కాంట్రాక్ట్‌ కార్మికులసమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ కార్మికులసమస్యలు పరిష్కరించాలి

Nov 21 2024 1:49 AM | Updated on Nov 21 2024 1:49 AM

మోతుగూడెం: ఏపీ జెన్‌కోలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న వారికి నేరుగా జీతాలు చెల్లించాలని, అర్హతను బట్టి వారిని పర్మినెంట్‌ చేయాలని సీలేరు కాంప్లెక్స్‌ విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మోతుగూడెంలో ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ను బుధవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీ జెన్‌కో పనిచేస్తున్న కార్మికులను పనిని బట్టి స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌గా పరిగణించి జీతాలు చెల్లించాలని కోరారు. ఖాళీగా ఉన్న ఏపీ జెన్‌కో క్వార్టర్లపే అద్దె ప్రతిపాదికను ఇప్పించాలని కోరారు. జెన్‌కో ఆస్పత్రిలో కాంట్రాక్టు కార్మికులకు వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రీజనల్‌ కార్యదర్శి రత్నాకర్‌, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement