-
అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ రాజేశ్వర్రావుకు బుధవారం టీఎస్యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. జూన్ 3నుంచి నిర్వహించే బడిబాట కార్యకమ్రంలో భాగంగా మూతపడిన పాఠశాలలను తెరిపించి, టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల ప్రవేశాల ను పెంచేందుకు ప్రణాళిక చేపట్టాలన్నారు. డీఈఓ కార్యాలయంలో కొన్ని సంవత్సరాలుగా డిప్యుటేషన్పై పనిచూస్తూ విద్యాబోధనకు దూరంగా ఉన్న ఉపాధ్యాయులను తిగిరి పాఠశాలలకు పంపించాలన్నారు. ఎలాంటి డిప్యుటేషన్ లేకున్నా కొందరు ఉపాధ్యాయులు పాఠశాల పనివేళల్లో డీఈఓ కార్యాలయంలో ఉంటున్నారని ఆరోపించారు. విద్యాశాఖలో సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో పనులు పూర్తి చేయాలి
డోర్నకల్: జిల్లాలో ఎంపికైన ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించా రు. మండలంలోని చాప్లాతండా, గొల్లచర్ల ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదులతో పాటు పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక చేసిన అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, జూన్ 6వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, పీఆర్ డీఈ జుంకీలాల్, ఏఈ సఫ్తర్ అలీ, ఐకేపీ ఏపీఓ శంకర్నాయక్, హెచ్ఎం ఎం విశ్వనాథం, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పనుల పురోగతిపై సమీక్ష... మండల పరిధి 24 పాఠశాలల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, ఎంపీడీఓ శ్రీనివా సరావు, పీఆర్ డీఈ జుంకీలాల్, ఏఈ సఫ్తర్ అలీ ఆధ్వ్యంలో హెచ్ఎంలు, స్కూల్ చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. పరిశీలన.. గార్ల: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను జూన్ 11నాటికి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని అంజనాపురం, చిన్నకిష్టాపురం ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టే టాయిలెట్లు, లైటింగ్, ఫ్యాన్లు, తదితర మరమ్మతు పనులను మండల అధికారులు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. బిల్లులు రావడం లేదని కొన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, పనులు పూర్తి కాగానే వెంటనే ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ మంగమ్మ, ఎంపీఓ రజిని, పాఠశాలల హెచ్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని మోడల్ స్కూల్ ఇంటర్లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీ వరకు గుడువు ఉందని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉందన్నారు. బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ వసతి ఉందని, పూర్తి వివరాలకు జిల్లాలోని మోడల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రదించాలన్నారు. -
ముందస్తు చర్యలు!
నెహ్రూసెంటర్: కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులతో వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వానాకాలంలో విష జ్వరాలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తుంటాయి. దీంతో పాటు డెంగీ, మలేరియా, చికున్గున్యా, అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. నీరు, ఆహారం కలుషితంతో బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్ వ్యాధులు ప్రజలపై దాడులకు దిగుతున్నాయి.కాగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. సిబ్బంది అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. కలుషిత నీరు, ఆహారంతో.. వానాకాలంలో ఎక్కువగా తాగునీరు కలుషితం అవుతుంది. అపరిశుభ్రమైన నీరు, కలుషిత వస్తువులతో తయారు చేసే ఆహార పదార్థాల వల్ల అనారోగ్యం పాలవుతుంటారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వలన విష జ్వరాలు, ఫుడ్పాయిజన్, ఇతర వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. ఈ సీజనల్ కాలంలో బయట వస్తువులకు దూరంగా ఉండాలని, చల్లటి పదార్థాలు తీసుకోవద్దని, వీధుల్లో విక్రయించే ఫుడ్ను సాధ్యమైనంత వరకు తిరస్కరించాలని సూచిస్తున్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వైద్య సిబ్బందికి శిక్షణ.. వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తమకు కేటాయించిన గ్రామాల్లో సిబ్బంది ప్రజలకు వ్యాధులుపై అవగాహన కల్పిస్తూ నీరు, దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను చేపట్టాలని వివరించారు. నిరంతరం ఇంటింటా సందర్శించి ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి శిక్షణలో వివరిస్తున్నారు. వైద్యారోగ్యశాఖతో పాటు పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ అభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టేలా ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులను నివారణలో వైద్య సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరం. వ్యాధులపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. వైద్య సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. జ్వరాలు వస్తే వెంటనే సమీపంలోని పీహెచ్సీ, ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. – కళావతిబాయి, డీఎంహెచ్ఓ పరిశుభ్రత పాటిస్తేనే.. అంటువ్యాధులు వ్యాప్తిచెందకుండా ఉండాలంటే పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. మురికి నీరు నిల్వ ఉండకుండా, పరిసరాలను శుభ్రం చేసుకుంటూ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే, ఫ్రైడే పాటించాల్సిన అవసరం ఉంది. దోమలు గుడ్లు పెట్టకుండా, లార్వా పెరగకుండా నివారించడానికి డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అవగాహ న పెంచుకోవడం ద్వారా విష జ్వరాల బా రిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలని వైద్యులు తెలుపుతున్నారు. సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్యశాఖ అప్రమత్తం ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది ఫ్రైడే డ్రై డే పాటించాలని సూచనజిల్లాలో కేసుల వివరాలు ఇలా... సంవత్సరం డెంగీ మలేరియా 2020 7 7 2021 43 43 2022 125 125 2023 40 40 2024 13 13 -
సూర్య ప్రతాపం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. వారం క్రితం చిరుజల్లులతోపాటు మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్ల బడింది. అయితే రెండు రోజుల నుంచి భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తున్నాయి. త్రీవఎండకు ఉక్కపోత తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. బుధవారం కేసముద్రం మండలంలో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మానుష్యం.. రోహిణికార్తె ప్రారంభంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఉదయం 8గంటల తర్వాత జిల్లా కేంద్రంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రహదారుల పక్కన ఉండే చిరువ్యాపారులు ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నా రు. వడదెబ్బతో వృద్ధులు మృతి చెందుతున్నారు. పెరిగిన ఎండలతో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. దుకాణాల వద్ద మంచినీ టి బాటిళ్లు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. అలాగే కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, చెరకు రసాలు, శీతల పానీయాలకు డిమాండ్ పెరిగింది. మళ్లీ దంచికొడుతున్న ఎండలు గరిష్టంగా 44.7డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు.. మండలం ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్)కురవి 41.6 నర్సింహులపేట 42.4 తొర్రూరు 41.4 దంతాలపల్లి 41.6 బయ్యారం 40.3 చిన్నగూడూరు 40.5 మహబూబాబాద్ 40.3 నెల్లికుదురు 40.1 కేసముద్రం 44.7 డోర్నకల్ 40.8 మరిపెడ 39.3 పెద్దవంగర 40.9 కొత్తగూడ 40.8 గంగారం 39.8 గూడూరు 40.3 సీరోలు 40.4 గార్ల 42.3 ఇనుగుర్తి 39.8 -
దొంగల హల్చల్
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి వరుస చోరీలకు పాల్పడున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు. కాగా, రోజురోజకూ దొంగల బెడద పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. తాళంవేసి ఉన్న ఇళ్లే టార్గెట్.. జిల్లా కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో వరుసగా 13 చోరీలు జరిగాయి. కాగా, వరుస దొంగతనాలతో ప్రజలు ఊరెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు, కృష్ణకాలనీ, రాంచంద్రాపురం కాలనీ, నర్సంపేట రోడ్, కురవి గేట్, ఆర్టీసీ కాలనీ, ఎంపీ క్యాంపు కార్యాలయం సమీపం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రోడ్, ముకుందా థియేటర్ ప్రాంతం, జ్యోతిబసు కాలనీ, బ్యాంక్ కాలనీ, మహర్షి పాఠశాల ఏరియాతో పాటు మరికొన్ని ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న వరుస చోరీలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని, పోలీసులు గస్తీ పెంచి చోరీలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు... ● జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు ప్రాంతంలో ఈ నెల 2న ఒకరి ఇంట్లో చోరీ జరిగి 20 తులాల వెండి ఆభరణాలు, రూ.14వేల నగదు అపహరణకు గురయ్యాయి. ● ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో ఈ నెల 3న ఒకరి ఇంట్లో ద్విచక్ర వాహనం అపహరణకు గురైంది. ● కృష్ణకాలనీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ నెల 8న చోరీ జరిగి రెండున్నర తులాల బంగారు నక్లెస్, తులం బంగారం చైన్, మొబైల్ఫోన్ అపహరణ కు గురయ్యాయి. ● హన్మంతునిగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో ఈ నెల 9వ తేదీన 8 కుర్చీలు, 4 బెంచీలు, గోడ గడియారం, పాఠశాల రికార్డులు ఎత్తుకెళ్లారు. ● కురవి గేట్ ప్రాంతంలోని ఒకరి ఇంట్లో తులంన్నర బంగారు గొలుసు, తులం బంగారు చెవిబుట్టాలు, రూ.1.10 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. ● మహర్షి విద్యాలయం సమీపంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఒకరి ఇంట్లో ఈనెల 14న చోరీ జరుగగా.. తులం బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ● బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఇంటి పక్కన ఇంట్లో ఈ నెల 14న చోరీ జరిగి రెండు జతల బంగారు చెవి కమ్మలు, జత బంగారు మాటీలు, బంగారు చైన్, 20 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ● సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఒకరి ఇంట్లో ఈ నెల 18న చోరీ జరిగి రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.46 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ● రాంచంద్రాపురం కాలనీలోని ఒకరి ఇంట్లో ఈ నెల 25వ తేదీన రూ. 4.70 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అదేరోజు మరొకరి ఇంట్లో 5గ్రాముల బంగారు చైన్, లాకెట్, రూ.20 వేల నగదు దొంగిలించారు. అదే విధంగా ఇంటి తాళాలు పగులగొట్టి తులం బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు, రూ. 4 వేల నగదును ఎత్తుకెళ్లారు. ● బ్యాంకు కాలనీకి వెళ్లే దారిలో ఈ నెల 25న ఓ మహిళ మెడలో నుంచి 3తులాల బంగారు గోపితాడును ఓ దుండగుడు అపహరించుకెళ్లాడు. ● జ్యోతిబసునగర్ కాలనీలో ఈ నెల 28వ తేదీ రాత్రి ద్విచక్ర వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రత్యేక బృందాలతో గస్తీ చేపట్టాం.. చోరీల నియంత్రణకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నాం. 4 బృందాలు ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ ద్విచక్రవాహనాలపై గస్తీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఊర్లకు వెళ్లినప్పుడు తమ ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లాలి. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ మహబూబాబాద్ చోరీలతో ప్రజల బెంబేలు తాళం వేసిఉన్న ఇళ్లే టార్గెట్ పోలీసులకు సవాల్గా మారుతున్న వరుస దొంగతనాలు -
రైతుల వివరాలు నమోదు చేయాలి
బయ్యారం: రైతులకు విక్రయిస్తున్న విత్తనాల వివరాలను ప్రతిరోజు తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని ఏడీఏ ఎం.లక్ష్మీనారాయణ డీలర్లకు సూచించారు. బుధవారం ఆయన బ య్యారం, గంధంపల్లి–కొత్తపేటలోని పలు విత్తన షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో స్టాక్బోర్డులు, ధరల పట్టిక, స్టాక్ రిజిస్టర్, క్యాష్ బిల్, ప్రిన్సిపుల్ సర్టిఫికెట్లను పరిశీలించారు. రైతు వారి వివరా ల రిజిస్టర్ మెయింటెన్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏడీఏ.. తప్పనిసరిగా రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఏఓ రాంజీ తదితరులు పాల్గొన్నారు. స్కూళ్ల ప్రారంభం నాటికి యూనిఫాం అందజేస్తాం..తొర్రూరు రూరల్: ప్రభుత్వ స్కూళ్ల ప్రారంభ నాటికి విద్యార్థులందరికీ యూనిఫాం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్డీఏ డీపీఎం నళిని అన్నారు. బుధవారం మండలంలోని వెలికట్ట, అమ్మాపురం, కంఠాయపాలెం గ్రామాల్లో కొనసాగుతున్న యూనిఫాం స్టిచ్చింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల పరిధి అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకుంటు న్న విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం అందిస్తుందని చెప్పారు. జూన్ 12నాటికి యూనిఫాం స్టిచ్చింగ్ పనులన్నీ పూర్తి చేసేవిధంగా చూడాలని కోరారు. మండ ల నోడల్ అధికారి మహంకాళి బుచ్చయ్య, ఏపీఎం సంజీవరావు, సీఏలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కరాటే పోటీల్లో రాణించిన శివతేజ తొర్రూరు: మలేసియాలో జరిగిన అంతర్జాతీ య కరాటే పోటీల్లో తొర్రూరుకు చెందిన విద్యార్థి గాదగని శివతేజ గోల్డ్మెడల్స్ సాధించినట్లు కరాటే మాస్టర్ సోమ శ్రీధర్ బుధవారం తెలి పారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి మలేసియాలో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ కటాస్ పోటీల్లో రాణించిన శివతేజ ఫైనల్లో శ్రీలంక దేశానికి చెందిన క్రీడాకారుడితో పోటీ పడి గెలుపొందినట్లు చెప్పారు. అనంతరం శివతేజకు స్వీట్లు తినిపించి అభినందించారు. పెరటికోళ్లతో ఆదాయంకొత్తగూడ: పెరటి కోళ్ల పెంపకంతో గిరిజనులు అదనపు ఆదాయం పొందవచ్చని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి అన్నారు. గిరిజన ఉప ప్రణాళిక నిధు ల ద్వారా ఆదివాసీ, గిరిజనులకు బుధవారం నాటుకోళ్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి శ్రీకాంత్, ఏఈఓ సుస్మిత తదితరులు పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ లక్ష్యం నెల్లికుదురు/నర్సింహులపేట: వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యమ ని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ హెచ్ఆర్డీ అశోక్ కుమార్ అన్నారు. ఎర్రబెల్లిగూడెంని రామానుజాపురం 33/11కేవీ, మండల కేంద్రాల్లోని 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను బుధవా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతర విద్యుత్ను అందిస్తూ వచ్చే వానాకాలం సీజన్లో అవసరమైన చోట ఏబీ స్విచ్లు పెట్టాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు. ఈదురుగాలులు, తుపాన్ లాంటి వర్షాలు కురిసినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యవసాయానికి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, వందశాతం బిల్లులు వసూలు చేయాలని చెప్పారు. డీఈ మధుసూదన్, ఏడీఈలు పాపిరెడ్డి, లోకనాథ్రెడ్డి, ఏఈ సింధు పాల్గొన్నారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
గార్ల: జిల్లాలో ఎంపికై న అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జెడ్పీ సీఈఓ నర్మద, డీపీఓ హరిప్రసాద్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని పుల్లూరు, సూర్యాతండా, తిర్లాపురం, పూసలతండా, మర్రి గూడెం గ్రామాల పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను వారు పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే, ఆయా పాఠశాలల బిల్లులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. పాఠశాలల్లో కనీస వసతులు లైటింగ్, ఫ్యాన్లు, టాయిలెట్లు, కిటికీలు, తలుపుల నిర్మాణ పనులు జూన్ 11తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీఓ మంగమ్మ, ఏఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కిషన్, పాఠశాలల హెచ్ఎంలు ఉన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేశాయి
హన్మకొండ: నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పట్టభద్రులను ప్రలోభాలకు గురి చేశాయని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. వివిధ రకాలుగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయలేదన్నారు. పట్టభద్రులు బీజేపీకి మద్దతుగా నిలిచారని, పోలింగ్ సరళిని బట్టి తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సర్వే చేసిన వారే ఫోన్ చేసి చెప్పారని అన్నారు. ఉమ్మడి నల్ల గొండ, ఖమ్మం జిల్లాల్లో గతంలో ఎప్పుడూ బీజేపీ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాలేదని, ఇప్పుడు మార్పు వచ్చిందని, పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన పట్టభద్రులు మృతి చెందారని, ఇది బాధాకరమైన విషయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేవలం సన్న ధాన్యానికే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్కు తలదించుకునే పరిస్థితులు వచ్చాయని, ఆ కేసును సీబీఐకి అప్పగిస్తేనే సమగ్ర విచారణ జరిగి దోషులు బయటపడతారన్నారు. ఎడ్ల అశోక్ రెడ్డి, పెసరు విజయ్చందర్ రెడ్డి, తాళ్ళపల్లి కుమారస్వామి, వన్నాల శ్రీరాములు ఉన్నారు. -
సిద్ధమవుతున్న యూనిఫాం
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయనున్నారు. ఈమేరకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో యూనిఫాం కుట్టడానికి అవసరమైన వస్త్రాన్ని జిల్లాలోని అన్ని ఎమ్మార్సీలకు అందించారు. యూనిఫాం కుట్టే బాధ్యతను ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది. 4,7453 మంది విద్యార్థులకు.. గత ఏడాది యూడైస్ పొందుపర్చిన విధంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా వస్త్రాన్ని అందజేశారు. జిల్లాలోని 872 ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో చదువుతున్న 4,7453 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేయడానికి 20,1074 మీటర్ల క్లాత్ అవసరం. ఒక జతకు 10,0319 మీటర్ల క్లాత్ మాత్రమే వచ్చింది. దీనిని జిల్లాలోని 18 మండలాల ఎమ్మార్సీలకు పంపించారు. కాగా తరగతుల వారీగా ఐదు డిజైన్లలో యూనిఫాంలు విద్యార్థులకు అందించనున్నారు. జత యూనిఫాం కుట్టడానికి ప్రభుత్వం గతంలో మాదిరిగానే రూ. 50లుగా నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1470 మహిళా సంఘాలు, పట్టణ ప్రాంతాల్లోని 596 మెప్మా సంఘాల ఆధ్వర్యంలో దుస్తులు కుడుతున్నారు. యూనిఫాం పొందే విద్యార్థుల వివరాలు తరగతులు బాలురు బాలికలు మ్తొతం క్లాత్(మీ) 1–8 1,8447 1,6163 3,4610 60,060 9,10 4622 3310 7923 2,3803 11,12 ఇంటర్ 556 816 1372 4561 కేజీబీవీ 6–8 – 1682 1682 5120 కేజీబీవీ9–12 – 1546 1564 5472 కేజీబీవీ ఎంపీహెచ్డబ్ల్యూ – 320 320 1520 జిల్లాలో 872 పాఠశాలల్లో 4,7453 మంది విద్యార్థులు స్కూళ్ల పునఃప్రారంభం నాటికి పంపిణీ చేసేందుకు సన్నాహాలు మహిళా సంఘాలకు కుట్టు బాధ్యతలు ఒక్కో జత కుట్టుకూలి రూ.50చెల్లింపుపాఠశాలలు తెరిచేలోగా అందిస్తాం.. పాఠశాలల పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాలతో పాటు ఉచితంగా స్కూల్ యూనిఫాం అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు కావాల్సిన క్లాత్ వచ్చింది. ఆ క్లాత్ను జిల్లాలోని అన్ని మండలాలకు తరలించాం. మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫాం కుట్టడానికి అదేశాలు జారీ చేశాం. – పి. రామారావు, డీఈఓ -
ఏసీబీ రైడ్స్..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో అవినీతి నిరోధకశాఖ వరుసగా దాడులు చేయడంతో లంచగొండి అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంగళవారం రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో అన్ని శాఖల అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇటీవల డబ్బులు తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు పట్టుబ డిన విషయం తెలిసిందే. కాగా, అన్ని సక్రమంగా ఉన్నా.. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామని పలు వురు అధికారులు తెగేసి చెబుతుండడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎవరు ఊహి ంచని విధంగా దాడులు జరుగుతుండడంతో ఎప్పు డు ఎవరు వస్తారో.. ఏం జరుగుతుందో అని అవినీతి అధికారుల్లో ఆందోళన మొదలైంది. వరుస ఘటనలు.. జిల్లాలో వరుసగా అవినీతికి పాల్పడుతూ.. ఏసీబీ అధికారులకు పట్టుపడుతున్నారు. గతంలో ము న్సిపల్ కమిషనర్ ఏసీబీకి చిక్కిన తర్వాత అక్రమార్జనకు పాల్పడే వారి సంఖ్య తగ్గింది. అయితే తర్వా త ఎస్సీ కార్పొరేషన్ అధికారి, ఆతర్వాత పంచాయతీరాజ్ శాఖలో ఏఈ లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. తర్వాత లంచాలకు మరిగిన ఓ పోలీస్ అధి కారి ఆగడాలపై విసిగిన ప్రముఖులు ఏసీబీని సంప్రదించారు. సదరు అధికారిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వల పన్నగా.. పసిగట్టిన అధికా రి తృటిలో తప్పించుకున్నాడనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత డబ్బులు తీసుకునేందుకు అధికారులు వెనకాడడం, కొన్ని సందర్భాల్లో గుట్టు చప్పుడు కాకుండా తీసుకొని పనులు చేశారు. అయితే రెండు నెలల క్రితం జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఏసీబీకి చిక్కి జైలు పాలయ్యారు. ఇది మరవక ముందే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ డీటీఓ గౌస్ పాషా డ్రైవర్ వద్ద అక్రమంగా నిల్వ ఉన్న డబ్బులు పట్టుకున్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్లను కార్యాలయంలో ఉంచి డబ్బులు వసూళ్లు చేశారని, వారి వద్ద ఉన్న కొంత నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. ఇలా జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరగడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇతర శాఖలపై నిఘా.. ఇటీవల ప్రభుత్వం మారడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చింది. దీనికి అనుగుణంగా మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారులు మా రారు. ఈ క్రమంలోఎక్కడ అవినీతి జరిగినా తమ కు తెలియజేయాలంటూ అవినీతి నిరోధక శాఖ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది. దీనికి తోడు ప్రజల్లో కూడా అవినీతి నిరోధకశాఖ పై అవగాహన పెరిగింది. దీని ఫలితమే ఇటీవల సబ్ రిజిస్ట్రార్, ప్రస్తుతం డీటీఓ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఇంతటితో ఆగేలా లేవనే ప్రచా రం జరుగుతోంది. అవినీతి, అక్రమాలకు ఎక్కువ అవకాశం ఉన్న శాఖలపై ఏసీబీ అధి కారులు నిఘా పెంచినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిప ల్, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, వైద్యారోగ్యశాఖలపై ఎక్కువ ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. చిన్న చిన్న పనులకు కూడా డబ్బులతో ముడిపెట్టి నెలల తరబడి జాప్యం చేస్తున్నారని విసిగి వేసారిన బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారని ప్రచారం. కాగా, వరుస ఘటనలతో అధికారులు ఆందోళన చెందుతుండగా.. ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో దాడులు ఇటీవల పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ వరుస ఘటనలతో బెంబేలు ఇతర శాఖలపై కూడా నిఘా అవినీతి అధికారుల గుండెళ్లో పరిగెడుతున్న రైళ్లు -
కౌంటింగ్కు ఏర్పాట్లు చేయాలి
● సీఈఓ వికాస్రాజ్ మహబూబాబాద్: జూన్ 4న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఈఓ వికాస్రాజ్ జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఈఓ వికాస్రాజ్ జాయింట్ చీఫ్ ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కౌంటింగ్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. వీసీలో జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్కుమార్సింగ్, అదనపు కలెక్టర్ డేవిడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంగవాడీలను ప్రీస్కూల్స్గా తీర్చిదిద్దుతాం● డీడబ్ల్యూఓ వరలక్ష్మి మహబూబాబాద్: పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందకు ప్రభుత్వం ప్రత్యేక కా ర్యాచరణ రూపొందించిందని, దీనిలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలు(రీపీ స్కూల్స్)గా తీర్చిదిద్దే చర్యలు చేపట్టిందని డీడబ్ల్యూఓ వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి దశలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ప్రీస్కూళ్లుగా ఎంపిక చేసి న తర్వాత ఇటీవల హైదరాబాద్లో మాస్టర్ ట్రైనీగా శిక్షణ పూర్తి చేసిన వారు జిల్లాలో శిక్షణ ఇస్తారన్నారు. కేంద్రాల్లో ప్రతీరోజు ఉదయం 9నుంచి సాయంత్ర 4గంటల వరకు పలు కా ర్యక్రమాలు, ఆట పాటలతో విద్యాబోధన ఉంటుందన్నారు. జిల్లాలో 80 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన 20శాతం కూడా మూడు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మహిళలు జాగ్రత్తలు పాటించాలిడోర్నకల్: మహిళలు రుతుక్రమ సమస్యలపై జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మండలంలోని ముల్కలపల్లి, తొడేళ్లగూడెం, వెన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు డోర్నకల్ పీహెచ్సీలో వి ద్యార్థునులు, మహిళలతో సమావేశాలు నిర్వహించి రుతుక్రమ సమస్యలపై అవగాహన కల్పించారు. రుతుక్రమ సమయంలో తీసుకో వాల్సిన జాగ్రత్తలు, ఇబ్బందులు ఎదురైనప్పు డు పాటించాల్సిన నియమాలపై అంబరీష వి వరించారు. అనంతరం పీహెచ్సీలో అమలవుతున్న జాతీయఆరోగ్య కార్యక్రమాలను సమీ క్షించి, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాధ్విజ, ఎస్ యూఓ వడ్డె శ్రీనివాస్ ఆర్బీఎస్కే వైద్యురాలు డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీకే విక్రయించాలి● విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు మహబూబాబాద్ రూరల్: రైతులకు విత్తనాలు, పురుగుమందులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామ ని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం తనిఖీ నిర్వహించారు. విత్తనాల బిల్లులు, లైసెన్స్ కాలపరిమితి, తయారు తేదీలను పరిశీలించారు. లైసెన్స్ అనుమతి ఉన్న డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ తనిఖీ ల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు శ్రీనివాస్, రాకేష్, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధ తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ యూఈఈయూ) వరంగల్ జిల్లా కార్యదర్శి ఎల్.శ్రీనివాస్ కోరారు. మంగళవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలో ని టీజీఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ మదుసూధన్రావుకు నాయకులు వినతిపత్రం అందించారు. -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
మహబూబాబాద్ రూరల్: దేశంలో నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు తీసుకోనున్న చర్యల్లో భాగంగా కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) జూలై 1నుంచి అమల్లోకి రానున్నాయని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. నూతన చట్టాలపై మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ..కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు విడతల వారీగా శిక్షణ ఇస్తారన్నారు. నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సూచించారు. పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాల్సి ఉంటుందని సూచించారు. డీఎస్పీ (ఫంక్షన్ వర్టికల్స్) గండ్రతి మోహన్ నేతృత్వంలో డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, డోర్నకల్ సీఐ ఉపేందర్, ఎస్సై రమాదేవి డీఎస్పీ స్థాయి అధికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ట్రైనీ ఐపీఎస్ చేతన్ పండరి, టౌన్ డీఎస్సీ తిరుపతిరావు, సీఐ దేవేందర్ పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
‘ఆధార్’ కష్టాలు
డోర్నకల్: జిల్లాలోని డోర్నకల్లో ఆధార్ నమోదు కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 31వ తేదీ వరకు స్థానిక పోస్టాఫీస్లో కొనసాగిన ఆధార్ నమోదు కేంద్రాన్ని మే 1న ఎత్తివేశారు. దీంతో ప్రజలు ఆధార్ సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డు పొందడం, పేర్ల సవరణ, చిరునామా మార్పు, ఫోన్ నంబర్ అనుసంధానం, బయోమెట్రిక్ అప్డేట్ తదితర పనుల కోసం డోర్నకల్తో పాటు 30గ్రామాల ప్రజలు ఖమ్మంలోని ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో.. స్మార్ట్ ఫోన్ ద్వారా ఆధార్ నమోదు తదితర పనులు చేసుకుని అవకాశం ఉన్నా ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. గతంలో డోర్నకల్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, పోస్టాఫీస్, ఏపీజీవీబీలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేవి. ప్రస్తుతం వాటిని రద్దు చేయడంతో దూరప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ 14వ తేదీ వరకు ఆధార్ను అప్డేట్ చేసుకోవాలంటూ ప్రచారం జరుగుతుండడం, స్థానికంగా ఆధార్ నమోదు కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై స్థానిక పోస్టాఫీస్ సిబ్బందిని వివరణ కోరగా ఆధార్ నమోదు పనులు నిర్వహిస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ఏప్రిల్ 31తో ముగియడంతో మే 1నుంచి ఆధార్ సేవలు నిలిచినట్లు తెలిపారు. అధికారులు స్పందించి డోర్నకల్లో తక్షణమే ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మూడుసార్లు ఖమ్మం వెళ్లాం... డోర్నకల్లో ఆధార్ నమో దు కేంద్రాన్ని రద్దు చేయడంతో మా పిల్లల ఆధార్ కార్డు కోసం మూడుసార్లు ఖమ్మంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాం. ప్రతీసారి సరైన ధ్రువ పత్రాలు లేవని, నెట్వర్క్ పని చేయడం లేదని, రద్దీ ఉందని నిర్వాహకులు చెప్పడంతో ఆధార్ కార్డు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. – ఏపూరి రమణ, డోర్నకల్ డోర్నకల్లో ఆధార్ నమోదు కేంద్రం లేకపోవడంతో తిప్పలు ఖమ్మం వెళ్తున్న మండల ప్రజలు స్థానికంగా ఏర్పాటు చేయాలని వేడుకోలు -
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటిపారుదలశాఖ వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీరు (ఎస్ఈ) ఎవరనేది ఆ శాఖలో హాట్టాఫిక్గా మారింది. ఆరు రోజుల క్రితం వరకు వెంకటేశ్వర్లు ఎస్ఈగా వ్యవహరించారు. ఆయన స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ఉన్న ఓంకార్ సింగ్ను వరంగల్ సర్కిల్ ఎస్ఈగా నియమించారు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీలపై విచారణ జరుగుతుండగా.. ఆ విచారణ ఎదుర్కొంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓంకార్సింగ్కు సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా అదనపు బాధ్యతలు అప్పగించడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నియామకంపైన కూడా ‘అప్పుడు.. ఇప్పుడు అదే తంతు’ శీర్షికన సాక్షిలో ఈనెల 26న ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్వర్గాల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారి ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ మేరకు ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఓంకార్సింగ్ బదిలీ ఉత్తర్వులు రద్దు చేశారు. కాళేశ్వరం లింకు–2లో ఈఈగా పని చేస్తున్న ఎన్.శ్రీధర్ను ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో పదోన్నతులు, బదిలీల వ్యవహారం నీటిపారుదలశాఖలో హాట్ టాపిక్ అయింది. రేసులో సీతారాం.. వెంకటేశ్వర్లు వరంగల్ సర్కిల్ ఎస్ఈ బాధ్యతల నుంచి ఓంకార్ సింగ్ను తప్పించడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ సర్కిల్ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయం కాగల ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాల్వల పునరుద్ధరణ, లైనింగ్ పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ సర్కిల్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టేందుకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కొందరు ఎస్ఈ, ఈఈ క్యాడర్లలోని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. ఓంకార్ సింగ్ కంటే ముందు ఎస్ఈగా ఉన్న వెంకటేశ్వర్లు మళ్లీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న సీతారాంనాయక్ కూడా ఇన్చార్జ్ ఎస్ఈ కోసం ఉన్నతాధికారుల ను కలిసినట్లు చెబుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉన్న మరో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కూడా ఈ సీటుపై గురిపెట్టి పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఇంజినీరింగ్ వర్గాల్లో ఉంది.ప్రచారంలో సీతారాం నాయక్.. వెంకటేశ్వర్లు పేర్లు వరంగల్ సర్కిల్లో కోట్లాది రూపాయలు పనులు.. ఓంకార్ సింగ్ ఉత్తర్వులు రద్దు.. ప్రత్యామ్నాయంగా ప్రయత్నాలు చర్చనీయాంశంగా పదోన్నతులు, బదిలీలు -
కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
కమలాపూర్: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎ న్నికలు నిర్వహించాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గురిమిళ్ల రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన కమలాపూర్లో విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. స్థానిక పాలనలో అన్ని కులాల ప్రాతినిథ్యం ఉండాలంటే కులగణన చేపట్టి రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ డిక్లరేషన్సభలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో కులగణన ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సైదమ్మ, ప్రధాన కార్యదర్శి చైతన్యభారతి, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.చక్రవర్తి, సహాయ కార్యదర్శి గోవిందు, హనుమకొండ, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల కన్వీనర్లు మొగిలి, లక్ష్మయ్య, మోహనకృష్ణ, శిరీష, విలాస్, రవి తదితరులు పాల్గొన్నారు. -
రియల్టర్కు నోటీసులు
హసన్పర్తి: గ్రామాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు.‘సాక్షి’లో ఈ నెల 27వ తేదీన ‘యథేచ్ఛగా రియల్ దందా’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. ఈమేరకు గ్రామాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులపై ఉక్కు పాదం మోపడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హసన్పర్తి మండలం మడిపల్లిలో వెంచర్ ఏర్పాటుకు సిద్ధమైన ఓ రియల్ట ర్కు నోటీసులు ఇచ్చారు. స్థానిక పంచాయతీ అధికారి వెంకన్న సదరు వెంచర్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా ప్లాట్లు చేసి హద్దులు నిర్ధారిస్తే వాటిని తొలగించడమే కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సీఏ రేగొండ(కొత్తపల్లిగోరి): కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన సీఏ..సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. మండల కేంద్రంలోని ఏపీజీవీబీలో సీఏగా పని చేస్తున్న కొత్తపల్లిగోరికి చెందిన సీఏకు తెలియకుండా సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ నుంచి ఈ నెల 26న రూ.15 వేలు, 28న రూ.10 వేలు తస్కరించారు. ఖాతా నుంచి నగదు పోగోట్టుకున్న సదరు సీఏ మోసపోయానని గ్రహించి మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
బాలల సంరక్షణ కేంద్రానికి మానస
● ఆర్థిక సాయానికి ముందుకొస్తున్న దాతలు కురవి: తల్లిని కోల్పోయి అనాథ అయిన బాలిక మానసను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించా రు. మంగళవారం ‘సాక్షి’లో ‘ఇంటికి వస్తూ .. ఆటోలోనే ప్రాణం విడిచిన మహిళ’.. అనే శీర్షికతో కథ నం ప్రచురితమైన విషయం విధితమే. ఈ కథనంపై కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం డీడీడబ్ల్యూఓ వరలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నాగవాణి, వివిధ శాఖల అధికారులు.. బాలిక మానస ఇంటికి చేరుకున్నారు. బంధువులు, గ్రామస్తులతో చర్చించిన అనంతరం మానసను మహబూబా బాద్లోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించా రు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు పరికిపండ్ల అశోక్, చైల్డ్లైన్ సిబ్బంది వెంకటేష్, కల్యాణి, అంగన్వాడీ టీచర్లు దడిగల భద్రకాళి, బండారి ఉమమహేశ్వరి, దడిగల అరుణ, హైస్కూల్ టీచర్ దైద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బాలికకు దాతల సాయం.. మానసకు ఆర్థిక సాయం అందించడానికి దాతలు ముందుకొస్తున్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్తోపాటు అనేక మంది దాతలు సాయం చేస్తున్నారు. ఈ సొమ్మంతా ఒకేసారి డిపాజిట్ చేసి ఆ పత్రం బాలికకు అందజేస్తామని శ్రీనివాస్ తెలిపారు. -
సీహెచ్సీలో వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలి
గార్ల: మండల కేంద్రంలోని 30 పడకల సీహెచ్సీ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీచేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గార్లలో ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన హయాంలో 30 పడకల ఆస్పత్రిగా వైద్యవిధాన పరిషత్లో అప్గ్రేడ్ చేయించానని తెలిపారు. గతంలో ఆస్పత్రిలో 24గంటలు డ్యూటీ డాక్టర్ ఉండేవాడని, ప్రస్తుతం రాత్రి సమయంలో డాక్టర్లు ఎవరూ ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీ డాక్టర్ను నియమించాలని కోరారు. అదేవిధంగా గార్ల సమీపంలోని పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మాణానికి తన హయాంలో రూ.15కోట్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. ఈ నిధులు వెనక్కి వెళ్లకుండా.. పనులు ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్నాయక్, ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖదీర్, రాధాకృష్ణ, గాజుల గణేష్, కట్టా రమేష్, పాషా పాల్గొన్నారు. -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ
నెహ్రూసెంటర్: జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని అనేక సవరణలతో నిర్వీర్యం చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. ఏళ్లుగా వామపక్షాలు పోరాటాలు చేసి సాధించిన ఉపాధి చట్టంపై బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 54 లక్షల జాబ్కార్డులతో కోటి 20 లక్షల మంది కూలీలు పేరు నమోదు చేసుకున్నారని, డిమాండ్కు అనుగుణంగా పనులు కల్పించడం లేదన్నారు. భూమి, కూలీ, ఉపాధి రక్షణకు ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలోని కూలీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధి బిల్లుల అవకతవకలపై మే 28 నుంచి జూన్ 6 వరకు జీపీ కార్యాలయాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జూన్ 7న కలెక్టరేట్ ఎదుట ధర్నా, 10న ఉపాధి చట్టం రక్షణ కోసం హైదరాబాద్లో సదస్సు నిర్వహిస్తున్నామని తెలి పారు. సమావేశంలో కుర్ర మహేష్, బాణాల రాజ న్న, ఎండి.యాకూబ్, కె.చంద్రకళ, వంగూరి వెంకటేశ్వర్లు, రజిత, చేపూరి గణేష్, వీరభద్రం, రామేశ్వరం, బ్రహ్మచారి, మల్లయ్య పాల్గొన్నారు. -
మెడికల్ క్యాంపులు
నెహ్రూసెంటర్: నల్లగొండ–వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం పో లింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల్లో మెడికల్ ఫస్ట్ ఎయిడ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో హెచ్ఈఓ ఓబిలిశెట్టి రామకృష్ణ, సిస్టర్లు ఉమారాణి, అరుణ, ఆశ కార్యకర్తలు పార్వతి, ఉపేంద్ర పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి● డీఎంహెచ్ఓ కళావతిబాయి నెల్లికుదురు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. సోమవారం స్థానిక పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ మురళీధర్, వైద్యులు నాగేశ్వర్రావు, విజయ్, శ్రావణ్కుమార్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బంధం చెరువు లూటీకురవి: సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలోని బంధం చెరువును సోమవారం జనం లూటీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బంధం చెరువులో మత్స్యకారులు పూర్తిస్థాయిలో చేపలు పట్టలేదు. అయినప్పటికీ సోమవారం చుట్టుపక్కల ఉన్న తండాలు, గ్రామాల ప్రజలు చెరువులోకి దిగి లూటీ చేశారు. దీంతో మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లింది. ఈ మేరకు ఉప్పరిగూడెం సొసైటీ సభ్యులు ఉపేందర్, కొప్పెర రామన్న సీరోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చెరువులో చేపలను లూటీ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యుమోనియాతో బాలుడి మృతి కొత్తగూడ: న్యుమోనియాతో మూడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని బక్కచింతలపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు అశ్విని–సురేష్ దంపతులకు మూడు నెలల క్రితం మొదటి సంతానంగా బాబు జన్మించాడు. వారం రోజుల క్రితం బాలుడికి జలుబు జ్వరం వచ్చింది. దీంతో నర్సంపేట ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడికి ఊపిరితిత్తుల్లో నంజు వచ్చిందని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు సోమవారం మృతి చెందాడు. బాధ్యతల స్వీకరణ కేయూ క్యాంపస్: కేయూలోని పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా (పీజీసెక్షన్) మ్యాథమెటిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్యజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.జ్యోతి నుంచి సౌజన్యజీ బాధ్యతలు తీసుకున్నారు. మూడేళ్లుగా హనుమకొండలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2013లో యూనివర్సిటీలో మ్యాథ్మెటిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. మూడేళ్లపాటు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో పరీక్షల నియంత్రణాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. మరో మూడేళ్లు యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్విర్తించారు. -
ఓటేసిన ప్రముఖులు
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్: ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. కాగా మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ మానుకోట పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఓటు వేయగా.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్చందర్రెడ్డి, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షడు వడ్డెబోయిన శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సీతామహాలక్ష్మి దంపతులు అదే కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు బద్రినారాయణ ఓటు వేశారు. అదే పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థి వెంకట్రెడ్డి ఓటు వేశారు. అలాగే సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఆకు విస్తర్లను పట్టణాల్లో విక్రయిస్తా..
మాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామం. తిర్మలాయపల్లి, ఆరెగూడెం, వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో విస్తరు కట్టలు సేకరిస్తా. ఒక్కో కట్టకు రూ.70 చొప్పున చెల్లిస్తా. ఒక్క కట్టలో 100 ఆకులు (పేట్లు) వరకు ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి వరంగల్లోని కాశిబుగ్గ, కొత్తవాడ, శివనగర్, రంగశాయిపేట, హనుమకొండ ప్రాంతాల్లో విక్రయిస్తా. వీటిని ఎక్కువగా దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తారు. పెళ్లిళ్లు, పలు కార్యక్రమాల్లో అందరూ ప్లాస్టిక్ విస్తరాకులే వాడుతుండడంతో గిరాకీ అంతంత మాత్రంగా ఉంటోంది. – బరిగెల ఎల్లయ్య, తిర్మలాయపల్లి -
బ్యాలెట్ పత్రాల్లో ముద్రణ లోపం
● అధికారుల జోక్యంతో సమస్య పరిష్కారం పాలకుర్తి/పాలకుర్తి టౌన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 28వ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాల్లో ముద్రణ లోపంతో మరకలు పడ్డాయని కొంతమంది ఓటర్లు సిబ్బందిని నిలదీశారు. దీంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సై సాయి ప్రసన్న కుమార్.. ఈ విషయం ఉన్నతాధికారులకు చెప్పారు. వారు మరకలతో కూడిన 44 పత్రాలను పరిశీలించి వాటిని పక్కన పెట్టించారు. ఆ తరువాత వరుస సంఖ్యలో బ్యాలెట్ పత్రాలు అందించారు. ఏజెంట్ల సమక్షంలో ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఓటింగ్కు పలువురు దూరం కాజీపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన పోల్ చిటీలు అందక కాజీపేటలో పలువురు ఓటింగ్కు దూరమయ్యారు. తాము ఏ పోలింగ్ కేంద్రం వెళ్లి ఓటు వేయాలో తెలియక తికమక పడ్డారు. దరఖాస్తు చేసింది కాజీపేట మండలంలో కావడంతో అన్ని పోలింగ్ కేంద్రాలకు కేటా యించారు. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటువేసే పరిస్థితి క నిపించింది. పట్టణంలో సగం మందికి కూడా పోల్ చిటీల పంపిణీ జరగకపోవడంతో ఎక్కడా ఓటు వే యాలో తెలియక పలువురు మిన్నకుండిపోయారు. ముగ్గురిపై కేసు హసన్పర్తి: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు కేయూ ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. ఎస్డీఎల్సీఈ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి ఫొటోలతో ముద్రించిన పోల్ చీటీలతో ప్రచారం చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. ఈమేరకు ప్రచారం నిర్వహిస్తున్న అశోక్, జ్యోతి, మోహన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్కుమార్ చెప్పారు. -
ఆకుపల్లెం.. అదృశ్యం
రాయపర్తి: ఆయుర్వేద గ్రంథం ప్రకారం ఆకులో భోజనం చేయడం వల్ల కంటిచూపు సరిగా ఉండడంతోపాటు జీర్ణశక్తి పెరుగుతుంది. సహజసిద్ధంగా లభించే మోదుగ ఆకుపై ఎలాంటి రసాయన మైనపు పూతలు ఉండవు. ఇందులో భోజనం చేయడం వల్ల ఎలాంటి రసాయనిక పదార్థం ధరిచేరక మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. ఎక్కువ కాలం నిల్వ ఉండే విస్తరాకు మోదుగ. అప్పట్లో మోదుగ, మర్రి, రావి, అరటి, పసుపు ఆకులను విస్తర్లుగా కుట్టి అందులో భోజనం చేసేవారు. వేసవిలో మోదుగ ఆకులు సేకరించి ఎండబెట్టి పనులు లేని సమయాల్లో ఇంటివద్ద అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ విస్తర్లు కుట్టేవారు. ఇలాంటి తరుణంలో మానవులు యాంత్రిక జీవనం కొనసాస్తూ రెడీమేడ్గా రంగురంగులతో తయారు చేసిన ప్లాస్టిక్ విస్తర్లను ప్రతి కార్యాలయంలో వినియోగిస్తూ అనారోగ్యానికి గురవడమేకాకుండా పర్యావరణానికి హాని తలపెడుతున్నారు. పల్లెల్లో ప్రతి కిరాణా షాపుల్లో ప్లాస్టిక్ ప్లేట్లు లభిస్తుండడంతో విస్తరాకులను మర్చిపోతున్నారు. మోదుగ ఆకు విస్తర్లను కేవలం దైవపూజల్లో మాత్రమే ఉపయోగించడం గమనార్హం. నేటి కంప్యూటర్ యుగంలో మానవుడు ప్రకృతి ‘ప్రసాదా’లకు క్రమక్రమంగా దూరమవుతున్నాడు. సహజవనరులను అందిపుచ్చుకునేందుకు అవకాశం లేక పర్యావరణ సమతుల్య తను దెబ్బతీసే ప్లాస్టిక్ భూతాన్ని ఆశ్రయిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో బందీగా మారిన మానవుడు.. తనకున్న కళలు, అభిరుచులను కాలగర్భంలో కలుపుతూ ఉత్తచేతులతో కాలం వెల్లదీస్తున్నాడు. ఇందులోభాగంగా ప్రకృతి అందించే విస్తరాకుల(ఆకుపల్లెం)ను వదిలిపెట్టి డిస్పోజబుల్స్ కోసం పరుగులు తీస్తున్నాడు. ఫలితంగా ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుండగా.. ప్రజలకు ఉపాధి దూరం చేస్తోంది. కనుమరుగవుతున్న మోదుగాకు విస్తర్లు ప్రతి కార్యంలోనూ ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం పాతరోజులే బాగున్నాయంటున్న ప్రజలుప్లాస్టిక్ ప్లేట్లలో వేడి భోజనం చేయడం వల్ల అందులో ఉన్న రసాయనాలు కరిగి వారానికి 5గ్రాముల పాలిథీన్ పదార్థం మనిషి శరీరంలోకి చేరుతోందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేస్తున్నప్పటి నుంచి ప్రతి పనికి ప్లాస్టిక్ను వినియోగించడం మూలంగా పాలిథీన్ శరీరంలోకి చేరి వివిధ రకాల వ్యాధుల బారిన పడడంతోపాటు క్యాన్సర్కు దారితీస్తుందని చెబుతున్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement