్వస్వం అన్నట్లుగా బతుకుతాడు. ఎంత నచ్చజెప్పిన విష్ణుమూర్తి పేరు తలచకుండా ఉండడు. చివరకు కొడుకునే సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నరసింహా అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయి. దాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ చక్కగా వాడుకున్నాడు. భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్తో అద్భుతంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్లో నరసింహ స్వామి ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోతుంది.హిరణ్యకశిపుడితో నరసింహాస్వామి చేసే యాక్షన్ తెరపై చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. యానిమేటెడ్ సినిమా అయినా సరే కొన్ని యాక్షన్ సీన్లకు థియేటర్స్లో విజిల్స్ పడతాయి. యానిమేషన్ పర్ఫెక్ట్గా కుదిరింది. తెరపై చూస్తుంటే కమర్షియల్ సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. సామ్ సీ.ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎం అదిరిపోయింది. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

థాయ్-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ
థాయ్లాండ్, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది.భారత పౌరులు థాయ్లోని ఏడు ప్రావిన్స్ల వైపు ప్రయాణం చేయొద్దని శుక్రవారం థాయ్లాండ్లోని భారత రాయబార కార్యాలయం సూచింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని అందులో స్పష్టం చేసింది. ట్రాట్, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కవావో, ఛంథాబురి, ఉవోన్ రట్చథాని..ప్రావిన్స్లు ఈ జాబితాలో ఉన్నాయి.In view of the situation near Thailand-Cambodia border, all Indian travelers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom.As per Tourism Authority of Thailand places mentioned in the following link are not recommended for… https://t.co/ToeHLSQUYi— India in Thailand (@IndiainThailand) July 25, 2025ఇదిలా ఉంటే.. మరోవైపు థాయ్లాండ్ తాత్కాలిక ప్రధాని పుమ్తోమ్ వెచయాచై కూడా ఆయా ప్రావిన్స్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా థాయ్లాండ్ – కాంబోడియా మధ్య నడుస్తున్న వివాదం.. తాజాగా తీవ్రరూపం దాల్చింది.Ta Muen, Ta Moan Thom దేవాలయాలు తమవంటే తమవని ఇరు దేశాలు కొన్ని దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. థాయ్లాండ్ నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్ ప్రధాని షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో రాయబారం చేయబోయారు. ఆ సమయంలో ‘అంకుల్’ అని సంబోధిస్తూ మాట్లాడిన ఫోన్కాల్ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్ సైన్యం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశంపై అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం విచారణకు ఆదేశించడంతో పాటు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న పుమ్తోమ్ వెచయాచై థాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.జూలై 23, 2025న ల్యాండ్మైన్ పేలడంతో థాయ్లాండ్కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ప్రతిగా.. థాయ్లాండ్ F-16 యుద్ధ విమానాలతో కాంబోడియా లక్ష్యాలపై బాంబుల దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల రాయబారులను ఉపసంహరించుకున్నారు.గురువారం నాటి ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన 14 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంక్షోభంతో సరిహద్దులో ఉంటున్న వేలమంది తమ తమ దేశాలకు పారిపోయారు. శుక్రవారం సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. థాయ్లాండ్ కంబోడియన్ సరిహద్దులో వైమానిక దాడులు చేస్తోంది.

ప్రభుత్వ అధికారుల అక్రమాల పుట్టపగులుతోంది.. తవ్వే కొద్దీ డబ్బే డబ్బు
భువనేశ్వర్: అవినీతికి పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల్ని విజిలెన్స్ అధికారులు ఆట కట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ అధికారికి 116 ఫ్లాట్లు గుర్తించగా.. మరో అధికారి ఇంట్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, గోల్డ్ కాయిన్లు, ఇతర బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారుల ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆరో ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నాయక్ నివాసంలో ఆదాయానికి మించిన రూ.1.44 కోట్ల క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు.తనిఖీల్లో జయపూర్లోని ఆయన ఫ్లాట్లో రహస్య గదిలో దాచిన రూ. 1.44 కోట్ల నగదు, 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణేలు (ప్రతి నాణెం 10 గ్రాములు),6 ప్రాంతాల్లోని జయపూర్, భువనేశ్వర్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, తొమ్మిదిమంది ఏఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించి నగదు లెక్కింపు కొనసాగుతోంది.ఈ దాడికి ముందు మరో అటవీ శాఖ అధికారి నివాసాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు అధికారికి 119కి పైగా ప్లాట్లు ఉన్నట్లు తేలింది.

సౌమ్య కేసు: దుస్తులే తాడుగా.. జైలు గోడ దూకి పరార్.. కేరళలో హైఅలర్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌమ్య(23) హత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న గోవిందచామీ అలియాస్ ఛార్లీ థామస్ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్ శాఖ కేరళవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి అప్రమత్తమైంది. అయితే గంటల వ్యవధిలో.. ఓ స్థానికుడి సహాయంతో పోలీసులు ఆ మానవ మృగాన్ని పట్టుకోగలిగారు.2011లో సౌమ్య అనే యువతిని రైలు నుంచి బయటకు నెట్టేసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు చార్లీ థామస్. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ నాలుగు రోజులకే కన్నుమూసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసులో ఘటన జరిగిన మరుసటిరోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కన్నూరు జైలులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న చార్లీ.. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పరారయ్యాడు. తాను ఉంటున్న సెల్ ఊచలను తొలగించి బయటకు వచ్చిన చార్లీ.. ఆపై తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్ ఫెన్సింగ్ను దాటేసి మరీ పరారయ్యాడు. గోడ దూకాక.. రోడ్డు మీద తాపీగా నడుచుకుంటున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీంతో పోలీసు శాఖ స్టేట్ వైడ్ అలర్ట్ ప్రకటించింది. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు.. ఇలా అన్నిచోట్ల చార్లీ ఫొటోలతో గాలింపు ముమ్మరం చేసింది. చార్లీని గుర్తిస్తే 9446899506 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరింది.ఈలోపు.. కన్నూరు తలప్పు ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో చార్లీని చూసినట్లు స్థానికుడు ఒకరు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. అక్కడ బావిలో దాక్కుని కనిపించాడు. దీంతో తాడు సాయంతో అతన్ని బయటకు తీశారు. ఉదయం. 11గం. ప్రాంతంలో చార్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తరలించారు. 2011, ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరణూర్ వెళ్తున్న రైలులో సౌమ్య(23) ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామీ.. ఆమెను రైలు నుంచి తోసి, ట్రాక్ పక్కన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. అటుపై ఆమె ఫోన్తో ఉడాయించాడు. ఆ ఫోన్ ఆధారంగానే పోలీసులు ఆ మరుసటిరోజే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇటు త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది.ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది నవంబర్ 11న ఫాస్ట్ట్రాక్ కోర్టు గోవిందచామీకి మరణశిక్ష విధించింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో చార్లీ నవ్వుతూ కనిపించాడు. పైగా శిక్ష ప్రకటించే సమయంలోనూ అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. అయితే.. 2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా, 2014లో సుప్రీం కోర్టు సైతం స్టే ఇచ్చింది. 2016లో గోవిందచామీపై మర్డర్ అభియోగాన్ని తొలగించి.. కేవలం రేప్కేసు కింద జీవిత ఖైదును సుప్రీం కోర్టు విధించింది. అంత కట్టుదిట్టమైన భద్రత నుంచి ఎలా?కన్నూరు సెంట్రల్ జైలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుందని, అలాంటి జైలు నుంచి చార్లీ తప్పించుకోవడం ఏంటి? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఎవరో అతనికి సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చార్లీ కరడుగట్టిన నేరస్తుడు. అర్ధరాత్రి 1గం. సమయంలో తప్పించుకున్నాడు. అధికారులేమో ఉదయం 5గం. గుర్తించారు. ఏడుగంటలకు పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా అతను తప్పించుకునే టైంలోనే జైల్లో కరెంట్ పోయింది. ఇది పక్కా స్కెచ్తోనే జరిగి ఉంటుంది’’ అనే అనుమానాలు వ్యక్తం చేశారాయన. అయితే కేరళ పోలీస్ శాఖ మాత్రం అతని కోసం వేట కొనసాగుతోందని తెలిపింది. ఈలోపు అతను దొరకడం విశేషం.

ఇండియన్స్ను వద్దంటే యూఎస్కే నష్టం
భారత్ వంటి దేశాలతో సహా విదేశాల్లో నియామకాలను నిలిపివేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేశం పంపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణాలు లేకపోలేదు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ అక్కడి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోపాటు ఇంకా కొన్ని కారణాలున్నాయి. అయితే దీని అమలు చేస్తే యూఎస్ సాంకేతిక అభివృద్ధి మందగిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.జాతీయవాదం, అమెరికా ఫస్ట్ ఎజెండా2025 జులై 23-24 తేదీల్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ రాడికల్ గ్లోబలిజం నుంచి టెక్ కంపెనీలు బయటకు రావాలని నొక్కి చెప్పారు. టెక్ కంపెనీలు యూఎస్ నుంచి ప్రయోజనం పొందుతున్నాయని చెబుతూ, చైనా, భారత్ వంటి దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఎత్తిచూపారు. అమెరికాలో ఉపాధిని పెంచేందుకు స్థానిక టెక్నాలజీ కంపెనీలు ముందుకు రావాలన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీఇదే సదస్సులో కృత్రిమ మేధకు సంబంధించి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో కృత్రిమ మేధ అభివృద్ధిని పెంచడానికి, దేశ పురోగతి అడ్డంకులను తగ్గించడానికి ‘విన్నింగ్ ది రేస్’ పేరుతో జాతీయ వ్యూహాన్ని తెలియజేశారు. ఈ ప్రణాళికలో డేటాసెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా, కృత్రిమ మేధకు అవసరమైన మౌలిక సదుపాయాలను కంపెనీలు సులభంగా నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాను కృత్రిమ మేధలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. ఏఐని అభివృద్ధి చేయడానికి ఫెడరల్ ఫండింగ్ పొందే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఉత్తర్వుపై సంతకం చేశారు. అందులో భాగంగా కంపెనీలు రాజకీయంగా తటస్థంగా ఉండే ఏఐ టూల్స్ను తయారు చేయాల్సి ఉంటుంది.హెచ్-1బీ వర్క్ వీసాలపై ఆందోళనట్రంప్ గత హయాంలో జారీ చేసిన బై అమెరికన్, హైర్ అమెరికన్ కార్యనిర్వాహక ఉత్తర్వులను పునసమీక్షించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా టెక్ సంస్థల్లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా విధానాలపై ఇది ఒత్తిడి తెస్తుంది. ఈ వీసా అమెరికా కంపెనీలు స్థానిక సిబ్బంది కంటే విదేశీ ప్రతిభావంతులపై ఎక్కువగా ఆధారపడటానికి ప్రోత్సహిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.ఇప్పటికే హెచ్చరికలు..గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. భారత్లో నియామకాలు ఆపేయాలనే ట్రంప్ హెచ్చరిక కంపెనీల దీర్ఘకాలిక కార్యకలాపాలకు సవాలుగా మారుతుంది. ఇప్పటికే యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్ ఉద్యోగులను తిరిగి యూఎస్కు రప్పించాలని కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..నష్టమేంటి..?ట్రంప్ వ్యాఖ్యలపై భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రతిభావంతులకు భారతదేశం నెలవుగా కొనసాగుతోంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలకు సహాయపడటం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ టెక్ ఎకోసిస్టమ్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రా కోసం భారతీయ ఇంజినీర్లు, డెవలపర్లు, పరిశోధకులు గణనీయంగా దోహదపడుతున్నారు. భారత్ నుంచి నియామకాలను నిలిపివేస్తే అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి మందగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వాయిదా పడిన కొత్త రేషన్కార్డుల పంపిణీ
'దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు'.. జ్యోతిరాజ్ సందీప్ క్లారిటీ!
భారత్తో నాలుగో టెస్ట్.. రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న జో రూట్
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్ క్రికెటర్లు వీరే!
కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
చీరలో కావ్య వయ్యారాలు.. ప్రభాస్ బ్యూటీ ఫొటోగ్రఫీ
ఫాస్టెస్ట్ ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేసింది..
విశాఖ టు జోగిపేట వయా వికారాబాద్!
అఫ్రిది రీఎంట్రీ.. బాబర్ ఆజమ్కు మళ్లీ చుక్కెదురు
గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్
బుల్లితెర నటుడి ఎంగేజ్మెంట్! నటికి మాత్రం రెండో పెళ్లి!
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
ముడతలు లేకుండా అందంగా.. ఆకర్షణీయంగా మెరిసిపోవాలంటే..!
లిక్కర్ కేసు సంగతి చూడమంటే తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికే వచ్చారేంటయ్యా!!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
ఇండస్ట్రీ నే షేక్ చేస్తోన్న.. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
హరి హర వీరమల్లు.. హిట్టా..! ఫట్టా..!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
వాయిదా పడిన కొత్త రేషన్కార్డుల పంపిణీ
'దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు'.. జ్యోతిరాజ్ సందీప్ క్లారిటీ!
భారత్తో నాలుగో టెస్ట్.. రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న జో రూట్
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా టాప్ క్రికెటర్లు వీరే!
కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
చీరలో కావ్య వయ్యారాలు.. ప్రభాస్ బ్యూటీ ఫొటోగ్రఫీ
ఫాస్టెస్ట్ ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేసింది..
విశాఖ టు జోగిపేట వయా వికారాబాద్!
అఫ్రిది రీఎంట్రీ.. బాబర్ ఆజమ్కు మళ్లీ చుక్కెదురు
గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్
బుల్లితెర నటుడి ఎంగేజ్మెంట్! నటికి మాత్రం రెండో పెళ్లి!
బగారా రైస్. చికెన్ కర్రీతో టీచర్ల విందు..కట్ చేస్తే కలెక్టర్..!
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు
HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్కాట్ దెబ్బ
ముడతలు లేకుండా అందంగా.. ఆకర్షణీయంగా మెరిసిపోవాలంటే..!
లిక్కర్ కేసు సంగతి చూడమంటే తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికే వచ్చారేంటయ్యా!!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఐటీ రిటర్న్ కొత్త డెడ్లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!
హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
హరిహర వీరమల్లు పార్ట్-2.. నిర్మాత రత్నం షాకింగ్ సమాధానం!
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
మీరు నటనకు ఎప్పుడూ దూరంగా లేర్సార్! నటిస్తూనే ఉన్నారు!
రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
సినిమా

అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్
బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆనాటి సంగతులను నెమరేసుకున్నాడు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. "ఆరోజుల్లో షూటింగ్ చేయడం అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడున్నన్ని ప్రత్యేక విభాగాలు అప్పుడు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్సే అన్నీ చూసుకోవాలి! దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు నేను సహాయ దర్శకుడిగా పని చేశాను.అన్ని పనులు ఒక్కరే..డైలాగులు రాసి నటీనటులకు ఇవ్వడం, వారిని చూసేందుకు వచ్చిన జనాల్ని అదుపు చేయడం మా పని. కొన్నిసార్లు హీరోహీరోయిన్లకు మేకప్మ్యాన్ కూడా మేమే అవుతాం. స్విట్జర్లాండ్లో సీన్స్ షూట్ చేసేందుకు మొత్తం 21 మందిమి వెళ్లాం. అందరం ఒకే బస్లో కూర్చునేవాళ్లం. బస్లో వెళ్తుండగా ఎక్కడైనా లొకేషన్ బాగుందనిపించగానే వెంటనే దిగిపోయి షూట్ చేసేవాళ్లం. హీరోహీరోయిన్లు కూడా..సరైన వసతులు లేనిచోట హీరోయిన్ కాజోల్ (Kajol) ఓ చెట్టు వెనక్కు వెళ్లి చీర మార్చుకునేది. షారూఖ్ ఖాన్ ఎక్కడపడితే అక్కడే డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యేవాడు. ఎత్తైన కొండలపై షూటింగ్ ఉందంటే అందరూ సామాన్లు పట్టుకుని పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే! షారూఖ్, కాజోల్ కూడా కొంత సామాను పట్టుకుని నడిచేవారు. అందరం ఒక టీమ్గా ముందుకు కదిలేవాళ్లం. మాకు సాయం చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. హీరోయిన్ డ్రెస్, జ్యువెలరీ కూడా తక్కువ రేటులో తీసుకునేవాళ్లం. హీరోయిన్ జుట్టు సరిచేశాడబ్బు ఎక్కువ లేకపోయేసరికి రైల్వే స్టేషన్ బయట అతి చవకైన ఆభరణాలు కొనుక్కొచ్చేవాడిని. కానీ ఇప్పుడంతా ఎలా మారిపోయిందో చూస్తున్నారుగా.. హీరో వానిటీ వ్యాన్లో కనీసం ఎనిమిది మందైనా ఉంటున్నారు. అప్పట్లో మేనేజర్, పీఆర్ అని ఎవరూ లేరు. హీరోయిన్ వెంట ఆమె తల్లి మాత్రమే ఉండేది. ఒకసారి కాజోల్ మేకప్మ్యాన్ లేకపోయేసరికి నేనే తన జుట్టు సరి చేశా. ఆమె తల్లి ముఖానికి మేకప్ వేసింది. ఆరోజుల్లో అంతా చాలా సరదాగా ఉండేది, ఇప్పుడంతా బోరింగ్గా మారిపోయింది అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.సినిమాదిల్వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 1995లో రిలీజైంది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించగా యష్ చోప్రా నిర్మించారు. షారూఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ విషయానికి వస్తే.. ఆయన బ్యానర్లో తెరకెక్కిన ధడక్ 2 మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు.చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్

రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
బాలీవుడ్ నటుడు సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ విషాద సమయంలో వారికి ఆర్థికసాయం అందించారు. తనవంతు సాయంగా లక్షన్నర రూపాయలు ఫిష్ వెంకట్ కుటుంబానికి అందించారు. అంతే కాకుండా సోనూ సూద్ కూడా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవల కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక మృతి చెందారు. ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు ఆయన వైద్యం కోసం ఆర్థికసాయం అందించారు. అయినప్పటికీ సరైన సమయంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్లో కనిపించాడు.

బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ
రీసెంట్ టైంలో బాలీవుడ్లో ఓ యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ మూవీ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే 'సయారా'. జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడిన ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))కథేంటి?వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రీసెంట్ టైంలో ఏ ఇండస్ట్రీలో చూసినా సరే లవ్ బ్యాక్డ్రాప్ మూవీస్ పెద్దగా రావట్లేదు. అందరూ హారర్, యాక్షన్, పీరియాడికల్ అంటూ పాన్ ఇండియా ట్రెండ్ వెంటపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సింపుల్ ప్రేమకథ, మనసుకు హత్తుకునే పాటలతో వచ్చిన హిందీ సినిమానే 'సయారా'. ఇప్పటివరకు చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటిలో ఒకలాంటిదే ఇది కూడా. స్టోరీ పరంగా కొత్తగాం ఏం ఉండదు. చాలాసార్లు చూసేశాం అనిపిస్తుంది. కాకపోతే స్టోరీని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.పెళ్లి బట్టలతో వాణి బత్రా.. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లిన సీన్తో సినిమా మొదలవుతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దీంతో కొన్నాళ్ల పాటు బాధతో ఇంటికే పరిమితమవుతుంది. అలా ఆరు నెలల తర్వాత తిరిగి బాహ్య ప్రపంచంలో అడుగుపెడుతుంది. రైటర్గా ఓ చోట జాబ్లో జాయిన్ అవుతుంది. అదే రోజు తన ఆఫీస్కి వచ్చి ఒకడ్ని కొడుతున్న సింగర్ క్రిష్ కపూర్ని ఈమె చూస్తుంది. అలా అక్కడ వీళ్లిద్దరికీ మొదలైన పరిచయం కాస్త ఎక్కడి వరకు వెళ్లింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.హిందీ ఆడియెన్స్ ఈ సినిమా చూసి తెగ ఎమోషనల్ అయిపోతున్నారు గానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఓకే ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఎమోషనల్గానే అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా గతం మర్చిపోయిన వాణి ముఖంలో అమాయకత్వం చూస్తే అయ్యో అనిపిస్తుంది. అలానే పాటలు కూడా దేనికవే బాగుంటాయి. మరీ సూపర్ అని చెప్పాం గానీ ఓ మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఎవరెలా చేశారు?క్రిష్ కపూర్గా చేసిన అహన్ పాండే, వాణిగా చేసిన అనీత్ పడ్డాకి ఇదే తొలి సినిమా. కానీ అద్భుతంగా చేశారు. అదిరిపోయే కెమిస్ట్రీ పండించారు. కొన్ని క్లోజప్ షాట్స్లో హీరోయిన్ని చూస్తుంటే మనల్ని కూడా ఇలాంటి అమ్మాయి ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుంది. అంతా బాగుంటుంది మరి. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ మోహిత్ సూరి.. తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్లో మరో మంచి మూవీ తీశాడు. సినిమాటోగ్రఫీ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో, అది కూడా హిందీలో మాత్రమే ఉంది. ప్రేమలో ఉన్నోళ్లు, ప్రేమలో విఫలమైనోళ్లు ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అయ్యే అవకాశముంది. ఒకవేళ బిగ్ స్క్రీన్పై చూస్తే ఆసక్తి లేదంటే కొన్నాళ్లు ఆగితే నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)

40 మంది సామాన్యుల ఎంపిక.. హాట్స్టార్లో 'బిగ్బాస్' అగ్నిపరీక్ష
"బిగ్బాస్ షోలో సామాన్యులు". కామన్ మ్యాన్ అంటారే కానీ వారు అప్పటికే సోషల్ మీడియాలో కొద్దోగొప్పో ఫేమస్ అయినవారినే రియాలిటీ షోకి తీసుకొస్తారు! గత రెండు మూడు సీజన్లలో ఇదే జరిగింది. అయితే ఈసారి (Bigg Boss Telugu 9) ఒక్కరిని కాదు కనీసం ముగ్గురు, నలుగురినైనా కామన్ మ్యాన్ కేటగిరీ కింద ఎంపిక చేస్తారట! ఇప్పటికే షోలో పాల్గొనడానికి అనేకమంది వీడియోలు పంపి దరఖాస్తులు చేసుకున్నారు.40 మందితో షోమొదటి దశలో సుమారు 200 మందిని సెలక్ట్ చేశారు. హావభావాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. ఇలా పలు అంశాల ఆధారంగా వీడియోలు జల్లెడ పట్టి అందులో 100 మందిని ఎంపిక చేశారు. వీరితో గ్రూప్ డిస్కషన్స్ అయ్యాక చివరగా 40 మందిని ఫైనలైజ్ చేశారు. ఇప్పుడీ 40 మంది మధ్యే అసలైన పోటీ జరగనుంది. వీరికి బిగ్బాస్ అగ్నిపరీక్ష (BIGG BOSS AGNIPARIKSHA) పెట్టనున్నాడు. ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.అగ్నిపరీక్షఅసలు ఆ 40 మంది ఎవరు? ఆ అగ్నిపరీక్షలో ఎలాంటి టాస్కులిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే! అయితే ఈ అగ్నిపరీక్షను బిగ్బాస్ అభిమానులు జియోహాట్స్టార్లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. వచ్చే నెలలోనే ఈ అగ్నిపరీక్ష కార్యక్రమం ఉండనుంది. ఇందులోనుంచి ముగ్గురు, నలుగురు కంటెస్టెంట్లను ఎంపిక చేసిన తర్వాత.. సెప్టెంబర్లో బిగ్బాస్ 9 ప్రారంభం కానుంది. చదవండి: చైసామ్ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

బీసీసీఐ పొమ్మంది!.. ఆ జట్టు హెడ్కోచ్గా అభిషేక్ నాయర్
భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) మరో జట్టుకు కోచ్గా నియమితుడయ్యాడు. మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) జట్టు యూపీ వారియర్స్కు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. యూపీ వారియర్స్ జట్టు సీఓఓ క్షేమల్ వేంగన్కర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.మాకెంతో ప్రత్యేకం‘‘అభిషేక్ నాయర్ మా జట్టుకు హెడ్ కోచ్గా రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాము. ఆయన కోచ్గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిన తర్వాత.. మరో మాటకు తావులేకుండా మేము ఒప్పందం చేసుకున్నాం.ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్ది.. వారిలో విజయకాంక్షను రగిల్చే అతి కొద్ది మంది కోచ్లలో అభిషేక్ ఒకరు. అతడి అనుభవం మాకు ఉపయోగపడుతుంది. గత పద్దెనిమిది నెలల కాలంలోనే మూడు జట్లు చాంపియన్గా నిలవడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.అభిషేక్ యూపీ వారియర్స్తో చేరడం మాకు ఎంతో ఎంతో ప్రత్యేకం’’ అని క్షేమల్ వేంగన్కర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు వెల్లడించాడు. కాగా 2018లో అభిషేక్ నాయర్ కోచ్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ సహాయక సిబ్బందిగా చేరాడు. ఇక 2022లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ట్రింబాగో నైట్ రైడర్స్కు హెడ్కోచ్గా వ్యవహరించాడు.కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్రఇక.. 2024లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్గా తన వంతు పాత్ర నిర్వర్తించాడు. ఈ క్రమంలో నాటి కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అతడి సహాయక సిబ్బందిలో అసిస్టెంట్ కోచ్గా చేరాడు.టీమిండియా విధుల నుంచి తప్పించారుఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టులలో టీమిండియా 3-0తో వైట్వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ను 3-1తో చేజార్చుకోవడంతో నాయర్పై బీసీసీఐ వేటు వేసింది. 2025 జనవరిలో అతడిని అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది.ఈ క్రమంలో మళ్లీ కేకేఆర్ అసిస్టెంట్ కోచ్గా తిరిగి వచ్చిన 41 ఏళ్ల అభిషేక్ నాయర్.. ముంబై టీ20 లీగ్-2025లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్కు మెంటార్గానూ వ్యవహరించాడు. తాజాగా డబ్ల్యూపీఎల్లో యూపీ వారియర్స్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎంపికయ్యాడు.చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్బై!?

పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని తాకిన న్యూజిలాండ్ ప్లేయర్
న్యూజిలాండ్ లెగ్ బ్రేక్ బౌలర్ ఐష్ సోధి అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకాడు. జింబాబ్వే ట్రై సిరీస్లో భాగంగా నిన్న (జులై 24) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన సోధి.. అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (సోధితో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. సోధికి ముందు న్యూజిలాండ్కే చెందిన టిమ్ సౌథీ (164), ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ (161) ఈ మైలురాయిని తాకారు.సౌథీ 126 మ్యాచ్ల్లో 164 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ 96 మ్యాచ్ల్లో 161, సోధి 126 మ్యాచ్ల్లో 150 వికెట్లు తీశారు. సోధి ఈ ఘనత సాధించే క్రమంలో ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా వేయకపోవడం విశేషం.భారత్ తరఫున టాప్లో అర్షదీప్అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా అర్షదీప్ సింగ్ ఉన్నాడు. అర్షదీప్ 63 టీ20ల్లో 99 వికెట్లు తీశారు. అర్షదీప్ తర్వాత యుజ్వేంద్ర చహల్ (96), హార్దిక్ పాండ్యా (94) అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత బౌలర్లుగా ఉన్నారు.జింబాబ్వేతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆఖర్లో మైఖేల్ బ్రేస్వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు. అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

సచిన్, ధోని, కోహ్లి సంపాదన తెలిసి.. నోరెళ్లబెట్టిన ఇంగ్లండ్ స్టార్లు!
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. విరాట్ కోహ్లి (Virat Kohli).. ఈ మూడు పేర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రికెట్ను కూడా ఓ మతంగా భావించే భారత్లో కోట్లాది మంది అభిమానులకు వీరు దేవుళ్లతో సమానం అంటే అతిశయోక్తి కాదు. తమదైన ఆటతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన వీరు.. సంపాదనలోనూ ముందే ఉన్నారు.రెండు చేతులా సంపాదనఈ టీమిండియా దిగ్గజ త్రయం వెయ్యి కోట్లకు పైగా సంపాదన కలిగి ఉన్నారని అంచనా. క్రికెటర్లుగా బీసీసీఐ నుంచి పొందే ప్రయోజనాలతో పాటు.. తమ క్రేజ్ను క్యాష్ చేసుకునే క్రమంలో ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు వీరు అంబాసిడర్లుగా ఉన్నారు. తద్వారా రెండు చేతులతో సంపాదిస్తున్నారు.శతక శతకాల ధీరుడు సచిన్, మూడు ఐసీసీ ట్రోఫీల వీరుడు ధోని రిటైర్ అయినా.. సంపాదనలో మాత్రం ముందే ఉన్నారు. ఇక కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా సూపర్స్టార్ల సంపద గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అడిగిన ప్రశ్నకు.. భారత జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది.రూ. 100 కోట్లకు పైగానే‘‘టీమిండియా సూపర్స్టార్ల సంపాదన ఏమేర ఉంటుంది’’ అని ఓ పాడ్కాస్ట్లో వాన్.. రవిశాస్త్రిని అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్ల సంపాదన చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎండార్స్మెంట్ల ద్వారా రూ. 100 కోట్లకు పైగానే సంపాదించి ఉంటారు.నోరెళ్లబెట్టిన ఇంగ్లండ్ స్టార్లు!అవును.. పది మిలియన్ల పౌండ్లు. నేనైతే వంద రూపాయలకు ఒక పౌండ్ చొప్పున ఇప్పుడు లెక్కకడుతున్నా. ఎంఎస్, విరాట్, సచిన్... 15- 20కి పైగా యాడ్లు చేస్తారు. రోజూ ఏదో వ్యాపకం ఉంటుంది. ఒక్కరోజు నటించే యాడ్తో కోట్లు సంపాదిస్తారు’’ అని రవిశాస్త్రి చెప్పాడు. దీంతో నోరెళ్లబెట్టడం వాన్ వంతైంది. అతడితో పాటు అక్కడే ఉన్న అలిస్టర్ కుక్ కూడా ఆశ్చర్యపోయాడు.ఎవరికి వారే సాటికాగా సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసి... ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డు బద్దలయ్యే ప్రసక్తే లేదని చెప్పవచ్చు. ఇక ధోని టీమిండియాకు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు.మరోవైపు.. సూపర్స్టార్ కోహ్లి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పటికి ఎనభై రెండు శతకాలు సాధించి.. సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్ను కూడా అధిగమించి.. అత్యధిక శతకాల వీరుడిగా కొనసాగుతున్నాడు. కాగా అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.చదవండి: మరణాన్నే జయించిన వాడికి ఇదో లెక్కా?: మాజీ క్రికెటర్ ప్రశంసలు

జడేజాది క్లియర్గా నాటౌట్.. కావాలనే ఔట్ ఇచ్చారు! ఫ్యాన్స్ ఫైర్
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగు టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆదిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా భారత్ కంటే 133 పరుగులు వెనకంజలో ఉంది.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 264/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదనంగా 94 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో సాయిసుదర్శన్(61) టాప్ స్కోరర్గా నిలవగా.. రిషబ్ పంత్(54) విరోచిత పోరాటం కనబరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఔటైన తీరు వివాదస్పదమైంది. జడేజా ఇచ్చిన క్యాచ్ను ఇంగ్లండ్ ఫీల్డర్ హ్యారీ బ్రూక్ క్లీన్గా అందుకోలేదన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. భారత ఇన్నింగ్స్ 85వ ఓవర్ వేసిన ఆర్చర్.. ఐదో బంతిని జడేజాకు ఎవే స్వింగర్గా సంధించాడు.ఆ బంతిని జడేజా డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. సెకెండ్ స్లిప్లో ఉన్న బ్రూక్ డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. అయితే బ్రూక్ క్యాచ్ను అందుకునేటప్పుడు బంతి నేలకు తాకినట్లు కన్పించింది. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం అది క్లీన్ క్యాచ్ కాదా కనీసం చెక్ చేయకుండా ఔట్ అని వేలు పైకెత్తాడు. దీంతో జడేజా(20 పరుగులు) కూడా ఔట్ అని భావించి రివ్యూ తీసుకోకుండా మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్లు పై భారత అభిమానులు మండిపడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఎలా ఔట్ ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బంతి క్లియర్గా నేలకు తాకిందంటూ స్క్రీన్ షాట్లను ఎక్స్లో షేర్ చేస్తున్నారు.The @imjadeja catch by Harry Brook had clearly touched the groundJadeja stood his ground as he too saw it. Why would he give way? #INDvsENG#ECB pic.twitter.com/23Fqnj4SEB— Vivek J (@Vivekrvcse) July 24, 2025చదవండి: ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్బై!?
బిజినెస్

వెజ్ ప్రోటీన్ స్లైస్ను విడుదల చేసిన మెక్డొనాల్డ్స్
ఆహార ప్రియులకు ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన ఫాస్ట్ ఫుడ్ను అందించాలనే లక్ష్యంతో మెక్డొనాల్డ్ ఇండియా (వెస్ట్ & సౌత్) ‘ప్రోటీన్ ప్లస్ స్లైస్’ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ వెజిటేరియన్ ఆధారిత ఆవిష్కరణ కోసం మెక్డొనాల్డ్ సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో జత కట్టినట్లు పేర్కొంది.ప్రోటీన్ ప్లస్ స్లైస్ప్రోటీన్ ప్లస్ స్లైస్ అనేది మొక్కల ఆధారిత ప్రోటీన్ స్లైస్. ఇది అధిక పోషకాలు కలిగి మాంసాహార ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భారతీయ అభిరుచులు, ఆహార ప్రాధాన్యతలకు అనుగుణంగా దీన్ని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్లైస్ 100% శాఖాహారంతో తయారు చేసినట్లు చెప్పింది. ఇందులో మొక్కల ఆధారిత ప్రోటీన్ అధికంగా ఉంటుంది. భారతీయ ఆహార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్థానికంగా అభివృద్ధి చేశారు.సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ సహకారంఈ స్లైస్ ఆవిష్కరణకు మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత విశ్వసనీయతను చేకూరుస్తుందని కంపెనీ నమ్ముతుంది. పప్పులు, తృణధాన్యాల నుంచి సేకరించిన మొక్కల ఆధారిత ప్రోటీన్లను ఉపయోగించి పోషకాల సమతుల్యానికి సీఎఫ్టీఆర్ఐ పరిశోధనలు ఎంతో తోడ్పడ్డాయని మెక్డొనాల్డ్ తెలిపింది. స్థిరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి భారత్లో డిమాండ్ పెరుగుతుందని చెప్పింది. ఈ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఇండియన్స్ను వద్దంటే యూఎస్కే నష్టంవెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ నిర్వహిస్తున్న మెక్డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ & సౌత్) మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అవుట్లెట్ల మెనూలో ఈ ప్రోటీన్ ప్లస్ స్లైస్ను ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాంక్ తీసుకొని, దాన్ని విశ్లేషించిన తర్వాత ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్నటి బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతోపాటు, ఈ రోజు కూడా ఊరట లభించింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఇండియన్స్ను వద్దంటే యూఎస్కే నష్టం
భారత్ వంటి దేశాలతో సహా విదేశాల్లో నియామకాలను నిలిపివేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేశం పంపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణాలు లేకపోలేదు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ అక్కడి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోపాటు ఇంకా కొన్ని కారణాలున్నాయి. అయితే దీని అమలు చేస్తే యూఎస్ సాంకేతిక అభివృద్ధి మందగిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.జాతీయవాదం, అమెరికా ఫస్ట్ ఎజెండా2025 జులై 23-24 తేదీల్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ రాడికల్ గ్లోబలిజం నుంచి టెక్ కంపెనీలు బయటకు రావాలని నొక్కి చెప్పారు. టెక్ కంపెనీలు యూఎస్ నుంచి ప్రయోజనం పొందుతున్నాయని చెబుతూ, చైనా, భారత్ వంటి దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఎత్తిచూపారు. అమెరికాలో ఉపాధిని పెంచేందుకు స్థానిక టెక్నాలజీ కంపెనీలు ముందుకు రావాలన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీఇదే సదస్సులో కృత్రిమ మేధకు సంబంధించి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో కృత్రిమ మేధ అభివృద్ధిని పెంచడానికి, దేశ పురోగతి అడ్డంకులను తగ్గించడానికి ‘విన్నింగ్ ది రేస్’ పేరుతో జాతీయ వ్యూహాన్ని తెలియజేశారు. ఈ ప్రణాళికలో డేటాసెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా, కృత్రిమ మేధకు అవసరమైన మౌలిక సదుపాయాలను కంపెనీలు సులభంగా నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాను కృత్రిమ మేధలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. ఏఐని అభివృద్ధి చేయడానికి ఫెడరల్ ఫండింగ్ పొందే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఉత్తర్వుపై సంతకం చేశారు. అందులో భాగంగా కంపెనీలు రాజకీయంగా తటస్థంగా ఉండే ఏఐ టూల్స్ను తయారు చేయాల్సి ఉంటుంది.హెచ్-1బీ వర్క్ వీసాలపై ఆందోళనట్రంప్ గత హయాంలో జారీ చేసిన బై అమెరికన్, హైర్ అమెరికన్ కార్యనిర్వాహక ఉత్తర్వులను పునసమీక్షించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా టెక్ సంస్థల్లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా విధానాలపై ఇది ఒత్తిడి తెస్తుంది. ఈ వీసా అమెరికా కంపెనీలు స్థానిక సిబ్బంది కంటే విదేశీ ప్రతిభావంతులపై ఎక్కువగా ఆధారపడటానికి ప్రోత్సహిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.ఇప్పటికే హెచ్చరికలు..గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. భారత్లో నియామకాలు ఆపేయాలనే ట్రంప్ హెచ్చరిక కంపెనీల దీర్ఘకాలిక కార్యకలాపాలకు సవాలుగా మారుతుంది. ఇప్పటికే యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్ ఉద్యోగులను తిరిగి యూఎస్కు రప్పించాలని కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..నష్టమేంటి..?ట్రంప్ వ్యాఖ్యలపై భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రతిభావంతులకు భారతదేశం నెలవుగా కొనసాగుతోంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలకు సహాయపడటం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ టెక్ ఎకోసిస్టమ్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రా కోసం భారతీయ ఇంజినీర్లు, డెవలపర్లు, పరిశోధకులు గణనీయంగా దోహదపడుతున్నారు. భారత్ నుంచి నియామకాలను నిలిపివేస్తే అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి మందగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 134 పాయింట్లు నష్టపోయి 24,932కు చేరింది. సెన్సెక్స్(Sensex) 395 ప్లాయింట్లు దిగజారి 81,794 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

శ్రావణం : రోజూ పండుగే.. ప్రతీ తిథి దివ్యముహూర్తమే
చిన్నకోడూరు(సిద్దిపేట): శ్రావణ మాసంతోనే హిందూ సాంప్రదాయాల ప్రకారం పండుగలు ప్రారంభమవుతాయి. శ్రావణం శుభకరం అని కూడా అంటారు. ఈ మాసంలో రోజూ పండుగేనని ప్రతీ ఘడియ లక్ష్మి కటాక్షమే అని విశ్వసిస్తారు. ఈ మాసంలో చేసే అన్ని పూజల్లోకెల్లా వరలక్ష్మి వ్రతాన్ని ఉత్తమమైనదిగా పేర్కొంటారు. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కాగా, ఈ నెల 29న నాగుల పంచమి, వచ్చే నెల 8న వరలక్ష్మివ్రతం, 9న శ్రావణ పౌర్ణమి(రాఖీ పండుగ), 16న శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. మంగళ, శుక్ర, శనివారాలకు ప్రాధాన్యత శ్రావణమాసంలోని మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవి భక్తులు నమ్ముతారు. మంగళవారాలు శ్రీగౌరీ, శుక్రవారాలు శ్రీలక్ష్మీ, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజలకు ముఖ్యమైన రోజులు. వీటికి తోడు శ్రావణంలోని శుక్ల పక్షంలోని 15 రోజులు ఎంతో విశేషమైనవి. సకల ఉపచారాలతో నిష్ఠగా మహలక్షి్మవ్రతం నిర్వహిస్తారు. తొమ్మిది సంఖ్యకు ఈ వ్రతంలో ప్రాధాన్యత. అందుకే తొమ్మిది పోగులతో కూడిన తోరం ధరించి తొమ్మిద రకాల పిండి వంటలు లక్ష్మీదేవికి నివేదన చేసి ముత్తైదువులకు వాయినమిస్తారు. మహిమాన్వితం శ్రావణ పున్నమి శ్రావణ మాసం పౌర్ణమి ఎంతో మహిమ కలిగినదని చెబుతారు. గాయత్రీ ఉపాసన చేసే వారు నూతన యజ్ఞోపవీతాలను ఇదే రోజున ధరిస్తారు. సర్వ విద్యా స్వరూపుడైన హయగ్రీవుని జయంతి కూడా ఇదే రోజు. రక్షా బంధనం, రుషి తర్పణం వంటి వైదిక కర్మలు ఇదే రోజున ఆచరిస్తారు. ఎంతో మహిమాన్విమైన ఈ తిథినాడు పూజిస్తే సత్ఫలితాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంపరమపవిత్రం శ్రావణం హిందువుల పరమ పవిత్రం శ్రావణ మాసం. ఈ మాసం పండుగలకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ప్రతీ హైందవ ఇంట్లో ఈ నెలంతా పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చనలు, తులసి అర్చనలు, పుష్పార్చనలు, రుద్రాభిషేకాలు వంటి పూజలు చేస్తారు. –సదాశివ శర్మ, పురోహితులు, చిన్నకోడూరుచదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్లుక్ వైరల్

గిరాయిపల్లి అమరుల స్ఫూర్తి
గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి ఏభై ఏళ్లు. ఈ సంఘటనతో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ) విద్యార్థుల విప్లవ పోరాటం ముగిసిపోలేదు. కామ్రేడ్స్ సూరపనేని జనార్దనరావు, లంకా మురళీమోహన్ రెడ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్... ఈ నలుగురి అమరత్వం సజీవమైనది. 1974లో ప్రారంభమైన రాడికల్ విద్యార్థి యూనియన్ ప్రభావానికి గురయ్యారు గిరాయిపల్లి అమరులు. నక్సల్బరీ సైద్ధాంతిక అవగాహనతో పనిచేశారు. జనార్దనరావు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు దగ్గర గరికపర్రు గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబం. ఇంజినీరింగ్ విద్య కోసం వచ్చిన విద్యార్థి వరంగల్ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తున్న విప్లవోద్యమంలోనూ ప్రధాన శక్తి అయ్యాడు. ఇంజనీరింగ్ విద్యను ఆఖరి సంవత్సరం వదిలి ప్రజా పోరాటాలలో భాగమయ్యాడు. విప్లవోద్యమ కర్తవ్యాన్ని దాని ప్రాసంగికతను విడవకుండా ఆనాటి యువతరంలో విప్లవ మార్గం పట్ల, అనురక్తి కలిగించగలిగాడు. 1975 జూన్ 25న తన సహచరులతో పాటు ఎన్కౌంటర్ అయిన సమయానికి అతడి వయసు ఇరవై అయిదేళ్లు. ఎమర్జన్సీ తొలి నాళ్ళ కాలం అది.గిరాయిపల్లి అమరులు తమ అమరత్వంతో పోరు విత్తనాలు చల్లారు. వీరి జ్ఞాపకార్థం గిరాయిపల్లిలో స్ఫూర్తి స్థూపం వెలిసింది. ప్రభుత్వం 1985లో ఈ స్థూపాన్ని కూల్చివేసింది. 1990లో తిరిగి నిర్మాణం జరిగింది. గిరాయిపల్లి అమరత్వాన్ని తలుచుకున్నప్పుడు మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసీ హననం గురించి మాట్లాడుకోవడం సముచితం. అరవై ఏళ్ళ విప్లవోద్యమ చరిత్రలో అణ చివేత, రక్తపాతం సాధారణమైన అంశమైంది. విప్లవకారులకు, ఆదివాసులకు భారత రాజ్యాంగ పరిధిలోని ఏ హక్కులూ వర్తించడం లేదు. జీవించే హక్కు అనుమతించడం లేదు. గిరాయిపల్లి అమరుల అమరత్వాన్ని వర్తమానం వెలుగులో చూసినప్పుడే దాని విలువ మరింత అర్థమవుతుంది.– అరసవిల్లి కృష్ణ ‘ విరసం అధ్యక్షుడు(గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగి నేటికి 50 ఏళ్లు)

సానబెట్టే సామర్థ్యం, సమరోత్సాహం
రామాయణ, మహాభారత కాలాల నుంచి నేటి దాకా చూస్తున్నాం, తలపెట్టిన పని విజయవంతం కావాలంటే, అర్థ బలం, అంగ బలం, బుద్ధి బలం, సామర్థ్యం మాత్రమే సరిపోవు. వాటికి తోడుగా ఉత్సాహం కావాలి. ఆత్మవిశ్వాసం, సకారాత్మకత, పట్టుదల, బలమైన విజయకాంక్ష– వీటిని కలబోస్తే అది ఉత్సాహం రూపంలో ప్రకటితమౌతుంది.రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అన్నట్టు సమరం సాగింది. ప్రత్యర్థులిద్దరూ అన్ని విధాలా సమరంలో సమవుజ్జీలే. ఇద్దరివీ లోకోత్తరమైన బల పరాక్రమాలు. అందుకే యుద్ధం సుదీర్ఘంగా సాగినా, ఎంతకీ ఎటూ తెగలేదు. ప్రత్యర్థులిద్దరూ అలసిపోయారు. చింతాక్రాంతులు కూడా అయ్యారు. ఆ దశలో, యుద్ధం చూసేందుకు దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహర్షి, యుద్ధ పరిశ్రాంతుడై కూర్చొన్న దాశరథి దగ్గరకు వచ్చాడు. సకల కార్య సిద్ధిప్రదమూ, సర్వశత్రు వినాశకమూ అయిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు. అవని జనులకు ప్రత్యక్ష దైవమయిన ఆదిత్యుడిని ఈ స్తోత్రంతో ముమ్మారు స్తుతించి, అందరు దేవతల అనుగ్రహాన్ని పొంది, దైవబలం సమకూర్చుకొమ్మన్నాడు. జయావహమైన ఈ మంత్రం జపించి, స్థైర్య సాహసాలను సంతరించుకొమ్మన్నాడు. ‘ఇప్పుడిక నువ్వు రావణుడిని వధించటం తథ్యం!’ అని తన ఆశీర్వాద బలం కూడా జోడించి, శ్రీరాముడిని ఉత్సాహపరిచి వెళ్ళాడు. ఈ ఘటన యుద్ధాన్ని కీలకమైన మలుపు తిప్పింది. ఇనుమడించిన ఉత్సాహంతో ఈసారి రణరంగంలో ప్రవేశించిన దాశరథి ధాటిని దశకంఠుడు తట్టుకోలేకపోయాడు. వీగిపోయి, విగత జీవుడయ్యాడు. వైదేహీ వల్లభుడినే విజయలక్ష్మి కూడా వరించింది. నిరుత్సాహం సమర్థతను నీరు గారుస్తుంది. ఉత్సాహ శక్తి సామర్థ్యాన్ని సాన బట్టి, పదును పెంచుతుంది. అగ్నికి వాయువులా తోడై, ప్రజ్వలింపజేస్తుంది. దైవబలమూ, మహా పురుషుల ఆశీర్వాద బలమూ, శంకలను శమింపజేయటం వల్ల కలిగే మనోబలమూ, ధర్మ పక్షానికి సర్వదా కవచంగా నిలిచే ధర్మబలమూ, ఉత్సాహాన్ని వృద్ధి చేసే ఉత్ప్రేరకాలు.– ఎం. మారుతిశాస్త్రి

‘ఇక్సీ’తో.. ఇన్ఫెర్టిలిటీ ఫిక్స్..!
ఫెర్టిలిటీ సమస్యలకు ప్రత్యామ్నాయం టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇది మానవ జీవితాన్ని గట్టిగానే ప్రభావితం చేస్తోంది. మానవ మనుగడకు తోడ్పాటునందిస్తోంది.. కాలుష్యం, రసాయనాల ప్రభావంతో పాటు తీవ్ర ఒత్తిడి అనేక రుగ్మతలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సంతానోత్పత్తిపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది.. దీనికి పరిష్కారంగా అనేక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగినది ఐవీఎఫ్ పద్ధతి. చదువులు, ఉద్యోగాలు, భారీ జీతాల కోసం భారీ లక్ష్యాలతో వివాహ వయసు దాటిపోతోంది. దీంతో గతంలో మహిళలనే ఇబ్బంది పెట్టిన ఇన్ఫెర్టిలిటీ సమస్య మగవారిలోనూ కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా సగటున 50 శాతం మందిలో ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా యుక్త వయసులోనే పురుషులు శుక్ర కణాలను, మహిళలు అండాలను భద్రపరుచుకునే వెసులుబాటు వచ్చేసింది. మారుతున్న కాలంలో పాటే అధునాతన చికిత్సలు అందుబాలోకి వచ్చేశాయి. ఆలస్యంగా వివాహాలు చేసుకునే వారి వేధించే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారంగా ఎంబ్రియో ఫ్రీజింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. మెట్రోనగరాల్లో ఒకటైన మన నగరంలోనూ ఈ వెసులుబాటు వచ్చేసింది. శుక్ర కణాలు, ఎగ్ (జీవ కణం) క్వాలిటీలో ఎలాంటి ఇబ్బందులూ లేనివారు యుక్త వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీటిని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇలా ఫ్రీజ్ చేసిన వాటిని ఐదు నుంచి పదేళ్లలో ఎప్పుడైనా గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వవచ్చు. దీంతో విద్య, ఉద్యోగం వంటి కారణాలతో అనేక మంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఇది సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నగర ప్రజలు ఐవీఎఫ్ కేంద్రాలకు క్యూ కట్టేవారు.. దీనికి పరిష్కారంగా అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడంతో ఫ్రీజింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. 40 శాతం దంపతుల్లో సంతాన సమస్యలు..ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిడి, సంపాదన, లైఫ్స్టైల్, కుటుంబ పరిస్థితులు, కాలుష్యం, ఆహారం, మైక్రో ప్లాస్టిక్, హార్మోన్ల సమతుల్యత, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మద్యం సేవించడం, పొగ తాగడం, రక్త సంబందీకులను పెళ్లి చేసుకోవడం, జన్యుపరమైన, ఇతర సమస్యలతో సుమారు 40 శాతం కొత్తగా పెళ్లైన జంటల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో పురుషుల్లో 50 శాతం మందిలో, 45 శాతం మంది స్త్రీలల్లో పునరుత్పత్తి సమస్యలు గుర్తిస్తున్నారు. ఇద్దరిలోనూ సమస్యలు ఉన్న జంటలు సుమారు 15 శాతం నుంచి 20 శాతం ఉంటున్నాయి. ఈ సమయంలో కొంత మంది మానసికంగా కుంగిపోవడం కనిపిస్తోంది. ఐవీఎఫ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. 30 ఏళ్లు వయసుగల వారిలో ఐవీఎఫ్ పద్దతులు సుమారు 60 శాతం నుంచి 70 శాతం సక్సస్ రేటు ఉండగా, ఆపై వయసున్న వారిలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. జీవ కణం పదేళ్లు..ఆరోగ్య రంగంలో ప్రపంచానికే మార్గదర్శిగా వెలుగొందుతున్న హైదరాబాద్ సంతాన సమస్యలకు చెక్ పెట్టే అధునాతన పద్ధతులను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ కంటే అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచి్చంది. దంపతుల నుంచి సేకరించిన ఎగ్స్, శుక్రకణాలను ఎంబ్రియాలజీ ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద పిండాన్ని (జీవ కణం) తయారు చేస్తారు. ఐదు నుంచి ఆరు రోజుల్లో పిండం సిద్ధమైపోతుంది. ఇలా తయారు చేసిన పిండాన్ని పదేళ్లలోపు ఎప్పుడైనా మహిళ గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వైరల్ మార్కర్ టెస్టులు.. పెళ్లికి ముందు, లేదా వివాహం నిశ్చయించుకున్న జంటలు ముందుగా వైరల్ మార్కర్, ఏఎంహెచ్ వంటి టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ ఇద్దరిలో ఎవరికైనా సమస్యలు ఉంటే ముందుగానే వాటికి చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతల్లో పనిచేసే వారిలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందట. మహిళల్లో 25 ఏళ్ల లోపు ఎగ్ రిలీజ్ బాగుంటుందని, తరువాత తగ్గిపోతుందని చెబుతున్నారు. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వివాహానికి ముందే చేసుకుంటే మంచిది. ఏడాది వరకూ సహజంగానే ట్రై చేసుకోవచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్..పట్టణ ప్రాంతాల్లో జీవన శైలి, ఇతర అలవాట్లతో సంతాన సమ్యలు సర్వసాధారణం అయిపోయాయి. దీంతో కొందరు ఐవీఎఫ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. శుక్రకణాలు, అండం, పిండాన్ని ఫ్రీజ్ చేయడం, ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్లు కొనసాగుతున్నాయి. శుక్ర కణాలు, ఎగ్స్ ఎంబ్రియాలజీ ల్యాబ్లో మైక్రో స్కోప్ కింద కలిపి పిండం (జీవకణం) తయారు చేస్తాం. దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. మహిళకు నొప్పి లేకుండా డే కేర్ ప్రొసీజర్లో పూర్తయిపోతుంది. మరుసటి రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. – పీ.స్వాతి, రీప్రొడక్టివ్ మెడిసిన్, కన్సల్టెంట్ రైన్బో హాస్పటల్స్ (చదవండి: సైక్లింగ్ పర్యావరణ హితం.. ఆరోగ్యం కూడా..!)
ఫొటోలు
అంతర్జాతీయం

Australia: హిందూ ఆలయ గోడలపై జాత్యహంకార వ్యాఖ్యలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోగల ఒక హిందూ దేవాలయం గోడలపై ద్వేషపూరిత జాత్యహంకార రాతలు కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆస్ట్రేలియా హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయమని ఆయన పునరుద్ధాటించారు.ఆస్ట్రేలియాలోని వాధర్స్ట్ డ్రైవ్లో గల స్వామినారాయణ ఆలయం గోడపై దుండగులు ఎర్రటి పెయింట్ చల్లి, జాత్యహంకార దుర్భాషపూరిత వ్యాఖ్యలు రాశారు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి సమీపంలోని రెండు ఆసియా రెస్టారెంట్లలో కూడా ఇదే సందేశం కనిపించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై స్పందిస్తూ, స్వామి నారాయణ ఆలయం రోజువారీ ప్రార్థనలు, సామూహిక భోజనాలు, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తుందని భగవత్ తెలిపారు.అయినప్పటికీ ఇటువంటి ఘటనలు ఎదురవడం శోచనీయమన్నారు. హిందువులు ఇతర వర్గాలవారిపై ప్రేమను చూపించాలని, ద్వేషంపై ప్రేమ విజయం సాధిస్తుందని భగవత్ అన్నారు. ఆలయంలో జరిగిన ఘటన తీవ్రంగా కలత పెట్టే అంశమని, భయాన్ని వ్యాప్తి చేయడానికే విద్రోహులు ఇటువంటి చర్యకు పాల్పడ్దారని భగవత్ పేర్కొన్నారు.

థాయ్, కంబోడియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
బ్యాంకాక్: థాయ్లాండ్- కంబోడియా మధ్య సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశల సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా సరిహద్దుల్లో భద్రతా దళాల ఘర్షణలు జరిగినట్లు ఇరు దేశాలు మీడియాకు తెలిపాయి. థాయ్ సైన్యం, కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ప్రసాత్ తా ముయెన్ థామ్ సమీపంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. థాయ్లాండ్ పరిధిలోని సురిన్ ప్రావిన్స్లో ప్రసాత్ తా ముయెన్ ఉంది. అయితే కంబోడియా ఇది తమదేనని చెబుతోంది.ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన దరిమిలా థాయ్- కంబోడియా సైనికుల పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. గురువారం ఉదయం పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తుండటంతో, తాము పారిపోయి కాంక్రీట్ బంకర్లో దాక్కుంటున్నట్లు థాయ్లాండ్ ప్రజలు తెలిపారు. థాయ్లాండ్ , కంబోడియాలు ఎవరు తొలుత కాల్పులు జరిపారనే దానిపై వాదనలు చేసుకున్నాయి. ఈ ఆగ్నేయాసియా పొరుగు దేశాల మధ్య సంబంధాలు మే నెల నుండి క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న సాయుధ ఘర్షణలో కంబోడియా సైనికుడొకరు మృతిచెందారు.థాయ్లాండ్ ముందుగా ఈ సాయుధ ఘర్షణను ప్రారంభించిందని, కంబోడియా స్వయం రక్షణ పరిధిలోనే వ్యవహరించిందని, అయితే థాయ్ దళాల నిర్ద్వంద్వ చొరబాటుకు ప్రతిస్పందించామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ముందు కూడా ఒక ల్యాండ్ మైన్ పేలి, ముగ్గురు థాయ్ సైనికులు గాయపడ్డారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి ఇరు రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.

‘ఎల్ఏసీ’లో ఏం చేద్దాం?.. భారత్-చైనా సమీక్ష
న్యూఢిల్లీ: భారత్- చైనా దేశాలు తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సమీక్షించాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు తదుపరి చేపట్టాల్సిన చర్యలకు ఏర్పాట్లు చేశాయి. ఢిల్లీలో జరిగిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ)సమావేశంలో ఇరుపక్షాలు ఈ అంశాలపై చర్చలు జరిపాయి.సరిహద్దుల్లో ప్రశాంతత, సాధారణ పరిస్థితి నెలకొనడం, ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా సాధారణీకరించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని ఇరు దేశాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఈ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న ప్రత్యేక ప్రతినిధుల (ఎస్ఆర్) తదుపరి దశ చర్చలకు భారత్- చైనా సిద్ధమయ్యాయని ఎంఈఏ పేర్కొంది. ఈ చర్చలకు భారత ప్రత్యేక ప్రతినిధిగా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి నేతృత్వం వహించనున్నారు.ఈ చర్చలకు ముందు వాంగ్ భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. గడచిన తొమ్మిది నెలలుగా భారత్- చైనాలు ఇరు దేశాల సంబంధాలను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు వైపులా ఘర్షణ పాయింట్ల నుండి దళాలను విరమించుకున్నప్పటికీ, తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎల్ఏసీ వెంబడి 60 వేల మంది సైనికులున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డబ్ల్యూఎంసీసీ చర్చలు జరిగాయి.2020 జూన్లో తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత ఏడాది అక్టోబర్ 21న ఖరారైన ఒప్పందం ప్రకారం డెమ్చోక్, డెప్సాంగ్ పాయింట్ల నుండి సైనిక దళాలను వెనక్కు మళ్లించారు. గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఇరుదేశాల దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.

మతోన్మాదం, ఉగ్రవాదంలో మునిగిన పాక్
ఐక్యరాజ్యసమితి: సమయం, సందర్భం కాకపోయినా కశ్మీర్ అంశాన్ని ప్రతిసారీ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావిస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి దీటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జూలై నెల సమావేశంలోభాగంగా మంగళవారం ‘‘బహుళత్వం ద్వారా అంతర్జాతీయ శాంతిభద్రత ప్రోత్సాహం, శాంతియుతంగా వివాదాల పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో పాకిస్తాన్ తొలుత ప్రసంగించింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ఉపప్రదాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రసంగించారు. ‘‘కశ్మీర్ను భారత్ ఆక్రమించింది. తాజా ఉద్రిక్తతలను అడ్డంపెట్టుకుని సిందూ నదీజలాల ఒప్పందం అమలును భారత్ రద్దుచేసింది. కశ్మీర్సహా భారత్తో నెలకొన్ని ప్రతిష్టంభనకు అంతర్జాతీయ జోక్యం తప్పనిసరి’’అని ఇషాక్ దార్ అన్నారు. ఈయన వ్యాఖ్యలపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దీటుగా బదులిచ్చారు. ‘‘బాధ్యతాయుతంగా ఉంటూ ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్కృషిచేస్తోంది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదనే అంతర్జాతీయ ప్రాథమిక సూత్రాన్ని భారత్ పాటిస్తోంది. ప్రజాస్వామ్య పథంలో పైపైకి దూసుకెళ్తూ, ఆర్థిక శక్తిగా అవతరిస్తూ, బహుళత్వానికి, సామాజిక సమ్మిళిత వృద్ధిని సాధిస్తూ భారత్ బిజీగా ఉంటే ఉగ్రవాదం, మతోన్మాదం, అంతర్జాతీయ ద్రవ్యనిది సంస్థ(ఐఎంఎఫ్) వంటి చోట్ల వేల కోట్ల రుణాలుచేస్తూ పాకిస్తాన్ బిజీగా ఉంది’’అని హరీశ్ దెబ్బిపొడిచారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ 2.1 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరుచేసిన విషయం తెల్సిందే. ‘‘పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ ఉగ్రవాదులే పహల్గాంలో పాశవిక హత్యాకాండకు తెరలేపారు’’అని హరీశ్ గుర్తుచేశారు.
జాతీయం

రాజస్తాన్: కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థుల దుర్మరణం
రాజస్తాన్ ఝలవార్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మరో 15 మందికి గాయాలైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు క్లాస్లో కూర్చుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 20 ఏళ్ల కిందటి నాటి ఈ స్కూల్ భవనానికి మరమ్మత్తులు అవసరమని గతంలో పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో.. గత కొంతకాలంగా ఇక్కడ వర్షాలు పడుతుండడంతో ఈ ఘోరం జరిగింది. పైకప్పు రాళ్లతో కట్టి ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.ప్రమాదంపై ప్రధాని మోదీ, రాజస్తాన్ సీఎం భజనాన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. सुबह-सुबह झालावाड़ से दुखद खबरझालावाड़ में एक सरकारी स्कूल की बिल्डिंग गिरने से 5 बच्चों की मौत हो गई. वहीं हादसे में 30 से ज्यादा बच्चे गंभीर घायल हैं.हादसा शुक्रवार सुबह प्रार्थना के दौरान मनोहरथाना ब्लॉक के पीपलोदी सरकारी स्कूल में हुआ.#Rajasthan #Jhalawar pic.twitter.com/DgtbbO8k3q— Avdhesh Pareek (@Zinda_Avdhesh) July 25, 2025

వరదల్లో చిక్కుకున్న విద్యార్థులు.. ఐదు అడుగుల నీటిలో ఇద్దరు యువకులు..
ఛండీగఢ్: ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వర్షాల కారణంగా పలుచోట్ల చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా పంజాబ్లో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు తెగిపోవడంతో 35 మంది స్కూల్ పిల్లలు వరద నీటిలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఎంతో ధైర్య సాహసాలతో జుగాద్ అనే పిలవబడే ప్రత్యేక పద్దతి ద్వారా పిల్లలను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. పంజాబ్లోని మల్లెయన్ గ్రామపంచాయతీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలకు వెళ్లిన పిల్లలకు ఉదయం 10 గంటల తర్వాత స్కూల్స్కు సెలవు ప్రకటించారు. దీంతో, వారంతా ఇంటికి వస్తున్న సమయంలో వరదల కారణంగా మల్లెయాన్, రసూల్పూర్ గ్రామాలను కలిపే రోడ్డు కొట్టుకుపోయింది. దాదాపు 35 మంది పిల్లలు, యువతులను వరద నీటిలో చిక్కుకున్నారు. పిల్లలంతా భయాందోళన చెబుతున్న సమయంలో వారిని కాపాడేందుకు ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. జుగాద్ అని పిలవబడే ప్రత్యేక పద్దతి ద్వారా వారి రక్షించారు.సుఖ్బిందర్ సింగ్, గగన్దీప్ సింగ్ సహా పలువురు పిల్లలకు సహాయం చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్బిందర్ సింగ్, గగన్దీప్ సింగ్ కలిసి మానవ వంతెనను ఏర్పాటు చేశారు. ఐదు అడుగుల లోతులో వారిద్దరూ వంతెనగా ఏర్పడితే.. స్థానికుల సాయంతో పిల్లలను రోడ్డు దాటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లలను కాపాడిన వారిద్దరినీ పలువురు ప్రశంసిస్తున్నారు.शाबाश पंजाबियों...पंजाबी हर वक्त मदद के लिए तैयार रहते हैमोगा के एक गांव की सड़क बह गई। स्कूल जाने वाले बच्चे फंस गए। लोगों ने अपनी पीठ को पुल बनाकर 30 बच्चों को पार कराया। कई साल बाद ऐसी तस्वीर देखने को मिली।सफेद टीशर्ट और शर्ट वाले युवक की तारीफ होनी चाहिए।#Punjab pic.twitter.com/33e0yu0zJ0— Anwar Ali (@Anwarali_0A) July 24, 2025

Rameshwaram Cafe: పొంగల్లో పురుగు.. ఫేక్ వీడియోతో పాతిక లక్షలు కొట్టేసే ప్లాన్!
సాక్షి,బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) పొంగల్లో పురుగు కనిపించిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన రెస్టారెంట్కు ఉన్న పేరును బద్నాం చేసేందుకు జరిపిన కుట్రలో భాగమేనని రామేశ్వరం కేఫ్ యజమానులైన రాఘవేంద్రరావు,ఆయన సతీమణి దివ్యా రాఘవేంద్ర రావులు ఓ నోట్ను విడుదల చేశారు. ఫేక్ వీడియో చూపించి రూ.25లక్షలు కొట్టేసే ప్లాన్లో భాగమేనని ఆధారాల్ని బయట పెట్టారు బెంగళూరు విమానాశ్రయంలోని రామేశ్వరం కేఫ్లో పొంగల్లో పురుగు కనిపించిన ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఓ కస్టమర్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని రామేశ్వరం కేఫ్లో బ్రేక్ఫాస్ట్గా పొంగల్ ఆర్డర్ చేశారు. ఆహారం తింటున్న సమయంలో అతను పొంగల్లో పురుగు ఉందని గుర్తించి, వెంటనే స్టాఫ్కు సమాచారం ఇచ్చాడు. కానీ కేఫ్ యాజమాన్యం పట్టించుకోలేదు.దీంతో కోపోద్రికుడైన కస్టమర్.. కేఫ్ నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో తీశాడు. ఆ వీడియోలో పొంగల్లో పురుగు పడిందంటూ ఓ స్పూన్ను చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కేఫ్ ఓనర్ను సంప్రదించాలా? అంటూ చర్చించారు. ఆ వీడియోతో దిగివచ్చిన నిర్వహకులు కస్టమర్కు క్షమాపణలు చెప్పారు. రూ. 300 రీఫండ్ ఇచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే? తమ రెస్టారెంట్ పొంగల్లో పురుగు లేదని రామేశ్వరం కేఫ్ యాజమాన్యం ట్వీట్లో ఓ నోట్ను విడుదల చేసింది. ‘‘ ఆ నోట్లో.. మా రెస్టారెంట్ ఐదారుగురు కస్టమర్లు వచ్చారు. పొంగల్లో పురుగుపడిందని హడావిడి చేశారు. పొంగల్లో పురుగు పడింది కాబట్టి తమకు నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే మేం తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు.పొంగల్లో పురుగు పడిందని ఫిర్యాదుతో కస్టమర్కు క్షమాపణులు చెప్పి.. తిరిగి రూ.300 డబ్బులు కూడా ఇచ్చాం. డబ్బులు తీసుకొని సదరు కస్టమర్లు వెళ్లిపోయారు. అలా వెళ్లారో లేదో మాకు ఫోన్ చేశారు. మీ కేఫ్కు ఉన్న పరువు,ప్రతిష్ట దెబ్బతినకూడదంటే మాకు రూ.25లక్షలు ఇస్తే మేం సైలెంట్గా ఉంటామని చెప్పారు. మేం అందుకు ఒప్పుకోలేదు. మేం కస్టమర్లకు పరిశుభ్రమైన ఆహారాల్ని అందిస్తున్నాం. కస్టమర్లకు అందించే ఆహారం విషయంలో మేం ఎక్కడ రాజీపడబోం అంటూ అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు అందించినట్లు చెప్పారు. తమ రెస్టారెంట్పై వస్తున్న వదంతుల్ని కస్టమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు,రెస్టారెంట్పై అసత్య ఆరోపణలు చేసిన కస్టమర్లను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. గతంలో పలువురు కస్టమర్లు.. తమ భోజనంలో పురుగులు,ఈగలు, రాళ్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. న్యాయపరంగా అవన్నీ అవాస్తవాలేనని గుర్తించినట్లు వెల్లడించారు. Press Release pic.twitter.com/KgvVOpwGFu— The Rameshwaram Cafe (@RameshwaramCafe) July 24, 2025

కీబోర్డు, మౌస్ లేకుండానే.. కంప్యూటర్ పనిచేస్తుంది!
కీబోర్డు, మౌస్, టచ్ స్క్రీన్, వాయిస్ కమాండ్ల వంటివి లేకుండా కంప్యూటర్తో పనిచేయించడాన్ని ఊహించగలమా? స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో.. దాన్ని సుసాధ్యం చేయనుంది మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా సంస్థ. కేవలం మన చేతివేళ్ల కదలికలతో, వాటి సంజ్ఞలతో కంప్యూటర్లూ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను ఇకమీదట నియంత్రించవచ్చు! టెక్నాలజీ వాడకంలో ఇదో గొప్ప మలుపు కానుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వరం. మాట (వాయిస్) లేదా సాధారణ ఇన్పుట్ పద్ధతులు పనిచేయని సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.భవిష్యత్తులో మన చేతివేళ్ల కదలికలతోనే కంప్యూటర్కు అన్నీ చెప్పేయొచ్చు, వాటిని నియంత్రించవచ్చు. ముఖ్యంగా రహస్యమైన విషయాలను ఎవ్వరికీ తెలియకుండా నిర్భయంగా కంప్యూటర్లో కంపోజ్ చేయొచ్చు.. సెర్చ్ చేయొచ్చు.. ఒకటేమిటి.. మనకు నచ్చినవన్నీ చేయొచ్చు. మెటా సంస్థ తయారుచేస్తున్న స్మార్ట్ రిస్ట్ బ్యాండ్తో ఇవన్నీ సాధ్యం కానున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇప్పటికే వాయిస్ కమాండ్స్తో పనిచేసే స్మార్ట్ కళ్లజోళ్లను మెటా రూపొందించింది.మెటా రియాలిటీ ల్యాబ్స్లో..: ఈ సాంకేతికతకు సంబంధించిన పురోగతిని ఇటీవల ప్రముఖ జర్నల్ ‘నేచరల్’లో మెటా ప్రచురించింది. మెటాకు చెందిన వ్యాపార, పరిశోధనా విభాగం ‘రియాలిటీ ల్యాబ్స్’లో ఈ పరిశోధనలు నిర్వహించారు. సుమారు 300 మంది వివిధ రకాల పనులు చేస్తుంటే.. వారి కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను పసిగట్టేందుకు మెషీన్ లెర్నింగ్ మాడ్యూళ్లకు శిక్షణ ఇచ్చారు. ఆ మోడళ్లు వారి కండరాల సందేశాలను విజయవంతంగా గ్రహించి, వారి కదలికలకు అనుగుణంగా పనిచేశాయి. ఈ రిస్ట్ బ్యాండ్ని మెటా ఆగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు ‘ఓరియన్’తోనూ పరీక్షించారు.ఎలా పనిచేస్తుంది?..: మన మెదడు.. నరాల ద్వారా కండరాలకు విద్యుత్ సంకేతాలు పంపుతుంది. వీటిని ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్జీ) సంకేతాలు అంటారు. మన మణికట్టు దగ్గర ఉండే కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే రిస్ట్ బ్యాండ్ని మెటా కంపెనీ తయారుచేసింది. దీని సాయంతో కంప్యూటర్లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)తో పనిచేసే వస్తువులను నియంత్రించవచ్చు. ఇకమీదట కీబోర్డులు, మౌస్లు లేదా స్క్రీన్ను టచ్ చేయడం వంటివేవీ అవసరం ఉండదు. కంప్యూటర్లతో పనిచేయించడం మరింత సులభతరం, సరళతరం కానుంది. మన జేబుల్లో చేయి పెట్టి వేళ్లు కదిలించినప్పుడు కూడా ఇది పనిచేయడం విశేషం.ఏమిటీ సాంకేతికత?సాధారణంగా ఎలక్ట్రోమయోగ్రాఫిక్ (ఈఎమ్జీ) సంకేతాలు శరీరం లోపలి నుంచి వస్తాయి. వాటిని గ్రహించి బయట నుంచి పనిచేస్తుంది కాబట్టి దీన్ని ‘ఉపరితల ఈఎమ్జీ (ఎస్ఈఎమ్జీ) సాంకేతికతగా పిలుస్తున్నారు. ఇది చాలా తేలికైన రిస్ట్ బ్యాండ్. మనం చేతిని కదిలినప్పుడు కండరాల నుంచి వచ్చే అతి సూక్ష్మ లేదా స్వల్ప స్థాయి విద్యుత్ సంకేతాలను కూడా గ్రహించి పనిచేయడం దీని ప్రత్యేకత. పెద్దపెద్ద పరికరాలు, యంత్రాల అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. కెమెరాలు, కొన్ని రకాల సెన్సర్లతో పనిచేసే వ్యవస్థలు మన సంజ్ఞలను గుర్తించి పనిచేస్తాయి. కానీ, మన కదలికలు స్పష్టంగా లేకపోతే ఇవి పనిచేయవు. కానీ, మన మెదడు – కంప్యూటర్ లేదా న్యూరో మోటార్ ఇంటర్ఫేస్లు.. అంటే మన శరీరం నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలతో పనిచేసే వాటితో ఈ సమస్య ఉండదని ఈ అధ్యయన కర్తలు చెబుతున్నారు.దీంతో ఏమేం చేయొచ్చు?⇒ ఒక టేబుల్ లేదా మన తొడ లేదా డెస్క్ లాంటి దానిపై మనం రాసిన దాన్ని కూడా ఈ రిస్ట్ బ్యాండ్ గుర్తించి, మనం ఏం రాశామో కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తుంది.⇒ మెసేజ్లు టైప్ చేయొచ్చు⇒ మెనూలు నియంత్రించ వచ్చు⇒ చేతుల కదలికల ద్వారా డిజిటల్ కంటెంట్ను మనకు నచ్చినట్టు యాక్సెస్ చేయవచ్చుఎవరికి ఉపయోగం?దివ్యాంగులకు..⇒ శరీరంలోకి ప్రత్యేకమైన ఇంప్లాంట్లు లేదా సంక్లిష్టమైన పరికరాలు జొప్పించాల్సిన అవసరం లేకుండానే.. వివిధ శారీరక సామర్థ్యాలు ఉన్న వ్యక్తులకు..⇒ సాధారణ ఇన్ పుట్ పరికరాలను ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నవారికి ..⇒ బహిరంగంగా లేదా ప్రైవేటుగా మాట్లాడలేని సందర్భాల్లో ఏదైనా విషయాన్ని రహస్యంగా అవతలివారికి చేరవేయాల్సి వచ్చినప్పుడు..మరిన్ని ఆవిష్కరణల కోసం..ప్రస్తుతానికి ఈ సాంకేతికత పూర్తిగా అభివృద్ధి కాలేదు. మన శరీరం నుంచి వచ్చే సంకేతాలను గుర్తించే పరికరాలను భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని మెటా చెబుతోంది. ఈ సాంకేతికతకు సంబంధించిన డేటా, సాఫ్ట్వేర్ మోడళ్లు, డిజైన్ మార్గదర్శకాలను పరిశోధకులతో పంచుకునేందుకు మెటా ముందుకు వచ్చింది. తద్వారా.. కండరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాల ఆధారంగా పనిచేసే మరిన్ని సాంకేతికతల ఆవిష్కరణలకు ఇది తోడ్పాటు అందించనుంది.
ఎన్ఆర్ఐ

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్డీఎస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
క్రైమ్

గర్భిణీ భార్య హత్య.. ఇంట్లో మృతదేహం.. బయట భర్త నాటకం
సాక్షి,బెంగళూరు: ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. నువ్వులేకపోతే నేను లేనన్నాడు. కాదూ కూడదు అంటే చచ్చిపోతున్నాడు. చివరికి ఆమెను లేకుండా చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను కడతేర్చాడు. ఆపై పరారయ్యాడు.బెంగళూరు పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువకుడు శివం తన 22 ఏళ్ల గర్భవతి భార్య సుమనను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.శివం, సుమన ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మందలించారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం, బెంగళూరుకు పారిపోయి వచ్చారు. బెంగళూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న శివమ్ పెయింటర్గా పనిచేస్తుండగా.. సుమన ఇంట్లోనే ఉంటుంది. ఆమె మూడు నెలల గర్భిణీ.ఐదేళ్ల పాటు ప్రేమ,దోమ అంటూ సుమన వెంటబడ్డ శివమ్ పెళ్లి తర్వాత తన రాక్షస బుద్ధిని బయటపెట్టాడు. అనుమానం పేరుతో సుమనను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇదే విషయమై సుమనపై శివమ్ చేయిచేసుకున్నాడు. ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఎవరికి వారు వేర్వేరు రూముల్లోకి వెళ్లి నిద్రించాడు. మరునాడు అంటే మంగళవారం ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో ఎప్పటిలాగే పనికెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చాడు. పూటగా మద్యం సేవించాడు. బుధవారం సైతం ఆమెను లేపేందుకు ప్రయత్నించగా అచేతనంగా పడి ఉండి.సుమన మరణించిందని నిర్ధారించుకొని ఇంటినుంచి పారిపోయాడు. అయితే,ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి సుమనపై అనుమానం పెంచుకున్న భర్త శివమ్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు.

చచ్చేంత వరకు జైల్లోనే ఉండండి
సాక్షి, చెన్నై: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజూ చెమ్మల్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాంచీపురం సమీపంలో 2018లో ఇద్దరు పిల్లల హత్య స్థానికంగా కలకలం రేపింది. విజయ్, అభిరామి దంపతుల పిల్లలైన అజయ్(6), కరి్ణక(4) ఈ హత్యకు గురైనట్టు గుర్తించారు. ఈ పిల్లలను వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో తల్లే కడతేర్చినట్టు విచారణలో తేలింది. ప్రియుడు మీనాక్షి సుందరం మోజులో పడ్డ అభిరామి భర్త విజయ్, పిల్లలను హతమార్చేందుకు పథకం వేసింది. అయితే, ఘటన జరిగిన రోజున భర్త విజయ్ ఇంటికి రావడంలో ఆలస్యం జరగడంతో పిల్లలు హతమైనట్టు విచారణలో తేలింది. భర్తను హతమార్చ లేక పిల్లల్ని చంపేసి ప్రియుడితో ఉడాయించిన అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసు విచారణ కాంచీపురం కోర్టు న్యాయమూర్తి బిజు చెమ్మల్ ముందు విచారణ జరిగింది. వానదనలు, సాక్షుల విచారణలన్నీ ముగిసి గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ కసాయి తల్లి, ఆమె ప్రియుడికి మరణించే వరకు జైలు శిక్ష విధించారు. ఈ సమయంలో కోర్టుకు వచ్చిన అభిరామి తీర్పు తదుపరి మహిళా కానిస్టేబుల్ కాళ్లను పట్టుకుని కన్నీటి పర్యంతమైంది. అభిరామి, మీనాక్షి సుందరంకు మరణించే వరకు జైలు శిక్షతోపాటూ తలా రూ. 15 వేలు జరిమానా విధించారు.

రాజస్తాన్: కుప్పకూలిన స్కూల్ పైకప్పు.. ఏడుగురు విద్యార్థుల దుర్మరణం
రాజస్తాన్ ఝలవార్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మరో 15 మందికి గాయాలైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు క్లాస్లో కూర్చుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 20 ఏళ్ల కిందటి నాటి ఈ స్కూల్ భవనానికి మరమ్మత్తులు అవసరమని గతంలో పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో.. గత కొంతకాలంగా ఇక్కడ వర్షాలు పడుతుండడంతో ఈ ఘోరం జరిగింది. పైకప్పు రాళ్లతో కట్టి ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.ప్రమాదంపై ప్రధాని మోదీ, రాజస్తాన్ సీఎం భజనాన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. सुबह-सुबह झालावाड़ से दुखद खबरझालावाड़ में एक सरकारी स्कूल की बिल्डिंग गिरने से 5 बच्चों की मौत हो गई. वहीं हादसे में 30 से ज्यादा बच्चे गंभीर घायल हैं.हादसा शुक्रवार सुबह प्रार्थना के दौरान मनोहरथाना ब्लॉक के पीपलोदी सरकारी स्कूल में हुआ.#Rajasthan #Jhalawar pic.twitter.com/DgtbbO8k3q— Avdhesh Pareek (@Zinda_Avdhesh) July 25, 2025

మా బిడ్డను చంపేశాడు
విశాఖపట్నం: వివాహం చేసుకుంటానని తమ కుమార్తెను వంచించి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ యశ్వంత్ అనే యువకుడు చంపేశాడని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ప్రాంతానికి చెందిన కార్తీక రామారావు, కార్తీక రామలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. కార్తీక నవ్యశ్రీ (25)ని ప్రేమికుడు యశ్వంత్ తామెవరం ఇంట్లో లేని సమయంలో ఈ నెల 2వ తేదీన చంపేశాడని తెలిపారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కార్తీక నవ్యశ్రీ తల్లిదండ్రులు రామారావు, రామలక్ష్మి తెలిపిన వివరాలివి. 35 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నామని వారు చెప్పారు. తమ కుమార్తె కార్తీక నవ్యశ్రీ, యశ్వంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వారి పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతించాయన్నారు. ఈ నేపథ్యంలో కావ్యశ్రీకి హైదరాబద్లో ఉద్యోగం దొరకడంతో వెళ్లి ఉద్యోగం చేసుకోమని యశ్వంత్ ఆమెతో చెప్పాడని పేర్కొన్నారు. అక్కడి నుంచే వేధింపులు ప్రారంభం.. కావ్యశ్రీ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుండగా అనుమానం పెంచుకున్న యశ్వంత్ నీవు ఎవరితోనో తిరుగుతున్నావని తరచూ వేధించేవాడని, కావ్యశ్రీని వైజాగ్ వచ్చేయమని చెప్పడంతో ఆమె మూడు నెలల కిందట వచ్చి వర్క్ ఫ్రం హోం చేస్తుందని తెలిపారు. మేము లేనప్పుడు.. గత నెల 29న ఇంటి పని కోసం కొత్తూరు వెళ్లామని, కావ్యశ్రీ నుంచి ఫోన్ వచ్చిందని, యశ్వంత్ తనను వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. మూడు రోజుల పాటు యశ్వంత్ కావ్యశ్రీతోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (2వ తేదీ వేకువ జాము) యశ్వంత్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కావ్యశ్రీ ఉరి పోసుకున్నట్టు తెలిపాడన్నారు. ఉదయం వచ్చి చూసే సరికి తమ కుమార్తె చనిపోయి ఉందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇంట్లో ఉన్న హుక్ కూడా ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకునేంతగా ఉండదని, యశ్వంతే తమ కుమార్తెను చంపేసి ఉండాడని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు, కావ్యశ్రీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి యశ్వంత్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు.