Anakapalle District News
-
బాలికా సాధికారతకు పెద్దపీట
పరవాడ: బాలికా సాధికారతకు సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్సా ర్ విభాగం తీసుకున్న చొరవ అభినందనీయమని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఈ విభాగం ఆధ్వర్యంలో గత నెల 9న ప్రారంభమైన బాలికా సాధికారత మిషన్–2025 వర్క్షాపు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య నేర్పించడం ఎంత అవసరమో వివరించారు. బాలికల వ్యక్తిత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్టీపీసీ కార్పొరేట్ ప్లానింగ్ ఈడీ సంగీత కౌశిక్ మాట్లాడుతూ బాలికల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ చొరవను కొనియాడారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శర్మ మాట్లాడుతూ గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ ద్వారా బాల బాలికలకు యోగా, కరాటే, కంప్యూటర్, నృత్యం, స్పోకెన్ ఇంగ్లిష్, వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం తదితర అంశాల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు. వర్క్షాప్లో పాల్గొన్న 120 మంది బాలికలకు అవసరమైన సదుపాయాలను కల్పించడం కోసం సంస్థ రూ.50 లక్షలను వెచ్చిందన్నారు. ఈ మిషన్లో బాలికలకు మార్గదర్శకాలను అందించిన ఉద్యోగులను ఈడీ అభినందించారు. కార్యక్రమంలో బాలికల నృత్యాలు, ఆపరేషన్ సిందూర్, యోగా, కరాటే వంటి ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. 120 మంది బాలికలకు వివిధ రంగాల్లో శిక్షణ ఎన్టీపీసీ కృషి అభినందనీయం: కలెక్టర్ విజయ కృష్ణన్ -
పరీక్ష నేల చూపులు
హిమ సొగసుమన్యంలోని పాడేరు ఘాట్, హుకుంపేట, జి.మాడుగుల ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేసవిలోను కమ్ముకున్న మంచు తెరలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పగటి పూట ఎండ, రాత్రి చలిగాలులు ఉండటం వల్ల ఉదయం వేళల్లో మంచుతో కూడిన ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి, పాడేరుఅవగాహన లేక నష్టపోతున్నాం భూసార పరీక్షలపై చాలామంది రైతులకు అవగాహన లేదు. మట్టిలో పోషకాల గురించి తెలియక అధిక మోతాదులో ఎరువులు వాడి నష్టపోతున్నాం. వ్యవసాయశాఖ అధికారులు ఈ సీజన్లో గ్రామ సభలు పెట్టి రైతులను భూసార పరీక్షలపై చైతన్యవంతం చేయాలి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, మందులు వాడాలన్న అవగాహన రైతులకు కల్పించాలి. –పోలిరెడ్డి రమణ, రైతు, పురుషోత్తపురం నా పొలంలో మట్టి నమూనా తీయలేదు ఇప్పటివరకు నా పొలంలో మట్టి నమూనా తీయలేదు. ఖరీఫ్ సాగు సమయం ఆసన్నమైనా మట్టి నమూనా సేకరించకపోతే ఇంకెప్పుడు భూసార ఫలితాలు రైతులకు తెలుస్తాయో వ్యవసాయాధికారులే చెప్పాలి. భూసార పరీక్షల ఫలితాలు సకాలంలో రైతులకు అందజేస్తే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. –యల్లపు శ్రీనివాసరావు, రైతు, సోమలింగపాలెం, యలమంచిలి యలమంచిలి రూరల్: పంటల సాగులో నేల స్వభావం కీలక పాత్ర పోషిస్తుంది. మట్టిలో తగిన పోషకాలుంటేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఇందుకోసం భూసార పరీక్షలు చేయించి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తూ సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. నేల సారవంతానికి తగ్గట్టుగా ఎరువులు వాడితే మంచి దిగుబడులు పొందవచ్చు. ఇందుకు నేలలో సరైన పోషకాలు ఉన్నాయా? లేకుంటే ఎంత మోతాదులో ఎరువులు వాడాలి.. వంటి వివరాలు తప్పనిసరిగా రైతులు తెలుసుకోవాలి. కానీ జిల్లాలో భూసార పరీక్షలకు అవసరమైన మట్టి నమూనాల సేకరణ లక్ష్యానికి దూరంగా సా..గుతోంది. మట్టి నమూనాల సేకరణకు ఖరీఫ్ సీజన్ అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్కు ముందే వ్యవసాయ శాఖ అధికారులు మట్టి నమూనాల కోసం మండలాలవారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రెండుసార్లు గడువు పొడిగించినా.. జిల్లాలో 24 మండలాల్లో 450 రైతు సేవా కేంద్రాల్లో ఈ ఏడాది 25,052 మట్టి నమూనాల సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా ఆశించిన స్థాయిలో సేకరణ జరగలేదు. దీంతో ఇప్పటివరకు రెండుసార్లు గడువు పొడిగించినా ఇప్పటివరకు 84.62 శాతం (21,441) మాత్రమే మట్టి నమూనాలను తీశారు. నర్సీపట్నం, రోలుగుంట, సబ్బవరం మండలాల్లో మాత్రమే మట్టి నమూనాల లక్ష్యం పూర్తి చేశారు. పరవాడ, కశింకోట, బుచ్చెయ్యపేట, రాంబిల్లి, చోడవరం, మునగపాక, చీడికాడ మండలాల్లో 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన మండలాల్లో మట్టి నమూనాల సేకరణపై సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. పాయకరావుపేట, నాతవరం, మాకవరపాలెం మండలాలు మట్టి నమూనాల సేకరణ గణాంకాల్లో అట్టడుగున ఉన్నాయి. మట్టి నమూనాల సేకరణే ఇంకా పూర్తి చేయకపోవడంతో వాటి విశ్లేషణ పూర్తి చేసి రైతులకు నివేదికల కార్డులను సకాలంలో అందజేయడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఇప్పటికే ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో కొన్నిచోట్ల వానాకాలం సాగు కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారు. మట్టి నమూనాల సేకరణకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించారు. ఈ నేపథ్యంలో సేకరిస్తున్న మట్టి నమూనాల ఫలితాలు సకాలంలో అందుతాయో? లేదోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మట్టి నమూనాల సేకరణ లక్ష్యం 25,052 సేకరించిన నమూనాలు 21,441 ఖరీఫ్ సమీపిస్తున్నా కొలిక్కిరానిభూసార ఫలితాలు రెండుసార్లు గడువు పొడిగించినా సా..గుతున్న మట్టి నమూనాల సేకరణ ఫలితాలు వస్తేనే రైతులకు ప్రయోజనం ఇప్పటివరకు 84.62 శాతం మట్టి నమూనాల సేకరణ మట్టి సేకరణ ఇలా.. ఎంచుకున్న 2.5 ఎకరాల పొలంలో ఒక మూల నుంచి మూడు అడుగుల దూరాన్ని వదిలిపెట్టి ‘వి’ ఆకారంలో ఆరు అంగుళాల గుంత తీసి అడుగు నుంచి మూలల వైపు మట్టిని సేకరించాలి. ఇదే విధానంలో 10 నుంచి 20 చోట్ల జిగ్జాగ్గా మట్టిని గోనెసంచిపై వేసి బాగా కలపాలి. ఆ మట్టిని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఎదురెదురుగా ఉన్న భాగాలు తీసుకుని. మిగిలిన భాగాన్ని వదిలేస్తారు. ఇలా అర కిలో మట్టి నమూనాను తీసుకుని అనకాపల్లిలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. మట్టి పరీక్షల అనంతరం సేంద్రీయ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు భూమిలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. రెండేళ్లకోసారి నిర్వహించే భూసార పరీక్షల ద్వారా నేలలో పోషకాలను బట్టి అధికారుల సూచనల మేరకు ఎరువులు, మందులు ఏ మోతాదులో వేయాలో తెలుస్తుంది. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగాన్ని, అదనపు ఖర్చును తగ్గించవచ్చు. రైతు సేవా కేంద్రాల సిబ్బంది సేకరిస్తున్న మట్టి నమూనాలకు భూసార పరీక్ష కేంద్రంలో 12 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను ఎస్హెచ్సి పోర్టల్లో పొందుపరుస్తున్నారు. ఫలితాలను రైతు మొబైల్ఫోన్కు తెలుగులో సంక్షిప్త సందేశం పంపేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఫలితాల విశ్లేషణ పత్రాలను కూడా రైతులకు కార్డుల రూపంలో అందజేస్తారు. పొలంలో ఉన్న పోషక స్థాయిలకు అనుగుణంగా ఎరువులను సూచిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే పూర్తయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సాగుకు ముందుగానే భూసార ఫలితాలు వచ్చేలా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
యంత్రాలతో పనులు.. సిమెంట్ కాలువలకు ముప్పు.!
వైఎస్సార్ హయాంలో కాలువలకు సిమెంట్ లైనింగ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాండవ కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టారు. మొదట విడతలో రూ.55 కోట్లు మంజూరు చేయగా.. చాలకపోవడంతో మళ్లీ రూ.10 కోట్లు ఇచ్చారు. కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయడంతో శివారు ఆయకట్టుకు సైతం నీరు పుష్కలంగా ప్రవహించేది.నాతవరం: తాండవ కాలువలో పూడికతీత పనులు పొక్లెయిన్తో చేపట్టడం వల్ల సిమెంట్ లైనింగ్ దెబ్బతింటోంది. ఉపాధి హామీ పథకం పనులు కూలీలతోనే చేపట్టాలన్న నిబంధనలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు. అనకాపల్లి జిల్లాలో రెండు నియోజకవర్గాలు, కాకినాడ జిల్లాలో రెండు నియోజకవర్గాల పరిధిలో మేజరు, మైనరు కాలువ కలుపుకొని సుమారుగా 120 కిలోమీటర్ల పొడవున సాగునీరు ఆయకట్టుకు ప్రవహిస్తుంది. ఈ ఏడాది తాండవ కాలువలో పూడికతీత పనులను రూ.60 లక్షల ఇరిగేషన్ నిధులతో, రూ.1.50 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో అయితే కూలీలతోనే పనులు చేయించాలి. ఇరిగేషన్ నిధులతో అయితే అధిక శాతం యంత్రాలతో చేస్తున్నారు. పొక్లెయిన్ను తాండవ కాలువలోకి దించి పూడికతీత పనులు చేపట్టడం వల్ల సిమెంట్ లైనింగ్ పెచ్చులూడి పోతుంది. పొక్లెయిన్ ఐరన్ పళ్లతో పూడిక తొలగించడంతో పూడిక తొలగింపు మాట ఎలా ఉన్నా అధిక శాతం సిమెంట్ లైనింగ్ ధ్వంసం అవుతుందని ఆయకట్టుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పూడిక తీసిన మట్టిని గట్టు దరిదాటని విధంగా వేస్తుండడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మళ్లీ కాలువలోకే జారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కూలీలతో పనులు చేయించితే సిమెంట్ లైనింగ్కు ఎలాంటి దెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే కూలీలతో పూడిక పసులు చేపడితే ఖర్చు ఎక్కువ.. పని కాస్తా ఆలస్యంగా జరుగుతుంది. దీన్ని గమనించిన కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో డబ్బులు మిగులుతాయన్న ఉద్దేశంతో యంత్రాలతో పనులు కానిచ్చేస్తున్నారు. పూడికతీత పనులు అధికంగా కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికలు ప్రాజెక్టు కమిటీ చైర్మన్, డీసీ మెంబర్లతో పాటు కమిటీ సభ్యులు నీటి సంఘాల అధ్యక్షులు అంతా కూటమి నేతలే ఉన్నారు. దీంతో ఆయా కూటమి పెద్దలను మచ్చిక చేసుకుని పూడిక తీత పనులు ఎలా చేసినా ఏం ఫర్వాలేదన్న విధంగా చేస్తున్నారన్న బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలకు భయపడి అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో ఇంత వరకు పూడిక తీసిన కాలువలో పనులు పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు నిబంధనల ప్రకారం బాధ్యతగా చేయించాలని రైతులు కోరుతున్నారు. స్పీకర్ అయ్యన్న ఆదేశాలు బేఖాతరు ఇటీవల మండలంలో పర్యటనకు వచ్చిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాండవ కాలువ పూడికతీత పనులు ప్రధాన గేట్లు మరమ్మతు విషయంలో నిబంధనలు పాటించి నాణ్యతగా వేగవంతంగా చేయాలన్నారు. ఎవరైనా నాణ్యత పాటించకుండా పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయినా అధికారులు పొక్లెయిన్తో పనులు చేస్తున్నారు. ఈ విషయంపై తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధను సంప్రదించగా.. పొక్లెయిన్తో కాకుండా మనుషులతో పూడికతీత పనులు చేస్తామన్నారు. తాను స్వయంగా ఆయా పనులు పర్యవేక్షించి ఎలాంటి సమస్య లేకుండా చేస్తానన్నారు. కొన్ని చోట్ల మద్యం సీసాలు ధ్వంసం చేశారని, అవి గుచ్చుకుంటాయ,ని అలాంటి చోట మాత్రమే యంత్రాలతో పనులు చేపడుతున్నామన్నారు. తాండవ కాలువ పనుల్లో అవకతవకలు దెబ్బతింటున్న కాలువ సిమెంట్ లైనింగ్ గట్టు దరిదాటని విధంగా వేస్తున్న పూడికతీత మట్టి వర్షాలకు మళ్లీ కాలువలోకే జారిపోతున్న వైనం కూటమి నేతల కనుసన్నల్లో పనులు -
విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే యోగ
అనకాపల్లి టౌన్: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు యోగాను నేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా విద్యాశాఖ, జిల్లా ఆయుష్ శాఖ సహకారంతో యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో అప్పారావు నాయుడు మాట్లాడుతూ రోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. యోగా ప్రాధాన్యతను ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ప్రతిరోజూ ప్రార్థన, డ్రిల్ కార్యక్రమంలో యోగా ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా ఆయుష్మాన్ అధికారిణి డాక్టర్ కె. లావణ్య మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అనంతరం యోగ గురువులు దొరమ్మనాయుడు, బి.అప్పారావుల ఆధ్వర్యంలో యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు సాగింది. కార్యక్రమంలో డీఎస్డీవో రమణ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మోటూరి నాగేశ్వరావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి మహలక్ష్మినాయుడు, మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
9న నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ల ప్రారంభం
తుమ్మపాల: ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న విజన్ యాక్షన్ యూనిట్లను ఈ నెల 9న ప్రారంభించనున్నామని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అధికారులు ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా ఆమె నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్లకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్గా వ్యవహరిస్తారని, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, కేటాయించిన ఐదుగురు సిబ్బంది యూనిట్లో ఉంటారన్నారు. యూనిట్లకు కేటాయించిన సిబ్బంది వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న విజన్ యాక్షన్ యూనిట్లు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. యూనిట్ ఏర్పాటుకు కావలసిన వసతి, ఫర్నిచర్, కంప్యూటర్లు సమకూర్చవలసిందిగా మండల అభివృద్ధి అధికారులను ఆమె ఆదేశించారు. జిల్లా ప్రణాళిక అధికారి జి.రామారావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్ : మండలంలోని తండాలదిబ్బ కూడలికి సమీపంలో జంపపాలెం గ్రామానికి వెళ్లే రహదారి పక్కన నీరు లేని పంటకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఇటీవల ఈ ప్రాంతంలో చొక్కా లేకుండా జీన్స్ ప్యాంటుతో తిరుగుతూ, మతిస్థిమితం లేనట్టు కనిపించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. కొందరు స్థానికులు అతని ఫొటోను కూడా తీశారు. ఈ ఫొటో పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఎండల తీవ్రతకు ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో పిల్లి గంగబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440796104, 9440796079 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని పోలీసులు కోరారు. -
వీధి కుక్కల దాడిలో ఐదు మేకల మృతి
బుచ్చెయ్యపేట : మండలంలోని వడ్డాది గ్రామంలో వీధి కుక్కల దాడిలో ఐదు మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ. 35 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు కురందాసు నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కురందాసు నాయుడు శుక్రవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న పాకలో మేకలను ఉంచి వచ్చాడు. శనివారం ఉదయం వెళ్లి చూడగా, పాకలో ఐదు మేకలు తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాయి. మేకల ఒంటిపై ఉన్న గాయాలను బట్టి వీధి కుక్కలు దాడి చేసినట్లు గుర్తించాడు. ఇటీవలి కాలంలో వడ్డాది పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. మేకలు, గొర్రెలు, ఆవు, గేదె దూడలతో పాటు నాటు కోళ్లపై కూడా వీధి కుక్కలు దాడి చేసి గాయపరుస్తూ, ప్రాణాలు తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడదను నివారించి, తమ పశుసంపదను కాపాడాలని పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
38 తోడపెద్దులకు అచ్చులు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం చిన్నరామస్వామి దేవాలయంలో సూరిశెట్టి తోడపెద్దు అచ్చు సేవా కార్యక్రమాన్ని పీలా లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆలయ దేవాలయ చైర్మన్ వి.పైడారావు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పైడారావు మాట్లాడుతూ జిల్లాలో 38 తోడపెద్దులకు అచ్చులు వేశామన్నారు. ఈనెల 6వ తేదీన దేవాలయం వద్ద రాత్రి భజనలు, నేలవేషాలు, తప్పెటగుళ్లు, కోలాటాలతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. శనివారం దేవాలయం నుంచి పురవీధులు గుండా 38 తోడపెద్దులను శారదానది ఒడ్డు వరకూ ఊరేగించి, అక్కడ వాటికి స్నానం చేయించి, జిల్లాలో వివిధ ప్రాంతాలకు పంపించామన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 15వ తేదీలోగా జన్మించిన ఎద్దులను సైజు, పుట్టుమచ్చలు చూసి ఎంచుకుని దేవాలయం వద్ద అచ్చు వేయడం జరిగిందన్నారు. తోడపెద్దులను దేవునికి అంకితం చేశామన్నారు. పూర్వం ఏ ఇంట్లో శుభకార్యమైనా ముందుగా తోడపెద్దుతో అడుగు పెట్టించి, వివాహాలు చేసేవారన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల తోడపెద్దు భక్తులు పాల్గొన్నారు. శారదా నది వరకు ఘనంగా ఊరేగింపు -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
అనకాపల్లి టౌన్: ముస్లిం సోదరులు శనివారం జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండగను నిర్వహించారు. మసీదు వీధిలో ఉన్న జామియా మసీదు, శారదానది ఒడ్డున ఉన్న దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా జామియా మసీదు అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ ఈ పండగ దయ, దాతృత్వం ప్రాముఖ్యత తెలియజేస్తుందన్నారు. సమాజంలో ఐక్యత, సోదర భావం మరిమళించేలా ఈ పర్వదినాన్ని జరుపుకొంటామన్నారు. కశింకోటలోని జామియా, నూరి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూరి మసీదు కమిటీ నూతన అధ్యక్షుడు షేక్ కరీముల్లా రెహమాన్ (బాబర్) మాట్లాడుతూ నిస్వార్థమైన ఆత్మీయత, అనుబంధాలను వ్యాపింపజేయడమే బక్రీద్ పండగ ఉద్దేశమన్నారు. -
చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం
● బాపు ఒక చరిత్ర కాదు.. జీవన పాఠం ● ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘గాంధియానా’ ● మహాత్ముని జీవిత విశేషాల పుస్తకాల ప్రత్యేక విభాగం సీతంపేట(విశాఖ): జాతిపిత మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి. సత్యం, అహింస అనే సిద్ధాంతాలను ఆయుధాలుగా మలిచి, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి మార్గాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా’పేరిట ప్రత్యేక పుస్తక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ చరిత్ర, జీవితం అపురూపం. ఆయన పోరాటం, సిద్ధాంతాలు, ఆశయాలపై వేలాదిగా పుస్తకాలు ప్రచురించగా.. వాటిలో సుమారు వెయ్యి వరకు పుస్తకాలు దాతల నుంచి సేకరించి ఇక్కడ అందుబాటులో ఉంచారు. గాంధీజీ గురించి ఎందుకు చదవాలి? గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తి గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదివితే నైతిక ప్రవర్తన అలవడుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పేదవారికి సహాయం చేయాలనే గుణం, దేశభక్తి వంటి సుగుణాలు పెంపొందుతాయి. తద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగుతారు. వివేకంతో కూడిన విద్యను అభ్యసించి, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శరీరశ్రమ, నిర్భయత్వం, సర్వమత సమభావం, స్వదేశీ, అస్పృశ్యతా నివారణ అనేవి గాంధీజీ పాటించిన ఏకాదశ వ్రతాలు. మత సామరస్యం, అస్పృశ్యతా నివారణ, మద్యపాన నిషేధం, ఖాదీ, గ్రామ పరిశ్రమలు, మౌలిక విద్య, పారిశుధ్యం ఆరోగ్య నియమాలు, ప్రాంతీయ భాషాభివృద్ధి, వయోజన విద్య, సీ్త్ర సాధికారత, జాతీయ భాష, ఆర్థిక సమానత్వం, రైతు సంక్షేమం, కార్మిక సంక్షేమం, ఆదివాసుల వికాసం, కుష్టు రోగుల సేవ తదితరవి మహాత్ముడు అవలంబించారు. వీటన్నింటి గురించి తెలుసుకునేందుకు గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి.స్వామి వివేకానంద చెప్పినట్లు ‘క్యారెక్టర్, కరికులమ్, కల్చర్’అనే మూడింటిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. వేల పుస్తకాలు.. కోట్ల ప్రతులు ముంబయిలోని సర్వోదయ మండల్, గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్లు గాంధీజీపై వచ్చిన సుమారు 7 వేల పుస్తకాలను సేకరించి భద్రపరిచాయి. గాంధీజీ స్థాపించిన నవజీవన్ ట్రస్ట్ ఆయన ఆత్మకథ ‘సత్యశోధన’ను 17 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ప్రచురించింది. కోటికి పైగా గాంధీజీ ఆత్మకథ పుస్తకాలు అమ్ముడయ్యాయంటే అతిశయోక్తి కాదు. గాంధేయవాదం ఆదర్శం గాంధేయవాదం అన్ని కాలాలకు, అన్ని సమాజాలకు వర్తించే మహత్తర భావన. యువత వ్యక్తిత్వ వికాసానికి గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు ఎంతగానో దోహదపడతాయి. ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా రిఫరెన్స్’పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ సెంటర్ వ్యవస్థాపకుడు కె.ఎస్.శాస్త్రి బహూకరించిన వందలాది అమూల్యమైన పుస్తకాలు యువతకు దిశానిర్దేశం చేయగలవు. ఇవి కేవలం అలనాటి జాతీయోద్యమ చరిత్రనే కాక, సామాజిక రుగ్మతలపై గాంధీజీ సాగించిన పోరాటాన్ని, ఆయన సంస్కరణ దృక్పథాన్ని ఈ తరం వారికి స్పష్టం చేస్తాయి. గాంధీ గురించి ఏ సమాచారం అయినా ఈ పుస్తకాల్లో లభిస్తుంది. – డి.వి.సూర్యారావు, రచయిత నైతిక విలువలు పెరుగుతాయి గాంధీజీ గురించి చదవడం వల్ల నైతిక ప్రవర్తన అలవడుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదవాలి. కనీసం ఆయన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’పుస్తకాన్ని అయినా చదవాలి. కళాశాలలో చేరేటప్పుడు ప్రతి విద్యార్థికి యాజమాన్యం గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని అందజేయాలి. ఏడాది చివరలో నాన్ క్రెడిట్ (మార్కులతో నిమిత్తం లేకుండా) పద్ధతిలో పరీక్ష నిర్వహించి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా చూడాలి. దీని వల్ల ప్రతి ఒక్కరిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఇలా చేస్తే మెరుగైన సమాజం ఏర్పడటానికి దోహదపడిన వారవుతారు. అలాగే సచివాలయ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు వారం, పది రోజుల పాటు శిక్షణ ఇవ్వడం ద్వారా గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలపై అవగాహన కల్పించవచ్చు. దీని వల్ల వారిలో అంకితభావం పెరుగుతుంది. – ఆచార్య వి.బాలమోహన్దాస్, గాంధీ సెంటర్ అధ్యక్షుడు తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాలు ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్(సత్యశోధన), గాంధీ: ది ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ది వరల్డ్(రామచంద్ర గుహ), గాంధీ బిఫోర్ ఇండియా(రామచంద్ర గుహ), ఇండియా ఆఫ్టర్ గాంధీ(రామచంద్ర గుహ), మై డియర్ బాపు(సి.రాజగోపాలాచారి గాంధీజీకి రాసిన లేఖలు), ది గుడ్ బోట్మ్యాన్(రాజమోహన్ గాంధీ), గాంధీ: ప్రిజనర్ ఆఫ్ హోప్(జుడిత్ ఎం. బ్రౌన్), ది డెత్ అండ్ ఆఫ్టర్లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ(మకరంద్ పరాంజపే), హింద్ స్వరాజ్ లేదా ఇండియన్ హోమ్రూల్(గాంధీ–1909), ఐయామ్ గాంధీ(బ్రాడ్ మెల్ట్జర్), మై డేస్ విత్ గాంధీ(నిర్మల్ కుమార్ బోస్), ది లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ(లూయీ ఫిషర్), ఎ వీక్ విత్ గాంధీ(లూయీ ఫిషర్), మహాత్మా గాంధీ: హిజ్ లైఫ్ అండ్ ఐడియాస్(చార్లెస్ ఎఫ్. ఆండ్రూస్, అరుణ్ గాంధీ), ది మ్యాన్ బిఫోర్ ది మహాత్మా(చార్లెస్ డిసాల్వో), ది లివింగ్ గాంధీ: లెసన్స్ ఫర్ అవర్ టైమ్స్(తారా సేఠియా), గాంధీ అండ్ మావో ఇన్ క్వెస్ట్ ఆఫ్ అనాలజీ(రతన్ దాస్), గాంధీ సీఈవో(అలాన్ ఆక్సెల్రాడ్) -
అయ్యో పాపం!
● నిద్రపోతున్న కూలీని గమనించని లారీ డ్రైవర్ ● నల్ల పిక్కలో కూరుకుపోయి దుర్మరణం ● మూడు రోజుల తర్వాత వెలుగుచూసిన విషాద ఘటన పెందుర్తి: ఓ నిర్మాణ కూలీ జీవితం నిద్రలోనే కడతేరింది. తాను పనిచేస్తున్న చోటే సేద తీరుతుండగా విధి చిన్నచూపు చూడటంతో ఊపిరాడక అసువులు బాశాడు. పెందుర్తి మండలం ముదపాకలోని జగనన్న కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామానికి చెందిన పక్కి సూరన్నదొర (57), గంగమ్మ దంపతులు కుటుంబంతో కలిసి ముదపాకకు వలస వచ్చి ఇక్కడి జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేస్తుంటారు. సూరన్నదొర అన్న కుమారుడు పక్కి ప్రసాద్ ఈ నెల 4న ఇదే ప్రాంతంలో బావిలో పడి మృతి చెందాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు వెళ్లిన సూరన్న.. నీరసంగా ఉండటంతో ముదపాకలోని ఇంటికి తిరిగి వచ్చేశాడు. తీవ్ర విషాదంలో ఉన్న సూరన్న ముదపాకలోనే ఉన్న బంధువులతో అదే రోజు సాయంత్రం మద్యం సేవించాడు. ఉదయం మళ్లీ కేజీహెచ్కు వెళ్లి మృతదేహంతో ఊరికి వెళతానని చెప్పాడు. అనంతరం సమీపంలో నిర్మాణం కోసం పోసి ఉన్న నల్ల పిక్క రాశిపై పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి అక్కడికి పిక్క వేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ సూరన్న నిద్రిస్తున్న విషయాన్ని గమనించకుండా అతనిపైనే అన్లోడ్ చేసేశాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న సూరన్నదొర ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల తర్వాత వెలుగులోకి... కేజీహెచ్కు వెళతానని చెప్పిన సూరన్న కనిపించకపోవడంతో విజయనగరం వెళ్లిపోయాడని అందరూ భావించారు. కానీ అతను అక్కడికి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించకుండా చాలాసేపు ఎదురుచూశారు. చివరకు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు గురువారం తిరిగి ఇక్కడికి వచ్చి సూరన్న ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో అతను అదృశ్యమైనట్లు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే శనివారం ఉదయం కాలనీలో నిర్మాణ పనుల కోసం నల్ల పిక్కను తరలించేందుకు పొక్లెయిన్తో లారీలకు లోడ్ చేస్తున్నారు. ఆ సమయంలో నల్ల పిక్క రాశి నుంచి ఓ చేయి బయటకు కనిపించడం, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దుర్వాసన రావడంతో ఆందోళనకు గురైన పొక్లెయిన్ ఆపరేటర్ విషయాన్ని కాలనీవాసులకు, గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా, అది సూరన్నదొరదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐ కె.వి.సతీష్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది కిందట రైలు ప్రమాదంలో సూరన్న కుమారుడు, మూడు రోజుల కిందట ప్రమాదవశాత్తు బావిలో పడి అతని అన్న కుమారుడు మృతి చెందడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబంలో.. ఈ తాజా విషాదం చోటుచేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. -
యోగాతో సమస్యలు తీరవు
ఎస్.రాయవరం: యోగాసనాలతో ప్రజల సమస్యలు తీరిపోవు..కేవలం ప్రజల దృష్టి మరల్చిందుకు ప్రధాని నరేంద్రమోదీ యోగా జపం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ అన్నారు. వెంకటాపురం గ్రామంలో ఉపాఽధి కూలీలతో శనివారం సత్యనారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 21 నెలరోజులు పాటు యోగా కార్యక్రమాలు చేపట్టేందుకు పిలుపునిచ్చిందన్నారు. ఎద్దు ఈనిందంటే దూడను కళ్లెంతో కట్టేయమన్నట్లుగా కేంద్రం ఇలా పిలపునిచ్చిందో లేదో వెంటనే యోగాంధ్ర అంటూ రాష్ట్రం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమం ముగింపురోజున విశాఖకు నరేంద్రమోదీ వస్తున్నారన్నారని, ఆ రోజున రెండు లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. లోటు బడ్జెట్తో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే.. విశాఖలో యోగా ఎందుకని ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కుగా పిలిచే విశాఖ ఉక్కు ఖర్మాగారాన్ని ఆదుకునే సమయం లేదు, కాని యోగాసనాలకు సమయం ఎలా వచ్చిందని విమర్శించారు. ఇకనై మోదీ ఆంధ్రాను ఎలా ఆదుకుంటారో ప్రకటన చేయాలన్నారు. -
ట్రెజరీలో అడ్డగోలు బదిలీలు
విశాఖ సిటీ: జిల్లా ఖజానా శాఖలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. నిబంధనలను ఉల్లంఘించి, ఇష్టానుసారంగా బదిలీల ప్రక్రియను ముగించారంటూ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అకౌంటెంట్లు, సబార్డినేట్లకు సంబంధించిన బదిలీలలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు? సాధారణంగా ఒకే చోట ఐదేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలి. అంతేకాకుండా, బదిలీలను కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి. అయితే జిల్లా ఖజానా శాఖలో ఈ నిబంధనలను పట్టించుకోకుండా, స్టేట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కనుసన్నల్లో 34 మంది ఉద్యోగులను ఇష్టానుసారంగా బదిలీ చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయినా అక్కడే కొనసాగింపు ఈ బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 12 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ కమిటీ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించలేదని సమాచారం. దీనికి తోడు, ఖజానా శాఖలో ఐదేళ్లుగా జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగికి బదిలీ చేయకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సదరు జూనియర్ అకౌంటెంట్పై అవినీతి ఆరోపణలు చేస్తూ పలువురు సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. అయినప్పటికీ, ఆరోపణలను, ఐదేళ్ల నిబంధనను పట్టించుకోకుండా అతడిని బదిలీ చేయకపోవడం పట్ల ఆ శాఖ సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీటీవో సంతకం చేసి సెలవుపై..? ఈ బదిలీల ఫైల్పై జిల్లా ట్రెజరీ ఆఫీసర్ (డీటీవో) నాగభూషణం సంతకం చేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళినట్లు సిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బదిలీల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని బాధితులు, ఇతర ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరిపి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకుండా 34 మందికి స్థానచలనం ఐదేళ్ల నిబంధనను పట్టించుకోని అధికారులు -
ఏపీ పీజీ ఈసెట్ ప్రారంభం
మద్దిలపాలెం(విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీ ఈసెట్ 2025 శుక్రవారం ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఈ పరీక్షలను ప్రారంభించారు. పరీక్షల తొలిరోజు ఉదయం సెషన్లో 92 శాతం, మధ్యాహ్నం సెషన్లో 82 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏయూ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష సెట్ కోడ్ను వీసీ విడుదల చేయగా, రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణరావు, సెట్ కన్వీనర్ ఆచార్య పి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు శని, ఆదివారాల్లో కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
యలమంచిలి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యలమంచిలి టిడ్కో గృహ సముదాయం నివాసి కుండల లోకనాథం(57) శుక్రవారం మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో లోకనాథం స్థానిక టిడ్కో గృహ సముదాయానికి సమీపంలో ఉన్న డీఎస్సార్ పెట్రోల్ బంక్లో తన స్కూటీలో పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా ఎదురుగా తుని వైపు వెళ్తున్న తుని ఎంఆర్ పేటకు చెందిన వాన అప్పలనాయుడు(25) బైక్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకనాథాన్ని ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కొసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం లోకనాథం మృతి చెందినట్టు యలమంచిలి ట్రాఫిక్ బి.రామకృష్ణ తెలిపారు. మృతుని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
అచ్యుతాపురం రూరల్ : మండలంలో గొర్లి ధర్మవరం గ్రామానికి చెందిన అప్పికొండ అప్పారావు(60) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఐవోసీఎల్ కంపెనీలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ముస్లిం కుటుంబంపై కక్షసాధింపు
నాతవరం: ముస్లిం కుటుంబంపై కూటమి నేతలు కక్షసాధింపు చర్యలకు దిగారు. కుమారుడి పెళ్లి వేడుకలో ఉండగా పొక్లెయిన్తో వారి ఇల్లు కూల్చివేశారు. దీనికి సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు.. జిల్లేడుపూడి పంచాయతీ శివారు వై.వెంకయ్యపాలెం గ్రామానికి ఇరవై ఏళ్ల క్రితం షేక్ సుభాన్ కుటుంబం వలస వచ్చింది. దివంగత పారిశ్రామికవేత్త, నూకాంబిక అలయ నిర్మాణకర్త ఎం.ప్రభాకర్ చౌదరి సుభాన్కు ఆశ్రయం కల్పించారు. సుభాన్ ఓ రైతు నుంచి స్థలం కొని తాటాకు ఇల్లు కట్టుకొని చికెన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభాకర్ చౌదరి దివంగతులయ్యాక సుభాన్కు సమస్య మొదలైంది. సుభాన్ ఇంటికి సమీపంలో ఉన్న జీడిపిక్కల పరిశ్రమను కేరళకు చెందిన వ్యక్తి నడిపేవారు. ఆయన వేరొకరికి పరిశ్రమను విక్రయించారు. జీడి పిక్కల ఫ్యాక్టరీకి ఈశాన్య భాగంలో సుభాన్ ఇల్లు ఉందని, దాంతో వ్యాపారం సరిగా జరగలేదంటూ ఇల్లు ఖాళీ చేయమని కొత్త యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ వివాదం రెండేళ్ల నుంచీ నలుగుతోంది. జీడి పిక్కల ఫ్యాక్టరీ యజమాని టీడీపీకి చెందిన స్థానిక సర్పంచ్కు సన్నిహితుడు కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సుభాన్కు సమస్య మొదలైంది. ఏప్రిల్ నెలలో పంచాయతీ డ్రైనేజీ పనుల నెపంతో పొక్లెయిన్తో వీరి ఇంటి ముందు భాగంలో కాలువ పనులు చేశారు. టీడీపీ నేతలు, అధికారుల అండతో తన ఇంటికి ముప్పు పొంచి ఉందని గ్రహించిన సుభాన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే రెండు రోజుల క్రితం ఆయన ఇంటిని నేలమట్టం చేశారు. కుమారుడి వివాహం రోజునే ఇల్లు కూల్చివేత తన చిన్న కుమారుడి వివాహం నిమిత్తం ఈనెల 4వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సమీపంలో జగ్గంపేట వెళ్లామని సుభాన్ చెప్పారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పొక్లెయిన్తో తమ ఇంటిని కూల్చేశారని, శబ్దం రావడంతో ఇంటి పక్కనే నివాసం ఉంటున్న చిటికిల కృష్ణవేణి గమనించి ‘ఏమిటీ అన్యాయం’ అని ప్రశ్నించగా.. ముఖానికి ముసుగులు వేసుకున్న వ్యక్తులు నీకు సంబంధమేమిటని బెదిరించి వెళ్లిపోయారని వివరించారు. సమాచారం అందుకొని వెంటనే 100 నంబరుకు ఫిర్యాదు చేశామన్నారు. నాతవరం పోలీసులు వెంటనే తమ నుంచి వివరాలు తీసుకున్నారని, కానీ నేటి వరకు రాలేదన్నారు. దుండగులు తాము బక్రీద్ పండగ కోసమని పెంచుతున్న మేకపోతును కూడా తీసుకుపోయారన్నారు. ఈనెల 5న ఇంటికి చేరుకొని, ఫ్రిజ్ తదితర విలువైన సామగ్రితో సహా తమ ఇల్లు ధ్వంసమైన దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. 6వ తేదీన బంధుమిత్రులకు పెళ్లి భోజనాలకు పిలిచామని, కానీ తామే రోడ్డున పడ్డామని వారు ఆవేదనగా చెప్పారు. వివాహ వేడుకలో ఉండగా ఇల్లు కూల్చివేత టీడీపీ నేత అండతోజీడిపిక్కల వ్యాపారి దారుణం -
సామాజిక సందేశంతో ఆకట్టుకున్న నాటికలు
మద్దిలపాలెం(విశాఖ): విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెలవారీ నాటక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం రెండు సందేశాత్మక నాటికలను ప్రదర్శించారు. వీఎండీఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్. రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్, నాంచారయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి ప్రదర్శనగా స్నిగ్ధ కలం నుంచి జాలువారిన ‘దోషేచ వహ్ని’నాటిక ప్రదర్శించారు. మధ్యతరగతి కుటుంబాల్లో కుమార్తెను అత్తవారింటికి పంపిన తర్వాత, ఆ తల్లిదండ్రులు సర్వం కుమార్తెకు ధారపోస్తూ, కోడలి వేదనను పట్టించుకోని ఇతివృత్తంతో ఈ నాటిక సాగుతుంది. ‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయినేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి’ అనే ఆరు సూత్రాలను పాటిస్తూ జీవించే సీ్త్ర పాత్రను ఈ నాటిక స్పృశించింది. అయితే భర్త తప్పు చేసినప్పుడు.. సప్తమ సూత్రంగా ‘దోషేచ వహ్ని’ అని సీ్త్ర చైతన్యవంతురాలై తనకు తానుగా లిఖించుకోవాలి అన్న సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథాంశానికి తగ్గట్టుగా నటీనటుల చక్కని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. రెండవ నాటికగా కెరటాలు ప్రదర్శించారు. భాగవతుల రమాదేవి రచించిన ‘కెరటాలు’కథకు మునిపల్లె విద్యాధర్ నాటకీకరణ చేశారు. ఆధునిక భావాలతో నేటి యువత, ముఖ్యంగా మహిళలు తమ తల్లిదండ్రులను, ఆ తర్వాత భర్తను కూడా ఎదిరించడమే అభ్యుదయంగా భావించి తమ జీవితాలను, భవిష్యత్ను భగ్నం చేసుకుంటున్నారు. అలాంటివారు కెరటాల్లో కొట్టుకు పోకుండా.. గతంలో కొందరి జీవితాలను ఉదాహరణగా తీసుకుని ఒడ్డుకు చేరాలనే సందేశమిస్తూ ఈ నాటిక సాగింది. ఈ రెండు నాటికలను రాజాం కళాక్రియేషన్స్ సంస్థ ప్రదర్శించింది. -
ఏయూలో సమూల మార్పులు
విభాగాలకు నూతన డీన్, డైరెక్టర్ల నియామకం మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్, శుక్రవారం పరిపాలనకు సంబంధించి పలువురు డీన్లు, డైరెక్టర్లను పూర్తిస్థాయిలో మార్పు చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థాగత మార్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కీలక నియామకాలు డీన్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్, డీన్ అవుట్రీచ్, డీన్ అలమ్నీ రిలేషన్స్, డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, చీఫ్ కో–ఆర్డినేటర్లు వంటి నూతన పదవులను ఏర్పాటు చేశారు. స్పాట్ వాల్యుయేషన్ విభాగానికి చీఫ్ కో–ఆర్డినేటర్ను నియమించారు. బోధనా సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్ను నియమించారు. డీన్ అలమ్నీ రిలేషన్స్ పదవిని ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఓపెన్ లెర్నింగ్లను అనుసంధానించి, ఒకే డైరెక్టర్ పరిధిలోకి తీసుకువచ్చారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కళల విభాగాలను అనుసంధానిం చనున్నారు. నూతన డీన్ల వివరాలు డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్: కె. రాంబాబు, డీన్ అకడమిక్స్ అఫైర్ కె. శ్రీనివాసరావు, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ వల్లికుమారి (కంప్యూటర్ సైన్స్), డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ – సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ ప్రొఫెసర్ అప్పలనాయుడు (కెమికల్ ఇంజనీరింగ్), డీన్, పీజీ అండ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్ ఆచార్య మునిస్వామి (స్టాటిస్టిక్స్), డీన్ అలమ్నీ రిలేషన్స్ ప్రొఫెసర్ శ్యామల (కెమిస్ట్రీ), డీన్ అవుట్రీచ్ ప్రొఫెసర్ కె. రమాసుధ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఎస్. హరినాథ్ (సోషల్ వర్క్), డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ కె.ఎస్. రావు (సివిల్ ఇంజనీరింగ్), చీఫ్ కో–ఆర్డినేటర్ స్పాట్ వాల్యుయేషన్ కేటీ బలరాం పడాల్ను నియమించారు. -
చెట్టు పైనుంచి పడిన యువకుడు మృతి
బుచ్చెయ్యపేట: మండలంలోని రాజాం గ్రామానికి చెందిన నడిపల్లి తరుణ్(19) ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. గత నెల 15వ తేదీన గ్రామంలో తాడిచెట్టు ఎక్కి తాటికాయలు నరికి చెట్టు దిగుతుండగా తరుణ్ కాలు జారి పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరిన ఆయన్ను అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత 20 రోజులుగా వైద్య సేవలు పొందుతూ తరుణ్ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన తల్లి పద్మ.. తరుణ్ చిన్నతనంలోనే మృతి చెందగా.. తండ్రి అప్పలనాయుడు బాగోగులు చూసుకుంటున్నాడు. ఐటీఐ చదువుతున్న తరుణ్ అకాల మృతితో తండ్రి అప్పలనాయుడు భోరున విలపిస్తున్నాడు. -
పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్ విడుదల
అనకాపల్లి టౌన్: దివ్యాంగులకు పారా స్పోర్ట్స్తో మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.అసయ్య తెలిపారు. స్థానికంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ క్రీడాకారులతో సమానంగా పారా క్రీడాకారులకు గౌరవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గనిరెడ్డి రాము, తదితరులు పాల్గొన్నారు. -
బ్రాండిక్స్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
అచ్యుతాపురం రూరల్ : బ్రాండిక్స్ బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము డిమాండ్ చేశారు. శుక్రవారం యలమంచిలి మండలం కృష్ణాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్యుతాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందుకుంటున్న మహిళా కార్మికులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రంగా గాయాలైన మహిళా కార్మికులను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారన్నారు. మహిళా కార్మికులు గత సంవత్సర కాలం నుంచి బస్సుల ఫిట్నెస్ సరిగ్గా లేదని చెబుతున్నప్పటికీ మూర్ఖంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. స్టీరింగ్ లోపం కారణంగా బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో సుమారు 30 మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వేతనంతో కూడిమ సెలవులు మంజూరు చేయాలన్నారు. -
పీతపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభం
అనకాపల్లి: కోడూరు పంచాయతీ పరిధి పీతపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కును శుక్రవారం కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనకాపల్లి కేంద్రంలో తొలి ఎంఎస్ఎంఈ పార్కును కోడూరులో ఏర్పాటు చేశామని, పారిశ్రామిక పార్కులో స్థలాలు పొందిన వారు వెంటనే యూనిట్ల స్థాపన మొదలు పెట్టాలని కోరారు. పార్కులో యూనిట్ల స్థాపనకు 171 మందికి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. పార్కును రూ. 59.47 కోట్లతో అభివృద్ధి చేశామని, 250 ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కోడూరు గ్రామం నుంచి పీతపాలెం వరకు రెండు కిలోమీటర్ల రహదారిని రూ.79.42 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించామన్నారు. ఆర్డీవో షేక్ ఆయిషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు ఎస్.నరసింహారావు, డిప్యూటీ జోనల్ మేనేజరు సూర్యనారాయణ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు జి.నాగరాజారావు, తహశీల్దారు బి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్ష తప్పింది విద్యార్థులు కాదు.. కూటమి ప్రభుత్వం
అనకాపల్లి: రాష్ట్ర విద్యాశాఖ వైఫల్యంతో ఎంతోమంది టెన్త్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమైందని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ రమాజ్యోతికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పదో తరగతి మూల్యాంకనంలో లోపాలు విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయన్నారు. తక్కువ మార్కులు వచ్చిన వారు, పరీక్ష తప్పిన వారు రీ వాల్యుయేషన్ చేయిస్తే.. అనేకమందికి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయని, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారని ఆయన ప్రశ్నించారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందన్నారు. కచ్చితమైన ఫలితాలు వెల్లడించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో రాత్రీ పగలూ కష్టపడి చదివి పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంతులేని మానసిక క్షోభకు గురయ్యారన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలోనే కూటమి ప్రభుత్వం చేతగానితనం బయటపడిందన్నారు. ప్రశ్నాపత్రాలు వాట్సాప్ వేదికగా లీక్ అయినా తప్పులను సరిదిద్దుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంస్కరణలు తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం వాటికి దశల వారీగా మంగళం పాడేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి విద్యార్థి విభాగం అధ్యక్షుడు చరణరాజ్, పెందుర్తి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉగ్గిన నాగార్జున, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బోడి వెంకటేష్ యాదవ్, విద్యార్థులు బోలెం హరి హేమంత్, సంతోష్, కిరణ్, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు. టెన్త్ ఫలితాల్లో తీవ్రమైన అవకతవకలు మొదట ఫెయిలైన వారికి రీ కౌంటింగ్లో అధిక మార్కులు విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం డిమాండ్ -
చేతకాక.. కమిషనర్ లేక!
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగింది. కూటమి ప్రభుత్వ అసమర్థతపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడగా.. కూటమి కార్పొరేటర్ల అసంబద్ధ వాదనలతో సభ రసాభాసగా మారింది. అడ్డగోలుగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో చూపిన చొరవ, జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ను నియమించడంలో చూపకపోవడంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. ప్లకార్డులతో మేయర్ పోడియంను చుట్టుముట్టి, తక్షణమే జీవీఎంసీకి రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ సమావేశ మందిరం మార్మోగింది. డాబాగార్డెన్స్ (విశాఖ): నూతన మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాద, ప్రతిపాదనలతో హోరెత్తింది. ప్రధాన అజెండాలోని 27 అంశాలతో పాటు, టేబుల్ అజెండాలోని 6 అంశాలు సభ్యుల చర్చకు వచ్చాయి. వీటిలో 3 ప్రధాన అజెండా(1, 10, 14) అంశాలు, 2 టేబుల్(1, 6) అజెండా అంశాలు తప్ప, మిగిలినవన్నీ ఆమోదం పొందాయి. రెగ్యులర్ కమిషనర్ నియామకం ఎప్పుడు? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సభను అడ్డుకున్నారు. ప్లకార్డులతో మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, జీవీఎంసీకి తక్షణమే రెగ్యులర్ కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేశారు. కీలకమైన కమిషనర్ పోస్టును నెలల తరబడి భర్తీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని నినాదాలు చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు వారి నినాదాలతో సభ దద్దరిల్లింది. మేయర్ పీలా శ్రీనివాసరావు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మొదట పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాప తీర్మానం చేయాలని సూచించడంతో, వైఎస్సార్సీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు. అనంతరం, ఉగ్రదాడి బాధితులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. ఇన్చార్జ్ కమిషనర్ రాకపోవడంతో బ్రేక్ ఇన్చార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నందున సమావేశాానికి హాజరుకాలేదు. దీనిపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కమిషనర్ లేకుండా సభను నిర్వహించడాన్ని తప్పుబట్టారు. వారి నిరసనతో మేయర్ పీలా శ్రీనివాసరావు 15 నిమిషాల్లోనే టీ బ్రేక్ ప్రకటించారు. దాదాపు అరగంట తర్వాత కమిషనర్ హాజరు కావడంతో సభ తిరిగి ప్రారంభమైంది. జీరో అవర్ కోసం పట్టు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పీలా అజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించగా, కార్పొరేటర్లు తమ వార్డు సమస్యల పరిష్కారం కోసం జీరో అవర్ కావాలని పట్టుబట్టారు. మేయర్ దీనికి అంగీకరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ జీవీఎంసీకి నాలుగు నెలలుగా కమిషనర్ లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెండు, మూడు రోజుల్లో కమిషనర్ను నియమించేలా చూడాలని సూచించారు. ఎవడ్రా నువ్వు..! జీరో అవర్లో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్పొరేటర్ కంపా హనోక్ మాట్లాడుతుండగా.. వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన హనోక్, ‘ఎవడ్రా నువ్వు’అంటూ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనతో సభలో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు కల్పించుకుని, వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, పార్టీ మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హనోక్కు చురకంటించారు. హనోక్ వెంటనే క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. జీవీఎంసీలో ఘోస్ట్ ఉద్యోగులు జీవీఎంసీలో ‘ఘోస్ట్ ఉద్యోగులు’ఉన్నారని, పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. అలాంటి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి రైతులను ఇబ్బంది పెడుతున్నందున, డ్రైన్లు నిర్మించాలని పల్లా సూచించారు. ఎఫ్ఆర్యూ ఒప్పందం ఎప్పుడైనా రద్దు చేయొచ్చు శ్రీహరిపురంలోని ఫస్ట్ రిఫరల్ యూనిట్ నిర్వహణ కోసం రూ.1.20 కోట్లు కేటాయించడం, విజయ (బెహరా) వెల్ఫేర్ సొసైటీకి చెల్లింపుల ఆమోదంపై జీవీఎంసీ కౌన్సిల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పీవీ సురేష్ సహా ఇతర కార్పొరేటర్లు మాట్లాడుతూ సొసైటీ ఉచిత సేవలకు బదులు డబ్బులు వసూలు చేస్తోందని, 30 ఏళ్ల లీజుపై కూడా అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సొసైటీ సరిగా పనిచేయకపోతే విచారణ జరిపి ఒప్పందాన్ని ఎప్పుడైనా రద్దు చేస్తామని మేయర్ పీలా శ్రీనివాసరావు ద్వారా హామీ ఇచ్చారు. ఆమోదించిన అంశాల్లో ప్రధానమైనవి ● జీవీఎంసీలోని ఈఈ–1 పరిధిలో సివిల్ పనుల పర్యవేక్షణకు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను ఏడాది పాటు కొనసాగింపు. ● రూ.55.40 లక్షల అంచనా వ్యయంతో 19వ వార్డు పెదవాల్తేరులో చేపల మార్కెట్ పునరుద్ధరణ . ● ఇంజినీరింగ్ విభాగం ఈఈ–5 పరిధిలో 18 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సెక్యూరిటీ గార్డుల కొనసాగింపు.ఖాళీగా కమిషనర్ కుర్చీమాట్లాడుతున్న మేయర్ పీలా శ్రీనివాస్ రెగ్యులర్ కమిషనర్ ఎక్కడ అంటూవైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆగ్రహం జీవీఎంసీపై కూటమి నిర్లక్ష్యం 27 అజెండా అంశాలు.. 6 టేబుల్ అజెండా అంశాలు సుదీర్ఘంగా సాగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంపీలా గోవిందు హాజరుపై అభ్యంతరం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు హాజరుపై డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ అభ్యంతరం తెలిపారు. ఏ హోదాలో ఆయన వచ్చారని ప్రశ్నించగా, పీలా గోవింద్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని, ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చినట్లు అధికారులు వివరించారు. -
డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
తొలిరోజు 88.39 శాతం హాజరు ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాలో విద్యాశాఖ మొత్తం 12 పరీక్షా కేంద్రాలను కేటాయించింది. మొదటి రోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో 11 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. తొలి రోజు 2,447 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపించగా, వారిలో 88.39 శాతం (2,163 మంది) హాజరయ్యారు. 284 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎన్. ప్రేమ్కుమార్ తెలిపారు. ఉదయం సెషన్లో 7 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,435 మందికి 1,278 మంది (89.06శాతం) హాజరయ్యారు.మధ్యాహ్నం 4 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,012 మందికి 885 మంది (87.45శాతం) హాజరయ్యారు. డీఈవో ఒక కేంద్రాన్ని, పరీక్షల స్క్వాడ్ మూడు కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్షలు జరిగిన కేంద్రాలలో బుచ్చిరాజుపాలెంలోని ఏడీజెడ్ ఆరోవనా డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో అత్యధికంగా 450 మంది అభ్యర్థులను కేటాయించగా, నగరంలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో అత్యల్పంగా 85 మంది అభ్యర్థులను కేటాయించారు. -
తూట్లు...
● అటకెక్కిన ‘అన్నదాతా.. సుఖీభవ’ ● మొక్కుబడిగా ఆర్బీకేల పనితీరు ● ఎరువులు, విత్తనాలు అందని పరిస్థితి ● మూలకు చేరిన కియోస్క్ మిషన్లు ● పాత పద్ధతిలోనే గ్రామానికి విత్తనాలు సరఫరా చేసేలా ప్రతిపాదన ఆశయానికిరైతులకు అగచాట్లు రైతన్నకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. ‘అన్నదాతా.. సుఖీభవ’ పేరిట పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లు మొండి చేయి చూపింది. వ్యవసాయ సేవలను అత్యంత చేరువలో గ్రామంలోనే అందించే ఆర్బీకేలు ఇప్పుడు మొక్కుబడిగా సాగుతున్నాయి. సేవలు పూర్తిగా అందివ్వకపోగా వాటిని కుదించి, మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదేగాని జరిగితే వ్యవసాయం, పశు సంవర్థక, ఫిషరీస్ సేవలు రైతులకు మరింత దూరమయ్యే అవకాశం ఉంది. కియోస్క్ మిషన్ ఎక్కడ? మాది లక్ష్మీపురం గ్రామం. నాకు రెండెకరాల పొలం వుంది. ఖరీఫ్ సీజన్లో వరి వేస్తాను. మాది ముంపు ప్రాంతం కావడంతో ఎక్కు వగా వరిలో ఆర్జీఎల్ రకం విత్తనం వేస్తాము. గతేడాది వరకు మాకు నచ్చిన విత్తనం, ఎరువులు మిషన్లో నమోదు చేసుకునేవాడిని. ఎరువులు కూడా కియోస్క్ మిషన్లో నమోదు చేసుకునేవాడిని. నా పేరున నాకు ఏమి కావాలో అది నమోదయ్యేది. ఈసారి అలా చేయలేదు. విత్తనాలు వచ్చాక ఏవి ఉంటే అవి తీసుకోవాలట. –బలిరెడ్డి కాసు, రైతు, లక్ష్మీపురం సూచనలు అందడం లేదు మా ఊరి రైతు భరోసా కేంద్రంలో ఇంతకు ముందులా రోజూ టీవీ వేసి ఉండకపోవడంతో వ్యవసాయ సూచనలు తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంది. నేను వరి, చెరకు పండిస్తాను. ఇంతకు ముందు మాకు విత్తనాలు కావాలంటే మిషన్లో నమోదు చేసుకునేవాళ్లం. ఇప్పుడు అలా లేదట. మిషన్ను పక్కన పెట్టేశారు. వరి, చెరకు పంటల్లో తెగుళ్లు, ఇంకా ఏమైనా వ్యవసాయ సూచనలు కావాలంటే టీవీలో చూసి తెలుసుకునేవాడిని. ఇప్పుడు చెప్పేవారు లేరు. – కరక తలుపులయ్య, రైతు, చాకిపల్లి, రామజోగిపాలెం చోడవరం: వ్యవసాయ సేవలు, విత్తనాలు, ఎరు వుల కోసం మండల కేంద్రాలకు వెళ్లి రోజుల తరబ డి వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు పడిన నాటి చీకటి రోజులు రైతులకు గుర్తొస్తున్నాయి. వారికి ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించి, గ్రామంలోనే వ్యవసాయ సేవలన్నీ అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)లను తెచ్చింది. ఆ వ్యవస్థలో ఏకంగా సుమారు రూ.50 లక్షల వ్యయంతో ఆర్బీకేలకు సొంత భవనాలు నిర్మించడంతోపాటు కుర్చీ లు, కంప్యూటర్, టేబుళ్లు, పుస్తకాల రేక్లు సమకూర్చారు. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, శాస్త్రవేత్తల సూచనలు అందుకొని, విజ్ఞానాన్ని పొందేందుకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విత్తనాలు, ఎరువులు పొందేందుకు కియోస్క్ మిషన్లు కూడా నెలకొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆర్బీకేల్లో సేవలు అరకొరగానే రైతులకు అందుతున్నాయి. ఏడాది నుంచి కరెంటు బిల్లులు చెల్లించలేదు. ఏ రోజు విద్యుత్ కనెక్షన్ తొలగిస్తారో తెలీని పరిస్థితి.. ఇంటర్నెట్ సామర్ధ్యం తగ్గించడంతో ఆన్లైన్ సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. ‘భరోసా’ దక్కలేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పేరిట అందించిన పెట్టుబడి సాయం స్థానంలో కూటమి ప్రభుత్వం ‘అన్నదాతా.. సుఖీభవ’ను ప్రవేశపెడతా మని చెప్పింది. గతంలో రూ.13.500 ఇస్తే.. ఇప్పు డు రూ.20 వేలు అందిస్తామని డంబాలు పలికింది. కానీ గత ఏడాది, ఈ ఏడాది రెండేళ్లు ఆర్థిక సాయం అందించలేదు సరికదా ఇంతవరకు కనీసం విధివిధానాలను రూపొందించలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందని వారు గుర్తుచేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేశారని, కౌలు రైతులతో సహా ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేశారని పేర్కొన్నారు. ఆర్బీకేల్లో ఎన్నో సేవలుజిల్లాలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. ఇవి కాక అపరాలు, చెరకు, ఇతర వాణిజ్య పంటలు కూడా వేలా ది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 23 వేల 300 మెట్రిక్ టన్నుల వరి విత్తనాలు కావాలని ప్రతిపాదన పెట్టారు. 33 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా కావాలని ప్రతిపాదన పంపించారు. అయితే ప్రతిపాదనలు ఆర్బీకేల ద్వా రా జరగలేదు. వ్యవసాయాధికారుల అంచనాల మేరకు ప్రతిపాదన పెట్టారు. గతేడాది వరకు రైతు లకు ఏ రకం వరి విత్తనం అవసరం, ఏ సమయంలో ఏ ఎరువు అవసరమో నేరుగా రైతే పాసుపుస్త కం పట్టుకొని ఆర్బీకేలకు వెళ్లి అక్కడ కియోస్క్ మిషన్లో స్వయానా నమోదు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆర్బీకేల్లో ఆ పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కియోస్క్ మిషన్లను నిరుపయోగంగా పక్కన పెట్టేసింది. పాత పద్ధతిలో రైతులకు కావలసినవి ఆర్బీకేలో ఉన్న సిబ్బందికి చెబితే వారు నమోదు చేసుకొని మొత్తం ఇండెంట్ను ప్రతిపాదనకు పంపుతున్నారు. దీనివల్ల పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులు సరఫరా కాకపోతే రైతులందరికీ అవి అందే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏ రకం విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తే వాటినే రైతులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక రైతుల విజ్ఞానం కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీల వినియోగం కూడా పూర్తిగా లేదు. ఏదో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే వ్యవసాయ కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రమే టీవీలు ఆన్ చేస్తున్నారు. మిగతా సమయాల్లో రైతులకు అవసరమైన వ్యవసాయ సూచనలు తెలుసుకునే పరిస్థితి లేదు. అదే గతంలో ఉదయం నుంచీ సాయంత్రం వరకు టీవీలు ఆన్ చేసి వివిధ చానల్స్, ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవసాయ కార్యక్రమాలన్నీ నిరంతరం చూసేందుకు వీలుండేది. రైతులకు సమయం దొరికినప్పుడు ఆర్బీకేలకు వచ్చి ఆ వ్యవసాయ సూచనలు తెలుసుకొని విజ్ఞానంతో వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు వ్యవసాయ సిబ్బంది సూచనలు చెబితే తప్ప వ్యవసాయంలో నష్టాలను టీవీలో చూసి నివారించుకునే అవకాశం లేకుండా పోయింది. -
300 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
నక్కపల్లి: రేషన్ డిపోల ద్వారా తెల్లకార్డుదారులకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. మండలంలోని జానకయ్యపేటలో తెల్లకార్డుదారుల నుంచి కారు చౌకగా కొనుగోలు చేసి రైసు మిల్లులకు ఆటోలో తరలిస్తున్న 300 కిలోల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జానకయ్యపేటలో ఆటోలో బియ్యం తరలిస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. జానకయ్యపేట, సిహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, చినతీనార్ల తదితర చుట్టుపక్కల గ్రామాల్లో కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆటో డ్రైవర్ తెలిపాడని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. కిలో రూ.18ల చొప్పున కొని అధిక ధరకు రైసు మిల్లర్లకు విక్రయిస్తుంటామని డ్రైవర్ చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయిస్ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడ్డ బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.75 వేలు ఉంటుంది. -
అంగరంగ వైభవంగా రామలింగేశ్వర విగ్రహ ప్రతిష్ట
మాడుగుల : మండలంలో సత్యవరం గ్రామంలో గురువారం అంగరంగ వైభవంగా రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా రామలింగేశ్వర, నందీశ్వరుడు, వినాయక, పార్వతీదేవిల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ట జరిపారు. భక్తులంతా బూరెలు, పండ్లు, పుష్ఫాలు, నవధాన్యాలు తీసుకొచ్చి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గోన్నారు. అనతంరం స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నసమారాధన జరిపారు. ఉత్సవాల సందర్భంగా మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాగశాలలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో గృహస్తు దంపతులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్, మాజీ ఎంపీపీ రామధర్మజ పాల్గొన్నారు. -
రైతులను మోసగించిన ఎంపీ రమేష్
దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సహా కూటమి నాయకులు ఘోరంగా మోసం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో గురువారం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాగా ఒకప్పుడు సహకార రంగంలో రోల్మోడల్గా నిలిచి, నేడు శిథిలావస్థకు చేరుకున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోక పోవడం అత్యంత దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార రంగంలో నడుస్తున్న ఫ్యాక్టరీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం రైతులను మోసగించడమేనన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో అత్యధికంగా వరి, చెరకు పండిస్తుండగా కూటమి నాయకులు మాత్రం డిస్టలరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రైతులు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లలో రూ.89 కోట్లు మంజూరు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 2023–2024 సీజన్లో చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు ఇంకా చెల్లించాల్సిన రూ.150 అందరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 2024–25 సీజన్లో లక్షా 7వేల టన్నుల చెరకు క్రషింగ్ జరపగా, దీనిలో జనవరి 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు మాత్రమే తొలి దఫా పేమెంట్గా టన్నుకు రూ.3వేలు చొప్పున చెల్లించారన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 10 వరకు క్రషింగ్ జరిగినా రైతులకు ఇంకా పేమెంట్ల ఇవ్వలేదన్నారు. ఫ్యాక్టరీ భవిష్యత్ అంధకారంగా ఉందని, నెలల తరబడి కార్మికులకు జీతాలు, రైతులకు పేమెంట్లు ఇవ్వకపోవడంతో దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవాడ చెరకు రైతులను దారుణంగా మోసం చేసిన ఎంపీ రమేష్, కూటమి నాయకులు నిస్సిగ్గుగా ప్రజల్లో తిరుగుతున్నారని ఘాటుగా విమర్శించారు. రైతులను మోసగించిన నాయకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు. కూటమి పాలనలో దయనీయంగా చెరకు రైతులు, కార్మికుల పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో రూ.89 కోట్ల నిధులు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ధ్వజం -
కారుకు నిప్పు అంటించిన దుండగులు
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి శారదనగర్లో నివాసం ఉంటున్న జర్నలిస్టు ఈశ్వరరావు కారుకు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి దుండగులు ఈ సంఘటనకు పాల్పడ్డారు. తను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డుపై పార్కింగ్ చేశాడు. పెట్రోల్ పోసి కారుకు నిప్పు అంటించారు. మంటలు ఒక్కసారిగా ఎగిసి పడడంతో ఈఽశ్వరరావు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసి వెనుతిరిగారు. అందరూ వెళ్లిపోగా మరలా దుండగులు కారుకు నిప్పు అంటించారు. దీంతో కారు మొత్తం దగ్ధమైంది. బాధితుడు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఏపీఐఐసీ భూముల పరిశీలన
నక్కపల్లి: మండలంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో జరుగుతున్న పనులను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ గురువారం పరిశీలించారు. వేంపాడు, చందనాడ, డీఎల్పురం, అమలాపురం, రాజయ్యపేటలలో 2000 ఎకరాలు బల్క్ డ్రగ్ పార్క్కు, 2500 ఎకరాలు ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్ప్లాంట్కు కేటాయించిన విషయం తెలిసిందే. రూ.1100 కోట్ల వ్యయంతో ఈ భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునేందుకు కలెక్టర్ విజయ కృష్ణన్తో కలిసి యువరాజ్ ఈ ప్రాంతాల్లో పర్యటించినట్లు అధికారులు తెలిపారు. ఏ గ్రామంలో ఎంత భూమి సేకరించారు. జిరాయితీ ఎంత, డీ ఫారం ఎంత, ప్రభుత్వ భూమి ఎంత అనే వివరాలు అధికారులు వివరించారు. గతంలో ఆయన ఉమ్మడి విశాఖ కలెక్టర్గా ఉన్న సమయంలోనే భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులు వంటి ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ పునరావాస కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసి లేఅవుట్ సిద్ధం చేసి నిర్వాసితులకు అప్పగించాలని ఆదేశిస్తున్నట్లు చెప్పారు. ఆర్డీవో రమణ, ఎస్డీసీ అనిత, తహసీల్దార్ నర్సింహమూర్తి, ఎంపీడీవో సీతారామరాజు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. అంత గోప్యత ఎందుకో? పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ పర్యటనపై రైతులు, నిర్వాసితులకు కనీస సమాచారం లేదు. పూర్తిగా అధికారిక పర్యటన అయినప్పటికీ స్థానిక అధికారులు గోప్యంగా ఉంచారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని గతంలో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని రైతులు, నిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారు. బాధిత రైతులు ఎక్కడ ఆయన కాన్వాయ్ను అడ్డుకుని తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తారనే భయంతోనే పర్యటనను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. సమస్యలను కార్యదర్శి దృష్టికి తీసుకు వచ్చేవారమని, ఎవరికీ కనీస సమాచారం లేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తెలిపారు. వివరాలు తెలుసుకున్న పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ ఉన్నతాధికారి పర్యటన గోప్యంగా ఉంచడంపై నిర్వాసితుల్లో అసంతృప్తి -
దిక్కులేని జీవీఎంసీ
● కమిషనర్ లేని పాలన.. విశాఖకు తీరని వేదన ● ఫైళ్లు పేరుకుపోతున్నాయి.. పనులు సాగడం లేదు ● కూటమి నిర్లక్ష్యంపై నగర ప్రజల ఆగ్రహం డాబాగార్డెన్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఐదు నెలలుగా రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో నగర పాలన పూర్తిగా గాడితప్పింది. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు నెలల తరబడి కీలక అధికారిని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. అధికారులలో జవాబుదారీతనం కొరవడింది. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్తంభించిన పాలన శాశ్వత కమిషనర్ లేకపోవడంతో జీవీఎంసీలో పర్యవేక్షణ కొరవడింది. పాలన స్తంభించిపోయింది. సుమారు 20 లక్షల జనాభా, 98 వార్డులున్న జీవీఎంసీ బాధ్యతలను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు కలెక్టరేట్ వ్యవహారాలు.. మరోవైపు జీవీఎంసీ బాధ్యతలతో ఆయన సతమతమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొరవడి, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కింది స్థాయి అధికారులు సైతం తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తుండడంతో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. పనులు ముందుకు సాగడం లేదు. నూతన మేయర్ సైతం సమీక్షలకే పరిమితమయ్యారని, అధికారులను జవాబుదారీ చేసే స్థాయిలో చర్యలు కొరవడ్డాయని విపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అటకెక్కిన అభివృద్ధి, పారిశుధ్యం కమిషనర్ లేని లోటు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కమిషనర్ హయాంలో మురికివాడల అభివృద్ధి, రూ.500 కోట్లతో తాగునీటి పైపులైన్ల మంజూరు, గుర్తించిన 1,150 ఖాళీ స్థలాల్లో పార్కుల అభివృద్ధి వంటి కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో చేపట్టాల్సిన పనులన్నీ ప్రస్తుతం నిలిచిపోయాయి. ఉన్నతాధికారి పర్యవేక్షణ కొరవడటంతో పారిశుధ్య నిర్వహణ దయనీయంగా మారింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. మురికివాడలు, కొండవాలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దక్షిణ నియోజకవర్గంలో ప్రసాద్గార్డెన్స్, వెలంపేట, పండావీధి, అల్లిపురం, కొబ్బరితోట, పద్మానగర్, చిలకపేట, జాలారిపేట, రంగిరీజువీధి, చెంగల్రావుపేట, జబ్బరతోట, పెయిందొరపేట, కోటవీధి, ఫెర్రీరోడ్డు, తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవ, డెయిరీఫాం ఏరియా, రామ్నగర్తో పాటు పలు మురికివాడ ప్రాంతాలు, ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు కొండవాలు ప్రాంతాలు, మురికివాడ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. జీవీఎంసీని గాడిలో పెట్టేదెవరు? జీవీఎంసీకి శాశ్వత కమిషనర్ లేకపోవడం నగర పాలనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అభివృద్ధి కుంటుపడింది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఫైళ్లు కదలడం లేదు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్కు కమిషనర్ను నియమించకుండా కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకమేంటో? నగర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కమిషనర్ను నియమించడం అత్యవసరం. – బానాల శ్రీనివాసరావు, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ప్లాస్టిక్ నియంత్రణ ఎక్కడ? నగరంలో యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతోంది. గత మేయర్, కమిషనర్ హయాంలో చేపట్టిన ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడానికి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, డోర్–టు–డోర్ ప్రచారాలు, నియంత్రణ కమిటీలు అన్నీ అటకెక్కాయి. దీంతో నగరంలో మళ్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దర్శనమిస్తోంది. ప్రజాగ్రహం, ప్రతిపక్షాల ఆందోళన జీవీఎంసీకి కమిషనర్ను నియమించడంలో ప్రభుత్వ వైఫల్యంపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్నే నియమించలేని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఐదు నెలలుగా కమిషనర్ లేకపోవడం జీవీఎంసీ చరిత్రలోనే ఇది మొదటిసారని, ఇది కూటమి ప్రభుత్వ ఘనకార్యమని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. తక్షణమే సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించి, నగర పాలనను గాడిలో పెట్టాలని సీపీఎం, సీపీఐ ఫ్లోర్ లీడర్లు గతంలోనే నిరసన వ్యక్తం చేశారు. సమర్థంగా పనిచేస్తున్న కమిషనర్ను అర్ధాంతరంగా బదిలీ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం విశాఖను దిక్కులేని నగరంగా మార్చివేశారని, ప్రజల సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని మండిపడ్డారు. -
బౌద్ధమతం శాంతిని బోధిస్తుంది
బౌద్ధ సన్యాసి గల్కండెగమ ఉదిత థెరో విశాఖ విద్య: శ్రీలంకలోని థెరవాడ సంప్రదాయానికి చెందిన బౌద్ధ సన్యాసి గల్కండెగమ ఉదిత థెరో ఏయూలోని విద్యా విభాగంలో ‘బౌద్ధమతం–శాంతి విద్య’పై గురువారం ప్రసంగించారు. ఆధునిక కాలపు సంఘర్షణలను పరిష్కరించడం, అంతర్గత సామరస్యాన్ని పెంపొందించడంలో నాలుగు గొప్ప సత్యాలు, అష్టాంగ మార్గం ఔచిత్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు బౌద్ధ బోధనల ద్వారా శాంతి యొక్క ఆధ్యాత్మిక, తాత్విక కోణాలతో నిమగ్నమయ్యే అరుదైన అవకాశాన్ని అందించింది. విభాగాధిపతి ప్రొఫెసర్ టి.షారోన్ రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణ, యువత అభివృద్ధిలో శాంతి విద్య యొక్క పరివర్తనాత్మక పాత్రను వివరించారు. -
జిల్లాలో 82 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
● డీఎఫ్వో లక్ష్మణ్ నక్కపల్లి: జిల్లాలో జూన్, జూలై నెలల్లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 82 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖాధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల్లో అటవీ భూముల శాతాన్ని పెంచాలన్నదే లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 నర్సరీలు ఏర్పాటు చేసి పంపిణీకి మొక్కలు సిద్ధంగా ఉంచామన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పేపర్ మిల్స్, ఉద్యానవన శాఖ, డ్వామా, అటవీ శాఖల సమన్వయంతో మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సరుగుడికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు. 70 లక్షల సరుగుడు, మిగిలిన 12 లక్షలు పలు రకాల జాతులుంటాయన్నారు. పొలాల్లో సరుగుడు పెంపకానికి ఉచితంగా మొక్కలు సరఫరా చేస్తామన్నారు. నర్సీపట్నం, అనకాపల్లి యలమంచిలి, చోడవరం రేంజ్ కార్యాలయాల పరిధిలో మొక్కల పెంపకంపై పర్యవేక్షణ చేస్తామన్నారు. -
పెరటిలోనే ఔషధ మొక్కలు
అనకాపల్లి: రాణపాల, తులసి, అలివెరా, నేల ఉసిరి వంటి ఔషధ మొక్కలను ప్రతి ఇంటి పెరడులో పెంచుకోవచ్చని ఆయుష్మాన్ భారత్ వైద్యురాలు డాక్ట ర్ కె.లావణ్య చెప్పారు. వి.వి.రమణ రైతు భారతి హాల్లో గురువారం జిల్లా గ్రామీణ వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆ మె మాట్లాడారు. ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని చెప్పారు. పరి శుభ్రమైన గాలిని పీల్చాలంటే మొక్కల ద్వారానే సా ధ్యమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇళ్ల వద్ద మొక్కలను పెంచడం లేదని, వాతావరణంలో అనేక మార్పులు సంభవించి, వివిధ వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొత్తగా గృహాలు నిర్మించే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ప్రాంతీయ పర్యావరణ పరిరక్షణ కన్వీనర్ డాక్టర్ ఎస్.నూకరాజు మాట్లాడా రు. సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కాండ్రేగుల అప్పారావు, సభ్యులు కాండ్రేగుల విశ్వేశ్వరరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. చక్కని ఆరోగ్యానికి ఎంతో మేలు: డాక్టర్ లావణ్య -
తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య
అనకాపల్లి టౌన్: తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణ పరిధిలో జరిగింది. పట్టణ ఎస్ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయరామరాజుపేట శ్రీరామ్నగర్ కాలనీలో నివాసముంటున్న గుండే అభిషేక్ కుమార్ (17)బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఫ్రెండ్స్తో వెళతానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి రావడంతో అతని తల్లి ఎస్.కె షకీనా ఎందుకు ఆలస్యంగా వచ్చావని మందలించింది. దీంతో మనస్థాపం చెంది గదిలో గడియపెట్టుకొని ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని చనిపోయాడు. కొద్దిసేపటి తరువాత గమనించిన తల్లి చుట్టుపక్కల వాళ్లని పిలిచి తలుపులు బద్దలు కొట్టి అభిషేక్ను కిందికి దించి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అభిషేక్ ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాశాడు. ఘటనపై మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
20 ఏళ్లకు పైబడి ఒకేచోట..
నాతవరం: వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది సిబ్బంది ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2001–02 సంవత్సరంలో ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలను నియమించారు. ఆనాటి నుంచి 2024 వరకు వీరు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరిని రెగ్యులర్ చేశారు. వీరు రెగ్యులరైజ్ అయి ఏడాది అవుతున్నా ప్రభుత్వం ప్రస్తుతం తలపెట్టిన సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించడంలేదు. కాంట్రాక్టు ఉద్యోగులు కావడంతో గతంలో బదిలీలకు చాన్స్ దక్కలేదు. ఇప్పుడు రెగ్యులర్ అయి ఏడాది మాత్రమే అయిందంటూ అన్యాయం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పీహెచ్సీలలో ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు 65మంది వరకు 20 ఏళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారు. వీరు బదిలీల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నాతవరం పీహెచ్సీలో ఫార్మసిస్టు వెంకటరావు 23 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇదే మండలం గునుపూడి పీహెచ్సీ పరిధిలో ఏఎన్ఎం 22 ఏళ్లుగా, పాయకరావుపేట మండలం గొడిచెర్ల పీహెచ్సీలో ఫార్మసిస్టు 24 ఏళ్లుగా, రాంబిల్లి మండలంలోని పీహెచ్సీలలో లేబ్ టెక్నీషియన్లు 22 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. ఇన్నాళ్లూ రెగ్యులర్ కాలేదని బదిలీకి చాన్స్ ఇవ్వలేదని, కనీసం ఇప్పుడైనా ప్రత్యేకంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఉద్యోగంలో చేరిన స్ధానంలోనే పదవీ విరమణ చేయాల్సి వస్తుందన్నారు. ఫార్మసిస్టులు, లేబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంల కష్టాలు కాంట్రాక్టు ఉద్యోగులుగా ఇన్నాళ్లూ బదిలీకి అవకాశం లేదు ఏడాది క్రితం రెగ్యులరైజ్ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈసారైనా బదిలీకి చాన్స్ ఇవ్వాలని కోరుతున్న వైద్య సిబ్బంది క్రమబద్ధీకరించి సంవత్సరమే అయిందని నిరాకరిస్తున్న ప్రస్తుత సర్కారు -
యోగాతో ఆరోగ్యం, దీర్ఘ కాలిక వ్యాధుల నివారణ
అనకాపల్లి: నిత్య జీవితంలో యోగా చేయడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చని, వివిధ రకాలైన వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చని, సంపూర్ణంగా, ప్రశాంతంగా జీవిస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.బాలాజీ అన్నారు. యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా స్థానిక గవరపాలెం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా ఆయుష్ మాన్ భారత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం యోగాసనాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవం విశాఖలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలగాలంటే ప్రతి ఒక్కరూ ఉదయం లేదా సాయంత్రం సమయంలో రోజుకు రెండు గంటలు యోగా చేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు మాట్లాడుతూ కరోనా వంటి విపత్తుల తరువాత మానవ జీవితంలో యోగా ప్రాముఖ్యత కలిగిందని, ప్రాచీన కాలం నుంచి యోగాకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నప్పటికీ కరోనా తరువాత దీనిపై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు. చిన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకూ వయస్సును బట్టి యోగాసనాలు వారివారి స్వగృహాల్లోనే చేసుకోవచ్చని పేర్కొన్నారు. అంతకుముందు యోగా గురువుల బి.అప్పారావు, దొర్రం నాయుడు, మంగియ్య పర్యవేక్షణలో యోగాసనలు చేశారు. వైద్య సిబ్బంది ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ఎం. శ్రీనివాసరావు, జిల్లా ఆయుష్శాఖ అధికారి డాక్టర్ కె.లావణ్య, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి శ్రావ్య శ్రీ, జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ -
పాయిజన్ కంటే పాలిథిన్ ప్రమాదం
నక్కపల్లి: పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నక్కపల్లి మండలం పెదబోదిగల్లంలో ఏపీఐఐసీ నిర్వాసితుల కోసం ఎంపిక చేసిన పునరావాస కాలనీలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలిథిన్ అనేది పాయిజన్ కంటే ప్రమాదమన్నారు. అందుకే దీని వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయన్నారు. మార్కెట్లకు వెళ్లినపుడు చేతి సంచి లేదా నూలుతో తయారు చేసిన సంచిలను తీసుకెళ్లాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం విరివిగా మొక్కలు పెంచాలన్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజ్, డీఎఫ్వో లక్ష్మణ్, ఆర్డీవో వి.వి.రమణ, ఎస్డీఎఫ్వో సునీల్కుమార్, రేంజ్ ఆఫీసర్ అనిల్కుమార్, ఎఫ్డీవో పైడిరాజు, తహసీల్దార్ నర్సింహమూర్తి, ఎంపీడీవో సీతారామరాజు, సర్పంచ్ మున్నీసా పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరగాలి ఎస్.రాయవరం: ఆయిల్పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని, రైతులు వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఆయిల్పామ్ డ్రైవ్లో భాగంగా వమ్మవరం గ్రామంలో గురువారం కలెక్టర్ పామాయిల్ మొక్కలు నాటారు. పెనుగొల్లు గ్రామంలో వరహానది గట్టుపై కొబ్బరి మొక్కలు, అందులో అంతరపంటగా సాగు చేసేందుకు కోకో మొక్కలు నాటారు. గ్రామంలో ఓ సీనియర్ రైతును సత్కరించి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేసిన సేంద్రియ ఎరువు కిట్లను రైతులకు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రభాకర్, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ అధికారి పట్టాభిరామిరెడ్డి, జిల్లా అధికారి టి.చంద్రశేఖర్, మండల వ్యవసాయాధికారి సౌజన్య, తహసీల్దార్ జె.రమేష్బాబు, ఎంపీడీవో సత్యనారాయణ, పెనుగొల్లు సర్పంచ్ ఉద్దండం నాగశ్రీదేవి, వైఎస్సార్ సీపి నాయకలు ఉద్దండం సూర్యనారాయణ పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి కలెక్టర్ విజయ కృష్ణన్ -
జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ
కలెక్టర్ హరేందిర ప్రసాద్ విశాఖ సిటీ: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. భక్తులు జాతీయ రహదారిని దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎన్హెచ్ఏఐ అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలని చెప్పారు. తొలి పావంచా వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, మరుగుదొడ్లు, రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, ముందుగానే పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్సులు, వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఉదయం నుంచి దర్శనాలు ప్రధాన అర్చకుడు వైదిక కార్యక్రమాల షెడ్యూల్ను వివరించారు. జూలై 9వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు మొదలవుతాయని, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. తొలి పావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టడం ద్వారా 32 కి.మీ మేర గిరి ప్రదక్షిణ మొదలవుతుందని పేర్కొన్నారు. 10వ తేదీ సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగుతాయని, ఆ రోజే స్వామికి నాలుగో విడత చందనోత్సవం జరుగుతుందని తెలిపారు. -
ఏవోబీలోనూ సుధాకర్ కీలకపాత్ర
● మావోయిస్టు ఉద్యమ బలోపేతంలో తనదైన ముద్ర ● ఏజెన్సీలో ఘటనలకు ఆయనే వ్యూహంరూపొందించే వారని ప్రచారంసాక్షి,పాడేరు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ లక్ష్మీనరసింహచలం ఏవోబీలో ఉద్యమ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్ అడవుల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందారు. ఈ ప్రాంత ఉద్యమంతో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. నల్లమల అడవుల నుంచి ఏవోబీలోకి ప్రవేశించిన ఆయన ఏవోబీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చేపట్టిన శాంతి చర్చల్లోను ఆయన పాల్గొన్నారు. ఒడిశాలోని సుంకి–సాలూరు ఏరియా కమిటీలో సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపారు. 2006లో అప్పటి విజయనగరం జిల్లా మక్కువ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రసమంతవలస అడవుల్లో సుధాకర్ పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అడవిలో సురక్షిత ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో అప్పటి పోలీసు పార్టీలు ఆయనను సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటినుంచి ఆయన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారారు. ఏవోబీ పరిధి రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగే మావోయిస్టు ఉద్యమ కార్యక్రమాలకు ఈయనే వ్యూహం రూపొందించేవారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనను కోల్పోవడం దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగానే చెప్పవచ్చు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చోడవరం: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి పి.రాజారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం చోడవరం కోర్టుల ఆవరణలో మొక్కలు నాటారు. అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి పి.రాజారావు , ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వర్ణ మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ అప్పలరాజు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు చీపురుపల్లి సూర్యనారాయణ, ఎస్.భవానీశంరరావు, వి.వెంకట్రావు, పైడిరాజు, వారాది రాజు, చందు, పీవీ రమణమూర్తి పాల్గొన్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో మొక్కలు నాటారు. ఎండీ సన్యాసినాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఆవరణతోపాటు చెరకు కాటాల వద్ద, పలు పాఠశాలల్లోనూ, గోవాడ, అంబేరుపురం గ్రామాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ సీసీ ప్రసాద్, సీఏఓ ఎస్ఎల్ సత్యనారాయణ, సీఈ పి.ప్రసాదరావు, సీడీఓ రామం, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, పీఏ రవి, యూనియన్ నాయకులు భాస్కరరావు, రామునాయుడు పాల్గొన్నారు. చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ కె. మన్మథరావు, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి పాల్గొని మొక్కలు నాటారు. పాస్టిక్ వస్తువులు పూర్తిగా వాడకం మానేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణాన్ని పరిరక్షించాలని జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు, ఎమ్మెల్యే రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మాడుగుల సబ్ రిజిస్ట్రార్ పురుషోత్తమ్, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఈఓపీఆర్డి మహేష్, పంచాయతీ ఈఓ నారాయణరావు, పాల్గొన్నారు. మానవ మనుగడకు చెట్లు కీలకం అనకాపల్లి టౌన్ : మానవ మనుగడలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. గవరపాలెం జీవీఎంసీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులు, ఉపాధాయులు పుట్టిన రోజుల సందర్భంగా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి పదో అదనపు జిల్లా జడ్జి నరేష్ పాల్గొని మొక్కలను నాటారు. పలుచోట్ల మొక్కలు నాటిన అధికారులు -
యోగాంధ్ర కు నాడే బీజం
ఈనెల 21న విశాఖ సాగర తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగా దినోత్సవం భారీ ఎత్తున జరగనుంది. ఆ నేపథ్యంలో జిల్లా అంతటా నెల రోజులపాటు ‘యోగాంధ్ర’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు, పార్కులు, సాగర తీరాలు, పాఠశాలలు, చివరకు ఉపాధి కూలీలు పనిచేసే ప్రాంతాలు.. ఇలా అన్ని చోట్ల యోగాసనాలు వేయిస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ఉద్యోగులతో అభ్యాసం చేయించి, ప్రధాని సమక్షంలో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనేది లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో యోగ శిక్షకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నియమించింది. ‘ఆయుష్’ ద్వారా సంప్రదాయ వైద్యాన్ని విస్తృత పరచి, అందరినీ యోగా వైపు నడిపించాలన్న ప్రయత్నం ఆనాడే ప్రారంభమైంది. నక్కపల్లి: కోవిడ్ కాటు వేయడంతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్న రోజులవి.. అల్లోపతి వైద్య విధానంలో సరైన చికిత్స లేక అందరి చూపు ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్యం వైపు మళ్లింది. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో ఆయుష్ వైద్యశాలలను బలోపేతం చేసి, వాటికి అనుబంధంగా యోగ విద్యను ప్రచారంలోకి తేవడానికి యోగ శిక్షకులను నియమించారు. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, వేంపాడు ఆయుర్వేద ఆస్పత్రుల పరిధిలో నాటి నుంచి వీరు విశేష సేవలు అందిస్తున్నారు. ఈ శిక్షకుల ద్వారా ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు గంటపాటు యోగాసనాలు నేర్పించే కార్యక్రమం చేపట్టారు. తదుపరి గ్రామాల్లో ఆసక్తి చూపిన పెద్దలు, పిల్లలు, మహిళలు, యువతీయువకులకు కూడా యోగాపై అవగాహన కల్పించడంతోపాటు, యోగాసనాలు నేర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఈ ఆయుర్వేద ఆసుపత్రులకు అనుబంధంగా పనిచేసే యోగా శిక్షకులకు గంటకు రూ.250ల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పురుషులయితే నెలకు 32 గంటలు, మహిళలయితే నెలకు 20 గంటలపాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. 2021 నుంచి 2024 వరకు నాలుగేళ్లపాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ప్రతి గ్రామంలోను విద్యార్థులతో కలిపి 150 నుంచి 200 మందికి పైగా యోగా నేర్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత యోగా శిక్షకులకు వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. యోగాంధ్రలో కీలక పాత్ర యోగాంధ్ర కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ యోగా సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. మే 21 నుంచి ప్రపంచ యోగా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. జూన్ 21న విశాఖలో ఐదు లక్షల మందితో 45 నిమిషాల సమయంతో కూడిన ప్రొటోకాల్ యోగాను నిర్ణయించారు. సులభశైలిలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం గ్రామాల్లో యోగా శిక్షకుల ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. వీరంతా యోగా కొనసాగింపులో భాగంగా వారి పరిధిలో ఉన్న గ్రామాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం రోజున విశాఖ బీచ్రోడ్డులో యోగాసనాలు వేయాల్సి ఉంటుంది. యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నత స్థాయి అధికారులంతా భాగస్వాములవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో మే 27 నుంచి జూన్ 15 వరకు యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు, శిక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో నాలుగు టూరిజం ప్రాంతాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మే 27న పరవాడ ముత్యాలమ్మపాలెం, జూన్ 2న కేడీపేటలో అల్లూరి సీతారామరాజు పార్క్, 9న రాంబిల్లి తీరప్రాంతం, 15న రేవుపోలవరం సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇంతటి బాధ్యతలను మోస్తున్న యోగా శిక్షకులు.. తమ వేతనాలు పెంచాలని, సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు. నాలుగేళ్ల క్రితమే యోగ శిక్షకులను నియమించిన వైఎస్ జగన్ సర్కారు ఆయుష్ వైద్యశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న శిక్షకులు నేటి యోగాంధ్ర కార్యక్రమాల్లో విస్తృత సేవలు -
కొత్తకోటలో నిలిచిన సచివాలయ సేవలు
రావికమతం : కొత్తకోటలోని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల్లేక ప్రభుత్వ పరమైన సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 15 వేలు పై బడి జనాభా ఉన్న కొత్తకోటలో మూడు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయం–1 లో డిజిటల్ అసిస్టెంట్ , వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులు లేరు. వేసవి సెలవులు అనంతరం ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో చేరే విద్యార్థులకు కుల,ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అవసరం. అలాగే రేషన్కార్దుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులు లేకపోవడంతో ఆ సచివాలయం పరిధిలో పని జరగట్లేదు. రెండో, మూడు సచివాలయాల్లోనూ సిబ్బంది అరకొరగానే ఉన్నారు. ఒకటో సచివాలయం పరిధిలోని విద్యార్థులు, స్థానికులు స్ధానికులు వివిధ ధ్రువపత్రాలు, రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి రెండు, మూడు సచివాలయాలకు వెళ్లినా అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రకాష్రావు, వెంకటేశ్వర్లు, రమణబాబు తదితరులు చెబుతున్నారు.ఒకటో సచివాలయం పరిధిలోని వారంతా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో సచివాలయంలో సేవలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకన్నబాబు తెలిపారు. -
జీడితోటలో 80 కేజీల గంజాయి స్వాధీనం
అనకాపల్లి : రోలుగుంట మండలం కొవ్వూరు నుంచి కంతలం గ్రామాల మధ్యలో జీడితోటలో 80 కేజీల గంజాయి నిల్వ చేసినట్టు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు రోలుగుంట ఎస్ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి అన్నారు. కొత్తూరు పంచాయతీ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రావణి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీడితోటల్లో తనిఖీలు నిర్వహించగా 60 కేజీల గంజాయి నిల్వ చేసినట్టు గుర్తించారని, మరో 20 కేజీల గంజాయిని తీసుకుని అక్కడ దాచేందుకు వచ్చిన నర్సీపట్నం పట్టణానికి చెందిన కుంచా యేసుక్రాంతి, రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఎర్ర పవన్ కుమార్లు పోలీసులను చూసి వెనుదిరిగి వెళుతూ పట్టుబడ్డారని తెలిపారు. వారిని విచారించగా అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం శిరిపురం గ్రామానికి చెందిన బూరిటీ శ్రీను నుంచి గంజాయిని కొనుగోలు చేసి కొవ్వూరు–కంతలం గ్రామాల మధ్య జీడితోటలో భద్రపరిచినట్టు తెలిపారన్నారు. నిందితుల వద్ద మూడు సెల్ఫోన్లు, బజాజ్ పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందిని నగదు ప్రోత్సాహంతో అభినందించారు. ముగ్గురు అరెస్టు, రిమాండ్ -
వేట సాగదు...పూట గడవదు..
గొలుగొండ : వందలాది మంది జాలర్లకు అన్నం పెట్టే తాండవ జలాశయం ఈ వేసవిలో జాలర్లకు నిరాశే మిగిల్చింది. ప్రతి ఏటా వేసవి వచ్చిందంటే జాలర్లకు కాసుల పంట పండేది. కానీ ఏ ఏడాది దాదాపుగా 15 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా వేసవిలో రొయ్యల వేట చాలా మందకొడిగా సాగుతోందని జాలర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏటా వేసవిలో రొయ్యల వేట జలాశయంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తే ఈ ఏడాది మే నెలలో భారీ వర్షాలు కురిసి రొయ్యల వేటకు ఇబ్బందులు కలిగించాయి. 500 మందికి జీవనోపాధి... తాండవ జలాశయంలో 500 మంది వరకు జాలర్లు ప్రతి ఏటా రొయ్యల వేట సాగింస్తుంటారు. మత్య్సకారుల సంఘం ఆధీనంలో ఈ రొయ్యల వేట నిర్వహించి జీవనోపాధి పొందుతారు. ప్రతి ఏటా ఏప్రిల్లో సంఘం ఆధ్వర్యంలో రొయ్యల వేట నిర్వహించి జూన్ రెండవ వారంలో వేటను నిలుపుదల చేస్తారు. సుమారుగా 50 రోజుల పాటు రొయ్యల వేట నిర్వహించే సమయంలో ప్రతి జాలరికి ప్రతిరోజు రూ.1500 వరకు ఆదాయం వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అలాగే రాత్రి సమయంలోనూ వేట నిర్వహించి జీవనోపాధి పొందుతారు. అయితే ఈ ఏడాది ఈ పరిస్థితి లేకుండా పోయింది. ఎండల సమయంలో వర్షాలు తాండవ జలాశయం సుమారుగా 4వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. తాండవ జలాశయం చుట్టూ వెంకటాపురం, పొగచెట్లపాలెం, గొలుగొండ, జోగుంపేట, సాలికమల్లవరం, అమ్మపేట, గాదంపాలెం, జలార్లుపేట, జాలర్లుపేట, కొత్తమల్లంపేట తదితర గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో లైసెన్సులు ఉన్న వారు సుమారుగా 200 మంది జాలర్లు కాగా మరో 300 వందల మంది వరకు అనుభవం ఉన్న జాలర్లు రొయ్యల వేట నిర్వహిస్తారు. ప్రతి ఏటా మత్స్యకారల సంఘం ప్రతినిధులు, మత్య్సశాఖ ఆద్వర్యంలో ఏఫ్రిల్ నెలలో రొయ్యల వేట సాగించి జూన్ రెండవ వారంలో నిలుపుదల చేస్తారు. వేడి తీవ్రత ఆధికంగా ఉండడం వల్ల రొయ్యలు జలాశయం నుంచి బయటకు వచ్చే సమయంలో వేట సులువుగా జరుగుతుంది. కానీ ఏ ఏడాది మే నెల అంతా భారీ వర్షాలు, తుఫాన్ల ప్రభావం వల్ల రొయ్య జలార్లకు చిక్కలేదు. రొయ్యల కోసం బిందులు, వల లు వేసుకొని జలాశయంలోకి వెళ్లి ప్రయ త్నాలు చేసినా అనుకున్నంత ఫలితం దక్కలేదు. మరో 10 రోజుల్లో రొయ్యల వేట నిలుపుదల చేయడం జరుగుతుందని, కానీ ఇప్పటి వరకూ సరిగా వేట సాగ లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది నిరాశే... గడిచిన 15 సంవత్సరాల చరిత్రలో ఈ ఏడాది మే నెలలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో రొయ్యల వేట జరగడం చాలా కష్టతరంగా మారింది. మే నెలలో రొయ్యల వేటకు వెళ్లిన సందర్భంగా గాలులు, వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాం. చేపల వేట కన్నా రొయ్యల వేట 50 రోజుల్లో మంచి ఆదాయం అందిస్తుంది. కానీ ఈ ఏడాది నిరాశే మిగిలింది. మరో 10 రోజుల్లో రొయ్యల వేట నిలిచిపోతుంది. – రాజు, మత్స్యకారుడు, వెంకటాపురం తాండవ జలాశయంలో రొయ్యల వేటకు ఇబ్బందులు అధిక వర్షాలే కారణం -
బెదిరించి..రూ.25వేలు యూపీఐకి బదిలీ
యలమంచిలి రూరల్ : విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువకుడిని బెదిరించి అతని మొబైల్ ఫోన్ యూపీఐ ద్వారా రూ.25 వేల నగదు బదిలీ చేయించుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై యలమంచిలి మండలం కొత్తలి గ్రామానికి చెందిన బాధితుడు ఇత్తంశెట్టి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పలు సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టగా 92 రోజుల తర్వాత ఇద్దరు నిందితులు యలమంచిలి మండలం పులపర్తి గ్రామానికి చెందిన తప్పెట్ల భగవాన్(25), ఎస్ రాయవరం మండలం వేమగిరికి చెందిన కొప్పన రవి(29)లను పట్టుకోగలిగామని ఆయన శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. వివరాలివి. ఈ ఏడాది మార్చి 12న అచ్యుతాపురం టీజే పరిశ్రమలో మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న బాధితుడు విధులు ముగించుకుని తన స్వగ్రామం యలమంచిలి మండలం కొత్తలికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పురుషోత్తపురం గ్రామానికి సమీపంలో హైవేపై ఇద్దరు గుర్తు తెలియని యువకులు తనిఖీ సిబ్బందిలా వ్యవహరించి ద్విచక్రవాహనాన్ని ఆపి బాధితుడి వద్ద డబ్బు ఉంటే ఇచ్చేయమని బెదిరించారు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో అతని మొబైల్ ఫోన్ లాక్కుని, యూపీఐ పిన్ చెప్పాలని అడగ్గా బాధితుడు చెప్పడానికి నిరాకరించాడు.అతడిపై చేయి చేసుకోవడం, చంపుతానని బెదిరించడంతో భయపడిన బాధితుడు ప్రసాద్ తన ఫోన్ పే యూపీఐ పిన్ నెంబరు నిందితులకు చెప్పాడు. దీనినుపయోగించి బాధితుడి బ్యాంకు అకౌంట్ నుంచి నిందితుల్లో ఒకరు తన మొబైల్లో ఉన్న బెట్టింగ్ యాప్ అకౌంటుకు రూ.15 వేలు, మరొకరు రెండు విడతల్లో మరో రూ.10 వేలు నగదు బదిలీ చేసుకున్నారు. నేరుగా బ్యాంకు అకౌంట్లకు కాకుండా బెట్టింగ్ యాప్కు నగదు బదిలీ చేసుకోవడంతో నిందితులను గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని సీఐ చెప్పారు. దారి దోపిడీకి పాల్పడడానికి ముందు రోజు రాత్రి నిందితులిద్దరూ మూడు చోట్ల మద్యం సేవించారని మార్చి 12వ తేదీ తెల్లవారుజామున మరొకసారి మద్యం సేవించడానికి డబ్బు లేకపోవడంతో నేరానికి పాల్పడినట్టు దర్యాప్తులో తెలిందన్నారు. నిందితులిద్దరూ అవివాహితులేనని మద్యం, బెట్టింగ్లకు అలవాటుపడి దారి దోపిడీకి తెగించారన్నారు. ఇలాంటి నేరాలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. కఠిన శిక్షలు ఉంటాయన్నారు. నిందితులిద్దర్నీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి, రిమాండ్కు తరలించినట్టు సీఐ చెప్పారు. సమావేశంలో యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర, ఆచారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దారి దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్ -
బీకాం టాపర్కు సీపీఎం నేతల సన్మానం
గొలుగొండ: ఆదీవాసీ గిరిజన యువకుడు దుర్గాప్రసాద్ బీకాంలో యూనివర్శిటీ ప్రథమ స్థానం సాధించడంతో సీపీఎం నేతలు బుధవారం గ్రామంలో సత్కరించారు. పాతమల్లంపేట పంచాయతీ శివారు గిరిజన గ్రామం అయిన ఎన్. గదబపాలెం గ్రామానికి చెందిన చీమల దుర్గాప్రసాద్ నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలలో బీకాం చదివాడు. ఇటీవల ఫలితాల్లో ఆంధ్రయూనివర్సిటీ బీకాంలో ప్రథమ స్థానం సాధించడంతో అతనికి సీపీఎం నేతలు అభినందనలు తెలిపారు. దుర్గాప్రసాద్ గిరిజన యువకులకు ఆదర్శంగా నిలుస్తాడన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు నారాయణమూర్తి, అడిగర్ల రాజు, గొర్రి శివ, చీమల రాము, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
రోలుగుంట : మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజానికి మేలు జరుగుతుందని అటవీశాఖ చోడవరం రేంజర్ జగదీష్ అన్నారు. రావికమతం మండలం మరుపాక నర్సరీ నుంచి పలు జాతుల మామిడి, నేరేడు, వేప,రావి తదితర 150 మొక్కలను బుధవారం ఆయన స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల సిబ్బందికి అందజేశారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి మొక్కలు పెంపకం చేపడుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ మొక్కలు నాటాలి, పొలాల్లో, చెరువు గట్లపై రైతులు ఏఏ మొక్కలు నాటాలో తెలియజేశారు. పచ్చదనం, వన వృక్షాల అభివృద్ధితోనే ఆశించిన వర్షాలు పడతాయని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవింద, నాయకులు బంటు రాజు, ఈ కాంప్లెక్సు సీఆర్పీ సతీ్ష్, వివిధ గ్రామాల జెడ్పీ ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, రైతులు పాల్గొన్నారు. చోడవరం అటవీశాఖ రేంజర్ జగదీష్ -
బావిలో పడి వ్యక్తి మృతి
పెందుర్తి: తోటి కూలీలతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. పెందుర్తి మండలం ముదపాకలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా తెర్లాంకి చెందిన పక్కి ప్రసాద్(25) ముదపాకలోని జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి పనులు చేసిన తరువాత సమీపంలోని బావిలోకి తోటి ముగ్గురు నిర్మాణ కూలీలతో కలిసి ఈతకు వెళ్లాడు. మిగిలిన వారు వెళ్లిపోదాం అంటే ‘నేను కాసేపు ఉండి వస్తాను’ అని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రసాద్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తోటి కూలీలు బావి వద్దకు వెళ్లారు. అక్కడ దుస్తులు ఉండడంతో ప్రసాద్ నీటిలో మునిగిపోయి ఉండవచ్చని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
ఆరిలోవ: జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రయాణిస్తున్న ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మధురవాడ నుంచి నగరానికి వెళ్తున్న ఒక కారు జూ పార్కు సమీపంలోకి రాగానే పొగలు రావడం డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. కారు ఆపిన వెంటనే మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ ఘటనతో వెనుక వస్తున్న ఇతర వాహనదారులు భయపడి సుమారు అర కిలోమీటరు దూరంగా తమ వాహనాలను నిలిపివేశారు. కారులో ఉన్నవారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు, కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారు లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనపై ఆరిలోవ పోలీసులు ప్రమాదవశాత్తు కారు దగ్ధమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిజిటల్ భాగ్యం కలిగేనా?
ఆధునిక ప్రమాణాలతో.. అయితే డిజిటల్ చెల్లింపుల అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు, దుర్వినియోగం జరిగే అవకాశం వంటి అంశాలపై దేవస్థానం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి సహేతుకమైనవే అయినప్పటికీ.. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఆధునిక సాఫ్ట్వేర్ను వినియోగించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. భక్తుల సౌలభ్యాన్ని, దేవస్థానం ఆర్థిక ప్రయోజనాలను, లావాదేవీల్లో పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని.. సింహాచలం దేవస్థానంలో కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సింహాచలంలో దర్శనం టికెట్లు, వివిధ ఆర్జిత సేవల టికెట్లు, ప్రసాదాల కొనుగోలు, కేశఖండన వంటి అన్ని సేవలకు నగదు చెల్లింపు తప్పనిసరి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సింహగిరికి భక్తులు తరలివస్తుంటారు. అయితే సరిపడా నగదు వెంట తెచ్చుకోలేనివారి భక్తుల బాధలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు అధికంగా వినియోగించే యువత.. సరిపడా నగదు వెంట తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో స్మార్ట్ఫోన్, బ్యాంకు ఖాతాలో నగదు ఉన్నప్పటికీ.. ఆలయ కౌంటర్ల వద్ద ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపుల సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి క్యూలో నిరీక్షించి.. చివరకు నిరాశకు గురవుతున్నారు. కొండ దిగువన బస్సు టికెట్టు నుంచి కొండపైన ప్రతి అవసరానికీ నగదు కోసం ఇతరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వస్తే.. ఈ సమస్యలన్నీ తీరుతాయని భక్తులు అంటున్నారు. దేవస్థానానికి ఆదాయ మార్గం డిజిటల్ పేమెంట్లు అందుబాటులో లేకపోవడంతో దేవస్థానం కొంత ఆదాయం నష్టపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యాన్నదాన పథకానికి విరాళాలు అందించాలనుకునే భక్తులు అనేకమంది ఉంటారు. ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం నగదు, చెక్కు, డీడీ రూపంలో విరాళాలు స్వీకరిస్తున్నారు. స్వామికి విరాళం ఇవ్వాలని వారు ముందుగా నిర్ణయించుకుని సింహగిరికి వస్తారు. పై మూడు పద్ధతుల్లో ఏదొకదాన్ని అనుసరించి విరాళం అందజేస్తుంటారు. కాగా.. ఆలయానికి వచ్చిన తర్వాత, స్వామి వారి దర్శనానంతరం లేదా అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత తక్షణమే తమకు తోచినంత విరాళం ఇవ్వాలని చాలా మంది భక్తులు భావిస్తుంటారు. అయితే చేతిలో తగినంత నగదు లేకపోవడం, డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో వీరు విరాళం ఇవ్వలేక వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం అన్నప్రసాద విభాగం కౌంటర్ వద్ద రోజూ పదుల సంఖ్యలో భక్తులు డిజిటల్ చెల్లింపుల గురించి ఆరా తీస్తున్నారు. డిజిటల్ చెల్లింపులతో చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు విరాళాలు సులభంగా స్వీకరించే వీలుంటుంది, తద్వారా అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అంతేకాకుండా దర్శనం టికెట్లు, ఇతర సేవల ద్వారా కూడా దేవస్థానానికి పారదర్శకంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అప్పన్న సన్నిధిలో అన్నీ నగదు లావాదేవీలే.. డిజిటల్ పేమెంట్లు లేక భక్తుల అవస్థలు విరాళాల సమర్పణలోనగదు రహిత చెల్లింపులతో మేలు తద్వారా భక్తులకు సౌలభ్యం, దేవస్థానానికి ఆదాయం -
నేడు వెన్నుపోటు దినం
యలమంచిలి రూరల్: వెన్నుపోటు అంటే గుర్తుకువచ్చేది చంద్రబాబే అని, నాడు ఎన్టీఆర్కు.. నేడు సూపర్ సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. మంగళవారం యలమంచిలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, యలమంచిలి సమన్వయకర్త కన్నబాబురాజుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు నయవంచనకు నిరసనగా ఈ నెల 4వ తేదీ బుధవారం వెన్నుపోటు దినం పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అడ్దగోలుగా విమర్శలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కడపలో నిర్వహించిన మహానాడు ద్వారా మరోసారి ప్రజలను మోసం చేయడానికి చూశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి రికార్డు సృష్టించారన్నారు. 2024లో ప్రజలను మోసం చేయడం ఇష్టం లేకనే ఆయన ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల హామీలు తుంగలో.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ విమర్శించారు. మంగళవారం యలమంచిలి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, లేదంటే రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తానని బాబు చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ సాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాణి. సేనాపతి రాము, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వర్రావు, అర్రెపు గుప్తా, అచ్యుతాపురం మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు పాల్గొన్నారు. కూటమి వంచనను నిలదీద్దాం వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ -
బొగ్గు లారీ బీభత్సం
నలుగురికి గాయాలు పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో మంగళవారం ఉదయం ఓ బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ పోర్టు ట్రస్టు నుంచి అచ్చుతాపురం ఎస్ఈజెడ్కు వెళ్తున్న బొగ్గు లారీ ఉద యం 6.45 గంటల సమయంలో అతి వేగంగా వచ్చి ముందున్న కారును, ఆటో ను ఢీకొట్టింది. అనంతరం సిగ్న ల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. ప్ర మాదంలో కారు వెనుక భాగం దె బ్బతినగా, ఆటో ముందు భాగం నుజ్జయింది. ఆటోలో ఉన్న సీతారాములు, నాగలక్ష్మి, ఆదిలక్ష్మి, దేముడమ్మ గాయపడ్డారు. క్షతగాత్రులను అగనంపూడి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ఆదిలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ ప్రమాదంలో సిగ్నల్ విద్యుత్ స్తంభం, హైమాక్స్ లైట్, రెయిలింగ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉదయం సమయంలో రోడ్డుపై పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్ఐ కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొగ్గు లారీని క్రేన్ సహాయంతో బయటకు తీసి.. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
ముగిసిన బ్యాడ్మింటన్ టోర్నీ
ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఏరీనా వేదికగా జరుగుతున్న హండ్రెడ్ ఎస్3 ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 400 మంది క్రీడాకారులు అండర్ 11, 13, 15, 17 ఏళ్ల కేటగిరీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ చైతన్య, శ్రీనివాస్, కార్పొరేటర్ ఉషశ్రీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వి.వి.సోమరాజును సత్కరించారు. స్పోర్ట్స్ ఏరీనా నిర్వాహకుడు సహాని తదితరులు పాల్గొన్నారు. -
కాపులకు చంద్రబాబు వెన్నుపోటు
నక్కపల్లి: కాపుల ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయం మర్చిపోయి తిరిగి కాపులకే వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబునాయుడు సిద్ధపడుతున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ తునిలో జరిగిన రైలు దగ్ధం కేసును తిరిగి తెరిపించి కాపు ఉద్యమకారులను జైలుకి పంపించాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. తుని ఘటనకు సంబంధించిన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసిందని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారులపై టీడీపీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఎత్తివేసిందన్నారు. ఈ కేసులను తిరిగి విచారణ చేపట్టే విధంగా హైకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. కాపు జాతిని, కాపు నాయకులను పూర్తిగా అడ్డు తొలగించుకోవాలనే కుట్రతోనే చంద్రబాబు, లోకేష్లు ఈ చర్యలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. దీనిలో భాగంగా ఉద్యమ సమయంలో కేసులను తిరగదోడి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, వారి సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని గతంలో జరిగిన ఉద్యమాల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారన్నారు. వీరందరిపై కక్ష కట్టి వేధిస్తే భవిష్యత్లో తమకు ఎదురు తిరగరన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కేసులు రీ ఓపెన్ చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. జనసేన పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు ఏదో రోజు పవన్ కల్యాణ్పై కేసులు పెట్టించి జైలుకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. కాపులపై పెట్టిన కేసులు తిరగదోడాలని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై పవన్ కల్యాణ్ స్పందించాలన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని నమ్మి కాపులంతా గంపగుత్తుగా కూటమి పార్టీలకు ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. చంద్రబాబు లోకేష్లు చేస్తున్న కుట్రలపై జనసేన పార్టీతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలు గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ వీసం నానాజీ, ఉపసర్పంచ్ వీసం రాజు, పార్టీ నాయకులు ముద్దా శ్రీను, అల్లాడ కొండ, దేవవరపు వెంకటసత్యనారాయణ, పోతంశెట్టి బాబ్జీ, అల్లాడ కొండ తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా అణగదొక్కే కుట్ర తుని రైలు కేసు రీ ఓపెన్ చేసేందుకు కంకణం పవన్ కల్యాణ్ను కూడా ఏదో రోజు జైలుకి పంపిస్తాడు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం -
న్యాయ విద్యార్థుల అ‘పూర్వ’ కలయిక
కె.కోటపాడు: విశాఖపట్నంలో న్యాయ విద్యాపరిషత్ లా కళాశాలలో 1993లో చదువులు సాగించిన పూర్వ విద్యార్థులు చౌడువాడలో అపూర్వ కలయిక పేరుతో కలుసుకున్నారు. మూడు దశాబ్దాల తరువాత కలిసిన నాటి స్నేహితులంతా ఒక్కచోట చేరి గత స్మృతులను నెమరువేసుకున్నారు. అల్లరి చేష్టలను తలచుకొని రోజంతా సంతోషంగా గడిపారు. వారి కుటుంబాల యోగక్షేమాలను ఒకరికి ఒకరు తెలుపుకున్నారు. ఈ అపూర్వ కలయికకు చోడవరం న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ సారథ్యం వహించారు. వివిధ ప్రాంతాల్లో న్యాయవాద వృత్తి నిర్వహిస్తున్న వారు, న్యాయశాఖలో వివిధ హోదాల్లో స్థిరపడిన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. మూడు దశాబ్దాల తరువాత మళ్లీ చౌడువాడలో కలుసుకున్న పాత మిత్రులు -
జేఈఈ అడ్వాన్స్డ్లో దొండపూడి విద్యార్థి ప్రతిభ
రావికమతం : మండలంలోని దొండపూడి గ్రామానికి చెందిన అడ్డూరి లీలా గణేష్ జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరిలో 2839 ర్యాంక్ సాధించాడు. లీలా గణేష్ విశాఖపట్నం శ్రీ విశ్వ కాలేజ్లో ఇంటర్ చదివాడు. ఇంటర్ ఎంపీసీలో 985 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు అడ్డూరి శ్రీను, సరోజిని సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. లీలా గణేష్ పదో తరగతి వరకు దొండపూడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 578 మార్కులు సాధించి మండలంలో రెండో స్థానంలో నిలిచాడు. అప్పటి వైఎస్సార్ ప్రభుత్వంలో జగనన్న అణిముత్యాలు అవార్డును మాజీ ప్రభుత్వ విప్ ధర్మశ్రీ చేతుల మీదుగా అందుకున్నాడు. గణేష్ జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించడంతో ఆ విద్యార్థిని కాలేజి అధ్యాపకులు, గ్రామ పెద్దలు అభినందించారు. -
వంచన.. వేదన
అక్రమ కేసులు.. దాడులు పెట్టుబడి సాయం ఏదీ.. నాకు నాతవరం మండలం గునిపూడి గ్రామంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. గతేడాది నాలుగు ఎకరాల్లోనూ వరి పంట వేశాను. ‘అన్నదాత సుఖీభవ’ పేరిట ప్రభుత్వం అందిస్తామన్న పెట్టుబడి సాయం అందించకపోవడం, వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో నష్టం వచ్చింది. ధాన్యం కొనుగోలు దళారుల చేతుల్లో పెట్టడం వల్ల ధర పెంచలేదు. దీంతో బ్యాంక్ నుంచి తెచ్చిన వ్యవసాయ రుణం తీర్చలేకపోయాను. అసలుకు వడ్డీ కలిసి భారంగా మారింది. బ్యాంక్ నుంచి గతంలో తీసుకున్న రుణం చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వకపోతే నాకున్న నాలుగు ఎకరాల్లో సగం మాత్రమే వరి పంట వేస్తాను. – వి.సూరిబాబు, గునిపూడి, నాతవరం భర్త చనిపోయినాపింఛన్ రాలేదు.. ఎస్.రాయవరం మండలంలో హోం మంత్రి క్యాంపు కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరుప్రోలు గ్రామం మాది. నా భర్త చనిపోయి ఏడాదిన్నర అవుతున్నా పింఛన్ మంజూరు కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాది కాలంలో భర్తలు చనిపోయిన చాలా మందికి పింఛన్ మంజూరు చేశారు. నా భర్త ముందే చనిపోవడం నేను చేసుకున్న పాపమా? 50 సంవత్సరాల వయసులో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నా ను. గత ప్రభుత్వం అందించిన కాపు నేస్తం, డ్వాక్రా నగదు ఎంతో కొంత ఆసరాగా ఉండేది. ఎన్నికల ముందు ఇచ్చిన దరఖాస్తు పరిశీలించేలోగా ఎన్నికలు వచ్చాయి. అవి అయ్యాక ఏడాది కాలంగా నాయకుల చుట్టూ తిరిగినా పింఛన్ మంజూరు కాలేదు. – దమ్ము సత్యవతి, కొరుప్రోలు గ్రామం, ఎస్.రాయవరం మండలంక్రిమినల్ కేసులు బనాయించి తొలగించారు.. నేను ఎటువంటి అవకతవకలకు పాల్పడకపోయినా.. తప్పులు చేయకపోయినా.. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నన్ను అన్యాయంగా తొలగించారు. హోం మంత్రి వంగలపూడి అనిత అప్పటి డ్వామా పీడీపై ఒత్తిడి తెచ్చి మరీ నన్ను తీసేయించారు. డ్వామా పీడీ సందీప్తో మాకు ఫోన్ చేయించి రాజీనామా చేయాలని చెప్పించారు. నేను చేయనని చెప్పాను. నాపై క్రిమినల్ కేసులు పెట్టి మరీ తొలగించారు. 16 ఏళ్లు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాను. మా యాక్ట్ ప్రకా రం తప్పు చేస్తే థర్డ్ పార్టీ విచారణ గానీ, క్వాలిటీ కంట్రోల్ విచారణ గానీ చేసి తొలగించాలి. కానీ దానికి విరుద్ధంగా నన్ను విధుల నుంచి తీసేశారు. నాపై ఎందుకింత కక్ష? – మేకా సోమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, ఈదటం, పాయకరావుపేట నియోజకవర్గం సాక్షి, అనకాపల్లి: వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య.. నమ్మిన వారిని నట్టేట ముంచడంలో ఘనాపాటీలు.. సూపర్ సిక్స్ మోసం ఫిక్స్ అని జనం గగ్గోలు.. తల్లికి వందనం అంటూ పంగనామాలు పెట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రెండో ఏట అడుగుపెడుతున్నా ఇంకా ఆ హామీ విద్యార్థుల తల్లిదండ్రులను ఊరిస్తూనే ఉంది. అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, నెలకు రూ.1500ల ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. కూటమి ప్రభుత్వ నేతల అరాచకాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి అణిచివేతకు గురిచేయడం.. లేదంటే వారిపై దాడులు, అడ్డు తొలగించేందుకు హత్యాయత్నాలతో అరాచకం.. జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే కూటమి నేతలు దాడులు, హత్యలు, దౌర్జన్యాలతో బరి తెగించారు. లేటరైట్, ఇసుక, మద్యం, అక్రమ మైనింగ్, గ్రావెల్ మాఫియా చెలరేగిపోతున్నారు. వీధివీధినా బెల్టు షాపులతో విచ్చలవిడి మద్యంతో మహిళలపై దాడులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. కూటమి పార్టీల అధినేతలే కాదు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన.. అడుగడుగునా దగా దగా అంటూ సామాన్య ప్రజలు వాపోతున్నారు. అర్హత ఉన్నాపింఛన్ కట్ చేశారు.. నాకు ఒక కన్ను పుట్టుక నుంచి పూర్తిగా కనిపించదు. రెండో కన్ను కూడా మసక మసకగా ఉంటుంది. కూలీ నాలీ చేసు కోలేని పరిస్థితిలో ఉన్నాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్ వచ్చేది. ఆ సొమ్ముతో ఇల్లు గడిచేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పింఛన్ తీసేశారు. నేను కూలికి కూడా వెళ్లలేకపోతున్నాను. నాకు ఏ కారణంగా పింఛన్ తీసేశారని కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇచ్చాను. కానీ ఇప్పటివరకూ పింఛను ఇవ్వలేదు. – వరలక్ష్మి, దివ్యాంగురాలు, పాకలపాడు, గొలుగొండ మండలంలబ్దిదారుల ఎదురుచూపులు.. ● జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’ కోసం సుమారు 2,65,778 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రూ.1,063 కోట్ల పెట్టుబడి సాయం వారికి అందాల్సి ఉంది. ● ఏడాదికి 2,13,190 మంది విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు వంతున రూ.319 కోట్లు అందాలి. రెండేళ్లకు కలిపి రూ.638 కోట్ల బాకీ ● ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున జిల్లాలో 18 ఏళ్లు దాటిన 5,47,888 మంది మహిళలకు ‘ఆడబిడ్డ నిధి’ ఏడాదికి రూ.986.19 కోట్లు అందించాలి. రెండేళ్లకు రూ.1972.38 కోట్ల బాకీ. ● అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 2.30 లక్షల మంది నిరుద్యోగులు. వారికి రూ.3 వేల వంతున నెలకు రూ.69 కోట్లు, ఏడాదికి రూ.828 కోట్లు ఇవ్వాలి. ● ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం జిల్లాలో 18 ఏళ్లు దాటిన మహిళలు 6,53,505 మంది, 5 నుంచి 18 ఏళ్ల బాలికలు 84,814 మంది ఎదురుచూస్తున్నారు. హామీలకు తూట్లు.. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు చెప్పిన సూపర్ సిక్స్తోపాటు జిల్లాకు సంబంధించి మరో 143 హామీలు ఇచ్చారు. షరా మామూలుగా విస్మరించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూటమి నేతలు స్థానిక అంశాలపై అనేక వాగ్దానాలు చేశారు. వాటికీ అతీగతీ లేదు. పాయకరావుపేట బహిరంగ సభలో.. ఎన్నికలకు ముందు పాయకరావుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత అనేక హామీలు ఇచ్చారు. నక్కపల్లి డిగ్రీ కళాశాలకు నూతన భవనాల నిర్మాణం.. చిన దొడిగల్లులో అసంపూర్తిగా ఉన్న పీహెచ్సీ నిర్మాణం పూర్తి.. ఉద్దండపురంలో అసంపూర్తిగా ఉన్న వాటర్ గ్రిడ్కు నిధుల మంజూరు.. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు.. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్.. అడ్డురోడ్డు–నర్సీపట్నం రోడ్డు నిర్మాణం.. కోటవురట్ల మండలంలో రామచంద్రపురం జంక్షన్ నుంచి అడ్డురోడ్డు వరకు రహదారి నిర్మాణం... పాయకరావుపేట టౌన్లో మెయిన్ రోడ్డు విస్తరణ అందులో కొన్ని. వీటిలో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. అనకాపల్లి సభలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి సభలో సీఎం రమేష్, కొణతాల రామకృష్ణతో కలిపి పలు హామీలు ఇచ్చారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం.. అనకాపల్లిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా నూతన భవన సముదాయం నిర్మాణం.. కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు.. అనకాపల్లి టౌన్లో నడిబొడ్డున ఉన్న డంపింగ్ యార్ట్ తరలింపు.. ఆర్ఈసీఎస్ను ఏపీఈపీడీసీఎల్ నుంచి విడదీసి మళ్లీ స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ.. వడ్డాది దగ్గర పెద్దేరు నదిపై, విజయరామరాజు పేట వద్ద తాచేరు నదిపై వంతెనల నిర్మాణం, రోలుగుంట–వడ్డాది రోడ్డు నిర్మాణం పూర్తి, రావికమతంలో జూనియర్ కళాశాల నిర్మాణం.. అందులో కొన్ని. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏడాది కూటమి పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై 91 అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు కూడా పాల్పడ్డారు. ● నర్సీపట్నం నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్తోపాటు 44 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ● రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ యూత్ లీడర్ అల్లంపల్లి ఈశ్వర్రావుపై రౌడీలతో హత్య చేయించేందుకు కుట్రలు పన్నారు. ● కక్ష సాధింపుతో వైబీ పట్నా నికి చెందిన చుక్కా రాంబాబుపై దాడి చేశారు. చిటెకెల కన్నపై కేసు నమోదు చేసి ఆయన ఇంటిని కూల్చేశారు. ● నర్సీపట్నం నియోజకవర్గం చీడిగొమ్మల గ్రామంలో టీడీపీ నేతలు దాడి చేసి కొట్టి..12 మంది వైఎస్సార్సీపీ యువ నాయకులపై కేసులు నమోదు చేశారు. ● గత ఏడాది జూలై 9న మాకవరపాలెం మండలం ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ కొల్లి అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. అడ్డుకున్న కొల్లి అప్పలనాయుడు తమ్ముడు రామారావు, తల్లి సత్యవతి, తండ్రి అప్పారావుపై కూడా కర్రలతో దాడి చేశారు. ● మాకవరపాలెంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ను వైఎస్సార్సీపీ నేతలు మందలించారు. ఈ వీడియోను ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఒక టీడీపీ నేత ట్విట్టర్లో పెట్టగా వైఎస్సార్సీపీ నేతలు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్లు బొడ్డు గోవిందరావు, మాకిరెడ్డి అయ్యప్ప, పార్టీ నేత బండారు గాంధీపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు తరలించారు. న్యాయస్థానం మొట్టికాయలు పెట్టడంతో తోక ముడిచారు.చంద్రబాబు బృందానికి వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎన్నికల హామీలను నమ్మి ఓట్లేసిన వారికి వంచన.. సంక్షేమ పథకాలు అందక బతుకు భారమై సామాన్యుల వేదన.. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని ఏమాత్రం అనిపించినా వారిపై కక్షసాధింపు.. అక్రమ కేసులు.. శాంతిభద్రతలు అదుపు తప్పినా.. నేరాల సంఖ్య పెరుగుతున్నా.. సాక్షాత్తూ హోం మంత్రి సొంత జిల్లాలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.. గ్రావెల్ దోపిడీ, ఇసుక అక్రమ తవ్వకాలు,పైరవీలు, పథకాల పంపిణీలో అధికార పార్టీ నేతల పెత్తనం.. అంతా రాజకీయం.. ఇదీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సామాన్యుడు ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్.. -
జిల్లాలో 32 శాతం రేషన్ పంపిణీ పూర్తి
అనకాపల్లి : చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమంలో నేటి వరకూ 32 శాతం పంపిణీ పూర్తి చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. స్థానిక 84వ వార్డు కోట్ని వీధి 15 వ నెంబర్ రేషన్ షాపు పరిధిలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి, భీమునిగుమ్మం వీధిలో వృద్ధురాలు ఇంటికి రేషన్ను ఆమె స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, వృద్ధులకు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయాలని ఆమె కోరారు. డిజిటల్ పేమెంట్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో 1069 రేషన్షాపులు ఉన్నాయని, వాటి ద్వారా ఐదు లక్షల ముప్ఫై వేల కార్డుదార్లకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో దివ్యాంగులు, కదలలేని స్థితిలోను, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు సుమారు 66 వేలు మంది ఉన్నారని, వారందరికీ రేషన్ డీలర్లు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేస్తారని తెలిపారు. రెండు రోజుల లోపల శత శాతం పంపిణీ పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోపల మధ్యాహ్నం 12 నుండి 4 గంటల సమయంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు, వృద్ధులు జాబితా అందరి రేషన్ డీలర్ల వద్ద ఉందని వారికి ఇంటి దగ్గరే సరుకులు పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, జిల్లా సరఫరా అధికారి కె.ఎల్.ఎన్ మూర్తి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఐసీడీఎస్ పీడీగా సూర్యలక్ష్మి
సాక్షి, అనకాపల్లి: జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీగా ఎన్.సూర్యలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లా పీడీగా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి అనకాపల్లి ఐసీడీఎస్ పీడీగా బదిలీ అయ్యారు. సోమవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఐసీడీఎస్ పీడీగా పనిచేస్తున్న అనంత లక్ష్మి దీర్ఘకాలిక సెలవులు పెట్టిన విషయం తెలిసిందే. అనకాపల్లి ఐసీడీఎస్ పీడీగా బదిలీపై వచ్చిన సూర్యలక్ష్మి గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో సీడీపీఓ (సిటీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)గా పనిచేశారు. అదేవిధంగా మహిళా ప్రాంగణం సిటీ మేనేజర్గా కూడా సమర్థవంతంగా పనిచేశారు. స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించే మహిళా ప్రాంగణం మేనేజర్గా పనిచేసి ఆమె ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. -
ఎస్పీ కార్యాలయాలనికి 30 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 30 అర్జీలు అందాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, చీటింగ్ వంటి వాటిపై అర్జీలు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్ఐ డి.వెంకన్న, అర్జీదారులు, తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల ఇలవేల్పు.. మాడుగుల మోదకొండమ్మ
పీజీఆర్ఎస్.. తూతూమంత్రం.!IIలోమాడుగుల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ జాతరను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి సతకంపట్టు వద్ద, ఆలయం వద్ద ఉదయం నుంచి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా భారీ విద్యుత్ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద టీవీ కళాకారులతో ప్రదర్శనలు, సతకంపట్టు వద్ద చిత్ర కళా ప్రదర్శన, దసరా స్టేజిపై చింతామణి, గయోపాఖ్యానం నాటకాలు, గవర వీధిలో విజయవాడ కళాకారులతో డ్యాన్స్ కార్యక్రమం జరగనున్నాయి. సతకంపట్టు వద్ద కొలువైన అమ్మవారి ప్రతిరూపమైన ఘటాలను చిత్ర విచిత్రమైన నేల వేషాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయానికి చేర్చడంతో అమ్మవారి నెల రోజుల పండగ ముగుస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు సోమవారంతో ముగిశాయి. క్రికెట్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1,25,000, ద్వితీయ బహుమతిగా రూ.80 వేలను మంగళవారం అందజేస్తారు. నేటి జాతరకు ఘనంగా ఏర్పాట్లు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు -
సహజ సంపద దోపిడీకే ‘ఆపరేషన్ కగార్’
అనకాపల్లి టౌన్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభు త్వం అమాయక ఆదివాసి గిరిజనులను బలి తీసుకుంటుందని, ఏజెన్సీ ప్రాంతాల నుంచి గిరిజనులను తరిమి కొట్టి అక్కడ ఉండే సహజ సంపదను దోచుకోవడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. స్థానిక రోటరీ కల్యాణ మండపంలో ఆపరేషన్ కగార్ లోగుట్టు అనే అంశంపై సదస్సు సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల ఏరివేత పేరుతో నడుస్తున్న ఈ ఆపరేషన్ వెనుక అటవీ సంపదలను కార్పొరేట్లకు కట్టబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో విస్తరించిన దండకారణ్యంలో ఇనుము, సున్నపురాయి, బాకై ్సట్, డోలమైట్, సహా విలువైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి, అక్కడ ఉన్న ప్రజలను అడ్డుతొలగించడానికి మావోయిస్టుల అంతం పేరుతో ఆపరేషన్ కగార్ చేపట్టినట్లు ఆరోపించారు. 2005లో సల్వాజుడం, 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ చేపట్టాయని, దాని కొనసాగింపే ఆపరేషన్ కగార్ అని తెలిపారు. ఈ సమావేశంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు వి.ఎస్.కృష్ణ, ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ అధ్యక్షుడు అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
రాజకీయ కక్షతో వందలాది పింఛన్లు రద్దు అవ్వాతాతలు, దివ్యాంగులతో కూటమి సర్కారు ఆటలు వెన్నుపూస విరిగినా జాలి లేదు ఆమె పేరు నల్లబెల్లి రాజేశ్వరి. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామం. ఆమెకు వెన్నుపూస సమస్య ఉంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. వికలాంగుల సర్టిఫికెట్ దాఖలు చేయగా పింఛన్ మంజూరయింది. గత ఏడాది జూన్ వరకు పింఛన్ అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ ఆగిపోయింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమెలాంటి దీనురాలికి కూడా నిర్దయగా పెన్షన్ తొలగించారు.రాజకీయ కక్షతోనే.. ఆమె పేరు త్రినాథ. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామం. ఆమెకు పుట్టుక నుంచి ఒక కన్ను లేదు. 18 ఏళ్లుగా వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నారు. వికలాంగుల సర్టిఫికెట్ కూడా ఉంది. కేవలం రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలన్న నెపంతో పింఛను తొలగించారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.కొత్త పింఛను కోసం దరఖాస్తు తీసుకోలేదు నా భర్త ఏడాదిన్నర క్రితం మరణించాడు. అప్పట్లో దరఖాస్తు చేస్తే ఎన్నికల కోడ్ అని ఇవ్వడం మానేశారు. కొత్త ప్రభుత్వం వచ్చేక మంజూరు చేస్తారేమోనని ఆశపడ్డాను. ఈ రోజు వరకు పింఛను మంజూరు చేయలేదు. చాలాసార్లు సచివాలయానికి వెళ్తే కొత్త పింఛను కోసం దరఖాస్తు తీసుకోవడం లేదు. కొత్తవి మంజూరు చేస్తే కబురు చేస్తాంలే అని తిప్పి పంపేశారు. ఇంటి యజమానిని కోల్పోయిన మాకు పింఛను మంజూరు చేయడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో తెలియడం లేదు. – కిల్లాడ హైమావతి, పాములవాక, కోటవురట్ల మండలం ఏడాది నుంచి కోరుతున్నా నా భర్త చనిపోయి ఏడాది అవుతోంది. నాకు వితంతు పింఛను ఇవ్వాలని ఏడాది నుంచి కోరుతున్నా. సచివాలయానికి వెళ్తే ఇప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు తర్వాత చూద్దామని పంపేశారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. పనుల్లోకి వెళ్లలేకపోతున్నా. పిల్లన్ని బడిలోకి పంపుతున్నాను. అమ్మఒడి ఇవ్వడం లేదు. వాళ్లని మాన్పించేసి కూలి పనులకు పంపడం ఇష్టంలేక నేనే కష్టపడుతున్నాను. ఏడాది నుంచి పింఛను మంజూరు కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నాను. – రావి సత్యవతి, మూలపర, నక్కపల్లి మండలం ఒకటో తేదీ వచ్చిందంటే చాలు పింఛనుదారుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. తమ పేరు ఉంటుందో ఊడుతుందోనన్న భయం వెంటాడుతుంది. గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా లబ్ధి చేకూరిస్తే, ఇప్పుడు రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తున్నారు. తమ పార్టీ సానుభూతిపరులైతేనే కూటమి సర్కారు కరుణ దక్కుతుంది. నెలకు సుమారు వంద వంతున ఏడాది కాలంలో 10,136 పింఛన్లు తొలగించారు. లబ్ధిదారుల ఏరివేతలో భాగంగా దివ్యాంగులు సైతం మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్లు సమర్పించాలని హుకుం జారీ చేశారు. ఒకటో తేదీన తెలతెలవారుతుండగా వలంటీరు ఇంటికే వచ్చి, ప్రేమగా పలకరించి, పెన్షన్ అందించిన రోజులను తలచుకొని అవ్వాతాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నక్కపల్లి: వృద్ధాప్య పింఛన్ కావాలంటే.. మీ ఇళ్ల వద్దకు రాలేం.. వీధుల్లోకి రావాల్సిందే.. ఒకటో తేదీన ఎక్కడో ఉంటే కుదరదు.. ఊర్లో ఉండాల్సిందే.. మేము పింఛన్లు ఇస్తున్న గ్రామ సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయం వద్దకు రావాలి.. ప్రతి నెలా పింఛన్లు బట్వాడా చేస్తున్న ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు ఇది. వైఎస్సార్సీపీ పాలన కంటే గొప్పగా చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లను ఒకటో తేదీ లేదా దానికి ఒక రోజు ముందుగానే ఇస్తున్నప్పటికీ పింఛన్దారులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఒకటో తేదీన పింఛన్ అందుకోకపోతే మరో రోజు ఇస్తారని భరోసా ఉండటం లేదు. ఆ రోజు ఎంత అత్యవసర పని ఉన్నా పింఛన్దారులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. పైగా అందరినీ ఒకచోట ఉంచి గంటలకొద్దీ పింఛన్లు ఇవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. నాటి బాధలు అన్నీ ఇన్నీ కావు అవ్వా తాతలకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల వ్యవహారంలో పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. పెన్షన్ల కోసం పండుటాకులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. 2019కు ముందు టీడీపీ ప్రభుత్వంలో వృద్ధులకు ఇచ్చే ఐదొందల పింఛను అందుకోవడానికి రోజంతా కార్యదర్శి కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద, రచ్చబండ వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఒకవేళ సదరు ఉద్యోగి ఆరోజు రాకపోతే మళ్లీ అతను వచ్చేదాకా రోజూ కార్యాలయాలకు వచ్చి వేచి చూడాల్సి వచ్చేది. పదే పదే తిరగాల్సి రావడంతో పింఛన్లు తీసుకోడానికి వచ్చే వారిలో ఎంతోమందికి వడదెబ్బ తగలడం, ఎక్కువ సేపు వేచి ఉండలేక నీరసపడి అనారోగ్యం పాలవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇక పింఛన్లు తీసుకోగానే, వాటిలో నుంచి వందో యాభయ్యో మామూళ్ల కింద చెల్లించాలి. పింఛనుదారుల్లో ఎవరైనా చనిపోతేనే మరొకరికి కొత్తగా మంజూరు చేసేవారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే పింఛన్లు మంజూరు చేసేవారు. తొలి నెల పింఛన్లు గ్రామంలో టీడీపీ నాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. కొత్త పింఛన్లను ఏడాదికొక మారు జన్మభూమి కార్యక్రమంలో మంజూరు చేసేవారు. అవికూడా ఊరికి నాలుగో, ఐదో అంతే.. జగనన్న ప్రభుత్వంలో కష్టాలు తప్పాయి.. పింఛన్ల పంపిణీలో అవ్వాతాతల అగచాట్లను స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దే వలంటీర్ల సహాయంతో అందజేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ వేకువజామునే ఇంటి వద్దకు వలంటీర్లను పంపి పింఛన్లు అందజేసి దేశ చరిత్రలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఎవరి నుంచి ఒక్కపైసా ఆశించకుండా పింఛను మొత్తం అందజేసేవారు. ఎవరైనా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే అక్కడకెళ్లి పింఛను ఇచ్చే సదుపాయం కల్పించారు. కరోనా సంక్షోభంలోనూ పింఛన్దారుల ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఆరు మాసాలకొకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. ఏడాది నుంచి మళ్లీ ఇక్కట్లు మొదలు కూటమి అధికారంలోకి రావడంతోనే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ అవ్వాతాతల కష్టాలు మొదలయ్యాయి. సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు బట్వాడా చేస్తున్నారు. వీధిలో ఒక చోట కూర్చొని పంపిణీ చేస్తున్నారు. దాంతో పింఛను తీసుకునేందుకు అవ్వాతాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్నా, కొత్తగా ఒక్క పింఛను మంజూరు చేయలేదు. భర్త చనిపోతే అతడు పొందే పింఛనును భార్యకు వెంటనే ఇవ్వలేదు. పింఛన్ల కోసం కటాఫ్ తేదీ పెట్టి అర్హులకు అన్యాయం చేశారని పలువురు బాధితులు వాపోతున్నారు. జిల్లాలో వివిధ కేటగిరీల కింద 2.54 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లను అందజేస్తోంది. పింఛను తీసుకునే భర్త చనిపోతే వారి భార్యల పేరున మంజూరు చేయడంలోనూ ప్రభుత్వం కక్కుర్తి ప్రదర్శించింది. పైగా స్పౌజ్ పెన్షన్ మంజూరు కోసం 2023 డిసెంబరు 1 నుంచి 2014 అక్టోబరు 31వ తేదీ వరకు కటాఫ్ పెట్టింది. ఇలా జిల్లాలో 3,168 మందికి మాత్రమే వితంతు పింఛన్లు మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం సామాజిక పింఛన్లు 2,54,962 ఉంటుందో ఊడుతుందోనన్న బెంగ కూటమి అధికారంలోకి వచ్చాక రద్దయినవి 10,136 వాన కురిసినా, ఎండ కాసినా వెళ్లి తెచ్చుకోవాల్సిందే.. -
టెన్త్ టాపర్ వర్షిణికి వాసవీ వనితా క్లబ్ సత్కారం
రోలుగుంట: పదో తరగతి మండల టాపర్ అయిన అదపురెడ్డి వర్షినిని వాసవీ వనిత క్లబ్ చార్టర్ ప్రెసిడెంటు నాగజ్యోతి తదితరులు సోమవారం ఘనంగా సత్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు భవన్ నిర్మాత పిరాట్ల నర్సింహం, వాసవీ క్లబ్, వాసవీ వనిత క్లబ్ సంయుక్తంగా జిల్లాస్థాయిలో మండల టాపర్లు అయిన అధిక మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు అనకాపల్లి ప్రభుత్వ పాఠశాలలో అభినందన సత్కార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక మార్కులు సాధించి 11 మండలాల నుంచి పాల్గొన్న టాపర్స్కి జ్ఞాపికలు, బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. వర్షిణి రోలుగుంట కేజీబీవీలో చదివి 570 మార్కులు సాధించింది. ఈ కార్యక్రమం నిర్వహణలో భాగస్వామి, రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్, వాసవీ వనిత క్లబ్ చార్టర్ ప్రెసెడెంటు నాగజ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత స్థితికి ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్ధుల తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఓరుగంటి నాగమణి, టీడీపీ అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము, జనసేన నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీ, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పరిహారం ఇచ్చి ఆదుకోండి..
భవన నిర్మాణ కాంట్రాక్టర్ నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన తాపీమేస్త్రి వేములపూడి వరహాలు కోరారు. చేతికర్ర సాయంతో కలెక్టరేట్కు చేరుకున్న ఆయన అధికారులకు తన గోడు వినిపించుకున్నాడు. విరోదిలు చిన్నా అనే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తూ జనవరిలో రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి గాయాలపాలయ్యానని, ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నప్పటికి కాంట్రాక్టర్, భవన యాజమాని గానీ పట్టించుకోలేదని ఆయన ఆరోపించాడు. ఏప్రిల్లో కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశానని, ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ కలెక్టర్ను కలిసి తన బాధను చెప్పుకుందామని వస్తే.. కిందనే సమస్య అడిగి పంపిచేస్తున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు. -
భూకబ్జాదారులకు ఎమ్మెల్యే రాజు అండ
ప్రభుత్వ భూములను ఫోర్జరీ దస్త్రాలతో రూ.4 కోట్లకు విక్రయించేయడంతో పాటు మరో 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ముఠాపై విచారణ చేపట్టాలని రావికమతం మండలం తోటకూరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త యడ్ల చినసత్తిబాబు పీజీఆర్ఎస్లో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అచ్చుతాపురం మండలం నునపర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో ప్రభుత్వ భూములను బినామీల పేరున తప్పుడు పాసు పుస్తకాలు తయారు చేసి భూకబ్జాలను పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నించిన తనతో పాటు కుటుంబ సభ్యులపై పోలీసు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత, చోడవరం ఎమ్మెల్యే రాజుకు చెప్పినా వారు పట్టించుకోకుండా.. ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని, వారి ఆదేశాలతోనే తనపై కేసులు నమోదయ్యాయన్నారు. గ్రామంలో సర్వే నంబర్ 3లో ప్రైవేటు భూమితో పాటు సర్వే నంబర్ 2, 4లో ప్రభుత్వ భూమి 30 ఎకరాలు, కశింకోట మండలం అడ్డాం గ్రామంలో కూడా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పీజీఆర్ఎస్.. తూతూమంత్రం.!
● అర్జీల స్వీకరణ సరే.. పరిష్కారమెప్పుడు? ● ఆవేదన వ్యక్తం చేస్తున్న అర్జీదారులు ● కలెక్టరేట్లో అడుగడుగునా ఆంక్షలు తుమ్మపాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యలు పరిష్కార వ్యవస్థ కార్యక్రమం తూతూమంత్రంగా సాగుతోంది. కలెక్టరేట్కు వస్తే సమస్యను జిల్లా అధికారులు విని తక్షణమే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ పరిష్కరిస్తారన్న ఆశతోనే జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి మండుటెండను సైతం లెక్కచేయకుండా వస్తున్న అర్జీదారులకు నిరాశే మిగులుతోంది. జిల్లా అధికారులు సైతం అర్జీ తీసుకుని.. సరే వెళ్లండి అంటున్నారని పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రమాదాల్లో గాయాలపాలైన బాధితులు, సంక్షేమ పథకాల కోసం కుటుంబ సభ్యుల సహాయంతో వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. వీరిని గేటు వరకు మాత్రమే సిబ్బంది అనుమతి ఇస్తున్నారు. మరికొందరు తమ చిన్నారులను తీసుకుని వచ్చినప్పటికి పీజీఆర్ఎస్ వేదిక వద్దకు ఒక్కరికే అనుమతి అంటూ మిగిలిన వారిని బయటకు పంపించేస్తున్నారు. కలెక్టరేట్ బయట రోడ్డు నుంచి అర్జీదారులు బారికేడ్లు దాటుకుని ప్రధాన గేటు వద్దకు రాగా పోలీసులు అర్జీదారుల సంచుల్లో సామగ్రిని తనిఖీ చేసి ఒక్కరినే అనుమతిస్తున్నారు. అడుగడుగున తనిఖీలతో అడ్డంకులు పెట్టి మరి అర్జీదారులను కలెక్టరేట్లోకి పంపిస్తున్నా అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో అర్జీదారులంతా నిరాశతోనే వెనుతిరుగుతున్నారు. 265 అర్జీల స్వీకరణ కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్తో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కారంలో అధికారుల చొరవ చూపకపోవడం వల్లనే అర్జీలు రీఓపెన్ అవుతున్నాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీల విచారణలో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చేయాలని, పరిష్కరించలేని అర్జీల విషయంలో అర్జీదారులకు స్పష్టత ఇవ్వాలన్నారు. మొత్తం 265 అర్జీలు నమోదయ్యాయి. -
హత్యాయత్నం కేసులో ఆ నలుగుర్నీ అరెస్ట్ చేయాలి
నర్సీపట్నం: వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై హత్యాయత్నంకు పాల్పడిన మరో నలుగురిని తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం టౌన్ సీఐ గోవిందరావును పార్టీ నాయకులతో కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. రౌడీ షీటర్ పప్పల అప్పలనాయుడు, మరో ఐదురుగు రెండు బైక్లపై వచ్చి హత్యాయత్నంకు పాల్పడ్డారన్నారు. వారందరినీ అరెస్టు చేయకుండా రౌటీషీటర్, మరో వ్యక్తిని అరెస్టు చేసి కేసును నీరుగార్చే పని చేయవద్దన్నారు. కత్తులు, రాడ్లతో ఈశ్వరరావును వెంబడించారని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. పాల్ఘాట్ జంక్షన్ నుంచి అబిద్ సెంటర్ వరకు జరిగిన సంఘటన వాస్తవాలు బయటకు రావాలంటే సీసీ ఫుటేజీలను పరిశీలించాలన్నారు. సంఘటన ప్రారంభమైన సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరిపై కేసు పెట్టి సరిపెట్టాలనుకోవడం సరికాదని సీఐకు సూచించారు. అబిద్ సెంటర్లోని సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తే మిగతా నిందితులు దొరుకుతారన్నారు. ఆ ఇద్దరుతో పాటు ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ, పార్టీ లీగల్సెల్ ప్రతినిధులు మాకిరెడ్డి బుల్లిదొర, కౌన్సిలర్ సిరసపల్లి నాని, ఆరుగుల్ల రాజుబాబు, దాడి బుజ్జి తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్ సీసీ ఫుటేజీలు బయటపెట్టాలి -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
● కలెక్టర్ విజయ కృష్ణన్ గొలుగొండ: యోగాతోనే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మండలంలోని కృష్ణదేవిపేట గ్రామంలో సోమవారం ఉదయం ఆమె యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం తదితర మండలాల నుంచి వచ్చిన ప్రజలు ఉదయం 7 నుంచి 8.15 గంటల వరకు యోగాసనాలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి యోగా గురువులు మండల స్థాయిలో శిక్షణ ఇస్తున్నారన్నారు. మండల స్థాయిలో శిక్షణ తీసుకున్న వారు గ్రామ స్థాయిలో నేర్పాలన్నారు. నర్సీటప్నం ఆర్డీవో వి.వి. రమణ, వైద్య, గ్రామ సచివాలయం, ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సర్పంచ్ లోచల సుజాత పాల్గొన్నారు. అల్లూరికి నివాళి : మన్యం వీరుడు అల్లూరి సమాధికి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఘన నివాళులర్పించారు. అల్లూరి పార్కులో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ముందుగా అల్లూరి, గంటం సమాధుల వద్ద జ్యోతి వెలిగించారు. ఇక్కడ సమాధుల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఐటీఐల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నర్సీపట్నం: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాలకు ఈనెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ఐటీఐ ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసాచారి తెలిపారు. మొత్తం 456 మంది విద్యార్థులు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకున్నారని, అర్హులైన అభ్యర్థులకు మొబైల్ ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కౌన్సెలింగ్కు నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐలో హాజరు కావాలన్నారు. 5వ తేదీన 1 నుంచి 149 ర్యాంకులు, 6న 150 నుంచి 300, 7న 301 నుంచి 456 ర్యాంకుల అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. -
అడ్వాన్స్డ్లో అదరగొట్టారు
విశాఖ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులుఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో విశాఖ విద్యార్థులు అదరగొట్టారు. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. అందరితో శభాష్ అనిపించుకున్నారు. పక్కా ప్రణాళికతో చదివామని, అధ్యాపకుల సూచనలు, సలహాలు ఉపయోగపడ్డాయని విద్యార్థులు చెప్పారు. ఈ సందర్భంగా విజేతల నేపథ్యం, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకుందాం.. –డాబాగార్డెన్స్/సీతంపేట/తగరపువలసప్రముఖ ఐఐటీలో చేరుతా.. మా నాన్న సురేష్ సుమార్ అనకాపల్లి జిల్లాలో ఏపీఈపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గాను, తల్లి వసుధ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జేఈఈ అడ్వాన్స్డ్లో 510వ ర్యాంకు సాధించాను. దేశంలోనే అత్యుత్తమ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో చేరుతాను. –కొడవటి శివమ్రామ్ ప్రత్యూష్, 510 ర్యాంకు, రోజుకు 13 గంటలపాటు చదివా.. రోజుకు 13 గంటలపాటు చదివా. ప్రతి వారం వీక్లీ టెస్ట్లకు అటెండయ్యా. డౌట్స్ను అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకునేవాడిని. తండ్రి ప్రసాదరావు, తల్లి వీణ.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. అధ్యాపకులు, యాజమాన్యం, తల్లిదండ్రుల పోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నా. –టి.మనోహర్, 116వ ర్యాంకు చేపల వ్యాపారం చేస్తూ చదివించారు.. పదో తరగతి సింహాచలం గురుకుల పాఠశాలలో చదివి 588 మార్కులు సాధించాను. ఇంటర్ సీబీఎస్ఈలో 472/500 మార్కులు వచ్చాయి. మెయిన్స్లో 407వ ర్యాంకు, అడ్వాన్స్డ్లో 151వ ర్యాంకు వచ్చింది. నా తల్లిదండ్రులు అంజూరి శ్రీను, ఉమ మత్స్యకారులు. చేపల వ్యాపారం చేస్తూ చాలా కష్టపడి చదివించారు. ఖరగ్పూర్ లేదా ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి ఇంజనీర్ కావాలన్నది నా లక్ష్యం. – అంజూరి తారక్రామ్, 151వ ర్యాంకు, పాండ్రంకి గ్రామం పూర్ణ సాయికి 132వ ర్యాంక్ అనకాపల్లి టౌన్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో అనకాపల్లి నారాయణ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మామిడి పూర్ణసాయి 132వ ర్యాంక్ (ఓబీసీ కేటగిరీలో 18వ ర్యాంక్) సాధించాడు. బండారు యదు వంశీకి ఓపెన్ కేటగిరీలో 3,146 ర్యాంక్ దక్కింది. పూర్ణ సాయి తండ్రి శివనాగేశ్వరరావు ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. తల్లి పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. డేవిడ్ జాన్సన్కు 1353వ ర్యాంకు పాయకరావుపేట: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థి దేవి డేవిడ్ జాన్సన్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 1353వ ర్యాంకు సాధించాడని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. డేవిడ్ జాన్సన్ మాట్లడుతూ స్పెషల్ కోచింగ్ ద్వారా తనను తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని విద్యా సంస్ధల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, ఉపాధ్యాయ బృందం, సహచర విద్యార్థులు అభినందించారు. -
జగనన్న ఇంటి పట్టాను విక్రయించేశారు
జగనన్న కాలనీలో ఇచ్చిన పట్టాను తనకు తెలియకుండా విక్రయించేసి మరో చోట పట్టా ఇస్తానంటూ మోసం చేసిన సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుమ్మపాల కొత్తపేట వీధికి చెందిన దూడ నూకమ్మ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. తనకు మారేడుపూడి గ్రామం సర్వే 205లో ప్లాట్ నెం.13 స్థలం మంజూరు చేసి జియోటాగింగ్ కూడా చేశారని, ఇల్లు కట్టడం ఆలస్యమైనందున నా స్థలాన్ని గ్రామ నాయకులు ఇతరులకు విక్రయించేసి అన్యాయం చేశారని వాపోయింది. అధికారులు విచారణ చేపట్టి తన స్థలంలో ఇల్లు కట్టుకునేలా చేయాలని వేడుకుంది. -
కలిసికట్టుగా కృషి చేస్తే క్షయ రహిత జిల్లా
తుమ్మపాల: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబరులో ‘‘ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ – టీబీ ముక్త్ భారత్ అభియాన్–2025’ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని ‘‘నిక్షయ్ మిత్ర‘గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ నెల 4న గ్రామ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి జిల్లా స్థాయి వరకు టి.బి. పరీక్షలు చేయించాలన్నారు. కళ్లె పరీక్ష చేయడం, వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులకు ఎక్స్రే ద్వారా వ్యాధిని గుర్తించవచ్చన్నారు. వ్యాధి నిర్ధారణ చేసుకుని, క్షయ వ్యాధి లేని దేశంగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. చివరిగా క్షయ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం తదితర సమాచారంతో కూడిన గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.స్.వి.కె. బాలాజీ, డాక్టర్ సి.హెచ్. ధాత్రీప్రియ, వైద్యాధికారి ఎల్. శ్రావణ తదితరులు పాల్గొన్నారు. ‘ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ – టీబీ ముక్త్ భారత్ అభియాన్’ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ -
వీడని రేషన్ కష్టాలు
అచ్యుతాపురం రూరల్/నాతవరం: రెండో రోజు కూడా జిల్లా ప్రజలను రేషన్ కష్టాలు వీడలేదు. మోసయ్యపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో వినియోగదారులు సోమవారం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇచ్చేవారని, ప్రభుత్వం మారడంతో ఇక్కట్లు కొనితెచ్చుకున్నట్లు అయిందని రేషన్ వినియోగదారులు వాపోతున్నారు. నాతవరం మండలంలో సర్వర్ సమస్యతో డీలర్లతోపాటు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షణే తప్ప వేలిముద్రలు పడటం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మౌలిక వసతుల కోసం వినతి
గత ప్రభుత్వంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో నిర్మించుకున్న ఇళ్లకు మంచినీరు, రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ యలమంచిలి మండలం మర్రిబంధలో నివాసముంటున్న కాలనీ వాసి మారెడ్ల అప్పలరాజు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఇల్లు కట్టుకుని గడిచిన మూడేళ్లుగా నివాసముంటున్న తమకు మంచినీరు, రోడ్లు, తదితర సౌకర్యాలు లేవని వాపోయారు. రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నామని చెప్పారు. తాగునీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వివరించారు. ఇప్పటికే చాలా సార్లు అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నా పరిష్కారానికి నోచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు కూడా పంచాయతీ సిబ్బంది వసూలు చేయడం లేదని, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
బుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట మండలంలో ఐయితంపూడి గ్రామంలో రెండు ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఐయితంపూడి గ్రామానికి చెందిన ముచ్చకర్ల బొర్రయ్య, పెదిరెడ్ల రాజు తమ ఇళ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాలకు కూలీ పనులకు వలస వెళ్లగా.. గతంలో దొంగతనాలు జరిగాయన్నారు. బంగారం, వెండి వస్తువులు, నగదు పట్టుకుపోవడంతో అప్పట్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఇదే గ్రామానికి చెందిన ఐయితరెడ్డి శివకుమార్, ముచ్చకర్ల కృష్ణమూర్తి వ్యసనాలకు బానిసై తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. రెండు ఇళ్లల్లో జరిగిన దొంగతనాలు జరిగిన ప్రదేశాల్లో వేలిముద్రలు, వారి కదలికలు ఆధారంగా నిందితులను పట్టుకుని విచారణ చేయగా దొంగతనంకు పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద నుంచి మూడు తులాలు బంగారు ఆభరణాలు, 10 తులాలు వెండి వస్తువులు, రూ.15 వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను సోమవారం చోడవరం కోర్టులో హాజరు పరిచామన్నారు. చోరీ కేసులను ఛేదించిన అదనపు ఎస్ఐ భాస్కరరావు, హెడ్ కానిస్టేబుల్ అర్జున్, కానిస్టేబుళ్లు గణేష్, వెంకట్, హరీష్, కిరణ్, హోంగార్డులు నాగేష్, కనకరాజులను సీఐ కోటేశ్వరరావు అభినందించారు. -
రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ వెన్నుపోటు
దేవరాపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తారువలో ఆదివారం మాడుగుల నియోజకవర్గ ముఖ్య నాయుకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మోసాలను ఎండగడుతూ 4న మాడుగులలో నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రజలు తరఫున కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. కూటమి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలు సంక్షేమ, అభివృద్ధికి దూరమయ్యారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోను సంక్షేమ పథకాలన్నింటిని నిరాటంకంగా అమలుచేశామని తెలిపారు. జగన్ పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమాన్ని అందించి ప్రతి ఇంటికి గర్వంగా వెళ్లగలిగామని చెప్పారు. కూటమి పాలనలో సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల చెంతకు వెళ్లలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారని జిల్లా స్థాయి మినీ మహానాడులో స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ఆవేదన వెళ్లగక్కడం కూటమి పాలన తీరుకు నిదర్శనమన్నారు. మహానాడులో ప్రజలకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాజీ సీఎం జగన్పై విమర్శలకే పరమితమయ్యారన్నారు. అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ. 20 వేలు, తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ. 15 వేలు ఇస్తామని చెప్పి రైతులను, మహిళలను మోసం చేశారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500, పేదలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు కనీసం ఈ పథకాల ఊసెత్తక పోవడం దారుణమని చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగవకాశాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి కింద ఏడాదికి రూ. 3 వేలు ఇస్తామని చెప్పి దగా చేశారన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వాయిదాలు వేస్తున్నారని మండిపడ్డారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పిన కూటమి నేతలు చెరకు రైతులకు పేమెంట్లు ఇవ్వకుండా మనుగడ ప్రశ్నార్థకం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికి ఐదేళ్లలో జగన్ సుమారు రూ. 90 కోట్లు మంజూరు చేయగా, కూటమి సర్కార్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. మైదాన, గిరిజన గ్రామాలకు తారు రోడ్లు నిర్మించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లను నాడు–నేడులో అభివృద్ధి చేశామని చెప్పారు. రైవాడ ప్రాజెక్టును డ్రిప్ స్కీమ్ లో చేర్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, కూటమికి చిత్తశుద్ధి ఉంటే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు. పెద్దేరు జలాశయం కెనాల్ ఆధునికీకరణకు గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సుమారు రూ. 84 కోట్లు మంజూరు చేసి టెండర్ పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జల్జీవన్ మిషన్లో నియోజకవర్గానికి సుమారు రూ. 175 కోట్లు మంజూరు చేసి, ట్యాంక్లు నిర్మించి, పైపులైన్ పనులు సైతం దాదాపుగా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలం నాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, మండల మహిళా అధ్యక్షురాలు గొర్రుపోటు రమాదేవి, మండల బీసీసెల్ అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాసరావు, మండల రైతు విభాగం అధ్యక్షుడు అన్నం రామునాయుడు, సర్పంచ్లు నాగిరెడ్డి శఠారినాయుడు, దాడి జగన్, దాసరి సంతోష్కుమార్, ఎంపీటీసీ పోతల వెంకటరావు, రుత్తల రాంబాబు, కాటిపాం పెదనాయుడు, భుగత వెంకటరమణ, వేచలపు చిన్నంనాయుడు, రొంగలి నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలులోఘోర వైఫల్యం నారావారి మోసాలను నిరసిస్తూ 4న ‘వెన్నుపోటు దినం’ మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు తారువలో వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ -
అప్పులు పాలైన రైతు ఆత్మహత్య
మునగపాక: మండలంలోని కుమారపురంలో అప్పులు తీర్చలేక క్రిమిసంహారక మందు తాగి రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం విశాఖ కేజీహెచ్లో అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుమారపురం గ్రామానికి చెందిన పల్లెల సూరిబాబు(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులకు గాను రూ.5 లక్షలు, తన చిన్న కుమారుడు శ్రీనివాస్ కోసం దస్తావేజులు తనఖా పెట్టి ప్రైవేటు వ్యక్తుల నుంచి మరో రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వీటిని తీర్చే మార్గం లేక నిత్యం మద్యానికి బానిసై వడ్డీ చెల్లించే పరిస్థితులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దీనిలో భాగంగా గత నెల 28న సాయంత్రం క్రిమిసంహారక మందు తాగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కుమారుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష
అల్లిపురం(విశాఖ): పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోలీస్ కానిస్టేబుల్(సివిల్, ఏపీఎస్పీ) మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నగరంలో మొత్తం 27 పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్కు 12,491 మంది అర్హత సాధించగా, 11,338 మంది మాత్రమే హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి, కేంద్రాల లోపలకు అనుమతించారు. నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, డీసీపీ–1(లా అండ్ ఆర్డర్) అజితా వేజెండ్ల, డీసీపీ–2 (లా అండ్ ఆర్డర్) డి.మేరి ప్రశాంతి, డీసీపీ (అడ్మిన్) శ్రీ కృష్ణకాంత్ పటేల్లపు పలు కేంద్రాలను తనిఖీలు చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విశాఖ చేరిన డబుల్ డెక్కర్ బస్సు సింహాచలం: విశాఖ వీధుల్లో డబుల్ డెక్కర్ బస్సు కనువిందు చేయనుంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచనుంది. విశాఖలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు విశాఖకు చేరుకుంది. హనుమంతవాక నుంచి పాత అడవివరం వైపు ఉన్న బీఆర్టీఎస్ రోడ్డులో కనువిందు చేస్తూ సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలకు చార్జింగ్ కోసం ఆదివారం వచ్చింది. గోశాల ముఖద్వారం గేటు బస్సు కన్నా తక్కువ ఎత్తులో ఉండటంతో లోపలకి వెళ్లలేదు. గేటు బయటనే నిలిచింది. దాంతో బీఆర్టీఎస్ రోడ్డులో సింహాచలం వైపు వచ్చే వారంతా బస్సును ఆసక్తిగా తిలకించారు. గన్నవరం నియోజకర్గంలోని మల్లివల్లిలో అశోక్ లేల్యాండ్ బస్ బాడీ ప్లాంట్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ కంపెనీ తయారుచేసిన డబుల్ డెక్కర్ బస్సును ఏపీ ప్రభుత్వానికి సంస్థ ఉచితంగా అందించింది. దాన్ని విశాఖకు కేటాయించారు. -
మీకు దండాలు.. దయచేసి చదువును దూరం చేయొద్దు
కోటవురట్ల: విద్యా శాఖామంత్రి లోకేష్ గారూ.. మా పిల్లలకు చదువులు అవసరం లేదా..గిరిజన పిల్లలు చదువుకు దూరంకావలసిందేనా..ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు.. మా పిల్లల కోసం ఓ ఉపాధ్యాయుడిని నియమించలేరా అంటూ అణుకు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తూ దండం పెడుతూ ఆందోళన చేశారు. అణుకు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆదివారం ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ పాఠశాలను తెరిచి ఉపాధ్యాయుడిని నియమించాలని నినాదాలు చేశారు. పార్టీ మండల కార్యదర్శి ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ గ్రామానికి గత ప్రభుత్వంలో రోడ్డు వేసి, ప్రత్యామ్నాయ పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించారన్నారు. కూటమి ప్రభు త్వం వచ్చాక ఉపాధ్యాయుడిని తొలగించారని, దీంతో చిన్నారులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ సుమారు 60 మంది పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం వర్షాలకు రోడ్డు కూడా శిథిలమైందని, పిల్లలు రాళ్లు తేలిన రోడ్డుపై చదువు కోసం 12 కిలోమీటర్లు రానుపోను నడవాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యా శాఖా మంత్రి ,కలెక్టర్ స్పందించి గిరిజన బాలల కోసం పాఠశాలను పునఃప్రారంభించాలని కోరారు. సీపీఎం నాయకులు ఎం.నానాజీ, ఎం.సూరిబాబు, రఘుబాబు, నర్సింగరావు, నవీన్ పాల్గొన్నారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
దేవరాపల్లి: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీ కొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం దేవరాపల్లి నుంచి జీనబాడు వెళ్లే రహదారిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కివర్ల గ్రామానికి చెందిన కేత దేముడు దేవరాపల్లి నుంచి తన గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో పెదబయలు నుంచి దేవరాపల్లి వైపు వస్తున్న ఎస్. ప్రసాద్ ద్విచక్ర వాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఇద్దరు తలలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్య సేవలు నిమిత్తం కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. -
అనకాపల్లిలో టీడీపీ వర్సెస్ జనసేన
అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదివారం రేషన్ డిపోల పునః ప్రారంభంలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తీరుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు తీవ్ర అవమానం ఎదురైంది. అనకాపల్లి పట్టణం రైల్వే స్టేషన్ రహదారి కోట్నివీధి రేషన్ డిపో–15 పునః ప్రారంభించేందుకు ఉదయం 8 గంటలకే మాజీ ఎమ్మెల్యే పీలా, టీడీపీ నాయకులు చేరుకున్నారు. ఇంతలో జనసేన నాయకులు అక్కడికి చేరుకుని తమ ఎమ్మెల్యే కొణతాల వచ్చే వరకూ రేషన్ దుకాణాన్ని ప్రారంభించ వద్దని అక్కడే ఉన్న ప్రభుత్వ అధికారులకు చెప్పారు. దీంతో పీలా ఉదయం 10 గంటల వరకూ రేషన్ దుకాణం వద్దే కూర్చుని, కొణతాల కోసం నిరీక్షించారు. ఎప్పటికీ ఆయన రాకపోవడంతో సమయం ఆన్నసమైనది, తక్షణమే రేషన్ దుకాణాన్ని ప్రారంభించాలని అధికారులను పీలా కోరారు. ఎమ్మెల్యే వస్తే గానీ ప్రారంభించేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో చేసేది లేక పీలా తన అనుచరులతో గవరపాలెంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ వెంటనే జనసేన నాయకులు పీలా వెళ్లిపోయిన విషయాన్ని కొణతాలకు ఫోన్లో సమాచారం అందజేశారు. సుమారు ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యే వచ్చి కోట్నివీధి రేషన్ డిపోను ప్రారంభించారు. పీలా వెళ్లిన తరువాత కొణతాల రావడంపై టీడీపీ శ్రేణులు రుసరుసలాడుతూ కనిపించారు. తమను అవమానించడానికే జనసేన నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారని, బయటకు చెప్పుకోలేక లోలోపన మదనపడ్డారు. లబ్ధిదారులు కూడా 3 గంటలకు పైగా నిరీక్షించాల్సి రావడంతో నిరాశతో వెనుదిరిగారు. రేషన్ డిపో ప్రారంభంలో మాజీ ఎమ్మెల్యే పీలాకు తీవ్ర అవమానం ఎమ్మెల్యే కొణతాల కోసం 2 గంటలకు పైగా నిరీక్షణ చివరకు పీలా వెళ్లిన తరువాతప్రారంభోత్సవానికి హాజరైన కొణతాల రుసరుసలాడుతూ వెనుదిరిగిన టీడీపీ శ్రేణులు -
పేదల గూడు... పట్టదు గోడు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తాం. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తాం. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోం. – పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు హామీ సాక్షి, అనకాపల్లి: ప్రతిపేదవాడి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ఊదరగొడతారు. ఈ ఏడాది కాలంలో ఆయన మాటలను, పాలనను పరిశీలిస్తే పొంతన లేదని ఎవరికై నా ఇట్టే తెలిసిపోతుంది. బోగస్ హామీలు, మాయ మాటలు ఆయన సొత్తని రుజువు అవుతుంది. దానికి ప్రబల ఉదాహరణ పేదల ఇళ్లు. రెండు సెంట్ల స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కనీసం ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ ఏడాది కాలంలో ఒక్క ఇల్లు, సెంటు స్థలం మంజూరు చేయకపోగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు నిలిపివేసి ఘనతకెక్కారు. ఆయా కాలనీల్లో కనీస వసతులు కల్పించకుండా పేదల బతుకులతో ఆటలాడుకుంటున్నారు. పేదోడి సొంతింటి కల సాకారమయ్యేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా స్థలం అందజేయడంతో పాటు ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ప్రతి గ్రామంలో జగనన్న కాలనీల పేరిట కొత్త ఊళ్లు వెలిశాయి. మీ ఇల్లెక్కడ.. అంటే సమాధానం చెప్పుకోలేని నిరుపేదలకు జగనన్నకాలనీల్లో శాశ్వత చిరునామాలు లభించాయి. తనకు ఓ ఇల్లు ఉందని పేదోడు గర్వంగా తలెత్తుకుని చెప్పుకునే విధంగా అర్హతున్న ప్రతి ఒక్కరికీ సెంటున్నర స్థలాన్ని ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టారు. రాజకీయాలతీతంగా, పార్టీ జెండా చూడకుండా పేదోడనే అర్హతే ప్రామాణికంగా వై.ఎస్. జగన్ సర్కార్ ఇళ్లు మంజూరు చేస్తే..కూటమి ఏడాది పాలనలో పేదల ఇళ్ల నిర్మాణ బిల్లులను కూడా నిలిపివేసింది. రెండు సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తామనే ఎన్నికల హామీని గద్దెనెక్కిన తర్వాత అలవాటు ప్రకారం విస్మరించింది. ఉన్నవి పోయి...కొత్తవి రాక దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారు.చినుకుపడితే చిత్తడే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిమ్మరాజు పేట జగనన్నకాలనీలో ఉచితంగా సెంటున్నర స్థలం ఇచ్చి, ఇల్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే మా కాలనీలో నాతో పాటు సుమారు 34 మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి మా కాలనీలో రహదారి, డ్రైనేజీ సదుపాయం కల్పించలేదు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వర్షాకాలం వస్తే ఇంటికెళ్లే రహదారి బురద మయంగా ఉంటుంది. – కోలమూరి బాబురావు, తిమ్మరాజుపేట, మునగకపాక మండలంప్రతి పేదోడికి సొంతింటి కల నెరవేర్చాలనే ఆశయంతో గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రతి గ్రామంలో జగనన్న కాలనీల లేఅవుట్లు వేసి సెంటున్నర స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే ఆ కాలనీలపై కూటమి ప్రభుత్వం కినుకు వహించింది. వాటివైపు కన్నెత్తి చూడడం లేదు. కనీస మౌలిక వసతులు కల్పించలేదు. గతంలో వేసిన అంతర్గత రోడ్లకు ఇరువైపులా తుప్పులు పేరుకుపోయి ఉన్నా కనీసం తొలిగించే ప్రయత్నం కూడా అధికారులు చేయడంలేదు. జగనన్నకాలనీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా గతంలో వాటర్ ట్యాంక్లు,, విద్యుత్ స్తంభాలకు నిధులు మంజూరు చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పేదలను దగా చేసిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలు ఇంటి కోసం ఒక్కరికీ సెంటు స్థలం కూడా ఇవ్వని పరిస్థితి గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు బిల్లుల నిలిపివేత సగంలోనే నిలిచిపోయిన వందలాది ఇళ్లు జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించని సర్కార్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 682 జగనన్నకాలనీలు అభివృద్ధి సుమారు 58,571 ఇళ్లు మంజూరు 24,060 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ జగనన్న కాలనీలపై కినుకు -
దళిత యువకుడిపై హత్యాయత్నం గర్హనీయం
నర్సీపట్నం: దళిత యువకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై హత్యాయత్నాన్ని నిరసిస్తూ బహుజన ఐక్యవేదిక, వివిధ ప్రజా సంఘాల నాయకులు స్థానిక అబిడ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు భార్య లక్ష్మి మాట్లాడుతూ పోలీసులు కేసును నీరుగార్చేందుకు చూస్తున్నారని ఆరోపించింది. తన భర్తకు ఏమైనా అయితే కుటుంబ పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పక్కాగా తన భర్తను హత్య చేసేందుకు కత్తులు, రాడ్లుతో వస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో సరిపెట్టడం సరికాదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. బహుజన ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా నాగరాజు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇలాకాలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని వాపోయారు. నిందితులపై తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. వైజాగ్ భీమసేన కన్వీనర్ రవి సిద్దార్థ మాట్లాడుతూ మొన్న హోంమంత్రి అనిత నియోజకవర్గంలో దళితులపై దాడి జరిగిందన్నారు. ఈ రోజు సాక్షాత్తు స్పీకర్ నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై హత్యాయత్నం జరగడం శోచనీయమన్నారు. ఈ దాడులు, హత్యాయత్నాలు, హత్యలు కేవలం దళితులపై జరుగుతున్నాయన్నారు. అంబేడ్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర పొలిట్బ్యూరో సభ్యుడు సరమండ వీరబాబు మాట్లాడుతూ దళితులు రాజకీయాలు చేస్తుంటే చంపేయాలని చూడడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆరుగుల్ల రాజుబాబు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా దళిత యువకుడు ఈశ్వరరావుపై దాడి జరగటం అమానుషం అన్నారు. స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ చిట్టయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హత్యా రాజకీయాలు ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. లోతుగా విచారణ చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ ఆందోళనలో సాల్మన్రాజు, దేముడు, నాగేశ్వరరావు, సూరిబాబు, అప్పలనాయుడు, జల్లు బాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆందోళన -
హాస్టళ్లలో సెల్ఫోన్ల చోరీ కేసు ఛేదన
నిందితుడి అరెస్ట్, 12 ఫోన్లు స్వాధీనం తాటిచెట్లపాలెం: ద్వారకానగర్లోని హాస్టళ్లలో సల్ఫోన్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం ఏడీసీపీ మోహనరావు తెలిపారు. ద్వారకా పోలీస్స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ద్వారకానగర్లోని శ్రీచక్ర బాయ్స్ హాస్టల్ను కొవ్వూరి సోమిరెడ్డి నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 7న హాస్టల్లో ఉంటున్న గణేష్ అనే విద్యార్థి తన ఫోన్ కనిపించడం లేదని సోమిరెడ్డికి తెలిపాడు. దీంతో ఆయన హాస్టల్లో విచారించగా.. మొత్తం ఆరు ఫోన్లు, అదే ప్రాంగణంలోని మరో హాస్టల్లో ఐదు ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో సోమిరెడ్డి ద్వారకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ద్వారకా పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో నిందితుడు కనకం దామోదర్గా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గత నెల 27న అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 12 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. కనకం దామోదర్పై గతంలో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 20 సెల్ఫోన్ దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని ఏడీసీపీ తెలిపారు. -
బురద రోడ్డులో గిరిజనుల ఆందోళన
దేవరాపల్లి: జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల బకాయి బిల్లులను తక్షణమే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. వాలాబు, చింతలపూడిలో పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచిన రోడ్లు, కాజ్వే నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. వాలాబు పంచాయతీలో స్థానిక గిరిజనులతో కలిసి అసంపూర్తిగా నిలిచిపోయి బురదమయంగా మారిన రోడ్డులో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ వాలాబు పంచాయతీలో రూ. 12 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపడితే రూ.40 లక్షలు మాత్రమే నిధులు మంజూరు చేశారని వాపోయారు. చింతలపూడి పంచాయతీ శివారు వీరభద్రపేటలో రోడ్డు నిర్మాణానికి రూ. 84 లక్షలు మంజూరు చేయగా, ఎర్త్ వర్క్ చేసి పనులు నిలుపుదల చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. అనకాపల్లి జిల్లాలో 166 కిలోమీటర్ల పొడువున 1,354 రోడ్లు నిర్మాణం పనులు పూర్తి కాగా వీటికి కాంట్రాక్టర్లు రూ. 143 కోట్లు ఖర్చు చేస్తే రూ. 11 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండుగ పేరిట 1,734 రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేయగా, ఫిబ్రవరి నాటికి పూర్తి చేసిన 1,354 రోడ్లుకు సంబంధించి రూ. 143 కోట్లు విడుదల చేయాలని అధికారులు బిల్లులు అప్లోడ్ చేస్తే, రూ.11 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. ఇప్పటికై నా పెండింగ్ పనులు పూర్తి చేసి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో టి.శంకర్, పి.భీమన్న, సిహెచ్. రాంబాబు, కె.పైడితల్లి, కె.సుదర్శన్, డి.నూకాలు, డి. దేముడు, ఎరకన్న తదితర గిరిజనులు పాల్గొన్నారు. రోడ్ల పనుల బకాయి బిల్లులను చెల్లించాలని డిమాండ్ -
హెచ్ఎంలుగా బాధ్యతలు.. 24 గంటల్లోనే రిటైర్డ్
అనకాపల్లి టౌన్: పదోన్నతి పొందిన 24 గంటల్లోనే ఇద్దరు ప్రధానోపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. శనివారం వీరిని భీమునిగుమ్మం పాఠశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడు అభినందించారు. అనకాపల్లి పట్టణం రామాపురం ఎంపీయూపీ స్కూలులో బీ కోటేశ్వరరావు, ఎస్. రాయవరం మండలం కొరుప్రోలు హైస్కూల్లో డీఏఎన్ మూర్తి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి అనూహ్యంగా పదోన్నతులు కల్పిస్తూ విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు కోటేశ్వరావుకు ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం, డీఏఎన్ మూర్తికి రేవుపోలవరం జెడ్పీ హైస్కూళ్లలో గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి రావడంతో వారిద్దరూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే విచిత్రంగా 24 గంటల్లోనే పదవీ కాలం పూర్తి కావడంతో ఒక రోజు హెచ్ఎంలుగా మిగిలిపోయారు. -
తల్లీ కొడుకులు అదృశ్యం
యలమంచిలి రూరల్: పట్టణంలోని రాంనగర్కు చెందిన యాదగిరి లక్ష్మణరావు భార్య సాయిలక్ష్మి, ఆరేళ్ల కుమారుడు రిషివర్థన్ బుధవారం నుంచి కనిపించడం లేదని పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. తాను డ్యూటీకి వెళ్లి, ఇంటికి వచ్చేసరికి తన భార్య, కుమారుడు కనిపించలేదని, చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 28న తాను విధులకు వెళ్లిన తర్వాత ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బ్యాగు పట్టుకుని కుమారుడితో సహా వెళ్లిపోయినట్టు చుట్టుపక్కల వారు చెప్పారని భర్త పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై కె.సావిత్రి మీడియాకు తెలిపారు. -
ఏడాది పాలనంతా మోసాలే
నక్కపల్లి/ఎస్.రాయవరం: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనంతా మోసాలు, కక్షసాధింపులకే సరిపోయిందని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు శోభాహైమావతి, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. శనివారం అడ్డురోడ్డులో పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది పాలనలో ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సూపర్సిక్స్ హామీలన్నీ సూపర్ మోసాలని తేలిపోయిందన్నారు. రూ.4 వేలకు పింఛను పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు గత ప్రభుత్వ హయాంలోనే రూ.3 వేలు చెల్లించిన విషయం మర్చిపోయారన్నారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు లిక్కర్ స్కాములు, ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి వారం రూ.3 వేల కోట్లు రుణాలు తెస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు. ఏడాదిలోనే రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చేశారన్నారు. కూటమి ఏడాది పాలనను ఎండగడుతూ మండల కేంద్రాల్లో ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. ఐదేళ్ల పాలనలో కార్యకర్తలను విస్మరించిన విషయాన్ని జగనన్న గుర్తించారన్నారు. రాబోయే రోజుల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తారన్నారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని మట్టికరిపించి వైఎస్సార్సీపీ తిరిగి విజయకేతనం ఎగుర వేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను ఏ స్థాయిలో గౌరవించాలో జగనన్న దిశానిర్దేశం చేశారన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం వల్ల నష్టపోయిన ప్రతి కార్యకర్త బాధను అర్థం చేసుకుంటున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో గుణపాఠం చెప్తామన్నారు. ఈ రోజు మీది కావచ్చు, మాకంటూ ఒక రోజు వస్తుందని కూటమి నేతలను హెచ్చరించారు. ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేక మహానాడులో జగనన్నను విమర్శించడమే పనిగా పెట్టుకుని తీర్మానాలు చేశారని ఎద్దేవా చేశారు. కడప గడ్డపై మహానాడు అట్టర్ఫ్లాప్ అయిందన్నారు. సమన్వయకర్త కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్సీ డీవి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏడాదిలోపే వచ్చేసిందని, దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే చాలన్నారు. కార్యక్రమంలో ఎస్.రాయవరం జెడ్పీటీసీ కాకర దేవి, ఎంపీపీ పార్వతి తాతారావు, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల అధ్యక్షులు చిక్కాల రామారావు, శీరం నర్సింహమూర్తి, బీసీ విభాగం జిల్లా నాయకులు పైలా రమేష్, కొణతాల శ్రీను, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, ధనిశెట్టి బాబూరావు, జిల్లా మహిళా నాయకురాలు లోచల సుజాత, మధువర్మ, రాజేష్ ఖన్నా, జగతా శ్రీను, డి. సాయిబాబా, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ -
ఏపీఐఐసీ నిర్వాసితులకు రూ.693 కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ
నక్కపల్లి: మండలంలో పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.693 కోట్లు చెల్లించనున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. శనివారం వారు తహసీల్దార్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులతో మాట్లాడారు. మండలంలో తీరప్రాంతం వెంబడి పలు పరిశ్రమలు రానున్నాయన్నారు. వీటివల్ల లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కంపెనీల కోసం భూములు ఇచ్చిన రైతులు,నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు, నివాసప్రాంతాలు ఖాళీ చేస్తున్నవారికి ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.693 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 151 ఎకరాల్లో రూ.209 కోట్లతో లేఅవుట్లు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, ఐదు సెంట్ల చొప్పున ఇంటి స్థలం పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.8.36 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. నిర్వాసితుల్లో 289 మంది విద్యావంతులు ఉన్నట్టు గుర్తించామని, వీరందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఒక్కొక్కరికీ రూ.30 వేలతో నైపుణ్యశిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు, నిర్వాసితులు పరిహారం చెల్లింపుల్లో జరిగిన అన్యాయాన్ని ఈ సమావేశంలో వివరించి, న్యాయం చేయాలని కోరారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి, న్యాయం చేస్తామని మంత్రి, కలెక్టర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
బెల్ట్ షాప్పై దాడి
అచ్యుతాపురం రూరల్: మండలంలోని మెలుపాక జగన్నాథపురంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇక్కడ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి 53 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రామాన్ని కలెక్టర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల ప్రాంతంలో మఫ్టీలో ఉన్న అధికారులను గుర్తించని విక్రయదారు వారి ఎదుటే మద్యం అమ్మకాలు చేయడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ‘కలెక్టర్ దత్తత గ్రామంలో బెల్ట్షాపు’ అనే శీర్షికతో ఇటీవల సాక్షిలో వచ్చిన కథనానికి అధికారుల్లో చలనం లేకపోవడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించారు. ఎంజేపురం బెల్ట్ షాపులో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. ఇక్కడ ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. దాంతో గ్రామ రైతులు మద్యానికి బానిసై ఏ విధమైన పనులు చేయలేకపోతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శ్రమించిన సొమ్మంతా మద్యం సేవించడానికే సరిపోతుందని, ఇంటికి చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన విలేకరి అక్కడకి చేరుకుని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా, మఫ్టీలో ఉన్న అధికారులు అతని మొబైల్ బలవంతంగా లాక్కొని చేతిపై గాయపరిచారు. అంతేకాకుండా మొబైల్లో అప్పటి వరకూ తీసిన ఫొటోలు డిలీట్ చేశారు. సదరు అధికారులు విలేకరిపై దురుసుగా ప్రవర్తించడంతో పలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా రాంబిల్లి, యలమంచిలి పరిధిలో టాస్క్ఫోర్స్, ఎకై ్సజ్ డిపార్ట్మెంట్ వారు దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యలమంచిలి ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తేజ తెలిపారు. 53 మద్యం సీసాలు స్వాధీనం -
ఐఐఎంవీలో ‘ఈపీజీడీపీఎం’ ప్రారంభం
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎం విశాఖపట్నం(ఐఐఎంవీ)లో రక్షణ రంగ అధికారులు, కార్యనిర్వాహకుల కోసం ఏడాది పాటు నిర్వహించే ‘ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఈపీజీడీపీఎం)’శనివారం ప్రారంభమైంది. హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ విశ్రాంత సీఎండీ హేమంత్ ఖత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ మౌలిక వసతులు, వందే భారత్ వంటి ఆవిష్కరణలు, 6జీ టెక్నాలజీ వైపు సాగుతున్న ప్రయాణంలో దేశ నాయకత్వ పాత్రను కొనియాడారు. ఐఐఎంవీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ డైనమిక్, టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా రక్షణ సిబ్బందిని సిద్ధం చేయడానికి ఈ కోర్సును రూపొందించినట్లు చెప్పారు. అడ్మిషన్స్ చైర్ ప్రొఫెసర్ ప్రశాంత్ ప్రేమ్కుమార్ నాయర్ మాట్లాడుతూ ఈ బ్యాచ్లో సగటు వయసు 38 సంవత్సరాలు కాగా.. 13 సంవత్సరాల పని అనుభవం కలిగిన వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ప్రోగ్రాం చైర్ ప్రొఫెసర్ బి.శ్రీరంగాచార్యులు మాట్లాడుతూ ఈ కోర్సు మాడ్యులర్ ఎంబీఏగా హైబ్రిడ్ ఫార్మాట్లో రూపొందించినట్లు చెప్పారు. డీన్ కావేరీ కృష్ణన్ మాట్లాడారు. -
పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా రోడ్డు నిర్మాణం
మాకవరపాలెం: ఏపీఐఐసీ భూమిలో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా యలమంచిలి నియోజకవర్గంలో పెదపల్లికి నూతనంగా రోడ్డు నిర్మించనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మండలంలోని రాచపల్లి ప్రాంతంలో 17 ఏళ్ల కిత్రం ఆన్రాక్ రిఫైనరీ నిర్మాణం కోసం అప్పట్లో 2,400 ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మిగిలిన మరో 309 ఎకరాల భూమిని నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణతో కలసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న భూమిని పరిశ్రమల స్థాపనకు కేటాయించనున్నట్టు చెప్పారు. అందుకు వీలుగా రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా రామన్నపాలెం జంక్షన్ నుంచి యరకన్నపాలెం మీదుగా యలమంచిలి నియోజకవర్గంలోని పెదపల్లి వద్ద హైవేను కలుపుతూ 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చామని, నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ రామారావు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ -
మరోసారి సీజీఆర్ఎఫ్ చైర్మన్గా సత్యనారాయణ
మహారాణిపేట: ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రసల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్గా బి.సత్యనారాయణ రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. శనివారం సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2022 నుంచి 2025 వరకు సత్యనారాయణ సీజీఆర్ఎఫ్ చైర్మన్గా సేవలందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో 1998 నుంచి 2022 వరకు పలు హోదాల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. 2022లో జిల్లా జడ్జిగా పదవీ విరమణ పొందారు. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో తీర్పులిచ్చారు. కాగా సత్యనారాయణ పునర్నియామకం పట్ల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు, కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, ఏపీ ఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.హరిబాబు(ఫైనాన్స్), సీజీఆర్ఎఫ్ సభ్యులు ఎ.మురళీకృష్ణ (ఇండిపెండెంట్), ఎస్.సుబ్బారావు (ఫైనాన్స్), బి.సులేఖరాణి (టెక్నికల్) హర్షం ప్రకటించారు. -
స్పాట్ వాల్యుయేషన్ నుంచి మినహాయించాలి
● డీఈవో గిడ్డి అప్పారావునాయుడుకు యూటీఎఫ్ వినతిఅనకాపల్లి : ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితంగా బదిలీ అయ్యే అవకాశమున్న స్కూల్ అసిస్టెంట్లను సప్లిమెంట రీ స్పాట్ వాల్యు యేషన్ నుంచి మినహాయించా లని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. జీవీఎంసీ విలీన గ్రామం కొప్పాకలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడుకు శనివారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 31, జూన్ 1, 2వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు బదిలీ వెబ్ ఆప్షన్ ఇచ్చుకునే పనిలో ఉన్నారని, వారందరికీ మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో స్పాట్ వాల్యుయేషన్ను రీ షెడ్యూల్ చేయాలని కోరారు. ఒక వైపు ప్రభుత్వమే బదిలీల షెడ్యూ ల్ని ప్రకటించి అవే రోజుల్లో పేపర్లను మూ ల్యాంకనం చేయాలని చెప్పడం సరికాదన్నారు. పేపర్లు దిద్దడానికి రాని ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయని అధికారులు చెప్పడంతో భయపడుతున్నారని వాపోయారు. -
పింఛన్ల పంపిణీ ప్రారంభం
కశింకోట/నక్కపల్లి: సామాజిక పింఛన్ల పంపిణీని హోం మంత్రి నక్కపల్లి మండలం ఉద్దండపురంలో, కలెక్టర్ కశింకోటలో శనివారం ప్రారంభించారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఉద్దండపురంలో మాట్లాడుతూ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే శనివారం నుంచి పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. మంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించారు. వారి ఇంట్లో స్వయంగా టీ తయారు చేసి అందరికీ ఇచ్చారు. కలెక్టర్ విజయ కృష్ణన్ కశింకోటలోని గవరపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నడవడానికి సహకరించక మంచానికే చాలా కాలంగా పరిమితమై ఉన్న తనకు వితంతు పింఛన్ స్థానంలో వికలాంగ పింఛన్ అందివ్వడానికి చర్యలు తీసుకోవాలని బాధితురాలు సూరిశెట్టి లక్ష్మీమణి విన్నవించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. డీఆర్డీఏ పీడీ శచీదేవి, మండల ప్రత్యేక అధికారి సుభాషిణి, ఎంపీడీవో వి.వి.రవికుమార్, తహసీల్దార్ జి.సత్యనారాయణ పాల్గొన్నారు. -
సబ్ జైలులో సౌకర్యాలపై ఆరా
● నిందితులతో మాట్లాడిన న్యాయమూర్తిఅనకాపల్లి టౌన్: స్థానిక సబ్ జైల్లో నిందితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవ అధికారి ధర్మారావు ఆరా తీశారు. పదో అదనపు జిల్లా జడ్జి నరేష్ ఆదేశాల మేరకు సాధారణ పరిశీలనలో భాగంగా సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి నిందితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్కు చూపించాలని జైలు అధికారులను ఆదేశించారు. బెయిల్ కోసం న్యాయ సహాయకులను ఉపయోగించుకోవాలని సూచించారు. జైల్ సూపరింటెండెంట్ కిరణ్, న్యాయ సహాయకులు తులసి, సాయిరాం, ఎంఎల్ఎస్సీ ప్రతినిధి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పేరు అబద్ధంకబ్జా నిజం!
● భూముల విలువ రూ. 50 కోట్ల పైమాటే! ● పంట నష్టపరిహారం, బీమా సైతం కాజేత ● ప్రశ్నిస్తే హోం మంత్రి పేరుతో బెదిరింపులు మోసగించి కాజేశారు.. ఈ భూములను సాగు చేసుకునేందుకు మా పూర్వీకులకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. వెంకటాపురం గ్రామానికి చెందిన ‘అబద్ధం’ అనే టీడీపీ నాయకుడు, జగన్మోహన్రావు అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేసి భూములను లాక్కున్నారు. ఒక్క పైసా లీజు ఇవ్వకపోగా పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వారి ఆగడాలకు తట్టుకోలేక ఏం చేయాలో తోచక భయంతో జీవిస్తున్నాం. మా దగ్గర పట్టాలు ఉన్నాయి. –తంతట సూర్యారావు, వెంకటాపురం, ఎస్.రాయవరం మండలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేరులోనే కాదు అక్రమ వ్యవహారాల్లోనూ ఓ టీడీపీ నేత సార్థక నామధేయుడినని నిరూపించుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం టీడీపీ నేత అమలకంటి అబద్ధం హోంమంత్రి అనితకు ముఖ్య అనుచరుడు. దళిత వర్గానికి చెందిన అనిత హోంమంత్రిగా ఉన్నప్పటికీ ఆమె అనుచరుడు మాత్రం నిరుపేద దళితుల భూములను ఆక్రమించి దర్జాగా సాగు చేసుకోవడం గమనార్హం. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములను ఆక్వా సాగు పేరుతో లీజుకు తీసుకుని అనిత ముఖ్య అనుచరుడు కాజేశారని బాధితులు వాపోతున్నారు. రూ.50 కోట్ల విలువ చేసే 103 ఎకరాల భూముల రికార్డులను విశాఖ ఆక్వాఫారానికి చెందిన జగన్మోహన్రావుతో కలిసి మార్పు చేసి తనపరం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. తమ భూములను తమకివ్వాలని కోరితే కేసులు నమోదు చేయించి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆక్రోశిస్తున్నారు. మరోవైపు ఈ భూముల రికార్డులన్నీ తారుమారు చేసి... పంట నష్టపరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, రాయితీలు పొందుతుండటం గమనార్హం. ఆక్వా సాగు పేరుతో.. ఎస్.రాయవరం మండలం వాకపాడు రెవెన్యూ పరిధిలోని 73, 74, 75, 77, 78, 344, 345, 346, 347, 348, 351, 352, 353, 354, 435, 438, 439, 441, 442, 443, 445 సర్వే నంబర్లలో సుమారు 103 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వం వీటిని సుమారు 30 ఏళ్ల క్రితం తంతట సూర్యారావు (పట్టానెం 41/98), దండా కొండయ్య (42/98), పెయ్యిల నాగరాజు (43/98), గారా నర్సింహులు, జల్లూరి అప్పారావు, దండా త్రిమూర్తులు, దండా అప్పన్న, దండా తాతబ్బాయి, గారా అప్పయ్యమ్మ, బీరా నాగన్న, గారా అప్పారావు, కొప్పిశెట్టి మాణిక్యం, కొప్పిశెట్టి అప్పారావు, కొప్పిశెట్టి అయ్యన్న తదితర స్థానిక పేద రైతుల పేరుతో డీ–ఫారం పట్టాలు మంజూరు చేసింది. అప్పటినుంచి వీరంతా ఈ భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేత ‘అబద్ధం’.. తనకు లీజుకు ఇస్తే ఆక్వా లాభాల్లో వాటా ఇస్తానని నమ్మబలికి పదేళ్ల క్రితం వారి నుంచి తీసుకున్నాడు. ఎమ్మెల్యే అనిత అండదండలతో 2014లో ఈ భూమిని 42 సబ్ డివిజన్లుగా విభజించి.. ఈ ప్రాంతానికి సంబంధం లేని విశాఖ ఆక్వాఫారానికి చెందిన జగన్మోహన్రావు తండ్రి వీరభద్రరావును తెరమీదకు తీసుకు వచ్చి అతని పేరున మ్యూటేషన్ (వెబ్ల్యాండ్లో) చేశారు. ఈ 42 సబ్ డివిజన్లకు 42 ఖాతా నెంబర్లు ఇచ్చారు. ఈ భూముల్లో ఆక్వా కాకుండా వరి సాగు చేస్తున్నాడు. తమ భూములకు లీజు చెల్లించాలని లేదంటే వెనక్కి ఇవ్వాలని కోరిన రైతులను బెదిరిస్తూ హోంమంత్రి సహకారంతో పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నాడు. పట్టాలున్నాయి.. ప్రభుత్వం మా పూర్వీకులకు ఇచ్చిన భూములను అబద్ధం అనే టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని భూముల్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారు. కేసులు బనాయిస్తున్నారు. మా దగ్గర పట్టాలు ఉన్నాయి.ఇద్దరూకలిసికబ్జా మా తాత, తండ్రులకు డీ–ఫారం పట్టాలు ఇచ్చారు. ఈ భూముల్లో గంటి, జొన్న సాగు చేసే వాళ్లం. పెట్టుబడులు పెట్టలేక ఆకుల జగన్మోహన్రావు అనే వ్యక్తికి లీజుకు ఇస్తే టీడీపీ నాయకుడు అబద్ధంతో కలిసి కబ్జా చేశారు. మా భూములు మాకు అప్పగించాలని కోరితే కేసులు పెట్టి వేధిస్తున్నాడు. మావద్ద ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. – దండా తాతబ్బాయి, వాకపాడు, ఎస్.రాయవరం మండలం దళితులకు చెందిన 103 ఎకరాలను కాజేసిన టీడీపీ నేతనేటి నుంచి రేషన్ డిపోల్లో సరకుల పంపిణీ 2న అల్లూరి పార్క్ వద్ద యోగా ప్రదర్శన కలెక్టర్ విజయ కృష్ణన్ మా భూములు మాకు అప్పగించాలి మాకు ఈ భూములు మినహా వేరే ఆధారం లేదు. వయసు పైబడటంతో కష్టంగా ఉంది. అబద్దం అనే నాయకుడు మా భూములు ఆక్రమించి సాగుచేస్తున్నాడు. మా భూములు మాకు అప్పగించి న్యాయం చేయాలి. –దండా మాణిక్యం, వాకపాడు – పెయ్యిల నాగరాజు, వాకపాడు -
రక్తసిక్తం.. భయానకం
విశాఖపట్నం: నర్సీపట్నం రక్తసిక్తమయింది.. రాత్రి పూట కత్తులు చేతపట్టి వెంటపడి దాడి చేయడంతో భయానక వాతావరణం నెలకొంది.. పైశాచికానందంతో వీడియో తీస్తూ, వికటాట్టహాసం చేస్తూ, ‘మా మామయ్య మధుని (కౌన్సిలర్ మధు) తిడతా వా’ అని ఓ రౌడీ షీటర్ రంకెలేయడం నర్సీపట్నంలో అదుపు తప్పిన శాంతిభద్రతలకు తార్కాణంగా నిలిచింది. నిందితుడు అప్పలనాయుడు టీడీపీ కార్యకర్త. స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన మరో ఆరుగురితో కలిసి వైఎస్సార్సీపీ నర్సీపట్నం యూత్ అధ్యక్షుడు, దళిత యువకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై శనివారం రాత్రి హత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. బలిఘట్టం నుంచి టిఫిన్ తీసుకువెళ్లేందుకు నర్సీపట్నం పాల్ఘాట్ సెంటర్కు వచ్చిన ఈశ్వరరావుపై పప్పల అప్పలనాయుడు బృందం రెండు బైక్లపై వచ్చి దాడికి దిగారు. సినీ ఫక్కీలో వీడియో తీస్తూ వెంటపడి కత్తులతో దాడి చేశారు. ప్రాణభయంతో పాల్ఘాట్ సెంటర్ నుంచి అబిద్ సెంటర్కు ఈశ్వరరావు పరుగులు తీశారు. మెయిన్ రోడ్డులో ఉన్న షాపులో దాక్కుంటే బయటకు లాక్కుని వచ్చి మరింత దారుణంగా కొట్టి చంపేందుకు కత్తులు తీశారు. ఈశ్వరరావు వారిని విదిలించుకుని మళ్లీ పరుగులు తీసి అంబేడ్కర్ విగ్ర హం వద్ద దాక్కున్నారు. సమాచారం అందుకున్న మొబైల్ కానిస్టేబుల్ హుటాహుటిన వచ్చి ఈశ్వరరావును కాపాడారు. కానిస్టేబుల్ ఆయనను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్చైర్మన్లు తమరాన అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణ, ఈశ్వరరావు అనుచరులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. సీఐ గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్వరరావు సంఘటన వివరాలను ఈశ్వరరావును అడిగి స్టేట్మెంట్ రికార్డు చేశారు. రౌడీ షీటర్ పప్పల అప్పలనాయుడు కొద్ది కాలం క్రితం బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావుపై హత్యా యత్నానికి పాల్పడినప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఈశ్వరరావును పరామర్శిస్తున్న పార్టీ నాయకులు స్పీకర్ ఇలాకాలో హత్యా రాజకీయాలు వైఎస్సార్సీపీ దళిత నేతపై కత్తులతో దాడి రౌడీ షీటర్ పప్పల అప్పలనాయుడు ఘాతుకం ఆరుగురితో కలిసి హత్యాయత్నం వెంటపడి దాడి చేస్తూ వీడియో చిత్రీకరణ రౌడీ షీటర్ అయ్యన్న కుటుంబానికి సన్నిహితుడు, టీడీపీ కార్యకర్త -
నచ్చిన చోట కొలువు కోసం పైరవీలు
మహారాణిపేట (విశాఖ): ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గడువు దగ్గర పడుతుండటంతో, తమకు నచ్చిన చోటకు పోస్టింగ్ల కోసం పైరవీలు ఊపందుకున్నాయి. కూటమి ప్రజా ప్రతినిధుల సిఫార్సులకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లోని కొంతమంది అధికారులు నిమగ్నమయ్యారు. నగరంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నగరంలో పోస్టింగ్లు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా భీమిలి, విశాఖ రూరల్, ఆనందపురం, పెందుర్తి, సీతమ్మధార తహసీల్దార్ పోస్టులకు మంచి డిమాండ్ ఉంది. వీటిని పొందేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఆరుగురు సిద్ధపడినట్టు ప్రచారం జరుగుతోంది. నిబంధనలివీ.. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం తెలిసిందే. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి స్థాన చలనం కల్పించాలి. మన్యం ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యమివ్వాలి. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయడమే కాకుండా అన్ని క్యాడర్లు, పోస్టుల్లో చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని, ఎంత కాలం ఒకే ప్రాంతంలో పని చేశారనేది లెక్కించాలి. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారికి, 40 శాతానికి మించి వైకల్యం ఉన్న ఉద్యోగులకు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే బదిలీల్లో ప్రాధాన్యమివ్వాలి. రెవెన్యూలో సిఫార్సులకే పెద్దపీట? ఉమ్మడి విశాఖలోని రెవెన్యూ శాఖలో అన్ని క్యాడర్లలో బదిలీలు విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ చేయాల్సి ఉంది. దీనిపై ఆయన ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కలెక్టర్లతో సమావేశమై చర్చించారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, తహసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర క్యాడర్ల బదిలీలపై తుది నిర్ణయం విశాఖ కలెక్టర్ తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయన కార్యాలయానికి 68 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇవి కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కూడా సిఫార్సు లేఖలు, ఫోన్లు వచ్చినట్లు సమాచారం. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లు విశాఖ జిల్లాలో పోస్టింగ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది నచ్చిన చోట పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కూటమి ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు పోస్టు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం -
అంతర్జాతీయ మోడలింగ్లో మెరిసిన విశాఖ చిన్నారి
అక్కిరెడ్డిపాలెం: షీలానగర్లోని బీవీకే స్కూల్లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల జినిషా అలికానా ‘సూపర్ గ్లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్’గా ఎంపికై ంది. ఈమె తండ్రి రాంబాబు అలికానా ఎయిర్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తుండగా, తల్లి కావ్య గృహిణి. జినిషా మొదటిసారిగా గాజువాకలో జరిగిన మెస్సీ ఈవెంట్లో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత గోవాలో జరిగిన కార్యక్రమంలో 54 మంది పోటీదారుల్లో రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటింది. ఆగస్టులో వియత్నాంలో నిర్వహించే అంతర్జాతీయ పోటీకి జినిషా ఎంపికై నట్లు ఆమె తండ్రి రాంబాబు తెలిపారు. గోవా ఆడిషన్లో జినిషా నెమలి వేషధారణలో చేసిన ప్రదర్శన పలువురి ప్రశంసలు పొంది, ఆమెను ఫస్ట్ రన్నరప్గా నిలబెట్టింది. వియత్నాంలో జరగనున్న పోటీలో జినిషా విజయం సాధించాలని ఆమె స్నేహితులు, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. -
అంగన్వాడీ భవనంపై కూలిన భారీ చింత చెట్టు
● పాక్షికంగా దెబ్బతిన్న కారు దేవరాపల్లి: మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రైవాడ పంచాయతీ శివారు శంభువానిపాలెంలో భారీ చింత చెట్టు.. పక్కనే ఉన్న అంగన్వాడీ భవనంపై కూలింది. ఆ సమయంలో అంగన్వాడీ కేంద్రం మూసి ఉండడం, పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే చింత చెట్టు కింద పార్క్ చేసిన గ్రామానికి చెందిన నాయుడు కారు పాక్షికంగా దెబ్బతింది. గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత పంట పొలాల్లో వర్షపు నీరు భారీగా చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. -
జూలై 9న గిరి ప్రదక్షిణ
సింహాచలం: సింహాచలం క్షేత్రంలో జూలై 9న గిరి ప్రదక్షిణ ఉత్సవం జరగనుందని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామన్నారు. గిరి ప్రదక్షిణ ఉత్సవం నిర్వహణపై శుక్రవారం దేవస్థానం వైదికులు, ఇంజినీరింగ్ అధికారులు, సెక్షన్ హెడ్లతో ఈవో ముందస్తు సమీక్ష నిర్వహించారు. జూలై 9న 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు, అలాగే జూలై 10న ఆలయ ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారని ఈవో అంచనా వేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం కొండచుట్టూ స్టాల్స్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు విషయంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులకు ముందుగానే లేఖలు రాయాలని సూచించారు. జీవీఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, ఫైర్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గిరి ప్రదక్షిణ ఉత్సవంలో దాతల సహకారం కూడా ఎంతో ముఖ్యమని ఈవో పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, మంచినీటి సదుపాయాల కోసం జీవీఎంసీ సహకారం తీసుకుంటామన్నారు. సమావేశంలో స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో ఎస్.రాధ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, ఈఈ రాంబాబు, ఏఈవోలు రమణమూర్తి, ఆనంద్కుమార్, పిల్లా శ్రీనివాసరావు, పంతం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు కె.మూర్తి, రాజ్యలక్ష్మి, సునీల్, పద్మనాభరాజు, త్రిమూర్తులు, పీఆర్వో నాయుడు పాల్గొన్నారు. ఏర్పాట్లపై దేవస్థానం ఈవో త్రినాథరావు సమీక్ష -
కార్మికురాలి ప్రాణం విలువ రూ.2.5 లక్షలు
ఎస్.రాయవరం: సాయి మైరెన్ పరిశ్రమలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కార్మికురాలికి రూ.2 లక్షల యాభై వేలు వెలకట్టి తల్లికి నష్టపరిహారం ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అన్నారు. పార్టీ నాయకులతో కలిసి అడ్డురోడ్డులో స్థానిక విలేకర్లతో ఆయన సమావేశమయ్యారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల బాలిక హులకా అనిత బుధవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. బాలిక మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పంచనామాకు విశాఖ కేజీహెచ్కు తరలించారు. అయితే విశాఖలో మృతురాలి తల్లిదండ్రులను మభ్యపెట్టి ఆ నగదు ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. బాలిక మృతికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడే మెరుగైన వైద్యం అందించాల్సిన పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందన్నారు. సకాలంలో వైద్యం అందిస్తే బాలిక మృతి చెందేది కాదన్నారు. పోలీసులు హత్యానేరంగా కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు ఎం.రాజేష్, చిరంజీవి, బాబ్జి తదితరులు ఉన్నారు. కుటుంబ సభ్యులను మభ్యపెట్టి అరకొర సాయం సీపీఎం నాయకుడు అప్పలరాజు -
కొండ కోనల్లో పెళ్లి సందడి
గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి నడయాడిన ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఆదివాసీ సామూహిక వివాహాలు జరగడం చాలా ఆనందంగా ఉందని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. వికాస తరంగణి–దానధర్మ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట గ్రామంలో శుక్రవారం 108 ఆదివాసీ గిరిజన జంటలకు సామూహిక వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 10 వేలమంది పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ నామజపంతో కృష్ణదేవిపేట గ్రామం మార్మోగింది. చినజీయర్ స్వామి నూతన వధూవరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఏనాడూ ఎవరి పెళ్లికి వెళ్లలేదని, ఇలా ఆదివాసీ సామూహిక వివాహాలకు హాజరుకావడం మొదటిసారని చెప్పారు. ఈరోజు శ్రీరాముడు జన్మించిన పునర్వసు నక్షత్రమని, మీరంతా సీతారాముల్లా ఆదర్శంగా దాంపత్య జీవితం గడపాలని ఆశీర్వదించారు. మీ బిడ్డలను దేశానికి, సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. వికాస తరంగణి– దానధర్మ సంస్థ ప్రతి జంటకు మూడు గ్రాముల బంగారు మంగళ సూత్రాలు ఉచితంగా ఇవ్వడంలో సంస్థ మాజీ అధ్యక్షులు రమేష్గుప్త, మల్లయ్య కృషి ఎంతో ఉందని తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన 10 వేలమందికి భోజనాలు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్ఐలు రామారావు, తారకేశ్వర్రావు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణదేవిపేటలో 108 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహాలు తాళిబొట్లు అందించి ఆశీర్వదించిన చినజీయర్ స్వామి -
విద్యార్థుల ప్రతిభకు తార్కాణమే ‘స్పెక్ట్రమ్’
విశాఖ విద్య: విద్యార్థుల అద్భుత ప్రతిభకు తార్కాణంగా ‘స్పెక్ట్రమ్’ప్రదర్శన నిలిచిందని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం బీఎఫ్ఎం, ఎంఎఫ్ఏ విద్యార్థుల వార్షిక చిత్రకళా ప్రదర్శన స్పెక్ట్రమ్– 2025ను శుక్రవారం వీసీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన శిల్పాలు, చిత్రాలు ఆయన తిలకించి అభినందించారు. విద్యార్థులు తమ అద్భుత ప్రతిభతో కళాఖండాలను తీర్చిదిద్దారని ప్రశంసించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిత్రకళా విభాగం విద్యార్థులను భాగస్వాములు చేస్తూ ఒక ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు తయారు చేసిన శిల్పాలు, చిత్రాలను నిశితంగా పరిశీలించి.. వాటి వెనుక ఉన్న భావాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విభాగాధిపతి డి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొని కారు బోల్తా
మాకవరపాలెం: రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొని ఓ కారు బోల్తాపడింది. నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళుతున్న కారు మండల కేంద్రంలోని బ్రాందీ షాపు వద్దకు వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ కనిపించకపోవడంతో ఢీకొని బోల్తా పడింది. కారులో ఉన్న నలుగురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కారును పక్కకు తీసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా తామరం జంక్షన్ నుంచి మాకవరపాలెం వరకు సుమారు కిలోమీరు మేర రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లకు హెచ్చరిక బోర్డులు, రేడియం స్టికర్లు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. -
10న విశాఖలో రాష్ట్రపతి పర్యటన
మహారాణిపేట: నగరంలో జూన్ 10వ తేదీన జరగనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో శుక్రవారం గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ టి.వి.కట్టిమణితో కలిసి వివిధ అంశాలపై సమీక్షించిన కలెక్టర్.. కార్యక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి జూన్ 10వ తేదీ ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలుకు చేరుకుంటారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమం అనంతరం, ఆమె రోడ్డు మార్గం ద్వారా విమానాశ్రయానికి చేరుకుని తిరిగి ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు మార్గంలో రానున్న నేపథ్యంలో సుందరీకరణ పనులు, మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జ్ఞానాపురం రైల్వే అండర్ పాస్ వద్ద నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒకవేళ వర్షం పడినట్లయితే మోటార్ల ద్వారా నీటిని తొలగించాలని జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐఎన్ఎస్ డేగా నుంచి కన్వెన్షన్ హాలు వరకు ఎలాంటి హోర్డింగులు, విద్యుత్ తీగలు, ఇతర అడ్డంకులు లేకుండా తొలగించాలని సూచించారు. ఏయూ కన్వెన్షన్ హాలు వద్ద సీటింగ్ ఏర్పాట్లు, ప్రోటోకాల్ నిబంధనలు పక్కాగా ఉండేలా చూసుకోవాలన్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రానున్న క్రమంలో ప్రత్యేక గ్రీన్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు మార్గంలో, ఏయూ కన్వెన్షన్ హాలు వద్ద పారిశుధ్య పరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీఆర్వో బిహెచ్ భవానీ శంకర్, ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాధుర్, అధికారులు పాల్గొన్నారు. -
‘అవినీతిపరుడు కొండనాయుడుకు పదవి ఇవ్వొద్దు’
బుచ్చెయ్యపేట: అవినీతికి పాల్పడుతున్న టీడీపీ రావికమతం మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు మళ్లీ పదవి ఇవ్వొద్దంటూ పలువురు టీడీపీ నాయకులు నిరసన గళమెత్తారు. ఈ మేరకు శుక్రవారం రావికమతం మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు వడ్డాదిలో టెంట్ వేసి రాజునాయుడుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లుగా కొండనాయుడు పార్టీ మండల అధ్యక్షుడిగా ఉంటూ అన్ని శాఖల అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అవినీతికి పాల్పడున్నాడన్నారు. పలు గ్రామాల్లో భూ దందాలు చేయడమే కాక అధికారుల బదిలీల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని విమర్శించారు. మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలను బెదిరించి తాను చెప్పిన పనులు మాత్రమే చేయాలని, ఎమ్మెల్యే తరువాత సూపర్ ఎమ్మెల్యేని తానేనని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. తనకు మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ప్రయత్నాలు చేస్తున్నాడని, అవినీతికి పాల్పడుతూ పార్టీ పరువు తీస్తున్న కొండనాయుడు కుటుంబ సభ్యులకు ఎటువంటి పదవులు ఇవ్వొందంటూ పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు భర్నికాన అప్పారావు, వై.చినసత్తిబాబు, పి.శ్రీనుబాబు, ఎం.దేముళ్లు, పి.అప్పన్న, సిహెచ్.రాజునాయుడు, ఎస్.రాము, మలిచెట్ల నాగేశ్వరరావు, బాబూరావు తదితరులు నినాదాలు చేశారు. రాజునాయుడు అవినీతిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుకు, ఎమ్మెల్యే రాజుకు ఫిర్యాదు చేశారు. -
అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్: రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్జెండర్గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు. రెండేళ్ల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్ సీఐ, ఎస్ఐలను అభినందించిన డీఎస్పీ విష్ణుస్వరూప్ వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు. అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
ఉపాధి కూలీగా సర్పంచ్..
కోటవురట్ల: అతనో గ్రామానికి సర్పంచ్. అయినా తెల్ల చొక్కా వేసుకుని ఊరకే కూర్చోలేదు. పని చేస్తేనే ఎవరికై నా ఆరోగ్యం, కుటుంబానికి ఆసరా ఉంటుందని భావించారు. నలుగురూ ఓ చోట చేరి పనిచేస్తే వారి మధ్య అనుబంధం, ఆత్మీయత పెరుగుతాయని తలంచారు. ఉపాధి హామీ పథకంలో ఓ కూలీగా జాబ్కార్డు తీసుకుని అందరితో పాటు తానూ పనిచేస్తూ ఆదర్శంగా నిలిచారు. అతనే చినబొడ్డేపల్లి గ్రామ సర్పంచ్ పైల శివరామ్. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్గా గెలిచారు. ఆనాటి నుంచి గ్రామ సమస్యలను పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరిస్తూ ఉపాధి హామీ పథకంలో చేరి నేటి తరం యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉద్యోగం లేదని నిరాశ నిస్పృహలలో కుంగిపోకుండా అందుబాటులో ఉన్న ఏదొక పని చేసుకుంటూ గొప్ప స్థాయికి చేరుకునేందుకు మరింత ఉత్సాహంగా మార్గాలను వెతుక్కోవాలని సర్పంచ్ శివరామ్ చెబుతున్నారు. -
మనుగడ ప్రశ్నార్థకం
గోవాడ సుగర్స్ఎమ్మెల్యే, ఎంపీ గార్లూ... ప్రభుత్వ సాయం ఏదీ ? ప్రభుత్వ సాయం అందించి గోవాడ ఫ్యాక్టరీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు, తర్వాత చెప్పిన ఎంపీ సీఎం రమేష్, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, బండారు సత్యనారాయణమూర్తి ఇప్పుడు ఫ్యాక్టరీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడంలేదు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి తేలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఓవరాయిలింగ్ పనుల్లో అవసరమైన మిషనరీలో మార్పు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఫ్యాక్టరీకి ఎంపీ, ఎమ్మెల్యే ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి సాయంగా ఇప్పించలేకపోయారు. వీరి నిర్లక్ష్యం, అలసత్వం వల్లే ఫ్యాక్టరీకి ఈ దయనీయ దుస్థితి పట్టింది. క్రషింగ్ నిలిచిన సందర్భంలో రైతులు అనేకసార్లు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేసినా ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి కనీస చర్యలు చేపట్టలేదు. ఫ్యాక్టరీని నష్టాల్లో చూపించి చివరికి మూసేయించాలన్న ఆలోచనలోనే ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం: రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక సుగర్ ఫ్యాక్టరీ గోవాడ చక్కెర కర్మాగారం. మొత్తం 11 సుగర్ ఫ్యాక్టరీలు ఉండగా ఇప్పటికే 10 కర్మాగారాలను మూసివేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన గోవాడ సుగర్స్.. గత చంద్రబాబు పాలనా కాలంలో కునారిల్లింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మళ్లీ ఈ కర్మాగారానికి ఆర్థిక సాయం చేసి కొత్త ఊపిరులు ఊదారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీరుతో ఈ సుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ ఫ్యాక్టరీపై 23 వేల మంది చెరకు రైతులు, 2 వేల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ సాయంలేక ఒకపక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా.. మరోపక్క పాత మిషనరీ కావడంతో తరుచూ యాంత్రిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ముగిసిన సీజన్లో పలుమార్లు క్రషింగ్కు అంతరాయం కలిగి చివరికి లక్ష్యం చేరుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.89 కోట్లను గ్రాంట్గా, వడ్డీ లేని రుణంగా ఎటువంటి షూరిటీ పెట్టుకోకుండా ఇచ్చి ఫ్యాక్టరీని ఆదుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఒక్కపైసా కూడా ఫ్యాక్టరీకి గాని, రైతుల చెరకు బకాయిలకు గాని సాయం చేయలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో నిండా మునిగిపోయింది. ప్రభుత్వం ఆదుకుంటేనే.. 2024–25 సీజన్కు సంబంధించిన చెరకు రైతుల బకాయిలు, కార్మికుల బకాయి జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఫ్యాక్టరీ ఉంది. వచ్చే సీజన్ క్రషింగ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.35 కోట్ల సాయం చేయాల్సి ఉంది. లేకుంటే వచ్చే సీజన్ను ప్రారంభించే పరిస్థితి లేదు. అంతేకాకుండా పంచదార ఉత్పత్తితో పాటు ఉప ఉత్పత్తులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఇథనాయిల్, డిస్టి లరీ పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉంది. గత వైస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కేంద్రం సహకారంతో రూ.102 కోట్లతో ఇథనాయిల్ పరిశ్రమ పెట్టడానికి కావలసిన అన్ని అనుమతులు తీసుకోవడం, కొంత నిధులు కూడా మంజూరుకు సిద్ధం చేయడం జరిగింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఆ ప్రాజెక్టును ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోపక్క డిస్టిలరీ పరిశ్రమకు రూ.300 కోట్లు తెస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే ఇటీవల ప్రకటించినా ఆ ప్రాజెక్టు కూడా ప్రకటనలకే పరిమితమైంది. కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు, నిధులు ఇవ్వడంతోపాటు నిలిచిపోయిన కో జనరేషన్ ప్లాంట్ను కూడా వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సుమారు రూ.50 కోట్లు అత్యవసరంగా ప్రభుత్వం విడుదల చేస్తే.. వచ్చే సీజన్ క్రషింగ్తోపాటు ఓవరాయిలింగ్ పనులు కూడా జరిగి ఫ్యాక్టరీ గాడిలో పడే అవకాశం ఉంది. ఎన్నికల ముందు చెరకు రైతులను, సుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇటువైపే చూడకపోవడంపై రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఫ్యాక్టరీ ఏడాదిలో ఒక్క పైసా కూడా అందని ప్రభుత్వ సాయం వైఎస్సార్సీపీ హయాంలో ఫ్యాక్టరీకి రూ.89 కోట్ల సాయం గోవాడ సహకార చక్కెర కర్మాగారం భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. వచ్చే క్రషింగ్ సీజన్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు చుట్టుముడుతున్నాయి. అత్యధిక షేర్ కలిగిన ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆదుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఫ్యాక్టరీ నడుస్తుందా.. మూసేస్తారా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. -
మామిడిని సహజంగా మగ్గించాలి
కశింకోట: ఆరోగ్యం కోసం కోత కోసిన మామిడి కాయలను సహజంగా మగ్గించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి.ప్రభాకర్ రైతులకు సూచించారు. మండలంలోని బయ్యవరంలో శుక్రవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పంటల సాగులో మెలకువలు, యాజమాన్య పద్ధతుల గురించి అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్వానికి వచ్చిన తర్వాత మామిడి కాయలను కోసి సహజంగా మగ్గించాలన్నారు. పక్వానికి రాకుండా కాయలు కోసి విషపూరితమైన రసాయనాలు కలిగిన కాల్షియం కార్బైడ్, తదితర మందులు వాడి మగ్గించరాదన్నారు. ఇలా అసహజంగా మగ్గిన పండ్లు తినడం ఆరోగ్యకరం కాదన్నారు. ఇవి ఎక్కువ నిల్వ కూడా ఉండవన్నారు. మామిడి సాగులో అధికారులు సూచించిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏటా ఆశించిన దిగుబడులు సాధించవచ్చునన్నారు. జీడిమామిడిలో యాజమాన్య పద్ధతులను వివరించారు. జిల్లా రిసోర్స్ కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకుడు సిహెచ్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విత్తన శుద్ధి పాటించి వరి సాగు చేపట్టాలన్నారు. భూమి సారవంతం కోసం ముందుగా పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు కలియ దున్నాలన్నారు. మండల వ్యవసాయ అధికారి ఎం.స్వప్న మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉద్యానవన విస్తరణ అధికారి ప్రవీణ మాట్లాడుతూ తమ శాఖ వద్ద కొబ్బరి, మామిడి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, వీటిని వర్షాల సమయంలో నాటుకోవాలని సూచించారు. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం భూసార శాస్త్రవేత్త బి.శ్రీహరిరావు మాట్లాడుతూ సహజ సిద్ధమైన ఎరువులు వాడడం ద్వారా భూముల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునన్నారు. పశువైద్య శాస్తవేత్త డాక్టర్ విజయరాజ్ఞి మాట్లాడుతూ పశుగ్రాసం సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. -
ఈనెల కూడా పప్పన్నం లేనట్టే!
అనకాపల్లి టౌన్: కందిపప్పు.. బలవర్ధకమైన ఆహార పదార్థం. చక్కగా ప్రొటీన్ అందిస్తుంది. అందుకే ధర ఎంతైనా కందిపప్పును కొంటారు. చౌకధరల దుకాణంలో కూడా దీనికే డిమాండ్ ఎక్కువ. అయితే గత ఐదు నెలలుగా రేషన్ షాపులలో కందిపప్పు, రాగులు, గోధుమ పిండి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాగులు, గోధుమల సంగతి పక్కన పెడితే కనీసం కందిపప్పును సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నెల కూడా కందిపప్పును అడగొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 7652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవి నిలిచిపోయాయి. కొన్ని నెలలు అరకొరగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఐదు నెలలుగా పూర్తిగా నిలిపివేసింది. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్షాపుల్లో కందిపప్పు పూర్తిగా కనబడదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర కేజీ పంచదార ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి 130 నుంచి 150 రూపాయలు పలుకుతుంది. కూటమి నేతలు అధికారంలోకి రాకముందు రేషన్ షాపులను బలోపేతం చేస్తామని నిత్యావసరాలైన బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగి పిండి తదితర వాటిని రాయితీపై అందజేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్ధాయిలో ఒక్క నెల కూడా పూర్తి స్ధాయిలో సరుకులు సరఫరా చేయకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలలుగా కందిపప్పు అందించని కూటమి ప్రభుత్వం 546 మెట్రిక్ టన్నుల సరఫరాకు ఎగనామం నాణ్యత కలిగిన బియ్యం ఇవ్వాలి పేదలకు ఇచ్చే కందిపప్పును ప్రభుత్వం ఐదు నెలలుగా నిలిపివేయడం దారుణం. అలాగే నాణ్యత కలిగిన బియ్యం ఇస్తే బహిరంగ మార్కెట్లో కొనాల్సిన అవసరం ఉండదు. –కొణతాల హరనాథ్బాబు, ఆమ్ ఆద్మీ జిల్లా కన్వీనర్ పేదవాడు ప్రొటీన్ ఫుడ్కు దూరం ప్రత్యేక కేంద్రాల ద్వారా సబ్సిడీ ధరకు కందిపప్పు పంపిణీ చేయాలి. పేదవాడికి కందిపప్పే పరమాన్నం. దీనిని సరఫరా చేయలేకపోవడం వలన పేదలు ప్రొటీన్ ఫుడ్కు దూరం అయినట్లే. –కోన లక్ష్మణ్, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు -
విజయనగరం వరకే రాయగడ ఎక్స్ప్రెస్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధి రాయగడ–విజయనగరం సెక్షన్లో జరుగుతున్న మూడో లైన్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను జూన్ 2,3 తేదీల్లో రద్దు చేశారు. మరికొన్నింటిని గమ్యం కుదించడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన రైళ్లు ● జూన్ 2న విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం(58538 / 58537) పాసింజర్, విశాఖపట్నం–కోరాపుట్(18512) బై–వీక్లీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–రాయ్పూర్–విశాఖపట్నం(58528/58527) పాసింజర్ ● జూన్ 3న కోరాపుట్–విశాఖపట్నం(18511) బై–వీక్లీ ఎక్స్ప్రెస్ గమ్యం కుదించిన రైళ్లు ● జూన్ 1 గుంటూరు–రాయగడ(17243) ఎక్స్ప్రెస్ విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది. జూన్ 2 రాయగడ–గుంటూరు(17244) ఎక్స్ప్రెస్ విజయనగరం నుంచి బయలుదేరుతుంది. రీషెడ్యూల్ చేసిన రైళ్లు ● జూన్1న ఎర్నాకుళం– టాటా (18190) ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. అలప్పుజ–ధన్బాద్(13352) బోకారో ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. ● జూన్ 2న దుర్గ్–విశాఖపట్నం(20829) వందేభారత్ ఎక్స్ప్రెస్ నాలుగున్నర గంటలు ఆలస్యంగా ఉదయం 10.15 గంటలకు, విశాఖపట్నం–దుర్గ్(20830) వందేభారత్ ఎక్స్ప్రెస్ 4గంటలు ఆలస్యంగా రాత్రి 6.50 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైళ్లు అంతే ఆలస్యంగా ఆయా స్టేషన్లను రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని డీసీఎం సూచించారు. -
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపునకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీజేఏసీ) అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక న్యూకాలనీ పాలూరి చిదంబరం మెమోరియల్ హాల్లో శుక్రవారం రెవెన్యూ సహా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు ఉద్యోగులు మూడు పీఆర్సీలు కోల్పోయారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కూటమి ప్రభుత్వానికి నివేదిక పంపామని, త్వరలో శుభవార్త వస్తుందని ఎదురుచూస్తున్నామన్నారు. ప్రతి ఏడాది 10 వేల నుంచి 15 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారని, వీరికి బకాయి పడ్డ రూ.6 వేల కోట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఆయన కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు రూ.20 వేల కోట్లు బకాయి ఉందని, వీఆర్వో గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. 2023 జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే నగదు చెల్లించి వైద్యం పొందే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించే వారని, పది సంవత్సరాలుగా ఇది జరగడం లేదన్నారు. ఉద్యోగులకు నేటి వరకూ డీఏ రూ.1100 కోట్లు, సరెండర్ లీవ్లు రూ.3 వేల కోట్లు, జీపీఎఫ్ రూ.500 కోట్లతో పాటు ఇతర అలవెన్సుల బకాయి ఉన్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బకాయి ఉందో పే స్లిప్పై నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఎస్సీ జిల్లా కార్యదర్శి వై.శ్రీరామ్మూర్తి, అధ్యక్షుడు వి.రత్నం, జిల్లా నాయకులు వాసు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు -
మైరెన్ పరిశ్రమ కార్మికురాలి అనుమానాస్పద మృతి
ఎస్.రాయవరం : సాయి మైరెన్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికురాలు అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికుల్లో ఆందోళన రేకెత్తింది. సుమారు 5 వందలకు పైగా కార్మికులు పని చేసే ఈ పరిశ్రమలో ప్రాథమిక స్థాయిలో వైద్యం అందివ్వకపోవడం, 10 కిలోమీటర్లలోపు దూరంలో ఉన్న నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేసరికి 19 ఏళ్ల యువతి మృత్యవాత పడడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ ప్రాంతానికి చెందిన హులకా అనిత (19) కొన్ని నెలలుగా పరిశ్రమలో పనిచేసేందుకు వచ్చి, ఇదే పరిశ్రమలో ఉన్న హాస్టల్లో ఉంటున్నది. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనితకు పరిశ్రమ యాజమాన్యం కనీసం ప్రాథమిక వైద్యం కూడా అందివ్వకపోవవడంతో బుధవారం రాత్రి మృతి చెంది ఉంటుందని ప్రజా సంఘాల నాయకుడు ఎం.అప్పలరాజు ఆరోపించారు. కాగా ఆమె అనారోగ్యమా, ఇతర కారణాలతో మృతి చెందిందా? అనే విషయాలు తెలియడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా పోస్టుమార్టం చేయాలని విశాఖపట్నం కేజీహెచ్కి మృతదేహాన్ని తరలించినట్టు అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావు తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యులు ఒడిశా రాష్ట్రం నుంచి రావాల్సి ఉండగా సాయంత్రానికి ఫిర్యాదు రాలేదని, వచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ చెప్పారు. ఈ విషయం గురువారం పరిశ్రమ పరిసర ప్రాంతాల వారికి తెలియడంతో కొందరు మీడియావారు, ప్రజాసంఘాల నాయకులు పరిశ్రమలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పరిశ్రమ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించకపోవడంతో స్థానికులు తహసీల్దార్ రమేష్బాబుకి ఫోన్లో సమాచారం అందించారు. తహసీల్దార్ ఆర్ఐ మణికంఠను వివరాలు తెలుసుకుని నివేదిక తీసుకురావాలని ఆదేశించడంతో ఆర్ఐ మణికంఠ పరిశ్రమలో విచారణ చేపట్టారు. జ్వరం ఎక్కువగా వచ్చిందని ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికి చనిపోయినట్టు చెప్పారన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికురాలిమృతి : సీపీసీ నేతల ఆరోపణ సాయి మైరెన్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికురాలు అనిత మృతి చెందిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ఆరోపించారు. బుధవారం రాత్రి సమయంలో కంపెనీలో మృతి చెందిన అనితను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెప్పారన్నారు. అనిత మృతి పట్ల సమగ్ర విచారణ జరిపించాలన్నారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 1979 వలస కార్మికుల చట్టాన్ని అమలు చేసి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కదిలివచ్చిన రెవెన్యూ యంత్రాంగం
మునగపాక: ‘రీ–సర్వే సవరణకు ముప్పుతిప్పలు’ పేరిట గురువారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ స్పందించారు. ఆమె ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కదిలి వచ్చి, బాధిత రైతును కలిసి వివరాలు తీసుకున్నారు. వెంటనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తన భూమికి సంబంధించి రీ–సర్వేలో జరిగిన లోపాలను సవరించి తనకు న్యాయం చేయాలని కోరుతూ మునగపాకకు చెందిన రైతు పీలా అప్పారావు అధికారుల చుట్టూ పదే పదే తిరిగినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో సైతం ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా తన సమస్య పరిష్కారం కాలేదని ‘సాక్షి’ వద్ద తన గోడు వినిపించుకున్నారు. గురువారం వెలువడిన వార్తా కథనానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆదిమహేశ్వరరావు, డీటీ శేషుబాబు, ఆర్ఐ పడాల్, సర్వేయర్, వీఆర్వోలు రైతు అప్పారావు పొలానికి చేరుకొని రికార్డులు అక్కడికక్కడే పరిశీలించారు. అప్పారావుకు సంబంధించిన భూమికి అతని పాస్ పుస్తకంలోని సర్వే నెంబరుకు సరిపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పారావుకు రీ–సర్వేలో ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. ‘రీ–సర్వే సవరణకు ముప్పుతిప్పలు’ వార్తకు స్పందన కలెక్టర్ ఆదేశాలతో బాధిత రైతును కలిసిన తహసీల్దార్ సమస్య పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ -
నిన్న ఇసుక.. నేడు రాళ్లు.. రేపు.?
సాగరతీరంలో కొన్ని గంటల్లో చోటుచేసుకున్న అనూహ్యమైన మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురుగా ఉన్న బీచ్ రోడ్డు ప్రాంతంలో బుధవారం కనిపించిన దృశ్యం.. ఒక్క రాత్రిలోనే పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఇసుక మేటలతో నిండి ఉన్న ఈ ప్రాంతం.. గురువారం ఉదయానికి కెరటాల తీవ్రతకు ఇసుకంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ గతంలో వేసిన రాళ్లు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో తీరంలోని కొబ్బరి వనాలకు కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గతంలోనూ ఇదే ప్రాంతం భారీగా కోతకు గురైన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన మట్టి, రాళ్లు డంపింగ్ చేసి తాత్కాలికంగా కోతను నివారించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి, తగిన చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. – ఏయూ క్యాంపస్ -
డీటీవో భవనం మెట్లు కూలి గాయపడ్డ సిబ్బంది
మహారాణిపేట: కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న జిల్లా ట్రెజరీ కార్యాలయం(డీటీవో) మెట్లు పాక్షికంగా కూలిపోయాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ట్రెజరీ కార్యాలయానికి వెళ్లే ఐరన్ మెట్లలో ఓ భాగం పడిపోయింది. ఈ ఘటనలో ఆఫీస్ సబార్డినేట్ ప్రసాద్ తలకు గాయం అయింది. తృటిలో ప్రాణాపాయం తప్పిందని సిబ్బది ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కురిస్తే భయం ఎప్పుడు వర్షం కురిసినా ట్రెజరీ కార్యాలయ పరిస్థితి దారుణంగా ఉంటుంది. 2014లో వచ్చిన హుద్హుద్ తుపానుకు పూర్తిగా ధ్వంసమైన భవనంలోనే ఇప్పటికీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వర్షం పడితే ఆ భవనంలో ఉండేందుకు భయపడే పరిస్థితి. కొన్ని రోజుల క్రితం ఇదే కార్యాలయానికి చెందిన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ పూర్తిగా కూలిపోయింది. సిబ్బంది విధుల్లో లేని సమయంలో ఆ సంఘటన జరగడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కార్యాలయ మార్పునకు చొరవచూపట్లేదు. పక్కనే పక్కా భవనం..! జిల్లా ట్రెజరీ కార్యాలయానికి నూతన భవనాన్ని జిల్లా పరిషత్ పక్కన నిర్మించారు. ఎలక్ట్రిక్, చిన్నచిన్న పనులు మినహా భవనం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ వివిధ సాంకేతిక కారాణాల పేరిట ఇంకా దీన్ని ప్రారంభించలేదు. తాజా ఘటనతో జిల్లా ట్రెజరీ అధికారి వై.సుధాకర్ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ దృష్టికి కార్యాలయ సమస్యను తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందించి కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఆటంకాలపై ఆరా తీశారు. -
మైక్తో దాడికి యత్నం
నర్సీపట్నం: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు ఆవేశంతో వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణపై మైకుతో దాడికి యత్నించడం కలకలం రేపింది. మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విమర్శలు, ప్రతి విమర్శలతో చాలెంజ్ చేసుకున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వైస్ చైర్మన్ రామకృష్ణ, కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు మధ్య మాట మాట పెరిగి, పరిస్థితి అదుపు తప్పింది. టీడీపీ కౌన్సిలర్ మధు మైక్తో వైస్ చైర్మన్ రామకృష్ణపైకి దాడికి యత్నించారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మైక్తో పదే పదే దూసుకు వచ్చిన టీడీపీ కౌన్సిలర్ మధును వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు, అధికారులు అదుపు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు సహకారంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గత ప్రభుత్వంలో పైసా పని జరగలేదని టీడీపీ కౌన్సిలర్ సిహెచ్.పద్మావతి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ రూ.25 కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేశారని చైర్పర్సన్, వైస్చైర్మన్ రామకృష్ణ బదులిచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నది ఐదేళ్లే, మీ కుటుంబానికి ప్రజలు ముప్పేళ్లకు పైగా అధికారం ఇస్తే ఇంకా రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు కడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైస్ చైర్మన్ రామకృష్ణ అన్నారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ మధు, వైస్ చైర్మన్ రామకృష్ణ మధ్య మాటా మాటా పెరిగింది. టీడీపీ కౌన్సిలర్ మైక్తో దాడికి యత్నించారు. కౌన్సిలర్లు, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మరింత కొట్లాట జరిగేది. టౌన్ సీఐ గోవిందరావు సిబ్బందితో రంగప్రవేశఽం చేయడంతో వివాదం సద్దుమణిగింది. సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ నిర్వాహకులను మార్చడం సరికాదు అజెండాలోని పదో అంశంపై వైస్ చైర్మన్ రామకృష్ణ, మాకిరెడ్డి బుల్లిదొర, మరో వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతో సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ నిర్వాహకులను మార్చడం సరికాదని కమిషనర్ సురేంద్రను నిలదీశారు. వాటర్ ప్లాంట్ నిర్వహణకు ఎలాంటి అగ్రిమెంట్ లేన్నందున స్వయం సహాయక సభ్యులకు నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నామని కమిషనర్ బదులిచ్చారు. సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చింది టీడీపీ, అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు, అగ్రిమెంట్ లేకుండా ఎలా ఇచ్చారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిలదీశారు. వారికి కనీసం నోటీసు ఇవ్వకుండా తొలగించటం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ కల్పించుకుని మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, ఈ అంశాన్ని పక్కన పెట్టాలని అధికారులకు సూచించారు. కౌన్సిలర్లు సౌజన్య, రామరాజు తమ వార్డుల్లోని సమస్యలను ప్రస్తావించారు. మున్సిపల్ వైస్ చైర్మన్పై టీడీపీ కౌన్సిలర్ దౌర్జన్యం వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం -
వర్షాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు
సింహాచలం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా సింహగిరికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం ఈవో వి.త్రినాథరావు గురువారం పరిశీలించారు. స్వామి దర్శనానికి భక్తులు వెళ్లే ఉచిత, రూ.100, రూ.300 క్యూల్లో నడుస్తూ ఎక్కడెక్కడ వర్షం నీరు వస్తోందో ఆయా ప్రాంతాలను గుర్తించారు. నీరు భక్తులపై పడకుండా ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ప్రసాదాల విక్రయశాలకు వెళ్లి, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. భక్తులతో మార్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ప్రసాదాల నిల్వ గది ఇరుగ్గా ఉండటంతో, ప్రత్యామ్నాయ గదిలోకి మార్చాలన్నారు. ప్రసాదాల నాణ్యతలో అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. -
యాంత్రీకరణ సాగు లాభదాయకం
కశింకోట: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధం కావాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. మోహనరావు కోరారు. యాంత్రీకరణతో వ్యవసాయం చేపట్టడం ద్వారా పని వేగం కావడంతోపాటు ఖర్చు తగ్గుతుందన్నారు. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖల సహకారంతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు సంబంధించి సలహాలు, సూచనలను శాస్త్రవేత్తల ద్వారా రైతులకందించే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి. ప్రభాకరరావు మాట్లాడుతూ ఖరీఫ్లో మెట్ట ప్రాంతాల్లో కూరగాయల సాగు లాభదాయకంగా ఉంటుందన్నారు. పండ్ల తోటల పెంపకం, ఇతర ఉద్యాన వన పంటల వైపు రైతులు చొరవ చూపాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ గౌరి మాట్లాడుతూ చెరకు సాగులో విత్తన శుద్ధి చేసుకొని నాటాలన్నారు. పంట మార్పిడి చేస్తుండటం వల్ల ఎర్రకుళ్లు, పశుపాకు తెగుళ్లు నివారించవచ్చునన్నారు. బెల్లం తయారీలో అనారోగ్య కారక మందులు వినియోగించొద్దన్నారు. జిల్లా రిసోర్స్ కేంద్రం అధికారులు సీహెచ్. సుబ్రహ్మణ్యం, పి. శ్రీధర్ పంటల సాగులో రైతులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఏవో ఎం. స్పప్న మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులు రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు. బీసీటీ కేంద్రం భూసార శాస్త్రవేత్త మట్టి పరీక్షలు ప్రాధాన్యం గురించి వివరించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి రాజ్ని, కశింకోట, వెదురుపర్తి, తేగాడ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహనరావు -
విద్యుత్ లైన్ ఏర్పాటులో ఉద్రిక్తత
పెదపూడిలో అధికార పార్టీ కుట్ర ●సాక్షి కథనానికి స్పందించిన అధికారులుబుచ్చెయ్యపేట: మండలంలోని పెదపూడిలో విద్యుత్ లైన్ ఏర్పాటులో ఉద్రిక్తత ఏర్పడింది. ఐదు గ్రామాలకు 24 గంటల పాటు కరెంట్ సరఫరా కోసం రోడ్డుకు ఎడమ వైపు విద్యుత్ లైన్ వేయగా, పెద్దపూడిలో మాత్రం అధికార పార్టీ నాయకులు కుట్రపూరితంగా చెట్లను తొలగించడానికి కుడి వైపునకు మార్చాలని అధికారులపై ఒత్తిడి చేశారు. దానికి గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో మళ్లీ పనులు ఆగిపోయాయి. అంధకారంలో 5 గ్రామాలు అనే శీర్షికన బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం విద్యుత్ లైన్ కలపడానికి యంత్ర పరికరాలతో పెదపూడి వచ్చారు. సీతయ్యపేట నుంచి పెదపూడి, ఫంగిడి, ఎస్ఎల్నగర్, ఉప్పరగూడెం, చిన్నయ్యపాలెం గ్రా మాలకు విద్యుత్ స్తంభాలు, వైర్లు ఆరు నెలల క్రితమే వేశారు. పెదపూడి దగ్గరలో రెండు విద్యుత్ స్తంభాలను మాత్రం రోడ్డుకు అవతల(కుడి) వైపు మార్పు చేయాలని గ్రామానికి చెందిన ఒకరిద్దరూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో వందల ఏళ్ల నాటి చెట్లను తొలగించడానికి వారు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల వేసిన రెండు విద్యుత్ స్తంభాలను తీసి భారీ చెట్లు ఉన్న రోడ్డుకు అవతలవైపు మార్పు చేయాల్సిన అవసరమేంటని ఆగ్రహించారు. యంత్ర పరికరాలు పనులు చేయకుండా సర్పంచ్ గోకివాడ వరకృష్ణ, గ్రామస్తులు గోకివాడ నాయుడు, సాయి, నారాయణ, వీరునాయుడు, చిరంజీవి, బొట్టా శివ, ఆలేటి రామకృష్ణ, వియ్యపు సోమునాయుడు, రామునాయుడు, మీసాల అప్పారావు, మీసాల నూకరాజు, గోకివాడ దేముడు, రమణ, వియ్యపు ప్రవీణ్, కుంచం శివప్రసాద్, లాలం గంగరాజు, పోలిరెడ్డి దేముడు, కిల్లాడ బుల్లిబాబు, సాగిరాజు సన్యాశిరాజు, వర్మ తదితర గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పినట్టు చేస్తున్నారు తప్ప నిబంధనలు పాటించడం లేదని మండిపడ్డారు. గతంలో వేసిన విద్యుత్ స్తంభాలకే వైర్లు బిగించి కరెంట్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దాంతో సిబ్బంది చేసేది లేక యంత్రాలతో వెనుదిరిగారు. -
చిననందిపల్లిలో వైభవంగా మరిడిమాంబ జాతర
దేవరాపల్లి: మండలంలోని మరిడిమాంబ పండగ గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన కొయ్య రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలుత ఈ రథానికి గ్రామస్తులు పసుపు కుంకుమ సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ వాయిద్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, పులి వేషాలు జాతరలో విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వాకీటాకీలతో కమిటీ సభ్యుల పర్యవేక్షణ.... గ్రామ జాతరలో కమిటీ సభ్యులంతా పండగ ఏర్పాట్లతోపాటు ఎటువంటి అవాంతరాలు ఏర్పడిన తక్షణమే స్పందించేందుకు వాకీటాకీలను వినియోగించారు. జాతరలో ఇలా తొలిసారిగా వాకీటాకీలతో కమిటీ సభ్యులు కనిపించడంతో పండగకు హాజరైన భక్తజనం ఆసక్తిగా తిలకించారు. ఆకట్టుకున్న పులి, దేవతామూర్తుల వేషధారణలు -
అవినీతి, దోపిడీయే కూటమి ప్రభుత్వ ధ్యేయం
చోడవరం : కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయినా వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా మహానాడులో టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గు చేటని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. చోడవరంలో పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందని, ఈ ఏడాది కాలంలో హామీలేవీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మహానాడులో చంద్రబాబుకు మీరే హీరో అంటూ డబ్బా కొట్టుకున్నారు తప్ప ప్రజల కోసం ఏం చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తూ, నోటీసులు ఇవ్వకుండా భవనాలు కూల్చేస్తూ నానా ఇబ్బందులు పెడుతూ నిలదీసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారన్నారు. ఎన్ని కష్టాలైనా మా నాయకుడు జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన నిరంతరం వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. దీనిలో భాగంగానే జూన్ 4న వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చోడవరం పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, పెద్దసంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ప్రజలకు తెలియజేయాలన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో చిన్నచిన్న గోతులు ఉన్న రోడ్లనే తాము బాగు చేయించలేదని ఎన్నికల ముందు గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు ఇప్పుడు ఏడాది కాలంలో ఏ రోడ్డు బాగుచేయించారని ప్రశ్నించారు. వైస్సార్సీపీ హయాంలో నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు చేయకుండా వదిలేశారని, అధికారంలోకి వస్తే మేము చేయించేస్తామని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఇప్పుడు ఏమయ్యారని ధర్మశ్రీ ప్రశ్నించారు. రోజుకి రూ.లక్ష చొప్పున జిల్లా మంత్రులు, నాయకులకు కప్పం చెల్లించాల్సిన దోపిడీకి కూటమి ప్రజాప్రతినిధులు తెరతీశారని ధర్మశ్రీ ఆరోపించారు. మహానాడులో టీడీపీ సొంత డబ్బా హామీలు అమలు చేయకుండా సంబరాలు సిగ్గుచేటు జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో ఆందోళన వైఎస్సార్సీపీ పార్లమెంటు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ -
ప్రేక్షకుల రుణం తీర్చుకునే చిత్రం ‘థగ్ లైఫ్’
బీచ్రోడ్: ‘థగ్ లైఫ్’ఒక అద్భుతమైన సినిమా అని హీరో కమల్హాసన్ అన్నారు. నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో గురువారం చిత్ర యూనిట్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా కమల్హాసన్ మాట్లాడుతూ విశాఖపట్నం తనను ఎంతో ఆదరించిందన్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన తనకు ‘మరో చరిత్ర’చిత్రం తిరుగులేని అభిమానగణాన్ని అందించిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ‘ఏక్ దుజే కేలియే’చిత్రం హిందీలో విజయం సాధించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతోగానో ఆనందించారన్నారు. ‘సాగర సంగమం’, ‘ఏక్ దుజే కేలియే’, ‘శుభసంకల్పం’వంటి చిత్రాలు షూటింగ్లు ఇక్కడే జరిగాయని, ఇది తన సొంత ఇల్లు లాంటిదని ఆయన పేర్కొన్నారు. మంచి కళ ఎక్కడ కనిపించినా తాను సెల్యూట్ చేస్తానని, అందులో ఎన్నో విషయాలు నేర్చుకుంటానని కమల్ అన్నారు. తాను కొన్ని చెడు సినిమాలు కూడా చేశానని, వాటిని ప్రేక్షకులు మరిచిపోయి కేవలం మంచి చిత్రాలనే గుర్తు పెట్టుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మంచి సినిమాలు అందించడం తన బాధ్యత అని అన్నారు. తాను నటించిన 15 తెలుగు చిత్రాల్లో 13 విజయవంతం అయ్యాయని, ఆ విజయాలన్నీ ప్రేక్షకుల వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. ప్లాప్లు మాత్రమే తన ఖాతాలో వేసుకుంటానన్నారు. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ‘థగ్ లైఫ్’చిత్రాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ‘థగ్ లైఫ్’చాలా గొప్ప చిత్రమని, శింబు అద్భుతమైన నటన కనబరిచారని, ఇది వరకు చూడని పాత్రలో ఆయన కనిపిస్తారని కొనియాడారు. అభిరామి కూడా అద్భుతంగా నటించారని, నాజర్తో తనది చాలా కాలం నాటి ప్రయాణమన్నారు. త్రిష నటన ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని, తామంతా కలిసి ఒక గొప్ప సినిమా చేశామని నమ్ముతున్నట్లు చెప్పారు. జూన్ 5న తాము అనుకున్నది కరెక్టో కాదో ప్రేక్షకులు సినిమా చూసి చెప్పాలని కోరారు. హీరో శింబు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని, ఈ చిత్రం కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఓజీ’సినిమాలో తాను ఒక పాట పాడానని, అది త్వరలోనే విడుదల కానుందని తెలిపారు. పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’చిత్రం కూడా త్వరలో విడుదల కానుందని, ఆ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ ‘వర్షం’సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్ తనకెంతో ఇష్టమైన నగరమని, ‘థగ్ లైఫ్’సినిమాలో కమల్ హాసన్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తాను ఇంద్రాణి అనే పాత్ర పోషించానని, ఆ పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందన్నారు.ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్హాసన్, త్రిష సందడి -
ఆయిల్పామ్ తోటలో గంజాయి డంప్
అనకాపల్లి: పోలీసుల వాహనాల తనిఖీల్లో భారీ స్థాయిలో గంజాయి నిల్వ గుట్టురట్టయింది. కారులో తరలిస్తున్న 150 కేజీల గంజాయి పట్టుబడగా, దీనిపై తమదైన శైలిలో విచారించగా, ఆయిల్పామ్ తోటలో నిల్వ చేసిన మరో 600 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతోపాటు మూడు ద్విచక్రవాహనాలు, ఒక కారు, రూ.2500 స్వాధీనం చేసుకుని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున రోలుగుంట, కొత్తకోట ఎస్ఐలు పి.రామకృష్ణారావు, ఎం.శ్రీనివాసరావు రోలుగుంట మండలం కొంతలం–అడ్డసరం గ్రామాల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మూడు ద్విచక్ర వాహనాలు, కారులో తరలిస్తున్న 150 కేజీలు గంజాయి పట్టుకున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా రోలుగుంటకు చెందిన వియ్యపు గోవింద్ ఆయిల్ పామ్ తోటలో మరో 600 కేజీల గంజాయి నిల్వ చేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గోవింద్తోపాటు మాకవరపాలెం మండలానికి చెందిన బంగారు అప్పలనాయుడు ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కలిమేలలో పాపులు వెంకటేష్ వద్ద 750 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. నాలుగు రోజుల క్రితం 600 కిలోల గంజాయిని తీసుకొచ్చి ఆయిల్ పామ్ తోటలో నిల్వ ఉంచారు. వీరికి రోలుగుంట మండలానికి చెందిన తమరాన వెంకట శ్రీనివాసరాజా, కడిమి రాకేష్, బొడ్డు నానాజీ, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మారిగెల లక్ష్మణ్ రెడ్డి, మడుల శివ కుమార్ సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కారులో సీలేరు, మారేడిమిల్లి – తుని ద్వారా రోలుగుంటకు దఫాదఫాలు గంజాయి రవాణా చేస్తున్నారు. తాజాగా 150 కేజీల గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గతంలో వియ్యపు గోవింద్పై నాలుగు, నల్లబిల్లి అంజిబాబుపై రెండు గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. అనంతరం గంజాయి కేసులో ప్రతిభ కనబర్చిన రోలుగుంట, కొత్తకోట పోలీస్లకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. మొత్తం పట్టుబడిన గంజాయి విలువ రూ.37,50,000 ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా గుట్టురట్టు 750 కేజీల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం 9 మంది నిందితుల అరెస్టు -
4న వెన్నుపోటు దినం
నర్సీపట్నం: హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వచ్చే నెల 4న వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకుని శాంతియుత బైక్ ర్యాలీ చేపడుతున్నామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. ఈ ర్యాలీకి అనుమతించాలని గురువారం డీఎస్పీ పి.శ్రీనివాసరావును కలిసి లిఖిత పూర్వకంగా దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలు అమల్లో విఫలమైందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలను మరోమారు మోసం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన గళం వినిపించేందుకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శాంతియుత ర్యాలీ చేపడుతున్నామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నంలోని సీబీఎం కాంపౌండ్ నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్ వరకు ర్యాలీ సాగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. డీఎస్పీని కలిసిన వారులో మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, లీగల్ సెల్ ప్రతినిధి, కౌన్సిలర్ మాకిరెడ్డి బుల్లిదొర, నాయకుడు చింతకాయల వరుణ్ ఉన్నారు. ర్యాలీకి అనుమతించాలనిడీఎస్పీకి మాజీ ఎమ్మెల్యే గణేష్ వినతి -
ఎన్టీఆర్కు నివాళి
తుమ్మపాల/అనకాపల్లి: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ కలెక్టరేట్లో బుధవారం ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య, సంక్షేమ పథకాల సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు సుబ్బలక్ష్మి, కె.మనోరమ, జిల్లా గణాంకాధికారి జి.రామారావు, డీఎస్వో కె.ఎల్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
సినిమా థియేటర్ల ఆకస్మిక తనిఖీ
నర్సీపట్నం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు నర్సీపట్నంలో సినిమా థియేటర్లను ఆర్డీవో వి.వి.రమణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా పీవీఆర్ కాంప్లెక్స్లో ఉన్న నాలుగు థియేటర్లతో పాటు రాజు, బంగార్రాజు థియేటర్లను ఆయన తహసీల్దార్ రామారావుతో కలిసి పరిశీలించారు. టాయిలెట్లు, ఫైర్ సేఫ్టీ సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా క్యాంటీన్లో ధరలను అడిగి తెలుసుకున్నారు. ధరల పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. నిబంధనల మేరకు థియేటర్లలో సౌకర్యాలు ఉన్నదీ? లేనిదీ? చూశామన్నారు. తమ పరిశీలనలో గుర్తించిన అంశాల ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆర్డీవో తెలిపారు. ఎమ్మార్పీకి మించి తినుబండారాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మీ సేవలు చాలు.. వెళ్లిపోండి.!
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఫారిన్ సర్వీసుపై పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులందరినీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వర్సిటీకి చేరాయి. దీంతో రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ కాలేజీల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన వారంతా నేడో రేపో ఇక్కడ నుంచి రిలీవ్ కానున్నారు. ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్ కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో జరిగినందున ఉన్నత విద్యామండలి అధికారులు ఇందుకు అనుమతించారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో 40 మంది వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఏయూలో పనిచేస్తున్నారు. వీసీ కీలక నిర్ణయం ఆంధ్ర యూనివర్సిటీకి ఆర్థిక భారమవుతున్న వారిని పంపించేయాల్సిందే అని వర్సిటీలోని కొంతమంది కొంతకాలంగా పట్టుబడుతున్నారు. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ ఇటీవల క్యాంపస్ కాలేజీల డీన్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఎయిడెడ్ అధ్యాపకుల విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారిని పంపించేయాల్సిందేనని మెజార్టీ విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని వర్సిటీ నుంచి రిలీవ్ చేస్తామని ఈ నెల 19న కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు నివేదించారు. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ అధ్యాపకులంతా తదుపరి పోస్టింగ్ కోసమని కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆచార్యుల కొరత తీరేదెలా.? ఏయూలో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. వెయ్యి మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం రెండు వందల్లోపే రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. దీంతో ఎయిడెడ్, కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులే బోధనలో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 38 ఎయిడెడ్ అధ్యాపకులు రిలీవ్ చేస్తే.. ఆ స్థానాలను వేరే మార్గాల్లో భర్తీ చేయాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు వీసీ దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఏయూలో ప్రొఫెసర్ల కొరత వేళ.. ఎయిడెడ్ అధ్యాపకులకు ఉద్వాసన వీసీకి కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ విద్యార్థుల చదువులపై ప్రభావం 31 నాటికి రిలీవ్ చేస్తాం ఏయూలో పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులను వెంటనే పంపించాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎయిడెడ్ అధ్యాపకులను ఏయూలో కొనసాగించుకుంటారా? లేదా అని ఇటీవల డైరెక్టర్ నుంచి లేఖ వచ్చింది. దీనిపై తమ పరిధిలో నిర్ణయం తీసుకుని వారిని పంపించేస్తామని నివేదించాం. ఈ నెల 31న నాటికి ఎయిడెడ్ అధ్యాపకులందరినీ ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తాం. – ఆచార్య ధనుంజయరావు, రిజిస్ట్రార్ -
ఉపాధి కల్పించకుంటే మా గతేంటి?
● స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన ● కొనసాగిన అడ్మిన్ ముట్టడి.. స్వల్ప ఉద్రిక్తత ఉక్కునగరం(విశాఖ): ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నామని, ఉపాధి కల్పించకపోతే తమ కుటుంబాల గతేంటని స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ రోజు బుధవారం జరిగిన ఉక్కు అడ్మిన్ ముట్టడి కార్యక్రమంలో అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లి కాంట్రాక్ట్ కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం గేట్ల దిగ్బంధానికి కార్మికులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అడ్మిన్ భవనం వద్దకు చేరుకున్నారు. ఒకేసారి బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త తోపులాట నెలకొంది. పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కార్మికులు పోలీసు వలయాన్ని దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంత మంది కింద పడిపోయారు. దీంతో యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంత కాలం పనిచేసిన తమను తీసేస్తే తమ కుటుంబాల గతేంటని ప్రశ్నించారు. సాయంత్రం వరకు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురు, శుక్రవారాలు కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శుక్రవారం రీజనల్ లేబర్ కమిషన్ చర్యల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ముట్టడిలో పాల్గొన్న నాయకులపై కేసు నమోదు ఉక్కు అడ్మిన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై స్టీల్ప్లాంట్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. స్టీల్ప్లాంట్ రాజభాష విభాగం జీఎం లలన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు వివరాలిలా ఉన్నవి. ఈనెల 20 నుంచి జరుగుతున్న స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో 27, 28 తేదీల్లో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేపట్టాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, కార్పొరేటర్ గంగారావు, సత్యనారాయణ, కె.ఎం.శ్రీనివాస్, సీఐటీయూ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కార్యదర్శి నమ్మి రమణ, జి.శ్రీనివాస్, ఆర్.టి.రాజుతో పాటు సుమారు 200 కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాలు చేసి రాకపోకలు సాగించే ఉద్యోగులకు ఇబ్బందులు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆటో బోల్తా పడి 12 మందికి గాయాలు
కశింకోట: కశింకోట–పెదపాడు రోడ్డులో బుధవారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. టి.అర్జాపురం నుంచి అచ్యుతాపురానికి కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి పక్కనున్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు. వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడి చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. సీఐ అల్లు స్వామినాయుడు అనకాపల్లి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. -
‘ఉపాధి’ బకాయిలు చెల్లించండి మహాప్రభో.!
రోలుగుంట: ఉపాధి వేతన బకాయిలు తక్షణం చెల్లించాలంటూ మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ శివారు లోసింగి, పనసలపాడు గ్రామాల్లో కూలీలు బుధవారం ఖాళీ క్యారేజీలతో వినూత్న నిరసన తెలిపారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.గోవిందరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల శ్రామిక కుటుంబాలకు రూ.8,500 కోట్ల మేర బకాయిలున్నాయన్నారు. దీంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఈ పథకం కింద పని చేసే దాదాపు 15 వేల మంది సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు అందలేదన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని వేసవి సమయంలో ఉపాధి పథకం పనులపై ఆధారపడిన పేదల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పథకం నిబంధనల మేరకు జరిగిన పనులకు 15 రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికై నా బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో పీడీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. -
అనకాపల్లిలో ఆపరేషన్ కగార్పై 2న సదస్సు
కె.కోటపాడు : సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో అనకాపల్లిలోని రోటరీ హాల్లో వచ్చేనెల 2న ఆపరేషన్ కగార్పై సదస్సు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. ఈ మేరకు కె.కోటపాడులో బుధవారం సదస్సు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో నెత్తుటి ఏరులు పారిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆపరేషన్ పేరిట మావోయిస్టులను ఏరివేసి, అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. 2005లో సల్వాజుడుం, 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో నరమేధంను సృష్టించి.. దానికి కొనసాగింపుగా ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. ఏపీతో పాటు ఐదు రాష్ట్రాల్లో 28 రకాలైన విలువైన ఖనిజాలు విస్తరించి ఉన్నాయని, ఈ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కేవలం వాటి కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టారన్న వాదన బలంగా ఉందన్నారు. ఈ సదస్సుకు మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని దొరబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లె దేముడుబాబు, వేచలపు కాసుబాబు, వేమల కన్నబాబు, శరగడం పరమేష్, పొంతపల్లి రామారావు, రెడ్డి అప్పలనాయుడు, వియ్యపు రాజు పాల్గొన్నారు. -
గంజాయి తరలింపుపై పోలీసుల దాడి
రోలుగుంట: కారులో గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ రామకృష్ణారావు, సిబ్బంది బుధవారం దాడి చేశారు. కొంతలం కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి కారుతో పరారయ్యేందుకు ముగ్గురు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు దాడి చేసి, కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, కానును సీజ్ చేశారు. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అంచానా. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒకరు పరారైనట్టు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన వారిలో అన్నవరం జిల్లా, మదనపల్లి మండలం, సస్పాతోట గ్రామానికి చెందిన పట్నం సురేష్(28), ఇదే మండలం, బి.కొత్తకోట గ్రామానికి చెందిన బంటుపల్లి కల్యాణ్(27), కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కిల్కోట అంతరంగ రోడ్డుకు చెందిన వి.గౌతమ్(38) ఉన్నారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించామని ఎస్ఐ చెప్పారు. ముగ్గురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ 20 కిలోల గంజాయి స్వాధీనం, కారు సీజ్ -
ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా కృష్ణారావు
అనకాపల్లి: ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ కె.కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అల్లూరి జిల్లా డీసీహెచ్ఎస్గా, పాడేరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహించి, ఫిబ్రవరి 21న అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి ఈఎన్టీ సర్జన్గా బదిలీపై వచ్చారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆదేశాల మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు జిల్లా ఇన్చార్జి డీసీహెచ్ఎస్గా బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్ కె.కృష్ణారావుకు ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు అభినంద నలు తెలిపారు. -
ఏఎంసీకి వ్యాపారవేత్త గుప్తా పార్థివ దేహం
అనకాపల్లి: స్థానిక ఉప్పవారివీధికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పుష్కల గ్యాస్ కంపెనీ యజమాని కె.ఎల్.ఎన్.గుప్తా (85) మంగళవారం రాత్రి అనారోగ్య కారణంగా తన స్వగృహంలో మృతి చెందారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుప్తా పార్థివ దేహాన్ని విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ (ఏఎంసీ)కి అందజేశారు. మృతుడి భార్య కె.అచ్యుతాంబ, మేనల్లుళ్లు విజయ్బాబు, కిరణ్ అనాటమీ హెచ్వోడీ డాక్టర్ రవీంద్ర కిషోర్కు గుప్తా మృతదేహాన్ని పరిశోధనల నిమిత్తం దానం చేశారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
తీరని భూ దాహం
● బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనపు భూ సేకరణ ● పెదతీనార్లలో 518,సీహెచ్ఎల్ పురంలో 198 ఎకరాలు ● రైతులతో అధికారుల మంతనాలు ● నేరుగా కొనుగోలుకు యత్నాలు ● ఎకరాకు రూ.37 లక్షలు ఇస్తామని బేరాలు ● ససేమిరా అంటున్న రైతులు నక్కపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి భూదాహం తీరడం లేదు. బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనపు భూసేకరణ చేస్తోంది. పోనీ పరిహారం విషయంలో న్యాయం చేస్తోందా అంటే అదీ లేదు. నోటిఫికేషన్ లేకుండా నేరుగా రైతుల వద్ద నుంచే కొని వారి నోట్లో మట్టి కొట్టేందుకు కుయుక్తులు పన్నుతోంది. బుధవారం ఏపీఐఐసీ అధికారులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వెల్లడైంది. తక్కువ భూమి సేకరించే గ్రామాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తూ, ఎక్కువ భూములు అవసరమైన చోట నేరుగా రైతుల నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డైరెక్ట్ పర్చేజ్ అయితే రైతులకు నష్టపరిహారం తప్ప ఇతర ప్యాకేజీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం సీహెచ్ఎల్ పురం రెవెన్యూ పరిధిలో 198 ఎకరాలు, పెదతీనార్ల రెవెన్యూ పరిధిలో 518 ఎకరాలు భూములు కావాల్సి ఉంది. తక్కువ భూ మి ఉన్న సీహెచ్ఎల్ పురంలో భూసేకరణ కోసం తాజాగా 4 (1) నోటిఫికేషన్ విడుదల చేశారు. 500 ఎకరాలు దాటి అవసరమున్న పెదతీనార్లలో మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయకుండా నేరుగా కొనుగోళ్ల పేరుతో రైతులతో మంతనాలు జరుపుతున్నారు. బల్క్డ్రగ్ పార్క్ కోసం సరిపడా భూములను గత ప్రభుత్వం కేటాయించింది. కూటమి ప్రభుత్వం పార్క్ విస్తరణ పేరుతో అదనంగా భూములు సేకరించడం పట్ల ఆయా గ్రామాల రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా యి. ఏపీఐఐసీ ద్వారా మండలంలో వేంపాడు, చందనాడ, అమలాపురం, డీఎల్ పురం, రాజయ్యపేట ల్లో ప్రభుత్వం 4500 ఎకరాలు సేకరించిన విష యం తెలిసిందే. వీటిలో గత ప్రభుత్వం 2 వేల ఎకరాలు బల్క్డ్రగ్ పార్క్కు కేటాయించింది. మిగిలిన భూములను కూటమి ప్రభు త్వం తాజాగా తెర మీదకు వచ్చిన ఆర్సిలర్ మిట్టన్ నిప్పన్ ఇండియా స్టీల్ప్లాంట్కు ఆగమేఘాల మీద కట్టబెట్టింది. రైతుల నుంచి వ్యతిరేకత బల్క్డ్రగ్ పార్క్కు సరిపడ భూములు కేటాయించినప్పటికీ పార్క్ విస్తరణ పేరుతో జానకయ్యపేట, సీహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక గ్రామాల్లో మరో వెయ్యి ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బల్క్డ్రగ్ పార్క్లో చిన్న చిన్న యూనిట్లు స్థాపించే పారిశ్రామికవేత్తల కోసమే తమ నుంచి అదనంగా భూములు సేకరిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. తాజాగా బుధవారం పెదతీనార్ల గ్రామస్తులతో ఏపీఐఐసీ ఎస్డీసీ అనిత సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలో 518 ఎకరాల భూమి అవసరమవుతోందని, బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనంగా సేకరిస్తున్నామని, నేరుగా కొనుగోళ్ల పేరుతో భూములు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామాల్లో మార్కెట్ విలువ ఎకరా రూ.15 లక్షలు ఉందని, దానిని రెట్టింపు చేసి, ఫలసాయంతో కలిపి ఎకరాకు రూ.37 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని, భూములు ఇవ్వాలని కోరారు. పెదతీనార్లలో 20 నుంచి 50 ఎకరాల భూములు కలిగిన భూస్వాములు ఎకరాకు రూ.60 లక్షలు చెల్లిస్తే భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. దీనిపై వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి కొంతమంది రైతులతో కలసి అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరు మాట్లాడుతూ పెద్ద రైతులను దృష్టిలో పెట్టుకుని భూముల ధర నిర్ణయించడానికి వీల్లేదన్నారు. ఈ భూములపై ఆధారపడి జీవించే వారికి 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, మేజర్లకు నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏర్పాటయిన రసాయన పరిశ్రమల వల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం అయితే భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. జానకయ్యపేట, చినతీనార్లలో రైతులు కూడా బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం అయితే భూములు ఇవ్వమంటూ నిరసన తెలియజేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సి వస్తే 4 (1) నోటిఫికేషన్ విడుదల చేసి 2013 భూసేకరణ చట్టప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ భూములపై ఆధారపడ్డ ఇతర వృత్తుల వారికి కూడా న్యాయం చేయాలన్నారు. -
విపత్తుల నివారణపై ప్రత్యేక చర్యలు
అనకాపల్లి: అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన ప్రతిస్పందన ద్వారా ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని, విపత్తుల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం జిల్లాలో పోలీస్శాఖ అఽధికారులతో విపత్తులపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తదితర ప్రమాదాలు సంభవించిన సమయంలో దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగహన కల్పించినట్టు చెప్పారు. విపత్తులు సంభవించిన సమయంలో పోలీసు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) ప్రకారం సమన్వయంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా విధులు కేటాయిస్తూ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ సహకారంతో అచ్యుతాపురం, పరవాడలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. విపత్తులను ఎదుర్కోడానికి అగ్నిమాపక శాఖ, వైద్య బృందాలు, ఎస్డీఆర్ఎఫ్/ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు లు సమష్టిగా కృషిచేయాలన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు అత్యాధునిక ఫైర్ సేఫ్టీ పరికరాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కె.చైతన్య, సీఐలు పాల్గొన్నారు. ఎస్సీ తుహిన్ సిన్హా -
ఏషియన్ కరాటే చాంపియన్ అంజనా శ్రీవేణి
పాయకరావుపేట: పట్టణానికి చెందిన విద్యార్థి ని ధూళి అంజనా శ్రీవేణి కరాటేలో దుమ్ము రేపింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించిన 9వ ఏషియన్ గోజుర్వు కరాటే చాంపియన్షిప్లో భారతదేశం తరపున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. ఈ అంతర్జాతీయ పోటీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజికిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, నేపాల్, ఇండోనేషియా వంటి పలు ఆసియా దేశాల నుంచి సుమారు వెయ్యిమంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అండర్–12 కేటగిరీలో పోటీ పడిన అంజనా శ్రీవేణి, తన అద్భుతమైన ప్రదర్శనతో సిల్వర్ మెడల్ను కై వసం చేసుకుని దేశానికి, రాష్ట్రానికి, పాయకరావుపేటకు గర్వకారణంగా నిలిచింది. పోటీ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆమెను తమిళనాడు కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ షీహాన్ ప్రమోష్ స్వయంగా కలిసి ఘనంగా సత్కరించారు. -
వ్యక్తిని రక్షించి.. యువకుడు మృతి
● రేవుపోలవరంలో విషాదంఎస్.రాయవరం: రేవుపోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడబోయే ప్రయత్నంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ విభీషణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్ ఇషాక్ మదీనా వలీ (20), షేక్ అలీషాలు అదేగ్రామానికి చెందిన షేక్ అహ్మదుల్లా ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కోసం బుధవారం రేవుపోలవరం తీరానికి వచ్చారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సముద్రంలోకి కొట్టుకు పోతున్నట్టు గమనించారు. ఒడ్డున ఉన్న మహిళ బిగ్గరగా అరవడంతో విన్న ఇషాక్ మదీనా వలీ, అలీషాలు సముద్రంలోకి వెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు. ఇంతలో రాకాసి అలలు పోటెత్తడంతో ఇషాక్మదీనావలీ కొట్టుకుపోయాడు.వెంటనే స్థానిక మత్స్యకారులు బయటకు తీసినప్పటికీ ప్రాణాలు నిలువలేదు. మృతదేహాన్ని నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
వాస్తవాలు చెప్పే దమ్ము లేదా?
మహారాణిపేట (విశాఖ): టీడీపీ మంత్రుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు గిరిజనం గురించి అవాస్తవాలు చెబుతున్నారని, అవగాహనలేమితో మాట్లాడుతున్నారా.. లేదా నిజం చెబితే ప్రజలు ఛీకొడతారని ముందే గ్రహించి ప్రజలను తప్పుదా రి పట్టిస్తున్నారా అని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ప్రశ్నించారు. మహానాడు వేదికగా జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ చిల్లర మాట లు మాట్లాడారని ఆమె మండిపడ్డారు. విశాఖలోని జెడ్పీ బంగ్లాలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వ చ్చిన తర్వాత దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న గిరిజనుల కోసం ఏడాది కాలంలో ఒక్క సంక్షేమ పథకమైనా ప్రత్యేకంగా అమలు చేశారా.. అని ఆమె నిలదీశారు. సూపర్ సిక్స్ వాగ్దానాలను అటకెక్కించారని, కనీసం గిరిజన రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రతి గిరిజనుడికి సంక్షేమ క్యాలెండర్ ప్రకారం పథకాలు అందిన విషయం నిజమా కాదా? అని ఆమె అన్నారు. బాకై ్సట్ జీవోను తెచ్చింది చంద్రబాబు కాదా? గిరిజన ప్రాంతంలో ఉన్న సంపదను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆనాడు జిందాల్ కంపెనీతో ఒప్పందం చేసుకొని బాకై ్సట్ జీవోను తీసుకొచ్చిన విషయం నిజమా? కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై జీసీసీ చైర్మన్, ఇతర నాయకులకు అవగాహన ఉందా? లేదా? అని నిలదీశారు. బాకై ్సట్ తవ్వకాలపై తీసుకొచ్చిన 97 జీవోను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన విషయాన్ని ఎందుకు మరిచిపో యారని నిలదీశారు. కాల్సైట్, బాకై ్సట్, లేటరైట్ గనులను అక్రమంగా తవ్వి సంపాదన సృష్టించుకో వాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు అధికారం చలాయించే విధానాన్ని రద్దు చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డేనన్నారు. గత టీడీపీ ప్రభు త్వం గిరిజనతరులకు కూడా స్థానిక సంస్థల ఎన్ని కల్లో పోటీకి అవకాశం ఇస్తే.. ఆ విధానాన్ని రద్దు చేసి స్థానిక సంస్థల్లో వంద శాతంగిరిజనులే పోటీ చేసే విధానాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చిన విషయా న్ని గుర్తు చేశారు. గిరిజనులకు మేలు చేయడం అంటే ఇది కదా అని ఆమె పేర్కొన్నారు. గిరిజన శాఖ మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు ఈ డీఎస్సీలో 2000 పోస్టులు ఇస్తున్నట్లు చెప్పారని, కానీ కేవలం 1023 పోస్టులు మాత్రమే కేటాయించి, ఎందుకలా తప్పుదారి పట్టిస్తున్నారని నిలదీశారు. వైఎస్ జగన్ హయాంలో గిరిజనులకు మహర్దశ డోలి మోతల గురించి గొప్పలు చెప్పుకోవద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డోలి మోతల నివారణ కోసం ప్రత్యేకంగా కనెక్ట్ పాడేరు పేరుతో ఒక ప్రాజెక్టును అమలు చేశారన్నారు. పాడేరు డివిజన్లో 1300కు పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని గుర్తించి వాటి నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకొని, అన్నీ సిద్ధం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి తామేదో చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తోందన్నారు. గిరిజన ప్రాంతంలో వైద్య సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేలా పాడేరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన మహనీయుడు ఎవరో చెప్పాలని, ఇటువంటి గొప్ప కార్యక్రమం చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా గిరిజనుల కోసం చేశారా? అని సుభద్ర నిలదీశారు. మహానాడు వేదికపై అన్నీ అబద్ధాలే.. ఏడాదిలో గిరిజన సంక్షేమానికి ఒక్క పనైనా చేశారా? కిడారి తదితర నేతల ప్రసంగాలపై నిలదీసిన జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర -
ప్రైవేటు బస్సును అడ్డుకున్న ఆర్టీసీ డీఎం
నర్సీపట్నం: టూరిస్ట్ పర్మిట్తో స్టేజ్ గ్యారేజ్ సర్వీసు చేస్తున్న ప్రైవేటు బస్సును ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. ప్రతి రోజు సాయంత్రం బయలుదేరుతున్న నర్సీపట్నం–హైదరాబాద్ బస్సును బుధవారం ఆర్టీసీ డీఎం ధీరజ్, సిబ్బంది నిలిపివేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకుని స్టేజ్ క్యారేజ్ సర్వీసు చేస్తున్నారన్నారు. అదే విధంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నారన్నారు. టూరిస్ట్ పర్మిట్ బస్సును స్టేజ్ క్యారేజ్ సర్వీసుగా తిప్పకూడదన్నారు. అందుకే అడ్డుకున్నామన్నారు. ఇకపై స్టేజ్ క్యారేజ్ తిప్పమని హామీ ఇవ్వడంతో వదిలిపెట్టామని డీఎం తెలిపారు. -
రీ–సర్వే సవరణకు ముప్పుతిప్పలు
అర్జీల గతి ఇంతేనా?● మూడుసార్లు దరఖాస్తు చేసిన రైతు ● 7 నెలలు దాటినా లభించని పరిష్కారంమునగపాక: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా సామాన్యుల సమస్యలు తీరడం లేదు. ఈ వ్యవస్థ మొక్కుబడిగా నడుస్తోందని, తమలాంటి వారికి న్యాయం జరగడం లేదని మునగపాకకు చెందిన రైతు పీలా అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ‘సాక్షి’కి తెలిపారు. మునగపాక పంచాయతీ కార్యాలయంలో గత ఏడాది అక్టోబర్ 19న తహసీల్దార్ ఆదిమహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో అప్పారావు రీ–సర్వేలో జరిగిన తప్పును సవరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల్లోగా సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ ఆరోజున చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అప్పారావు ఫిబ్రవరిలో రెవెన్యూ అధికారులను మరోసారి కలిసి తనకు న్యాయం జరగలేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 19న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో మరోసారి దరఖాస్తు చేశారు. అనంతరం వీఆర్వోను కలిసి తన ఫిర్యాదు గురించి వివరించారు. ప్రస్తుతం యాప్ ఓపెన్ కావడంలేదని వీఆర్వో చెబుతున్నారని, గత అక్టోబర్లో యాప్ పనిచేసిన సమయంలో తన సమస్యను పరిష్కరించి ఉంటే తన సమస్య తీరేదని అప్పారావు వాపోతున్నారు. రీ–సర్వే సవరణ కోసం తాను దరఖాస్తు చేసుకుంటే పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారే గాని సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారే గాని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి తనకు తగు న్యాయం జరిగేలా చూడాలని అప్పారావు కోరుతున్నారు. -
క్వారీ రోడ్డు కోసం కొండనే తొలిచేస్తున్నారు
తుమ్మపాల: అనధికార మైనింగ్ రహదారిపై బవులువాడ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ విజయకుమార్ రంగంలోకి దిగి పనులు నిలిపివేశారు. దీనిపై త్వరలో గ్రామసభ నిర్వహిస్తామని తెలిపారు. మండలంలో బవులువాడ రెవెన్యూ పరిధి రావుగోపాలరావు, జగనన్న కాలనీల వద్ద సర్వే నంబరు 70, 74, 75 కొండ మీదుగా నెల రోజులుగా చేపడుతున్న అనధికార మైనింగ్ రోడ్డును మంగళవారం ఆయన రూరల్ ఎస్సై రవికుమార్తో కలిసి పరిశీలించారు. కొండపై మూడు కిలోమీటర్ల మేర వేసిన రోడ్డు పనులు పరిశీలించి రావుగోపాలరావు కాలనీ వాసులతో మాట్లాడారు. కాలనీకి ఆనుకుని కొండపై రోడ్డు నిర్మించడం వల్ల కాలుష్యం పెరుగుదలతోపాటు బండరాళ్లు పడే అవకాశం ఉందని వాపోయారు. మార్టూరు రెవెన్యూ పరిధిలో నవీన్, రమణారెడ్డి క్వారీలకు తమ గ్రామం మీదుగా రాకపోకలు లేవని, కూటమి పార్టీ అండతో క్వారీ యాజమానులు దౌర్జన్యంగా కొండను తొలిచేస్తున్నారని ఫిర్యాదుదారులు కె.సత్తిబాబు, తదితరులు తెలిపారు. క్వారీ వాహనాల రాకపోకలకు గతంలో ఉన్న రోడ్డు వద్ద క్రమేణా నివాసాలు ఏర్పాటు కావడంతో ప్రత్యామ్నాయంగా కొండ మీదుగా రహదారి నిర్మాణానికి అంగీకారం తెలిపామని కొందరు కాలనీ వాసులు తెలిపారు. ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తహసీల్దారు త్వరలో గ్రామసభ నిర్వహిస్తామన్నారు. అనధికారిక రోడ్డు పనులుపై చర్యలు తీసుకోవాలని, జేసీబీలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని ఫిర్యాదుదారులు కోరగా, ప్రస్తుతానికి పనులు నిలిపివేయాలని, వాహనాలను తరలించాలని క్వారీ యాజమానులకు సూచించి వెనుతిరిగారు. ఆర్ఐ రమేష్, వీఆర్వో రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. బవులువాడ గ్రామస్తుల ఫిర్యాదుతో నిలిపివేసిన అధికారులు -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి మృతి
అచ్యుతాపురం రూరల్: గత నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంతాడ లోహిత్కుమార్ మంగళవారం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో పూడిమడకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే ప్రమాదంలో ఈరిగిల వివేక్ మృతి చెందడం పాఠకులకు విదితమే. ఇటీవల పదో తరగతిలో 565 మార్కులతో పాసైన విద్యార్థి లోహిత్కుమార్ రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో అతడి కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. రూ.10 లక్షలపైన అప్పులు చేసి ఖర్చు పెట్టి నెల రోజులుగా ఆస్పత్రిలో వైద్యం చేయించినా ప్రాణాలు దక్కలేదు. దాంతో చేతికందొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు పోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పూడిమడకలో విషాద ఛాయలు