
లక్ష్యానికి మించి ఉత్పత్తి
సీలేరు జల విద్యుత్ కేంద్రం ప్రతి ఏటా లోడిస్పాస్ అధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమిస్తోంది. ఈ ఏడాది మూడు సార్లు ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘనత రాష్ట్రంలో ఏ జల విద్యుత్ కేంద్రానికీ దక్కలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్రాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఫిబ్రవరి 26న 4.949 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి మొదటి ఆల్ టైం రికార్డును చేసుకుంది. గత నెల 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5.126 మిలియన్లు విద్యుత్ ఉత్పత్తి చేసి రెండో రికార్డును నెలకొల్పింది. అదే నెలలో ఒక రోజు వ్యవధిలో 5.325 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి మరింత ఘనత సాధించింది.