breaking news
Mahabubabad
-
ఉమ్మడి కుటుంబమే భేష్..
బంధాలు తెగి.. అనుబంధాలు వీడి ● యాంత్రిక జీవనంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం ● చిన్నచిన్న సమస్యలకే విడాకుల వరకు.. ● కొరవడిన పెద్దల మార్గనిర్దేశం నేడు ప్రపంచ జనాభా దినోత్సవంఒకే ఇల్లు.. ఒకే వంట డోర్నకల్: డోర్నకల్లో దశాబ్దాలుగా జైనమతానికి చెందిన పలువురు ఉమ్మ డి కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నా రు. కాగా పట్టణంలోని మెయిన్ రోడ్డు కు చెందిన కాలా సుమేర్చంద్జైన్ది ఉమ్మడి కుటుంబం. సుమేర్చంద్, మ నోజ్కుమార్, ఆనంద్కుమార్, సుశీల్కుమార్ నలుగురు అన్నదమ్ములు. వారి భార్యాపిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. కుటుంబంలో మొత్తం 19మంది ఉన్నారు. వారికి వంటతో పాటు ఇతర పనులన్నీ ఇంట్లో మహిళలు కలిసి చేస్తుండగా.. అన్నదమ్ములంతా ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్నారు. ప్రతీ రోజూ కలిసి పనులు చేసుకోవడం, కలిసి భోజనం చేస్తూ ఆనందంగా గడుపుతున్నామని సుమేర్చంద్జైన్ చెబుతుండగా.. ఎలాంటి సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరించుకుంటున్నామని, కలిసి ఉండడంతోనే ఆరోగ్యంగా, ధైర్యంగా ఉంటున్నామని మహిళలు అంటున్నారు. -
త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోండి
బయ్యారం: లబ్ధిదారులు త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. గురువారం మండలంలోని కాచనపల్లి, గురిమెళ్ల, గౌరారం, ఉప్పలపాడు, నర్సాతండా, వెంకట్రాపురం, బాలాజీపేట, బాల్య తండా, బయ్యారం, జగ్గుతండా, సంతులాల్పోడుతండా, కొత్తపేట, సింగారం పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు నిర్మించుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తేవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు విద్యుత్ తీగలు అడ్డువస్తే వెంటనే తొలగించాలన్నారు. అనంతరం సింగారంలో నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదులు.. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించారని వెంకట్రాంపురం, బాలాజీపేట పంచాయతీల్లో పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందజేశారు. భూములు, ఆర్థికంగా ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేశారని, అర్హులకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల కేటాయింపులో తమకు న్యాయం చేయాలని మహిళలు కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మరో దఫా అర్హులకు ఇళ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, గార్ల–బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతితో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య -
ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాం..
కురవి: మండలంలోని బలపాల గ్రామానికి చెందిన ఈడిగిరాల బాలవర్ధన్కు 17ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె లక్ష్మీప్రసన్న మరిపెడ ఎంజేపీలో 7వ తరగతి, కుమారుడు భానుప్రకాశ్ మానుకోట ఎంజేపీలో 5వ తరగతి చదువుతున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బాలవర్ధన్కు వచ్చే జీతంతో కుటుంబం ఇబ్బంది లేకుండా నడుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రతీ వస్తువుకు విపరీతమైన ధరలు పెరుగుతున్నాయని, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే కష్టమని బాలవర్ధన్ అన్నారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నామన్నారు. -
ఆదర్శ కుటుంబం..
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పాత బజారుకు చెందిన మహమ్మద్ అఫ్జల్, సాబేరబేగం దంపతులకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కటుంబంలో 19 మంది ఒకేచోట ఉమ్మడిగా నివాసం ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహమ్మద్ అఫ్జల్, సాబేరబేగం దంపతుల కుమారులు, కోడళ్లు జమీల్–అస్మాఅంజుమ్, ఖలీల్–రెహనాపర్వీన్, షకిల్–హుమేర, ఆదిల్–నఫీస్ ఉన్నారు. అఫ్జల్, సాబేరబేగం నలుగురు కుమార్తెల్లో ఒక కుమార్తె ఖైరున్నీసాబేగం భర్త 24 సంవత్సరాల క్రితం మృతిచెందగా ఆమె కూడా వీరివద్దే ఉంటుంది. కాగా వారంతా ఒకే ఇంట్లో నివసిస్తూ సంతోషంగా ఉంటున్నారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu1. మీరు ఎంత మంది పిల్లలను కనాలనిఅనుకుంటున్నారు?3. పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనే ప్లాన్ ఎలా చేస్తారు? 2. ఉమ్మడి కుటుంబమా.. ఒంటరిగా ఉండడం ఇష్టమా? ఉమ్మడి కుటుంబం భార్యాభర్తలు విడిగా ఉండడంభార్యాభర్తలు జాబ్ చేయడం వల్ల పిల్లలను చూసుకునే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని..4. ఈ తరంలో ఒక్కరు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు ఎందుకు? 401510052416263620‘ఒక్కరు.. లేదా ఇద్దరు పిల్లలు చాలు. అంతకంటే ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవు. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని అంటున్నారు యువజంటలు. దీంతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మారిన జీవన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఈ తరం ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ వచ్చే ఇరవై ఏళ్లలో యువజనుల జనాభా తగ్గి, సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురికి పైగా.. బిడ్డల్ని కనాలన్న సూచనలు వస్తున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనే విషయంలో యువజంటలు ఏమంటున్నాయి.. వీరితో పాటు 25 ఏళ్ల పైబడి వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారి మనోగతంపై ‘సాక్షి’ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అంశాలపై సర్వే నిర్వహించింది. అంతకంటే ఎక్కువ కనలేమంటున్న యువ జంటలుఉమ్మడి కుటుంబంలో ఉంటేనే సంతోషం ● ‘సాక్షి’ సర్వేలో స్పష్టీకరణ – సాక్షి నెట్వర్క్ న్యూస్రీల్ -
పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలి
మహబూబాబాద్ రూరల్: పెండింగ్ కేసుల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలనే ప్రధాన ఏజెండాగా గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలంటే జైల్లో ఉన్న ఖైదీలను కోర్టులో సకాలంలో హాజరుపరచాలని సూచించారు. పెండింగ్ వారెంట్లు త్వరగా క్లియర్ చేయాలని, సాక్షులను సరైన సమయంలో హాజరుపరచాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరవపల్లి కృష్ణతేజ్, తొర్రూర్ జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్, డీపీఈఓ కిరణ్, డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్, సీఐలు, ఎస్సైలు, ఎకై ్సజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ -
అఽధికారుల తప్పిదం.. రైతుకు శాపం
హసన్పర్తి: అధికారుల తప్పిదం.. రైతుకు శాపంగా మారింది. జాతీయ రహదారి 563లో నిర్మాణంలో భాగంగా అధికారులు చేపట్టిన సర్వే సందర్భంగా అనేక పొరపాట్లు చోటు చేసుకున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లకుండా కేవలం గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వే నంబర్లు సేకరించి నివేదిక ఇచ్చినట్లు రైతుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ జిల్లా హసన్పర్తి, సూరారం, కోతులనడుమ, వల్భాపూర్, పెంబర్తి గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నట్లు నివేదికల్లో పేర్కొనలేదు. హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన గొర్రె సారయ్యకు గ్రామ శివారులోని సర్వే నంబర్ 63/ఏలో సుమారు 0.32 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్నాడు. అయితే సర్వే అఽధికారులు ఈ నంబర్లును పరిహార జాబితాలో పొందపరచలేదు. దీంతో సదరు రైతు ఆందోళనకు గురై పరిహారం రాకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ భూమి సేకరణకు నోటిఫికేషన్.. సర్వే సందర్భంగా తప్పిపోయిన ఆ భూములను సేకరిస్తున్నట్లు జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో ఆయా ప్రాంతాల వారీగా పరిహారం నిర్ణయించారు. హసన్పర్తిలో ఎకరానికి రూ.1.06 కోట్లుగా మార్కెట్ ధర నిర్ణయించారు. అయితే ఈ రోడ్డు భూసేకరణ చేపట్టిన సమయంలో 2017లో జారీ చేసిన నోటిఫికేషన్లో మార్కెట్ ధర రూ.51లక్షలు. దీంతో మార్కెట్ ధర రెట్టింపు కావడంతో పరిహారం చె ల్లించడానికి అధికారులు జాప్యంచేస్తూ వస్తున్నారని బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు స్పందించడం లేదు.. పరిహారం చెల్లింపులో అధికారుల స్పందించడం లేదు. సరైనా సమాచారం కూడా అందించడం లేదు. దీంతో రోజూ కార్యాలయం చుట్టు ప్రదక్షణ చేస్తున్నా. –గొర్రె కిరణ్, మృతుడి కుమారుడు పరిహారం చెల్లింపులో జాప్యం రోదిస్తున్న నేషనల్ హైవే బాధితుడు -
ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడి మృతి
● పాలకుర్తిలో ఘటన పాలకుర్తి టౌన్ : బైక్పై అతివేగంగా వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై దూలం పవన్కుమార్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి రంజిత్(20) హైదరాబాద్లోని ఓ వైన్ షాపులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్పై మైలారం నుంచి పాలకుర్తి మీదుగా జనగామ వెళ్తుండగా జనగామ నుంచి పాలకుర్తికి వచ్చి బస్తాండ్లోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రుడిని 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సును ఢీకొన్న రంజిత్ హెల్మ్ంట్ ధరించి ఉంటే బతికేవాడు. -
పెరుగుతున్న గోదావరి
● రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13మీటర్లకు చేరిన నీటిమట్టం ఏటూరునాగారం/వాజేడు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది వరద క్రమక్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం వరకు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటిమట్టం 13 మీటర్లకు చేరింది. వరద క్రమంగా పెరుగుతోందని కేంద్ర జలవనరుల అధికారులు తెలిపారు. సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. పేరూరు వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరుకుంది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ కనిపిస్తోంది. -
నర్సంపేట డిగ్రీ కళాశాల సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల( అటానమస్) రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం కేయూలో వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లం నవీన్ ఫలితాల వివరాలు వెల్లడించారు. బీఎస్సీలో 41.74 శాతం, బీఏలో 51.85శాతం, బీకాంలో 39.92శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ ఫలితాలను క్యూ ఆర్ కోడ్, లింక్ ద్వారా కళాశాల వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి ఎస్. కమలాకర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాజీరు, స్టాఫ్సెక్రటరీ రహీముద్దీన్, భద్రు, తదితరులు పాల్గొన్నారు. 17న హనుమకొండలో గిరిజన మార్కెటింగ్ మేళా ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ట్రైబల్ ఫెడరేషన్ మార్కెటింగ్ (ట్రైఫాడ్) ఆధ్వర్యంలో ఈనెల 17న హనుమకొండలోని గిరిజన భవన్లో హస్తకళా ప్రదర్శన, మార్కెటింగ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ చిత్రామిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో గిరిజన కళాత్మక హస్తకళల (దుస్తుల తయారీ, పెయింటింగ్, ఫుడ్ ప్రొడక్ట్స్, వెదురు బుట్టలు అల్లడం) ప్రదర్శన ఉంటుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆసక్తిగల గిరిజన కళాకారులు తాము తయారు చేసిన వస్తువులను ప్రదర్శించడానికి మేళాకు హాజరు కావాలని కోరారు. ఈ ప్రదర్శనకు హాజరయ్యే కళాకారులు తప్పని సరిగా కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. మేళాకు హాజరైన కళాకారులకు రవాణా చార్జీలను ట్రైఫాడ్ ద్వారా అందజేస్తామన్నారు. మరింత సమాచారం కోసం 8330954571 నంబర్లో సంప్రదించాలన్నారు. యువకుడిపై పోక్సో కేసు పాలకుర్తి టౌన్: ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పా ల్పడిన ఘటనలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దూలం పవన్కుమార్ తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ బాలికపై( 16 ఏళ్లు) మండలంలోని తీగారం గ్రామానికి చెందిన దండెంపల్లి ప్రణయ్ లైంగికదాడికి పాల్పడగా ఆ బాలి క గర్భం దాల్చింది. ప్రస్తుతం 6 నెలల గర్భవతి అని తెలియడంతో ప్రణయ్.. ఆ బాలికకు గర్భస్రావం కోసం టాబ్లెట్లు ఇచ్చాడు. ఇంటికి వెళ్లాక సదరు బాలిక టాబ్లెట్లు వేసుకోగా రక్తస్రావం అయ్యింది. గమనించి కుటుంబ సభ్యులు బాలికను నిలదీశారు. దీంతో విషయం బయటపడింది. ప్రస్తుతం బాలికను హనుమకొండలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దూలం పవన్కుమార్ తెలిపారు. -
సైబర్ మోసగాళ్ల బరితెగింపు..
జనగామ: సైబర్ మోసగాళ్ల బరితెగించారు. పహల్గాం దాడి కుట్రలో సంబంధాలు ఉన్నాయంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ ప్రతినిధి లకావత్ లక్ష్మీనారాయణ నాయక్కు పహల్గాం ఉగ్రదాడి ఘటనలో సంబంధాలపై విచారణ ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు గురువారం ఫోన్ చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. ‘హలో లక్ష్మీనారాయణ గారు పహల్గాం ఉగ్రదాడి విచారణ అధికారిని మాట్లాడుతున్నా.. ఆ దాడి వెనక మీకు సంబంధాలు ఉన్నాయని తెలిసింది.. విచారణకు రావాల్సి ఉంటుంది, లేదంటే వెబ్సైట్ ద్వారా రిపోర్టు చేయాలి’ అని బోల్తాకొట్టించాడు. అయితే సైబర్ నేరస్తుడిపై డాక్టర్ లక్ష్మీనారాయణకు అనుమానం కలిగింది. పహల్గాం ఘటన కు తనకు సంబంధం ఉంటే పూర్తి సమాచారం స్థానిక పోలీసులకు ఇస్తానని, అక్కడ నుంచి తీసుకోవాలని తెగేసి చెప్పడంతో అనుమానితుడిగా భావించిన సైబర్ నేరస్తుడు ఫోన్ కట్ చేశాడు. వెంటనే జనగా మ సీఐ దామోదర్రెడ్డికి గుర్తుతెలియని వ్యక్తి సంభాషణను పంపించి, ఇందుకు సంబంధించి విషయాలు వివరించారు. అగంతకుల బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే ఎవరూ భయపడొద్దని, వ్యక్తిగ సమాచారం ఇవ్వొద్దని డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. పహల్గాం దాడికి సంబంధాలంటూ బెదిరింపు విచారణకు రండి.. లేదా వెబ్సైట్లో రిపోర్టు చేయాలి డాక్టర్ను బురిడీ కొట్టించే ప్రయత్నం పోలీసులకు ఫిర్యాదు -
భద్రకాళీ శరణం మమః
హన్మకొండ కల్చరల్ : సర్వాభిష్టములు ఆకలిదప్పులను తీర్చి, దుష్టులను సంహరించే శాకంబరీదేవిగా భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భక్తులు భద్రకాళీ శరణం మమ అంటూ పులకించారు. చారిత్రక శ్రీభద్రకాళీ దేవాలయంలో నిర్వహిస్తున్న తిథిమండల దేవాతాయజన పూర్వక శాకంబరీ నవరాత్రోత్సవాల చివరిరోజు గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని మహాశాకంబరీదేవిగా కూరగాయలతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జూన్ 26న ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం ఉత్సవాలు ప్రారంభమై పక్షం రోజులుగా ఒక్కొక్కక్రమంలో పూజలందుకుంటూ ఆషాఢశుద్ద పౌర్ణమి గురువారం అమ్మవారు పరిపూర్ణ శాకంబరీదేవిగా భక్తులను అనుగ్రహించింది. ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించిన భక్తులు భద్రకాళీ శరణం మమః అంటూ భక్తిపారవశ్యంలో మునిగారు. ఆలయ అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు అలంకరణలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్ మండువ శేషగిరిరావు, రేణుక దంపతులు, హైదరాబాద్కు చెందిన ఈమని హరికృష్ణ, స్మిత దంపతులు శాకంబరీ అలంకరణ దాతలుగా వ్యవహరించారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల నుంచి టన్ను పలు కూరగాయలు, పండ్లతో శాకంబరీదేవిగా అలంకరించడం ప్రారంభించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, సిబ్బంది అలుగు కృష్ణ , నాగులు, అశోక్, చింతశ్యామ్ సుందర్, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మితా, చిత్రానిత్యాక్రమాల్లో పూజలు.. ఉదయం మితా, చిత్రానిత్యాక్రమాల్లో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మహాశాకంబరీదేవిగా అలంకరించి మహాహారతి, పంచహారతి, మహానివేదన జరిపారు. హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. రాత్రి వరకు కొనసాగింది. శాకంబరీ ఉత్సవాన్ని పురస్కరించుకుని మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు మహాశాకంబరీదేవిగా దర్శనం మితా, చిత్రానిత్యాక్రమంలో పూజలు పులకించిన భక్తజనం ఘనంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలుఅమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ.. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మంత్రిని ఘనంగా స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర జలు సుఖసంతోషాలు, ఆయురారో గ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరింత ముందుకెళ్లాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. రాష్ట్ర ప్రజలపై అమ్మ వారి దయ ఉండాలని కోరుకున్నానన్నారు. -
ఎక్కువ మంది పిల్లల్ని పెంచడం కష్టం..
గూడూరు: నా పేరు ఎడ్ల నరేశ్రెడ్డి. మాది గూడూరు మండలం సీతానగరం శివారు రెడ్డిపల్లె గ్రామం. నన్ను మా బంధువులు చిన్నతనంలో దత్తత తీసుకొని పెంచి పెద్దవాడిని చేశారు. మాకు ఎకరం పొలం ఉంది. 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మా కూతురు శ్రీముఖ 8వ తరగతి చదువుతుంది. ఒక్కరు చాలు అనుకున్న.. కానీ గత సంవత్సరం కుమారుడు ఆర్యనాథ్రెడ్డి జన్మించాడు. ఆటో, ట్రాలీ, లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. ఏడాదిగా కాంగ్రెస్ పార్టీలో గ్రామ నాయకుడిగా ఎదిగాను. దీంతో ఎమ్మెల్యేలు మురళీనాయక్, దొంతి మాధవరెడ్డి సహకారంతో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్గా నియామకమయ్యాను. కొంతకాలంగా కొంచెం చెప్పుకునే విధంగా జీవనం కొనసాగుతుంది. అయితే నేటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని పెంచి పెద్ద చేయడం కష్టం. వారికి కావాల్సినవి ఇవ్వడంలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఒక్కరు లేదా ఇద్దరు పిల్ల లతో సరిపెట్టుకుంటే మంచిదనేది నా ఆలోచన. -
ఒకరి వెంట ఒకరు
తీరని విషాదం..జనగామ: తల్లి, కొడుకు ఒకేరోజు ఒకరి వెంట ఒకరు తనువుచాలించారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చారబుడ్డి దయాకర్రెడ్డి(55), తల్లి అహల్యాదేవి(85) గిర్నిగడ్డలో నివాసముంటున్నారు. దయాకర్రెడ్డికి ఇద్దరు అన్నలు ఉన్నారు. ఇందులో ఓ సోదరుడు మృతి చెందగా, రెండో సోదరుడు వ్యాపార రీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. తల్లి బాగోగులు చూసుకునేందుకు దయాకర్రెడ్డి జనగామలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అహల్యాదేవిపై కోతులు దాడులు చేయడంతో కిందపడి తీవ్రంగా గాయపడింది. దీంతో వెన్నుముక ఆపరేషన్ చేయించాడు. ఇదే సమయంలో దయాకర్రెడ్డికి కూడా వెన్ను నొప్పి సమస్య తీవ్ర కావడంతో ఆపరేషన్ చేయించుకుని కోలుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పని మనిషి బయటకు వెళ్లిన తర్వాత రాగిజావ తయారు చేసి తల్లికి ఇచ్చి తానూ తాగాడు. అనంతరం కొడుకు దయాకర్రెడ్డి ఇంటి వెనుక కుర్చీలో, తల్లి అహల్యాదేవి మంచం పక్కన చనిపోయి ఉన్నారు. తల్లి తల కింద నుంచి రక్తం మరకలు ఉన్నాయి. రాగి జావలో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు, పలువురు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి, తమ్ముడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారి మృతిపై ఎలాంటి అనుమానం లేదని సోదరుడు వాసుదేవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ చేతన్ నితిన్, సీఐ దామోదర్రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని తల్లి, కొడుకు మృతికి గల కారణాలపై ఆధారాలు సేకరించారు. కాగా, దయాకర్రెడ్డి, ఆయన తల్లి అహల్యాదేవి మరణ వార్త తెలుసుకున్న అన్ని పార్టీల నాయకులు, స్థానికులు, అభిమానులు అక్కడకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగారాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుల కుటుంబీకులను పరామర్శించిన వారిలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, వెన్నెం సత్యనిరంజన్రెడ్డి, జక్కుల వేణు మాధవ్, వంగాల మల్లారెడ్డి, కరుణాకర్రెడ్డి, గుజ్జుల నారాయణ, తదితరులున్నారు.తనువు చాలించిన తల్లి, కొడుకు.. జనగామలో ఘటన మృతుడు మాజీ కౌన్సిలర్ అనారోగ్యంతోనే.. అనుమానం లేదు పోలీసులకు మృతుడి సోదరుడి ఫిర్యాదు -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
డోర్నకల్: ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ మేళా కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెన్నారం గ్రామ పరిధిలో గురువారం అదనపు కలెక్టర్ ఆయిల్పామ్ మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన,పట్టు పరి శ్రమ అధికారి మరియన్న, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఇమ్మానియల్, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, హెచ్ఓ శాంతి ప్రియ,ఏఓ మురళీమోహన్,ఏఈఓలు పాల్గొన్నారు. పారిశుద్ధ్య సమస్యపై దృష్టి సారించాలి... డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పారిశు ద్ధ్య సమస్యపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం పారిశుద్ధ్య సమస్య, ఇందిర మ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సమస్యను వంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై నిత్యం సమీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఏఈ శృతి తదితరులు పాల్గొన్నారు. -
శాసనసభ ఏర్పాటు చేసే దమ్ముందా..?
హన్మకొండ: ప్రతిపక్ష పార్టీ లేఖ రాస్తే శాసనసభ ఏర్పాటు చేసే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు. రాజకీయాల్లో అనేకమంది ముఖ్యమంత్రులను చూశానని, రేవంత్ రెడ్డిని చూస్తే... మాట మార్చడం, మడమ తిప్పడం, ఏ మార్చడం ఆయన నీతి, రీతిగా కనిపిస్తుందన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి ఆయన మాట్లాడారు. శాసనసభ సమావేశాలకు ఒక తంతు ఉంటుందన్నారు. ప్రభుత్వం గవర్నర్కు సమావేశ తేదీ వివరాలలో లేఖ పంపాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ ఆమోదంతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామంటే లేఖ రాయడానికి సిద్ధమన్నారు. మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడం కాదన్నారు. ప్రెస్ క్లబ్ను ఇతర క్లబ్లతో పోల్చడం నిరంకుశత్వమన్నారు. పార్టీలు మారినప్పుడు ప్రెస్క్లబ్కు వెళ్లి మాట్లాడలేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చెప్పులు క్యూలో పెడుతూ నిరీక్షిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2 లక్షల జాబ్ క్యాలండర్ ఎటు పోయిందని నిలదీశారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవ రెడ్డి, చింతం సదానందం, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, నయీముద్దీన్, రామ్మూర్తి పాల్గొన్నారు. సభా సమావేశానికి ఒక తంతు ఉంటుంది మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
ఓరుగల్లులో తగ్గిన జననాల రేటు
రాష్ట్ర జననాల సగటులో 13వ స్థానంలో ఉమ్మడి జిల్లా సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్లో జననాల రేటు రోజురోజుకూ పడిపోతోంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది పార్లమెంట్లో దేశంలోని రాష్ట్రాల వారీగా జనన, మరణాలపై నివేదిక సమర్పించింది. బర్త్ రేటు (జననాల రేటు) తగ్గిందని 2021లో దేశవ్యాప్తంగా నమోదైన జనన రిజిస్టర్ రిపోర్ట్నూ వెల్లడించింది. 2021లో జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో 2001 నుంచి 2011 పదేళ్లలో సుమారు 42 లక్షల మంది జన్మిస్తే.. 2021 నాటికి ఆ జననాల సంఖ్యతో పోలిస్తే సంఖ్య 5.58 లక్షలు తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్లో జననాల రేటును పరిశీలిస్తే 2011 నుంచి తగ్గుతూ వస్తోంది. అంతకు ముందు జనాభా వృద్ధి రేటు ప్రకారం గంటకు 60–70 మంది నుంచి 30–35కు పడిపోయింది. ఇందుకు కరోనా మహమ్మారి తర్వాత జననాల సంఖ్య తగ్గిందనేది ఒక కారణం కాగా.. చాలా మంది ఒక్కరు, లేదా ఇద్దరితో సరిపెట్టుకోవడం కూడా కారణమని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలు, రాష్ట్రంలో జననాల రేటు ఇ లాగే తగ్గితే వచ్చే 20 ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి సీని యర్ సిటిజన్లు పెరుగుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. 1951 జనాభా వృద్ధి ఇలా.. సాధారణంగా ప్రతీ పదేళ్లకు ఒకసారి దేశ జనాభాను లెక్కిస్తా రు. 1872లో మొదటిసారి జనాభాను లెక్కించినప్పటికీ... స మగ్ర జనగణన 1881లో చేపట్టారు. 1952 నుంచి మనదే శంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ‘కుటుంబ ని యంత్రణ’ కార్యాచరణ మొదలైంది. రెండు దశాబ్దాలు ఈ కార్యక్రమం సీరియస్గా సాగినా.. ఆ తర్వాత నెమ్మదించింది. 2011 నుంచి జననాల రేటు తగ్గుముఖం.. ఐదేళ్లలో పుట్టింది 70 వేల మందే.. ఇలాగైతే వచ్చే ఇరవై ఏళ్లలో పెరగనున్న సీనియర్ సిటిజన్లు ఆందోళన కలిగిస్తున్న జననాల సంఖ్య నేడు ప్రపంచ జనాభా దినోత్సవంఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా రేటు ఇలా.. సంవత్సరం జనాభా పెరిగిన జనాభా శాతం 1951 13,29,836 +2,04,177 +18.14 1961 15,45,435 +2,15,599 +16.21 1971 18,70,933 +3,25,498 +21.06 1981 23,00,295 +4,29,362 +22.95 1991 28,18,832 +5,18,537 +22.54 2001 32,46,004 +4,27,172 +15.15 2011 35,12,576 +2,66,572 +8.21 2021 37,50,000 +2,37,424 +6.33 2025 38,20,000 +70,000 +1.83 -
కాజీపేట మీదుగా గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
కాజీపేట రూరల్ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం దివ్యదక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజీతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ను నడిపిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం సికింద్రాబాద్ అసిస్టెంట్ మేనేజర్ పి.వి.వెంకటేశ్ తెలిపారు. ఈ మేరకు కాజీపేట రైల్వే వీఐపీ లాంజ్లో గురువారం టూరిస్ట్ ట్రైన్ బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్లో ప్రారంభమయ్యే గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ కాజీపేటకు 1.55 గంటలకు, వరంగల్కు 2.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు 7 రాత్రులు, 8 రోజులు పాటు ఉండే గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ను తమిళనాడు, కేరళలోని తిరువణ్ణమలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తాంజావూరు ప్రదేశాల సందర్శన ఉంటుందని వివరించారు. ఒకరికి బుకింగ్ సాధారణ టికెట్ ధర రూ.14,100, 3 ఏసీ టికెట్ ధర రూ.22,300, 2 ఏసీ టికెట్ ధర రూ. 2900 ఉంటుందన్నారు. ఈ ట్రైన్కు సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయన్నారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్తో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు ఈ యాత్ర ట్రైన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్ బుకింగ్, ఇతర వివరాలకు 040–27702407, 9701360701, 9281495843, 9281495845 నంబర్లు లేదా www.irctctourism.comలో సంప్రదించాలని కోరారు. ఐఆర్సీటీసీ టూరిజం మానిటర్స్ కె.ప్రశాంత్, ఎం.శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ నెల 19న సికింద్రాబాద్ నుంచి ప్రారంభం ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్ -
జ్ఞానదీపం గద్దెలను తాకిన వరద..
● పొంచి ఉన్న ప్రమాదం కాళేశ్వరం: మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహితనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద బుధవారం రాత్రి కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన జ్ఞానదీపాల గద్దెలను తాకింది. దీంతో దేవస్థాన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఒక వేళ వరద పెరిగితే ఆ రెండు జ్ఞానదీపాలు వరదల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం త్రివేణి సంగమం సరస్వతీఘాట్ వద్ద 8.480 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. మరింత వరద పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. -
పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి
విద్యారణ్యపురి: పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం హనుమకొండలోని పెన్షనర్ల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.భవిష్యత్లో పెన్షనర్లకు పీఆర్సీ, డీఏ లబ్ధిపొందే అవకాశం ఉండదన్నారు. కేంద్రప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది మార్చి నుంచి జూన్ 2025 వరకు ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీరస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు సింగారెడ్డి మాట్లాడారు. సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా జి.రాజన్న, మహిళా ఉపాధ్యక్షులుగా ఎన్. సుభాషిణి, ప్రధాన కార్యదర్శిగా కె.దేవదాసు, సహాయ కార్యదర్శులుగా ఎం. మల్లయ్య, ఎం. దేవేందర్రెడ్డి, ట్రెజరర్గా ఎల్. గోవిందరెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఆగయ్య వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
నేడు గురుపౌర్ణమి
● సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్: ఆషాఢ శుద్ధ పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అంటారు. వేద సంహితలను రాసిన వ్యాసభగవానుడిని పూజిస్తారు. వ్యాసభగవానుడు వ్యక్తికాదని గురువే అని భావించేవారు గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. భక్తులు సాయిమందిరాల్లో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం హనుమకొండ బస్టాండ్ సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరం, యాదవనగర్లోని సాయిబాబా ఆలయం, పద్మాక్ష్మీనగర్లోని సాయిబాబా ఆలయం, భద్రకాళి దేవాలయం దగ్గర ఉన్న సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కాగా, హనుమకొండ బస్టాండ్ సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, 6 గంటలకు మంగళస్నానం, ఉదయం 8 నుంచి 11గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 5గంటలకు పూజలు ఉంటాయని చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ తెలిపారు. పత్తి పంటలో యాజమాన్య పద్ధతులు.. ● రైతులు అవగాహన పెంచుకోవాలి ● కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజన్న మామునూరు: పత్తి పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజన్న సూచించారు. ఈ మేరకు బుధవారం మామునూరు, సింగారం, ఒంటి మామిడిపల్లి గ్రామాల్లో కృషి విజ్ఞాన కేంద్రం, మామునూరు వ్యవసాయ శాస్త్రవేత్తలు పత్తి పంటలను క్షేత్ర స్థాయిలో సందర్శించారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో విత్తుకున్న పత్తి పంటలు, ప్రస్తుతం 30 నుంచి 45 రోజుల వయసులో ఉన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో తామర పురుగులు, పచ్చ దోమ, పేనుబంక, గోధుమ రంగు ముక్కు పురుగు ఉధృతి గమనించారు. వీటి నివారణకు రైతులు పంట తొలి దశ నుంచే సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలన్నారు. తామర పురుగుల నియంత్రణకు ఎకరాకు 10 చొప్పున నీలి రంగు జిగురు అత్తలు అమర్చుకోవాలన్నారు. -
గొర్రెల షెడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగ..
● షార్ట్ సర్క్యూట్తో జీవాలు మృత్యువాత నెక్కొండ: గొర్రెల షెడ్డుపై 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి జీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని పెద్దకొర్పోలులో జరిగింది. గ్రామస్తులు, బాధితురాలు నూకల లక్ష్మి కథనం ప్రకారం.. లక్ష్మి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన గొర్రెల షెడ్డుపై 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్లింది. ఈ క్రమంలో ఇన్సూరేటర్ ఫెయిల్ కావడంతో విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో షెడ్డు షార్ట్ సర్క్యూట్కు గురవడంతో 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితురాలు బోరున విలపించింది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరింది. కాగా, గతంలోనూ ఇళ్ల పైనుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్ లైన్ను, ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని పలుమార్లు తెలిపినా అధికారులు స్పందించలేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. -
‘టీ– హబ్’ను సందర్శించిన వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి, విశ్వవిద్యాలయం రూసా నోడల్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని టీ–హబ్ కార్యాలయాన్ని సందర్శంచారు. విశ్వవిద్యాలయం తరఫున ఒప్పందానికి సంబంధించి విధివిధానాలపై చర్చించారు. టీ–హబ్లో అందుబాటులో ఉన్న వసతులు, వనరులు, సదుపాయాలను పరిశీలించారు. ఈ వనరుల కాకతీయ యూనివర్సిటీకి కె–హబ్ అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతాయనే అంశాలను పరిశీలించారు. టీ–హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కవికృత్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్తాలుక్ పాల్గొని కె–హబ్ అభివృద్ధికి టీ–హబ్ తరుపున సహకారం ఉంటుందని తెలిపారని వీసీ ప్రతాప్రెడ్డి తెలిపారు. -
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదుట గల ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు బుధవారం పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సెట్విన్ అధికారులు వనజ, సత్యనారాయణరెడ్డి పరీక్షలను పర్యవేక్షించారు. యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్ విజయశ్రీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ సందర్శించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, సుమంద సోనీ, సోమ శైలజ, బొడ్డు నితీష, తదితరులు పాల్గొన్నారు. -
నేడు మహాశాకంబరీ అలంకరణ
హన్మకొండ కల్చరల్: నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం(నేడు) అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలతో మహా శాకంబరీదేవిగా అలంకరించనున్నారు. దేవిగా అమ్మవారి రూపాన్ని దర్శించడానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు రానున్నారు. ఈమేరకు మహబూబాబాద్ శ్రీలక్ష్మీ శ్రీనివాస సేవా సమితి అధ్యక్షుడు జీకే రెడ్డి ఆధ్వర్యంలో సేవాసమితి సభ్యులు ఎనిమిది క్వింటాళ్ల కూరగాయలు అమ్మవారికి సమర్పించారు. బుధవారం రాత్రి సేవాసమితి సభ్యులు కూరగాయలను దండలుగా తయారుచేశారు. అమ్మవారి శాకంబరీ విశ్వరూప దర్శనం గురువారం ఉదయం 9గంటల నుంచి రాత్రి వరకు కొనసాగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. లోక కల్యాణం కోసమే శాకంబరీ ఉత్సవాలు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్ర జలు సుఖ సంతోషాలతో ఉండాలని శాకంబరీ ఉ త్సవాలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం ని త్యాహ్నికం నిర్వహించిన అనంతరం 3 గంటల నుంచి శాకంబరీ అలంకరణ ప్రారంభమవుతుంది. 6గంటల పాటు అలంకరణ కొనసాగుతుంది. అ లంకరణ సమయంలో భక్తులను అనుమతించరు. అలంకరణ పూర్తయిన తర్వాత అమ్మవారి స్నపనభేరాన్ని మితాక్రమంలో, భోగాభేరాన్ని చిత్రాక్రమంలో పూజలు నిర్వహించి ఉదయం 9గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. ముద్రా, జ్వాలామాలినీ క్రమాలలో అమ్మవారికి పూజలు భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా 14వరోజు బుధవారం అమ్మవారిని ముద్రా, జ్వాలామాలినీ క్రమాలలో పూజలు జరిపారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ముద్రా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని జ్వాలామాలినీ అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్త తొనుపునూరి వీరన్న, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రకాళి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి తరలిరానున్న వేలాది మంది భక్తులు -
15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు
మొగుళ్లపల్లి: ఓటరు గుర్తింపు కార్డు ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే నేరుగా ఇంటికే రానుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే ఇంటికే ఓటరు గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యువతను చైతన్యపర్చేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్పులు, చేర్పులు కూడా.. ఇదివరకే ఓటరుగా నమోదై జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి సైతం 15 రోజుల్లోనే ఇంటికే ఓటరు కార్డు పంపించనున్నారు. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారం ఓటర్లకు ఎలక్ట్రోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు చేయడానికి నెలకు పైగా సమయం పడుతుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదును ప్రోత్సహించడానికి సరికొత్త మార్గంఅర్హులు ఓటరుగా నమోదు కావాలి..అర్హులు ఓటరుగా నమోదు కావాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే గుర్తింపు కార్డు రానుంది. –సునీత, తహసీల్దార్, మొగుళ్లపల్లి -
కేంద్రం మొండి వైఖరి వీడాలి
హన్మకొండ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం విద్యుత్ అధికారులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 50 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. పేద, మద్య తరగతి ప్రజలున్న దేశంలో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని, ప్రైవేటీకరిస్తే చార్జీలు మరింత పెరిగే ప్రమాదముందన్నారు. దీనిని వినియోగదారులు, రైతులు భరించలేరన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వీడాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేమునూరి వెంకటేశ్వర్లు, బి.సామ్యా నాయక్, ఎన్.సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, పి.మల్లికార్జున్, పి.మహేందర్ రెడ్డి, కె.రంగా రావు, ఎ.ఆనందం, ఎన్.కుమారస్వామి, అజ్మీరా శ్రీరాం నాయక్, వాలు నాయక్, బి.ఆంజనేయులు, ఆర్.నవీన్, జె.అరుణ్, ఎల్.శ్రీనివాస్, జె.హర్జీ నాయక్, మచ్చిక బుచ్చయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ శ్రీధర్ -
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
● 18 ఏళ్లు నిండి ప్రతి ఒక్కరూ ఈసీఐ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి తమ ఫోన్ నంబర్, ఈ–మొయిల్ ఐడీతో సైన్ అప్ కావాలి. ● క్రియేట్ చేసిన అకౌంట్పై క్లిక్ చేసి తన పేరు, పాస్వర్డ్ నమోదు చేయాలి. తర్వాత పాస్వర్డ్ నిర్ధారించాలి. ● సైన్ అప్ అయిన ఈ–మొయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దానిని ఎంట్రీ చేసి అందులో ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ● కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు ఫామ్–6తో వ్యక్తిగత వివరాలు, అడ్రస్ తదితర వివరాలు నమోదు చేసి అందులో పేర్కొన్న ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అనంతరం మరోసారి వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. ● మార్పులు, చేర్పుల కోసం ఫామ్–8, ఓటరు పేరు తొలగించుకునేందుకు ఫామ్–7 నింపాలి. ● ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు చేసిన సమయంలో ఎస్ఎంఎస్ వచ్చిన రెఫరెన్స్ నంబర్ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. -
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుళ్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె.ఈశ్వర్ రావు, కన్వీనర్ ఎం.ఎ.వజీర్ అన్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను శాశ్వత ఎంప్లాయ్గా కన్వర్షన్ చేయాలని డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేశారు. అంతకు ముందు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇతర శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఆర్టిజన్ ఉద్యోగులను పోల్చొద్దన్నారు. ఇది కంపెనీ అని, ఐడీ యాక్ట్ వర్తిస్తుందన్నారు. యాజమాన్యానికి తమకు లేబర్ కమిషనర్ ఎదుట 12(3) ఒప్పందం కూడా కుదిరిందన్నారు. ఆ ఒప్పందాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కి స్టాండింగ్ రూల్స్ తీసుకొచ్చిందని, ఈ రూల్స్కు వ్యతిరేకంగా పది నెలలుగా జరుగుతున్నదే ఈ కన్వర్షన్ పోరాటమన్నారు. ఈ నెల 14 ఉదయం 6 గంటల నుంచి సమ్మె చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 10న లేబర్ కమిషనర్తో చర్చలున్నాయని, ఈ చర్చలు సఫలం కాకపోతే నిరవధిక సమ్మె తప్పదన్నారు. తెలంగాణ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ కందికొండ వెంకటేశ్, కోకన్వీనర్ కృష్ణమాచారి. నాయకులు చంద్రారెడ్డి, సలీంపాషా, రఘునాథరెడ్డి, ప్రసాద రాజు, మురళి, ఐలయ్య, రాజన్న, జయచందర్, సృజన, శ్రీనాథ్, శ్రీకాంత్, రాజేందర్ పాల్గొన్నారు. ఏపీ ఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె.ఈశ్వర్ రావు, కన్వీనర్ ఎం.ఎ.వజీర్ -
8 కిలోల ఎండు గంజాయి పట్టివేత
ఖిలా వరంగల్ : కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 8.7 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నామని వరంగల్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్ల డించారు. భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో డ్రగ్ కంట్రోల్ బృందం సీఐ సతీశ్, ఎస్సై పూర్ణచందర్, ఆర్పీఎఫ్ ఏఎస్సై దుర్గాప్రసాద్, సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మహారాష్ట్ర డైసర్కు చెందిన ఎండి. అష్రఫ్ షేక్, డోంగ్రి శాంతినగర్కు చెందిన రహీం బాబన్ పటేల్, ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్ జిల్లాకు చెందిన రాజు ఠాకూర్, మహారాష్ట్ర రత్నగిరి దైసార్కు చెందిన ప్రవీణ్ శ్యామ్ తవుడే అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో 8.7 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. నలుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ -
హత్య కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : నగరంలోని ఉర్సు గుట్ట సమీపంలో వనం రాకేశ్ అనే వ్యక్తిని హత్య చేసినఘటనలో శివనగర్కు చెందిన గాడుదుల రాజేశ్, జున్ను హరికృష్ణ అలియాస్ బంటికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2022, ఆగస్టు 27న వనం రాకేశ్ తన మిత్రులు మరుపట్ల నిఖిల్, శివ, తదితరులతో ఉర్సు గుట్ట సమీపంలోని మహాలక్ష్మి బేకరీ వద్ద ఉ న్న సమయంలో కడిపికొండ వైపు నుంచి బైక్పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. రాకేశ్, తన మిత్రుల సమీపంలోకి వచ్చి మూత్ర విసర్జన చేస్తుండగా ఇక్కడ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో రాకేశ్తో నిందితులు ఘర్షణ పడుతుండగా రాకేశ్ మి త్రులు నిఖిల్, శివ నివారించారు. దీంతో ఇద్దరు వ్య క్తులు(బైక్పై వచ్చిన వారు).. రాజేశ్, హరికృష్ణ అలియాస్ బంటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా సుమారు తొమ్మిది మంది అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఉర్సు గుట్టకు చేరుకుని అక్కడే ఉన్న రాకేశ్, నిఖిల్పై దాడి చేశారు. హరికృష్ణ కత్తితో రాకేశ్ను పొడవగా అడ్డుకోవడానికి వెళ్లిన తన స్నేహితులు నిఖిల్, శివకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం మేరకు స్థానికులు అంబులెన్స్లో బాధితులను ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు రాకేశ్ మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చారు. విచారణలో గాడుదుల రాజేశ్, జున్ను హరికృష్ణ అలియాస్ బంటిపై నేరం రుజువుకావడంతో ఇద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి నిర్మలా గీతాంబ తీర్పు వెలువరించారు. ఈ కేసును పోలీస్ అధికారులు శ్రీనివాస్, రమేశ్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో కానిస్టేబుల్ ప్రతాప్, హోంగార్డు సదానందం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరబోయిన శ్రీనివాస్ కేసు వాదించారు. తీర్పు వెలువరించిన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
వైద్యం వికటించి వృద్ధుడి మృతి?
తొర్రూరు/ కొడకండ్ల: వై ద్యం వికటించడంతోనే వృద్ధుడు మృతి చెందా డని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన డివిజన్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జి ల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం పాండురంగయ్య(70) గ్రామాల్లో దుస్తుల విక్రయాలు జరుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు వారి మాదిరిగానే బుధవారం కూడా గ్రామాలు తిరిగి ఇంటికి చేరుకున్న సమయంలో తీవ్ర కడుపు నొప్పికి గురయ్యాడు. ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. దీంతో తొర్రూరులోని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా వైద్యుడు పరీక్షించి ఇంజక్షన్లు, ఇతర వై ద్యం చేశాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో స్కానింగ్ తీసుకురావాలని సూచించాడు. దీంతో పట్టణంలోని ఓ స్కానింగ్ సెంటర్కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందగా వృద్ధుడి మృతదేహంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందో ళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు శాంతించలేదు. చివరకు ఆస్పత్రి తరఫున పరిహారం అందేలా కృషి చేస్తామని మ ద్యవర్తులు తెలపడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై ఉపేందర్ వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు.● ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన ● తొర్రూరులో ఘటన -
కష్టానికి తగ్గ ప్రతిఫలం
జయ్యారం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 546 మార్కులు సాధించి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకునే అవకాశాన్ని పొందాను. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషశ్రీ మేడమ్, ఉపాధ్యాయుల సహకారంతో ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యా. తల్లిదండ్రులు కష్టపడి కూలీ పని చేస్తూ చదివిస్తున్నారు. వారి కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలనే లక్ష్యంతో ఇష్టంగా చదివిన. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం – షేక్ మహిముద, జయ్యారం. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బాట మా పాఠశాల నుంచి బాసర ట్రిపుల్ ఐటీకి ఆరగురు విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ గ్రామీణ ప్రాంతంలోని పేద కుటుంబాలకు చెందినవారే. వారికి వచ్చిన ఈ అవకాశం ఉజ్వల భవిష్యత్కు బాట. డీఈఓ రవీందర్రెడ్డి మొదటి నుంచి చక్కటి ప్రణాళికతో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా మమ్ముల్ని ప్రోత్సాహించారు. ట్రిపుల్ ఐటీ సెకండ్ స్పెల్లో కూడా మరికొంత మంది విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. – ఉషశ్రీ, ప్రధానోపాధ్యాయురాలు, జెడ్పీహెచ్ఎస్ జయ్యారం -
జయ్యారం బడి భేష్..
చిన్నగూడూరు: మండలంలోని జయ్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించి, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. ప్రధానోపాధ్యాయురాలు ఉషశ్రీ, ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించామని, అదే స్ఫూర్తితో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించామని ఎంపికై న విద్యార్థులు తెలిపారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. మండలం నుంచి ఏడుగురు ఎంపిక.. ఇటీవల విడుదలైన ట్రిపుల్ ఐటీ ఎంపిక జాబితాలో మండలం నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపిక కాగా, ఒక జయ్యారం జెడ్పీహెచ్ఎస్ నుంచే ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. పది ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించడమే కాకుండా, 36 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఆరుగురు సీట్లు సాధించడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన ఆరుగులు విద్యార్థులు -
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ నియోజవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ వాళ్లకు ముఖ్యమంత్రిని విమర్శించడమే తప్ప వేరే ఏం పనిలేదని మండిపడ్డారు. సోమ్లాతండా, కేసముద్రంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మంత్రులకు వివరించామని, త్వరలో వాటిని కూడా మంజూరు చేపిస్తామని అన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామని, ఇటీవలే రెండు డీఏలు ఇచ్చామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపా రు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భరత్చందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రాంరెడ్డి, నాగేశ్వరరావు, ప్రభా కర్, చిట్టెం వెంకన్న, సతీష్, నాయకుల వెంకన్న, సురేందర్, యాదవరెడ్డి, మహేందర్ రెడ్డి, రాజు, హరిసింగ్, రమేశ్, ప్రవీణ్ కుమార్ ఉన్నారు. -
కార్మికులకు శాపంగా మారిన లేబర్కోడ్లు
నెహ్రూసెంటర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి నాలుగు లేబర్కోడ్లు కార్మికులకు శాపంగా మారా యని ఐక్య కార్మిక సంఘాల నాయకులు అన్నారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్)మాస్లైన్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్, బి.విజయసారథి, గౌని ఐలయ్య, పాయం చిన్న చంద్రన్న, సనప పొమ్మన్న మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక లేబర్కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపును ఉపసంహరించుకొని కార్మికులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కుంట ఉపేందర్, అజయ్సారథిరెడ్డి, హలవత్ లింగ్యా, నాగన్న, దార స్నేహబిందు, కాంపల్లి శ్రీనివాస్, గునిగంటి రాజన్న, రామ్మూర్తి, మైస శ్రీనివాస్, సులోచన, గుజ్జు దేవేందర్, పెరుగు కుమార్, మంద శంకర్, చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రావణ్, ఆవుల కట్టయ్య, బండపల్లి వెంకటేశ్వర్లు, చైతన్య, వీరన్న, సట్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు. ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలోర్యాలీ -
ఇంజనీర్ కావాలనేది నా కల
జయ్యారం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన. 566 మార్కులు సాధించాను. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. మా అన్నయ్య నాకు ఆదర్శం. తను నీట్ ర్యాంక్ సాధించడానికి కష్టపడిన పద్ధతినే నేను పాటించాను. ఉపాధ్యాయుల సహకారంతో పదో తరగతిలో మంచి మార్కులతో పాటు, ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాను. ఇంజనీర్ కావాలనేది నా కల. గొప్ప చదువులు చదివి ఊరికి, పాఠశాలకి మంచి పేరు తెస్తాను. – జాటోత్ శైలజ, మంగోరిగూడెం ఉన్నత స్థాయికి చేరాలని.. జయ్యారం పాఠశాలలో పదో తరగతి చదువుకున్నాను. పది పరీక్ష ఫలితాల్లో 559 మార్కులు సాధించాను. జీవితంలో ఇంజనీర్ చదివి ఉన్నత స్థాయికి చేరాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ చది విస్తున్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహించారు. వారి సహకారంతో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం ఆనందంగా ఉంది. – చెవుల ఉదయ్, జయ్యారం -
ముందుకు సాగట్లే.. !
ఉమ్మడి జిల్లాకు కలిసిరాని వానాకాలం ● గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం ● సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు ● లోటు వర్షపాతం ఖాతాలో ఆరు జిల్లాలు ● కష్టకాలంలో పత్తి సాగువైపే మొగ్గు... వరి సాగుపై వేచి చూసే ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై రెండు మాసాలు నడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చేరక.. పెరిగిన భూగర్భజలాలు కూడా అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా..ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల ఈసారి ఆశించిన మేరకు సాగు పెరగలేదని, అయితే ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా లోటు వర్షపాతమే... వరి సాగు 6.39 శాతమే.. జనగామ జిల్లాలో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉమ్మడి వరంగల్లో 2025–2026 వానాకాలం సాగు అంచనా, సాగు లెక్క ఇదీ..మొత్తం సాగు అంచనా ఎకరాలు5,46,138 మొత్తం సాగు శాతం : 34.50 శాతం15,82,755 -
పోక్సో కోర్టు పీపీగా వెంకటయ్య
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన న్యాయవాది కొంపెల్లి వెంకటయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, రాంచంద్రునాయక్, యశస్వినిరెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగాయని, బాధితులకు అండగా ఉండి నిందితులకు శిక్షలుపడేలా కృషి చేస్తానని కొంపెల్లి వెంకటయ్య తెలిపారు.నేడు ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళామహబూబాబాద్ రూరల్: ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నేడు(గురువారం) నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ ఆధికారి జినుగు మరియన్న బుధవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 200 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటుతామన్నారు. ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా సందర్భంగా రైతులు అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు. నూతన సబ్స్టేషన్లు మంజూరునెహ్రూసెంటర్: జిల్లాకు నూతనంగా 8 సబ్ స్టేషన్లు మంజూరు కాగా పనులు ప్రారంభమయ్యాయని జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ పి.విజేందర్రెడ్డి బుధవారం తెలిపారు. వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్లో లోఓల్టేజ్ సమస్య, మౌలిక వసతుల అభివృద్ధికి అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుతో వినియోగదారులకు, రైతులకు విద్యుత్ అంతరాయలు తగ్గుతాయని స్పష్టం చేశారు. 13న పంచరామాలకు ఆర్టీసీ బస్సు యాత్ర నెహ్రూసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర టూర్ ప్యాకేజీలో భాగంగా పంచరామాలకు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) ఈ నెల 13న రాత్రి 11 గంటలకు యాత్ర బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ బుధవారం తెలిపారు. పంచరామాలకు రెండు రోజులకు గానూ ఒక్కొక్కరికి రూ.1700 చార్జ్గా నిర్ణయించామన్నారు. అదే విధంగా మల్లూరు, బొగత జలపాతం, లక్నవరం, రామప్ప ఒక్కరోజు టూర్ ప్యాకేజీకి ఒక్కొక్కరికి రూ.700 చార్జ్గా నిర్ణయించామని, బస్సు ఈ నెల 13న ఉదయం 5గంటలకు డిపో నుంచి బయలుదేరుతుందని డీఎం పేర్కొన్నారు. టికెట్ బుకింగ్ వివరాల కోసం ఎండి.నబి 99482 14022 నంబర్లో సంప్రదించాలన్నారు. ఆత్మరక్షణకు కరాటే దోహదం మహబూబాబాద్ అర్బన్: నేటి సమాజంలో బాలికలు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాపు కార్యాలయంలో బధవారం జాతీయస్థాయిలో పథకాలు సాధించిన సోహతబుస్ను అదనపు కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు. కార్యక్రమంలో కోచ్ జహీద్ తదితరులు పాల్గొన్నారు. ‘స్వచ్ఛభారత్’ పరిశీలననెల్లికుదురు: మండలంలోని వావిలాల గ్రామంలో స్వచ్ఛభారత్ అమలు విధానాన్ని సెంట్రల్ అకాడమిక్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ బృందం బుధవారం పరిశీలించింది. గ్రామంలోని అంగన్వాడీ సెంటర్, స్కూల్, గ్రామ పంచాయతీ, దేవాలయ ప్రాంతం, సెగ్రిగేషన్ షెడ్, ఇంకుడు గుంతలను బృందం సభ్యులు పరిశీలించారు. రాష్ట్ర కోఆర్డినేటర్ జి.నరేశ్, సూపర్వైజర్ మధుకర్, డీపీఓ పుల్లారావు, ఇన్చార్జ్ ఎంపీడీఓ బానోతు పద్మ, ఎంఈఓ రామ్దాస్, జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్లు శ్రవణ్, రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
జ్వరంతో బాలుడి మృతి
కేసముద్రం: జ్వరంతో ఓ బాలుడి మృతి చెందాడు. ఈ ఘటన ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండాజీపీ శివారు బావోజీతండాలో చోటు చేసుకుంది. ఎస్సై మురళీధర్రాజు కథనం ప్రకారం..తండాకు చెందిన ధారావత్ బాలాజీ, అనిత దంపతుల పెద్దకుమారుడు చరణ్సింగ్(15) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా, వారం క్రితం జ్వరం రావడంతో ఇంటికి తీసుకొచ్చారు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఆ బాలుడికి జ్వరంతోపాటు కడుపునొప్పి రావడంతో కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. సదరు వైద్యుడు ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా, ఇంజక్షన్ వికటించడంతోనే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మురళీధర్రాజు తెలిపారు. ● ఇంజక్షన్ వికటించడంతోనే మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు -
ప్రాణహిత పరవళ్లు..
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం వరద ప్రవాహం పెరగడంతో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం సరస్వతీఘాట్ వద్ద మెట్లను తాకుతూ 6.600 మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదై దిగువకు కాళేశ్వరం మీదుగా తరలింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి రెండు రోజుల నుంచి వరద తాకిడి పెరుగుతోంది. 1.33లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతుండగా..బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నారు. బుధవారం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇంజనీరింగ్ అఽధికారులు పేర్కొంటున్నారు. కాళేశ్వరం వద్ద 6.600 మీటర్ల ఎత్తులో నీటిమట్టం 1.33 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల -
‘వేం’ కారునుంచి పొగ
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం సోమ్ల తండా గ్రామ శివారులోని హెలిపాడ్ సమీపంలో నిలిపిన ఇన్నోవా కారు నుంచి మంగళవారం ఒక్కసారిగా పొగ వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ల్యాండ్ అయ్యే హెలిపాడ్ సమీపంలో రోడ్డు పక్కన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వాహనం నిలిపారు. అందులో నుంచి పొగ రాగానే గమనించి అగ్నిమాపక సిబ్బంది వెంటనే టియర్ గ్యాస్ ఉపయోగించి ఆర్పివేశారు. కారు ఇంజిన్ భాగంలో ఏసీ షార్ట్ సర్క్యూట్ జరిగి పొగ వచ్చిందని, పొగ ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పేర్కొన్నారు. -
19 వరకు ఎంఏ తెలుగు పరీక్ష ఫీజు గడువు
హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2024–2025 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ ఎంఏ తెలుగు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజు ఈ నెల 19వ తేదీ లోపు చెల్లించాలని పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 19వతేదీ సాయంత్రం 5గంటలలోపు తమ దరఖాస్తులను పీఠం కార్యాలయంలో సమర్పించాలన్నారు. అలాగే, ఈ నెల 23 వరకు ఆలస్య రుసుముతో చెల్లించొచ్చని తెలిపారు. వివరాలకు 9989417299, 9989139136 నంబర్లో సంప్రదించాలని సూచించారు. భాగ్యనగర్, గోల్కొండ, శాతవాహన రైళ్లకు పర్మనెంట్ కోచ్ల పెంపు కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రయాణించే భాగ్యనగర్, గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లకు అప్ అండ్ డౌన్ మార్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా ఒక 3 ఏసీ (ఎకనామి) కోచ్ను పర్మనెంట్ పెంపుదల చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. థర్డ్ ఏసీ (ఎకనామి) రైళ్ల కోచ్ల వివరాలు.. జూలై 13వ తేదీ నుంచి సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233) భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, జూలై 14వ తేదీ నుంచి సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్ (17234) భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, జూలై 13 తేదీ నుంచి గుంటూరు–సికింద్రాబాద్ (17201) గోల్కొండ ఎక్స్ప్రెస్, జూలై 14వ తేదీ నుంచి సికింద్రాబాద్–గుంటూర్ (17202) గోల్కొండ ఎక్స్ప్రెస్, జూలై 13వ తేదీ నుంచి విజయవాడ–కాచిగూడ (12713) శాతవాహన ఎక్స్ప్రెస్, జూలై 13వ తేదీ నుంచి కాచిగూడ–విజయవాడ (12714) శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లకు థర్డ్ ఏసీ (ఎకనామి) కోచ్లు పెంచినట్లు సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. కోతుల బెడదను నివారించాలని రాష్ట్రపతికి ఉత్తరం ● పోస్ట్ చేసిన మహబూబాబాద్ జిల్లా గార్లవాసి గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో కోతుల బెడదను నివారించాలని కోరుతూ గార్లకు చెందిన కందునూరి ఈశ్వర్లింగం మంగళవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసి స్పీడ్పోస్ట్ చేశారు. మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఇళ్లల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే భయపడుతున్నారని, ఇక పత్తి, వరి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయన్నారు. పలుమార్లు కలెక్టర్, అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఉత్తరం ద్వారా వివరించారు. కోతుల సమస్యపై జిల్లాలో ఎవరూ పట్టించుకోకపోవడంతోనే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జికి ఉత్తరం రా సి పోస్ట్ చేసినట్లు ఈశ్వర్లింగం వెల్లడించారు. -
ఆలోచన అదుర్స్..
పాలకుర్తి టౌన్ : సాధారణంగా పానీ పూరి బండి ఒక ప్రాంతంలో ఆ రహదారిపైనే కనిపిస్తుంది. లేదా షాపులో మాత్రమే ఉంటుంది. వినియోగదారులు అక్కడికెళ్లి మాత్రమే తినాల్సి ఉంటుంది. అయితే ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. వినియోగదారులు వ్యాపారి వద్దకు కాకుండా వ్యాపారే వినియోగదారుడి వద్దకు వెళ్లేలా కొత్తగా ఆలోచించాడు. అనుకున్నదే తడువుగా బైక్(మొబైల్ పానీ పూరి)కు పానీపూరి బండి అమర్చి నేరుగా వినియోగదారుల వద్దకే వెళ్లి విక్రయిస్తున్నాడు. అతనే పాలకుర్తి మండలం టీఎస్కే తండాకు చెందిన బానోత్ రమేశ్. బైక్ను సగభాగం వరకు తొలగించి పానీపూరి డబ్బాను ఆల్ట్రేషన్ చేసి అందంగా ముస్తాబు చేసి పాలకుర్తి మండల కేంద్రంలో విక్రయిస్తున్నాడు. దీంతో ఈ మొబైల్ పానీపూరి బండిని చూసిన వినియోగదారులు ఆలోచన..అదుర్స్ అంటూ కొనియాడుతున్నారు. బైక్కు రూ. 80వేలకు కొనుగోలు హైదరాబాద్లో పానీపూరి డబ్బాను ఆల్ట్రేషన్ చేసినట్లు రమేశ్ తెలిపారు. కాగా, రమేశ్ పానీపూరిని ముందస్తుగానే వివాహ, శుభకార్యాలకు భోజన ప్రియులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. బైక్కు పానీపూరి బండి ఏర్పాటు ఆకట్టుకుంటున్న మొబైల్ పానీపూరి వాహనం -
ఎమ్మార్టీ విభాగంలో ఉపయోగం లేని ఎఎల్ఎం పోస్టుల సృష్టి..
ఎమ్మార్టీ విభాగానిది కీలక పాత్ర.. టీజీ ఎన్పీడీసీఎల్లో ఎమ్మార్టీ విభాగానికి కీలక భూమిక. సబ్ స్టేషన్లు, డీటీఆర్ల నిర్వహణ్యలో వీరి పాత్ర కీలకం. వీటితోపాటు సీటీ, హెచ్టీ, ఎల్టీ మీటర్లను రోటేషన్ పద్ధతిలో పరీక్షిస్తుంటారు. సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ బాధ్యత కూడా వీరిదే. ఏ మాత్రం అలసత్వం వహించినా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడమో, నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల లోపాలను సరిదిద్దేది ఈ విభాగం ఉద్యోగులే. విద్యుత్ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న వీరిపై యాజమాన్యం వివక్ష ధోరణి అనుసరించడంతో విసిగిపోతున్నారు. -
ఆదివాసీ సంస్కృతి ప్రకారమే జాతర నిర్వహించాలి
ఎస్ఎస్తాడ్వాయి : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మేడారం జాతర నిర్వహించాలని పూజారులు కోరారు. గత నెల 3వ తేదీన రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్, మంత్రి సీతక్క మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం మాస్టర్ ప్లాన్లోని శాశ్వత నిర్మాణాలను పరిశీలించారు. గద్దెల డిజైన్లోని మార్పులు, చేర్పులపై పూజారుల అభిప్రాయాలు స్వీకరించేందుకు వారితో సమావేశం నిర్వహించాలని శైలజారామయ్యార్ ఆదేశించారు. దీంతో మంగళవారం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో కలెక్టర్ దివాకర్ టీఎస్.. సమ్మక్క, సారలమ్మ పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వనదేవతల గద్దెల డిజైన్పై పూజారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అమ్మవార్ల గద్దెలపై ఎత్తు బంగారం, కొబ్బరి, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం వలన భక్తులకు సంతృప్తి కలుగుతుందని, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల పైకప్పు డిజైన్ తొలగించాలని కలెక్టర్కు వివరించారు. అమ్మవార్ల గద్దెలను యథావిఽధిగా ఉంచాలన్నారు. పూజారుల అభిప్రాయం మేరకు గద్దెల డిజైన్లో మార్పులు, చేర్పులు చేస్తామని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. మరోసారి ఈనెల 11వ తేదీన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మేడారంలో శాశ్వత అభివృద్ధి నిర్మాణ పనులకు పూజారులు సహకరించాలన్నారు. సమావేశంలో ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కొక్కెర రమేశ్, చందా రఘుపతి, కాక సారయ్య, కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన అరుణ్కుమార్, భోజారావు, సిద్ధబోయిన రమేశ్, పూజారులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కోరిన పూజారులు మేడారం మాస్టర్ ప్లాన్పై సమావేశం అభిప్రాయాలు వెల్లడించిన పూజారులు -
సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ చర్యలు
వరంగల్ క్రైం: ద్విచక్రవాహనాలకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు మారిస్తే వాహనదారుడితోపాటు మార్చిన మెకానిక్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్రావు హెచ్చరించారు. అధిక శబ్దం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కేయూసీ జంక్షన్ వద్ద రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్రవాహనాలకు ఏర్పాటు చేసిన అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను గుర్తించి తొలగించినట్లు పేర్కొన్నారు. వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్డురోలర్తో ధ్వంసం చేసినట్లు వివరించారు. ఇందులో హనుమకొండకు చెందిన 275, కాజీపేట 111, వరంగల్వి 75 ౖసైలెన్సర్లు ఉన్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాల సైలెన్సర్లను మార్చడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతోపాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ శబ్దం చేసే ద్విచక్రవాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన పే ర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రా మకృష్ణ, సీతారెడ్డి, వెంకన్న, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్రావు రోడ్డు రోలర్తో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ధ్వంసం -
ప్రభుత్వాలవి కార్మిక వ్యతిరేక విధానాలు
హన్మకొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరా డి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూల నాలుగు కోడ్లు తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. బుధవారం జరిగే సమ్మె కు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ మద్దతు ఇచ్చిందన్నారు. అయితే 10 పని గంటల విధానాన్ని తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 282 జారీ చేసిందని దుయ్యబట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సారంగపాణి, ఐఎఫ్ టీయూ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు, టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ, మున్సిపల్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకుడు ధర్మరాజు మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఏకశిల పార్కు నుంచి సుబేదారిలోని కలెక్టరేట్ వరకు ర్యాలీ తీయనున్నట్లు తెలిపారు. టీఎస్ టీయూసీ నా యకుడు శ్యాం, మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ, బీఆర్టీయూ నాయకుడు నాయిని రవి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి
కొత్తగూడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. గ్రామాల్లో లబ్ధిదారులను పంచాయతీ కార్యదర్శులు తప్పుతోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ అంటూ కొర్రీలు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లబ్ధిదా రులు ఎవరైనా ఇల్లు నిర్మించుకోలేము అని తెలిపితే వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తామని అన్నారు. నిర్మాణ పనులను హౌసింగ్ శాఖ పర్యవేక్షణ పెంచాలని ఏఈ లాల్సాబ్కు సూచించారు. రాజన్న పాలనే ఆదర్శం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆదర్శంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి సీతక్క అన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని మండలకేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 108, ఆరోగ్య శ్రీ పథకాలను ఆయన స్ఫూర్తితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల మృతి చెందిన యాదగిరి యుగేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సారయ్య, నారాయణరెడ్డి, మొగిళి, రణధీర్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క -
డేంజర్ దారి!
మరిపెడ రూరల్: జిల్లా మీదుగా వెళ్తున్న 563 జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి గాయాలపాలవ్వడంతో పాటు మృతి చెందుతున్న ఘటనలు ఉన్నాయి. గత శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు వ్యాపించడంతో ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. గుంతను తప్పించబోయి రెండు లారీ లు ఢీకొని ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయినప్పటకీ నేషనల్ హైవే అధికా రులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహిస్తున్నారు. మరిపెడ మండలం మీదుగా.. జాతీయ రహదారి–563 ఖమ్మం నుంచి జిల్లాలోని మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, తొర్రూరు మండలాల మీదుగా వరంగల్కు వెళ్తోంది. కాగా మరిపెడ మండల పరిధిలో రహదారిపై పలుచోట్ల మీటరు లోతు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. ఈ రహదారిలో ప్రయాణించాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. పూడ్చినా.. మూణ్నాళ్ల ముచ్చటే.. వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గత మూడు నెలల క్రితం మండల పరిధిలోని హైవేపై ఏర్పడిన గుంతలను తాత్కాలికంగా పూడ్చారు. అయితే వాహనాల రాకపోకల వల్ల మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఆదివారం ఖమ్మం నుంచి వరంగల్కు లోడుతో వెళ్తున్న లారీ గుంతలోనే నిలిచిపోయింది. పది కిలోమీటర్ల రోడ్డు పరిధిలో సుమారు పది చోట్ల గుంతలు ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా గుంతలను పూడ్చి వాహనదారుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. భయంగా ప్రయాణించాల్సి వస్తోంది.. ఖమ్మం–వరంగల్ హైవే పై ఏర్పడిన గుంతల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది. హైవే అధికారులు ఎప్పటికప్పుడు గుంతలను పూడ్చాలి. – గుగులోతు దేవేందర్, ద్విచక్రవాహనదారుడు, రైప్సింగ్తండాజాతీయ రహదారిపై గుంతలతో తరచూ ప్రమాదాలు విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాహనదారులు గుంతను తప్పించబోయి ఇటీవల రెండు లారీలు దగ్ధం ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సజీవదహనం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులుఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు మరిపెడ మున్సిపాలిటీ పరిధి గణేశ్ వైన్షాపు ఎదుట మండలంలోని వీరారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పెట్రోల్ బంకు వద్ద రహదారిపై ఏర్పడిన గుంతను తప్పించబోయి దంట్లకుంటతండాకు చెందిన ఓ ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. సోషల్ వెల్ఫేర్ గురుకు పాఠశాల వద్ద ఏర్పడ్డ గుంతలో పడి మరో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. అదే గుంత వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్ వేయగా వెనుకాల నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారు గాయాలపాలయ్యారు. ఇవే కాకుండా నాలుగైదు సంవత్సరాల నుంచి రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
అభివృద్ధి పథం..
రూ.400 కోట్ల పనులకు శంకుస్థాపనలు ● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు ● మానుకోటలోని సోమ్లాతండా, కేసముద్రంలో బహిరంగ సభలు ● స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని కార్యకర్తలకు పిలుపుసాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబాబాద్రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. కార్యకర్తల్లో జోష్.. బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు,ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, అధికారులు ఉన్నారు. మంత్రులు ఏమన్నారంటే... – వివరాలు 8లోu -
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్: రాష్ట్రంలో మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని సర్పంచ్ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంగ్ బోడ లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం మానుకోట మండలంలోని సోమ్లాతండాలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనుల శంకుశస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. కాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు నిరసన తె లిపేందుకు అక్కడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకో వడంతో జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బోడ లక్ష్మణ్, లూనావత్ అశోక్ మాట్లాడుతూ.. పాత బిల్లులు క్లియర్ చేయకుండా కొత్త పనులకు శంకుస్థాపనలు చేయడం దారుణమన్నారు. మాజీ సర్పంచ్ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనను అడ్డుకోవడానికి, నిరసన తెలపడానికి వెళ్తున్న వారిని అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. గో బ్యాక్ భట్టి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులను మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలోమాజీ సర్పంచ్లు శ్యామ్, గుట్టయ్య, వెంకట్రెడ్డి, రామచంద్రు, దాము, సుమన్, వెంకన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ల ఆందోళన ఉపముఖ్యమంత్రి వద్దకు వెళ్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు -
తండాల్లో సీత్లా పండుగ సందడి
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం గిరిజన తండాల్లో సీత్లాభవాని పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు సీత్లా భవాని వేడుకలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈమేరకు ఆయా తండాల్లో గిరిజన మహిళలు వ్యవసాయ భూముల వద్దకు గంపలతో చేరుకుని సీత్లాభవాని దేవతకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జంతుబలి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పశుసంపదతో పాటు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. -
కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి
కురవి: కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని రాష్ట్ర లెప్రసీ జాయింట్ డైరెక్టర్ జాన్బాబు అన్నా రు. మంగళవారం బలపాల, కురవి పీహెచ్సీలను ఆయన తన బృందంతో సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాధికి ఉచితంగా మందులు లభిస్తాయని వివరించారు. స్పర్శలేని రాగి రంగు మచ్చలను గుర్తించి వెంటనే చికిత్స అందివ్వాలన్నారు. 2027 నాటికి ఈ వ్యాధి మన దేశం నుంచి నిర్మూలించడానికి సమష్టి బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కుష్ఠు వ్యాధి నిర్మూలన అధికారి విజయ్, పీహెచ్సీ వైద్యాధికారులు స్రవంతి, విరాజిత, యశస్విని, బృందం సభ్యులు సకలారెడ్డి, వెంకటేశ్వరాచారి, శ్రీనివాసరెడ్డి, పారా మెడికల్ ఆఫీసర్స్ ఎల్లయ్య, వరుకరణ్రెడ్డి, వైద్య సిబ్బంది భద్రమ్మ, గౌసుద్దీన్, శోభ, రాజకుమారి, నీరజ, అనురాధ, సుహాసిని, నసీమ, కటాక్ష్మి, జ్యోతి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర లెప్రసీ జాయింట్ డైరెక్టర్ జాన్బాబు -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. -
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
మరిపెడ: గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి అన్నారు. మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ హాజరై హాస్టల్ పరిసరాలు, గదులు, వంటశాల, స్టోర్రూమ్, డైనింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈగలు, దోమలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంట మనుషులు పరిశుభ్రత పాటించాలని సూచించారు. పిల్లలకు ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ స్వామి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విద్యాసాగర్, సుదర్శన్, లక్ష్మీకుమారి, ఏఎన్ఎంలు సరళ, శ్రీదేవి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ రూరల్: జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పరిధిలో పారా లీగల్ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మంగళవారం తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచించిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు నిమిత్తం పారా లీగల్ వలంటీర్లను నియమిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి మహిళ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. విస్తృత పోలీసు బందోబస్తుమహబూబాబాద్ రూరల్: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు పర్యటన సందర్భంగా మహబూబాబాద్ మండలంలోని సోమ్లాతండా గ్రామంలో మంగళవారం విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ, ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో ఐదుగురు డీఎస్పీలు, పదహారు మంది సీఐలు, 55 మంది ఎస్సైలు, జిల్లా పోలీసు శాఖ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది మొత్తంగా 375 మంది బందోబస్తు విధులు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. శాకంబరీగా వీరభద్రస్వామికురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని అర్చకులు మంగళవారం శాకంబరీగా అలంకరించారు. భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భద్రకాళి అమ్మవారు శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాత్రా, సర్వమంగళగా భద్రకాళి హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా 13వ రోజు మంగళవారం అమ్మవారికి మాత్రా, సర్వమంగళ క్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉద యం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించా రు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని మాత్రా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని సర్వమంగళ అమ్మవారిగా అలంకరించి పూజలు చేశారు. -
‘లెక్కలతో సహా వస్తాం.. శాసనసభలో తేల్చుకుందాం’
మహబూబాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాళ్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. తాము చేసిన సవాల్కు సిద్ధమేనని, కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు వచ్చి చర్చకు సిద్ధంగా కావాలన్నారు. ప్రజల పట్ల ఏ మాత్రం నిబద్ధత ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రావాలని, తాము కూడా లెక్కలతో సహా వస్తామని, శాసనసభలోనే తేల్చుకుందామన్నారు మల్లు. ఈ మేరకు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ ఒక పెద్ద మనిషి హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి సవాళ్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి...! నీకు అర్ధం అయ్యింది ఏంటి..?, ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రిని రమ్మని సవాల్ విసిరితే ఆయన్ను రానివ్వడం లేదు. CM సవాల్ ను జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. కేసీఆర్ను రమ్మంటే ఆయన్ను రానివ్వకుండా ప్రెస్ క్లబ్ ఎవరో వచ్చి సవాళ్లు చేస్తున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రెస్క్లబ్కు రమ్మంటావా?, ముఖ్యమంత్రి రేవంత్.. మాజీ ముఖ్యమంత్రిని చర్చకు రమ్మని స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రికి ఏ బేసిన్ గురించి తెలియదు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా.. గోదావరి.. కృష్ణా జలాలు.. బేసిన్ గురించి.. ప్రజలకు తెలియ జేయడానికి చర్చించడానికి సిద్ధం. అసెంబ్లీలో చర్చకు మాజీ ముఖ్యమంత్రి రావాలి’ అని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
నేడు మానుకోటకు ఉప ముఖ్యమంత్రి, ఐదుగురు మంత్రుల రాక
● మహబూబాబాద్, కేసముద్రంలో రూ. 500 కోట్ల పనులకు శంకుస్థాపన సాక్షి, మహబూబాబాద్: పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల నిమిత్తం మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ఉదయం 12 గంటలకు మహబూబాబాద్ రూరల్ మండలం సోమ్లా తండాకు చేరుకుంటారు. అక్కడ రూ. 100కోట్లతో చేపట్టనున్న రోడ్లు, సబ్ స్టేషన్లు, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ పనులకు శంకుస్థాపన చేస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 1.20కోట్ల విలువైన చెక్కులు అందజేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి కేసముద్రం మున్సిపాలిటీకి చేరుకుని అక్కడ రూ. 300 కోట్లతో చేపట్టనున్న డిగ్రీ కళాశాల భవనం, హౌసింగ్ గోదాంలు, కల్వలలో 1322/11 కేవీ సబ్స్టేషన్, మట్టెవాడ, ఉప్పరపల్లి, కేసముద్రంలో నిర్మించనున్న 32/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులు పాల్గొంటారని మహబూబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సోమవారం తెలిపారు. గుండెపోటుతో ఈజీఎస్ ఏపీఓ శ్రీనివాస్ మృతి పాలకుర్తి టౌన్ : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఈజీఎస్ ఏపీఓ కమ్మగాని శ్రీనివాస్గౌడ్(50)గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని జనగామ రోడ్డులో వాకింగ్కు వెళ్లిన శ్రీనివాస్.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. స్థానికులు గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, శ్రీనివాస్ దేవరుప్పుల మండలంలో ఈజీఎస్ ఏపీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. డీఆర్డీఓ పీడీ వసంత, అడిషనల్ డీఆర్డీఓ పీడీ చంద్రశేఖర్.. శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రేవంత్ అసమర్థ పాలనే కారణం.. సీఎం రేవంత్రెడ్డి అసమర్థ పాలన శ్రీనివాస్ను హత్య చేసిందని ఏపీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్రావు అన్నారు. దేవరుప్పుల మండలంలో ఏపీఓగా విధులు నిర్వర్తిస్తున్న కమ్మగాని శ్రీనివాస్గౌడ్ మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. దీంతో మనస్తాపంతో గుండెపోటుకు గురై మృతి చెందారన్నారు. కాగా, ఈజీఎస్ ఏపీఓల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డీఆర్డీఓ పీడీ వసంత హామీ ఇచ్చారు. ఈజీఎస్ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. దేవరుప్పుల : మూడు నెలలు గడిచినా వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ ఏపీఓ కమ్మగాని శ్రీనివాస్ మనోవేదనతో గుండెపోటుకు గురై మృతి చెందారని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీనివాస్ కుటుంబీకులను ఫోన్లో పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం కూలీల సంక్షేమం కోసం కృషి చేసే ఉపాధి హామీ పథక ఉద్యోగులకు రెగ్యులర్ వేతనాలు ఇవ్వకపోవడం రేవంత్రెడ్డి సర్కారు ఆర్థిక దుస్థితికి నిదర్శనమన్నారు. -
కాజీపేటలో రైల్వే ఇన్చార్జ్ జీఎం తనిఖీ
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ సందీప్మాథూర్ తనిఖీ చేపట్టారు. ఇటీవల అదనపు జీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాథూర్.. మొదటి సారి ప్రత్యేక రైలులో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లిలో తనిఖీలు చేసుకుంటూ కాజీపేట జంక్షన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం భర్తీష్కుమార్ జైన్తో కలిసి కాజీపేట రైల్వే స్టేషన్ అమృత్ భారత్ అభివృద్ధి పనులు, ప్రయాణికుల వెయింటింగ్ హాల్, టాయ్లెట్స్ను తనిఖీ చేసి నిర్వహణలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్ఓవర్బ్రిడ్జి, ఎస్కలేటర్, లిఫ్టు నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. లోకోపైలెట్ కార్యాలయం, రూట్రిలే ఇంటర్లాకింగ్ కార్యాలయంలోకి వెళ్లి సిగ్నల్ రిలేలను తనిఖీ చేశారు. తనిఖీల్లో సికింద్రాబాద్ సీనియర్ డీఓఎం సురేశ్రెడ్డి, సీనియర్ డీసీఎం సిఫాలి, సీపీటీఎం ఎలివేందర్ యాదవ్, డీఓఎం జనరల్ సుధీర్, సీనియర్ డీఎస్టీఈ ప్రియ అగర్వాల్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి, ఏసీఎం ఐఎస్ఆర్ మూర్తి, కాజీపేట స్టేషన్మేనేజర్ అగ్గి రవీందర్, కాజీపేట సీనియర్ డీఎంఈ డీజిల్ వెంకటకుమార్, సీనియర్ డీఈఈ ఈఎల్ఎస్ సూర్యనారాయణ, ఏడీఈఎన్ సంతోశ్కుమార్, ఎస్ఎస్ఈ రాజన్న, ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ , జీఆర్పీ సీఐ నరేశ్కుమార్ ఉన్నారు. కాగా, ఇన్చార్జ్ జీఎంకు కాజీపేట రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్బ్రాంచీ కార్యవర్గ సభ్యులు పి.వేదప్రకాశ్, ఎస్.కె.జానీమియా, జి.రాజేశ్వర్, ఎ.సత్యనారాయణ, నరేశ్యాదవ్, నాగరాజు, తిరుపతి యాదగిరి.. డీజిల్ కాలనీలో మంచినీటి సమస్య, క్వార్టర్స్లో విద్యుత్ సప్లయ్, కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కాజీపేట మజ్దూర్ యూనియన్ ఆల్ బ్రాంచీస్ కోఆర్డినేటర్ నాయిని సదానందం, టెక్నికల్ బ్రాంచ్ సెక్రటరీ ఆర్.సమ్మయ్య ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై ఇన్చార్జ్ జీఎం సందీప్మా థూరుకు వినతి పత్రం అందజేశారు. అమృత్ భారత్ పనుల పరిశీలన -
ప్రైవేట్ పాఠశాల బస్సు అడ్డగింత..
గ్రామస్తులతో కలిసి బస్సును అడ్డుకున్న టీచర్లు డోర్నకల్: మండలంలోని తెల్లబండతండాలో సోమవారం ప్రైవేట్ పాఠశాల బస్సును గ్రామస్తులతోపాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. చిలుకోడుకు చెందిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం.. ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం చేస్తూ విద్యార్థుల సంఖ్య పెంచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాయమాటలు చెప్పి ప్రైవేట్లో చేర్పించుకుంటున్నారని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చిలుకోడు ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు తలారి విద్యాసాగర్, రాములు, తెల్లబండతండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సునీత, శంకర్ తదితరులు గ్రామస్తులతో కలిసి ప్రైవేట్ బస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. దీనిపై తల్లిదండ్రులు స్పందించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. -
రెండూ అవసరమే
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కనులపండువగా కేయూ స్నాతకోత్సవం విలువలు, నైపుణ్యాలుకేయూ క్యాంపస్: విలువలు, నైపుణ్యాలు రెండు అవసరమేనని, వృత్తిపర విజయానికి విలువలతో కూ డిన జీవితంపై విద్యార్థులు దృష్టిసారించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కేయూ 23వ స్నాతకోత్సవంలో గవర్నర్.. చాన్స్లర్గా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాం మాటలను గుర్తుచేస్తూ విజ యం కోసం కష్టాలు అవసరం అన్నారు. వైఫల్యాలకు భయపడకుండా దానిలోని విజయం కోసం బీ జాలు పండించాలన్నారు. మనిషి జీవితంలో ఇబ్బందులు వస్తుంటాయన్నారు. ఎందుకంటే ఆ విజయాన్ని ఆస్వాదించేందుకు ఇబ్బందులు అవసరమన్నారు. వైఫ్యలానికి భయపడొద్దన్నారు. వైఫల్యాన్ని ఆలింగనం చేసుకోండి.. దానినుంచి నేర్చుకోండి.. ప్రతి అడ్డంకికి మీ మెట్టు మారనివ్వండి అన్నారు. 21వ శతాబ్దానికి నైపుణ్యాలు అవసరమన్నారు. వి మర్శనాత్మక ఆలోచనలు, సృజనాత్మకత, సహకారం ఉత్పుకత, కమ్యూనికేషన్ వంటి ఐదు ‘సీ’లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యువత విజయానికి అవే మార్గదర్శకాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ యాభై సంవత్సరాల క్రితం స్థాపించినప్పుడు ఇది ఉత్తర తెలంగాణకు ఉన్నత విద్యలో రూపాంతర ప్రయాణానికి నాందిపలికిందన్నారు. 672 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. 27 విభాగాలతో 500కుపైగా కళాశాలలను కలిగి ఉందన్నారు. విశ్వవిద్యాలయం విస్తృత విద్యావ్యవస్థగా ఎదిగిందన్నా రు. 2023 కేయూ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించిందన్నారు. 2024లో ఎన్ఐఆర్ఎఫ్లో 151–200 ర్యాంకు సాధించిందన్నారు. ఫార్మాస్యూ టికల్ సైన్సెస్ కా లేజీ జాతీయస్థాయిలో 84వ స్థానంలో ఉందన్నారు. ఈ విజయాలు పరిమిత వనరుల మధ్య విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు కృషికి ఫలితమన్నారు. డీఎస్టీ, సీఎస్ఐఆర్, ఐసీఎంఆర్, యూ జీసీ, ఐసీఎస్ఆర్ ఏజెన్సీల మద్దతు కూడా గుర్తుచేశారు. మీ స్వప్నాల వేటకు ఇది మేల్కోనే క్షణమన్నారు. మీరు కేవలం డిగ్రీలు పొందలేదని ఒక బాధ్యత, ఆశయాన్ని దేశాభివృద్ధిలో భాగస్వామిగా మారే అవకాశాన్ని స్వీకరించారన్నారు. కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం విద్య, వికాసం, ఆశ, నూతన ఆరంభాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. కేరీర్లోనే కాకుండా భవిష్యత్లో ఇంకా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రారంభంలో పీహెచ్డీ పట్టభద్రులకు, గోల్డ్మెడల్స్ సాధించిన వారికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అభినందనలు తెలిపారు. మీడియం అవరోధం కాదు.. ప్రశ్నలడగడం నేర్చుకోవాలి కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి విద్యార్థుల శక్తిని ఉపయోగించాలన్నా రు. భాషామాధ్యమం మన అభివృద్ధికి అవరోధం కాదని, విజేతలుగా విద్యార్థులు నిలవడంలో తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితుల పాత్ర ను గుర్తుచేస్తూ విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రులు, గురువుల పాత్ర కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి తన సొంత జీవన ప్రయాణాన్ని పంచుకున్నారు. తనది నల్లగొండలో చిన్న గ్రామమన్నారు. తెలుగు మీడియంలో డిగ్రీ వరకు విద్యనభ్యసించి ఇంగ్లిష్తో పోరాడుతూ పేపర్ బాయ్గా పని చేసిన అనుభవాలను వివరించారు. తాను ఐఐసీటీ డైరెక్టర్గా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి విద్యార్థికి ‘మీ గతం కాదు, మీ లక్ష్యానికి మీరు చేసే ప్రయాణమే అసలైన నిర్వచనం’ అని సందేశమిచ్చారు. కేయూ అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి.. యూనివర్సిటీ విద్యాపరంగా, పరిశోధనపరంగా, అభివృద్ధి పరంగా ఎదుగుతున్న తీరు రిపోర్టు రూపంలో అందించారు. కేయూ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కలిగి ఉండి 50 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతోందని, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు కూడా నిర్వహించుకోబోతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కూడా తెలిపారు. స్నాతకోత్సవంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, డీన్లు గాదె సమ్మయ్య, బి.సురేశ్లాల్,జి. హనుమంతు, శ్రీనివాస్, సదానందం, కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, సెనెట్ సభ్యులు, మాజీ వీసీలు ఎన్. లింగమూర్తి, బి.వెంకటరత్నం, అంపశయ్య నవీన్, కేయూ పాలకమండలి సభ్యులు మల్లం నవీన్, సుకుమారి, అనితా రెడ్డి, బాలు చౌహాన్, సుదర్శన్, రమ, చిర్రరాజు, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్డీ అవార్డులు పొందని అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలు, వివిధ కోర్సుల్లో గోల్డ్మెడల్స్సాధించిన అభ్యర్థులకు గోల్డ్మెడల్స్ను రాష్ట్రగవర్నర్ జిష్ణుదేవ్వర్మ.. శ్రీనివాస్రెడ్డి, వీసీ ప్రతాప్రెడ్డితో కలిసి ప్రదానం చేశారు. గవర్నర్కు చేనేత జ్ఞాపిక అందజేత న్యూశాయంపేట: వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ కలెక్టర్లో సోమవారం టీబీపై జరిగిన సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హాజరయ్యారు. ఓరుగల్లు ప్రత్యేకత గుర్తుండేలా జీఐ ట్యాగ్ పొందిన చపాట మిర్చి, కాకతీయ కళాతోరణం ప్రతిబింబించిన వరంగల్ చేనేత డర్రీ జ్ఞాపికను కలెక్టర్ సత్యశారద.. గవర్నర్కు అందజేశారు. -
నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
డోర్నకల్: జిల్లాలో నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న ఆదేశించారు. పలు గ్రామాల్లో మిరప, కూరగాయల నర్సరీలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సరీ నిర్వాహకులు యాజమాన్య పద్ధతులతో పాటు నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నారుకు సంబంధించిన రైతుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, ఆరుబయట నారు పెంచొద్దని సూచించారు. లైసెన్స్ లేకుండా ఎలాంటి విక్రయాలు చేపట్టొద్దని, నిబంధనలు పాటించని, నకిలీ విత్తనాలతో నారు పెంచేవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సరీదారులు, రైతులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ విచారణ
గార్ల: కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని సాక్షి దినపత్రికలో ‘వసూళ్ల పర్వం!’ అనే శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారద కిందిస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించి, సిబ్బందిని విచారించినట్లు తెలిసింది. కొత్త రేషన్కార్డుల మంజూరులో సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక నుంచి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు ఇస్తామని తహసీల్దార్ తెలిపారు. కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలిమహబూబాబాద్ రూరల్ కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని లెప్రసీ ప్రోగాం ఆఫీసర్ విజయ్కుమార్ అన్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ.. కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందితే పూర్తిగా నిర్మూలించవచ్చని సూచించారు. వ్యాధికి ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎండీటీ చికిత్స అందుబాటులో ఉందని, బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన బృందం సభ్యులు, వెంకటాచారి, సుకులారెడ్డి, శ్రీని వాసరెడ్డి, డీపీఎంఓ వాల్యా, మౌనిక, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాగర్, హెచ్ఈఓ శ్రీనివాస్, హెచ్వీ పుష్పలీల, పీడీఎంఓలు, ఎంఎల్హెచ్పీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు నెల్లికుదురు: రైతుల పంటలకు విద్యుత్, ఎస్సారెస్పీ సాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అధికారులను హెచ్చరించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సాగునీరు, విద్యుత్ సమస్యలపై సోమవారం ఆయాశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు కాల్వల ద్వారా నీటిని తరలించాలన్నారు. గ్రామాల్లో చిన్నచిన్న విద్యుత్ సమ్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద నరేశ్, ఎంపీడీఓ బాలరాజు, విద్యుత్, ఇరిగేషన్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
మహబూబాబాద్: నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అడ్మిషన్ల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026–27 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల అయినట్లు పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానికులై ఉండాలని, 2025–26 విద్యాసంవత్సరంలో ఐదో తగతి చదువుతూ ఉండాలన్నారు. 2014 మే 1నుంచి 2016 జూలై 31వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3,4 తరగతులు పూర్తి చేసి ఉండాలన్నారు. 2025 డిసెంబర్ 13న పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9110782213, 7993263431 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ, ఉపాధ్యాయుడు సురేశ్, లైబ్రేరియన్ లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. -
సమ్మెను జయప్రదం చేయండి
నెహ్రూసెంటర్: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, పనిగంటల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఏఐటీయూసీ. ఐఎఫ్టీయూ, టీయూసీఐ, కార్మిక సంఘాల నాయకులు కుంట ఉపేందర్, రేషపల్లి నవీన్, శివ్వారపు శ్రీధర్, ఎస్కే మదార్, కొత్తపల్లి రవి మాట్లాడుతూ.. కార్మికులు ఈనెల 9న దేశవాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పని గంటల తగ్గింపు, లేబర్కోడ్ల రద్దు, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు, కార్మికులకు కనీస వేతనం అమలు వంటి డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో ఆకుల రాజు, కుమ్మరికుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, గారే కోటేశ్వర్రావు, మంద శంకర్, చెక్కల సోమయ్య, మధుసూదన్, జక్క రయ్య, పర్వత కోటేష్, హలా వత్ లింగ్యా, కృష్ణ, భాస్కర్రెడ్డి, బండపల్లి వెంకటేశ్వర్లు, వంగూరి వెంకన్న, బిల్లకంటి సూర్యం, పాయం చంద్రన్న, సత్యం, పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఇన్చార్జ్గా అడ్లూరి లక్ష్మణ్కుమార్
● సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి ● వీరి ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు! సాక్షిప్రతినిధి, వరంగల్: సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి పర్యటన తర్వాత ఆ పార్టీ హైకమాండ్ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన అధిష్టానం.. సోమవారం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్కు పార్టీ ఇన్చార్జ్గా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ను నియమించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్కుమార్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖను కేటాయించారు. నల్లగొండ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న లక్ష్మణ్కుమార్ పార్టీ ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్లో ఇటీవల నెలకొన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ సోమవారం లక్ష్మణ్కుమార్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలవనుండగా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సంస్థాగత కమిటీలు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్ లను నియమించిన అధిష్టానం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేసే బాధ్యతలను అప్పగించినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
భట్టిగారూ.. బాధలు తీర్చండి
సాక్షి, మహబూబాబాద్: సారవంతమైన భూములు, ఇనుప ఖనిజాలకు నెలవు.. కష్టించి పనిచేసే కార్మికులు, కర్షకులు ఉన్నప్పటికీ మానుకోట జిల్లా ఆశించినస్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. జిల్లాలో పేరుకు పెద్ద చెరువు అయిన బయ్యారం చెరువు వర్షాలు కురిస్తేనే నిండే పరిస్థితి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన కళాశాలల భవనాలకు నిధులు లేవు.. చదువుకున్న వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పట్టణా లకు వలస వెళ్తున్నారు. కాగా ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు తొలిసారిగా మంగళవారం వస్తున్న నేపథ్యంలో భట్టిగారూ.. నిధులు ఇచ్చి బాధలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. బయ్యారానికి సాగునీరు ఇవ్వండి.. ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన భూములను గుర్తించిన కాకతీయలు బయ్యారం చెరువు నిర్మించారు. పేరుకు పెద్ద చెరువుగా ఉన్నా.. చెరువులోకి నీళ్లు రావాలంటే.. వర్షాలు కురవాలి. వాగులు పొంగాలి.. అంతే కానీ ఏ ప్రాజెక్టు నీళ్లు చెరువుకు వచ్చే పరిస్థితి లేదు. చెరువులోకి నీళ్లు తీసుకువచ్చేందుకు ముందుగా సీతారామ ప్రాజెక్టు డిజైన్ చేసినట్లు ప్రచారం జరిగినా.. ప్రాజెక్టు డిజైన్లో బయ్యారం కనిపించలేదు. ప్రస్తుతం దేవాదుల నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల చెరువుకు గోదావరి నీళ్లు వస్తున్నాయి. అక్కడి నుంచి నీటిని తరలించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 కిలోమీటర్లు పైపులైన్ నిర్మించాలి. ఇంతదూరం వచ్చిన గోదావరి జలాలను గంగారం మండలం పుట్టల భూపతి గ్రామం వద్ద ప్రారంభమయ్యే పందిపంపుల వాగులో పైపులైన్ ద్వారా చేర్చాలి. అక్కడి నుంచి కొత్తగూడ, గంగారం మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారం పెద్దచెరువుకు పందిపంపులవాగుల ద్వారా నీటిని తీసుకురావొచ్చని ప్రతిపాదనలు తయారు చేశారు. బయ్యారం పెద్ద చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ద్వారా తులారాం ప్రాజెక్టుకు, కంబాలపల్లి పెద్ద చెరువుకు నీటిని తరలించేవిధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. దీంతో బయ్యారం, గార్ల, కామేపల్లి, ఇల్లెందు మండలాలకు సాగునీరు, ఇల్లెందు, మహబూబాబాద్ పట్టణాలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. బయ్యారం చెరువు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గోదావరి జలాలతో బయ్యారం చెరువు నింపేందుకు కావాల్సిన నిధులు కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరుతున్నారు. భవనాలకు నిధులివ్వండి.. మారుమూల ప్రాంతం మానుకోటలో గిరిజనులు, ఆదివాసీ జనాభా ఎక్కువ. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మానుకోటను జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, అనుబంధ ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల మంజూరు చేశారు. వీటితోపాటు జిల్లాకు మంజూరైన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు ఆర్తి గార్డెన్ దగ్గర 700 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించినట్లు ప్రకటించారు. అయితే ఈ కళాశాలతో మంజూరైన ఖమ్మం కళాశాల భవనాల నిర్మాణం కోసం రూ. 108కోట్లు విడుదల చేశారు. కానీ మహబూబాబాద్ ఇంజనీరింగ్ కళాశాలకు నిధులు మంజూరు చేయలేదు. కాగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నిధుల మంజూరు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ పీజీ కళాశాల, హార్టికల్చర్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నా... భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాక ఇరుకు గదుల్లో తరగతులు కొనసాగుతున్నాయి. వీటికి నిధులు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.బయ్యారం చెరువుకు నీళ్లు ఇవ్వండి భవనాలకు నిధులు కావాలి వనరులు ఉన్నా ఉపాధి కరువు పట్టణాలకు వలస వెళ్తున్న యువత నేడు డిప్యూటీ సీఎం పర్యటనపై జిల్లా ప్రజల ఆశలు యువత వలస బాట వనరులు ఉన్నా.. అనుబంధ పరిశ్రమలు లేకపోవడంతో మానుకోట యువత వలస బాట పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 50వేల మేరకు ఇంటర్, ఆపై చదువులు చదవిన వారు ఉన్నారు. యువతకు ఉపాధి కల్పించిన పెంకు ఫ్యాక్టరీ మూలన పడింది. పెంకు ఫ్యాక్టరీ ప్రాంతంలో గృహ అలంకరణ వస్తువుల తయారీ ఫ్యాక్టరీ నిర్మించాలి. పసుపు, మిర్చి, మొక్కజొన్న ఎక్కువగా పండించే ఈ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి, రైతులకు ప్రోత్సాహం కల్పించినట్లు అవుతుంది. సభా ఏర్పాట్ల పరిశీలన..కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి జ్యోతిరావు పూలే సెంటర్లో మంగళవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో నిర్వహించనున్న బహిరంగ సభాప్రాంగణ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసముద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు, పలువురు మంత్రులు వస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాత్రి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సభా ప్రాంగణాన్ని సందర్శించారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్రావు, వేముల శ్రీని వాస్రెడ్డి, చిదురాల వసంతరావు, రావుల ముర ళి, బండారు వెంకన్న, కదిర సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
దంతాలపల్లి: ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికెన్గున్యా వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి ఆవరణలో దోమల నివారణకు చర్యలు తీసుకునేలా ప్రజలకు వివరించాలన్నారు. వేడి ఆహారం, కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలసుకున్నారు. ఆస్పత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు. రిజిస్టర్లు తనిఖీ చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యులు కవిత, రమ్య, క్లస్టర్ సీహెచ్ఓ కుసుమ విద్యాసాగర్, నర్సింగ్ ఆఫీసర్ పద్మ, సూపర్వైజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలి నెల్లికుదురు: సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కుసుమ విద్యాసాగర్తో కలిసి సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, రజని, పీహెచ్ఎన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు పిల్లలను సాకేదెట్లా..?
మరిపెడ రూరల్: పేద కుటుంబంపై విధి పగబట్టింది. రెక్కల కష్టంపై ఆధారపడిన కుటుంబ పెద్దను అనారోగ్యం రూపంలో కబలించింది. ఫలితంగా భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారిగా మారి రోడ్డున పడ్డారు. కనీసం తిండి గింజలు కూడా లేని దుస్థితి. భర్త అంత్యక్రియలు, దశదిన కర్మలకు గ్రామస్తులే సహకరించారు. అయితే ఇప్పడు ఆ ఇద్దరు పిల్లలను సాకేదెట్లా అంటూ తల్లి భ్రమనంబ గుండెలవిసేలా రోదిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామానికి చెందిన చిదుముల వీరన్న, భ్రమనంబ దంపతులు నిరుపేదలు. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పి ల్లలు రక్షిత్, బ్లెస్సి సంతానం( పది సంవత్సరాల లోపు). ఈ క్రమంలో వీరన్నకు నెల క్రితం విషజ్వరం సోకింది. దీంతో చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులు ఆశ్రయించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రెక్కల కష్టం ద్వారా దాచుకున్న రూ. 50 వేలతోపాటు కొంత అప్పు చేసి భర్త చికిత్సకు ఖర్చు చేసింది. అయినా విష జ్వరం కారణంగా వీరన్నకు కామెర్లు సోకి గత నెల 23వ తేదీన మృతి చెందాడు. వీరన్న అంత్యక్రియలకు కూడా ఇంట్లో చిల్లి గవ్వలేదు. దీంతో ఆ కుటుంబ దీన స్థితి చూసి చలించిన గ్రామస్తులు ముందుకొచ్చి దాహన సంస్కారాలతోపాటు దశదిన కర్మలకు సహకారం అందించారు. నిరుపేద కుటుంబ కావడంతో వీరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అయితే పూట గడవని పరిస్థితుల్లో ఆ ఇంటిని నిర్మించుకోలేని దుస్థితిలో ఉంది ఆ కుటుంబం. గ్రామస్తుల సాయంతో ( ఆర్థిక, నిత్యావసరాలు) భ్రమనంబ ప్రస్తుతం కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తన ఇద్దరు పిల్లలను సాకేదెలా అని కన్నీటి పర్యాంతమవుతోంది. దీనిపై దాతలు స్పందించి ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని భ్రమనంబతోపాటు గ్రామస్తులు వేడుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందించే దాతలు 88973–90368 నంబర్ను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇంటి పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబం దిక్కు లేనివారైన భార్య, ఇద్దరు పిల్లలు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి .. మంజూరైన ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించుకోని దుస్థితి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు -
జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో (అటానమస్) కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 22, 23 తేదీల్లో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆవిష్కరించారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి ఆదివారం తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ విభాగం అధిపతి అరుణ, అధ్యాపకులు ఉదయశ్రీ, బాలరాజు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య హసన్పర్తి: కడుపు నొప్పి బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హసన్పర్తి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన బండి సదానందం(44) ఓ రైస్మిల్లులో ఆపరేటర్గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం పొందినా నయం కాలేదు.దీంతో జీవితంపై విరక్తి చెందిన సదానందం శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు వివిధ ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే ఆదివారం ఉదయం హసన్పర్తిలోని ఓ వెంచర్లో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. కాగా, మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం భూపాలపల్లి అర్బన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సాంబమూర్తి కథనం ప్రకారం.. మహముత్తారం మండలం స్థంభంపల్లి(పీపీ) గ్రామానికి చెందిన గుండు శేఖర్(34) పని నిమిత్తం బైక్పై భూపాలపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని సంతోషిమాత ఆలయం ఎదుట జాతీయ రహదారిపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బారికేడ్ను అదుపు తప్పి ఢీకొన్నాడు. దీంతో రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తున్నట్లు క్రమంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కూతురు ఉన్నారు. -
మనుమడి మృతి తట్టుకోలేక..
కురవి: మనుమడి మృతి తట్టుకోలేక మనోవేదనతో అమ్మమ్మ చనిపోయింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బుర్ర జగదాంబ కుమారుడు శ్రీకాంత్ విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడిగా పనిచేస్తూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన తండా బుచ్చమ్మ(85) ఐదు సంవత్సరాలుగా తన బిడ్డ జగదాంబ ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో మనుమడు శ్రీకాంత్ మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల నుంచి గుండలిసేలా రోదిస్తూ మనోవేదనతో ఆదివారం మృతిచెందింది. దీంతో బుచ్చమ్మ, శ్రీకాంత్ అంత్యక్రియలు ఒకే సారి నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం తీసుకెళ్తుండగా గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.● మనోవేదనతో అమ్మమ్మ కన్నుమూత ● నేరడలో విషాదఛాయలు -
వినియోగంలోకి కొత్త పోస్టులు..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్కు కొత్తగా మంజూరైన పోస్టులను వినియోగంలోకి తీసుకొస్తూ కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల వారీగా కేటాయింపులు చేశారు. టీజీ ఎన్పీడీసీఎల్లో ఏళ్లుగా వినియోగంలో లేని 216 అన్ యూజ్డ్ పోస్టులు, ఖాళీగా ఉంటున్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేస్తూ నూతనంగా 339 ఉద్యోగాలు మంజూరు చేసింది. ఈ పోస్టులను కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్, డివిజన్లు, ఇతర విభాగాల వారీగా పంపిణీ చేశారు. ఈ మేరకు శనివారం టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సర్కిళ్ల వారీగా విభజన.. కొత్తగా మంజూరైన చీఫ్ ఇంజనీర్ పోస్టును కార్పొరేట్ కార్యాలయం సీఈ ప్లానింగ్, ఐటీ, స్వ్వాడ్గా నిర్ణయించారు. చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టును కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎం ఆడిట్గా, జాయింట్ సెక్రటరీ పోస్టును లీగల్, రిక్రూట్మెంట్ జాయింట్ సెక్రటరీగా, ఇప్పటికే ఉన్న జాయింట్ సెక్రటరీ పోస్టును మెడికల్, పెన్షన్ జాయింట్ సెక్రటరీగా రీ డిజైన్ చేశారు. కొత్తగా మంజూరైన నాలుగు ఎస్ఈ పోస్టుల్లో ఒకటి కార్పొరేట్ కార్యాలయానికి కేటాయించారు. అయితే కార్పొరేట్ కార్యాలయంలో డీపీఈ పోస్టు ఒకటే ఉండగా మరోటి రావడంతో వీటిని సర్కిళ్ల వారీగా విభజించారు. డీపీఈ–1 కింద హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం సర్కిళ్లు, డీపీఈ–2 కింద కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ సర్కిల్ ఉండేలా పునర్విభజించారు. ఒక ఎస్ఈ పోస్టును ములుగు సర్కిల్కు, మరో రెండు ఎస్ఈ పోస్టుల్లో ఒకటి కార్పొరేట్ కార్యాలయం కమర్షియల్ ఎస్ఈగా, మరోటి ఎంకై ్వరీస్ ఎస్ఈగా కేటాయించారు. జనరల్ మేనేజర్ ఒకటి మంజూరు కాగా దీనిని కార్పొరేట్ కార్యాలయం రిక్రూట్మెంట్గా, ఇప్పటికే ఉన్న జీఎం పోస్టును మెడికల్, పెన్షన్ విభాగం జీఎంగా రీడిజైన్ చేశారు. మంజూరైన నాలుగు డివిజనల్ ఇంజనీర్ పోస్టులలో కాటారం డివిజన్, ములుగు సర్కిల్ డీఈ టెక్నికల్, మధిర డివిజన్, కార్పొరేట్ కార్యాలయానికి ఒక డీఈ పోస్టుగా పంపిణీ చేశారు. నాలుగు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్కు కేటాయించారు. ఆరు ఏడీఈ పోస్టులను ములుగు ఎస్ఈ కార్యాలయం, మహదేవపూర్ సబ్ డివిజన్, తాడ్వాయి సబ్ డివిజన్కు ఒక్కొక్కటి, మరో మూడు పోస్టులు కార్పొరేట్ కార్యాలయానికి అలాట్ చేశారు. అకౌంట్స్ ఆఫీసర్ పోస్టును ములుగు సర్కిల్కు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు రెండు మంజూరు కాగా ఒకటి ములుగు సర్కిల్కు, మరోటి అశ్వరావుపేట ఈఆర్ఓకు కేటాయించారు. పర్సనల్ ఆఫీసర్ పోస్టులు నాలుగు మంజూరు కాగా వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ సర్కిల్కు అలాట్ చేశారు. అలాగే, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్స్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ లైన్మెన్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్వీపర్ పోస్టులను సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లు, సెక్షన్ల వారీగా అలాట్ చేశారు. కొత్త పోస్టులతో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ములుగు సర్కిల్తో పాటు, ములుగు సర్కిల్ పరిధిలో కాటారం, ఖమ్మం జిల్లాలో మధిర నూతన డివిజన్గా, ములుగు జిల్లాలో మహదేవ్పూర్, తాడ్వాయి సబ్ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.టీజీ ఎన్పీడీసీఎల్కు 339 ఉద్యోగాలు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కంపెనీ అవసరాల మేరకు కేటాయింపు.. -
భక్తి శ్రద్ధలతో మొహర్రం
ఖిలా వరంగల్: మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రంను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ ఎల్బీనగర్ మోమిన్పురా, ఖిలా వరంగల్ మధ్యకోటలో మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి పీరీలకు పూలు, దట్టీలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీపీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ పీరీల ఊరేగింపు నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ సమీపంలోని పీరీల బావిలో రాత్రి 12 గంటలకు నిమజ్జనం చేసి ఘనంగా నివాళులర్పించారు. -
దివ్యాంగులకు శుభవార్త..
కాజీపేట: దివ్యాంగులకు శుభవార్త. రైల్వే శాఖ ఇటీవల (రెండు,మూడు నెలలు) నుంచి పాస్ పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఆన్లైన్లోనే అందజేస్తోంది. దివ్యాంగులు గతంలో రైల్వే శాఖ అందించే రాయితీ పాస్ల కోసం స్టేషన్లోని బుకింగ్ కౌంటర్ వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అన్ని ధ్రువపత్రాలు, ఫొటోలు ఇచ్చినా ప్రక్రియ పూర్తయ్యే వరకు పలుమార్లు తిరగాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులు పడలేక కొందరు అసలు పాస్లు తీసుకోవడానికే ముందుకు రావడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 12,500 మంది కి పైగా దివ్యాంగులున్నారు. వారిలో సగం మందికిపైగా రైల్వే పాస్లు లేవు. వరంగల్, కాజీపేట, కాజీ పేట టౌన్, మహబూబాబాద్, స్టేషన్ ఘన్పూర్ త దితర ప్రధాన రైల్వే స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావడ మే అందుకు కారణం. ఈ అంశాలను గమనించిన రైల్వే శాఖ దివ్యాంగ పాస్ ప్రక్రియను సులభతరం చేసింది. రెండు, మూడు నెలల నుంచి ఆన్లైన్లో దివ్యాంగజన్ కార్డులు జారీ చేస్తోంది. ఆన్లైన్ ద్వారా పాస్లు పొందడంతో పాటు ఇప్పటికే ఉన్నవారు నవీకరించుకునే వెసులుబాటు కల్పించింది. నాలుగు దశల్లో పరిశీలన.. ఆన్లైన్ వివరాలు నమోదు చేశాక.. నాలుగు దశల్లో పరి శీలన జరుగుతుంది. అంతా సవ్యంగా ఉంటే.. నెల, నెలన్నర రోజుల్లో కార్డు జారీ చేస్తా రు. అది సమీప రైల్వే స్టే షన్కు వస్తుంది. దరఖాస్తులో పేర్కొ న్న ఫోన్ నంబర్కు సమాచారం రాగానే వెళ్లి కార్డు తీసుకోవచ్చు. ఈ కార్డుతో కేవలం రాయితీ పొందడమే కాకుండా ఐఆర్సీటీసీ ద్వారా టికెట్లు పొందొచ్చు. దరఖాస్తు విధానం ఇదీ... ● divyangianid. indianrail. gov. in వెబ్ సైట్లోకి వెళ్లి ప్రాధాన్య భాషను ఎంపిక చేసుకోవాలి. ఆ భాషలోనే పేజీ ఓపెన్ అవుతుంది. దానిని క్లిక్ చేస్తే దరఖాస్తు వివరాలు వస్తాయి. ఆ ప్రకారం ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీ, పూర్తి చిరునామా తదితర వివరాలు నమోదు చేయాలి. ఫొటోలు అవసరమైనా ధ్రువపత్రాలను పీడీఎఫ్ రూపంలో పొందుపరచాలి. ● తమ ఆధార్ కార్డు, సదరం ధ్రువపత్రం (అందులో వైద్యుడి వివరాలు, రిజిస్ట్రేషన్, వైకల్య స్వభావం స్పష్టంగా ఉండాలి.) ఉండాలి ● జనన ధ్రువపత్రం (ఆధార్, పాన్ కార్డు ఉండాలి, పదోతరగతి ధ్రువపత్రం ఉన్నా పర్వాలేదు) ఫొ టోలను పీడీఎఫ్ ఫార్మట్లో పొందుపర్చాలి. ఆన్లైన్లో రైల్వే పాస్ల జారీ.. బుకింగ్ కౌంటర్ల వద్ద నిరీక్షణకు తెర -
నకిలీ వైద్య కేంద్రాలపై టీజీఎంసీ తనిఖీలు
ఎంజీఎం : నగరంలోని గోపాల్పూర్, యాదవనగర్ ప్రాంతాల్లో నకిలీ వైద్యులు నడుపుతున్న కేంద్రాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) తనిఖీలు నిర్వహించినట్లు టీజీఎంసీ సభ్యుడు వి.నరేశ్కుమార్ ఆదివారం తెలిపారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టెరాయిడ్లు, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్ వంటి ఔషధాలను వాడుతున్న నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గోపాల్పూర్లోని సాదుల్లా మెడికల్ స్టోర్ పని చేస్తున్న ఎండీ అక్బల్ షరీఫ్ మెడికల్ షాప్ వెనుకభాగంలో పడకలతో ఆస్పత్రిలా నడుపుతూ ఐవీ ఫ్లూయిడ్స్, నొప్పి నివారణ ఇంజెక్షన్లు అనధికారంగా ఇస్తున్నారన్నారు. అలాగే, గోపాల్పూర్లోని అంజలి రెడ్డి క్లినిక్లో సి.హెచ్. వెంకట్ రెడ్డి ఎలాంటి విద్యార్హత లేకున్నా 20 సంవత్సరాల నుంచి క్లినిక్ నడుపుతున్నాడు. అలాగే, డిప్లొమా ఇన్ ఓటీ టెక్నీషియన్ చేసిన క్రాంతి కుమార్ యాదవనగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా పేర్కొంటూ బెడ్లు ఏర్పాటు చేసి పేషెంట్లకు హైఎండ్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు ఇస్తున్నారని తనిఖీల్లో బయటపడిందన్నారు. వర్షాకాలంలో వ్యాధులు నిర్లక్ష్యం చేయొద్దని, ఈ సమయంలో నకిలీ డాక్టర్లను/ రూరల్ మెడికల్ ప్రాక్ట్టీషనర్స్ (ఆర్ఎంపీ) సంప్రదించడం వల్ల అనారోగ్యం మరింత పెరగడంతో పాటు వీరి వద్ద ఇచ్చే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, అనవసర యాంటీబయాటిక్స్ వాడకంతో రోగుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి మీ పరిసరాల్లో ఆర్ఎంసీ/ నకిలీ వైద్యులు ఇంజెక్షన్లు వేస్తున్నా, మందులు రాస్తున్నా వెంటనే టీజీఎంసీ వాట్సాప్ నంబర్ 91543 82727కి సమాచారం ఇవ్వాలని నరేశ్ కోరారు. తనిఖీల్లో వరంగల్ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ అన్వర్ మియా, హెచ్ఆర్డీఏ వరంగల్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.వెంకటస్వామి, బృందం పాల్గొన్నారు. పలు వైద్య కేంద్రాలపై కేసులు -
సమగ్రశిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్గా మన్మోహన్
విద్యారణ్యపురి: సమగ్రశిక్షలో (విద్యాశాఖ) హనుమకొండ జిలా క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కూల్ వెలుపల ఉన్న పిల్లల విభాగాలకు కోఆర్డినేటర్గా డాక్టర్ బండారు మన్మోహన్ను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం డీఈఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మన్మోహన్ ఎడ్యుకేషన్లో గౌరవ డాక్టరేట్, జువాలజీలో డాక్టరేట్ పొందారు. 25 సంవత్సరాల ఉపాధ్యాయ అనుభవం కలిగిన ఆయన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్గా పనిచేశారు.దరఖాస్తుకు నేడు చివరి తేదీ న్యూశాయంపేట : సీఎస్ఏటీ 2025–26 ఉచిత శిక్షణ కోసం సోమవారంతో దరఖాస్తు గడువు ముగుస్తుందని ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా సంచాలకుడు కె.జగన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్కు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కేటగిరీ అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ పొందేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నా రు. ఈ పరీక్ష ఈనెల 13న సుబేదారి ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
ఆర్టీసీ కండక్టర్తో ప్రయాణికుడి గొడవ
● చేతిలో ఉన్న ఎస్ఆర్, డబ్బులతో పరుగు ● పట్టుకుని పోలీసులకు అప్పగింత జనగామ: ఆర్టీసీ బస్సులో కండక్టర్తో గొడవపడి టికెట్ వివరాలను నమోదు చేసే ఎస్ఆర్, డబ్బులను ఓ ప్రయాణికుడు ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో జరిగింది. కండక్టర్ శంకర్ కథనం ప్రకారం.. జనగామ డిపోకు చెందిన టీఎస్27టీ7232 నంబర్ గల అద్దె బస్సు సిద్దిపేట నుంచి బయలుదేరింది. జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. టిమ్సర్వీస్ క్లోజ్ చేశానని కండక్టర్ తెలిపారు. అయితే సదరు ప్రయాణికుడు గొడవ చేయడంతో టిమ్ను రీ ఓపెన్ చేసి టికెట్ ఇచ్చాడు. అయినా సదరు ప్రయాణికుడు బూతు పురాణం మొదలు పెట్టాడు. తోటి ప్రయాణికులు సైతం అతడిని వా రించినా వినలేదు. కృష్ణ కళామందిర్ జంక్షన్లోని గాంధీ విగ్రహం వద్దకు రాగానే బస్సు స్లో కావడంతో కండక్టర్ చేతిలో ఉన్న ఎస్ఆర్, డబ్బులు లాక్కుని పరారయ్యాడు. దీంతో కండక్టర్, ప్రయాణికులు కేకలు పెట్టారు. అక్కడే ఉన్న స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించి, డిపో మేనేజర్కు సమాచారం అందించారు. ప్రయాణికుడి పూర్తి వివరాలు తెలియలేదు. -
ఓటమి రేపటి విజయానికి నాంది
వరంగల్ స్పోర్ట్స్: నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అని, క్రీడాకారులు ఓటమికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుౖగైన శిక్షణ, అత్యాధునిక వసతుల కల్పన కోసం సీఎం రేవంత్రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి సొంత గడ్డకు పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 581 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన అథ్లెట్లు ఆగస్టు 3, 4 తేదీల్లో జేఎన్ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి జేఎన్ఎస్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు -
మున్నేరు నీటిని తరలించొద్దు
బయ్యారం: మున్నేరువాగు నీటిని ఈ ప్రాంత రైతుల అవసరాలకు ఇవ్వకుండా, పాలేరు ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బయ్యారంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో మున్నేరు నీటి తరలింపుపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల ఐదున్నర దశాబ్దాల కల అని, గార్ల, బయ్యారం, డోర్నకల్, కురవి, కామేపల్లి మండలాల సాగునీటి అవసరాల కోసం డిజైన్ చేసిన ప్రాజెక్ట్ను ప్రస్తుత పాలకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు విడుదల చేశారన్నారు. వైఎస్సార్ మరణానంతరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇక్కడ ఒక్క ఎకరానికి నీళ్లివ్వకుండా పాలేరుకు నీటిని తరలించుకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. మున్నేరు నీటి రక్షణ కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర నాయకుడు గోపగాని శంకర్రావు, ఎన్డీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, టీవీవీ రాష్ట్ర నాయకుడు విశ్వ, సీపీఎం జిల్లా నాయకుడు మండ రాజన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాత గణేశ్, బి.సూర్యనారాయణ, బాబూరావు, భీముడు, నందగిరి వెంకటేశ్వర్లు, జి.సక్రు, ఏనుగుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య -
మరమ్మతులేవి?
బోనాలతో వెళ్తున్న మహిళలుడోర్నకల్: మండలంలోని మున్నేరువాగు సమీపంలో చాప్లాతండా గ్రామపంచాయతీకి చెందిన శ్మశానవాటిక, వర్మి కంపోస్ట్ షెడ్ ఏడాది క్రితం వరదలతో ధ్వంసమయ్యాయి. కాగా, నాలుగేళ్ల క్రితం వాటిని నిర్మించారు. పనుల అనంతరం అప్పటి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. అయితే గత వానాకాలం జూలై 27న భారీ వర్షాలతో మున్నేరుకు వరదలు రావడంతో వర్మి కంపోస్ట్ షెడ్తో పాటు శ్మశానవాటిన ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదధాటికి ధ్వంసం.. వర్మి కంపోస్ట్ షెడ్ కంపార్ట్మెంట్లతో పాటు శ్మశాన వాటిక బర్నింగ్ ప్లాట్ఫారాలు, టాయిలెట్లు వరద ధాటికి ధ్వంసమయ్యాయి. వర్మి కంపోస్ట్ షెడ్ ధ్వంసమవడంతో చాప్లాతండా గ్రామం నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. శ్మశానవాటిక దెబ్బతినడంతో చనిపోయిన వారి అంత్యక్రియలు మున్నేరువాగు ఒడ్డున నిర్వహిస్తున్నారు. కాగా మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా నేటికీ నిధులు మంజూరు కాలేదు. సపోర్టు కట్టను పట్టించుకోవడం లేదు.. వరదతో మున్నేరు ఆనకట్ట సపోర్టు కట్ట కొట్టుకుపోగా నేటికీ మరమ్మతులు చేపట్టలేదు. నాడు వరదల్లో సపోర్టు కట్ట కొట్టుకుపోవడంతో దిగువ ప్రాంతాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కొన్ని రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్ సపోర్టు కట్టను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు వర్షాకాలం ప్రారంభమై వర్షాలు పడుతుండటంతో మున్నేరువాగుకు వరద వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు వెంటనే స్పందించి వాగు సపోర్టు కట్ట మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఏడాది క్రితం వరదల్లో ధ్వంసమైన శ్మశానవాటిక, వర్మి కంపోస్ట్ షెడ్ పట్టించుకోని అధికారులు -
వసూళ్ల పర్వం!
గార్ల: కొత్త రేషన్కార్డుల మంజూరు కోసం తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్ కార్డు ల కోసం వెళ్తే కార్యాలయ సిబ్బంది సర్వర్ బిజీగా ఉందని, సైట్ ఓపెన్ కావడం లేదని, తర్వాత రమ్మని తిప్పుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నా రు. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కావడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ సిబ్బందికి డబ్బులు ముట్టచెబితే మాత్రం కొత్త రేషన్కార్డులు వెంటనే మంజూరు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయం చుట్టూ తిరగలేక డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని లబ్ధిదారులు అంటున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ శారదను సాక్షి వివరణ కోరగా మా కార్యాలయంలో రేషన్కార్డుల మంజూ రు కోసం ఎవరి వద్దనుంచి డబ్బులు వసూలు చేయ డం లేదు. ఒకవేళ సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త రేషన్కార్డుల మంజూరుకు రూ.3 వేల వరకు వసూలు -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గూడూరు: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు చిట్టె వెంకన్న అధ్యక్షతన మండల, గ్రామ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 8న కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.300 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మరో ఆరుగురు మంత్రులు హాజరవుతారన్నారు. ఆ సందర్భంగా అక్క డ నిర్వహించే బహిరంగ సభకు గూడూరు మండలం నుంచి సుమారు 5నుంచి 6వేల మంది కార్యకర్తలను తరలించి, సభను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నెక్కొండ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ ఎడ్ల నరేష్రెడ్డి, జిల్లా నాయకులు మాధవపెద్ది రమే్శ్చందర్రెడ్డి, ప్రదీప్రెడ్డి, బీరం శ్రీపాల్రెడ్డి, వాంకుడోతు కొమ్మాలు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్రెడ్డి, ఎండి. యాకూపాషా, మండల మల్లేశ్, పెసరి శివ, కన్నబోయిన వెంకన్న, హెచ్ శివ,అర్రెం వీరస్వామి, చంటి స్వామి పాల్గొన్నారు. అదేవిధంగా పీఏసీఎస్ చైర్మన్ చల్ల లింగారెరడ్డి, మాజీ ఎంపీపీ నూనావత్ రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి కేసముద్రంలో జరిగే కాంగ్రెస్ సభ విజయవంతానికి కృషి చేయాలి మండల నాయకులకు పిలుపునిచ్చారు. బహిరంగ సభను విజయవంతం చేయాలి మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని సోమ్లాతండాలో ఈ నెల 8న జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. సోమ్లాతండాలో బహిరంగ సభ, హెలిపాడ్ స్థలాన్ని ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని, అప్రమత్తంగా ఉండాలని, మానుకోట నియోజకవర్గంలో 90 శాతానికిపైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మురళీనాయక్ -
మిషన్.. నిరుపయోగం!
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పలు వాహనాలు నిరుపయోగంగా మారాయి. అధికారులు ఏమాత్రం ఆలోంచించకుండా సుమా రు రూ.55లక్షలతో రోడ్డు స్వీపింగ్ మిషన్, రూ.20 లక్షలతో కాల్వలు శుభ్రం చేసే మిషన్ కొనుగోలు చేశారు. స్వీపింగ్ మిషన్ మానుకోట రోడ్లపై పని చేయడం లేదు. కాల్వలు శుభ్రం చేసే మిషన్ పరిస్థితి కూడా అంతే. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా మూలనపడి ఉంటున్నాయి. వాటితో పాటు నాలుగు ఆటోలు కూడా మూలనపడి తుప్పు పడుతున్నాయి. దీంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష జనాభా.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా.. 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు, 25,000 పైచిలుకు గృహాలు ఉన్నాయి. విద్య, వ్యాపారం, ఉద్యోగ రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపి జనాభా లక్ష దాటుతుంది. అవుట్ సోర్సింగ్లో 205 మంది పని చేస్తుండగా.. వారిలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ట్రాక్టర్లు 11, మూడు చక్రాల ఆటోలు 14, నాలుగు చక్రాల ఆటోలు 19 ఉండగా ప్రతీ రోజు 33 టన్నుల చెత్త సేకరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిగ్నల్ కాలనీ శివారులో ఒక చెత్త డంపింగ్ యార్డు, గాంధీపురం గ్రామశివారులో మరో డంపింగ్ యార్డు ఉన్నాయి. కాగా జనాభాకు తగిన విధంగా పారిశుద్ధ్య కార్మికులు లేరు. కాగా పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. రూ.55లక్షలతో రోడ్డు స్వీపింగ్ మిషన్.. సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం 14వ ఫైనాన్స్ నిధుల నుంచి రూ.55 లక్షల వ్యయంతో రోడ్డు స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారు. అలాగే రూ.20 లక్షలతో కాల్వలు శుభ్రం చేసే జేసీబీ లాంటి మిషన్ కొనుగోలు చేశారు. కానీ మానుకోట రోడ్లపై స్వీపింగ్ మిషన్ పనిచేయడం లేదు. రోడ్డు మీద నడపగానే మిషన్ బుష్లు, ఇతర పరికరాలు ఊడిపోయాయి. దీంతో నాటి నుంచి నేటి వరకు మిషన్ మూలన పడింది. అలాగే కాల్వలు శుభ్రం చేసే మిషన్ కూడా మానుకోట కాల్వల్లో పని చేయడం లేదు. అలాగే రెండు సంవత్సరాల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు మానుకోట మున్సిపాలిటీకి నాలుగు మూడు చక్రాల ఆటోలు బహూకరించారు. ఆబ్యాంక్లో మానుకోట మున్సిపాలిటీ ఖాతా ఉండడం.. లావాదేవీలు జరపడం వల్ల ఆటోలు బహూకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఆటోలు కూడా పనిచేయడం లేదు. సుమారు కోటి రూపాయలు వృథా.. రోడ్డు స్వీపింగ్ మిషన్, కాల్వల శుభ్రం చేసే మిషన్, నాలుగు ట్రాలీ ఆటోలను కలిపితే సుమారు కోటి రూపాయలు వృథా అయ్యాయి. మానుకోట మున్సిపాలిటీ పరంగా రూ.70 లక్షలు, బ్యాంక్ ద్వారా ఆటోలకు రూ.25 లక్షలు, ఇతర వస్తువులు కొనుగుల కలిపి సుమారు కోటి రూపాయలు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. సుమారు రెండున్నర సంవత్సరాలుగా మూలకు పడడంతో.. ప్రస్తుతం వాటి టైర్లు, పరికరాలు పాడైపోతున్నాయి. డ్రైవర్లు లేకనే.. ఇంజనీరింగ్ విభాగం అధికారులు మాత్రం శిక్షణ పొందిన డ్రైవర్లు లేకనే మిషన్లు మూలకుపడ్డాయని చెబుతున్నారు. అయితే కొనుగోలు చేసేటప్పుడు మానుకోట మున్సిపాలిటీ డ్రైవర్లకు అవగాహన ఉందో లేదో తెలుసుకోవాలి. కానీ ఎవరిని సంప్రదించకుండానే తొందరపడి కొనుగోలు చేసి అభాసుపాలయ్యారు. కాగా ఉపయోగపడే విధంగా మార్పులు చేసి వెంటనే వినియోగంలోకి తేవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 15 రోజుల్లో వినియోగంలోకి వస్తాయి.. మిషన్లకు రిపేర్లు ఉన్నాయి. వాటిని మరమ్మతులు చేసి 15రోజుల్లో వినియోగంలోకి తెస్తాం. డ్రైవర్లకు కూడా వాటిని నడిపే విషయంలో శిక్షణ ఇప్పించి ఉపయోగిస్తాం. అవి వినియోగంలోకి వస్తే పారిశుద్ధ్యపరంగా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. –సీహెచ్.ఉపేందర్, మానుకోట మున్సిపల్ డీఈ వృథాగా స్వీపింగ్ మిషన్, ఆటోలు ప్రజాధనం దుర్వినియోగం అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం -
స్నాతకోత్సవానికి వేళాయె..
నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక ● ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ● 387 మందికి పీహెచ్డీ పట్టాలు.. ● 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం ● అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్ల పంపిణీకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387 మంది విద్యార్థుల పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్లో 10 మంది పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. అదేవిధంగా 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్లో 60, సైన్స్ 161, ఫార్మసీ 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 66, సోషల్ సైన్సెస్ 88, ఎడ్యుకేషన్ 25, లా 72, ఇంజనీరింగ్లో 44 మందికి గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. గోల్డ్మెడల్స్ విద్యార్థుల జాబితాలు.. పీహెచ్డీ పట్టాలు పొందే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్కు కూడా ఎంట్రీపాస్లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా విద్యార్థులకు అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది. ముందుగానే గోల్డ్మెడల్స్ ప్రదానం.. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు అభ్యర్థులకు గోల్డ్మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. విద్యార్థులు గోల్డ్మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్డీ విద్యార్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్మెడల్స్ విద్యార్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మందిని 19 బ్యాచ్లుగా చేశారు. అయితే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొందరు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నా రు. కొందరు విదేశాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. పేరెంట్స్ కోసం బయట స్క్రీన్ ఏర్పాటు.. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరి కోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవాన్ని వీరు వీక్షించనున్నారు. కేయూలో భారీ బందోబస్తు.. కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానుండడంతో క్యాంపస్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం స్నాతకోత్సవాన్ని నిర్వహించే ఆడిటోరియం ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీ చేసింది. సోమవారం ఉదయం మరోసారి తనిఖీ చేయనున్నది. కేయూలో పోలీసులు మోహరించారు. కేయూ పోలీస్ స్టేషన్తోపాటు వివిధ పోలీస్టేషన్లకు చెందిన ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది అందులో క్విక్ రెస్పాన్స్ పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తు నిర్వహిస్తారు. ఎంట్రీపాస్లు ఉన్న విద్యార్థులకు వివిధ కమిటీల బాధ్యులకు సభ్యులకు (ఆచార్యులు, ఉద్యోగులు) పాలక మండలి సభ్యులు, సెనెట్ సభ్యులకు ప్రెస్కు ఆడిటోరియంలోకి అనుమతి ఉంటుంది. పలు విద్యార్థి సంఘాల బాధ్యులపై పోలీసులు నిఘా ఉంచారు. గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. అలాగే, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందేవారు వైట్ డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ ఇలా.. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్కు చేరుకుంటారు. ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కాకతీయ యూనివర్సిటీకి ఉదయం 11:25 గంటలకు చేరుకుంటారు. ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనెట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనెట్ సభ్యులు గవర్నర్తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది. ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం ఉంటుంది. అనంతరం గోల్డ్మెడల్స్ విద్యార్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుంది. -
ఘనా, నీలపతాక క్రమాల్లో అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా పదకొండో రోజు ఆదివారం అమ్మవారికి ఘనా, నీలపతాక క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఘనా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని నీలపతాక అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి ఏకాదశి, ఆదివారం సెలవురోజు కావడంతో అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. -
వీరన్న సన్నిధిలో తొలి ఏకాదశి సందడి..
కురవి: కురవిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్నేరు నది నుంచి నూతన జలాలను అర్చకులు, వేదపండితులు తీసుకొచ్చి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. వీరభద్రస్వామికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు రెడ్యాల శ్రీనివాస్, పెనుగొండ అనిల్, దూసకంటి విజయ్, విజయ్, తేజ, పుణ్యమూర్తి, రమేశ్, అభిలాష్, శ్రీకాంత్, బాలకృష్ణ, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్ గౌడ్, చిన్నం గణే్శ్ జనార్దన్రెడ్డి, సక్రునాయక్, సోమ్లా, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దు మహబూబాబాద్ అర్బన్: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదివారం తెలిపారు. ఈ నెల 8న మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఉన్నందున జిల్లా స్థాయి అధికారులు ఆపనుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి రద్దు చేసినట్లు చెప్పారు. రిలే నిరాహార దీక్షలో చిన్నారులు.. కేసముద్రం: ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం తమకు పట్టా పాసుబుక్కులు అందించాలని ఆదివారం మండలంలోని నారాయణపురం గ్రామంలో బాధిత రైతులు తమ పిల్లలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ దారావత్ రవి, పలువురు రైతులు మాట్లాడారు. సాగు చేసుకుంటున్న తమ భూములకు పట్టాదారు పాసుబుక్కులు రాకపోవడంతో ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాసుబుక్కులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పనిగంటల పెంపు ఉత్తర్వులు రద్దు చేయాలినెహ్రూసెంటర్: రాష్ట్రంలో పని గంటల పరిమితిని 8నుంచి 10 గంటలకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల శ్రమ దోపిడీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని గంటలను పెంచుతుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక లేబర్కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని అన్నారు. సమావేశంలో నాగన్న, రాజమౌళి, రాజు, వీరన్న, మల్లయ్య, శ్రీశైలం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ముగిసిన చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేష్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
రేపే కేయూ స్నాతకోత్సవం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈనెల 7న (సోమవారం) నిర్వహించనున్న స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి తెలిపారు. శనివారం కేయూలోని సెనేట్ హాల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీసీ వివరాలు వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్యఅతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి పాల్గొన బోతున్నారని చెప్పారు. సోమవారం ఉదయం11గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి వరంగల్ నిట్కు చేరుకుంటారని అనంతరం బయలుదేరి 11:25గంటలకు కేయూకు రానున్నారని వెల్లడించారు. తొలుత స్నాతకోత్సవానికి సంబంధించి అకడమిక్ సెనేట్ సమావేశం జరుగనుందని తెలిపారు. 387మందికి పీహెచ్డీ పట్టాలు, 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం కేయూలో 2020–25 జూన్ 30వరకు ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఫార్మసీ, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, లా, ఇంజనీరింగ్ విభాగాల్లో 387 మందికి గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్డీల ప్రదానం జరుగనుందన్నారు. అదే విభాగాలకు చెందిన 2016–21వరకు 373 మంది అభ్యర్థులకు 564 గోల్డ్ మెడల్స్ను కూడా స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారని వీసీ ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. స్నాతకోత్సవ వేడుకను అన్ని విభాగాల సహాకారంతో విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది సహకరించి విజయవంతవ చేసేలా సహకరించాలని వీసీ కోరారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ పాల్గొన్నారు.గవర్నర్ పర్యటన ఇలా.. ఈనెల 7న ఉదయం 8:30గంటలకు హైదరాబా ద్లోని రాజ్భవన్ నుంచి బయలుదేరి వరంగల్ నిట్కు 11గంటలకు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే ఉండి ఉదయం 11:15 గంటలకు బయలుదేరి కాకతీయ యూనివర్సిటీకి 11:25 గంటలకు చేరుకుంటారు. ఉదయం 11:30గంటల నుంచి మధ్యాహ్నం 1:15గంటల వరకు స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కలెక్టర్లతో సమావేశం కేయూలో స్నాతకోత్సవం కార్యక్రమం ఉదయం 11:30గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటలకు ముగియనుంది. అనంతరం కేయూ గెస్ట్హౌజ్లో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు కాకతీయ యూనివర్సిటీనుంచి బయలుదేరి 2:10గంటలకు వరంగల్ నిట్ చేరుకుంటారు. 2:30గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30గంటల నుంచి మధ్యాహ్నం 3:15గంటల వరకు వరంగల్, హనుమకొండ కలెక్టర్ల సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పాల్గొంటారు. యాక్షన్ ప్లాన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ టీబీ టీబీ ఆఫీసర్లు, ఐఆర్సీఎస్ రీప్రెసెంటిటీవ్స్ పాల్గొంటారు. ఆ తర్వాత గవర్నర్ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారని సమాచారం. హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం -
స్నాతకోత్సవాన్ని అడ్డుకోవద్దు
కేయూ క్యాంపస్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కాకతీయ యూనివర్సిటీలో నిర్మించేందుకు పాలకమండలి ఆమోదం తెలపగా దాన్ని వెనక్కి తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అంతేగాకుండా ఆమోదాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈనెల 7న కేయూలో జరిగే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని కూడా వివిధ విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం విదితమే. దీంతో కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులతో క్యాంపస్లోని అకడమిక్ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించి, వారితో చర్చలు జరిపారు. హహనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ పాల్గొన్నారు. స్నాతకోత్సవ వేడుకకు సహకరించాలని వీసీ, రిజిస్ట్రార్ విద్యార్థి సంఘాల బాధ్యులను కోరారు. ఈ సందర్భంగా వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు యంగ్ ఇండియా స్కూల్కు ఎట్టి పరిస్థితుల్లోను భూమి ఇవ్వొద్దని యూనివర్సిటీ భూమిని కేటాయిస్తూ పాలక మండలి ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించినట్లు సమాచారం. పాలకమండలి ఆమోదంను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా తమకు పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలని పలు విద్యార్థి సంఘాల బాధ్యులు కోరారని సమాచారం. మరో రెండు విద్యార్థి సంఘాల బాధ్యులు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూమిని కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని యూనివర్సిటీ భూమిలోనే నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. గవర్నర్కు వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం యూనివర్సిటీ సమస్యలపై గవర్నర్కు విన్నవించేందుకు తమకు అవకాశం కల్పించాలని పలు విద్యార్థి సంఘాల బాధ్యులు కోరారు. స్నాతకోత్సవం తర్వాత లంచ్ అయిపోయాక కేయూ గెస్ట్హైజ్ వద్ద గవర్నర్ను కలిసేలా అవకాశం కల్పిస్తామని విద్యార్థి సంఘాల నాయకులకు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, వీసీ ప్రతాప్రెడ్డి తెలియజేశారని సమాచారం. దీంతో విద్యార్థి సంఘాల బాధ్యులు కూడా ఒకే అన్నట్లు తెలిసింది. భూమిని కేటాయించబోమని.. పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలని.. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేయూ భూమిని కేటాయించబోమని వీసీ ప్రతాప్రెడ్డి ఆదివారం వరకు ప్రకటించాలని లేనిచో స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని ఓ విద్యార్థి సంఘం నాయకులు తేల్చిచెప్పారని సమాచారం. అలాగే తమకు పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తామని కూడా వీసీ ప్రకటించి హామీ ఇవ్వాలని లేకుంటే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని మరో విద్యార్థి సంఘం నాయకుడు తేల్చి చెప్పారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో పోలీస్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. వీసీ, రిజిస్ట్రార్, పోలీసు అధికారులు విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు -
‘జూనోటిక్’తో జాగ్రత్త
సంగెం/మహబూబాబాద్/హన్మకొండ : కుక్కలు, పశువులు, కోళ్లు, పక్షులు, ఇతర జంతువుల నుంచి సంక్రమించే జూనోటిక్ వ్యాధుల విషయంలో జంతు ప్రేమికులు, పశుపోషకులు జాగ్రత్తగా ఉండాలి. పశువులు, వాటి పాకల అపరిశుభ్రత తదితర కారణాలతో సుమారుగా 200 రకాల నేడు (ఆదివారం) ప్రపంచ జూనోసిస్ డే ను జరుపుకుంటున్న సందర్భంగా వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తం చేయడంతో పాటు వ్యాధులపై విస్త్రత ప్రచారం కల్పించాల్సి అవసరముంది. ఈ సందర్భంగా సంగెం పశువైద్యాధికారి వల్లె రాజు, మహబూబాబాద్ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కిరణ్కుమార్, వడ్డెపల్లి పశువైద్యశాల వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ పలు సూచనలు చేశారు. పెంపుడు కుక్కలు, ఇతర జంతువుల యజమానులు రేబిస్ నివారణకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. పశువైద్యశాలల్లో రేబిస్ నివారణ టీకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రేబిస్ సోకిన వీధి కుక్కలు కరిస్తే పాడి పశువులు సైతం మృత్యువాత పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. జూనోసిస్ డే సందర్భంగా నేడు (ఆదివారం)ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీకా కార్యక్రమంలో ఉంటుందని పశువైద్యులు తెలిపారు. యజమానులు తమ పెంపుడు జంతువులతో ఉదయం 8 గంటల వరకు పశు వైద్య కేంద్రానికి చేరుకోవాలన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు.. ఇంట్లో పెంచే పెంపుడు కుక్కలకు మొదటిసారి 30 వ రోజు, బూస్టర్ డోస్ 90 రోజులకు, దీంతో పాటుగా ఏటా రేబిస్ నివారణ టీకాలు వేయించాలి. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు రేబిస్ సోకకుండా వ్యాధి నివారణ టీకాలు వేయిస్తూ ఉండాలి. ఈ వ్యాధులు కూడా.. హైడాటిసిస్, ఏకై కోకస్ (అంతర్గత పరాన్న జీవులు) కారణంగా కూడా మనుషులకు జూనోటిక్ వ్యాధులు సోకుతాయి. పశువులు, కుక్కల శరీరంలో ఉండే బద్దె పురుగులు గుడ్లు పెడతాయి. పశువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తింటే బద్దె పురుగుల గుడ్లు మానవుల శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ఇక కోళ్లఫారాల్లో పనిచేసే వారికి, సరిగా ఉడికించని గుడ్లు, మాంసం తిన్నవారికి సాల్మోనుల్లోసిస్ సోకుతుంది. కుళ్లిన ఆహార పదార్థాలు తిన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. పశువులకు రేబిస్ సంక్రమణ ఇలా... పశువులకు పిచ్చికుక్కలు కరవడం ద్వారానే ఎక్కువగా రేబిస్ సోకుతుంది. రేబిస్ ఎక్కువగా కుక్కలు, పిల్లులు, ముంగీసలు, నక్కలు, తోడేళ్లు తదితర జంతువుల ద్వారా చిట్టెలుక నుంచి ఏనుగు వరకు అన్ని క్షీరదాలకు సోకుతుంది. కుక్క కరిచిన తర్వాత వ్యాధి లక్షణాలు 2నుంచి 3 వారాల తర్వాత కనబడుతాయి. మెడ ప్రాంతాల్లో కరిస్తే వ్యాధి లక్షణాలు త్వరగా కనబడుతాయి. పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా ప్రతీ ఏటా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇప్పిస్తే వ్యాధిని అరికట్టవచ్చు. అంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అనేకం. దొమ్మ (అంత్రాక్స్) మటన్ కొట్టే వారికి, గొర్రెలు, మేకలు, పశువులు చనిపోతే చర్మకోసం వాటిని కోసేవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదముంది. కొమ్ములు, చర్మం, ఎముకలతో సంబంధమున్న పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ వ్యాధి సోకవచ్చు. బ్రూసెల్లోసిస్ ఇది డెయిరీఫాంలో పనిచేసే వారికి, పశు వైద్యులకు సోకే అవకాశముంది. పందులను కరిచిన దోమ మనుషులకు కుట్టినప్పుడు మెదడువాపు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పందులను మనుషులకు దూరంగా ఉంచడం, వ్యాధినిరోధక టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి నివారించవచ్చును. పెంపుడు కుక్కలతో జర భద్రం రేబిస్ నివారణకు టీకా తప్పనిసరి నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవంనివారణ చర్యలు..వ్యాధులు సోకిన జంతువులు, కోళ్ల మాంసం, గు డ్లు సరిగా ఉడికించకుండా తినకూడదు. పాడైన, అపరిశుభ్రంగా ఉన్న పాలు, మాంసం, గుడ్లను ఆహారంగా తీసుకోకూకుడు. రేబిస్ సోకిన పశువుల పాలు తాగకూడదు. పాడి పశువులు, జంతువుల పాకలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానికి అనుగుణంగా రోగ నిరోధక టీకాలను వేయించా లి. పెంపుడు కుక్కలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి డీవార్మింగ్ మందులు తినిపించాలి. చనిపోయిన పశువులు, జంతువులను దూర ప్రాంతాల్లో లోతైన గుంతలో సున్నం చల్లి పూడ్చిపెట్టాలి. నేడు ప్రపంచ జూనోసిస్ డే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను నివారించేందుకు చాలా ఏళ్ల పాటు బ్రిటిష్ శాస్త్రవేత్తలు టీకాతో ప్రయోగాలు చేశారు. 1885 జూలై 6వ తేదీన లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో అప్పటి నుంచి ఆ రోజును ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నారు. -
సహకార భావనతోనే సమాజాభివృద్ధి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు హన్మకొండ : సహకార భావనతోనే సమాజాభివృద్ధి సాధ్యమనే నినాదంతో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలపాలని రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీసీబీ కార్యాలయ ఆవరణలో రవీందర్ రావు మొక్క నాటి, మాట్లాడుతూ.. ప్రతి ఏటా జూలై మొదటి శనివారాన్ని అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకుంటారని వివరించారు. సహకార సంస్థల పాత్ర, వాటి ప్రయోజనాలు, సామాజిక ప్రభావాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజేయడమే సహకార దినం ఉద్దేశమన్నారు. 2012లో మొదటి అంతర్జాతీయ సహకార సంవత్సరం నిర్వహించినట్లు గుర్తు చేశారు. 13 సంవత్సరాల తర్వాత ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణలో మహిళా సహకార సంఘాలు, స్వయం సహాయక సమూహాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యువతకు సహకార రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సహకార అధికారి సంజీవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు ఎన్నమనేని జగన్మోహన్ రావు, నరేందర్, సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషా శ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు గొట్టం స్రవంతి, మధు, రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
సంస్థ అభివృద్ధికి పాటుపడాలి
● ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావుహన్మకొండ : సంస్థ అభివృద్ధికి ఉద్యోగ సంఘాలు పాటుపడాలని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.మధుసూదన్ రావు తెలిపారు. శనివారం నక్కలగుట్టలోని హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ మధుసూదన్ రావుకు తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శశికుమార్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఉద్యోగులను అంకితభావంతో పని చేయించడంలో సంఘాలు తమ పాత్రను పోషించాలన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ధరావత్ లక్ష్మణ్ నాయక్, కార్యదర్శి కడెం మహేష్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గొలుసు ఉపేందర్, సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులు, సెక్రెటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కోశాధికారి పాల్గొన్నారు. -
ఇరువర్గాల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
● సోషల్ మీడియాలో పోస్టే ఘర్షణకు కారణం..? రామన్నపేట : వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవాడకు చెందిన తుమ్మలకుంట ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొదట ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన దాడి రెండు కుటుంబాలతో పాటు రెండు ప్రాంతాలకు విస్తరించి సాముహిక దాడికి దారితీసింది. ఇరువర్గాల ఫిర్యాదుతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవాడ తుమ్మలకుంటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సాజిద్, అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి అర్ఫాత్ మధ్య శుక్రవారం సాయంత్రం మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. గాయపడిన అర్ఫాత్ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆగ్రహించిన కుటుంబీకులు రాత్రి 8 గంటలకు సాజిద్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. వెంటనే విషయం తెలుసుకున్న సాజిద్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు 9గంటల సమయంలో అర్ఫాత్ ఇంటికి వెళ్లి వారి ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు గ్రూపులు విడిపోయి ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున దాడి చేసుకునేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో స్థానికులతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింప చేశారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సాజిత్, అర్ఫాత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఆ.. పోస్టే ఘర్షణకు కారణం? శుక్రవారం రాత్రి నగరంలోని తుమ్మలకుంటలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు దాడి చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టే కారణమని చర్చించుకుంటున్నారు. మైనర్లు ప్రేమించుకుంటున్నామని నెపంతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఇరు కుటుంబ సభ్యులు ఘర్షణకు పాల్పడ్డట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఉత్సాహంగా చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని టీటీడీ కల్యాణ మంటపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 112మంది క్రీడాకారులు వచ్చినట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి.కన్నా పేర్కొన్నారు. ఆర్బిటర్లు సీహెచ్ శ్రీని వాస్, డి.ప్రేమ్సాగర్, ఫ్రాంక్లిన్, కట్కూరి అక్షయ్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
నర్సంపేట రూరల్ : పలు చోరీలకు పాల్పడిన కేసుల్లో నిందితులను అరెస్టు చేసి ఆరుగురిని రిమాండ్కు తరలించగా, ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.19.20లక్షల సొత్తును రికవరీ చేసినట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ పేర్కొన్నారు. శనివారం నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అంకిత్ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన పుల్లూరి రాజేష్ (ఆటో డ్రైవర్), నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంటకు చెందిన వర్రెంకి అక్షయ్ కుమార్ (డెకరేషన్ వర్క్), స్నేహనగర్కు చెందిన జెట్టి అక్షయ్, నీరుపల్లి సాయిరాం (మెకానిక్ వర్క్), నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకల ఉదయ్, నర్సంపేటకు చెందిన అలువాల విపిన్, ఖానాపురం మండలం టేకులతండాకు చెందిన ఎండీ సుబాని (బ్యాటరీ వర్క్) అంతా కలిసి గ్రూప్గా ఏర్పడ్డారు. చేసే పనిలో డబ్బులు రాకపోవడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాజేష్ ఆటోలో, ద్విచ క్ర వాహనంపై, విపిన్ స్కూటిపై పగటిపూటలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నర్సంపేటలోని నెక్కొండ రోడ్డులో గల ఫైనాన్స్లో అనుమానం రాకుండా రాజేష్ అతడి స్నేహితుడు ఎండీ సుబాని పేరుతో బంగారం కుదవపెట్టి, వెండి ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకోని జల్సాలకు పాల్పడుతున్నారు. అయితే నర్సంపేట పోలీస్ స్టేషన్లో–6 కేసులు, నల్లబెల్లి పీఎస్లో–1, పర్వతగిరి పీఎస్ లో–1చొప్పున మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. మొత్తం ఏడుగురిలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి ఆటో, ద్విచక్రవాహనం, స్కూటీ, ల్యాప్టాప్, మొబైల్, 13తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 2,000ల నగదు మొత్తం రూ.19.20 లక్షల సొత్తును రికవరీ చేసినట్లు డీసీపీ తెలిపారు. కేసు త్వరగా ఛేదించిన పోలీసులను అభినందించి, రివార్డులను అందించారు. నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు రఘుపతిరెడ్డి, సాయిచరణ్, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆరుగురి రిమాండ్ .. పరారీలో ఒకరు ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ -
చికిత్స పొందుతున్న అన్మ్యాన్ కార్మికుడి మృతి
కురవి : నేరడ గ్రామానికి చెందిన విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడు బుర్ర శ్రీకాంత్ (35) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నేరడకు చెందిన శ్రీకాంత్ 15ఏళ్లుగా విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జూన్ 6వ తేదీన తట్టుపల్లి శివారు చంద్యా తండా గ్రామంలో ఓ రైతు చేను వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని మానుకోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి నడుముకు శస్త్ర చికిత్స చేయించారు. చికిత్స పొందుతున్న శ్రీకాంత్ను ఈనెల 3వ తేదీన ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. విద్యుత్ శాఖ తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
‘కొలంబో’పై సీబీఐ కేసుతో ఉత్కంఠ
కాజీపేట రూరల్ : ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాలపై సీబీఐ కేసు ఘటన అందరిలో ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ హంటర్ రోడ్డు బ్రిడ్జి సమీపంలోని ఫాదర్ కొలంబో మెడికల్ ఆస్పత్రి (ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సీబీఐ కేసు ఘటన మెడికేర్ ఆస్పత్రి వర్గాల్లో, మెడికల్ కాలేజీ వర్గాల్లో దడ పుట్టిస్తోంది. 2023లో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్రావు ఈ మెడికల్ కళాశాలను ప్రారంభించారు. క్యాంపస్లో మెడికేర్ జనరల్ ఆస్పత్రి, ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్నారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మెడికల్ విద్యార్థులకు ల్యాబ్ సదుపాయాలు, బోధన, వసతి, పరికరాలు, ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ సిస్టం మొదలగునవి నిర్వహణ ఉండాలి. మెడికల్ కాలేజీ నిర్వాహణలో నిబంధనలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు అధికార అనుమతుల కోసం ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ ట్రస్టీ మెంబర్ కొమ్మారెడ్డి జోసెఫ్ మెడికల్ కాలేజీల తనిఖీలో అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు రూ.46 లక్షలు లంచం ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో తేలింది. ఈ విషయంలో జోసెఫ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ సీబీఐ కేసు విషయంలో అసలు ఏం జరుగుతుందని ఆస్పత్రి వర్గాలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా కళాశాల నడుస్తుందని కాలేజీ వర్గాలు అంటున్నాయి. ఆస్పత్రి, మెడికల్ కాలేజీ వర్గాల్లో టెన్షన్ టెన్షన్ -
రైతులు రాయితీలను వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్, ఉద్యాన పంటల అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసి ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందాలని తెలిపారు. జిల్లాలో 8 వేల ఎకరాలకుపైగా పామాయిల్ సాగు అవుతుందని, 1,350 ఎకరాల్లో పామాయిల్ దిగుబడి మొదలై ప్రతి రైతు ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరానికిగాను 4,500 ఎకరాల లక్ష్యంతో ఇప్పటి వరకు 663 ఎకరాల్లో మొక్కలు నాటడానికి రైతులు అనుమతి పొందారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి.మరియన్న, రైతులు బానోత్ హరి, సీహెచ్.సంపత్ రెడ్డి, బానోత్ సూర్యం, బానోత్ రాములు, బానోత్ వెంకన్న, భూక్య బాలకిషన్, బానోత్ పద్మ, భూక్య పద్మ, భూక్యా శివలాల్, భూక్యా శైలజ, డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, మండల ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు బాలాజీ, షాహీన్, టీజీ ఆయిల్ ఫెడ్ క్షేత్ర సిబ్బంది శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ -
ఆషాఢ మాసంలో మైదాకుపై మహిళల ఆసక్తి
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ జీన్స్ పాయింట్లు, బికినీ డ్రెస్లు వేసుకొని ఆడ, మగ తేడా లేకుండా తయారు అవుతు న్న ఈ రోజుల్లో మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే విధంగా పండుగలు నిర్వహించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ దుస్తులు, నిండైన వస్త్రధారణతో పండుగలు నిర్వహించుకుంటారు. కాలనీ లోని పెద్దలు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మికత చరిత్ర, ఆయుర్వేద గుణాలను రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. కాగా, సెవెన్ హిల్స్ కాలనీలో నిర్వహించిన గోరింట పండుగలో కోట నిర్మల, తోట శిరీష, బొమ్మనపల్లి సువర్ణ, ప్రియాంక, నందిని, శ్రీలత, విజయ, జ్యోతి, అరుణ, కవిత తదితరులు ఆనందంగా పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuప్రకృతితో మహిళలది విడదీయలేని అనుబంధం.. భూమాతను పూజించాలన్నా.. పూల పండుగ బతుకమ్మను పేర్చాలన్నా.. గిరిజనుల తీజ్ వేడుక మురవాలన్నా.. మహిళల చేతుల స్పర్శ తగలా ల్సిందే.. అలాంటి అపురూపమైన అరచేతులకే అందాన్ని తెచ్చేది.. గోరింటాకు. ఆషాఢంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే అందంతోపాటు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతా యని మహిళలు విశ్వసిస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన గోరింటాకు పండుగను మహిళలంతా ఆనందంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ కాలనీలో శనివా రం గోరింట పండుగ జరుపుకున్న మహిళల అభిప్రాయాలు.. వేడుక వివరాలే ఈనాటి ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి, మహబూబాబాద్ సంతోషంగా ఉంది వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఒకేచోట ఉండే కాలనీ వాసులం ప్రతీ పండుగను కలిసి జరుపుకుంటాం. గోరింటాకు పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది. పండుగ జరుపుకునేందుకు సహకరించిన ‘సాక్షి’ మీడియాకు కృతజ్ఞతలు. పండుగల సందర్భంగా పెద్దలు చెప్పే మాటలతో ఈ తరానికి సంస్కృతి, సంప్రదాయం మీద గౌరవం పెరుగుతుంది. – కీసర నందినిఒకే చోట చేరి సంబురాలు ● అందంతోపాటు ఆరోగ్యానికి మేలని అతివల విశ్వాసం రోజంతా సందడి గోరింటాకు పండుగ జరుపుకోవాలని అనుకున్నదే తడవుగా.. మహిళలంతా ఏకమై సమీపంలోని చెట్ల నుంచి ఆకును పాటలు పాడుతూ సేకరించారు. రోలు, రోకలితో గోరింటాకును మెత్తగా చేసి ఒకరి చేతికి మరొకరు గోరింటాకు పెట్టుకొని మురిసిపోయారు. ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజంతా ఆనందంగా గడిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో పురోగతి సాధించింది. దీంతో వివిధ ప్రాంతాలు, వివిధ కులాలు, మతాలకు చెందిన సుమారు 30 కుటుంబాలు ఒకే చోట (సెవెన్ హిల్స్ కాలనీ) ఇళ్లు నిర్మించుకుని ఏ పండుగ అయినా.. కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కష్టసుఖాల్లో సహకా రం అందించుకుంటూ ఒకే కుటుంబంలా జీవిస్తున్నారు.న్యూస్రీల్ -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
నెహ్రూసెంటర్: ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వా రా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవిరాథోడ్ సూచించారు. సబ్ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వైద్యులు సేవలందించాల ని సూచించారు. సబ్ సెంటర్ల రిజిస్టర్, ల్యాబ్ వివరాలు, ఓపీ రిజిష్టర్లను పరిశీలించారు. సమావేశంలో హెచ్ఈ కేవీ రాజు, ఎస్యూఓ రామకృష్ణ, డీపీఎం నీలోహన, ఏఓ వసంత, డీడీఎం సౌమిత్, రాజ్కుమార్, సురేష్,అరున్,కార్యకర్తలు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందించాలి చిన్నగూడూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని సదుపాయాలతో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ పేర్కొన్నారు. మండలంలోని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలో ఆస్పత్రి రికార్డులు, జేఏఎస్ మీటింగ్కు సంబంధించిన రిజిష్టర్లను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. చికిత్స నిమిత్తం వచ్చిన సెప్సిస్ ఔండ్ పేషెంట్కి డ్రెస్సింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. అన్ని ఎంసీహెచ్ పారామీటర్లలో ముందు ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది ఉన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలి
● డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతం చేయాలి ● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ● 8న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన మహబూబాబాద్: ఈనెల 8న జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించా రు. ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శనివా రం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. ఈనెల 8న మానుకోట మండలం సోమ్లాతండా, కేసముద్రం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిథులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్య లే కుండా పార్కింగ్ ఏర్పాట్లపై చర్యలు తీసుకో వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషో త్తం,ఆర్డీఓలు కృష్ణవేణి,గణేష్,ఆర్అండ్బీ ఈ ఈ బీమ్లానాయక్, డీఎంహెచ్ఓ రవిరాథోడ్, డీీపీఓ హరిప్రసాద్, తదతరులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాకు మానిటరింగ్ సిస్టంనెహ్రూసెంటర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు నూతన సాంకేతికతతో రియల్టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ప్రవేశపెట్టినట్లు విద్యుత్శాఖ ఎస్ఈ విజేందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా వచ్చిన సిస్టం ద్వారా విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి తెలియజేయవచ్చని, తక్కువ సమయంలో విద్యుత్ పునరుద్దరణ జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం, ఓల్టేజీ లెవెల్స్ వంటి వివరాలను రియల్ టైంలో సేకరించవచ్చన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో వంద సబ్ స్టేషన్లను గుర్తించి పనులు ప్రారంభించారని, మిగిలిన వాటిని దశల వారీగా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. సకాలంలో రైతులకు ‘సహకార’ సేవలు● జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు మహబూబాబాద్ రూరల్: రైతుల సేవలో సహకార శాఖ తరిస్తుందని, సకాలంలో వారికి అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా సహకార అధికారి ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. అంతర్జాతీయ సహకార దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణలో శనివారం డీసీఓ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్ మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్, డీసీసీబీ బ్యాంకు మేనేజర్ రజిత, ఫీల్డ్ ఆఫీసర్ యశ్వంత్, అసిస్టెంట్ మేనేజర్ సింధు, సొసైటీ సెక్రెటరీ ప్రమోద్, సుధగాని మురళి, లూనావత్ అశోక్ నాయక్, ఆవుల వెంకన్న, నరేష్ నాయక్, నవీన్ నాయక్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. హేమాచలక్షేత్రంలో మాస కల్యాణం మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు ఆలయ పూజారి ముక్కామల శేఖర్శర్మ ఆధ్వర్యంలో శనివారం మాసకల్యాణం(శాంతికల్యాణం) జరిపించారు. యాగశాలలో స్వామివారి జన్మనక్షత్రాన్ని(స్వాతి) పురస్కరించుకుని ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న భక్తులు శాంతి కల్యాణంలో పాల్గొన్నారు. -
కమ్యూనిస్టులు లేకుండా చేయలేరు
కురవి: కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదని, అడాల్ఫ్ హిట్లర్ వల్లే సాధ్యం కాలేదు.. అమిత్షా వల్ల ఏం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ఎండీ లియాఖత్ అలీ, సురేందర్కుమార్ ప్రాంగణంలో మహబూబాబాద్ జిల్లా సీపీఐ మూడో మహాసభలో కూనంనేని మాట్లాడారు. కమ్యూనిజం లేకుండా చేయడం ఎవరితరం కాదని, మానవ సమాజం, ఈ భూమి ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరిట అడవుల్లో ఉన్న కమ్యూనిస్టులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతం చేస్తానని చెప్పి నంబాల కేశవరావును హత్య చేశారని వెల్లడించారు. మావోయిస్టులు మా వాల్లేనని, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎర్రజెండా పట్టుకున్న ప్రతీ ఒక్కరు తమ వాల్లేనని పేర్కొన్నారు. బందిపోట్లు ప్రజల్లో ఉండి తిరుగుతున్నారని, మావోయిస్టులు ఆయుధాలను పక్కన పెట్టే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. వేర్వేరుగా ఉన్న ఎర్రజెండా పార్టీలన్ని ఒక్కతాటిపై రావాల్సిన అవసరం ఉందని, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరాలని కోరారు. డిసెంబర్ 26న ఖమ్మంలో సీపీఐ వందేళ్ల పండుగ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల వరకే పొత్తులు.. ఎన్నికల వరకే పొత్తులుంటాయని, ప్రజాసమస్యలను విస్మరిస్తే చూస్తూ ఊరుకోమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోటను విస్మరిస్తే బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయసారథి, సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్రెడ్డి, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, అజయ్సారథి, కట్టెబోయిన శ్రీనివాస్, కరణం రాజన్న, నెల్లూరి నాగేశ్వర్రావు, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, వరిపెల్లి వెంకన్న, నవీన్, బాలకృష్ణ, తురక రమేష్, బుర్ర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కమ్యూనిస్టులు ఏకతాటిపై రావాలి -
పంటల సాగులో మెలకువలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్: రైతులు పంటల సాగు సమయాల్లో మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి (ఇన్చార్జ్) అజ్మీర శ్రీనివాసరావు అన్నారు. మహబూబా బాద్ మండలంలోని మల్యాల గ్రామంలోని సాగు చేస్తున్న పత్తి, కూరగాయల పంటలను శ్రీనివాసరావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అంతర పంటల కృషి, కలుపు నివారణపై అవగాహన కల్పించారు. పంట మార్పిడి పద్ధతి అవలంభించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి మరియన్న, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, ఏఈఓ బాలాజీ, రైతులు రవి, బానోతు పద్మ, బానోతు బాలకిషన్, భూక్య పద్మ పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని డీఏఓ శ్రీనివాసరావు అన్నారు. మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డితో కలిసి మహబూబాబాద్లోని విత్తన, ఎరువుల దుకాణాల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఎరువులను ఈ పాస్ మిషన్ ద్వారా రైతు ఆధార్ కార్డు మీద మాత్రమే విక్రయించాలని, రైతులకు ఎమ్మార్పీ ధరకు మించి విక్రయించొద్దని డీలర్లకు సూచించారు. వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్స్ కలిగిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఏఓ శ్రీనివాసరావు -
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం..
డోర్నకల్: డోర్నకల్ సబ్ స్టేషన్ పరిధిలో గత నెల 14న ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తూ అసిస్టెంట్ లైన్మెన్ బి.క్రాంతికుమార్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహుపేటకు చెందిన బోగి నర్సయ్య, ఇందిర దంపతుల పెద్ద కుమారుడు క్రాంతికుమార్ ఏడేళ్ల క్రితం విద్యుత్శాఖలో చేరి డోర్నకల్లో విధులు నిర్వహిస్తూ చనిపోయాడు. 2019లో క్రాంతికుమార్కు వంశీలతతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్లు, రెండేళ్ల కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో క్రాంతికుమార్ మృతితో తల్లిదండ్రులతోపాటు తన పిల్లలు, భార్య రోడ్డున పడ్డారు. కాగా, తండ్రి కనిపించకపోవడంతో చిన్నారులు నిత్యం నాన్న.. నాన్న అంటూ క్రాంతికుమార్ను కలువరిస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
సిగాచి పరిశ్రమలో అఖిల్ మృతి..
● మృతుడిది తొర్రూరు మండలం మడిపల్లి ● వివాహమైన ఆరునెలలకే విషాదం.. తొర్రూరు రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంలో తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మోత్కూరి అఖిల్(29) మృతి చెందాడు. రెండు సంవత్సరాల నుంచి సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అఖిల్.. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో డీఎన్ఏ పరీక్షలకు పంపించి అఖిల్గా నిర్ధారించారు. కాగా, అఖిల్కు ఆరు నెలల క్రితం శివరాణి అనే యువతితో వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో భార్య శివరాణి, తల్లిదండ్రులు రాజేందర్, రాణి కన్నీరుమున్నీరవుతున్నారు. -
అంగవైకల్యమైనా నయా పైసా ఇవ్వలే..
దేవరుప్పుల: పన్నెండేళ్ల క్రితం విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడిగా చేరా. 2103లో రూ.1,800 జీతంతో ప్రారంభమైన నా సర్వీస్ నేటికి రూ.13 వేల వేతనం తప్ప ఏ ఇతర సౌకర్యాలు లేవు. 2021లో దేవరుప్పల మండలం కోలుకొండలో ఎల్సీ తీసుకుని పని చేస్తున్న క్రమంలో సబ్స్టేషన్ ఆపరేటర్ (ఉద్యోగ విరమణ పొందిన వృద్ఢుడు తిరిగి విధుల్లో చేరిన వ్యక్తి) రెండు ఫీడర్ బదులు ఒక్కటే ఆఫ్ చేశారు. ఎల్సీ క్లియర్ అని చెప్పగానే స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి కింద పడ్డా. దీంతో నా చెయ్యి కాలింది. ఛాతీ పై తీవ్రగాయాలై ప్రాణపాయ స్థితిలోకి వెళ్లా. కుటుంబ సభ్యులు అప్పు చేసి సుమారు రూ.18 లక్షలు ఖర్చు చేస్తేనే బతికా. శాఖ పరంగా తిరిగి విధుల్లో తీసుకున్నారే తప్ప ప్రత్యేకించి నయా పైసా ఇవ్వలేదు. ఇతర పనులు చేయని మాకు పర్మనెంట్ చేసి తగిన పనులు అప్పగించి ఆదుకోవాలి. – గొడిశాల వెంకటేశ్, అన్మ్యాన్ కార్మికుడు, దేవరుప్పుల -
గాలిలో దీపాలు!
వీరి ప్రాణాలు..భద్రత లేని విద్యుత్శాఖలోని అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల జీవితాలుక్షేత్రస్థాయిలో కీలక విధులు.. తరచూ ప్రమాదాలువెట్టి చాకిరీ తప్ప ఉద్యోగ భద్రత కరువు..మంచానికే పరిమితమైన భాస్కర్.. జఫర్గఢ్: విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ ఇటీవల షాక్కు గురైన తాటికాయల భాస్కర్ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. జఫర్గఢ్ శివారు వడ్డెగూడేనికి చెందిన భాస్కర్ 2012లో విద్యుత్ శాఖలో అన్మ్యాన్గా విధుల్లో చేరాడు. కొన్నేళ్ల నుంచి ఓబులాపూర్ సబ్స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఎల్సీ తీసుకుని స్తంభం ఎక్కి కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా భాస్కర్ నడుము భాగంతో పాటు రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అలాగే, కుడి చెయ్యి మూడు వేళ్లను సైతం తొలగించారు. వైద్యానికి సుమారు రూ.10 లక్షలు కాగా రూ. 7 లక్షల వరకు డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు చేయగా మిగతా డబ్బులు బాధిత కుటుంబ సభ్యులు భరించాల్సి వచ్చింది. అయినా భాస్కర్ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వారానికోసారి హెల్త్ చెకప్ కోసం వెళ్లిన సందర్భంలో రూ. 10వేల నుంచి 15 వేలు ఖర్చు అవుతోందని బాధిత కుటుంబీకులు తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తాము ఏమి చేయలేమంటున్నారని బాధితుడి భార్య అనూష ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్తతో పాటు ముగ్గురు పిల్లల పోషణ భారం పూర్తిగా తనపైనే పడిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. టీజీ ఎన్పీటీసీఎల్లో అన్మ్యాన్ కార్మికులుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు వెట్టి చాకిరీ తప్ప ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడం నుంచి.. నూతన లైన్ ఏర్పాటు, మరమ్మతులు, బిల్లుల వసూళ్లు తదితర అన్ని రకాల పనులు వీరితోనే చేయిస్తారు. అయినా ఈ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 40 ఏళ్ల వయసు దాటుతుండడంతో ఉద్యోగ అర్హత కోల్పోవాల్సి వస్తోందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబం వీధిన పడాల్సి వస్తోంది. అయి నా పట్టించుకున్న నాథుడే కరవవుతున్నాడని పలువు రు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఏళ్లుగా పనిచేస్తున్న అన్మ్యాన్ కార్మికులను పర్మనెంట్ చేసి నెలనెలా బ్యాంకు అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ -
నేషనల్ మీట్లోనూ సత్తా చాటాలి
వరంగల్ క్రైం: జోనల్ డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు.. జాతీయ స్థాయిలో నూ సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ శుక్రవారం ముగిసింది. జోనల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు, మహబుబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పలు విభాగాల్లో పోటీపడ్డారు. ప్రతిభ కనబరిచిన వారికి సీపీ పతకాలు అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగానికి 15 గోల్డ్ మెడల్స్తో సహా మొత్తం 31 పతకాలు వచ్చా యి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెంకు 19, మహబూబాబాద్ జిల్లాకు 17, ఖమ్మం జిల్లా అధికారులు 5 పతకాలు సాధించినట్లు నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ సాధన చేస్తే వృత్తి నైపుణ్యంతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చవచ్చని అన్నారు. పోటీల విజయవంతానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్, వ రంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
కేయూ పాలకమండలి సభ్యుల దిష్టిబొమ్మ దహనం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ భూములను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి యూనివర్సిటీ పాలకమండలి ఆమోదించిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్డీఎస్, డీఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, బీఆర్ఎస్వీ, బీఎస్ఎఫ్, డీఎస్యూ, ఎస్ఎస్యూ, ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో శుక్రవారం కేయూలో పాలకమండలి సభ్యుల శవయాత్ర నిర్వహించారు. హ్యూమనిటీస్ భవనం నుంచి పరిపాలన భవనం వరకు శవయాత్రను నిర్వహించి అక్కడ పాలకమండలి సభ్యుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ పలు చోట్ల కేయూ భూ ములు కబ్జాకు గురయ్యాయని, వాటిని వెనక్కితీసుకోవాలనే విషయంపై దృష్టిసారించకుండా యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 15ఎకరాల భూ మిని కేటాయిస్తూ పాలకమండలి సభ్యులు ఆమోదించడం శోచనీయమన్నారు. పాలకమండలి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల బాధ్యులు గడ్డం నాగార్జున, రాష్ట్ర సావిత్రి, కామగోని శ్రావణ్, ము న్నా గణేశ్, మంద శ్రీకాంత్, స్టాలిన్, కల్యాణ్, మర్రి మహేశ్, సాయికుమార్, బైరపాక ప్రశాంత్, కమ్మరపెల్లి శివ, మధు, అన్నమయ్య, సాయి, జశ్వంత్, రా జు, నరేశ్, సురేశ్, శివ, తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూములు ఇవ్వొద్దని డిమాండ్ -
కమ్యూనిజం శక్తుల ఐక్యం అనివార్యం
దేవరుప్పుల : పీడిత ప్రజానీకం కోసం నిత్యం పాటుపడే విప్లవ పార్టీలను అంతమొందించేందుకు ప్రధాని మోదీ చే స్తున్న కుట్రలను ఛేదించేందుకు కమ్యూనిజం భావజాల శక్తులు ఐక్యం కావడం అనివార్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్తూపం, విగ్రహానికి నారాయణతోపాటు అరుణోదయ స మాఖ్య వ్యవస్థాపకులు విమలక్క, ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు కుమారస్వామి, తదితరులు పూలమాల వేసి నివాళులుర్పించారు. అనంతరం కొమురయ్య స్మారక భవనంలో జరిగిన సంస్మరణ సభకు సీపీఐ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య అధ్యక్షత వహించగా నారాయణ మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు డెడ్లైన్ పేరిట సరిహద్దు సైన్యాన్ని అంతర్గతంగా వినియోగిస్తూ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. ఇదే మణిపూర్లో సాయుధ పంథాను అణిచివేయకుండా చూడడంలోనే వారి స్వార్థ పాలన వెల్లడైందన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచే పాలకులు రాజ్యాంగాన్ని మార్చలేరని హితవు పలికారు. నిజాం పాలనలో దొడ్డి కొమురయ్య పోరాట పటిమతోనే సాయుధ పోరాటం ఆవిర్భవించిందన్నారు. దీనితోనే బానిసత్వం, దున్నేవాడికి భూమితోపాటు భూస్వామ్య విధానం రద్దు అయ్యిందన్నారు. నేటికీ విస్నూ ర్ దేశ్ముఖ్ మూలాలకు చెందిన ప్రొఫెసర్ పాండురంగా రావు.. సాయుధ పోరాటాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. ఎర్రజెండా ద్వారానే అన్ని వర్గాల ప్రయోజనాలు సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్ల నర్సింహులు వారసురాలు చింతకింది అరుణక్క, సీపీఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్రావు, సుగుణమ్మ, సాయన్న, సొప్పరి సోమయ్య, బిల్లా తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, ఎల్లయ్య, ప్రశాంత్, సుజిత్, సోమనారాయణ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. విముక్తి పోరుకు స్ఫూర్తిప్రదాత దొడ్డి కొమురయ్య కార్పొరేట్ కోసమే ప్రకృతి సంపద దోపిడీకి యత్నం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ -
కేయూ స్నాతకోత్సవ రిహార్సల్స్
కేయూ క్యాంపస్: ఈ నెల 7వ తేదీన జరగనున్న కేయూ స్నాతకో త్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రిహార్సల్స్ చేశారు. పలువురు పాలకమండలి సభ్యులు, వివిధ విభాగాల డీన్లు, కమిటీల కన్వీనర్లు, సభ్యులు, ఇతర అధికారులు స్నాతకోత్సవ రిహార్సిల్స్ చేశారు. కొందరు విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానంపై కూడా రిహార్సల్స్ చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ రిహార్సల్స్ ద్వారా లోటు పా ట్లు తెలుసుకుని స్నాతకోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. కా ర్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. 6న కేయూకు పనిదినం.. ఈ నెల7వ తేదీ కేయూ స్నాతకోత్సవం నేపథ్యంలో 6న (ఆదివారం) అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థ్ధులకు వర్కింగ్ డేగా పరిగణిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ రోజుకు బదులు అక్టోబర్ 4వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. కాగా, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు క్యాంపస్లోని పలు చోట్ల క్లీన్అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.రైతుకు పాముకాటు దంతాలపల్లి : ఓ రైతు పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని వేములపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుండగాని వెంకన్న ఉదయం తన పొలంలో నీళ్లు పెట్టి గట్లు వేస్తున్నాడు. ఈ క్రమంలో తన కాళ్లు, చేతులకు అంటుకున్న బురదను శుభ్రం చేసుకునే సమయంలో పాము కాటు వేసింది. గమనించిన రైతు.. కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రంలోని ఆస్పత్రికి వచ్చాడు. వైద్యురాలు కవిత, ఏఎన్ఎం కవిత చికిత్స అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాము, తేలు కాటు విషానికి ఆస్పత్రిలో విరుగుడు (ఇంజక్షన్) ఉందన్నారు. తేలు, పాముకాటుకు గురైన మండల ప్రజలు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే ఆస్పత్రికి రావాలన్నారు. -
శ్రీశైలం మృతితో రోడ్డున పడిన కుటుంబం..
పాలకుర్తి టౌన్: విద్యుత్ శాఖ అన్మ్యాన్ కార్మికుడు బైకాని శ్రీశైలం మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన శ్రీశైలం గత సంవతరం ఏప్రిల్ 06న వల్మిడిలో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురైన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. శ్రీశైలం మృతి తర్వాత ప్రభుత్వం, విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో భార్య రాణి ఇద్దరు పిల్లలతో జీవన పోరాటం చేస్తోంది. తీగారం నుంచి తన తల్లిగారి ఊరు దేవరుప్పులకు వెళ్లి ఉంటుంది. కుటుంబ పోషణకు రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. పిల్లల పోషణ ఇబ్బందిగా ఉంది.. నాతోపాటు నా పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నా భర్త విధి నిర్వహణలోనే ప్రాణం కోల్పోయాడు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం, విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి సాయం అందలేదు. పిల్లలను పోషించుకునేందుకు ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వాలి. అలాగే, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి -
అనుమతుల కోసం అడ్డదారులు
● డబ్బులు ముట్టజెప్పిన ‘వరంగల్ ఫాదర్ కొలంబో’ ● ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్పై సీబీఐ కేసు నమోదు కాజీపేట రూరల్: నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) స్కామ్లో వరంగల్ హంటర్రోడ్డు బ్రిడ్జి సమీపంలోని ఫాదర్ కొలంబో మెడికేర్ ఆస్పత్రి (ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పాత్ర సంచలనం రేపుతోంది. అధికారిక అనుమతుల కోసం డబ్బులు ముట్టజెప్పినందుకు వరంగల్కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాల ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కళాశాల తనిఖీల్లో ఎన్ఎంసీ అధికారులు అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు మధ్యవర్తులకు జోసెఫ్ లంచాలు ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో తేలింది. దేశవ్యాప్తంగా 36 మందిపై సీబీఐ కేసులు నమోదు చేయగా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదుగురిలో వరంగల్కు చెందిన జోసెఫ్పై కేసు నమోదైంది. మెడికల్ కళాశాల క్లియరెన్స్, అధికార అనుమతుల కోసం మధ్యవర్తులకు రూ.20 లక్షలు, రూ.46 లక్షల చొప్పున రెండుసార్లు జోసెఫ్ ముట్టజెప్పినట్లు తేలింది. ఈ విషయమై వివరణ కోసం ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్కు శుక్రవారం రాత్రి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. రైల్వే ఇన్స్టిట్యూట్ తనిఖీ కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ను శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ (ఏపీఓ, ఇంజనీరింగ్ విభాగం) జితేంద్రకుమార్ బృందం తనిఖీ చేసింది. రైల్వే ఇన్స్టిట్యూట్, కమ్యూనిటిహాల్, స్టేడియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఇన్స్టిట్యూట్ నిర్వహణ, రికార్డులు, మెంబర్స్షిప్ వివరాలు, సౌకర్యాలు, సదుపాయాలను తనిఖీ చేశారు. ఇన్స్టిట్యూట్ బాయ్స్ వివరాలు, వేతనాలు అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీహాల్ నిర్వహణ బాగుందని అభినందించారని ఇన్స్టిట్యూట్ ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్రావు తెలిపారు. తనిఖీలో రైల్వే వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు విష్ణువర్ధన్రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఓఎస్ సత్యనారాయణ ఉన్నారు. -
విద్యుత్శాఖలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భద్రత కరువు
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025జీవనాధారాన్ని కోల్పోయారు.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ము న్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అన్మ్యాన్ హెల్పర్ గట్ల కరుణాకర్రెడ్డి గత గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి విద్యుత్ మోటా రు స్టార్టర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా సర్వీస్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సుమా రు 25ఏళ్లనుంచి ఆయన ఈదులపూసపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సేవలు అందిస్తున్నారు. కరుణాకర్ రెడ్డికి భార్య ప్రియాంక, కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సుశాంత్ రెడ్డి ఉన్నారు. కుమార్తె హైదరాబాద్లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, కుమారుడు మానుకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పెద్ద కరుణాకర్ రెడ్డి అకాల మరణంతో ఆ బాధ్యతలన్నీ భార్య ప్రియాంక మీదనే పడ్డాయి. ఈ క్రమంలో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారనుందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు 1,388 మందిహన్మకొండ: విద్యుత్శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వీరు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదరణకు నోచుకోవడం లేదు. వీరికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా యాజమాన్యంనుంచి అందే సహాయం కూడా లేదు. వినియోగదారులకు విద్యుత్ సంబంద సమస్యలు తలెత్తితే ముందుగా వీరినే సంప్రదిస్తారు. వీరి సమస్యలు వివరించి బాగు చేయించుకుంటారు. ఇంతటి కీలక భూమిక పోషిస్తున్న వీరికి ఆర్థిక భరోసా అందడం లేదు. ఇటీవల బీమా సౌకర్యం.. తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తుండడంతో చలించిన టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 1,388 మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి గత నెలనుంచి బీమా సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు 1300మందికి బీమా సౌకర్యం కల్పించారు. ఇందులో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెండు విభాగాలుగా విభజించారు. ఐటీఐ అర్హత కలిగిన వారికి నెలకు రూ.20 వేల వేతనం, ఐటీఐ అర్హత లేని వారికి నెలకు రూ.17 వేల వేతనం అందిస్తున్నారు. ఈ మేరకు ఐటీఐ అర్హత కలిగిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల బీమా, ఐటీఐ అర్హత లేని వారికి రూ.17 లక్షల పరిహారం అందేలా బీమా సౌకర్యం కల్పించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా వీరికి బీమా చేయించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో మృతిచెందిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్కు ఈ బీమా వర్తించే అవకాశముందని విద్యుత్ అధికార వర్గాలు తెలిపాయి. దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రామరాజు కొన్నేళ్లుగా విద్యుత్శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో గత మే 9న రైతుల వ్యవసాయ బావుల వద్ద ఓ ట్రాన్స్ఫార్మర్కు ఎగ్జ్ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ తీగ తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ చెయ్యిని పూర్తిగా మరో చేయిని సగం వరకు తీసి వేశారు. రెండు నెలలుగా వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.19 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. గ్రామస్తులు దాదాపు రూ.16 లక్షల వరకు విరాళాలు అందించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు అంటున్నారని బాధితుడి భార్య రజిత తెలిపింది. పెద్ద కుమార్తె అఖిల ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలని మదనపడుతోంది. చిన్న కుమార్తె అక్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాల్సి ఉంది. ఊరు అండగా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రజిత, పిల్లలు కన్నీటిపర్యంతమవుతున్నారు.పోరాడి తనువు చాలించిన రమేశ్ లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన జాగిళ్లపురం రమేశ్ 2020 జూన్లో కొత్తపల్లిలో లైన్మెన్ ఆదేశాలతో ట్రాన్స్ఫార్మర్ తీగలను సరి చేస్తుండగా విద్యుత్ షాక్తో కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. డిపార్ట్మెంట్ నుంచి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రి బిల్లులు చెల్లించారు. రమేశ్ మాత్రం కోలుకోలేదు. మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో తన తండ్రి ఉప్పలయ్య లేదా చెల్లెలు రజితకు ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పోరాడాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయం చేస్తామన్నారే కానీ, ఎవరూ ఏమీ చేయలేదు. చివరికి లోకాయుక్తాలో కేసు వేసి పోరాడి 2024, అక్టోబర్ 3న చనిపోయాడు. కేసు ఇంకా లోకాయుక్త్తాలోనే కొనసాగుతోంది. కన్నకొడుకు చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు ఉప్పలయ్య, ఆండాలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. న్యూస్రీల్చేతులు కోల్పోయి రెండు నెలలుగా ఆస్పత్రిలో.. క్షేత్రస్థాయిలో కీలక విధులు.. తరచూ ప్రమాదాలు ఇంటి పెద్ద చనిపోవడంతో రోడ్డున పడుతున్న కుటుంబం గాయాలపాలై మంచానికే పరిమితమైన మరికొందరు.. మొన్నటిదాకా వినియోగదారులకు ఇస్తున్న ఎక్స్గ్రేషియానే దిక్కు ఇటీవల బీమా సౌకర్యం కల్పించిన టీజీ ఎన్పీడీసీఎల్ ఐటీఐ అర్హత కలిగిన వర్కర్కు రూ.20 లక్షలు ఐటీఐ లేని వారికి రూ.17 లక్షల బీమా ఆర్టిజన్లుగా గుర్తించని టీజీ ఎన్పీడీసీఎల్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 2016లో విద్యుత్ సంస్థల్లోకి ఆర్టిజన్లుగా అబ్జర్వ్ చేసుకున్న క్రమంలో తెలంగాణ సౌథర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న కట్టర్లను (ఇక్కడ అన్మ్యాన్ వర్కర్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను అక్కడ కట్టర్లుగా పిలిచేవారు) ఆర్టిజన్లుగా తీసుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్లో మాత్రం అప్పటి యాజమాన్యం అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించలేదు. దీంతో వీరు ప్రమాదవశాత్తు మృతిచెందితే వినియోగదారులకు ఎక్స్గ్రేషియా చెల్లించినట్లుగానే రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై గాయాలపాలైతే చికిత్స ఖర్చులు మాత్రం యాజమాన్యం భరిస్తుంది. కానీ, ఇది సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
మానుకోట జిల్లా పోలీసుల ప్రతిభ
మహబూబాబాద్ రూరల్: పోలీసులు కేవలం విధి నిర్వహణలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ రాణించగలరని నిరూపిస్తూ పోలీస్ డ్యూటీమీట్లో జిల్లా పోలీసులు 16 పతకాలు సాధించారు. భద్రాద్రి జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్లో మహబూబాబాద్ జిల్లా పోలీసులు అందులో పాల్గొని ప్రతిభ కనబర్చి జిల్లాకు 4 బంగారు, 9 రజత, 3 కాంస్య పతకాలు తెచ్చిపెట్టారు. బాంబు స్క్వాడ్ విభాగంలో పీసీ రామయ్యకు (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ అశోక్ (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ వి.మహేశ్ (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ ఎ.మహేశ్ (ఒక సిల్వర్), పీసీ రాములు (ఒక గోల్డ్), వీడియో గ్రాఫర్ విభాగంలో పీసీ కుషాల్ కుమార్ (ఒక సిల్వర్), అబ్జర్వేషన్ విభాగంలో పీసీ మధు (ఒక సిల్వర్), కంప్యూటర్ ఎబిలిటీ ప్రోగ్రామింగ్ విభాగంలో ఎస్సై అరుణ్ కుమార్ (ఒక సిల్వర్), ఫింగర్ ప్రింట్ విభాగంలో ఎస్సై ప్రవీణ్ (ఒక కాంస్య), పోలీసు పోర్ర్టైట్ విభాగంలో పీసీ మధు (ఒక సిల్వర్), కంప్యూటర్ అవేర్నెస్ విభాగంలో పీసీ సుమన్ (ఒక సిల్వర్), అబ్దుల్ ఖదీర్ (ఒక గోల్డ్, ఒక బ్రాంజ్) మొత్తంగా 16 మెడల్స్ సాధించారు. ఈపతకాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని రాణీ రుద్రమదేవి హాల్లో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు జిల్లా నుంచి నోడల్ ఆఫీసర్గా డీఎస్పీ శ్రీనివాస్, వారికి కోచ్గా బీడీ టీం పీసీ అంజయ్య టీం సభ్యులకు ప్రోత్సాహాన్ని అందించారు. పోలీస్ డ్యూటీమీట్లో 16 పతకాలు -
‘స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేది లేదు’
మరిపెడ: స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేది లేదని మహబూబాబాద్ డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కాంప్లెక్స్లో శంకర్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని రవిరాథోడ్ సీజ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హై డోస్ వాడితే భవిష్యత్లో అనారోగ్యం బారిన పడతారన్నారు. అనుమతి లేకుండా వైద్యం చేయడం చట్టరీత్యా నేరమని, ప్రాక్టీషనర్లు పరిమితులకు లోబడి చికిత్స చేయాలని సూచించారు. జిల్లాలో అధికంగా మరిపెడలో అర్హత లేని వైద్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తనిఖీలు చేస్తున్నారనే సమాచారంతో మిగతా ప్రథమ చికిత్స కేంద్రాల నిర్వాహకులు షెట్టర్లకు తాళాలు వేసుకుని పరారయ్యారన్నారు. అయినప్పటికీ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి గుగులోతు రవికుమార్ తదితరులున్నారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ డోర్నకల్: డోర్నకల్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డోర్నకల్ సీఐ బి.రాజేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇస్లావత్ నవీన్ ఓ తండాకు చెందిన బాలికను ఇంటి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లాడు. బాలిక అదృశ్యంపై ఆమె అమ్మమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం నవీన్ పది రోజుల తర్వాత బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చాడు. పోక్సో కేసు నమోదు చేసి నవీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. చోరీ చేసేందుకు వచ్చిన బిహార్ యువకుడికి దేహశుద్ధిమహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని బుక్క బజార్ ప్రాంతంలోని బ్రహ్మణపల్లి సురేశ్ ఇంట్లోకి శుక్రవారం బిహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు ప్రవేశించాడు. బీరువా తెరిచి చోరీకి చేసేందుకు యత్నించాడు. ఏదో శబ్ధం అవుతున్నట్లుగా అలికిడి వినిపించడంతో వెంటనే ఆ ఇంటి యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి అరిచాడు. స్థానికులు వచ్చి ఆ యువకుడిని కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేజీబీవీలో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలిమహబూబాబాద్ అర్బన్: కేజీబీవీల్లో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్ను టీపీటీఎఫ్ నాయకులు శుక్రవారం సందర్శించి సభ్యత్వ నమెదు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్రెడ్డి, కార్యదర్శి రాచకొండ ఉపేందర్, మండల అధ్యక్షుడు భిక్షపతి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనెల్లికుదురు: నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేయాలనే కుట్ర చేసి పేదలకు దక్కకుండా చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు, బాబు గౌడ్, నర్సయ్య, యాకయ్య, పుల్లయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు. -
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
కేసముద్రం: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని గణపతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీపీఐ 19వ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, మంద భాస్కర్, లక్ష్మీనర్సయ్య, రవీందర్, ఇమామ్, సోమయ్య, వెంకటయ్య, సారయ్య, అనిత, కోటయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
మహనీయుల జీవితం అందరికీ ఆదర్శం
మహబూబాబాద్: మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా.. దొడ్డి కొమురయ్య, రోశయ్య చిత్రపటాలకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. సాయుధ పోరాట యోధుడు కొమురయ్య అన్నారు. కొటిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారన్నారు. మహనీ యులను ఒక కులానికో, వర్గానికో పరిమితం చేయకుండా వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, డీసీఓ వెంకటేశ్వర్లు, డీవీహెచ్ఓ కిరణ్కుమార్ పాల్గొన్నారు. టీబీపై విస్తృత ప్రచారం చేయాలి.. టీబీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతో టీబీ నివారణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. క్షయ వ్యాధిని 2030 వరకు నివారించాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని 171 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ద్వారా రెండు టీంలు తెమడ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీసీలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, డీఈఓ రవీందర్రెడ్డి, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి శిరీష సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
వణికిస్తున్న డెంగీ
జిల్లాలో నమోదైన మలేరియా, డెంగీ కేసుల వివరాలు సంవత్సరం మలేరియా డెంగీ2022 20 125 2023 06 40 2024 11 419 2025 ఇప్పటి వరకు 03 18సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం జిల్లా ప్రజలను వణిస్తున్న డెంగీ జ్వరాలు ఈ ఏడాది కూడా వదలడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారణలో జిల్లాలో 18 మందికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ డెంగీ కేసుల సంఖ్య వందకు పైగా ఉంటుందని అంచనా. డెంగీ జ్వరానికి కారణమైన దోమలను పూర్తి స్థాయిలో నివారించకపోవడంతోనే కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. డెంగీ జ్వరం వస్తే ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చవుతుంది. కాగా.. ఈ జ్వరం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు భయపడుతున్నారు. 18కి చేరిన కేసులు.. ఈఏడాది ఇప్పటి వరకు 18 మందికి డెంగీ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మహబూబాబాద్ అర్బన్ పీహెచ్సీ పరిధిలో నాలుగు, మల్యాలలో మూడు, కురవిలో రెండు, నెల్లికుదురు, నర్సింహులపేట, దంతాలపల్లి, తీగలవేణి, అయోధ్యపురం, కోమట్లగూడెం పీహెచ్సీల్లో ఒకొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుని మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, తొర్రూరు పట్టణాల్లోని చికిత్స పొందుతున్న వారు వందకుపైగా ఉన్నట్లు అంచనా. పట్టణాల్లోనే ఎక్కువ.. గతేడాది 419 డెంగీ కేసులు నమోదు కాగా.. ఇందులో మహబూబాబాద్, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గూడేలు, గిరిజన తండాలతో పోలిస్తే పట్టణాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడమే అని వైద్యులు చెబుతున్నారు. మురికి కాల్వలు, చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దోమల నివారణకు గంభోజీ చేపలు, ఆయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేయడం వంటి చర్యలు ఇప్పటి వరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎక్కడా మొదలు పెట్టలేదని ప్రజలు చెబుతున్నారు. ముందుకు సాగని ప్రణాళిక వర్షాకాలం రాకముందే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇప్పటి వరకు కనీస కార్యాచరణ చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు దోమ తెరలు పంపిణీ చేయాలి. కానీ.. నాలుగేళ్లుగా దోమ తెరలు రాలేదని గిరిజనులు చెబుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయడం బ్లీచింగ్, ఫాగింగ్ మొదలైన పనులకు నిధులు లేవు. దీంతో అప్పులు చేసి మరీ పనులు చేయాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. పంచాయతీ, వైద్యారోగ్యం, తాగునీటి సరఫరా శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అరికట్టాలని కలెక్టర్ సమీక్ష సమావేశం పెట్టి ఆదేశించినా ఆశించిన స్థాయిలో పని చేయడంలేదని ఫిర్యాదులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నాం..సీజనల్గా వచ్చే మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలకుండా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాం. జ్వర సర్వే నిర్వహించి కేసులను గుర్తించి వైద్య సేవలందిస్తున్నాం. దోమల నివారణ కోసం వినియోగించే రసాయనాలను పీహెచ్సీలకు పంపించాం. ఆర్డీటీ కిట్లు అందజేశాం. అవసరమైన చోట హెల్త్ క్యాంపులు పెట్టి చికిత్సలు అందజేస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – సుధీర్రెడ్డి, జిల్లా మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఇప్పటికి 16 మంది గుర్తింపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వందల్లో కేసులు ఇంకా మొదలుకాని ఫాగింగ్, దోమల నివారణ చర్యలు భయపడుతున్న జిల్లా ప్రజలు -
ఘోర ప్రమాదం: రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు.ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీల్లో ఒకటి గ్రానైట్ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక లారీ విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా, మరో లారీ వరంగల్ నుంచి ఏపీ వైపు వెళ్తుందని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదం కారణంగా ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్యాబిన్లో సజీవదహనమైన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. -
అన్నదాతలకు అర్థమయ్యేలా..!
హన్మకొండ : విద్యుత్ ప్రమాదాల నివారణపై టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అవగాహన, చైతన్యం కల్పించేందుకు సర్కిల్ కార్యాలయాల్లోని డివిజనల్ ఇంజనీర్లకు అదనంగా సేఫ్టీ అధికారులుగా బాధ్యతలు అప్పగించింది. రైతులు, విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కరించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పొలంబాట కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఇప్పటి వరకు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారాలు చూపించిన పొలం బాట.. ఈ సారి ప్రత్యేక లక్ష్యంతో ముందుకెళ్తోది. ఇందులో భాగంగా సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. అంతే కాకుండా విద్యుత్ ప్రమాదాల నివారణే ధ్యేయంగా వినియోగదారులను చైతన్య చేయడంతో పాటు, ప్రమాదాలు తలెత్తే కారణాలను విశ్లేషిస్తూ అధికారులు ముందుకెళ్తున్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 523 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సమస్యలను పరిష్కరించారు. అదే విధంగా 935 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ సరి చేశారు. తక్కువ ఎత్తులో ఉన్న 297 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల పునర్నిర్మించారు. 3,153 మధ్య స్తంభాలు నాటారు. తుప్పు పట్టిన 467 స్తంభాలను మార్చారు. రెండేసి విద్యుత్ లైన్లు ఉన్న 286 లైన్లను సరిచేశారు. క్రాసింగ్లో లైన్ల మధ్య ఉండాల్సిన దూరాన్ని 170 విద్యుత్ లైన్లలో సరిదిద్దారు. 1,216 వదులు ఉన్న లైన్లను సరి చేశారు. రోడ్ క్రాసింగ్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లు 185 ప్రాంతాల్లో ఎత్తు పెంచారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న 487 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సరి చేశారు. 739 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ పునరుద్ధరించారు. 224 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. 359 వంగిన పోల్స్, 547 డ్యామేజీ స్తంభాలను మార్చారు. 2,965 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశారు. 134 ప్రాంతాల్లో రెండేసి విద్యుత్ లైన్ల ఉన్న స్తంభాలను సరి చేశారు. విద్యుత్ లైన్ల క్రాసింగ్లు 348 ప్రాంతాల్లో నిర్దిష్ట ఎత్తుకు సరి చేశారు. వదులు ఉన్న 1,141 విద్యుత్ లైన్లను సరిదిద్దారు. 161 చోట్ల రోడ్డుకు అతి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ల ఎ త్తు పెంచారు. ఓ వైపు విద్యుత్ ప్రమాదాల కారకాల ను సరిదిద్దుతూనే.. మరో వైపు అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ జాగ్రత్త పాటించే విధానాలు వివరిస్తున్నారు. విద్యుత్ సమస్యలు గుర్తిస్తే 1912 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. పొలంబాట ద్వారా విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన రైతులను చైతన్య పరుస్తున్న డీఈ టెక్నికల్, సేఫ్టీ అధికారులు -
6న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క రాక
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ నెల 6న రానున్నారని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్లాతండా వద్ద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మురళీనాయక్.. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డీఎస్పీ తిరుపతిరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, మజ్జిగ, చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించా రు. తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు గాను పార్కింగ్ స్థలాలకు ఆప్రోచ్ రోడ్లు శనివారంలోగా పూర్తి చేయాలన్నారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చాలా ముఖ్యమన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సీట్లు
మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే ముందుగా ప్రవేశ పరీక్ష రాయాలి. అందులో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తాం. ఇక్కడ విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వివిధ క్రీడారంగాల్లో శిక్షణ అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో మెరుగైన విద్య అందిస్తున్నందుకు మానుకోట మోడల్ స్కూల్కు అంత క్రేజ్ ఉంది. ఇంటర్లో బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి ఉంది. – గండి. ఉపేందర్రావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ -
నో అడ్మిషన్ బోర్డు..
మహబూబాబాద్ అర్బన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు పంపించడానికి ఆసక్తి చూపుతున్నారు. అప్పులు చేసి లక్షల్లో ఫీజలు చెల్లిస్తున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మోడల్ స్కూల్లో నాణ్యమైన విద్య అందుతోంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఆదర్శం.. అనంతారం మోడల్ స్కూల్.. మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. అన్ని రంగాల్లో వి ద్యార్థులు ప్రతిభ చాటుతూ ట్రిపుల్ఐటీలో సీట్లు సాధిస్తున్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్,ఆర్మీ,నేవీ, పో లీసు ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నా రు. దీంతో మోడల్స్కూల్లో తమ పిల్లలను చది వించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. నో ఆడ్మిషన్ బోర్డు ఏర్పాటు.. అనంతారం మోడల్ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ముందుగా అర్హత ప్రవేశ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించాలి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయి. సామర్థ్యం మేరకు అడ్మిషన్లు ఫుల్ కావడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టడం గమనార్హం. తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలంటూ ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, రాజకీయ నాయకుల వద్దకు సిఫార్సు వినతిపత్రాలు కోసం తల్లిదండ్రులు వెళ్తున్నారు. కాగా ఏటా డిమాండ్, సౌకర్యాల మేరకు అడ్మిషన్ల సంఖ్యను పెంచుతూ ఒక తరగతికి 100మంది విద్యార్థుల చొప్పున రెండు సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇంటర్లో గ్రూపునకు 40మంది చొప్పున విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నాయి. మోడల్ స్కూల్లో పూర్తిగా నిండిన సీట్లు ఉత్తమ ఫలితాలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తి -
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లోuమూతబడే స్థాయి నుంచి..కురవి: జిల్లాలోని కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్యతండా(ఖాసీంతండా) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత విద్యాసంవత్సరం ముగ్గురు విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ ఏడాది బడి తెరిచే నాటికి ఒక బాలిక గురుకులంలో సీటు రావడంతో వెళ్లిపోయింది. ఈ తరుణంలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే మిగిలారు. దీంతో బడి మూతపడే స్థాయికి చేరింది. అయితే బడిని బతికించాలనే సంకల్పంతో హెచ్ఎం మంజుల బడిబాట కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టారు. అలాగే ప్రతీరోజు ఇంటింటికీ తిరిగి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో వివరాలు తెలుసుకుని, వారు ప్రభుత్వ బడిలో చేరేలా తల్లిదండ్రులను ఒప్పించారు. ఎంఈఓ బాలాజీ సహకారంతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, విద్యావంతులు మద్దతుగా నిలిచారు. ఇలా ఇద్దరు విద్యార్థులు ఉన్న పాఠశాల ప్రస్తుతం 23మందికి చేరింది. అలాగే మరికొంత మంది విద్యార్థులు బడిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా రు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎంఈఓ బాలాజీ ఒక టీచర్ను డిప్యుటేషన్పై పంపించారు. ఇద్దరు టీచర్లు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బడిని బాగు చేసేందుకు గ్రామానికి చెందిన పెద్దలు ముందుకు వస్తున్నారు. బడిని అందంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు.న్యూస్రీల్ -
విద్యారంగంపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. మహబూబాబా ద్ మండలంలోని బ్రాహ్మణపల్లి యూపీఎస్, కొమ్ముగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదుల్లో బోధన పద్ధతులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు. విద్యార్థుల పఠనాభివృద్ధికి పాఠశాలలు తీసుకుంటున్న చర్యలను అభినందించి, ప్రత్యేకంగా కొమ్ముగూడెం పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా కలెక్టర్ ఒక మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ, అత్యుత్తమ సాంకేతిక విద్యా బోధన అందించడం కోసం విద్యాశాఖను బలోపేతం చేస్తుందన్నారు. డీఈఓ రవీందర్ రెడ్డి, డీఎస్ఓ అప్పారావు, హెచ్ఎంలు భద్రు, శివలక్ష్మి, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్మార్ సింగ్ -
ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి
పెద్దవంగర: ఆర్థిక సమస్యలతో కోడలు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మరణ వార్త విన్న మామ గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని అవుతాపురంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేముల సంతోష్కు 2011లో మంచిర్యాలకు చెందిన ఝాన్సీ(30)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు అఖిల్ తేజ, అభిదామిని ఉన్నారు. సంతోష్ స్థానికంగా సీఆర్పీగా పని చేస్తుండగా, ఝాన్సీ తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా విధులు చేపడుతుంది. కాగా, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి వెంటనే తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోడలు మరణ వార్త విన్న మామ వేముల లక్ష్మ య్య(70) తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కుమారుడు సంతోష్ ఒంటరివాడు అయ్యాడని, మనుమడు, మనుమరాలు తల్లిలేని వారయ్యారని కలత చెందాడు. ఇంటికి తిరిగి వెళ్లిన కొద్ది సేపటికే గుండె నొప్పిగా ఉందని భార్య సరోజనతో చెప్పాడు. ఆమె సపర్యలు చేసేలోపే గుండెపోటుతో లక్ష్మయ్య మృతి చెందాడు. కాగా,కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఝాన్సీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేటకు తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై క్రాంతి కిరణ్ను వివరణ కోరగా ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆర్థిక సమస్యలతో కోడలి ఆత్మహత్య ఆమె మరణ వార్త విని గుండెపోటుతో మామ మృతి అవుతాపురంలో విషాదఛాయలు -
సర్కారు బడిబాట
సాక్షి, మహబూబాబాద్: సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు పెరుగుతోంది. బడుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం.. బడిబాటను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతానికి భిన్నంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు సర్కారు బడిబాట పడుతున్నారు. దీంతో గతంలో మూసివేసిన పలు పాఠశాలలు తెరుచుకున్నాయి. గత విద్యా సంవత్సరం వరకు తక్కువ పిల్లలతో వెలవెలబోయిన పాఠశాలలు నిండుగా విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. 4,601 మంది చేరిక ఈ విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి నిర్వహించిన బడి బాట కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 899 పాఠశాలల్లో 4,601 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో కొత్తగా చేరారు. ఇందులో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదివి 5 సంవత్సరాలు నిండిన వారు 1,846 మంది ఉండగా గతంలో ప్రైవేట్ పాఠశాలల్లో చదివి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారు 2,755 మంది ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కురవి మండలంలో 461 మంది పిల్లలను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచింది. కేవలం 10 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన చిన్నగూడూరు మండలం చివరి స్థానంలో నిలిచింది. తెరుచుకున్న పాఠశాలలు.. పిల్లలు లేరనే కారణంతో గత ఏడాది మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం తెరుచుకుంటున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో 148 పాఠశాలలు విద్యార్థులు లేక మూత పడ్డాయి. ఇందులో అత్యధికంగా మరిపెడ మండలంలో 36 పాఠశాలలు ఉండగా.. మహబూబాబాద్ 19, డోర్నకల్ 12, చిన్నగూడూరు 9, తొర్రూరు 8పాటు ఇతర మండలాల్లో మిగిలిన పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది బయ్యారం మండలంలోని ఎంపీపీఎస్ కొత్తూరు హెచ్సీ, ఎంపీపీఎస్ ఐజీ రోడ్ బయ్యారం, ఎంపీపీఎస్ బండ్లకుంట, ఇనుగుర్తి మండలంలోని ఎంపీపీఎస్ లక్ష్మీపురంతండా, ఎంపీపీఎస్ మాస్కుంట తండా, మహబూబాబాద్ మండలం లోని ఎంపీపీఎస్ హజారియాతండా, ఎంపీపీఎస్ చీకటిచింతల తండా, సీరోలు మండలంలోని ఎంపీపీఎస్ గుజిలీతండా, ఎంపీపీఎస్ కర్లకుంట తండా, పెద్దవంగర మండలంలోని ఆర్ఎంఎస్ తండాలోని పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోంది.నమ్మకం కలిగించాం.. అన్ని వసతులు, ఉత్తమ ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత మేరకు అపనమ్మకం ఉంది. ఈ విషయంపై తల్లిదండ్రులతో మాట్లాడి మంచి బోధన అందిస్తామని ఒప్పించాం. నమ్మకం కలిగించే విధంగా వారికి నచ్చజెప్పాం. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. ఈ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. – రవీందర్ రెడ్డి, డీఈఓ●ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న విద్యార్థులు పిల్లల రాకతో మూతబడిన 10 పాఠశాలల్లో బోధన పలు స్కూళ్లలో ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధబడి బాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మండలం అంగన్వాడీల ప్రైవేట్ మొత్తం నుంచి పాఠశాలల నుంచిబయ్యారం 112 128 240 చిన్నగూడూరు 00 10 10 దంతాలపల్లి 59 219 278 డోర్నకల్ 131 212 343 గంగారం 80 03 83 గార్ల 146 115 261 గూడూరు 162 184 346 ఇనుగుర్తి 45 63 108 కేసముద్రం 90 149 239 కొత్తగూడ 110 24 134 కురవి 144 317 461 మహబూబాబాద్ 150 263 413 మరిపెడ 169 210 379 నర్సింహులపేట 66 133 199 నెల్లికుదురు 162 198 360 పెద్దవంగర 65 268 333 సీరోలు 78 110 188 తొర్రూరు 77 149 226 మొత్తం 1,846 2,755 4,601 -
ఎంపీఎస్ఓల కొరత
మహబూబాబాద్: జిల్లాలో ప్రతీ మండలంలో వర్షపాతం నమోదు కోసం ఒక ఎంపీఎస్ఓ అధికారి ఉండాలి. అయితే జిల్లాలోని 18 మండలాలకు 10మంది మాత్రమే ఉన్నారు. ఆటోమేటిక్ వర్షపాతం నమోదు బాధ్యత అంతా సీపీఓ కార్యాలయ అధికారులదే కాగా.. ఒక టెక్నీషియన్కు మరమ్మతుల నిర్వహణ, ఇతర బాధ్యతలు అప్పగించారు. కాగా సిబ్బంది కొరతతో వర్షపాతం నమోదులో కొంత జాప్యంతో పాటు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి 16 మాన్యువల్ నమోదు కేంద్రాలు.. జిల్లాలో18మండలాలు,482 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా పాత 15 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలో మాన్యువల్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉ న్నా యి. మానుకోట మండలానికి చెందిన కేంద్రం మా త్రం ఆర్డీఓ కార్యాలయంలో ఉంది. ఇటీవల ఏర్పా టు చేసిన సీరోలు, ఇనుగుర్తి మండలాల్లో ఏర్పాటు చేయలేదు. ఎంపీఎస్ఓలు రికార్డుల్లో వర్షపాతం వివరాలు నమోదు చేసిన తర్వాత కలెక్టర్ కార్యాల యం, ఆర్డీఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. వేధిస్తున్న కొరత.. 18 మండలాలకు గాను 18 మంది ఎంపీఎస్ఓలు ఉండాలి. కానీ 10 మంది మాత్రమే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన మండలాల్లో ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి నమోదు, నిర్వహణ చేపడుతున్నారు. దీంతో పలువురి అధికారులపై పనిభారం పడుతోంది. ఒక్కరే టెక్నీషియన్.. 18 మండలాలకు గాను 23ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉన్నాయి. వాటి నిర్వహణ, రిపేర్ కోసం ఒక్కరే టెక్నీషియన్ పని చేస్తున్నారు. ఆటోమేటిక్ మిషన్లలో చాలా సమస్యలు వస్తాయి. అన్ని మండలాలకు ఒక్కరే వెళ్లాల్సి వస్తోంది. కాగా మరో టెక్నీషియన్ను నియమిస్తే సమస్యలు చాలా వరకు తీరుతాయి. ఇంటిగ్రేటెడ్ వర్షపాతం ఫైనల్.. ఎంపీఎస్ఓలు సంబంధిత వెబ్సైట్ లాగిన్లో వివరాలు నమోదు చేయాలి. అలాగే ఆటోమెటిక్ వర్షపాతం వివరాలను సీపీఓ సిస్టమ్లో సంబంధిత టెక్నీషియన్ మొబైల్లో చూడవచ్చు. కాగా ఎంపీఎస్ఓలు, టెక్నీషియన్లు సంబంధిత వెబ్సైట్లో మాన్యువల్, ఆటోమేటిక్ కేంద్రాల వర్షపాతం వివరాలను నమోదు చేస్తారు. అదే ఫైనల్గా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అక్కడ ఏర్పాటు చేయాలి.. ఇటీవల ఏర్పాటు చేసిన సీరోలు, ఇనుగుర్తి మండలాల్లో మాన్యువల్ వర్షపాతం నమోదు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అలాగే కేంద్రాల నిర్వహణ, మరమ్మతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడితే నమోదు వివరాలు కచ్చితంగా వస్తాయి. అన్నీ పనిచేస్తున్నాయి.. 23 ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రతీరోజు నమోదును రికార్డు చేస్తున్నాం. ఎలాంటి సమస్య లేకుండా తగు ఏర్పాట్లు చేశాం. భద్రతా దృష్ట్య్టా సబ్ స్టేషన్లలో 22 ఏర్పాటు చేసి, ఒకటి మల్యాల కేవీకేలో ఏర్పాటు చేశాం. కొత్త మండలాల్లో వర్షపాతం నమోదు కేంద్రాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. – దుర్గరాజు, ఉప గణాంక అధికారి 23 ఆటోమేటిక్ నమోదు కేంద్రాలు.. జిల్లాలో 23 ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉన్నాయి. కాగా మానుకోట మండలంలో 3, నెల్లికుదురు 2, నర్సింహులపేట 2, దంతాలపల్లి 1, తొర్రూరు 1, పెద్దవంగర 1, మరిపెడ 1, చిన్నగూడూరు 1, కురవి 1, సీరోలు 1, డోర్నకల్ 2, బయ్యారం 1, గార్ల 1, ఇనుగుర్తి 1, కేసముద్రం 1, గూడూరు 1, కొత్తగూడ 1, గంగారం మండలంలో ఒకటి ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రం ఉన్నాయి. వాటిని భద్రత దృష్టా విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేశారు. గంటగంటకు వర్షపాతం నమోదు అవుతుంది. వర్షపాతం నమోదులో తలెత్తుతున్న సమస్యలు జిల్లాలో 16 మాన్యువల్ వర్షపాతం నమోదు కేంద్రాలు 23 ఆటోమేటిక్ ఎంట్రీ సెంటర్లు -
మేడిగడ్డకు జలకళ..
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ జలకళ సంతరించుకుంటోంది. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం మీదుగా ప్రాణహిత నది గోదావరిలో కలుస్తుంది. అక్కడి నుంచి దిగువన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవా హం తరలుతోంది. దీంతో బ్యారేజీ వద్ద 77,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి వేయడంతో అవుట్ఫ్లో అదే స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా నీరు లేక వెలవెలబోయిన మేడిగడ్డ బ్యారేజీ వరద తాకిడితో జలకళ సంతరించుకుంది. సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద నీరు.. కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. వారం రోజుల నుంచి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో నది నిండుగా ప్రవహిస్తోంది. బుధవారం వరకు 40వేల క్యూసెక్కులతో సాధారణంగా ప్రవహించిన గోదావరి.. గురువారం భారీగా వరద నీరు చేరడంతో 94,500 క్యూసెక్కులతో ప్రవహిస్తోది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీ వద్ద 59 గేట్లలో 14 గేట్లు ఎత్తి 94,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.92టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకు గాను 79.65 మీటర్ల మట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న చొక్కారావు ఎత్తిపోతల నుంచి రెండు మోటార్ల ద్వారా 494 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్ బాబు తెలిపారు. -
అన్నదాతల అగచాట్లు..
దుగ్గొండి: వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. దీంతో రైతులు పంటలకు వేయడానికి ఎరువుల కోసం చూస్తున్నారు. ఇదే క్రమంలో యూరియా కొరత ఉందని, ఒక రైతుకు నెలకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తామని ప్రచారం కావడంతో అన్నదాతలు ఒక్కసారిగా యూరియా కోసం ఎగబడ్డారు. బుధవారం మండలంలోని మందపల్లి, దుగ్గొండి, మహ్మదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 20 టన్నుల చొప్పున యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు గురువారం తెల్లవారుజాము నుంచే గోదాముల వద్ద బారులు తీరారు. అయితే ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారని, అంతకంటే ఒక్కబస్తా కూడా ఎక్కువ ఇచ్చేది లేదని పీఏసీఎస్ సిబ్బంది తెలిపారు. దీంతో చేసేది ఏమీ లేక రైతులు క్యూలో నిలబడి రెండు బస్తాల చొప్పున తీసుకెళ్లారు. పైగా రెండు బస్తాల యూరియా కావాలంటే అరలీటర్ నానో యూరియా లింకు పెట్టి మరీ అమ్మకాలు సాగించారు. కాగా, యూరియా విక్రయ కేంద్రాల వద్ద జిల్లా వ్యవసాయ శాఖ అఽధికారి పేరిట ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధను వివరణ కోరగా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఆ ఆడియో తనది కాదని, అది ఫేక్ అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. జిల్లాలో యూరియా నిల్వ లు సరిపడా ఉన్నాయని తెలిపారు. యూరియా లేదని, దొరకదనే ప్రచారాన్ని నమ్మి అవసరం లేకున్నా తీసుకోవద్దని సూచించారు. రైతుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూరియాను పీఏసీఎస్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో తీసుకోవచ్చని ఆమె తెలిపారు. యూరియా కోసం బారులు రెండు బస్తాలకు మించి ఇవ్వలేమంటున్న సొసైటీ సీఈఓలు -
భూ కేటాయింపు ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలి
కేయూ క్యాంపస్: యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కాకతీయ యూనివర్సిటీ భూములు కేటాయిస్తూ యూనివర్సిటీ పాలకమండలి ఆమోదించిందని, ఈ ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రిజిస్ట్రార్ చాంబర్లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారులు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూ కేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఈనెల 7న జరిగే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఓ వర్గాన్ని తయారు చేసుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ను యూనివర్సిటీ భూముల్లోనే నిర్మించేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇది సరికాదని, యూనివర్సిటీ బయట ప్రభుత్వ భూముల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన సమయంలో రిజిస్ట్రార్ వి.రామచంద్రం చాంబర్లోనే ఉన్నారు. రెండు గంటలకుపైగా ఆందోళన కొనసాగడంతో రిజిస్ట్రార్ వద్దకు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారికి అవకాశం లేకుండా పోయింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ స్కూల్ నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ పాలకమండలిలో ఆమోదించారని,ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలంటే మళ్లీ పాలకమండలిలోనే చర్చించాల్సింటుందన్నారు. ఆందోళన సమాచారం అందుకున్న కేయూ సీఐ రవికుమార్, ఎస్సై నవీన్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి సంఘాల బాధ్యులను కేయూ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ కొద్ది సమయం తర్వాత విడిచిపెట్టారు. కార్యక్రమంలో ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, కోకన్వీనర్ మున్నా గణేశ్, బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, బాధ్యులు వీరస్వామి, వస్త్రం అనిల్, కొత్తూరు రోహిత్,స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమమకొండ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మర్రి మహేశ్, ఏఐడీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు మధు, సురేశ్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయి, యూనివర్సిటీ కన్వీనర్ అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు. లేనిపక్షంలో కేయూ స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటాం వివిధ విద్యార్థి సంఘాల బాధ్యుల డిమాండ్ రిజిస్ట్రార్ చాంబర్లో ఆందోళన -
బట్టలు విప్పాలనే ఉత్సాహంగా ఉందా..
జనగామ: ‘అసెంబ్లీలో మా బట్టలు విప్పుతామంటున్నారు, అక్కడ చర్చ మాత్రమే జరగాలి, మీ పార్టీ(బీఆర్ఎస్)ఆఫీసుకు నాతోపాటు కార్యకర్తలతో కలిసి వచ్చి గుడ్డలు విప్పి చూపిస్తాం, ఏం కావా లో చూసుకోండి’ అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్రావును ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, దీనిని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు చెడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని పదేపదే చెబుతున్నా, బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో రాయలసీమ రతనాల సీమ చేస్తామని, చేపల పులుసు తిని హామీ ఇచ్చి, ఈ రోజు బనకచర్ల బంకను తీసుకువచ్చి, మళ్లీ తెలంగాణ ఉద్యమ సెంటిమెంటును రగిలించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వచ్చి బట్టలు విప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నీ వు, నీ బామ్మర్ధి చూసుకునేందుకు సిద్ధమా అని ఎంపీ.. హరీశ్రావు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ చామల బావ, బామ్మర్దులకు ఏం కావాలో చూసుకోండి అసెంబ్లీలో చర్చ మాత్రమే జరగాలి భువనగిరి ఎంపీ చామల హాట్ కామెంట్స్ -
చోరీకి గురైన వాహనాల అప్పగింత
వరంగల్ క్రైం : హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ తనిఖీలతో డిసెంబర్, 2024 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన పది బైక్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ రాయల ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ద్విచక్రవాహనాన్ని బాధిత యజమానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అప్పగించిన పది ద్విచక్రవాహనాల్లో 9 బైక్లపై కరీంనగర్, కొండాపూర్, సదాశివపేట, రాజన్న సిరిసిల్ల, ఆకివీడు (ఆంధ్రప్రదేశ్), ధర్మసాగర్, సుబేదారి, గోదావరిఖని, మహబూబాబాద్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్లు, ఒక వాహనం కాటారం (భూపాలపల్లి జిల్లా)కు సంబంధించినట్లు వివరించారు. కార్యక్రమంలో వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ, హనుమకొండ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాము కాటుతో రైతు మృతి ● రాజోలులో ఘటన కురవి: పొలంలో పనిచేస్తుండగా పాము కాటు వేయడంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండలంలోని రాజోలులో చోటుచేసుకుంది. ఎస్సై గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోదాసి వరదయ్య(66) తన పొలంలో పనిచేసుకుంటున్న క్రమంలో పాము కాటు వేయడంతో అక్కడి నుంచి ఇంటికొచ్చి తన మనుమడికి విషయం చెప్పాడు. వెంటనే వరదయ్యను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. గంజాయి సేవిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్ న్యూశాయంపేట : వరంగల్ శివనగర్లోని ఓ ఇంట్లో గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను వరంగల్ నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు కథనం ప్రకారం.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ట్రోల్ ఫ్రీ నంబర్ 1908కు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రాత్రి ఆ ఇంటికి చేరుకున్నారు. గంజాయి సేవిస్తున్న నలుగురు యు వకులను అరెస్ట్ చేసిన రిమాండ్ నిమిత్తం కో ర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. కాగా, ఆ నలుగురు యువకులు పద్మాక్షి గుట్ట వద్ద షెహర్లాల్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేశారని, అతడిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీ ఎస్పీ గురువారం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై మొగిలి హెడ్కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్లు రాజేశ్, విజయ్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో విద్యుత్ కాంట్రాక్టు హెల్పర్ దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతికలోపాన్ని సరిచేసేందుకు వెళ్లిన విద్యుత్ కాంట్రాక్టు (ఆన్ మ్యాన్డ్) హెల్పర్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామ శివారులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, విద్యుత్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన గట్ల కరుణాకర్ రెడ్డి (46) విద్యుత్శాఖలో కాంట్రాక్టు (ఆన్ మ్యాన్డ్) పద్ధతిపై హెల్పర్గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం స్థానిక రైతులు పలు ప్రాంతాల్లో విద్యుత్ సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పడంతో గ్రామ శివారులోగల ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటారుకు సంబంధించిన స్టార్టర్ వద్ద మరమ్మతులు చేస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా సర్వీస్ వైరు ఆయనకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయేందర్ రెడ్డి, డీఈ విజయ్ కుమార్, ఏడీఈ ప్రశాంత్, రూరల్ ఇన్చార్జ్ ఏఈ వెంకటేశ్, మున్సిపాలిటీ ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి, ఇతర సిబ్బంది, ఉద్యోగులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ప్రియాంక, కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సుశాంత్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో కరుణాకర్ రెడ్డి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చాలామంచి సేవకుడిని కోల్పోయాం... కరుణాకర్ రెడ్డి దుర్మరణం విషయం తెలుసుకున్న వెంటనే ఈదులపూసపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాలవాసులు సంఘటన స్థలానికి వచ్చి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. కరుణాకర్ రెడ్డి ఎంతో మంచి సేవకుడని, ఏసమయంలోనైనాసరే కరెంటు సమస్య వచ్చిందని ఫోన్ చేసి చెప్పగానే ఆలస్యం చేయకుండా వచ్చి మరమ్మతులు చేసి వెళ్లిపోయే వాడని కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ కార్మికుడికి తీవ్ర గాయాలు.. మొగుళ్లపల్లి: విద్యుత్ స్తంభంపై మరమ్మతు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ సరఫరా కావడంతో ఓ కార్మికుడు కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం మండలంలోని మొట్లపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మొట్లపల్లి గ్రామ ఉపవిద్యుత్ కేంద్రంలో గ్రామానికి చెందిన జన్నె అనిల్ కొన్ని సంవత్సరాలుగా అన్మ్యాన్డ్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజుమాదిరిగానే విధి నిర్వహణలో భాగంగా ఎల్సీ తీసుకుని మరమ్మతు చేస్తున్నాడు. కాగా, అదే లైన్ మీద నుంచి కొద్ది దూరంలో 33కేవీ సామ్యర్థం గల మరో లైన్ వెళ్తోంది. ఈ క్రమంలో అనిల్ మరమ్మతు చేస్తున్న లైన్కు సంబంధించిన తీగ ప్రమాదవశాత్తు మరో లైన్కు చెందిన 33కేవీ తీగకు తాకింది. దీంతో విద్యుత్ సరఫరా జరగడంతో అనిల్ ప్రమాదానికి గురై స్తంభంపై నుంచి పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. -
బాలుడిపై వీధి కుక్కల దాడి
గూడూరు: మండల కేంద్రంలోని లక్ష్మీనా రాయణస్వామి దేవాలయ సమీప ఓ వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై కు క్కలు దాడికి పాల్ప డిన సంఘటన బుధవారం జరిగింది. బాలుడు అమ్మ మ్మ గారి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వచ్చిన మూడు కుక్కలు ఒక్కసారిగా బాలుడిని కరుస్తూ గీరడం మొదలు పెట్టా యి. దీంతో ఆ బాలుడి అరుపులకు కుటుంబ సభ్యులు రాగా కుక్కలు పరారయ్యాయి. గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. పట్టణ కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువైందని, చిన్నారులు, వృద్ధులు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని, కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఈసారి ముందస్తుగానే.. మహాజాతర
ఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజా రులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తా రు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి చివరివారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు. 20 రోజుల ముందుగానే జాతర ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన మేడారం మహా జాతర ఈసారి 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది.దీంతో 20 రోజుల ముందుగానే మహా జాతర జరగనుంది. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి, అమ్మవార్ల ఘడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి జాతర తేదీలను అమా వాస్య రోజుల్లో పౌర్ణమికి ముందుగా నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి 2026 జనవరి 17 నుంచి అమావాస్య మాసం ప్రారంభం కావడం, జనవరి 31న పౌర్ణమి అవుతుండడంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా జాతర తేదీలను నిర్ణయించారు. అంటే అధిక అమావాస్య రావడంతో ఈసారి జనవరిలోనే నిర్ణయించినట్లు పూజారులు వెల్లడించారు. 2018లో జనవరిలోనే జాతర.. గత మహాజాతరల తేదీలతో పోలిస్తే 2018లో జనవరి 31నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర తేదీలను నిర్ణయించారు. అలాగే 2010లో ఫిబ్రవరి 17నుంచి 20 వరకు, 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వరకు, 2014లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు, 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు, 2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు, 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర సాగింది. 2018లో మాత్రం జనవరి 31 నుంచి జాతర సాగగా.. ఈ దఫా 2026 జనవరి నెలాఖరులోనే జాతర సాగనుంది. అధికార యంత్రాంగం సమాయత్తం మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై సమాయత్తం కానుంది. ఈ సారి ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఇప్పటికే మేడారంలో శాశ్వత నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇకనుంచి జిల్లా యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై ప్రణాళికలతో ముందుకెళ్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు.అధిక అమావాస్య రాకతో జనవరిలో నిర్వహణ మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు 2026 జనవరి 28 నుంచి 31 వరకు.. కొనసాగుతున్న శాశ్వత అభివృద్ధి పనులుజాతర ఇలా.. జనవరి 28వ తేదీ: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాక 29వ తేదీ : సమ్మక్క గద్దైపెకి 30వ తేదీ : భక్తుల మొక్కుల చెల్లింపు 31వ తేదీ : దేవతల వనప్రవేశం -
విత్తనాలు విత్తేందుకు అనుకూలం
ఇటీవల కురిసిన వర్షాలతో విత్తనాలు మొలకెత్తేందుకు అనుకూలమైన పదును వచ్చింది. ఈనెల15 వరకు పత్తి, మొక్కజొన్న, మెట్ట భూముల్లో పునాస పంటలు వేసుకోవచ్చు. వరిలో 150 రోజుల పంట కాలం రకాలు కాకుండా 120 రోజుల పంట కాలం రకాలు నారు పోసుకోవాలి. ఇందులో కూనారం 1638, 733, 118, వరంగల్ రకం 962, 915, జగిత్యాల రకం(జేజీఎల్)24423, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా, 21278 రకాలను నారుపోసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వం అందించే బోనస్ కూడా వస్తుంది. – క్రాంతి కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త, కేవీకే మల్యాల● -
అభివృద్ధి పథంలో తెలంగాణ
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సన్నాహక సమావేశం పార్టీ పార్లమెంట్ నియోజవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్ రావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారన్నారు. నా యకులు, కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకు ఖర్గే వస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తప్పనిసరిగా ఖర్గే సభకు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని, సెప్టెంబర్ లోపు గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సి పాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మానుకోట, భద్రాచలం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీనాయక్, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మద్ది బేబీస్వర్ణకుమారి, నాగ సీతారాములు, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, కేసముద్రం ఏఎంసీ చైర్మన్ ఘంట సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ -
మేడిగడ్డకు పెరుగుతున్న వరద
పొంగిన పాకాల ఏరు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని పాకాల ఏరు బుధవారం సాయంత్రం నుంచి చెక్డ్యాంనుంచి ప్రవహిస్తోంది. దీంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ పంచాయతీల గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన గార్లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాకాల ఏటిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. – గార్లకాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్పల్లి సమీపంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి)బ్యారేజీకి ప్రాణహిత వరద తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత వరద ప్రవాహం కాళేశ్వరం మీదుగా మేడగడ్డకు చేరుతోంది. దీంతో బుధవారం సాయంత్రం వరకు 36,900 క్యూసెక్కుల వరద ప్రవాహం బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. -
మొక్కలకు జీవం!
జిల్లాలో వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో) మండంల వర్షపాతం గార్ల 87.8కేసముద్రం 68బయ్యారం 64.8గూడూరు 62.8మహబూబాబాద్ 52 కురవి 50.8 దంతాలపల్లి 11.4 పెద్దవంగర 12.4 తొర్రూరు 16.4 నర్సింహులపేట 18.4సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు నాటిన పత్తి, మొక్కజొన్న విత్తనాల్లో కొన్ని మొలకెత్తగా, సరిగ్గా పదును లేక మరికొన్ని చోట్ల మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలకు నీరు లేక వాడిపోతున్న తరుణంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు జీవం పోశాయి. ప్రస్తుతం విత్తనాలు నాటేందుకు అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పడంతో రైతులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. 82,120 ఎకరాల్లో సాగు.. వానాకాలం సీజన్లో 4,29,790ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 2,19,143 ఎకరాల్లో వరి, 84,854 ఎకరాల్లో పత్తి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న, 52,249 ఎకరాల్లో మిర్చి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు పంట ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలు 82,120 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 54,348 ఎకరాల్లో పత్తి, 16,043 ఎకరాల్లో మొక్కజొన్న, 9,996 ఎకరాల్లో జీలుగ,641 ఎ కరాల్లో పెసర,437ఎకరాల్లో జనుముతోపాటు కొద్ది పాటి ఎకరాల్లో పసుపు, కంది పంటలు సాగు చేశా రు. ఈవర్షంతో జూలై 5వరకు పత్తి గింజలు వేసే అ వకాశం ఉండడంతో మిగిలిన విస్తీర్ణంలో పత్తి గింజ లు పెడుతున్నారు.530ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా జల్లులు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురిశాయి. జిల్లాలో మొత్తం 631 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. 16 మండలాల్లో సగటున 39.5 మిల్లీ మీటర్లు నమోదైంది. అత్యధికంగా గార్ల మండలంలో 87.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా దంతాలపల్లి 11.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షపాతం స్వల్పమే అని.. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసి చెరువులు నిండితేనే పంటలకు భరోసా వస్తుందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షం కురిస్తే రైతులకు సాగునీటిపై రందీ ఉండదని అంటున్నారు. వర్షాలతో ప్రాణం పోసుకున్న పత్తి, మొక్కజొన్న పంటలు ఈనెల 15 వరకు విత్తనాలు నాటేందుకు అనుకూలం వరిలో స్వల్పకాలిక వంగడాల నారు పోసేందుకు సిద్ధం జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలతో అన్నదాతల్లో ఆనందం -
దంపతుల మధ్య గొడవ..
● మనస్తాపంతో మహిళ ఆత్మహత్య ● తూర్పు తండాలో ఘటన సంగెం: దంపతుల మధ్య గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ క్షణికావేశంలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగెం మండలం నల్లబెల్లి శివారు తూర్పు తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా జ్యోతి(44), బాలరాజు దంపతులకు ఇద్దరు కుమారులు సంతోశ్, సందీప్ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడికి వివాహం జరగగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. బుధవారం కుటుంబం, మేకలు మేపడానికి వెళ్లే విషయాల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతి బావిలో దూకుతుండగా పక్క చేనులో కలుపు తీస్తున్న మహిళా రైతు బానోత్ బుజ్జమ్మ చూసి తండాకు చెందిన మూడు మోతీలాల్కు చెప్పింది. మోతీలాల్ తండాకెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూడగా జ్యోతి బావిలో కనిపించలేదు. డయల్100కు కాల్ చేసి విషయం తెలపడంతో స్థానిక పోలీసులు.. ఫైర్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా వారు వచ్చి వెతకగా జ్యోతి మృతదేహం లభించింది. మృతురాలి కుమారుడు సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు. -
డీటీఓ కార్యాలయంలో ఏజెంట్ల దందా..?
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా రవా ణాశాఖ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఏడాది క్రితం కార్యాలయ అధికారులు లైసెన్స్ల జారీ కోసం ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అనుమానం రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏజెంట్ల నుంచి రూ. 4,5100, అధికారి డ్రైవర్ నుంచి రూ.1,6500, జేఏ నుంచి రూ. 895 నగదును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అదే విధంగా కార్యాలయంలోనే ఓ అవుట్సోర్సింగ్ ఉ ద్యోగి మద్యం తాగడం వివాదాస్పదంగా మారింది. అలాగే డీటీఓగా బాధ్యతలు చేపట్టిన భద్రునాయక్పై ఆరోపణలు రావడంతో రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇలా మానుకోట డీటీఓ కార్యాల యం పలు వివాదాలకు కేరాఫ్గా మారింది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం 10గంటలకు లైసెన్స్ కోసం తాళ్లపూసపల్లికి చెందిన ఓ వ్యక్తి.. ఏజెంట్ను సంప్రదించగా డబ్బులు అధికంగా వసూలు చేశాడు. దీంతో మాటామాట పెరిగి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆర్డీఓ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో తనిఖీతో పాటు విచారణ చేపట్టారు. లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర అవసరాల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి ఏజెంట్లు పనికో రేటు ఫిక్స్చేసి అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల ప్రకారం కార్యాలయంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడి కలెక్టర్కు ఫిర్యాదు.. ఆర్డీఓ విచారణ -
పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేసి వెళ్తూ..
స్టేషన్ఘన్పూర్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన పిల్లలకు నోట్ పుస్తకాలు కొనుగోలు చేసి వెళ్తున్న క్రమంలో తండ్రి అనంతలోకాలకు చేరాడు. బైక్పై వెళ్తూ ముందు వెళ్తున్న మరో బైక్ను ఢీకొట్టి కిందపడ్డాడు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు మీది నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన బుధవారం ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జిట్టెగూడెం తండాకు చెందిన లావుడ్య కుమార్(32) తన పిల్లలకు నోట్ పుస్తకాలతో పాటు ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు సమీపంలోని నారాయణలొద్ది తండాకు చెందిన లకావత్ భిక్షపతితో కలిసి తన బైక్పై స్టేషన్ఘన్పూర్ వచ్చాడు. పుస్తకాలు కొనుగోలు చేసిన అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తిరిగి జిట్టెగూడెం తండాకు బయలుదేరాడు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ మోడల్ కాలనీ సమీపాన జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టి ఇద్దరు బైక్తో సహా రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో హనుమకొండ నుంచి జనగామ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు రోడ్డుపై పడిన వారిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా భిక్షపతికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటనపై ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు నడిపి తన భర్త మృతికి కారణమయ్యాడనే మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. కాగా, మృతుడికి ఐదేళ్లలోపు వయసున్న కుమారుడు జనార్ధన్, కుమార్తె జాను ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు స్టేషన్ఘన్పూర్లో ఘటన -
ఇక వినియోగంలోకి..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లోని అన్యూజ్డ్ పోస్టులకు మోక్షం లభించింది. ఏళ్లుగా పక్కకు పెట్టిన ఆ పోస్టులు ఎట్టకేలకు ఇక వినియోగంలోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 216 అన్యూజ్డ్ పోస్టులతో పాటు ప్రస్తుతం అవసరం లేని 217 పోస్టులను రద్దు చేస్తూ అవసరమైన 339 పోస్టులను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానీయా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏళ్లుగా వినియోగంలో లేని డీఎం గ్రేడ్–1, హెల్పర్ బెంచ్, గన్మాన్, టెలిఫోన్ బాయ్, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టూల్ కీపర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ కమ్ మిక్సర్, టెలిఫోన్ ఆపరేటర్, ఎస్ఎస్ఎ, ఎల్ఎండీ, జేఎల్ఎండీ, క్లీనర్, రోనియో ఆపరేటర్, లష్కర్ వంటి 216 పోస్టులతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రద్దు చేస్తూ కొత్త పోస్టులుగా పునరుద్ధరించారు. దీంతో కొత్తగా 2 చీఫ్ ఇంజనీర్, 1 జాయింట్ సెక్రటరీ, 4 సూపరిటెండెంట్ , 1 జనరల్ మేనేజర్, 4 డివిజనల్ ఇంజనీర్, 4 సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, , 6 అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, 1 అకౌంట్స్ ఆఫీసర్, 2 అసిస్టెంట్ అకౌంట్ , 4 పర్సనల్ ఆఫీసర్ , 16 సబ్ ఇంజనీర్, 16 అసిస్టెంట్ ఇంజనీర్, 20 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 32 సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, 88 సీనియర్ అసిస్టెంట్, 48 అసిస్టెంట్ లైన్మెన్, 80 ఆఫీస్ సబార్డినేట్, 4 వాచ్మెన్, స్వీపర్ కమ్ గార్డెనర్, స్వీపర్, 6 శానిటరీ ఆర్డర్లీస్ పోస్టులు మంజూరయ్యాయి. దీంతో అధికా రుల కొరత తీరనుంది. పెరిగిన ఉన్నత స్థాయి పోస్టులతో పదోన్నతి.. ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో పదోన్నతి లభించనుంది. అన్ యూజ్డ్ పోస్టులను నూతన పోస్టులుగా సృష్టించేందుకు ప్రభుత్వ అనుమతి కోరినప్పటి నుంచి చాలా మంది ఆశావహులు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టిస్తూ అనుమతి ఇవ్వడంతో వారిలో సంతోషం వెల్లివిరిస్తోంది. సీజీఎం, ఎస్ఈ, డీఈ, ఏడీఈ, జనరల్ మేనేజర్, జాయింట్ సెక్రటరీ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతి కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. పోస్టులకు అనుమతి వచ్చినా పదోన్నతి ప్రక్రియ అంశం కోర్టులో ఉంది. పదోన్నతులపై హైకోర్టు స్టే విధించడంతో కొంత కాలంగా ఈ ప్రక్రియ నిలిచింది. కోర్టు ఏ క్షణాన స్టే ఎత్తివేసిన వెంటనే పదోన్నతి కల్పించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంది. నూతన పోస్టుల కోసం టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి కృషి ఫలించిందని ఆయా సంఘాలు, అసోసియేషన్ల నాయకులు తెలిపారు. అవసరమైన పోస్టులు పెరగడంతో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. ఎట్టకేలకు అన్యూజ్డ్ పోస్టులకు మోక్షం 339 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో లభించనున్న పదోన్నతి ఆశావహుల్లో వెల్లువెత్తిన సంతోషం.. తీరనున్న అధికారుల కొరత -
వృత్తి నైపుణ్యంతోనే విధుల్లో రాణింపు
వరంగల్ క్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సొంతం చేసుకోవాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే భద్రాది కొత్తగూడెం జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భద్రాది పోలీస్ డ్యూటీ మీట్లో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లు, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతీ విభాగంలో ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్కు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. నేరాలు త్వరితగతిన ఛేదించేందుకు, సాక్ష్యాలను శాసీ్త్రయంగా విశ్లేషించడానికి, ప్రజలకు న్యాయం అందించేందుకు ఈ వృత్తి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్, జోన్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ -
భర్త, యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గార్ల: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్కుమార్తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్కుమార్ హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు. -
చిరుద్యోగుల విభజనకు షెడ్యూల్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పూర్వ వరంగల్ సర్కిల్లో నిలిచిన చిరుద్యోగుల విభజన ప్రక్రియ అడుగు ముందుకు పడింది. మూడేళ్లుగా జాప్యం జరుగుతూ వస్తున్న ఆ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభకానుంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఎం ఆడిట్ చైర్మన్గా, హనుమకొండ సర్కిల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కన్వీనర్గా, ఆరు సర్కిళ్ల ఎస్ఈలు సభ్యులుగా ఉన్న కమిటీ.. వాచ్మెన్, స్వీపర్, ఎల్ఎండీ పోస్టుల బైపర్కేషన్కు నిర్ణయం తీసుకుంది. వాచ్మెన్, స్వీపర్, ఎల్ఎండీలకు ఈ నెల 15 వతేదీ వరకు వారు ఎక్కడి వెళ్తారో సంసిద్ధత తెలిపేందుకు దరఖాస్తులు అందిస్తారు. పూరించిన ఆ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు స్వీకరిస్తారు. ఆగస్టులో పరిశీలించి ఉద్యోగుల విభజన పూర్తి చేస్తారు. ఈ మేరకు సీజీఎం ఆడిట్ షెడ్యూల్ ఖరారు చేశారు. టెమ్రిస్ ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీగా సతీశ్ న్యూశాయంపేట : తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల(టెమ్రిస్) ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ లేవల్ కో–ఆర్డినేటర్(ఆర్ఎల్సీ)గా హనుమకొండ(బి–1) గురుకులం ప్రిన్సి పాల్ డాక్టర్ జంగా సతీశ్ నియమితులయ్యా రు. ఈ మేరకు సెక్రటరీ షఫియుల్లా బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఆర్ఎల్సీలు మూడు జిల్లాలకు ఒకరు చొప్పున పదహారు గురుకులాలను పర్యవేక్షిస్తుండగా ఉమ్మడి జిల్లాలో ఉ న్న 16 గురుకులాలను ఒక్కరే పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్ఎల్సీగా నియమితుడైన సతీశ్ను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందించారు. వరంగల్ మీదుగా తిరుపతికి 8 వీక్లీ రైళ్లుకాజీపేట రూరల్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి పుణ్యక్షేత్రానికి వరంగల్ మీదుగా జూలై 6వ తేదీ నుంచి కరీంనగర్–తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల సర్వీస్ల వివరాలు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతి–కరీంనగర్ (02761) వీక్లీ ఎక్స్ప్రెస్ వరంగల్కు ప్రతీ సోమవారం వచ్చి వెళ్తుంది. 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్–తిరుపతి (02762) వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ సోమవారం వరంగల్కు వచ్చి వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్లకు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లిలో అప్ అండ్ డౌన్ రూట్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం
వేలేరు: కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులతో కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 17 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్రావే ప్రధాన కారణమని ఆరోపించారు. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, మనిషికి గుండె ఎంత ముఖ్యమో కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ అంతేముఖ్యమన్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ద్వారా కనీసం 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు నాంది పలికింది కేసీఆరేనని, గతంలో ఆయన ఆంధ్రా ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హక్కులే ముఖ్యమని, బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులను ఆపి తీరుతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఏఓ కవితా, ఎంపీఓ భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, కాంగ్రెస్ నాయకులు బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, మల్లికార్జున్, రాజిరెడ్డి, ప్రమోద్ రెడ్డి, లక్ష్మణ్నాయక్, రవీందర్, రణధీర్ రెడ్డి, సలీంమాలిక్, తదితరులు పాల్గొన్నారు.కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్రావే కారణం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
గుంత.. చింత!
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuజిల్లాలోని మహబూబాబాద్ మినహా తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ ఐదేళ్ల ముందు ఏర్పడిన మున్సిపాలిటీలు, కేసముద్రం మున్సిపాలిటీ ఈ ఏడాది ఏర్పడింది. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో.. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కాలనీలు, విలీన ప్రాంతాల్లోని రోడ్లను పట్టించుకున్న వారు కరువయ్యారు. దీంతో గతంలో పోసిన మట్టి రోడ్లపై గుంతలు పడ్డాయి. వానాకాలంలో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. – సాక్షి, మహబూబాబాద్మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా రోడ్లు ● గుంతల్లో నిండిన నీళ్లు.. నడిచేందుకు ఇబ్బందులు ● మరమ్మతుల్లో అధికారుల జాప్యం ● మట్టిరోడ్ల స్థానంలో సీసీ రోడ్లు వేయాలని వేడుకోలు న్యూస్రీల్ -
పథకాలను వేగవంతంగా అమలు చేయాలి
హన్మకొండ: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి అన్నారు. పథకాల అమలు వేగవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఉమ్మడి జిల్లాల వారీగా సూపర్వైజర్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ క్రమంలో సంగీత లక్ష్మి హనుమకొండలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానాకాలం పూర్తయ్యేలోపు మూడు నెలల్లో ఆయిల్ పాం తోటల పెంపకంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా ఇతర తోటల పెంపకాన్ని పూర్తి చేయాలని, సూక్ష్య సేద్యపు పరికరాల బిగింపు పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతీ వారం సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా నివేదికను వ్యవసాయ శాఖ మంత్రికి అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ డీహెచ్ఎస్ఓలు జి.అనసూయ, ఆర్.శ్రీనివాసరావు, మిరయన్న, శ్రీధర్రావు, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. వానాకాలంలోపు తోటల పెంపకం పూర్తి చేయాలి ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి