
కాళ్లరిగేలా తిరిగినా..
నా వయసు 76 సంవత్సరాలు. మా భూమిని ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఒంటరిగా జీవిస్తున్న నా భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోమని రెండు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాను. కలెక్టరమ్మ ఆదేశించినా మండలంలోని అధికారులు నాకు న్యాయం చేయలేదు. అందుకే మళ్లీ ఫిర్యాదు చేయడానికి వచ్చాను. – చెన్నా సత్యవతి, చిన్నగుమ్మలూరు, ఎస్.రాయవరం మండలం
పాసు పుస్తకం ఆన్లైన్ చేయాలి
పట్టాదారు పాసు పుస్తకాన్ని ఆన్లైన్ చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో వినతి అందించాను. నిరుపేద దళితులమైన మాకు 1998లో తుమ్మపాల సర్వే నెం.708–1లో ఒక ఎకరం భూమి డీపట్టా మంజూరు చేశారు. జీడీ మామిడి తోటలు సాగుచేసుకుని జీవిస్తున్నాం. నా పేరున పట్టాదారు పాసుపుస్తకం కూడా మంజూరు చేశారు. దీని ఆధారంగా ఆన్లైన్ చేసి డిజిటల్ పుస్తకం మంజూరు చేయాలని కోరాను.
–వెలుసూరి ప్రకాశరావు, తుమ్మపాల, అనకాపల్లి మండలం
పింఛన్ తొలగించారు..
నా కుమారుడు ఆదాయ పన్ను కడుతున్నాడని నాకు పింఛన్ తొలగించారు. అతనికి వివాహమై ఇప్పుడు వేరుగా జీవిస్తున్నాడు. ఇప్పుడు నా కుమారుడు కూడా ఆదాయ పన్ను పరిధిలో లేడు. పైగా వేరుగా జీవిస్తున్నాడు. అందువల్ల దివ్యాంగుడనైన నా మొర ఆలకించి, పింఛన్ పునరుద్ధరించవలసిందిగా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించాను.
–జెట్టి సత్యారావు, పరశురాంపేట, అనకాపల్లి

కాళ్లరిగేలా తిరిగినా..

కాళ్లరిగేలా తిరిగినా..

కాళ్లరిగేలా తిరిగినా..