లక్ష్యానికి మించి ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి మించి ఉత్పత్తి

Apr 11 2025 12:41 AM | Updated on Apr 11 2025 12:41 AM

లక్ష్యానికి మించి ఉత్పత్తి

లక్ష్యానికి మించి ఉత్పత్తి

సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ప్రతి ఏటా లోడిస్పాస్‌ అధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమిస్తోంది. ఈ ఏడాది మూడు సార్లు ఆల్‌ టైం రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘనత రాష్ట్రంలో ఏ జల విద్యుత్‌ కేంద్రానికీ దక్కలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కేంద్రాలకు మించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. ఫిబ్రవరి 26న 4.949 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసి మొదటి ఆల్‌ టైం రికార్డును చేసుకుంది. గత నెల 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5.126 మిలియన్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసి రెండో రికార్డును నెలకొల్పింది. అదే నెలలో ఒక రోజు వ్యవధిలో 5.325 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసి మరింత ఘనత సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement