Anakapalle District News
-
ఇంటర్ టాపర్స్కు సత్కారాలు
కశింకోట/రోలుగుంట: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో టాపర్స్గా నిలిచిన ఇద్దరు విద్యార్థినులకు అరుదైన గౌరవం లభిస్తోంది. కశింకోట మండలం తేగాడ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివి బైపీసీలో 983/1000 మార్కులు తెచ్చుకున్న కంట్రెడ్డి రాజులమ్మ సన్షైన్ స్టార్స్ పురస్కారానికి ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ దొండా చంద్రకళ తెలిపారు.ఈ నెల 15న విజయవాడలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్నట్లు చెప్పారు. ఆమెతోపాటు ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అభినందనలు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావునాయుడు, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఆర్. జయప్రకాష్లు కూడా అభినందించారు. ఎంపీసీ గ్రూపు నుంచి 986 మార్కులు తెచ్చుకొని ఉమ్మడి విశాఖ జిల్లా టాపర్గా నిలిచిన రోలుగుంట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మడ్డు గౌతమి కూడా ఈ నెల 15న అమరావతిలో జరగనున్న టాపర్స్ సత్కార్కు ఎంపికై ంది. తల్లిదండ్రులతో కలిసి రావాలని ఇంటర్ బోర్డు కమిషన్ కార్యాలయం నుంచి ఆదివారం ఆహ్వానం అందింది. కళాశాల ప్రిన్సిపాల్ అప్పలరాజు, గణిత అధ్యాపకుడు సీనియర్ లెక్చరర్ సహదేవుడు ఆమెను అభినందించారు. -
పాడేరు ఘాట్లో వాహనం బోల్తా
● 15 మందికి గాయాలు ● ‘ఫైర్’ అధికారుల తక్షణ స్పందనతో తప్పిన ప్రాణాపాయం మాడుగుల: పాడేరు రోడ్డులో ఏసుప్రభువు విగ్రహం టర్నింగ్ పాయింట్ వద్ద ఆదివారం తెల్లవారు 3 గంటల సమయంలో బొలెరో వాహ నం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. అయితే ఫైర్ అధికారులు వెంటనే స్పందించి బోల్తా పడిన వాహనాన్ని తప్పించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణనష్టం జరగలేదు. స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి రాజేశ్వరరావు కథనం ప్రకారం.. వీరంతా ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కొడవలస, సీతమామిడి గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట వలస వెళ్తున్నారు. దీంతో వాహనం అదుపు తప్పడంతో వీరికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ నుంచి క్షతగాత్రులను తమ వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి తీవ్రంగా గాయాలైన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. -
పగిలిన గుండెలు...
ఆదివారం మిట్ట మధ్యాహ్నం 12:30 గంటల సమయం..ఒకవైపు మండుతున్న సూర్యుడి భగభగలు..మరోవైపు సెగలు కక్కుతున్న వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులు...ఊపిరి సలపని పని...కడుపు ఆకలితో నకనకలాడుతోంది... కాసేపట్లో పని చాలించి ఓ ముద్ద తిని వద్దాం..అనుకుంటుండగా..ఒక్కసారిగా భూమి దద్దరిల్లిన శబ్దం. దిక్కులు పిక్కటిల్లేలా కార్మికుల హాహాకారాలు... క్షణకాలంలో తునాతునకలైన దేహాలు...పూర్తిగా కాలిపోయిన శరీరాలు... కాలిన గాయాలతో బాధితుల పెడబొబ్బలు... ఒక్కసారిగా భీతిగొలిపే దృశ్యాలతో ఆ ప్రాంతం రక్తకాసారంగా మారిపోయింది. ఏం జరిగిందో తెలిసేలోగానే ఎనిమిది మంది అక్కడికక్కడే బుగ్గయిపోయారు... మరో ఎనిమిది మంది క్షతగాత్రులుగా మారిపోయారు...కోటవురట్ల మండలం కై లాసపట్నం సమీపంలోని విజయలక్ష్మి ఫైర్ వర్క్స్లో సంభవించిన ఘోరప్రమాదం దృశ్యమిది... ● మధ్యాహ్నం 12.30 గంటలకు భారీగా పేలుడు ● ఎనిమిది మంది దుర్మరణం, మరో ఎనిమిది మందికి గాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం ● ప్రమాద సమయంలో కేంద్రంలో 16 మంది కార్మికులు ● విశాఖపట్నం, నర్సీపట్నం ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు ● పదేళ్ల క్రితం గోకులపాడులో ఇదే పరిశ్రమలో ప్రమాదం ● ఆ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం ● మళ్లీ దశాబ్దం తరువాత అదే ఘోర కలి ● భద్రతా తనిఖీల్లో లోపం...కార్మికులకు శాపం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. ప్రమాదంలో మృతులు1. దాడి రామలక్ష్మి (35), రాజుపేట 2. పురం పాప (40), కై లాసపట్నం 3. గుప్పిన వేణుబాబు (34), కై లాసపట్నం 4. సంగరాతి గోవిందు (40), కై లాసపట్నం 5. సేనాపతి పైడితల్లినాయుడు అలియాస్ బాబూరావు (60), చౌడువాడ 6. అప్పికొండ తాతబాబు అలియాస్ పల్లయ్య (50), కై లాసపట్నం 7. దేవర నిర్మల (38), వేట్లపాలెం 8. హేమంత్ మనోహర్ (20), భీమిలి కొంపముంచిన పండగ ఆర్డర్ గ్రామాల్లో వివిధ పండుగలు ఉన్నాయి. బాణసంచా సామగ్రి కావాలి అని ఆర్డర్ వచ్చింది. దీంతో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. సెలవయినా ఆదివారం కూడా పనిచేశారు. పని ఒత్తిడిలో నిప్పు రవ్వలు వచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రవ్వల వల్ల పేలుడు జరిగి ఉండవచ్చు. ఈ సంఘటనలో బాణసంచా కంపెనీ యాజమాని కూడా గాయపడ్డారు. –అప్పారావు, నాగరాజు మేనల్లుడు, కై లాసపట్నంఆదివారం సెలవయినా డ్యూటీకి వెళ్లి... ఆదివారం డ్యూటీకి సెలవు. అయినా పనులు ఉన్నాయని చెప్పడంతో నా భర్త డ్యూటీకి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసినా తిరిగి వెంటనే డ్యూటీకి వెళ్లారు. అక్కడ ఏమయ్యిందో తెలియదు కానీ పెద్ద శబ్దం రావడంతో భయపడ్డాము. ఆ తర్వాత కొద్ది సేపటికి ఫోన్ వచ్చింది. ఈ ప్రమాదంలో నా భర్త గోవిందు గాయపడ్డారని ఫోన్లో చెప్పారు. పరుగెత్తి కంపెనీ వద్దకు చేరుకున్నాము. అక్కడ పరిస్థితి చూస్తే చాలా భయం వేసింది. కొన్ని మృతదేహాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. నా భర్త ఎక్కడ ఉన్నాడా అని వెతికాను. చివరకు కనిపించారు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొని వెళ్లాము. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు పంపారు. –సియ్యాద్రి వరలక్ష్మి, గోవిందు భార్య, కై లాసపట్నంకేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు 1. జల్లూరు నాగరాజు(50), రాట్నాలపాలెం 2. సియాద్రి గోవింద్(38), కై లాసపట్నం 3. వేలంగి సంతోషి (44), సామర్లకోట 4. వేలంగి సారోని(19), సామర్లకోట 5. మడగల జానకిరామ్(55), కై లాసపట్నం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు... 1. గంపెన సూరిబాబు(40), కై లాసపట్నం 2. సంగరాతి శ్రీను(35), కై లాసపట్నం 3. వేలంగి రాజు (19), సామర్ల కోట)ప్రమాద స్థలంలో భీతావహ దృశ్యాలు... ఘటన సమయంలో మందుగుండు సామగ్రి దంచుతున్న హేమంత్ మనోహర్ అనే వ్యక్తి తునాతునకలయ్యాడు. భారీ పేలుడుకు తల, కుడి చేయి ఎగిరిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన ఏడుగురు శరీరాలు పూర్తిగా కాలిపోయి విగతజీవులుగా కనిపించారు. ఇక గాయపడిన 8 మందిలో నాగరాజు (52)కు 90 శాతం కాలిన గాయాలతో, జానకీరాంకు 60 శాతం కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కూలి డబ్బుల కోసం వెళ్లి..పనికెళ్లిన నాలుగు రోజులకే.. ప్రతిరోజూ అక్కడ 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేస్తారు. బాణసంచా కేంద్రంలో ప్రమాద ఘటన జరిగే సమయానికి 16 మంది మాత్రం ఉన్నారు. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే మంగళవారం కోటవురట్ల మండలంలో అన్నవరం, చౌడువాడ, పందూరు గ్రామాల్లో గ్రామ జాతర ఉత్సవాలు ఉండడంతో బాణసంచా ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో గత వారం రోజులుగా పని ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో అక్కడ పనిచేసే సామర్లకోటకు చెందిన ఒక కుటుంబం సంతకు వెళ్లేందుకు ఓనర్ నుంచి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వచ్చారు. దీంతో అక్కడ పనిచేసే 11 మందితో పాటు ఈ అయిదుగురూ ప్రమాదంలో గాయపడ్డారు. భీమునిపట్నం: భీమిలి సమీపంలోని రేఖవానిపాలెం పంచాయతీ మహాలక్ష్మీపురానికి చెందిన మెడిసి హేమంత్(24) ఇటీవల బాణసంచా తయారీ నేర్చుకున్నాడు. తెలిసిన వారి ద్వారా నాలుగు క్రితం కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా కేంద్రంలో పనికి వెళ్లాడు. బాణసంచా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో అశువులుబాశాడు. అతని తండ్రి మెడిసి సత్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి లేరు. అక్క స్వర్ణకల ఉన్నారు. తన కొడుకు ఇంటికి ఆధారంగా ఉంటాడని భావించామని.. త్వరలో వివాహం కూడా చేయాలని అనుకున్నామని.. ఇంతలో ఘోరం జరిగిపోయిందని తండ్రి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. అందరితో సరదాగా ఉండే హేమంత్ ఇకలేడన్న విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు విషాదం మునిగిపోయారు. సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల : పొట్టకూటి కోసం మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు వెళ్లిన పలువురు కార్మికులు ఆ మందుగుండుకే ఆహుతయ్యారు. బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం పేద కార్మిక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన విస్ఫోటనం ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలను మింగేసింది. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో గ్రామస్తులంతా ఇళ్లలో సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించి అగ్ని ప్రకంపనలు సృష్టించినట్టుగా చుట్టూ పొగ, మంటలు కనిపించాయి. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో గల బాణసంచా కేంద్రంలో సంభవించిన పేలుడు ధాటికి గ్రామస్తులు భీతావహులయ్యారు. మంటలు ఎగిసిపడుతుంటే ఆవైపు వెళ్లాలంటే భయం..మరో వైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైర్ ఇంజన్, 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిందిలా... కై లాసపట్నం గ్రామానికి చెందిన మడగల జానకీరాం తన తోడల్లుడు అప్పికొండ తాతబ్బాయి పేరున ‘విజయలక్ష్మి ఫైర్వర్క్స్’ మందుగుండు తయారీకి లైసెన్సు తీసుకుని 20 ఏళ్లుగా మందుగుండు తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. లైసెన్స్కు వచ్చే ఏడాది 2026 వరకూ గడువు ఉంది. దీపావళి పండగతో పాటు సమీప మండలాల్లో పల్లెల్లో జరిగే గ్రామ పండుగలకు వచ్చే ఆర్డర్లపై మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. కొత్త అమావాస్య నుంచి వరుసగా పల్లెల్లో పండగలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. వర్క్లోడ్ ఎక్కువగా ఉండడంతో కార్మికులు ఒత్తిడితో పనిచేస్తున్నారు. సరిగ్గా 12.30 గంటల సమయంలో ఓ కార్మికుడు మందును దంచుతుండగా ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. వారం రోజులుగా తయారు చేసిన మందుగుండు సామగ్రి మొత్తం అక్కడే ఉండడంతో ఒక్కొక్కటిగా క్షణాల్లో అంటుకుపోయాయి. పక్కనే ఉన్న పౌడర్పై అగ్గి రేణువులు తూలి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పనిచేస్తున్న కార్మికులు తేరుకుని తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో తీవ్రంగా కాలిపోయి 8 మంది కార్మికులు అక్కడికక్కడే మాడి మసైపోయారు. విస్ఫోటనం ధాటికి అక్కడ ఉన్న రేకుల షెడ్లు, రెండు చిన్న స్లాబ్ గదులు చెల్లా చెదురయ్యాయి. భూమి కంపించినట్టయి..పెద్దగా మంట రావడంతో గ్రామస్థులంతా అదిరిపడి ఒక్కసారిగా పరుగున వచ్చారు. వరహాలు అనే గ్రామస్తుడు ఫైర్ ఇంజిన్, 108కి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సీపట్నం, నక్కపల్లి, కోటవురట్ల, ప్రభుత్వ ఆస్పత్రి 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.సమీప నక్కపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నుంచి మూడు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. మంటలు అదుపు చేయడానికి సుమారు 4 గంటల పాటు సమయం పట్టింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని విశాఖ కేజిహెచ్కు తరలించారు. మైనర్ గాయాలతో ఉన్న వారికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఘటనా స్థలానికి కలెక్టర్.. ప్రమాదం జరిగిన గంటన్నర వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక కోటవురట్ల సీహెచ్సీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కోటవురట్ల ప్రభుత్వ ఆస్పత్రి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని వెంటనే విశాఖపట్నం కేజీహెచ్, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేసి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని పేలుడుకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంవీపీకాలనీ (విశాఖ)/కోటవురట్ల: కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని ఆదివారం రాత్రి ఆమె ఎంపీ సీఎం రమేష్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనలో మృతి చెందిన వారంతా ఐదేళ్లుగా ఆ బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్నారన్నారు. 2026 వరకు ఆ కేంద్రానికి లైసెన్స్ ఉందన్నారు. పేలుడు పదార్థం చేజారడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే విషయం ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న 16 మందిలో 8 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి కేజీహెచ్లోను, ముగ్గురికి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోను మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన 8 మందికి ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఎక్స్గ్రేషియాను ప్రకటించినట్టు తెలిపారు. మరో రూ.2 లక్షలు కేంద్రం నుంచి కూడా మంజూరవుతుందన్నారు. క్షతగాత్రులకు రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఆమె వెంట కలెక్టర్ హరింద్రప్రసాద్, కేజీహెచ్ ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఉన్నారు. కోటవురట్ల: ప్రమాద ఘటనలో మృతులంతా రెక్కాడితే కాని డొక్కాడని వారే కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కై లాసపట్నానికి చెందిన సంగరాతి గోవిందుకు ఇద్దరు పిల్లలు కాగా పాప ఇంటర్, బాబు 9వ తరగతి చదువుతున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్ను ఇవ్వాలని ఆలోచనతో గోవిందు స్థానికంగా ఉన్న మందుగుండు తయారీ కేంద్రానికి నాలుగేళ్లుగా పనికెళుతున్నాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతురాలు పురం పాప మూడేళ్లుగా ఇందులో పనిచేస్తోంది. ప్రమాదమని తెలిసినా కుటుంబానికి వేరే ఆధారం లేక పని కెళ్లి అనంతలోకాలకు పోయింది. మరో మృతుడు గుంపిన వేణుబాబు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పనికి వెళ్లకపోతే ఆ రోజు పస్తులే. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతుడు అప్పికొండ తాతబ్బాయి కాగా ఇతని పేరునే విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ లైసెన్సు ఉంది. ఇతని తోడల్లుడు మడగల జానకీరాం ఈ ఫైర్ వర్క్స్ను నడుపుతుండగా తోడల్లుడికి సాయంగా ఇందులో పనిచేస్తున్నాడు. చౌడువాడకు చెందిన శానాపతి బాబూరావు ఫైర్ వర్క్స్ యజమాని మడగల జానకీరాంకు మావ అవుతారు. అల్లుడికి సాయంగా ఉండడం కోసం ప్రతి రోజు ఉదయాన్నే చౌడువాడ నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రమాదంలో ఇతనితో పాటు ఇతని పెద్దల్లుడు, స్వయాన బావమరిది అయిన అప్పికొండ తాతబ్బాయి కూడా మృతి చెందడంతో ఈ కుటుంబంలో పెద్ద విషాదాన్ని నింపింది. మామా అల్లుళ్లు ఇద్దరూ మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మరో అల్లుడు ఫైర్ వర్క్స్ యజమాని అయిన మడగల జానికీరాం కూడా దాదాపు 40 శాతం కాలిపోవడంతో ప్రమాదస్థితిలో విశాఖలోని కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. బాణసంచా కేంద్రంలో బతుకులు బుగ్గి కై లాసపట్నంలో ఘోర విషాదం పొట్టకూటికి ప్రమాదకర పనిలో... -
బల్క్ డ్రగ్పార్క్కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో ర్యాలీ
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్య్సకారులు, ఉపాది కూలీలు శనివారం నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యుడు అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో మత్య్సకారులు, కూలీలు బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, ప్రాణాలే ముద్దు అంటూ పనిముట్లను పట్టుకుని నినాదాలు చేశారు. రాజయ్యపేట నుంచి హెటెరో కంపెనీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు, అప్పలరాజులతోపాటు, మత్య్సకార నాయకులు మాట్లాడుతూ తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ ప్రాంతాల్లో ప్రజలు వ్యతిరేకించిన బల్క్ డ్రగ్పార్క్ను రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. ఇప్పటికే పరవాడ, అచ్చుతాపురం, నక్కపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రమాదకర పరిశ్రమల వల్ల ప్రజలు క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మవ్యాధులతో బాధపడుతున్నారన్నారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభావిత గ్రామాల్లో గ్రామసభలు, ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయలేదన్నారు. ఆగ మేఘాల మీద భూములు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభించేశారని విమర్శించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండానే పనులు ప్రారంభించారని మండి పడ్డారు. నిరసనలో సీపీఎం మండల కన్వీనర్ రాజేష్, కార్యదర్సి మహేష్బాబు, విద్యాకమిటీ చైర్మన్ కాశీరావు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, జనసేన నాయకులు పిక్కిస్వామి, మత్య్సకార నాయకులు సోమేశ్వరరావు, అప్పలరాజు, నూకరాజు ఏడుకొండలు, భూలోక, వీరన్న పాల్గొన్నారు. -
ఘనంగా ఉరుసు ఉత్సవం
కశింకోట: మండలంలోని బయ్యవరం వద్ద వెలసి ఉన్న హజరత్ అన్సర్ మద్నీ ఔలియా దర్గా ఉరుసు షరీఫ్ (చందనోత్సవం) శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జిల్లాతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిస్సా, టాటా నగర్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ముస్లింలతోపాటు స్థానిక హిందూవులు బారులు తీరి దర్గాను దర్శించి ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు గుంపులుగా సంప్రదాయ వస్త్రధారణతో తరలి వచ్చి సంప్రదాయంగా చందనం పూసి చాదర్లు కప్పి గులాబీ పూలు జల్లి ప్రార్థనలు చేశారు. తీపి పదార్థాలు, ఖర్జూరం, పండ్లను ప్రసాదంగా నివేదించారు. ఉదయం గుసుల్ షరీఫ్ (చందనం పూయుట) నిర్వహించారు. సాయంత్రం పాతియాఖాని అనంతరం తబురుక్ (ప్రసాద వితరణ) చేశారు. దర్గా ముతవల్లి అబ్దుల్ మాకీం, కార్యదర్శి మహమ్మద్ అయాజ్, అనకాపల్లి జామియా మసీదు కమిటీ అధ్యక్షుడు పి.ఎస్.ఎన్ హుస్సేన్, మదీన మసీద్ అధ్యక్షుడు ఎస్.ఎ. దావూద్ అలీ తదితరులు దర్గాను దర్శించారు. దర్గాను అందంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా తీర్థ మహోత్సవం జరిగింది. అలంకరణ వస్తువులు, తిను బండారాలు, పూజా సామగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి. ఆకాశ చక్రాలు, రంగుల రాట్నం, ఫోం జారుడు బల్లలపై పిల్లలతో పాటు పెద్దలు ఆనందంగా తిరుగాడారు. డీఎస్పీ శ్రావణి, సీఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
సెక్యూరిటీ గార్డ్ కుమార్తెకు అత్యధిక మార్కులు
● ఇంటర్ ఫలితాల్లో కై ట్స్ విద్యార్థిని ప్రతిభ అచ్యుతాపురం రూరల్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కై ట్స్ కళాశాల విధ్యార్ధిని పాలెపు సుప్రియ (1000/988)మార్క్స్తో అనకాపల్లి జిల్లాకి ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థిని తండ్రి ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా, తల్లి దినసరి కూలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నా తన పిల్లలను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు పడే తపన సుప్రియ తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలనే పట్టుదలతో సుప్రియ బాగా చదివి ఇంటర్లో అనకాపల్లి జిల్లాకే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ రెడ్డి చిరంజీవి మాట్లాడుతూ సుప్రియకి ఫ్రీ అడ్మిషన్తో పాటు ప్రతి ఏటా రూ.10వేల ప్రోత్సాహకంగా అందజేస్తున్నట్టు తెలిపారు. ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే ఎటువంటి వారైనా అనుకున్నది సాదించవచ్చునని చిరంజీవి అన్నారు. తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. -
ఇంటర్ ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్ధుల ప్రతిభ
పాయకరావుపేట : శనివారం ప్రకటించిన ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ తెలిపారు. తమ కళాశాల నుండి 15 మందికి పైగా విద్యార్థులు 980 కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో ఆర్.ఎస్.ఎస్.నగేష్ 464/470, జి.అనూష 460/470, కె.యామిని జ్యోతిక 460/470, జి.లాస్యశ్రీ 460/470 మార్కులు, బైపీసీలో ఆర్.నాగ సూర్యభవ్య 429/440 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ ఎంపీసీలో ఎ.హర్షిత 988, ఎస్.మేఘన 986, బైపీసీలో ఎం.సత్య అక్షయ 986, సిహెచ్ పూర్ణ శివాని 984 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్ధులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, ప్రిన్సిపాల్ భానుమూర్తి, అకడమిక్ ఇంచార్జి డి.శ్రీలక్ష్మి, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వడగళ్ల వానతో అతలాకుతలం
అనకాపల్లి టౌన్/బుచ్చెయ్యపేట: జిల్లాలో పలుచోట్ల శనివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడు తమ ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం రెండు గంటల వరకు 35.6 డిగ్రీల సెల్సియస్తో ఎండ మండిపోగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులతో వాతావరణం అంతా చల్లబడిపోయింది. అనకాపల్లిలో సుమారు గంటసేపు కురిసిన వర్షం 25.8 మి.మీ గా నమోదైంది. ప్రారంభంలో కొద్ది సేపు వడగళ్లు పడ్డాయి. ఈ వర్షం వలన లక్ష్మీదేవిపేట పాత్రుడు కాలనీలో భారీ వృక్షంతో పాటు రెండు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఈ గాలికి విద్యుత్ వైర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టమే తప్పింది. గవరపాలెం నూకాంబిక ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ అమ్మవారి విద్యుత్ అలంకరణ సెట్ నేలకొరిగింది. ఈ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. గవరపాలెం పూర్తిగా మునిగిపోయింది. విజయరామరాజు పేట అండర్ బ్రిడ్జిలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది, బంగారుమెట్ట, ఎల్బీ పురం, విజయరామరాజుపేట తదితర గ్రామాల్లో వడగళ్లతో వర్షం కురిసింది. దీంతో జీడిమామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వడగళ్లు మామిడి కాయలపై పడితే మచ్చలు వచ్చి కాయలు దెబ్బతిని కుళ్లిపోతాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి, బుచ్చెయ్యపేటలో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం తెగిన కరెంటు తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు -
బుచ్చెయ్యపేటలో తప్పిన పెను ప్రమాదం
బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేటలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. బుచ్చెయ్యపేటకు చెందిన పాతాళ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మంగళాపురం గ్రామంలో తమ బంధువుల వివాహానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో శనివారం ఉదయం మంగళాపురం నుంచి తిరిగి వస్తూండగా నేతవానిపాలెం దాటిన తరవాత బుచ్చెయ్యపేట దగ్గరలో ఎదురుగా నడిచి వస్తున్న వ్యక్తిని తప్పించబోయి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొన్నాడు. విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. కారు నుజ్జునుజ్జు అవగా అందులో ఉన్న నలుగురు వ్యక్తులతో పాటు ఇద్దరు చిన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. కొత్తగా వేస్తున్న విద్యుత్ స్తంభం అవడం విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ స్తంభాన్ని ఆనుకుని గ్రామానికి సరఫరా అవుతున్న విద్యుత్ స్తంభం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫారం ఉంది. దీనిని ఢీ కొడితే మంటలు చెలరేగి పెద్ద ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు. రోడ్డుపై పడ్డ విద్యుత్ స్తంభాన్ని స్థానికులు పక్కకు తొలగించి వాహనాల రాకపోకలు సాగేలా చేశారు. -
డాక్టర్ను అవుతా..
జిల్లా ఫలితాలు ఇలా...జనరల్ ఫస్టియర్ 62.62 శాతం సెకండియర్ 72.98 శాతం వొకేషనల్ ఫస్టియర్ 55.97 శాతం సెకండియర్ 67.15 శాతం కశింకోట: వైద్యురాలిగా సేవలు అందించడమే తన ధ్యేయమని కంట్రెడ్డి రాజులమ్మ చెప్పింది. ఆమె తేగాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో చదివి బైపీసీలో 983/1000 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ నీట్ కోచింగ్ తీసుకుంటున్నానని, ప్రవేశ పరీక్ష రాసి పశు వైద్యాధికారి కావాలని భావిస్తున్నానన్నారు. రావికమతం మండలం గొండ గ్రామానికి చెందిన ఆమె తండ్రి నాయుడు, తల్లి మంగ వ్యవసాయదారులు. రాజులమ్మ టెన్త్లో 553 మార్కులు సాధించి బుచ్చెయ్యపేట మండలం సీతయ్యపేట హైస్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.బైపీసీ 9831000 -
అడ్డదారిలో బండరాళ్లు
● సామర్ధ్యానికి మంచి లారీల్లో తరలింపు ● టోల్ఫీజును ఎగ్గొట్టేందుకు అడ్డదారుల్లో ప్రయాణం ● రాళ్ల తరలింపు వెనుక కూటమి ప్రజాప్రతినిధులు ● కన్నెత్తి చూడని పోలీసు, రవాణా, మైనింగ్, విజిలెన్స్ అధికారులునక్కపల్లి: కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో బండరాళ్ల లారీలు దొడ్డిదారిలో రాకపోకలు సాగిస్తున్నాయి. జాతీయ రహదారి మీదుగా తీసుకెళ్లాల్సిన లారీలను టోల్ ఫీజు నుంచి తప్పించుకోవడం కోసమే డ్రైవర్లు అడ్డదారి పట్టిస్తున్నారు. అధికారులు, స్థానిక ప్రజల కళ్లు కప్పి రాత్రి పూట మారుమూల గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఫలితంగా రోడ్లు శిథిలమవుతున్నాయంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బండరాళ్ల వాహనాలు గ్రామీణ ప్రాంత ప్రజల రాకపోకల కోసం వేసిన ఇరుకు రోడ్లలో ప్రయాణిస్తూ బోల్తా పడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనంటూ ఆయా గ్రామాల వారు భయాందోళనలు చెందుతున్నారు. ప్రతి రోజు 70 నుంచి 100 బండరాళ్ల లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. లారీ నుంచి ఒక్క బండరాయి జారిపడినా పెను ప్రమాదమేనని వారు చెబుతున్నారు. పరిమితికి మించి సామర్ధ్యంతో ఎటువంటి వే బిల్లులు లేకుండా ప్రయాణిస్తున్న వాహనాలపై రవాణా, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాజమండ్రి నుంచి రాంబిల్లికి పెద్ద పెద్ద బండరాళ్ల లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాంబిల్లి సమీపంలో సముద్రంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నిర్మించే ఎన్ఏవోబీ నిర్మాణపు పనుల్లో ఈ బండరాళ్లను వినియోగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కూటమి నాయకుల అండతో తరలింపు ఈ బండరాళ్ల తరలింపు వెనుక కూటమి పార్టీలకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి సమీపంలో ఉన్న నల్లరాయి క్వారీల నుంచి బ్లాస్టింగ్ చేసి ఈ రాళ్లను రాంబిల్లి తరలిస్తున్నారని తెలుస్తోంది. కూటమి నేతల అండదండలు ఉండటం వల్లే లారీల్లో సాధారణ సామర్ధ్యం కంటే రెట్టింపు లోడు వేసి బండరాళ్లను తరలిస్తున్నారు. సందట్లో సడేమియాలా ఈ గ్రామాల పరిధిలో ఉన్న కొంతమంది కూటమి పార్టీలకు చెందిన చోటా కార్యకర్తలు లారీలను ఆపేసి బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉపమాక, నక్కపల్లి సమీపాల్లో ఇటీవల కాలంలో విలేకరులం, స్థానిక నాయకులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు 10మంది లారీ డ్రైవర్లను బెదిరించి రూ.3 వేల చొప్పున వసూలు చేసినట్టు తెలిసింది. పెనాల్టీ ఎగ్గొట్టేందుకే అడ్డదారులు సాధారణంగా మల్టియాక్సిల్, 10 టైర్లు కలిగిన లారీల్లో 40 టన్నుల బరువును వేసి రాకపోకలు సాగించవచ్చు. ఇటువంటి లారీలు సింగిల్ జర్నీకి రూ.760లు ఫీజు చెల్లించాలి. రెండువైపులా 24 గంటల లోపు ప్రయాణిస్తే రూ.1140 చెల్లించాలి. గత కొద్ది నెలలుగా రాకపోకలు సాగిస్తున్న లారీల్లో 80 టన్నుల బరువు కలిగిన బండరాళ్లను లోడ్ చేసి తరలిస్తున్నారు. ఇలా సామర్ధ్యానికి మించిన లోడుతో వెళ్తున్న లారీల నుంచి గతంలో వేంపాడు టోల్ ప్లాజా సిబ్బంది రూ.5 వేల నుంచి రూ.6 వేలు అదనంగా ఫీజు వసూలు చేశారు. టోల్ప్లాజాల వద్ద అదనంగా విధించే పెనాల్టీతోపాటు సాధారణంగా చెల్లించే టోల్ఫీజును ఎగ్గొట్టేందుకు బండరాళ్ల లారీలు అడ్డదారుల్లో ప్రయాణిస్తున్నాయి. వేంపాడు ఊళ్లో నుంచి అమలాపురం, చందనాడ, నర్సాపురం బుచ్చిరాజుపేట మీదుగా ఉపమాక వచ్చి అక్కడ నుంచి నక్కపల్లి జాతీయ రహదారిపైకి చేరుకుంటున్నాయి. ప్రభుత్వ పెద్దల జోక్యంతో నిలిచిన తనిఖీలు కొద్ది రోజుల క్రితం ఇలా సామర్ధ్యానికి మంచి ఎటువంటి వే బిల్లులు లేకుండా బండరాళ్లతో వెళ్తున్న లారీలను రవాణా, విజిలెన్స్ అధికారులు పట్టుకుని రూ. 36 వేల పెనాల్టీ విధించారు. తర్వాత కూటమి పెద్దల జోక్యంతో లారీలు ప్రయాణించే రూట్లో అధికారుల తనిఖీలు నిర్వహించడం లేదన్న వాదన వినిపిస్తోంది. తనిఖీలు చేయాల్సిన రవాణా, మైనింగ్, విజిలెన్స్, ఆర్ అండ్ బి, పోలీసు అధికారులకు నెలవారీ మా మూళ్లు అందుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శిథిలమవుతున్న రోడ్లు చిన్నపాటి రోడ్లపై బండరాళ్ల లారీలు రాకపోకలు సాగించడంవల్ల రహదారులు శిథిలమవుతున్నాయని, గోతులు పడి వేసిన కొద్దిరోజులకే పాడుతున్నాయంటూ ఆయా గ్రామాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండరాళ్ల లారీలే కాకుండా ఇతర లోడుతో వెళ్లే కొన్ని భారీ వాహనాలు, మినీ వ్యాన్లు, కార్లు కూడా ఇదే రూట్నలో రాకపోకలు సాగిస్తున్నాయని చెబుతున్నారు. ఈ లారీలు గ్రామాల మీదుగా వెళ్లడాన్ని నియంత్రించాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారు. -
హోం మంత్రి హోమం
● అంతా రహస్యం హోం మంత్రి అనిత ఇంటిలో నిర్వహిస్తున్న హోమం సాక్షి, అనకాపల్లి: హోం మంత్రి పదవిలో కొనసాగడానికి, పాప దోషాలు పోవడానికి నక్కపల్లి మండలం సారికవానిపాలెం గ్రామంలో గల తన నివాసంలో హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం హోమం చేయించుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిపిన ఈ కార్యక్రమానికి అతి ముఖ్యలైన టీడీపీ నాయకులు హాజరైనట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడం, మహిళలపై అఘాయిత్యాలు పెరగడంతో ఇటీవల ప్రభుత్వ పాలనపై ముఖ్యంగా హోం శాఖ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. హోమం జరిపించిన విషయాన్ని మంత్రి అత్యంత గోప్యంగా ఉంచారు. -
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులుగా ఇద్దరికి చోటు
విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)ని పునర్వ్యవస్థీకరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎంపీ గొల్ల బాబూరావుతో పాటు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడులకు సభ్యులుగా స్థానం లభించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ప్రకటించింది. అలాగే పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉండనున్నారు. రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. -
వైద్య సిబ్బంది సాహసం
దేవరాపల్లి: ప్రజల ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు దేవరాపల్లి పీహెచ్సీ వైద్యాధికారి ఇ.పూజ్య మేఘన శుక్రవారం రాత్రి పెద్ద సాహసం చేశారు. గిరిజన జనాభాతోపాటు శివారు గ్రామాలున్న వాలాబు పంచాయతీలో 45 ఏళ్ల లోపు వయసు వారిలో ఎంత మందికి సికిల్ సెల్ వ్యాధి ఉందో సర్వే చేయాల్సి ఉంది. ఏ ఊరు వెళ్లినా గిరిజనులు ఉండకపోవడంతో ఈ సర్వేకు ఆటంకం కలుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన వైద్యాధికారి పూజ్య మేఘన సర్వే పూర్తి చేయాలన్న సంకల్పంతో గిరిజనులు అందుబాటులో ఉండే రాత్రి పూట శుక్రవారం నాడు అటవీ ప్రాంతమైన వాలాబుకు పయనమయ్యారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లిన వైద్య సిబ్బంది అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడే ఉండి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యాధి వలన కలిగే అనర్ధాలను గిరిజనులకు వివరించారు. కాగా రాత్రి పూట తమ ఇళ్లకు వైద్యాధికారి సిబ్బందితో కలిసి రావడంతో అడవి బిడ్డలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. డాక్టర్ పూజ్య మేఘనతోపాటు ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ తదితరులు గ్రామానికి పాల్గొన్నారు. వారి అంకిత భావానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణం గిరిజన గ్రామాల్లో అర్ధరాత్రి వైద్య సేవలు -
ట్టడుగున నకాపల్లి
ఐఐటీ సాధించాలి.. యలమంచిలి రూరల్: ఇంటర్లో జిల్లాకు ఆశించిన ఫలితాలు రాలేదు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం నిరాశ కలిగించింది. రాష్ట్రంలో ప్రథమ సంవత్సరంలో 20వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 25వ స్థానం దక్కింది. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్లో 62.62 శాతం, సెకండియర్లో 72.98 శాతంతో జిల్లా వెనుకంజలో ఉంది. మొదటి సంవత్సరంలో 10,279మంది జనరల్ విద్యార్థులు పరీక్షలు రాయగా 6437 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో 9512 మంది పరీక్షలకు హాజరు కాగా 6942 మంది పాసయ్యారు. వొకేషనల్ సెకండియర్కు 2128 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1429 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ ఫస్టియర్లో 2174 మంది పరీక్షలు రాయగా 1217 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్లో 52 శాతం, సెకండియర్లో 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది స్వల్పంగా ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోల్చితే జిల్లా విద్యార్థులు రాణించలేకపోయారు. విద్యార్థుల జీవితాల్లో కీలకమైన ఇంటర్మీడియట్ ఫలితాలను పరిశీలిస్తే ఆశాజనకంగా లేకపోవడం కలవరపరుస్తోంది. గతేడాది కంటే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతంసత్తా చాటిన గురుకులాలు.. ప్రభుత్వ సెక్టార్లో ఉన్న వివిధ గురుకులాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఒకటి రెండు మినహా మిగిలిన గురుకులాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. ఫస్టియర్లో బీసీ రెసిడెన్షియల్ కాలేజీలు 95.36 శాతం, బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాలు 80 శాతం, కేజీబీవీలు 86.46 శాతం, మోడల్ స్కూళ్లు 80.06 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సెకండియర్లో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు 95.48 శాతం, అంబేడ్కర్ గురుకులాలు 88 శాతం, కేజీబీవీలు 90.68 శాతం, మోడల్ స్కూళ్లు 91.29 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకున్నాయి.కేజీబీవీ విద్యార్థులు భళా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థులు ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న ఇద్దరూ కేజీబీవీలో చదివినవారే. తేగాడ కేజీబీవీ విద్యార్థి కంట్రెడ్డి రాజులమ్మ 983, నక్కపల్లి కేజీబీవీలో చదివిన పిరాది భవాని 982 మార్కులు సాధించారు. రైతు కుటుంబానికి చెందిన రోలుగుంట ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని మడ్డు గౌతమి ఎంపీసీలో 986 మార్కులు సాధించింది. ●ఎస్.రాయవరం కేజీబీవీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ●కోటవురట్ల కేజీబీవీలో సెకండియర్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించగా ప్రథమ సంవత్సరంలో 96.4 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ●యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 92 శాతం ఉత్తీర్ణత దక్కింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు డీలా.. రూ.వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రైవేట్ కళాశాలలు ఫలితాల్లో డీలా పడ్దాయి. జిల్లాలో ప్రైవేటు కళాశాలలు మొదటి సంవత్సరంలో 64.96 శాతం, రెండో సంవత్సరంలో 73.76 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అన్ని సౌకర్యాలు కల్పించినా ప్రభుత్వ కళాశాలల్లో కూడా మెరుగైన ఫలితాలు రాలేదు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో ఫస్టియర్లో 43.74 శాతం, సెకండియర్లో 60.73 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చింది. మే 12 నుంచి సప్లిమెంటరీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను మే 28 వ తేదీ నుంచి జూన్ 1 వరకు జిల్లా కేంద్రంలో మాత్రమే నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.సుజాత తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల స్కానింగ్ కాపీ కోసం ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపీసీ 9861000రోలుగుంట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎంపీసీలో 986 మార్కులు సాధించిన మడ్డు గౌతమి సామాన్య రైతు కుటుంబానికి చెందిన బాలిక. తండ్రి లక్ష్మీనారాయణ వ్యవసాయ పనులు చేస్తారు. తల్లి వెంకటలక్ష్మి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కుక్గా చేస్తున్నారు. చదువుపై మక్కువ ఉన్న తమ కుమార్తెకు పెద్ద చదువులు చెప్పించాలన్నది వారి ఆశయం. గౌతమి ప్రథమ సంవత్సరంలో 470 కి 463 సాధించి టాపర్గా నిలిచింది. ఆరో తరగతి నుంచి పది వరకు కేజీబీవీలో చదువుకుంది. గౌతమి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఐటీ సాధించి, మంచి ఇంజినీరుగా రాణించాలన్నది తన ఆశయమని చెప్పింది. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, తండ్రితోపాటు తన తల్లి కూడా వ్యవసాయ పనులు చేస్తూ ఎంతో శ్రమిస్తోందని తెలిపింది. అన్నయ్య మహేష్ సహకారం మరువలేనిదన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్, అధ్యపక బృందం, ఎస్వో తులసి అందించిన సహకారంతోనే తాను ఇన్ని మార్కులు సాధించానని తెలిపింది. -
ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం
నక్కపల్లి: తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమని బైపీసీలో 982/1000 మార్కులు సాధించిన నక్కపల్లి కేజీబీవీ విద్యార్థిని పిరాది భవాని తెలిపింది. ఆమె స్వగ్రామం పాయకరావుపేట మండలం రాజవరం. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, సుభద్ర మత్స్యకారులు. స్థానికంగా వేట సాగకపోవడంతో ఒరిశాలోని పూరీకి తాత్కాలికంగా వలస వెళ్లారు. భవాని ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు నక్కపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో చదువుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాల ప్రిన్సిపాల్తోపాటు, ఉపాధ్యాయినులు చూపించిన ప్రత్యేక శ్రదద్ధ వల్లే తాను మంచి మార్కులు సాధించగలిగానని తెలిపింది. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమని డిగ్రీ చదివి బీఈడీ చేసి టీచర్ను అవుతానని తెలిపింది. ప్రస్తుతం పూరీలో ఉన్న ఆమె తల్లిదండ్రులు సాక్షితో మాట్లాడుతూ.. తమకు చదువు సంధ్యలు లేవని, ఇద్దరు పిల్లలను బాగా చదివించాలన్నదే తమ ఆశయమన్నారు. బైపీసీ 9821000 -
హెవీలోడ్తో వెళ్తున్న లారీల పట్టివేత
నక్కపల్లి: టోల్ ఫీజును ఎగ్గొట్టేందుకు సామర్ధ్యానికి మించి బరువుతో వెళుతున్న రెండు లారీలను నక్కపల్లి పోలీసులు శనివారం పట్టుకున్నారు. బండరాళ్లతో రాజమండ్రి నుంచి రాంబిల్లి వెళ్తున్న లారీలు క్రషర్ బూడిదతో తిరిగి రాజమండ్రి వెళుతున్నాయి. ఒక్కొక్క లారీలో సుమారు 80 టన్నుల బరువు గల క్రషర్ వేస్ట్ లోడ్ చేశారు. జాతీయ రహదారిపై వేంపాడు వద్ద ఉన్న టోల్ప్లాజా మీదుగా వెళ్తే పరిమితికి మించి లోడ్ చేసినందుకు రూ.5 వేలకుపైనే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఈ పెనాల్టీ నుంచి తప్పించుకునేందుకు ఉపమాక, బోయపాడు, తమ్మయ్యపేట, అమలాపురం మీదుగా వేంపాడు చేరుకుని అక్కడ నుంచి రాజమండ్రి వెళ్లేందుకు ఈ రెండు లారీలు శనివారం ఉదయం రాకపోకలు సాగిస్తుండగా ఉపమాక సర్పంచ్ ప్రగడ వీరబాబు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు ఈ రెండు లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వీటిని రవాణాశాఖ వారికి అప్పగించడం లేదా ఉన్నతాధికారుల సూచన మేరకు పెనాల్టీ విధించడం చేస్తామని సీఐ కుమారస్వామి తెలిపారు. కాగా ఈ లారీలను అడ్డదారుల్లో పంపించేందుకు నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో విలేకరులుగా చెలామణి అవుతున్న ముగ్గురు వ్యక్తులతోపాటు ఉపమాక పరిసర గ్రామాలకు చెందిన కొంతమంది కూటమి నాయకులు ఒప్పందం కుదుర్చుకుని సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
విశాఖ తరహాలో పాయకరావుపేట అభివృద్ధికి కృషి
పాయకరావుపేట: రానున్న పదేళ్లలో పాయకరావుపేటను విశాఖ, గాజువాక తరహాలో అభివృద్ధి చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పాయకరావుపేటలోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో ఆమె శుక్రవారం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో అత్యధిక వనరులు ఉన్న నియోజకవర్గం పాయకరావుపేట అని చెప్పారు. నియోజకవర్గానికి బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ వంటి ప్రధాన పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. గత ఐదేళ్ల పాలనను ఆమె విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును జీవనాడిగా పేర్కొంటూ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. త్వరలో ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నిమని ఆమె తెలిపారు. హోమ్ మంత్రి విలేజ్ వాక్ నక్కపల్లి: మండలంలో వేంపాడులో శుక్రవారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విలేజ్ వాక్ నిర్వహించారు. ఉదయాన్నే ఆమె గ్రామంలో పలు వీధుల్లో పర్యటించారు. స్వయంగా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు తాగునీరు, కాలువలు, రోడ్ల సమస్యలను వివరించారు. తాగునీటి ఎద్దడి ఉందని పరిష్కరించాలని కోరారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
కాంట్రాక్టు కార్మికుడి అనుమానాస్పద మృతి
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడని పరిశ్రమ యాజమాన్యం చెబుతుండగా, విష వాయువులు పీల్చడం వల్లే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. వివరాలివి. అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన బావురిశెట్టి నాగేశ్వరరావు(55) గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో మూడేళ్లుగా క్లీనింగ్ పనులు చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం క్లీనింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. తోటి కార్మికులు ఈ విషయాన్ని పరిశ్రమ యాజమాన్యానికి తెలియజేయగా, నాగేశ్వరరావును వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగేశ్వరరావుకు భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి వివాహం అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు కింద నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా.. కాంట్రాక్టు కార్మికుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. -
అరటి తోటలు ధ్వంసం
వర్ష బీభత్సం.. తిమిరాంలో విరిగిన అగర్వుడ్ మొక్కలు దేవరాపల్లి: జిల్లాలో రెండు రోజులుగా పెనుగాలులతో కురిసిన వర్షాలకు అరటితోటలు ధ్వంసమయ్యాయి. దేవరాపల్లి మండలంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించిన రైతుల ఆశలు ఆవిరయ్యాయి. భారీగా వీచిన ఈదురు గాలుల ధాటికి తిమిరాం గ్రామానికి చెందిన రెడ్డి సింహాద్రప్పడు, కామిరెడ్డి శ్రీరామమూర్తి, రెడ్డి సత్యనారాయణ తదితరులకు చెందిన సుమారు 8 ఎకరాలలో ఏడేళ్ల క్రితం అగర్వుడ్ సాగు చేస్తున్నారు. దీనిలో అంతర పంటగా కడియం నుంచి తీసుకువచ్చిన అరటి మొక్కలు నాటారు. అరటి తోట దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో లాభాలు వస్తాయని ఆశపడిన రైతులకు అకాల వర్షాలు నిరాశ మిగిల్చాయి. ఈ నెల నుంచి అరటి గెలల విక్రయాలు ద్వారా వారానికి రూ.5వేలు పైగా ఆదాయం వచ్చేది. గురువారం సాయంత్రం ఈదురుగాలుల ధాటికి అరటి తోటతో పాటు ఏడేళ్లుగా కష్టపడి పెంచిన అగర్వుడ్ చెట్లు సైతం విరిగిపోయాయి. ఐదెకరాల్లో అరటి తోట, సుమారు 1500 వరకు అగర్వుడ్ మొక్కలు నేల కూలాయని బాధిత రైతు రెడ్డి సింహాద్రప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2 ఎకరాలలో సాగు చేసిన అరటి, అగర్వుడ్ తోటలు ధ్వంసమయ్యాయని రైతు కామిరెడ్డి శ్రీరాములు తెలిపారు. మరో రైతు రెడ్డి సత్యనారాయణకు చెందిన 50 సెంట్లలో అరటి తోట ధ్వంసమైంది. ప్రభుత్వం వెంటనే ఆదుకొని పంట నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతులు కోరుతున్నారు. రైతుల సమాచారం మేరకు నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించామని మామిడిపల్లి సచివాలయ వ్యవసాయ సహాయకురాలు రామలక్ష్మి తెలిపారు. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. రైతులపై ప్రకృతి కన్నెర్ర నాతవరం: ఈదురు గాలులతో కురిసిన ఆకాల వర్షానికి జీడి మామిడి తోటలతో పాటు అరటి తోటలకు తీవ్ర నష్టం కలిగింది. మండలంలో గురువారం రాత్రి ఈదురు గాలులతో పాటు భారీ వర్షం పడడంతో జీడి పిక్కలు, మామిడి కాయలు చాలా చోట్ల నేలకొరిగాయి. చమ్మచింత, వల్సంపేట, మాధవనగరం, నాతవరం, గుమ్మడిగొండ, వెదురుపల్లి, సరుగుడు, పెదగొలుగొండపేట, చినగొలుగొండపేట గ్రామాల్లో రైతులు అరటి తోటలు సాగు చేస్తున్నారు. అరటి తోటలు కాపు ముమ్మరంగా కాసి ప్రస్తుతం విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. పంట చేతికంది వచ్చే సమయంలో అరటి రైతులపై ప్రకృతి కన్రెర్ర చేయడంతో అరటి చెట్ల నేలమట్టమయ్యాయి. మండల వ్యాప్తంగా సుమారుగా 10 ఎకరాలకు పైగా అరటి తోటలు ఈదురు గాలలకు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. చాలా గ్రామాల్లో రైతులు పామాయిల్ తోటలో అంతర పంటగా అరటి తోటలు పెంచుతున్నారు. గాలులకు దెబ్బతిన్న అరటి తోటలను శుక్రవారం ఆయా గ్రామాల రైతులు ఉద్యావన వ్యవసాయశాఖాధికారులను తీసుకెళ్లి స్వయంగా చూపించారు. అరటి తోట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దెబ్బతిన్న తోటలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని నాతవరం గ్రామ సచివాలయ ఉద్యాన వనశాఖాధికారి రవితేజ తెలిపారు. -
ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా ‘స్వర్ణాంధ్ర 2047 విజన్’
● విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశంబీచ్రోడ్డు (విశాఖ): క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గ స్థాయి 2047 విజన్ ప్రణాళికలు రూపొందించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 15 నాటికి అన్ని పనులను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాల అధికారులకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి అంశాలను అవగతం చేసుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో పనిచేయాల్సిన అధికారుల బృందాలను ప్రకటించారు. జిల్లాకు కలెక్టర్ చైర్మన్గా, నియోజకవర్గానికి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా, ఆయా జోనల్ లేదా మండల స్థాయిలో జోనల్ కమిషనర్, ఎంపీడీవోలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని, ఒక్కో కమిటీలో ఐదుగురు సచివాలయ సిబ్బంది ఉంటారని ఆయన వెల్లడించారు. వీరంతా కలిసి స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికకు అనుగుణంగా తాత్కాలిక వార్షిక ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజల అవసరాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని, భవిష్యత్ రూపురేఖలు మార్చే విధంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి, మూడు జిల్లాల ఉన్నత స్థాయి అధికారులు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, ప్రణాళిక విభాగం అధికారులు, సీపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్ట్
● ఒకరు పరారీ ● లిక్విడ్ గంజాయి స్వాధీనం నర్సీపట్నం: లిక్విడ్ గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో కె.డి.పేట, గొలుగొండ ఎస్ఐలు తారకేశ్వరరావు, రామారావు, ఏఆర్ ఎస్ఐ వెంకటరావు, స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం కేడీ పేట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కారులో లిక్విడ్ గంజాయి తీసుకువెళ్తుండగా గుర్తించి పట్టుకున్నారు. కడప జిల్లా కోరుమిల్లి మండలం, గిరినగర్ గ్రామానికి చెందిన చాటకుండు గురయ్యను అరెస్ట్ చేశారు. ఇతను పలు కేసుల్లో నిందితుడు. ఈయనపై బద్వేల్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉందని డీఎస్పీ తెలిపారు. అదే జిల్లాకు చెందిన నాగడసారి కేశవ గంజాయి రవాణాకు సహకరించాడు. అక్కి దాసరి శ్రీహరి టూరిజం ట్రిప్ పేరుతో అద్దెకు కారు తీసుకున్నాడు. జీకే వీధి మండలం జెర్రిల పంచాయతీ వంతడపల్లికి చెందిన ముర్ల చంటిబాబును అరెస్ట్ చేశారు. ఈయన కూడా పాత కేసుల్లో నిందితుడు. గంజాయి రవాణాకు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి పరారులో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాటగుంట యరయ్య, చంటిబాబు కడప జిల్లా బద్వేల్ జైల్లో గంజాయి కేసులో ముద్దాయిలుగా ఉన్నప్పడు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఇటీవల జైల్ నుంచి విడుదలయ్యారు. చంటిబాబుకు స్నేహితులైన కేశవ, అక్కిదాసరి శ్రీహరి లిక్విడ్ గంజాయి వ్యాపారం చేసేందుకు మాట్లాడుకున్నారు. ఒడిశా సరిహద్దులో లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేశారు. నలుగురూ లిక్విడ్ గంజాయిని కారు డోర్లో పెట్టి రవాణా చేస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో గంజాయి దొరికిందని డీఎస్పీ తెలిపారు. కిలో లిక్విడ్ గంజాయి విలువ రూ.లక్ష ఉంటుందన్నారు. రవాణాకు ఉపయోగించిన టయోటా కారును పోలీసులు సీజ్ చేశారు. నలుగురు నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. -
దోపిడీకి పాల్పడిన బాలుడి అరెస్ట్
● ర్యాపిడో డ్రైవర్పై దాడి ఘటన ఉక్కునగరం: ర్యాపిడో డ్రైవర్పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసినట్లు నగర క్రైం డీసీపీ కె.లతా మాధురి తెలిపారు. ఈ నెల 10న స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ రహదారిలో ర్యాపిడో డ్రైవర్పై మైనర్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. గాజువాక సౌత్ ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ కేసు వివరాలు వెల్లడించారు. పార్ట్టైం ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్న కిశోర్ ఆ రోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా శ్రీనగర్ పెట్రోల్ బంక్ వద్ద బాలుడు స్టీల్ప్లాంట్ లోపలికి రైడ్ మాట్లాడుకున్నాడు. స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్మశానం వద్ద బైక్ ఆపమని చెప్పి, ఆ బాలుడు కిశోర్పై దాడి చేసి ఫోన్ లాక్కున్నాడు. ఆ ఫోన్ ద్వారా ముగ్గురికి రూ.48,100 ఫోన్పే ద్వారా పంపాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుతో క్రైం సిబ్బంది వెంటనే అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో పెదగంట్యాడ సమతా నగర్లోని సాయిబాబా గుడి దగ్గరలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించిన బాలుడి నుంచి రూ.48,100 నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై.. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో బాలుడు దోపిడీకి పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. డెలివరీ బాయ్స్, ర్యాపిడో, ఓలా తదితర డ్రైవర్లు రా త్రి సమయాల్లో అపరిచితులను నమ్మి లిఫ్ట్ ఇవ్వొద్దని సూచించారు. ఈ సందర్భంగా బాలుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. అనంతరం అతన్ని జువనైల్ హోమ్కు తరలించినట్లు క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ క్రైం మోహనరావు, ఏసీపీ జోన్–2 క్రైం డి.లక్ష్మణరావు పాల్గొన్నారు. -
తామరబ్బలో అదుపు తప్పి ఆటో బోల్తా
తామరబ్బలో నుజ్జు అయిన ఆటో (ఇన్సెట్)ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు దేవరాపల్లి: మండలంలోని తామరబ్బ సమీపంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది వరకు మహిళా ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సమ్మెద సమీపంలో జీడి తోటల్లో జీడి పిక్కలు సేకరించేందుకు(ఏరడానికి) రైవాడ గ్రామానికి చెందిన 20 మంది మహిళలు ప్రతి రోజూ కూలీ పని కోసం ఆటోలో వెళ్లి వస్తుంటారు. శుక్రవారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి ఆటోలో బయలుదేరారు. తామరబ్బ వంతెన సమీపంలో ప్రమాదకర మలుపులో ఎత్తుగా ఉన్న రోడ్డు ఎక్కలేక ఆటో అదుపు తప్పి వెనక్కి వెళ్లిపోతూ పక్కనే ఉన్న బండరాయిపై బోల్తా పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే వారిని రక్షించి వేరొక ఆటోలో దేవరాపల్లి పంపించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కోరి అప్పలరాజు, శీర సింహాచలమ్మ చేతులు విరిగాయి. వంకల అప్పలనర్స, మంగ, లక్ష్మి, దుక్క అప్పలనర్స, నర్సమ్మ, చిన్న, సన్నమ్మ తదితరులు గాయపడ్డారు. వీరికి దేవరాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందించారు. డ్రైవర్, ఓ మహిళకు తీవ్ర గాయాలు మిగతా మహిళలకు స్వల్ప గాయాలు క్షతగాత్రులంతా రైవాడ గ్రామస్తులు -
రూ. 20 లక్షల బీమా చెక్కు అందజేత
బాధిత కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కు అందిస్తున్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారులు దేవరాపల్లి: గరిశింగి పంచాయతీ శివారు చినగంగవరానికి చెందిన కోలా జోగిబాబు ఇటీవల మరణించడంతో దేవరాపల్లి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ), ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా) కింద రూ.20 లక్షలు మంజూరైంది. ఈ మేరకు స్థానిక ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్లో రీజనల్ మేనేజర్ పి.చిరంజీవి వెంకటేష్, ఇతర బ్యాంక్ అధికారుల చేతుల మీదుగా రూ. 20 లక్షల ప్రమాద బీమా చెక్కును నామినీగా ఉన్న మృతుడి భార్య కోలా మణికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ చిరంజీవి వెంకటేష్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్య, జీవిత బీమా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్, ఎంవీ రమణయ్య, నోడల్ అధికారి ఎస్.కె.సనవాజ్, తదితరులు పాల్గొన్నారు. -
నిలకడలేని సేన
● మలేషియాకు చెక్కేసిన జనసేన కార్పొరేటర్లు ● మాట నిలుపుకోని వైనం ● క్యాంప్ రాజకీయాలు చేయబోమని చెప్పిన మంత్రి నాదెండ్ల ● చెప్పిన నాలుగు రోజుల్లోనే విమానంఎక్కిన ఏడుగురు జనసేన కార్పొరేటర్లు ● టీడీపీ కార్పొరేటర్లతో కలిసి ప్రయాణం ● ఆదివారం మరికొంత మంది పయనం విశాఖ సిటీ: యథారాజా తథా ప్రజా అన్న నానుడి జనసేన నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిలకడలేని మాటలు, రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలోనే పుట్టానని.. ఒక్కో సభలో ఒక్కో చదువు చదివానని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో మీమర్లకు ఫుల్మీల్స్గా మారితే.. ఆ పార్టీ నంబర్–2 నాలుక కూడా నాలుగు రోజుల్లో మడతపెట్టేశారు. విశాఖ మేయర్పై అవిశ్వాస ఓటింగ్ వ్యవహారంలో జనసేన క్యాంప్ రాజకీయాలు చేయదని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీ కార్పొరేటర్లు విమానమెక్కి చెక్కేయడం గమనార్హం. కార్పొరేటర్లు చేజారిపోతారన్న భయంతో టీడీపీ నేతలే దగ్గరుండి మరీ విమాన టికెట్లు తీయించి మలేషియా విమానం ఎక్కించారు. నిలకడ లేని మాటలు.. జనసేన పార్టీకి ఓ విధానం, నేతల మాటలకు ఓ నిలకడ లేనట్లు మరోసారి రుజువైంది. అధ్యక్షుడి బాటలోనే కార్పొరేటర్లు నడుస్తూ జిల్లాలో మేయర్ పీఠాన్ని టీడీపీ చేతుల్లో పెట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే జనసేన కార్పొరేటర్లు విజయవాడలో పవన్ కల్యాణ్ను కలిశారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాలని హామీ తీసుకున్నారు. తాము క్యాంపు రాజకీయాలు చేయబోమని, తమ కార్పొరేటర్లపై పూర్తి నమ్మకముందని గొప్పలు చెప్పుకొచ్చారు. అది జరిగిన కొద్ది రోజుల్లోనే మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖకు వచ్చి జనసేన కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈయన కూడా క్యాంప్ రాజకీయాలకు జనసేన దూరమని పునరుద్ఘాటించారు. చెప్పిన కొద్ది గంటలకే మాట మార్చారు. అందరినీ విదేశాలకు పంపించాలని నిర్ణయించారు. ఓటమి భయం జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోడానికి కూటమి నేతలు కుట్ర రాజకీయాలు తెరతీస్తున్నారు. కౌన్సిల్లో బలం పెంచుకోడానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ఎర వేస్తున్నారు. లొంగని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. అయినప్పటికీ.. అవిశ్వాసానికి మద్దతుగా 58 కార్పొరేటర్ల మద్దతు ఉందని కూటమి నేతలు జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 19వ తేదీన అవిశ్వాస ఓటింగ్కు ప్రత్యేక కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్పొరేటర్లకు నోటీసులు పంపించారు. ఇదిలా ఉంటే.. కొంత మంది కార్పొరేటర్లు కూటమిలో ఇమడలేక బయటకు వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు ఇప్పటికే కొంత మంది కార్పొరేటర్లను మలేషియా పంపించారు. జనసేన కార్పొరేటర్లు కూడా మనసు మార్చుకోకముందే విదేశాలకు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఏడుగురు జనసేన కార్పొరేటర్లకు మలేషియా టికెట్ బుక్ చేసి శుక్రవారం సాయంత్రం దగ్గరుండి మరీ విశాఖ ఎయిర్పోర్టులో విమానం ఎక్కించారు. ఆదివారం టీడీపీ కార్పొరేటర్లతో కలిపి మిగిలిన జనసేన కార్పొరేటర్లను కూడా మలేషియా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాంబు పేల్చిన కూటమి కార్పొరేటర్ ఒకవైపు అవిశ్వాస ఓటింగ్కు కార్పొరేటర్లు చేజారి పోకూడదని కూటమి నేతలు క్యాంప్ రాజకీయాలు చేస్తుంటే.. మరోవైపు అదే కూటమికి చెందిన 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బాంబు పేల్చారు. మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు 58 మంది సంతకాలు చేసినట్లు కలెక్టర్ నోటీసులో పేర్కొని, ఆ తీర్మానం కాపీని సభ్యులకు అందించలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. కలెక్టర్ కార్పొరేటర్లకు ఇచ్చిన ఫారం–2 నోటీసులో 58 మంది సభ్యులు సంతకం చేసిన ప్రతిపాదిత అవిశ్వాస తీర్మానం కాపీని జత చేసినట్లు చెప్పారని, కానీ అటువంటి మోషన్ కాపీ జత చేయలేదని అభ్యంతరం తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి సంతకం చేసిన 58 మంది సభ్యుల సంతకాల ఆధారాలు సమర్పించని పక్షంలో ఆ నోటీసు 1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టు ముందు నిలబడకపోవచ్చన్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో పేర్కొన్న విధానాన్ని అనుసరించి పునఃపరిశీలించాలని కోరారు. అవిశ్వాస ఓటింగ్ ప్రక్రియలో చట్టపరమైన సమస్యలకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక సమావేశాన్ని సరైన పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
విద్యార్థుల కన్నీళ్లు తుడవాల్సింది పవన్ కల్యాణే..
నర్సీపట్నం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా పరీక్షలు రాయకుండా నష్టపోయిన జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. పోలీసుల అత్యుత్సాహంతోనే వారు పరీక్షకు హాజరు కాలేకపోయారని విమర్శించారు. నర్సీపట్నం వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే ప్రధాని నరేంద్ర మోదీకి చాలా ఇష్టం కనుక, ఆయనే జోక్యం చేసుకుని కేంద్ర స్థాయిలో ఒప్పించి 30 మంది విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో విద్యార్థుల కన్నీళ్లకు పవన్ కల్యాణే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తున్నామన్నారు. ఆర్థిక నేరస్ధులను టెర్రరిస్టుల కంటే ప్రమాదకరమైన వారిగా గుర్తించి దేశానికి రప్పించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక నేరగాళ్లు కాజేసిన రూ.16 లక్షల కోట్లను కక్కించాలన్నారు. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన 29 మంది ఆర్థిక నేరస్తులు విదేశాల్లో ఉన్నారన్నారు. వీరిలో 25 మంది గుజరాత్ వాళ్లే కావటం గమనార్హమన్నారు. ముంబాయి దాడుల సూత్రధారి రాణాను ఏవిధంగా అయితే తీసుకువచ్చారో.. అదే విధంగా ఆర్థిక నేరగాళ్లను తీసుకురావాలన్నారు. తాను పదేళ్ల క్రితం చింతపల్లి నియోజకవర్గంలో పది రోజుల పాటు పాదయాత్ర చేశానని, ఆ సమయంలో గిరిజనుల ఇబ్బందులను స్వయంగా చూశానన్నారు. రవాణా, వైద్య సదుపాయాలు లేక గిరిజనులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. టూరిస్టులు, కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా కాకుండా గిరిజనులకు మేలు జరగాలన్నారు. పండించిన పంటలను మార్కెట్కు తీసుకువెళ్లేందుకు రోడ్లు వేయాలన్నారు. వైద్యం, రక్షిత మంచినీటి పథకాలను అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఆయన పర్యటన సందర్భంగా పోలీసుల అత్యుత్సాహం పరీక్ష రాయలేకపోయిన జేఈఈ మెయిన్స్ విద్యార్థులు మోదీ పలుకుబడి ఉపయోగించి న్యాయం చేయాలి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ -
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
సాక్షిపై కేసుల్ని ఖండించిన పాత్రికేయులుసీతమ్మధార (విశాఖ): సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, మరో ఆరుగురు రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరుతూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక బ్యూరోచీఫ్ కేజీ రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ సాక్షి దినపత్రిక నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సాక్షి అనకాపల్లి, అల్లూరి జిల్లాల డెస్క్ ఇన్చార్జి బీబీ సాగర్ మాట్లాడుతూ సాక్షి ఎడిటర్తో సహా ఆరుగురు పాత్రికేయులపై కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతమన్నారు. ఒక హత్యకేసులో బాధితుల పక్షాన నిలిచి వాస్తవాలు వెలికితీయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వార్తలో పేర్కొన్న విషయాల్లో నిజనిజాలను ఖరారు చేసుకుని నిందితులపై చర్యలు తీసుకోవడం మాని, పాత్రికేయులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీ రామునాయుడు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో జరిగిన హత్యోదంతంలో దోషులను శిక్షించాల్సింది పోయి, వార్త కవర్చేసిన సాక్షి మీడియా జర్నలిస్టులపైనా, మీడియాపైనా కేసులు నమోదుచేయడం సరికాదన్నారు. సాక్షి ఎడిటర్తో పాటు ఇద్దరు జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు డి.ఆనంద్కుమార్ మాట్లాడుతూ వార్త కవర్ చేసిన సాక్షి మీడియా జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సీనియర్ జర్నలిస్టు పిల్లా విజయకుమార్ మాట్లాడుతూ యాజమాన్యాల మీద ఉన్న కోపాన్ని వృత్తి ధర్మం నిర్వహిస్తున పాత్రికేయులపై ప్రదర్శించడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు అనేష్కుమార్, ఏపీడబ్ల్యూజే అనుబంధ సామ్నా జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణకిశోర్, భీమిలి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రమణప్రసాద్, పలు ప్రెస్క్లబ్ల కార్యవర్గసభ్యులు, అధిక సంఖ్యలో పలు మీడియాలకు చెందిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో.. అనకాపల్లి: పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం తీసుకున్న మొండి వైఖరిని తక్షణమే విడనాడాలని అనకాపల్లి ప్రెస్క్లబ్ (ఏపీయూడబ్ల్యూజే) నియోజకవర్గ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి గణేష్లు అన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఆరుగురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ క్రిమినల్ కేసులను ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసి, ఏవో బి.సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరిగే అక్రమాలు, అన్యాయాలను పత్రికలు వెలికితీస్తాయని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పి.వీరబాబు, బి.మధుసూదనరావు, మంత్రి నారాయణమూర్తి, వేగి రామచంద్రరావు, కర్రి గంగాధర్, కోన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి పునాదుల ధ్వంసంపై ఫిర్యాదు
రోలుగుంట : భోగాపురం గ్రామంలో కాలనీ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన భూమిలో లబ్ధిదారుడు పరవాడ దొరబాబు ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిని సమీపంలో గల కొందరు దౌర్జన్యం చేసి ఇంటి నిర్మాణం చేయకుండా పునాదులు తవ్వి ధ్వంసం చేశారు. అంతే కాకుండా తనపై దాడికి దిగుతున్నారని, తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని బాధితుడు దొరబాబు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్కు ఫిర్యాదు చేశారు. వివరాలివి. రోలుగుంట మండలం కంచుగుమల పంచాయతీ శివారు భోగాపురం గ్రామంలో దివంగత తహసీల్దార్ పెంటకోట అప్పలనాయుడు సర్వే నెనంబరు 13/సి ప్లాట్ నెంబరు 37లో ఇంటి స్థలాన్ని 2015లో ఇచ్చారు. ఈ స్థలంలో దొరబాబు గృహనిర్మాణం చేపట్టగా సమీపంలో ఉన్న నక్కా రాజు, అప్పారావు, వెంకటరమణ దౌర్జన్యంగా వచ్చి నిర్మాణాన్ని అపేయాలని పునాదులు తవ్వి ధ్వంసం చేశారు. ఈ స్థలం నీది కాదని, తప్పుడు పేర్లతో 20 ఏళ్ల క్రితం పాత పట్టాని చూపి బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ఫ్లైఓవర్ వద్దే వద్దు ..
● ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయాలి ● ముక్తకంఠంతో ఆర్డీవోకు అచ్యుతాపురం ప్రజల విజ్ఞప్తిఅచ్యుతాపురం రూరల్ : అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా మండల కేంద్రమైన అచ్యుతాపురం కూడలిలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్లై–ఓవర్ కోసం అనకాపల్లి ఆర్డీవో షేక్ ఆయిషా గురువారం స్థానికులతో సమావేశమయ్యారు. ఫ్లై–ఓవర్ నిర్మాణానికి ప్రజలు అంగీకరిస్తే నష్టపరిహారంగా టీడీఆర్ బాండ్లు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. అయితే మాకు ఫ్లై–ఓవర్ వద్దు..రింగు రోడ్డు వేయండి అంటూ స్థానికులు ముక్తకంఠంతో చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో కాలుష్యం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా పరిశ్రమలను అనుసరించి అనేక రహదారులు ఏర్పాటు చేయడానికి అనుకూలమైన ప్రభుత్వ ఆస్తులు ఉన్నప్పటికీ కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అచ్యుతాపురం కూడలిని ఆనుకుని అచ్యుతాపురం, మోసయ్యపేట, ఇందిరమ్మకాలనీ, చోడపల్లి, బర్మాకాలనీ, భోగాపురం, కుమారపురం, కోనేంపాలెం ఇలా మరెన్నో గ్రామాల్లో వేలాది మంది ప్రజలు నివాసముంటున్న నివాస స్థలాల్లో రోడ్డు మీద రోడ్డు ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం పెరుగుతుందే కానీ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. విశాఖ పోర్టు నుంచి వచ్చే వందలాది భారీ వాహనాలు పరిశ్రమలకు చేరుకోవడానికి అప్పన్నపాలెం కూడలి నుంచి జంగులూరు కూడలికి తరలించవచ్చునన్నారు. అలాగే యలమంచిలి హైవే నుంచి వచ్చే వాహనాలు కానీ అనకాపల్లి బైపాస్ నుంచి వచ్చే వాహనాలకు కూడా పరిశ్రమలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలో రహదారుల ప్రణాళిక ఉందని అధికారులకు గ్రామస్తులు గుర్తు చేశారు. గతంలో పరిశ్రమలకు భూములు ఇచ్చి నిర్వాసితులైన వారు వచ్చిన పరిహారంతో పూడిమడక రహదారిలో వసతి ఏర్పాటు చేసుకున్నారని, ఇప్పుడు మరోసారి అభివృద్ధి పేరుతో రోడ్ల వెడల్పు, ఫ్లై–ఓవర్ల నిర్మాణాలు చేస్తే ఎక్కడికి పోవాలని భవన యజమానులు అధికారులను నిలదీశారు. ఫ్లైఓవర్ వద్దంటూ అనకాపల్లి ఆర్డీఓ షేక్ అయిషాకి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాజాన రమేష్ కుమార్, సన్యాసినాయుడు, సర్పంచ్ కూండ్రపు విమలా నాయుడు, సీపీఎం మండల కన్వీనర్ రాము, భవన యజమానుల సంఘం అధ్యక్షుడు దేశంశెట్టి అప్పలనాయుడు, గౌరవ అధ్యక్షుడు పల్లి శేషగిరిరావు తదితరులు ఉన్నారు. కష్టార్జితం కాలుష్యం పాలేనా... పదేళ్లు బయట దేశాల్లో కష్టపడి సంపాదించిన కష్టార్జితంతో కుటుంబంతో స్వగ్రామంలో ప్రశాంతంగా జీవించ వచ్చుననే ఉద్ధేశంతో నిర్మించుకున్న ఇల్లు ప్రస్తుతం కాలుష్యం బారిన పడుతుందని తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఇక్కడితో రోడ్డు వెడల్పు కాదు.. అని అధికారులు, నాయకులు చెప్పిన తరువాతే మా ఇంటి నిర్మాణం చేశాను. ఇపుడు ఫ్లై–ఓవర్ నిర్మిస్తే అంతకుఅంతా కాలుష్యం పెరిగి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇలా ఎందరో మండల కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికై నా ఫ్లై–ఓవర్ ఆలోచన మానుకుని, ప్రత్యామ్నాయ రహదారులు నిర్మాణం చేయాలి. – పచ్చిపులుసు వాసు, అచ్యుతాపురం● -
జెడ్పీ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ వితరణ
హెచ్ఎంకు కంప్యూటర్ అందజేస్తున్న లయన్స్ క్లబ్ నవ్య ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సభ్యులు రోలుగుంట : నర్సీపట్నం లయన్స్ క్లబ్ నవ్య వారు గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ప్రసాద్కు కంప్యూటర్ను అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ క్లబ్ తరపున ఏటా ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తమ క్లబ్ సభ్యురాలు ఈ పాఠశాల ఇంగ్లిష్ టీచర్ పి.వి.ఎం నాగజ్యోతి అభ్యర్థన మేరకు పాఠశాలకు కంప్యూటర్ను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సంఘ క్లబ్ సభ్యులు చైతన్య, విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
● వెంకటరాజుపురంలో బెల్లం తయారీ పాక దగ్ధం ● రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం ● చోడవరంలో నేల రాలిన మామిడిదేవరాపల్లి : మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వెంకటరాజుపురంలో బెల్లం పాకకు నిప్పు అంటుకోవడంతో రెండు పెనాల్లోని మరుగుతున్న చెరకు రసంతో పాటు పాకలో భద్ర పరిచిన 80 బెల్లం దిమ్మలు అగ్నికి ఆహుతయ్యాయి. గురువారం సాయంత్రం వర్షం కురుస్తుండడంతో బయట ఆరబెట్టిన చెరకు పిప్పిని పాకలోకి తీసుకెళ్తుండగా, ఈదురు గాలుల బీభత్సానికి బెల్లం తయారు చేస్తున్న పొయ్యి నుంచి నిప్పు రవ్వలు ఎగిరిపడి బెల్లం పాక కాలి బూడిదయ్యింది. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల మేర నష్టం జరిగిందని బాధిత రైతులు వనుం గంగమ్మ, రామునాయుడు, అబద్దం, శ్రీను, పెనగంటి సింహాచలంనాయుడు, లెక్కల రమణ వాపోయారు. ఈదురు గాలుల ధాటికి తెనుగుపూడి ప్రధాన కూడలిలో రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప సర్పంచ్ కాటిపాం పెదనాయుడు జోరు వర్షంలోనే చెట్లు తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. తారువ ఫీడర్ పరిధిలో చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడగా, యుద్ధప్రాతిపదికన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు విద్యుత్ ఏఈఈ కె.శంకరరావు తెలిపారు. నేలరాలిన మామిడి చోడవరం : మామిడి, జీడిమామిడి పంటలకు దెబ్బమీద దెబ్బ తగిలింది. పంట పక్వానికి వచ్చిన సమయంలో గురువారం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో పంట చాలా మేర దెబ్బతింది. చోడవరం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 20వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. ఈ ఏడాది మొదట్లో పూత బాగా వచ్చినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో పొగమంచు కమ్ముకుంది. మంచువల్ల చాలామేర పూత రాలిపోయింది. ఆలస్యంగా పిందెలు వచ్చాయి. 50శాతమే ఇప్పుడు తోటల్లో కాయలు ఉన్నాయి. కనీసం ఆ పంటైనా చేతికి వస్తే పెట్టుబడులైనా వస్తాయని ఆశించిన రైతులకు అకాల వర్షం నష్టం చేకూర్చింది. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో చోడవరం, అనకాపల్లి, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, బుచ్చెయ్యపేట ప్రాంతాల్లో మామిడికాయలు నేలరాలిపోయింది. గాలులు గట్టిగా వీయడంతో నేలరాలిన కాయలన్నీ పగిలి పోయాయి. బుచ్చెయ్యపేట : మండలంలో గురువారంసాయింత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో గాలివర్షం కురిసింది. గాలులు బలంగా వీయడంతో పలు గ్రామాల్లో చెట్టు కొమ్మలు విరగి పడగా జీడిమామిడికాయలు నేలరాలాయి. దీంతో జీడిమామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పెట్టుబడి కూడా పోయింది నేను అడ్డూరు గ్రామంలో 3ఎకరాల మామిడి తోట లీజుకి తీసుకున్నాను. కాయ పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివాన వచ్చింది. చెట్లకు ఉన్న కాయంతా నేలరాలిపోయింది. సుమారు రూ.లక్షా 40వేలు పెట్టుబడి పెట్టాను. పంట చాలా వరకు రాలిపోయింది. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. – అప్పారావు, మామిడి రైతు,అడ్డూరు ● -
గుల్ల కార్మికులకు న్యాయం చేయాలి
నక్కపల్లి : ఏపీఐఐసీ భూసేకరణలో ఉపాధి కోల్పోయిన గుల్ల కార్మికులకు, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం చందనాడలో నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించే విషయమై ఆర్డీవో వీవీ రమణ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభకు నిర్వాసితుల తరపున వైఎస్సార్సీపీ నాయకులు వీసం రామకృష్ణ, సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, రైతు సంఘ నాయకుడు ఎం.అప్పలరాజు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ చందనాడలో ప్రభుత్వ భూముల్లో గుల్ల కార్మికులు బట్టీలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందేవారన్నారు. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుందని, వారికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. డీఫారం, జిరాయితీ భూముల్లో పశువుల షెడ్లు వేసుకున్న వారికి కూడా ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. ఆ ప్యాకేజీ కింద ప్రభుత్వం ఇచ్చే రూ.8 లక్షలు సరిపోవని, కనీసం రూ.15 లక్షలు ప్యాకేజీ చెల్లించాలని, గుల్ల కార్మికులను సాగుదారులుగా గుర్తించి రూ.6.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. అలాగే డీఫారం భూముల్లో ఉన్న చెట్లకు నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు, నిర్వాసితులకు, గుల్లకార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంతో తహసీల్దార్ నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
జాతీయ సెపక్ తక్రా పోటీలకు దేవరాపల్లి విద్యార్థి
దేవరాపల్లి: జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి తమటపు జశ్వంత్ ఎంపికయ్యాడు. ఈ నెల 15 నుంచి 20 వరకు మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో జశ్వంత్ పాల్గొంటాడని స్థానిక ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జ్ ఎంఈవో బి.పడాల్దాస్ తెలిపారు. ఇటీవల కర్నూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ బాలుడు విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటాడు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనగా కేవలం ఐదుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి తమ పాఠశాల విద్యార్థి జశ్వంత్ ఒక్కరే ఎంపిక కావడం ఆనందంగా ఉందని పడాల్దాస్ చెప్పారు. జస్వంత్తోపాటు తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూరావును గురువారం స్థానిక హైస్కూల్లో హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. -
సింహగిరిపై ఘనంగా పండిత సదస్సు
● అప్పన్న వైభవాన్ని కీర్తించిన పలు దేవస్థానాల వేద పండితులు ● వేణుగోపాలస్వామిగా దర్శనమిచ్చిన అప్పన్న సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు గురువారం పండిత సదస్సు ఘనంగా జరిగింది. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేణుగోపాలస్వామిగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణమండపంలో వేదికపై కొలువుంచారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. అనంతరం రాష్ట్రంలోని పలు దేవస్థానాల నుంచి వచ్చిన సుమారు 120 మంది వేద పండితులు తమ పాండిత్యంతో స్వామిని కీర్తించారు. నాలుగు వేదాల్లోని స్లోకాలతో స్వామిని కొలిచారు. స్వామి వైభవాన్ని వివరించారు. అనంతరం దేవస్థానం తరఫున పండితులను సత్కరించారు. వేద పండితులు శ్యావాస మహర్షి ఘనాపాటి(విజయవాడ దేవస్థానం) పృధ్వి ఘనాపాటి(శ్రీశైలం), అన్నపూర్ణయ్య ఘనాపాటి(కాణిపాకం), యనమండ్ర సూర్యనారాయణ ఘనాపాటి(అన్నవరం), వెంకటేశ్వర ఘనాపాటి(కనకమహాలక్ష్మి దేవస్థానం), సింహాచలం దేవస్థానం వేదపండితులు సురేష్ ఘనాపాటి, జగన్మోహన్శర్మ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉదయం 7.30 నుంచి కల్యాణ ఉత్సవమూర్తుల చెంతన వైదిక సదస్యాన్ని నిర్వహించారు. సూపరింటెండెంట్లు జీవీవీఎస్కే ప్రసాద్, త్రిమూర్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్వర్ణ కవచ ధారునిగా అప్పన్న కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ప్రతి గురువారం మాత్రమే లభించే స్వర్ణ కవచ అలంకారాన్ని ఏటా వార్షిక కల్యాణోత్సవాల్లో పండిత సదస్యం రోజు కూడా చేయడం పరిపాటి. ఈసారి గురువారం రోజే పండిత సదస్సు రావడం విశేషం. -
డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
తుమ్మపాల : డీఎస్సీ ఉచిత శిక్షణ కొరకు జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి కె.రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అతిత్వరలో అందించబడుతుందని తెలియజేశారు. టెట్ అర్హత సాధించిన ఆసక్తి గల అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరడమైందన్నారు. అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం, నేటివిటీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, టెట్ పరీక్షలో అర్హత పత్రాలను జతపరచిన దరఖాస్తును వెనుకబడిన తరగతుల సంక్షేమం – సాధికారత అధికారి కార్యాలయం, డోర్ నెం.10–06–31/7, రఘురామకాలనీ, సర్వేపల్లి రాధా కృష్ణన్ జూనియర్ కాలేజీ స్ట్రీట్లో సమర్పించాలని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ నెం.9885845743, 9494978777 సంప్రదించవలసినదిగా ఆమె కోరారు.ప్రజాదర్బార్లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి అనిత నక్కపల్లి : హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం సారిపల్లిపాలెంలోని తన స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, భూ సరిహద్దు సమస్యలు, పట్టాదారు పాసుపుస్తకాల సమస్యలు పరిష్కరించాలని, స్వయం ఉపాధి కోసం రుణాలు ఇప్పించాలంటూ నాలుగు మండలాల నుంచి పలువురు అర్జీలు అందజేశారు. అర్జీలు పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పరిష్కరిస్తామన్నారు. సుమారు 600కు పైగా అర్జీలు వచ్చాయని తెలిపారు. -
మరో 30 ఎకరాల్లో సరుగుడు తోటల దగ్ధం
బుచ్చెయ్యపేట : చింతపాక గ్రామంలో మరో 30 ఎకరాల్లో సరుగుడు తోటలు కాలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన 80 మంది రైతులకు చెందిన 50 ఎకరాల సరుగుడు తోటలు కాలిపోగా సుమారు కోటిన్నర రూపాయలు రైతులకు ఆస్తి నష్టం జరిగింది. రావికమతం మండలం గొంప గ్రామానికి చెందిన రైతులకు చింతపాక రెవిన్యూలో భూములున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలిసి గురువారం రైతులు తమ పొలాల్లోకి వెళ్లి చూడగా వీరి సరుగుడు తోటలు కూడా కాలిపోయినట్టు గుర్తించారు. గొంప గ్రామానికి చెందిన పసుపులేటి సంజయ్, నాగరాజు, నాయుడు, శ్రీను, పెంటారావు, సత్తిబాబు, నరసమ్మ, కన్నంనాయుడు, సతీష్ తదితర రైతులకు చెందిన 30 ఎకరాల్లో తోటలు కాలిపోయాయి. సుమారు రూ.90 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. చింతపాక రెవిన్యూలో భూములండడంతో నష్టాన్ని గుర్తించి పరిహారం అందేలా అధికారులు చూడాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నర్సీపట్నం : పట్టణంలోని అయ్యన్న కాలనీలోని జరిగిన హత్య కేసులో నిందితుడు చిత్రాడ మహేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితుడిని అయ్యన్న కాలనీ జంక్షన్ చింతపల్లి రోడ్డులో ట్రైనీ డీఎస్పీ చైతన్య, సీఐ గోవిందరావు అదుపులోకి తీసుకున్నారన్నారు. అయ్యన్నకాలనీలో ఈ నెల 8వ తేదీన తలుపులమ్మ తల్లి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్ ప్రోగ్రాం వద్ద మృతుడు రుత్తల దుర్గాప్రసాద్తో నిందితుడు మహేష్ గొడవపడ్డాడని, అక్కడ విధి నిర్వహణలో ఉన్న తమ సిబ్బంది ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి పంపించేశారన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు మహేష్ మళ్లీ దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడని, దుర్గాప్రసాద్ ఛాతిలో కత్తితో మూడుసార్లు పొడిచి చంపాడని తెలిపారు. మృతుడి స్పేహితుడు అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిని కూడా గాయపరిచాడన్నారు. ఈ ఘటనలో నిందితుడిపై 75/2025యు/ఎస్103(1)బీఎన్ఎస్ యాక్టు కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిపై టౌన్ స్టేషన్లో మరో కేసు ఉందని, అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేశామన్నారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
మామిడి పండ్లను సంప్రదాయ విధానంలో మగ్గబెట్టాలి
● జేసీ జాహ్నవితుమ్మపాల: సంప్రదాయ, సురక్షిత విధానంలో మగ్గబెట్టిన మామిడి పండ్లను మాత్రమే విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి ఆదేశించారు. జిల్లాలో 12,500 మంది రైతులు 20 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారని, సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల పంటను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఉద్యానశాఖ అధికారులు పండ్లను మగ్గబెట్టే సురక్షిత విధానాలపై రైతులకు, వ్యాపారులకు తెలియజేయాలన్నారు. సబ్బవరం మండలం పినగాడి వద్ద గల రయిపనింగు చాంబర్లను వినియోగించుకునే విధంగా ప్రచారం చేయాలన్నారు. మానవులకు హాని కలిగించే కాల్షియమ్ కార్బైడ్ ఉపయోగించి పండ్లు మగ్గబెట్టే విధానాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని, వ్యాపారులకు కార్బైడ్ వినియోగిస్తే తీసుకునే చర్యల గురించి తెలియజేయాలని తెలిపారు. ఆహార భద్రతా శాఖ సిబ్బంది అధికంగా శాంపిల్స్ సేకరించాలని, కార్బైడ్ వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయాలన్నారు. జిల్లా పంచాయతీ శాఖ, మునిసిపల్ సిబ్బంది ఇందులో పాలు పంచుకోవాలని, రవాణాశాఖ సిబ్బంది మామిడి పండ్ల రవాణా వాహనాలను తనిఖీ చేయాలన్నారు. నర్సీపట్నం, పాయకరావుపేట మార్కెట్ యార్డులు, విశాఖపట్నం రైతుబజార్లలో గల రయిపెనింగు చాంబర్లను వెంటనే వినియోగంలోనికి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆమె ఆదేశించారు. -
టెన్త్ మూల్యాంకనం పూర్తి
డీఈవో అప్పారావునాయుడిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు అనకాపల్లి టౌన్: జిల్లాలోని మూడు కేంద్రాలలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిందని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహించామన్నారు. పరీక్షలు సజావుగా సాగడానికి సహకరించిన కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, విద్యాశాఖాధికారులు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా?
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులన్నా.. పేదలన్నా చులకన భావమని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల పాలనలో రైతుల ఆకలి కేకలు వినిపించడంలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చోడవరం సుగర్స్ రైతుల సమస్యలు, ఉపాధి కూలీల వేతనాల సమస్యలను గాలికొదిలేసి.. వైఎస్సార్ సీపీ నేతలపై దూషణలకు, వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. లాసన్స్బేకాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పది నెలల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. చోడవరం సుగర్ ఫ్యాక్టరీలో లక్ష టన్నులకు పైగా క్రషింగ్ నిలిచిపోయిందని, రైతులకు నేటికీ డబ్బు చెల్లించలేదన్నారు. రైతులకు డబ్బులు ఇవ్వకపోగా.. క్రషింగ్ను కూడా నిలిపివేస్తుంటే కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ మండిపడ్డారు. తక్షణమే కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 75 రోజులుగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం బకాయి పెట్టిందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా 75 రోజుల ఉపాధి వేతనాలను ఆపిన సందర్భాలు లేవన్నారు. కష్టపడ్డ వారికి కూలి డబ్బులు ఇవ్వకుండా నిలిపివేస్తే.. రాష్ట్రంలో పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.700 కోట్లు ఇవ్వాల్సి ఉందని, వేతనాలు ఇవ్వాలని ఉపాధి కూలీలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. తక్షణమే వారి వేతనాల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేస్తే సరిపోదని, ఏ హామీలైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని బొత్స డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. చోడవరం సుగర్ ఫ్యాక్టరీ రైతులకు పేమెంట్లు లేవు ఉపాధి కూలీలకు 75 రోజులుగా వేతనాలు చెల్లించడం లేదు శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం -
●ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
పాలకులు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. వారి యోగక్షేమాలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించాలి. రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. అప్పుడే అది ప్రజా ప్రభుత్వం. తమకు ఓటు వేయలేదనో, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుడనో కక్ష కట్టి నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు తొలగించినా, ఇబ్బందులు పెట్టినా అది ప్రజా కంటక ప్రభుత్వం. కూటమి సర్కారు వచ్చాక జనం అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. దివ్యాంగులు, వృద్ధాప్యంతో బాధ పడుతున్నవారు, రాజకీయాలకు దూరంగా బతికే సామాన్యులను సైతం అధికార పార్టీ ప్రతినిధులు వదిలిపెట్టడం లేదు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే ఏకై క లక్ష్యంగా.. వేధింపులే ఆదర్శంగా.. పింఛన్లను నిలిపివేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 10,136 పింఛన్లకు కోత పెట్టడమే ఇందుకు ఉదాహరణ. వైఎస్సార్సీపీకి ఓటు వేశానని.. నా వయస్సు 70 ఏళ్లు. ఆరేళ్లుగా వృద్ధాప్య పింఛను అందుకుంటున్నాను. వైఎస్సార్సీపీకి ఓటు వేశానని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నా పింఛను తీసేశారు. అధికారులను అడిగితే వస్తాయని చెబుతున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి అర్జీలు ఇచ్చాను. కానీ ఫలితం లేదు. – శ్రీరామ్మూర్తి, వెంకటాపురం, గొలుగొండ మండలంనాకు కన్ను కనిపించదు.. సర్కారుకు గోడు వినిపించదు నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. 2019లో వికలాంగ పింఛన్ మంజూరైంది. 2024 జూన్ వరకు పెన్షన్ వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్ నిలిపివేశారు. పలుసార్లు మండల, డివిజన్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. –నల్లబెల్లి వరలక్ష్మి, పాకలపాడు, గొలుగొండ మండలం కోర్టులోనే న్యాయం జరగాలి నాకు వెన్నుపూస సమస్య ఉంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. వికలాంగుల సర్టిఫికెట్ దాఖలు చేయగా నాకు పింఛన్ మంజూరయింది. గత ఏడాది జూన్ వరకు పింఛన్ అందుకున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చాక నా పెన్షన్ ఆగిపోయింది. దీనిపై కోర్టును ఆశ్రయించాను. –నల్లబెల్లి రాజేశ్వరి, పాకలపాడు, గొలుగొండ మండలంమంచానికే పరిమితం నాకు కాలు, చేయి పనిచేయదు. గత ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. దీంతో జీవనం సాగించేదానిని. కొత్త ప్రభుత్వం వచ్చాక రెండు నెలలు మాత్రమే పింఛన్ ఇచ్చి తరువాత నిలిపివేశారు. అధికారులను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాను. –బంగారు అచ్చియ్యమ్మ, పాకలపాడు, గొలుగొండ మండలంరాజకీయం.. అమానవీయం వృద్ధులు, వికలాంగులు అన్న జాలి లేదు లబ్ధిదారుల సంఖ్యకు కత్తెర వేయడమే లక్ష్యం వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్గా ఏరివేత డోలీ మోతతో నిరసన తెలిపాడని మరొకరి పింఛన్ కట్ మళ్లీ ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని దివ్యాంగులకు వేధింపులు 10 నెలల కూటమి పాలనలో ఏకంగా 10,136 పింఛన్లకు కోత వైఎస్సార్సీపీ మద్దతు సర్పంచ్ తమ్ముడి పింఛను తొలగింపు పింఛన్ వంచన -
ఏఐలో చరణ్తేజ్ ప్రతిభ
● జేఈఈ స్కోర్ లేకుండానే ఐఐటీ హైదరాబాద్లో సీటుయలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లికి చెందిన జెర్రిపోతుల చరణ్తేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ పరీక్ష నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) నిర్వహించిన ప్రవేశ పరీక్షలో మెరిశాడు. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలో రెండు దశల్లో చరణ్తేజ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రంలో ఐఐటీలో సీటు సాధించిన 20 మంది విద్యార్థుల్లో ఒకరిగా నిలిచాడు. ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఐఐటీల్లో కొన్ని ఇంజనీరింగ్ కోర్సుల్లో ఐఐటీ జేఈఈ స్కోర్ లేకుండానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఎన్టీఏ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన జెర్రిపోతుల చరణ్తేజ్కు ఐఐటీ హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ ఏడాది సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశం లభించింది. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా రెండు వేలమందికి వివిధ ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తనకు ఐఐటీ హైదరాబాద్లో సీటు దక్కడం పట్ల చరణ్తేజ్ ఆనందం వ్యక్తం చేశాడు. కోర్సు పూర్తి చేసి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మంచి ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని సాక్షికి తెలిపాడు. చరణ్తేజ్ తండ్రి నాగేశ్వర్రావు వివి ధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఈ సందర్భంగా చరణ్తేజ్ను పలువురు అభినందించారు. చరణ్తేజ్ -
అనిత ఒక ఫెయిల్యూర్ హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర హోంమంత్రిగా వంగలపూడి అనిత విఫలమయ్యారని, ఉమ్మడి విశాఖలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు జరిగితే నియంత్రించలేని అసమర్థురాలిగా మిగిలిపోయారని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదని.. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పిన మాట అని గుర్తు చేశారు. హోంమంత్రి ఒక దళిత ఐపీఎస్ను వేధిస్తున్న పరిస్థితులు చూస్తున్నామన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి అనిత రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించకుండా.. మా నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో 16,800 మంది మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు జరిగినట్లు హోంమంత్రి అనిత శాసనసభలో చెప్పారని, అంటే సగటున గంటకు ముగ్గురిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వరుసగా మహిళలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతుంటే.. హోం మంత్రి కనీసం బాధిత మహిళలను పరామర్శించి ధైర్యం చెప్పలేదని, ఆమె షాపింగ్మాల్స్ ప్రారంభోత్సవాలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ను శక్తి యాప్గా పేరు మార్చి.. ఏదో సాధించినట్టు గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా రాష్ట్రంలో శాంతిభద్రతలపై దృష్టి సారించాలని హితవు పలికారు. మహిళలపై అఘాయిత్యాలు నియంత్రించలేని అసమర్థురాలు మాజీ సీఎం వైఎస్ జగన్పై దూషణలు ఆపి పాలనపై దృష్టి పెడితే మంచిది వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ నాగ మల్లీశ్వరి సూచన -
అడుగంటుతున్న పెద్దేరు
మాడుగుల: పెద్దేరు జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడంతో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 134 మీటర్లకు తగ్గిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 135 మీటర్లు ఉంది. వర్షాలు అనుకూలించకపోతే ఖరీఫ్లో చెరకు, వరి, నువ్వు చేలకు ఇబ్బందిగా ఉంటుందని పెద్దేరు జలాశయం ఆయకట్టు రైతులు చెబుతున్నారు. జలాశయం ఖరీఫ్ ఆయకట్టు 15 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 10 వేల ఎకరాల్లో సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. పంట కాలువలకు మరమ్మతులు చేపడతామని రబీ వరి సాగుకు సాగునీరు విడుదల చేయలేదు. వ్యవసాయ మోటార్ల వద్ద అక్కడక్కడ రబీ వరి చేలు సాగు చేసుకున్నారు. కానీ పెద్దేరు జలాశయం పంట కాలువ మరమ్మతు పనులు నేటికీ ప్రారంభించకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పంట కాలువ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
పద్మనాభం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన పద్మనాభం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వానపల్లి వెంకటరమణ(60) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈయన ఎస్.రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విశాఖపట్నంలో పదో తరగతి మూల్యాంకనానికి వెళ్లి సాయంత్రం పద్మనాభంలోని తన ఇంటికి వచ్చాడు. అనంతరం సొంత పని మీద ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో రామనారాయణపురం సమీపంలో వెనుక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణకు తీవ్ర గాయాలు కాగా విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. వెంకటరమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఎంబీఏ, కుమార్తె పీజీ పూర్తి చేశారు. వెంకటరమణ మృతిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
టీడీఆర్ బాండ్లు మాకొద్దు
● మాట నిలుపుకోండి.. పరిహారం జమ చేయండి ● ఆర్డీవోకు పూడిమడక రోడ్డు విస్తరణ బాధితుల స్పష్టీకరణ ● మునగపాకలో టీడీఆర్ బాండ్లపై అవగాహన సమావేశంమునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణలో భూములు, గృహాలు కోల్పోతున్న నిర్వాసితులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారాన్ని నేరుగా అకౌంట్లో జమ చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ కోరారు. రహదారి విస్తరణ ప్రతి ఒక్కరికీ సమ్మతమేనని, అయితే గత గ్రామసభల్లో ఇచ్చిన హామీకి కట్టుబడాలన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ ఎస్.ఆదిమహేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ.. టీడీఆర్ బాండ్ల వలన తమకు ప్రయోజనం లేదని, ప్రభుత్వం నేరుగా పరిహారాన్ని అకౌంట్లో జమ చేయాల్సిందేనని పట్టుబట్టారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణకు సంబంధించి గత వైఎస్సార్సీపీ హయాంలోనే పరిహారం నిర్ణయించారని, అయితే పెరిగిన భూమి ధరలకు అనుగుణంగా పరిహారం పెంచుతారని నిర్వాసితులు ఆశించారన్నారు. అయితే రహదారి విస్తరణ జరిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశతో గతంలో నిర్ణయించిన ధరకు అంగీకరించారన్నారు. పరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో ఇవ్వడం వలన ప్రయోజనం ఉండదన్నారు. ఇందుకు స్పందించిన ఆర్డీవో ఆయిషా మాట్లాడుతూ తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రహదారి విస్తరణ అవసరమన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం టీడీఆర్ బాండ్లను పరిహారంగా ఇస్తుందని చెబుతూ.. ఈ బాండ్ల వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, స్థానికులు దొడ్డి శ్రీనివాసరావు, టెక్కలి పరశురామ్, ఆడారి అచ్చియ్యనాయుడు, దాడి ముసిలినాయుడు, ఆడారి శ్రీకాంత్, వీఆర్వో సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో మరో దారుణం
● జాతరలో ఘర్షణ.. యువకుడి హత్యనర్సీపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా లభ్యమవుతున్న మద్యంతో నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయి. పట్టణంలో కొద్ది కాలంలోనే రెండు హత్యలు జరిగాయి. ఇవి మద్యం మత్తులో జరిగిన దారుణాలు కావటం గమనార్హం. ఆరు నెలల క్రితం కొత్తవీధిలో యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. తాజాగా అయ్యన్నకాలనీలో తలుపులమ్మ తల్లి జాతరలో మద్యం మత్తులో మరో హత్య జరిగింది. ఈ ఘటనలో నీలంపేట గ్రామానికి చెందిన రుత్తల దుర్గాప్రసాద్ (22) ప్రాణాలు కోల్పోయాడు. టౌన్ సీఐ గోవిందరావు కథనం ప్రకారం.. అయ్యన్నకాలనీలో మంగళవారం రాత్రి తలుపులమ్మ తల్లి జాతర జరిగింది. జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ స్టేజ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మృతుడు రుత్తల దుర్గాప్రసాద్, తన స్నేహితుడైన మాకవరపాలెం మండలానికి చెందిన పైల సాయితో కలిసి అక్కడికి వచ్చాడు. అదే కాలనీకి చెందిన చిత్రాడ మహేష్ స్టేజ్ వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న మహేష్, మృతుడు దుర్గాప్రసాద్ స్టేజ్ ప్రోగ్రాం విషయంలో గొడవపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురికీ సర్దిచెప్పి పంపించేశారు. దుర్గాప్రసాద్, సాయి అదే కాలనీలో ఉంటున్న వాళ్ల అన్నయ్య ఇంటికి వెళ్లి పడుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మహేష్ తన అనుచరులతో దుర్గాప్రసాద్ అన్న ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగాడు. తన వెంట తీసుకెళ్లిన కత్తితో దుర్గాప్రసాద్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న దుర్గాప్రసాద్ను నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు హత్యకు గురికావడంతో తల్లి దేవుడమ్మ కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. ఇటీవల మృతుడి తండ్రి మృతి చెందారు. ఈ హత్యా ఉదంతంతో ఆ కుటుంబం మగదిక్కును కోల్పోయింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతుడి స్నేహితుడు సాయికి స్వల్ప గాయాలయ్యాయి. బహిరంగ మద్య సేవనంతోనే హత్యలు : సీఐ హత్యకు పాల్పడిన మహేష్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని సీఐ గోవిందరావు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడబడితే అక్కడ బహిరంగంగా మద్యం సేవించడం వల్ల ఎక్కువగా నేరాలు జరగుతున్నాయన్నారు. రోజుకు పదికిపైగా మద్యం కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అయినా నేరాలు ఆగటం లేదన్నారు. -
ఒక్కో వ్యక్తికి ఒక్కో పోలీసు పెట్టాలా.. హోం మంత్రి అనిత అసహనం
విశాఖ సిటీ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా వైఫల్యంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. వారు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక చిందులు తొక్కారు. మాజీ మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రామగిరి పర్యటనలో భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు జగన్ పర్యటనకు భద్రత కల్పించలేక ప్రభుత్వం చేతులెత్తేసిన అంశంపై హోం మంత్రికి ప్రశ్నలు సంధించారు. జగన్ పర్యటనకు భారీగా జనాలు వస్తారని గుర్తించలేకపోవడం ఇంటెలిజెన్స్ వైఫల్యమా? డ్రోన్, సీసీ కెమెరాల సర్వైలెన్సు ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా వలయం బలహీనంగా ఉందా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి అనిత ముందు సమాధానం చెప్పలేక తడబడ్డారు. కొద్ది క్షణాల తర్వాత 1100 మందితో భద్రత కల్పించామని, అందరూ తోసుకెళ్లడంతో హెలికాఫ్టర్కు లైట్ క్రాక్ మాత్రమే అయిందని చాలా తేలికగా మాట్లాడారు. అంత మందితో భద్రత కల్పించినా జనాలు తోసుకుంటూ రావడం పోలీసుల వైఫల్యం కాదా? అని మీడియా అడిగితే.. ఒక్కో మనిషికి ఒక్కో పోలీస్ను పెట్టాలా? అని తిరిగి మంత్రి విచిత్రంగా ప్రశ్నించారు. ఇంతలో మరో ప్రశ్న వేస్తున్న సమయంలో అనిత మీడియాపై రుసరుసలాడుతూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. జగన్ భద్రతా వైఫల్యంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన హోం మంత్రి -
కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి
అనకాపల్లి : పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల దర్యాప్తు పురోగతిని సి.సి.టి.ఎన్.ఎస్. (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కు సిస్టమ్)లో సమయానికి నమోదు చేయాలని రాష్ట్ర ఐజీ ఎఫ్.ఎస్.ఎల్. డైరెక్టర్ జి.పాలరాజు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంత నేర సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అన్ని రివ్యూ మీటింగులు సి.సి.టి.ఎన్.ఎస్. ఆధారంగా నిర్వహించనున్నందున, ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలు దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో నిందితుల ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా త్వరితగతిన లోకేషన్ గుర్తించి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పోలీస్ స్టేషన్లో ఎక్కువగా ఏ రకమైన కేసులు నమోదు అవుతున్నాయో గుర్తించి, సమీక్షించి తగ్గించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టీ కేసుల నమోదు, కోర్టులలో జరిమానా విధింపు తదితర అంశాలపై కోర్టు కానిస్టేబుళ్లను అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ డ్రోన్న్ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, పండగలు, జాతర్ల వద్ద నిఘా పెంపు చేయాలని, పేకాట, ఓపెన్ డ్రింకింగ్, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాలు, ప్రార్థనా స్థలాలు, లేడీస్ హాస్టళ్ల భద్రత కోసం సీసీ కెమెరాలు, వాచ్మెన్ ఏర్పాటు చేయించాలన్నారు. హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచి, కౌన్సెలింగ్ ఇవ్వాలని, హత్య, అత్యాచారం, గంజాయి, రోబరీ, దొంగతనాలు, పోక్సో కేసుల్లో నిందితులపై ప్రత్యేక దృష్టి సాధించి, అవసరమైతే రౌడీ/హిస్టరీ షీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కృష్ణ చైతన్య, సీఐలు లక్ష్మణమూర్తి, టి.లక్ష్మి, రమేష్, గఫూర్, ఎస్ఐలు ప్రసాద్, సురేష్, వెంకన్న, రమణయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ఐజీ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ పాలరాజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించిన ఎస్పీ సిన్హా -
కెమికల్ మీద పడి కార్మికుడి మృతి
● ఎస్టార్ కెమికల్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ బుచ్చెయ్యపేట: పొట్ట కూటి కోసం పనికి వెళ్లిన యువకుడు కెమికల్ మీద పడి మృత్యువాత పడ్డాడు. బుచ్చెయ్యపేట మండలం నీలకంఠాపురానికి చెందిన పడాల హరినాథ్ (22) మంగళవారం గ్రామ యువకులతో కలిసి అచ్యుతాపురంలో గల ఎస్టార్ కెమికల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లాడు. దినసరి కార్మికుడిగా ప్రైవేటు కాంట్రాక్టర్ వద్ద చేరిన ఈ యువకుడు కెమికల్ ఖాళీ డబ్బులను లారీకి ఎక్కించుకుని పరవాడ వద్ద తుక్కు దుకాణం వద్ద అప్పగిస్తుంటాడు. ఆ క్రమంలో పరవాడలో తుక్కు ఇనుప కొట్టు వద్ద దించుతుండగా డబ్బా ఒకటి మూత ఊడిపోయి అందులో ఉండిపోయిన కెమికల్ శరీరంపై పడింది. దీంతో హరినాథ్ ఒళ్లంతా బొబ్బలెక్కి గాయాలై అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. అతన్ని వెంటనే కూర్మన్నపాలెంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్ధితి విషమంగా ఉండటంతో రాత్రికి విశాఖ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ హరినాథ్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పడాల కన్నంనాయుడు, రాజ్యలక్ష్మిలకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు దివ్యాంగుడు కావడంతో రెండో హరినాథ్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. డిగ్రీ చేసి ఖాళీగా ఉండటంతో పది రోజులుగా హరినాథ్ గ్రామస్తులతో కలిసి అచ్యుతాపురం కూలీ పనులకు వెళ్లి వస్తున్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎస్టార్ యాజమాన్యం శుభ్రపరచకుండా సరైన నిబంధనలు పాటించకుండా విషపూరితమైన కెమికల్ ఖాళీ డబ్బాలు నిర్లక్ష్యంగా తరలించడం వల్ల హరినాథ్ మృత్యువాత పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు, మిత్రులు ఆరోపిస్తున్నారు. హరినాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విశాఖ వెళ్లి ఎస్టార్ కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడంతో హరినాథ్ మృతదేహానికి పోస్టుమార్టమ్ పూర్తికాక కేజిహెచ్లోనే ఉండిపోయింది. జెడ్పీటీసీ దొండా రాంబాబు, సర్పంచ్ పడాల నాగభూషణం, మాజీ సర్పంచ్ కోట సత్యనారాయణ విశాఖ వెళ్లి హరినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఉద్దండపురంలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి
● ప్రత్యర్థులు కొట్టడం వల్లే చనిపోయిందని కుటుంబీకుల ఫిర్యాదు ● కేసు నమోదు చేసిన పోలీసులు నక్కపల్లి : మండలంలో ఉద్దండపురం గ్రామంలో ఆవాల లక్ష్మి (60) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మరణించింది. తన తల్లి మరణానికి తనతో గొడవపడిన వ్యక్తులే కారణమని, తనను తన తల్లిని తీవ్రంగా గాయపరచడం వల్లే అనారోగ్యానికి గురై మరణించిందని మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే ఉద్దండపురం గ్రామానికి చెందిన అవాల సురేష్ మార్నింగ్ స్టార్ బస్సులో, ఇదే గ్రామానికి చెందిన వెలం శెట్టిశ్రీను షామోలి బస్సులో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా సురేష్ తాను పనిచేసే బస్సులో మానేసి షామోలి బస్సులో పనిచేసేందుకు హైదరాబాద్ బయలు దేరాడు. ఈ విషయం తెలుసుకున్న వెలం శెట్టి శ్రీను షామోలి బస్సులో క్లీనర్గా పనిచేస్తున్న కుర్ర సాయికి ఫోన్ చేసి ఆవాల సురేష్ గురించి దుర్భాషలాడాడు. ఈ విషయం తెలిసిన సురేష్, శ్రీనుతో ఫోన్లో గొడవపడ్డాడు. ఈనెల 4వ తేదీన ఇరువర్గాలు గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టుకుని బాహాబాహీకి తలపడ్డారు. ఈ ఘర్షణలో వెలంశెట్టి శ్రీను అతని కుటుంబ సభ్యులు సురేష్, అతని తల్లిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో సురేష్ తల్లి తీవ్ర అస్వస్థతకు గురయింది. కడుపులో నొప్పి రావడంతో ఏడో తేదీన నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తునిలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నయం కాకపోవడంతో అక్కడ నుంచి విశాఖలో కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మరణించింది. దీంతో తన తల్లి మరణానికి వెలం శెట్టి శ్రీను, అతని కుటుంబ సభ్యులు దాడి చేయడమే కారణమని వారు కొట్టడం వల్లే తన తల్లి అనారోగ్యానికి గురై మరణించిందని మృతురాలు కుమారుడు ఆవాల సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేజీహెచ్కు పంపిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నక్కపల్లి ఆస్పత్రిలో ఉన్న లక్ష్మి మృతదేహాన్ని సీఐ కుమార స్వామి పరిశీలించారు. బాధిత కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించారు. శ్రీను కుటుంబ సభ్యులు దాడి చేయడం వల్లే లక్ష్మి మరణించిందని వైద్యులు ధ్రువీకరిస్తే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
హడలెత్తించిన గిరి నాగు
దేవరాపల్లి: నాగయ్యపేట, వేపాడ మండలం కొప్పలవానిపాలెం సరిహద్దు పంట పొలాల్లో భారీ గిరినాగు బుధవారం స్థానిక రైతులను హడలెత్తించింది. నాగయ్యపేట గ్రామానికి చెందిన కొమ్మినేని కృష్ణ, సన్యాసినాయుడు పొలాల్లోకి గిరి నాగు చొరబడుతుండగా స్థానిక రైతుల కంట పడింది. సుమారు 12 అడుగుల పొడవున్న గిరి నాగును చూసిన స్థానిక రైతులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. సమీప కొప్పవానిపాలేనికి చెందిన స్నేక్ క్యాచర్ కృష్ణకు స్థానికులు సమాచారం అందించారు. అరగంటకు పైగా శ్రమించి గిరినాగును అతి కష్టం మీద పట్టుకున్నారు. పట్టుకున్న గిరినాగును అటవీ అధికారుల సమక్షంలో దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు స్నేక్ క్యాచర్ కృష్ణ తెలిపారు. -
చేపలకు చికెన్ మేత!
దేవరాపల్లి : చెరువుల్లో చేపలకు మేతగా యధేచ్చగా చికెన్ వ్యర్థాలను తరలిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాల నుంచి సేకరించిన కోళ్ల వ్యర్ధాలతో కొందరూ మాఫియాగా ఏర్పడి దర్జాగా వ్యాపారం చేస్తూ కాసులు గడిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి విశాఖతో పాటు పొరుగు జిల్లాలకు సైతం కోళ్ల వ్యర్థాలను తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ వ్యర్థాలను తినే చేపలను తింటే క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నా మాఫియా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్లాస్టిక్ డ్రమ్ల్లో నింపి వాహనాల్లో తరలిస్తున్నారన్నారు. కోళ్ల వ్యర్థాలను తినడం వల్ల త్వరగా చేప బరువు పెగడంతో పాటు మేత ఖర్చు కూడా తగ్గుతుండడంతో చేపల చెరువుల నిర్వాహకులు వీటిపైనే మొగ్గు చూపుతున్నారన్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలో ఈ చికెన్ వ్యర్ధాల దందా బహిరంగంగా జరుగుతున్నా, పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కోళ్ల వ్యర్ధాలతో పెంచిన చేపలను తినడం వల్ల క్యాన్సర్ కాలేయ, జీర్ణకోశ, గ్యాస్ట్రిక్, మలబద్దకం, ఫైల్స్, చర్మ వ్యాధులు, ప్రేగుల్లో పుండ్లు తదితరరోగాలు వస్తాయని నిపుణులు చెబుతన్నారన్నారు. కోళ్ల వ్యర్థాలను నిల్వ చేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు. ఇప్పటికై నా అధికారులు మామ్మూళ్ల మత్తు వీడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కోళ్ల వ్యర్థాల మాఫియాను కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా చికెన్ వ్యర్థాల వినియోగం ప్రజారోగ్యంతో చెలగాటం పట్టించుకోని పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు సీపీఎం నేత వెంకన్న ధ్వజం -
ఉద్యోగ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ
తుమ్మపాల: జిల్లాలో గల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకు రెండు ఉద్యోగ మేళాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 2025–26 సంవత్సరానికి రూపొందించిన ఉద్యోగ మేళా వార్షిక క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశంలో ఈమేరకు సీఎం ఆదేశించారని చెప్పారు. క్యాలెండర్ను అనుసరించి ఉద్యోగ మేళాలు నిర్వహించాలన్నారు. 14న అంబేడ్కర్ జయంత్యుత్సవం ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా చేపడుతున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. అనకాపల్లి పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో గల అంబేడ్కర్ విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని, అనంతరం స్థానిక ఎస్ఆర్ శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్లో జయంత్యుత్సవ సభ నిర్వహిస్తామన్నారు. -
సొమ్మొకడిది.. సోకొకడిది అన్న చందంగా ఉంది కూటమి నేతల ప్రచార కండూతి. అధికారంలోకి వచ్చాక ఒక్క గ్రామానికి కూడా సరైన రోడ్డు సదుపాయం కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనతను సైతం తన ఖాతాలో వేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ఏమాత్రం సిగ్గుపడడం లేదు. పక్కనున్న
గిరిజన గ్రామాల కష్టాలను తొలగించి పూర్తి స్థాయిలో రహదారి సమస్య పరిష్కరించేందుకు గత ప్రభుత్వం నక్కపల్లి మండలం రేబాక నుంచి కోటవురట్ల మండలం అల్లుమియ్యపాలెం వరకు 11 కిలోమీటర్ల మేర తారురోడ్డు నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరు చేసింది. అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కాపు కార్పొరేషన్ మాజీ డైరక్టర్ వీసం రామకృష్ణ సమస్యను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి వెంటనే నిధులు మంజూరు చేశారు. సీతంపాలెం నుంచి రేబాక తిరుపతిపాలెం మీదుగా కోటవురట్ల మండలం అల్లుమియ్యపాలెం వరకు మట్టి రోడ్డు ఉంది. నక్కపల్లి మండల ప్రజలు కోటవురట్ల, నర్సీపట్నం వెళ్లాలంటే సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. రేబాక నుంచి ఉద్దండపురం వచ్చి అక్కడ నుంచి అడ్డురోడ్డు మీదుగా కోటవురట్ల వెళ్లాలి. అలాగే సీతంపాలెం ప్రజలు నక్కపల్లి చేరుకుని అడ్డురోడ్డు మీదుగా కోటవురట్ల మండలంలో గ్రామాలకు వెళ్లాల్సి వచ్చేది. మట్టిరోడ్డుపై అనేక వ్యయప్రయాసలు పడి రాకపోకలు సాగించేవారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక నాయకులు సీతంపాలెం నుంచి రేబాక తిరుపతిపాలెం మీదుగా అల్లుమియ్యపాలెం గిరిజన గ్రామం వరకు 11.6 కిలోమీటర్ల దూరం కలిగిన తారురోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వంలో రూ.8 కోట్ల నాబార్డు నిధులు మంజూరు చేయించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కోటవురట్ల, నక్కపల్లి మండలాల మధ్య 20 కి.మీ. దూరం తగ్గుతుంది. ఈ మార్గంలో ఉన్న మామిడి, జీడి తోటల్లో పండించిన ఉత్పత్తులను గిరిజనులు మార్కెటింగ్ చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. రైతులకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఏడాది క్రితమే రోడ్డు పనులకు పనులకు శంకుస్థాపన జరిగింది. రహదారి మధ్యలో బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రావెల్, మెటల్ వేసి రోడ్డు పనులను గత ప్రభుత్వంలోనే సగం వరకు పూర్తిచేశారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో పనులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల క్రితమే పనులు పునఃప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు పూర్తి చేసే ప్రక్రియ మొదలు పెట్టగా.. ఈ రోడ్డుకు కూటమి ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయని, మంత్రి అనిత చొరవతోనే ఇది సాధ్యమయ్యిందంటూ కొంతమంది కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కూటమి నాయకులు పెడుతున్న పోస్టులను ప్రజలు తిప్పి కొడుతున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇదే సమస్య ఉన్నప్పటికీ పైసా నిధులు విడుదల చేయించలేని కూటమి నాయకులు ఇప్పుడిలా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని జనం విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించిన కల్వర్టు రేబాక నుంచి అల్లుమియ్యపాలెం వరకు మెటల్ వేసి నిర్మించిన రోడ్డు.. 11.6 కి.మీ. రోడ్డులో 5 కి.మీ. గత ప్రభుత్వ పాలనలో పూర్తయింది.. మిగతా రోడ్డును ఇప్పుడు నిర్మిస్తున్నారు.. 11 కి.మీ. తారురోడ్డు నిర్మాణంలో సగం ఆనాడే పూర్తి ఎన్నికల ముందే రోడ్డు పనులు ప్రారంభం ఎన్నికల ముందే రేబాక రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది మార్చిలో రేబాక, సీతంపాలెం గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలు రావడంతో పనులు ఆగాయి. తాజాగా మొదలు మళ్లీ మొదలయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రూ.8 కోట్లు మంజూరయ్యాయి. టీడీపీ నాయకులు తమ ప్రభుత్వవంలో రోడ్డు మంజూరయిందని తప్పుడు ప్రచారం చేసుకోవడం దారుణం. మా గ్రామానికి వచ్చి తెలుసుకుంటే మంచిది. – గాడి వీర్రాజు, రేబాక వైఎస్సార్సీపీ సర్కారు సమస్య తీర్చింది చాలా ఏళ్లుగా ఈ రోడ్డు నిర్మించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వం 30 ఏళ్లు పరిపాలించింది. ఒక్కసారి కూడా ఈ సమస్య గురించి ఆలోచించలేదు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, వైఎస్సార్సీపీ నాయకుడు వీసం రామకృష్ణ, సర్పంచ్ సాదిరెడ్డి శ్రీను కృషి వల్ల మా గ్రామం నుంచి అల్లుమియ్యపాలెం గ్రామానికి తారురోడ్డు మంజూరు చేశారు. కల్వర్టులు అప్పుడే నిర్మించారు. రోడ్డు కూడా సగం అప్పుడే పూర్తయింది. – సాదిరెడ్డి శేఖర్, రేబాక -
తీర ప్రాంతాల్లో ‘సాగర్ కవచ్’
కొమ్మాది: సాగర తీర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సాగర్ కవచ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం భీమిలి, మంగమారిపేట, రుషికొండ, సాగర్నగర్ బీచ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రుషికొండ బీచ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ పి.మనోజ్ కుమార్ తీర ప్రాంతాల అప్రమత్తతపై మత్స్యకారులకు, పర్యాటకులకు వివరించారు. తీర ప్రాంతాల వెంబడి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఎలా ఎదుర్కొని పోలీసులకు సమాచారం ఇవ్వాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి, గూఢచారి వ్యవస్థలను ఎలా కనుగొనాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీఐజీ పర్యటన సాగర్కవచ్లో భాగంగా రుషికొండ బీచ్లో బుధవారం రాత్రి మైరెన్ డీఐజీ గోపినాథ్ జెట్టీ పర్యటించారు. ఇక్కడ బీచ్లోని పర్యాటకులతో కాసేపు మాట్లాడి, మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆయన వెంట మైరెన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు మురళీకృష్ణ, పి. మనోజ్కుమార్ తదితరులు ఉన్నారు. -
50 ఎకరాల్లో సరుగుడు తోటలు దగ్ధం
● రూ.1.50 కోట్ల ఆస్తి నష్టంబుచ్చెయ్యపేట : మండలంలో గల చింతపాక, గున్నెంపూడి గ్రామాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 50 ఎకరాల్లో సరుగుడు తోటలు దగ్గం కాగా కోటి 50 లక్షలు వరకు ఆస్ధినష్టం జరిగింది. బుధవారం మధ్యహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి కిలోమీటరన్నర దూరంలో ఉండటంతో రైతులు అగ్ని ప్రమాదాన్ని ముందుగా గుర్తించలేదు. సరుగుడు తోటల్లో నుండి పొగ రావడంతో రైతులు తీవ్ర ఎండలో పొలాల్లోకి పరుగులు తీశారు. అప్పటికే చాలా మంది రైతుల సరుగుడు తోటలు పూర్తిగా మంటల్లో కాలిపోగా మిగిలిన రైతులంతా కలిసి మంటలను అదుపు చేశారు. చింతపాకతో పాటు పక్కనే ఉన్న రావికమతం మండలం గొంప రెవిన్యూ వరకు మంటలు వ్యాపించాయి. చింతపాక రెవిన్యూలో ఉన్న సోమయాజులు చెరువు కింద ఉన్న భూముల్లో కొంగా నాగరాజు,రమణ,రాజు,సలాది సత్యం, నాగరాజు,పరవాడ నాగరాజు,బంగారు నాయుడు,పరవాడ తమ్మునాయుడు,పాకంశెట్టి సన్యాసిరావు,కొంగా రాజబాబు,సలాది గణ,సత్తిబాబు,చెల్లిబాబు,దుర్గమ్మ,శాంభయ్య,నూకాలమ్మ,నిట్టా సత్తిబాబు తదితర రైతుల సరుగుడు తోటలు కాలిపోయాయి. సుమారు 80 మంది రైతులకు చెందిన సరుగుడు తోటలు కాలిపోగా రూ.కోటి 50 లక్షలు వరకు ఆస్ధి నష్టం జరిగిందని బాధిత రైతులు వాపోయారు. మంటలు ఆర్పడానికి 101కి ఫోన్ చేయగా విశాఖ అగ్నిమాపక అధికారులు ఫోన్లో మాట్లాడి రావికమతం అగ్నిమాపక అధికారులు నెంబర్ 08934 226111కి ఫోన్ చేయమన్నారు. ఈ నెంబర్కు ఫోన్ చేసినా పని చేయలేదని బాధిత రైతులు తెలిపారు. దీనిపై రావికమతం అగ్నిమాపక సిబ్బందిని వివరణ కోరగా విద్యుత్ సరఫరా లేకపోతే ఫోన్ పనిచేయదన్నారు. ఒక్కో రైతుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
● నిలిచిన డ్రెడ్జింగ్
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మంగళవారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు సాధారణ స్థాయికి మించి ఎగసిపడ్డాయి. ఈ ప్రభావం సబ్మైరెన్ మ్యూజియం వెనుక భాగంలో జరుగుతున్న డ్రెజ్జింగ్ పనులపై పడింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటాల ధాటికి డ్రెడ్జర్ నుంచి తీరానికి ఇసుకను తరలించడానికి ఉపయోగించే భారీ రబ్బరు ట్యూబ్ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీంతో డ్రెజ్జింగ్ పనులు నిలిచిపోయాయి. ఈ రబ్బరు ట్యూబ్ను తిరిగి డ్రెజ్జర్కు అనుసంధానించి పనులను ప్రారంభించేందుకు డీసీఐ చర్యలు తీసుకుంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ప్రభుత్వ భూమి కబ్జా
ఆర్ భీమవరంలో 110 ఎకరాల ● అనకాపల్లికి చెందిన వ్యాపారి, టీడీపీ నాయకుడి చేతుల్లో కబ్జా స్థలం ● గ్రామదేవత పడమటమ్మ ఆలయ భూమి ఆక్రమణ ● పట్టించుకోని అధికారులు ● గ్రామస్తుల ఆగ్రహం బుచ్చెయ్యపేట : మండలంలోని ఆర్.భీమవరం గ్రామంలో సుమారు 110 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న అనకాపల్లికి చెందిన వ్యాపారులు, గ్రామ నాయకుడు కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. సుమారు రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఆక్రమణకు గురైన భూముల్లో గ్రామదేవత పడమటమ్మ ఆలయానికి చెందిన భూములు కూడా ఉన్నాయి. ఆక్రమణదారులపై గ్రామస్తులు ఎదురుతిరిగినా రెవిన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూడడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామదేవత పడమటమ్మకు చెందిన 10 భూములతో పాటు కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను అధికారులు కాపాడకపోతే టెంట్ వేసి ధర్నాకు దిగడానికి గ్రామస్తులు సన్నద్ధమౌవుతున్నారు. వివరాలివి. ఆర్.భీమవరం గ్రామ శివారులో సర్వే నంబర్ 173లో సుమారు 70 ఎకరాలు, సర్వే నంబర్ 221లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 173 సర్వే నంబర్లో 35 ఏళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన నిరుపేదలు నిట్టా కొండయ్య, మండపాటి దేముడు, వెలంకాయల గంగులుకి డీ పట్టాలు ఇచ్చినట్టు రికార్డుల్లో ఉన్న ఈ భూములు కూడా అనకాపల్లికి చెందిన బడా వ్యాపారుల కబ్జాలో ఉన్నాయి. పూర్వం నుంచి అమ్మవారికి కేటాయించిన భూములను సైతం ఇటీవల గ్రామ నాయకుడు ఆక్రమించి ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటి కబ్జా చేయడంపై గ్రామస్తులంతా కలిసి తిరగబడ్డారు. ఫెన్సింగ్ను పీకేయడానికి చూడగా ఇరువర్గాల వారికి గొడవలు జరిగాయి. అయినా రెవిన్యూ అధికారులు సర్వే చేసి అమ్మవారి భూములు అప్పగించలేదు. సర్వే నంబర్ 173లో ఉన్న 70 ఎకరాలకు పూర్తి స్థాయిలో సర్వే చేసి పట్టాలిచ్చిన పేదలకు భూములు కేటాయించాలని, అమ్మవారి భూములు కేటాయించి సరిహద్దులు తేల్చాలని, సర్వే నంబర్ 221లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిని పేదలకు పంచాలని రెండు నెలల క్రితం గ్రామ నాయకులు, ప్రజలు కవల సతీష్, రాజారావు, వెలంకాయల అప్పారావు, మండపాక నూకరాజు, శ్రీనివాస్, కాలపురెడ్డి నగేష్ తదితరులు ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజుకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే చేయించి అమ్మవారి భూములను కబ్జా అవనీయకుండా కాపాడతానని ఎమ్మెల్యే మాట ఇచ్చినా నేటికీ అధికారులు సర్వే చేయలేదని, ఆక్రమణలు తొలగించలేదని గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. ఆర్.భీమవరంలో ప్రభుత్వ భూములను, గ్రామదేవత పడమటమ్మ ఆలయ భూములను కాపాడకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి గ్రామస్తులు సన్నద్ధం అవుతున్నారు. ఇదే గ్రామంలో మరో భూమాయ ఇప్పటికే ఇదే గ్రామంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని జిరాయితీ భూమిగా తప్పుడు సర్వే నంబర్లు వేసి ఒక వ్యాపారికి గ్రామ నాయకుల ద్వారా అమ్మకాలు చేశారు. ఇటీవల రీ సర్వేలో అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో వ్యాపారి కడియాల రాజేశ్వరరావు మోసపోయానని తెలుసుకున్నాడు. తాను కొన్న భూమిని తిరిగి ఇచ్చేయాలని గ్రామ నాయకులు ఒత్తడి చేయడంతో విసుగు చెందిన వ్యాపారి ఈ నెల 3వ తేదీన జిల్లా కలెక్టర్ విజయ్కృష్ణన్ను కలిసి 30 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు తన వద్ద ఉన్న భూ రికార్డులను కలెక్టర్కు అందజేశారు. జిల్లా అధికారులు ఆర్. భీమవరం రెవిన్యూలో పూర్తి స్థాయిలో భూ సర్వే చేయిస్తే మరిన్ని భూ కబ్జాలు బయటపడతాయని, ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ లక్ష్మిని వివరణ కోరగా జిల్లా అధికారులు దృష్టికి తీసికెళ్లి పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. -
రుషిల్ డెకార్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
అచ్యుతాపురం రూరల్: రుషిల్ డెకార్ పరిశ్రమలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత బాయిలర్ ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. 10 రోజులుగా షట్ డౌన్ పనులు చేసి ట్రయల్ చేస్తున్న సమయంలో ఇన్సులేషన్ మీద ఫెర్మిక్ ఫ్యూయల్ పడి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కార్మికులు చెబుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు. అయితే పరిశ్రమ యాజమాన్యం అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. షట్ డౌన్ అనంతరం ట్రయల్ చేసే సమయంలో చుట్టుపక్కల కెమికల్ అవశేషాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు వహించకపోవడం వలనే అగ్ని ప్రమాదం జరిగిందని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్లైవుడ్ తయారు చేసే ఈ పరిశ్రమ ప్రాంగణంలో వేల టన్నుల కలప ఉన్నందున అగ్ని ప్రమాదం భారీ స్థాయిలో జరిగి ఉంటే కోట్ల విలువైన రుషిల్ పరిశ్రమతోపాటు చుట్టుపక్కల చాలా కంపెనీలు, గ్రామాలు అగ్నికి ఆహుతై ఉండేవని కార్మికులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ నిండా పెద్ద ఎత్తున ఎండిన వేల టన్నుల కలపతోపాటు ప్లైవుడ్ తయారీకి ఉపయోగించే కెమికల్స్ను కూడా నిల్వ చేశారు. ఒక్క అగ్గి రవ్వ పడినా.. మార్టూరు గ్రామానికి సమీపంలో రుషిల్ డెకార్ పరిశ్రమ ప్రాంగణంలో వేల టన్నుల కర్రల మేట అనధికారికంగా నిల్వ చేసి ఉన్నారు. ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేకుండా గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన కర్రల నిల్వ అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఏ ఒక్క చిన్న అగ్గి రవ్వ ఆ ఎండిన కర్రలపై పడినా మార్టూరు గ్రామంతో పాటు సెజ్ పునరావాస దిబ్బపాలెం పంచాయతీ అంతా అగ్ని ప్రమాదానికి గురవుతుందని భయాందోళన చెందుతున్నారు. ప్రమాదంపై పూర్తి విచారణ చేపట్టాలి ఈ సంఘటనపై సీఐటీయూ నాయకులు ఉదయం గేటు లోపల ఉన్న పరిశ్రమ సిబ్బందిని ప్రశ్నించగా వారు అసలు ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని తొలుత బుకాయించారు. అయితే తమ దగ్గర ఉన్న వీడియోలను వారికి చూపించడంతో రాత్రి అగ్నిప్రమాదం జరిగిందని అంగీకరించారు. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బయట ప్రపంచానికి తెలియనీయకుండా పరిశ్రమల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయే తప్ప ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా ఇదే పరిశ్రమలో ప్రమాదాలు జరిగి కార్మికులు అంగవైకల్యం పాలైనట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము ఆరోపించారు. అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారు లు సమగ్ర విచారణ జరిపి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకర్రావుతో కలిసి ఆయన డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, లేబర్ అధికారులు నిరంతరం పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. గోప్యంగా ఉంచిన యాజమాన్యం ప్రమాదంపై విచారణ చేపట్టాలని సిటు డిమాండ్ ఫైర్ సేఫ్టీ లేకుండా అనధికారికంగా వేల టన్నుల కలప నిల్వలు -
పొట్ట కూటికి వెళ్లి అనంత లోకాలకు..
● ఒకే గ్రామానికి చెందిన ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో మృతి బుచ్చెయ్యపేట: బంగారుమెట్ట గ్రామానికి చెందిన ఇద్దరు పొట్ట కూటి కోసం వెళ్లి వేర్వేరు గ్రామాల్లో గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. మేరుగు శ్రీను(28) పెయింటర్గా పనిచేస్తున్నాడు. అరకులో పెయింటింగ్ పని కోసం వెళ్లి సోమవారం పనులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. స్ధానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతను మృతి చెందాడు. లక్ష్మీనారాయణ విశాఖలో కార్పెంటర్ పనులు చేస్తుంటాడు. మధురవాడ వద్ద నడిచి వెళ్తుండగా గుండెపోటుతో రోడ్డుపక్కనే కుప్పకూలి మృతి చెందాడు. లక్ష్మీనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలుండగా.. శ్రీనుకు తండ్రి ఉన్నాడు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందడంతో ఈ రెండు కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. వీరిద్దరి మృతదేహాలకు మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
క్రిస్టల్ ఫార్మా కార్మికుడి మృతి
● యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని సిటు ఆరోపణ అచ్యుతాపురం రూరల్: సెజ్లో గల క్రిస్టల్ ఫార్మా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వల స కార్మికుడు మంగురాం తపెయ్ (32) మృతి చెందినట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము ఆరోపించారు. ఈ నెల 1న మంగురాం కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా అస్వస్థతతో కళ్లు తిరిగి పడిపోయాడని, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా నామమాత్ర చికిత్స చేసి పంపించేశారన్నారు. మంగురాంకి సరైన చికిత్స అందకపోవడంతో నాలుగైదు రోజుల అనంతరం మళ్లీ అస్వస్థతకు లోనయ్యాడని, విశాఖ కిమ్స్ ఆస్పత్రికి, అనంతరం కేజీహెచ్కి తరలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సోమవారం రాత్రి మంగురాం కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు మల్టీ స్పెషాలిటీగా చెప్పుకునే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులతో సంబంధాలు పెట్టుకొని ఇక్కడి వైద్యంతో సరిపెడుతున్నాయని, దాంతో కార్మికుల జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆరోపించారు. -
రియల్.. కుదేల్
రిజిస్ట్రార్ కార్యాలయాలు కళ తప్పాయి. స్థిరాస్తి వ్యాపారం పతనం కావడంతో క్రయవిక్రయాలు క్షీణించాయి. కూటమి ప్రభుత్వ హయాంలో తమ కార్యకలాపాలు కుప్పకూలిపోయాయని రియల్టర్లు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా వడ్డీలు కట్టలేక అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. 2023–24లో లక్ష్యం రూ.370.57 కోట్లు.. ఆదాయం రూ.278.46 కోట్లు అచీవ్మెంట్ 75.14 శాతం స్థిరాస్తి వ్యాపారం నేల చూపులుకూటమి ప్రభుత్వంలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం భూముల విలువ పెంచినా.. తగ్గిన ఆదాయం క్షీణించిన క్రయవిక్రయాలు.. వ్యాపారులకు ఇబ్బందులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖకు బహుళ జాతి కంపెనీలు క్యూలు కడతాయని ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. ఐటీ, ఐటీయేతర, ఫార్మా, డేటా సెంటర్ల పెట్టుబడుల వరద ముంచెత్తుతుందని చెవులకు చిల్లులు పడేలా బాకాలు ఊదారు. సంపద సృష్టించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజల నోట్లో బూర్లు వండేశారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల సంపద ఆవిరైపోతోంది. అన్ని వ్యాపార రంగాలు తిరోగమన బాట పడుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మార్కెట్లు డీలా పడిపోయాయి. ఈ ప్రభావం జిల్లాలో స్థిరాస్తి రంగంపై పడింది. సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడడంతోనే రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టింది. పది నెలల కాలంలో క్రమంగా క్షీణించి.. భూముల విలువ ఇబ్బడి ముబ్బడిగా పెంచినా ఫలితం లేకపోయింది. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు తన విధానాలతో అన్ని రంగాల వారిని వెనక్కు నెట్టడంతో ఆ ప్రభావం.. డబ్బులతో ముడిపడిన స్థిరాస్తి రంగంపై పడింది. అనకాపల్లి జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.408.25 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. కానీ వచ్చింది కేవలం రూ.270.73 కోట్లు మాత్రమే. అంటే కేవలం 66. 3 శాతం మేరకే లక్ష్యాన్ని సాధించగలిగారు. సాధారణంగా గత ఏడాది వచ్చిన నికర ఆదాయాన్ని బట్టి ఈ ఏడాది టార్గెట్ నిర్ణయిస్తారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అచీవ్మెంట్ 75.14 శాతం ఉంది. దాని ప్రకారమే ఈ ఏడాది రూ.408.25 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. భూముల విలువ పెంచినా గత ఏడాది వచ్చినంత కూడా రాక పోవడాన్ని బట్టి స్థిరాస్తి విక్రయాలు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. రాబడిని పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. రియల్ రంగానికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయోనని వ్యాపారులు, మధ్యవర్తులు, ఈ రంగంపై పరోక్షంగా ఆధారపడినవారు ఆశగా ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్థిరాస్తి రంగం పుంజుకుంది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత రియల్ ఎస్టేట్ పరుగులు తీసింది. శివారు ప్రాంతాల్లో సైతం భూములకు డిమాండ్ పెరిగింది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లితోపాటు జిల్లాలోని యలమంచిలి, పరవాడ, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో ‘రియల్’ రంగం బాగా పుంజుకుంది. 16వ నంబరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములు, ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటైన అచ్యుతాపురంలో భూములు, ఇళ్ల ధరలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా గడించారు. వారిని చూసి మరికొందరు ఈ వ్యాపారంలో దిగారు. ప్రైవేటుగా ఫైనాన్స్ తెచ్చి పెట్టుబడులు పెట్టారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విశాఖ రాజధానిగా అయ్యే అవకాశం లేదని అందరూ భావించడంతో.. రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైంది. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్లు, వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. కొత్తగా వెంచర్లు, నిర్మాణాలకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో జిల్లాలో ఆస్తుల క్రయ, విక్రయాలు తగ్గిపోయాయి. 2024–25లో లక్ష్యం రూ.408.25 కోట్లు ఆదాయం రూ.270.73 కోట్లు భూముల విలువ రెట్టింపు చేసినా లక్ష్యంలో 66.3 శాతమే వచ్చింది. వైఎస్సార్సీపీ హయాంలో పెరిగిన రియల్ ఎస్టేట్.. సంపద ఏది బాబూ.. -
ప్రైవేటు ఆస్పత్రులకు డెలివరీ కేసులు
● దారి మళ్లిస్తున్న ప్రభుత్వ సిబ్బందిపై కఠిన చర్యలు ● సమగ్ర విచారణకు స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆదేశం ● నర్సీపట్నంలో ఆయుర్వేద ఆస్పత్రి ప్రారంభం నర్సీపట్నం: ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేసిన డెలివరీ కేసులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు వైద్యాధికారులను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిలో మంగళవారం కలెక్టర్ విజయ కృష్ణన్ సమక్షంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రభుత్వ ఆస్పత్రికి తక్కువగా డెలివరీ కేసులు పంపించి, ప్రైవేటు హాస్పిటల్స్కు ఎక్కువ కేసులు తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గత ఏడాది 398, ఈ ఏడాది 498 డెలివరీ కేసులు నర్సీపట్నంలోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లాయని స్పీకర్ పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాతవరం పీహెచ్సీలోని ఫార్మసిస్ట్ జాగరాపు వెంకటరావుపై వస్తున్న ఫిర్యాదులపై డీఎంహెచ్వో 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. కనీసం మూడు నెలలకొకసారి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని డిప్యూటీ డీఎంహెచ్వో జ్యోతిని ఆదేశించారు. సీఎస్ఆర్ గ్రాంట్ ద్వారా రూ.35 లక్షల విలువైన ఆధునిక అంబులెన్స్ను మంజూరు చేసిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోలార్ వేడి నీటి గ్రీజర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో పంచకర్మ సేవలు ఏరియా ఆస్పత్రి ఆవరణలో రూ.29 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రారంభించారు. హాస్పిటల్ నిర్మాణానికి సహకరించిన కలెక్టర్ను స్పీకర్ దంపతులు సత్కరించారు. ఈ హాస్పిటల్లో దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్య విధానంలో మందులు అందించనున్నట్లు తెలిపారు. చర్యవ్యాధులతో పాటు అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలోనే ఆయుర్వేద ఆస్పత్రిలో పంచకర్మ సేవలు ప్రారంభిస్తామన్నారు. అనంతరం విద్యార్ధుల యోగాసనాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్వో డాక్టర్ శ్రీనివాసరావు, ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఝాన్సీలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద, డాక్టర్ యశోదదేవి, డాక్టర్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న కల్యాణోత్సవం
నేత్రపర్వంగా● సందడిగా ఎదురు సన్నాహోత్సవం ● హరినామస్మరణతో మార్మోగిన సింహగిరి ● ఉత్సాహంగా రథోత్సవం.. పరవశించిన భక్తజనం ● భక్తులకు ముత్యాల తలంబ్రాల పంపిణీబుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గరిష్టం/కనిష్టంఅనకాపల్లి : 35.6/24.0 చోడవరం : 37.0/29.0రాగల ఐదు రోజులు జిల్లాలో ఆకాశం పొడిగా ఉండి, అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని ఆర్ఏఆర్ఎస్ వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళవారం రాత్రి కనులపండువగా జరిగింది. భూదేవి, శ్రీదేవి సమేత అప్పన్న స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తుల హరి నామస్మరణలతో సింహగిరి మార్మోగింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువులు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలుకుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాద సంవాదాలతో సందడిగా ఎదురు సన్నాహం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో వేంజేపచేశారు. అమ్మవార్ల పల్లకీని, అయ్యవారి పల్లకీని సింహగిరి మాడవీధిల్లో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడుభద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచారు. అక్కడ ఎదురు సన్నాహోత్సవం వాద, సంవాదాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తుల ఆనందోత్సాహాల మధ్య వేడుకగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిచారకుడు కె.ఇ.లక్ష్మీనరసింహన్, నరసాపురానికి చెందిన ఆధ్యాత్మికవేత్త వంగల వెంకటాచార్యస్వామి వ్యవహరించారు. కనుల పండువగా రథోత్సవం సింహగిరి మాడ వీధిలో పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులను రథంలో వేంజేపచేశారు. జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథసారధిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా విశాఖ నగరం నలుమూలల నుంచి వచ్చిన జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజనం స్వామి రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తాడేపల్లిగూడేనికి చెందిన రాజరాజేశ్వరి కాళీమాత ట్రూప్ బృందంచే కాంతారా డ్యాన్స్, గోపాలపట్నంకి చెందిన శ్రీమన్నారాయణ కోలాటం బృందం ప్రదర్శన, ఎస్.కోటకి చెందిన పార్వతీపరమేశ్వర ట్రూప్చే చెక్కభజన తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. న్యూస్రీల్ -
పరిహారం చెల్లించాకే పనులు
● రాజయ్యపేటలో ఏపీఐఐసీ అధికారులను అడ్డుకున్న మత్స్యకారులు నక్కపల్లి: తమ డీ ఫారం భూముల్లో ఉన్న చెట్లకు, సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు పనులు ప్రారంభించాలని పలువురు మత్స్యకారులు డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకుండా పనులు ప్రారంభించడాన్ని వారు అడ్డుకున్నారు. రాజయ్యపేటలో సర్వే నెంబరు 290లో ఉన్న సుమారు 70 ఎకరాల ప్రభుత్వ డీఫారం భూములను మత్స్యకారులకు పంపిణీ చేయడం, వారు అక్కడ జీడి, మామిడితోటలు పెంచుకుని సాగుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీఐఐసీ వారు బల్క్డ్రగ్ పార్క్ కోసం ఈ భూములు సేకరించారు. కేవలం భూములకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. వాటిలో ఉన్న చెట్లకు పరిహారం చెల్లించకుండా కొద్దిరోజుల నుంచి ఏపీఐఐసీ వారు యంత్రాలతో చెట్లను తొలగించి రోడ్లు నిర్మిస్తున్నారంటూ మంగళవారం మత్స్యకారులు పనులు అడ్డుకున్నారు. ఏపీఐఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నక్కపల్లి, ఎస్.రాయవరం సీఐలు కుమారస్వామి, రామకృష్ణ తమ సిబ్బందితో చేరుకున్నారు. తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి ఈ భూముల వద్దకు వచ్చారు. సీపీఎం నాయకులు అప్పలరాజు తదితరులు మత్స్యకారుల వద్దకు వెళ్లి వారికి అండగా నిలిచారు. మత్స్యకారులంతా యంత్రాల ముందు నిలబడి పనులు నిలుపుదల చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్, సీఐలు మత్స్యకారులతో చర్చలు జరిపారు. చెట్లకు పరిహారం విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సాగులో ఉన్న రైతుల వివరాల నమోదు కోసం సర్వే చేస్తామని చెబుతూ.. అప్పటి వరకు ఈ వివాదాస్పద భూముల్లో పనులు తాత్కాలికంగా నిలిపివేయడానికి అధికారులు అంగీకరించారు. -
తాండవ రిజర్వాయరులో తగ్గుతున్న నీటి నిల్వలు
● ప్రస్తుతం 364.8 అడుగులకు చేరిన నీటి నిల్వలు ● గేట్ల లీకేజీ ద్వారా వృథా అవుతున్న నీరు నాతవరం : ఉమ్మడి జిల్లాలోనే ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు నీటి మట్టం క్రమేపీ తగ్గిపోతుంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో అయకట్టుకు నీటిని సరఫరా చేసి డిసెంబరు నెలలో ప్రాజెక్టు నుంచి నీటిని నిలుపుదల చేశారు. తాండవ రిజర్వాయరు గేట్లు దించే సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 369.6 అడుగులు నీరు ఉండేది. ప్రాజెక్టు ప్రధాన గేట్ల ద్వారా నిత్యం నీరు లీకేజీతో పోవడంతో రోజు రోజుకు నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతోంది. తాండవలో మంగళవారం సాయంత్రానికి నీటి మట్టం 364.8 అడుగులకు చేరింది. ఆయకట్టుకు నీటిని నిలుపుదల చేసిన దగ్గర్నుంచి నేటి వరకు గేట్ల లీకేజీ ద్వారా సుమారుగా అయిదు అడుగుల నీరు వృధాగా పోయింది, తాండవ రిజర్వాయరు ప్రమాద స్థాయి నీటి మట్టం 380.0అడుగులు కాగా డేడ్ స్టోరేజీ నీటి మట్టం (అంటే బయటకు ప్రవహించదు) 345.0 అడుగులుగా అధికారులు పరిగణిస్తారు. తాండవ రిజర్వాయరు గేట్ల మరమ్మతుల ద్వారా లీకేజీలను ఆరికట్టేందుకు ప్రభుత్వం రూ.19.70 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో గత నెలలో ప్రధాన గేట్ల మరమ్మతు పనులను ఇరిగేషన్ ఈఈ బాలసూర్యం తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మేజరు ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు కావడంతో అనుభవం ఉన్న మెకానికల్ ఇంజినీరింగ్ అధికారులతో పనులు చేస్తున్నారు. ఆ పనులు సకాలంలో పూర్తి అయితే నిత్యం వృథాగా పోతున్న ప్రాజెక్టులో నీటిని అడ్డుకట్ట వేయవచ్చు. ఈ విషయంపై ప్రాజెక్టు డీఈ ఆనురాధ మాట్లాడుతూ ప్రస్తుతం తాండవ గేట్ల మరమ్మతు పనులు చేస్తున్నామన్నారు. లీకేజీ నీరు ప్రవహం బాగా తగ్గిందన్నారు. గేట్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు మరికొంత మెటీరియల్ రావలసి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి లీకేజీలు లేకుండా చేస్తామన్నారు. తాండవ ప్రాజెక్టులో తగ్గిన నీరు -
యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
● స్నేహితులే హంతకులని పోలీసుల నిర్ధారణ ● ఇద్దరు యువకులు, మైనర్ బాలుడిపై కేసు నమోదురావికమతం : మేడివాడ యువకుడు కొలిపాక పవన్ కుమార్(22) హత్య కేసును రావికమతం పోలీసులు ఛేదించారు. గర్నికం తిరుమల ఫంక్షన్ హాలు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి పవన్ కుమార్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పవన్కుమార్ తండ్రి ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు మూడు బృందాలతో దర్యాప్తు చేపట్టారు. రావికమతానికి చెందిన అతడి స్నేహితుల ప్రమేయం ఉందని భావించిన పోలీసులు అనుమానితుల కోసం గాలించి మంగళవారం ఇద్దరు యువకులు, మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మంగళవారం రావికమతం పోలీసుస్టేషన్ వద్ద పవన్ కుమార్ హత్యకు సంబంధించిన వివరాలను విలేకరులకు తెలిపారు. అనుమానితులైన వేపాడ నరేంద్ర కుమార్, కేతి దుర్గా ప్రసాద్, మైనర్ బాలుడినిసి అదుపులోని తీసుకుని విచారించినట్టు చెప్పారు. మృతి చెందిన పవన్కుమార్, వేపాడ నరేంద్ర కుమార్, కేతి దుర్గాప్రసాదుల మధ్య గతం నుంచి గొడవలు ఉన్నాయని, వారు ఎప్పడూ మద్యం తాగి ఘర్షణ పడుతుండేవారని చెప్పారు. నలుగురూ ఆదివారం మధ్యాహ్నం నుంచి మద్యం సేవిస్తున్నారు. వేపాడ నరేంద్రకుమార్ మద్యం మత్తులో ఉన్నప్పడు పవన్కుమార్ డబ్బులు దొంగిలించాడని ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో నరేంద్రకుమార్ మద్యం సీసాను పగలగొట్టి పవన్కుమార్పై దాడి చేశాడు. మిగిలిన ఇద్దరూ సహకరించారని డీఎస్పీ శ్రావణి తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితులు వేపాడ నరేంద్రకుమార్, దుర్గాప్రసాద్ చైన్నె రైల్వేస్టేషన్కు సమీపంలో తాళాలు వేసి వున్న ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారని, నరేంద్రకుమార్ నుంచి ఒకటిన్నర తులాల బంగారం గొలుసు, రూ.35 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అనకాపల్లి జిల్లా, విశాఖ నగర పరిదిలో వివిధ పోలీసు స్టేషన్లలో మోటర్ సైకిళ్లు, ఇళ్లలో దొంగతనాలకు సంబంధించి గతంలో 10 కేసులు ఉన్నాయని, పలుమార్లు అరెస్టు అయ్యారని చెప్పారు. నిందితులను అరెస్టు చేశామని బుధవారం కోర్టులో పర్చుతామని, మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. ఒక్క రోజులో కేసును ఛేదించిన కొత్తకోట సీఐ కోటేశ్వరరావును, రావికమతం ఎస్ఐ రఘువర్మ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
కాంగ్రెస్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం
నూతనంగా ఎన్నికై న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అనకాపల్లి టౌన్ : పట్టణంలోని న్యూకాలనీ రోటరీ హాల్లో జిల్లా, అనకాపల్లి పట్టణ, మండల కాంగ్రెస్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న నూతనంగా ఎన్నికై న సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వాళ్లకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకలు పి.ఎస్ దత్తు, జిల్లా అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ఎం.కోటేశ్వరావు, టి.అనంతరావు, ఎం. చక్రవర్తి పాల్గొన్నారు. -
వరి కోతలు వాయిదా వేసుకోవాలి
● రానున్న ఐదురోజులు వర్షాలు పడే అవకాశం అనకాపల్లి టౌన్ : జిల్లాలో వచ్చే ఐదురోజులు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరక్టర్ డాక్టర్ సిహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్ష సూచన ఉన్నందున కోత దశలో ఉన్న వరి పైరుని కోయడం వాయిదా వేసుకోవాలని, ఒకవేళ ఇప్పటికే కోసి ఉంటే పనలను కుప్పలుగా వేసుకొని టార్పలిన్ కప్పి జాగ్రత్త చేసుకోవాలని అన్నారు. వర్షాలు అనంతరం 80 నుంచి 90 శాతం గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలన్నారు. అలాగే పూత దశలో ఉన్న నువ్వు పైరులో కాయ తొలుచు పురుగు అశించే అవకాశం ఉన్నదని, నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, చెరకు కార్సి చేసిన 45 రోజులకు ఎకరాకు 150 కిలోల యారియాను మెక్కల మెదల్ల దగ్గర చిన్న గుంతలు తీసి వేసుకోవాలని, మెక్కతోటలైతే 45, 90 రోజుల వయసు గల తోటల్లో ఎకరాకు 75 కిలోల యూరియాను మొక్కల మొదళ్ల దగ్గర చిన్న గుంతలు తీసి వేసుకోవాలన్నారు. రాగల వర్షాన్ని వినియోగించుకొని ఖాళీగా ఉన్న పొలాల్లో వేసవి లోతు దుక్కులు దున్నుకోవాలని ఈ విధంగా చేయడం వలన పురుగులు, తెగుళ్ల అవశేషాలు, కలుపు విత్తనాలు భూ ఉపరితలానికి చేరి అవి సూర్యరశ్మి ద్వారా నిర్మూలించబడతాయన్నారు. సమావేశంలో డాక్టర్ టి. శ్రీలత, డాక్టర్ కె.వి.రమణమూర్తి, డాక్టర్ వి.గౌరి పాల్గొన్నారు. -
గంజాయిని తుదముట్టించేలా..
● అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలి ● ప్రజలు సమాచారం తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబరు 1972 ● నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్తుమ్మపాల: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి ఆమె పోలీస్, సెబ్, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖ, కోస్ట్ గార్డ్, మైరెన్, జీఆర్పీ, మత్స్య శాఖల అధికారులతో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులతో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. 1972 టోల్ ఫ్రీ నంబరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, సమాచారం అందించిన వారి వివరాలు ఎవరికీ తెలియవని భరోసా కల్పించాలన్నారు. నాలుగు వారాల ప్రత్యేక ప్రణాళిక ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ తాటిపర్తి, కోనాం, డౌనూరు, భీమవరం, శ్రీరాంపురాలలో శాశ్వత చెక్ పోస్ట్లు, 38 వాహన తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేశామని, నిరంతర నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. పటిష్టమైన నిఘా, తనిఖీలతో జిల్లా మీదుగా గంజాయి రవాణా అరికట్టగలిగినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చే రైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గంజాయి నిరోధానికి రూపొందించిన నెల రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రకారం మొదటి వారంలో పోలీసు, ఆరోగ్య, సంక్షేమ శాఖల ద్వారా ప్రజల నుంచి గంజాయికి సంబంధించిన సమాచారం సేకరిస్తామని, సేకరించిన సమాచారాన్ని రెండో వారంలో కేటగిరీ వారీగా క్రోడీకరిస్తామని, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మూడో వారంలో గంజాయి కార్యకలాపాలపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి, హైరిస్క్ ప్రాంతాల్లో నిఘా పెంచుతామన్నారు. నాలుగో వారంలో కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకున్న చర్యలపై సమీక్షించుకుంటామన్నారు. ఈ సందర్భంగా 1972 టోల్ ఫ్రీ నంబరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించే ప్రచార పోస్టరును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఆర్డీవోలు వి.వి.రమణ, షేక్ ఆయిషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.రాజేశ్వరి, డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకుడు ఎస్.విజయకుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు, జిల్లా ప్రజా రవాణా అఽధికారి కె.పద్మావతి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కేబుల్ టీవీ కంట్రోల్ రూం దగ్ధం
మాకవరపాలెం : అగ్నిప్రమాదంలో కేబుల్ టీవీ కంట్రోల్ రూం దగ్ధమైంది. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన గొర్లి వాసుదేవనాయుడుకు భీమబోయినపాలెం పంచాయతీ కార్యాలయం పక్కనే కేబుల్ టీవీ కంట్రోల్ రూం ఉంది. అయితే ఇది చెక్కలతో తయారు చేసినది కావడంతో సోమవారం అర్ధరాత్రి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లోపల ఉన్న సుమారు రూ.4 లక్షల విలువ చేసే కేబుల్ టీవీ సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ విషయమై ఈ కంట్రోల్ రూం ఆపరేటర్ లాలం ఏసుబాబు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్టు అనుమానం ఉందని, పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం
● వేడుకగా ఎదుర్కోలు ఉత్సవం ఉపమాకలోని శివాలయంలో స్వామివారి కల్యాణం నక్కపల్లి: పురాతన శివాలయం ఉపమాకలో ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక కల్యాణం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 8నుంచి 12వ తేదీ వరకు స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అంకురార్పణ చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు ఆలయంలో గణపతి పూజ, శుద్ధి పుణ్యాహవచనం కార్యక్రమాలు జరిగాయి. అంకురార్పణ అనంతరం స్వామివారిని సప్పరం వాహనంలోను, అమ్మవారిని పల్లకిలో ఉంచి నక్కపల్లి ఎదురు సన్నాహ మహోత్సవ కార్యక్రమానికి తీసుకు వచ్చారు. మైలవరభట్ల జోగారావు ఇంటి వద్ద ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించారు. ఈ పెళ్లిమాటల తంతును ప్రముఖ వేదపండితురాలు, ప్రవచనకర్త డాక్టర్ వేదాల గాయత్రీదేవి వ్యాఖ్యానంలో జరిగింది. స్వామి, అమ్మవార్ల గుణగణాలను భక్తుల కళ్లకు కట్టినట్టు వివరించారు. పెళ్లి కుమారుడి తరపున నక్కపల్లికి చెందిన శింగంశెట్టి వారి కుటుంబీకులు, పెళ్లి కుమార్తె తరపున ఎం.వి.వి.ఎస్ మూర్తి(సహరా పంతులు) వారి కుటుంబ సభ్యులతో ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అనంతరం శింగంశెట్టి కుటుంబీకులతో ప్రసాద వినియోగం జరిగింది. ఉపమాకలో స్వామివారి ఆలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద శివపార్వతుల కల్యాణం కొప్పిశెట్టి వెంకటేష్ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 9వ తేదీన కుంకుమ పూజ, 10వ తేదీన సదస్యం, 11న తోట ఉత్సవం, 12న పూర్ణాహుతి స్వామివారి పుష్ప యాగోత్సవం, పవళింపు సేవ జరుగుతాయని కార్యనిర్వాహణాధికారి మురళీకృష్ణ తెలిపారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం తిలకించేందుకు నక్కపల్లి, ఉపమాకల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కల్యాణోత్సవంలో ఉపమాక దేవస్థానం అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, శేషాచార్యులు, వి.మహేష్ ఆచార్యులు, పసర కొండ పండు ఆచార్యులు, ఉపమాక దేవస్థానం మాజీ చైర్మన్లు, కొప్పిశెట్టి కొండబా బు, బుజ్జి, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.వి. రామారావు, శ్రీపాద ప్రణవ్రామ్, శివాలయం మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు కె.హరిబాబు పాల్గొన్నారు. -
పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని ధర్నా
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్.శంకరరావు డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై బాదుడు ప్రారంభించిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.50 పెంచి గ్యాస్ వినియోగదారుల నడ్డివిరిచిందన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు, విద్యుత్ చార్జీలు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పుండు మీద కారం చల్లిన చందంగా మళ్లీ గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ పథకంపైన భారం పడుతుందని, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చేప్పేరోజులు దర్గర పడ్డట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు, జి.నాయనబాబు, కె.ఈశ్వరరావు, కె.తేల్లయ్యబాబు, నూకఅప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదంలో కిరాయి వ్యక్తుల దౌర్జన్యం
● పోలీసులకు ఎ.కొత్తపల్లి బాధిత మహిళల ఫిర్యాదు ● ఐదుగురు వ్యక్తులు పోలీస్స్టేషన్కు అప్పగింత దేవరాపల్లి : పొలంలోకి వెళ్తున్న తమపై కిరాయి వ్యక్తులు దాడి చేశారని ఎ. కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్కరాజు దేముడమ్మ, కంచిపాటి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎ.కొత్తపల్లిలో 6.80 ఎకరాల భూమిని సుమారు 20 ఏళ్లగా సాగు చేస్తున్నామని, ఈ భూమికి సంబంధించి తమకు, వేరొకరికి కోర్టులో వివాదం నడుస్తుందన్నారు. ఈ భూమిపై తమకు స్టేటస్కో ఆర్డర్ కోర్టు ఇచ్చిందన్నారు. అయితే సింగందొరపాలేనికి చెందిన వెలగల పైడంనాయుడు సదరు భూమిని తాను కొనుగోలు చేశానని చెబుతూ తమపై తరచూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈనేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం పొలంలోకి వెళ్తుండగా విశాఖపట్నంకు చెందిన సుమారు 30 మంది కిరాయి వ్యక్తులు తమను అడ్డగించి దాడికి తెగబడ్డారని బాధిత మహిళలు ఆరోపించారు. దుర్భాషలాడుతూ ఇక్కడి నుంచి వెళ్లకుంటే తమ వద్ద ఉన్న యాసిడ్తో దాడి చేస్తామని బెదిరించారని అన్నారు. సదరు కిరాయి వ్యక్తులను ఎవరని ప్రశ్నించగా తాము కె.కోటపాడు మండలం సింగందొరపాలెంకు చెందిన వెలగల పైడంనాయుడు తాలూకా అని, తమకు టీడీపీ పెద్ద నాయకుల సపోర్టు ఉందని చెప్పి బెదిరించారని బాధిత మహిళలు తెలిపారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో కొందరు పారిపోగా ఐదుగురిని పట్టుకొని పోలీస్స్టేషన్కు అప్పగించామన్నారు. తమపై దౌర్జన్యాలకు దిగిన సదరు కిరాయి వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఇది ఇలా ఉండగా రెవెన్యూ రికార్డుల ఆధారంగా కొనుగోలు చేసిన భూమిలోకి వెళ్తుండగా తమపైనే ఎ.కొత్తపల్లికి చెందిన వారు దాడి చేశారని, ఇదే విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెలగల పైడంనాయుడు తెలిపారు. -
సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ తుహిన్ సిన్హా
సబ్బవరం: స్థానిక పోలీస్ స్టేషన్ను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై సమీక్షించారు. ప్రధానంగా పేదలు, వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిస్కారానికి పోలీస్ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని సూచించారు. బేసిక్ పోలీసింగ్తోపాటు, విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి సేవించే వివరాలు సేకరించి, అక్రమ రవాణా అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తరుచుగా నమోదవుతున్న నేరాలు, పెండింగ్ ఫైళ్లను పరిశీలించి ఆయా కేసుల పురోగతిపై సమీక్షించి, తగు సూచనలిచ్చారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తుల వివరాలను సేకరించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దొంగతనాల నియంత్రణకు గస్తీ విధులు మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆయన వెంట పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సబ్బవరం సీఐ పిన్నింటి రమణ, ఎస్ఐలు సింహాచలం, దివ్య తదితరులున్నారు.● గంజాయి రవాణాపై వివరాలు సేకరించాలని ఆదేశం -
పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి స్ధాయి విచారణ చేపట్టాలి
కె.కోటపాడులో పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిరసన శాంతి ర్యాలీ చేస్తున్న పాస్టర్లు కె.కోటపాడు : గత నెల 31న రాజమండ్రిలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ కుటుంబానికి సత్వరం న్యాయం చేయాలని కె.కోటపాడు మండల పాస్టర్ ఫెలోషిప్ చైర్మన్ బిషప్ ఎస్.మోజేష్, అధ్యక్షుడు వి.జాన్ప్రకాష్ అన్నారు. కె.కోటపాడులో మంగళవారం సాయంత్రం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు. మోజేష్, జాన్ప్రకాష్ మాట్లాడుతూ సుమారు 8 రోజులు గడుస్తున్నా ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం కాలేదని అన్నారు. ఈ ఘటనలో ఉన్న వారిని త్వరితగతిన పట్టుకుని నిజాలను బయటకు తీయాలని కోరారు. మృతుడు ప్రవీణ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. క్రైస్తవ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలన్నారు. స్థానిక తహసీల్దార్ డి.రమేష్బాబుకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో యోహన్, వి.అబ్రహం, జాషువా, మైకిల్, ఆనంద్, సామియల్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 42 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీఆర్జీఎస్కు 42 అర్జీలు అందాయి. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా ఫిర్యాదులు స్వీకరించారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ డి.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. – విజయవాడ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కోటవురట్ల మండలం అన్నవరానికి చెందిన నక్కా మాణిక్యాలరావు మోసం చేసినట్టు అదే మండలం ఎండపల్లికి చెందిన గుడివాడ వరలక్ష్మి, లింగాపల్లికి చెందిన గెడ్డమూరి వెంకటరావు, టెకు కుమార్ అనే దివ్యాంగులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగమణి రూ.10.50లక్షలు, టేకు కుమార్ నుంచి రూ.3 లక్షలు, గెడ్డమూర్తి వెంకటరావు నుంచి రూ.4లక్షలు 2021 ఏడాదిలో దఫదఫాలుగా చెల్లించామని వాపోయారు. కనీసం తమ నగదును తిరిగి ఇప్పించాలని బాధితులు వేడుకున్నారు. ఈ విషయంపై ఎస్పీ కోటవురట్ల సీఐతో ఫోన్లో మాట్లాడి నక్కా మాణిక్యాలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ముగ్గురు బైకు దొంగల అరెస్టు
● 9 బైక్లు స్వాధీనంబుచ్చెయ్యపేట : మండలంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9 బైక్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. సోమవారం బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్ వద్ద బైక్లను, దొంగతనానికి పాల్పడిన యువకుల వివరాలను ఎస్ఐ శ్రీనివాసరావుతో కలిసి ఆమె వెల్లడించారు. పోలీసులు సాధారణ వాహనాల రికార్డుల తనిఖీల్లో భాగంగా విజయరామరాజుపేట గ్రామానికి చెందిన యువకుడిని పట్టుకుని ఆరా తీయగా రికార్డులు లేకపోవడంతో బైక్ దొంగిలించినట్టుగా గుర్తించామన్నారు. యువకుడిని విచారణ చేయగా ఇతనితో పాటు ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కలిసి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారన్నారు. బుచ్చెయ్యపేట, చోడవరం, అనకాపల్లి టౌన్, కంచరపాలెం, దువ్వాడ, విశాఖ ప్రాంతాల్లో బైక్లు దొంగతనం చేసినట్టు ముగ్గురూ ఒప్పుకున్నారన్నారు. వీరు దొంగతనం చేసిన 9 బైక్లను స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
24 లీటర్ల సారా స్వాధీనం
నాటు సారాను స్వాధీనం చేసుకున్న సీఐ శ్రీనివాసరావు పాయకరావుపేట: మండలంలోని గుంటపల్లి, పెదరాంభద్రపురం, అరట్లకోట గ్రామాల్లో దాడులు నిర్వహించి 24 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇద్దరు పురుషులు, ఒక మహిళను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామన్నారు. వారిని యలమంచిలి కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు. అదే విధంగా గతంలో సారాతో పట్టుబడిన 8 మందిని నక్కపల్లి మండల తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశామన్నారు. -
వైఎస్సార్సీపీ సర్పంచ్ తమ్ముడి పింఛన్ కట్
సర్పంచ్గా ఉన్న తన అన్న వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కావడంతో తన పింఛన్ తొలగించారని రావికమతం మండలం చినపాసిలి గ్రామానికి చెందిన వృద్ధ వికలాంగుడు కోమర దుర్గునాయుడు ఫిర్యాదు చేశారు. కారణం లేకుండా జనవరి నెల నుంచి పింఛన్ నిలిపివేశారని, కలెక్టర్ స్పందించి తన పింఛన్ను పునరుద్ధరించాలని కోరారు. వృద్ధురాలైన భార్యతో కలిసి పింఛనే ఆధారంగా జీవించే తమ పొట్ట కొట్టొదని ఆయన వేడుకున్నారు. గుండె జబ్బుతో ఉన్న తాను పింఛన్ సొమ్ముతోనే ప్రతి నెలా విశాఖపట్నం వెళ్లి మందులు తెచ్చుకుంటున్నానని వాపోయారు. – కోమర దుర్గునాయుడు -
కుమారుడి చిత్రహింసల నుంచి రక్షించండి
కుమారుడి చిత్రహింసల నుంచి రక్షించి, కన్న బిడ్డలకు భూములను సమానంగా పంచాలంటూ కె.కోటపాడు మండలం కింతాడ శివారు బత్తివానిపాలెం గ్రామానికి చెందిన కర్రి రాములమ్మ తన కుమార్తె వెంకటలక్ష్మితో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భర్త ద్వారా వచ్చిన భూములు, ఇంటిని తనకు తెలియకుండా పెద్ద కుమారుడు కర్రి గోవిందు తన పేరున నమోదు చేయించుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. – కర్రి రాములమ్మ, కుమార్తె వెంకటలక్ష్మి ● -
నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్
● ఫిర్యాదులపై స్పందన ఎక్కడ? ● గేటు బయటే దివ్యాంగులు ● అర్జీదారుడికి మాత్రమే లోపలికి అనుమతి తుమ్మపాల: కలెక్టరేట్ సోమవారం నిరసనలతో హోరెత్తింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు నినదించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. పలు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ గేటు బయట పలువురు నిరసనలు తెలిపారు. అధికారుల తీరుకు నిరసనగా పలువురు కూటమి పార్టీల నాయకులు కూడా నేరుగా ఆందోళన చేయడం గమనార్హం. దివ్యాంగులకు తప్పని నిరీక్షణ జిల్లాలోని దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో దివ్యాంగులు కార్యాలయం లేక ఎదురవుతున్న ఇబ్బందులను అనేక రూపాల్లో చేసిన నిరసనలకు నేటికి ఫలితం లేకుండా పోయింది. వారానికి ఒక్క రోజు చేపట్టే పీజీఆర్ఎస్లో తమ మొరను తెలిపేందుకు వ్యయ ప్రయాసలతో వస్తే వారిని కలేక్టరేట్ బయటే సిబ్బంది అడ్డుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. గేటు దాటి లోపలికి వెళ్లే అవకాశం లేక వారి వద్దకు వచ్చే అధికారుల రాక కోసం గంటల పాటు నిరీక్షిస్తున్నారు. తీరా వారి వద్దకు వచ్చిన అధికారులు సమస్య తమ పరిధి కాదంటూ అర్జీలు తీసుకుని చేతులు దులుపుకోవడంతో తమ సమస్యలకు పరిష్కారం చూపే నాథులే కరువయ్యారంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపలికి అనుమతి నిరాకరణ సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు చేరుకుని తమ గోడును జిల్లా అధికారులకు విన్నవించుకుందామని కలిసికట్టుగా వస్తున్న వారిని లోపలికి అనుమతించడం లేదు. వృద్ధ దంపతులు, కుటుంబ సభ్యుల తోడుతో వచ్చే నిరక్షరాస్యులు, నడవగలిగే వికలాంగుల్లో ఒక్కరిని మాత్రమే కలెక్టరేట్ లోపలికి అనుమతిస్తూ.. వారికి తోడుగా వచ్చిన వారిని సిబ్బంది బయటకు నెట్టేస్తున్నారు. దీంతో పాటు అధికారులకు అర్జీలిచ్చే క్రమంలో ఫొటోలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండాపోయింది. సిబ్బందికి చెప్పి ఫొటోలు తీయకుండా చూస్తున్నారు. సకాలంలో అర్జీలకు పరిష్కారం : కలెక్టర్ తుమ్మపాల: పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టరు విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఅర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జేసీ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, పత్యేక డిప్యూటీ కలెక్టరు ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలను వివరంగా దరఖాస్తుదారుడికి తెలియజేస్తే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. మొత్తం 394 అర్జీలు నమోదు కాగా.. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 246 అర్జీలు వచ్చాయి. పంచాయతీ రాజ్, పోలీస్, సర్వే, విద్యుత్, గ్రామీణ మంచినీటి సరఫరా, వాటర్ రిసోర్స్, గ్రామీణ అభివృద్ధి, మున్సిపాటిటీ, హౌసింగ్, మొత్తం 40 శాఖల్లో అర్జీలు స్వీకరించారు. అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలి తుమ్మపాల: రోలుగుంట మండలం శరభవరం పంచాయతీ పరిధిలోని రాజన్నపేట గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా క్వారీ యజమానులు పట్టించుకోవడం లేదని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పీఎస్ఎన్ రాజు ఆరోపించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఆయన మళ్లీ ఫిర్యాదు చేశారు. క్వారీ నిర్వాహకులు అనుమతులు తీసుకోకుండా నీటిపారుదల ట్యాంకు మీదుగా రహదారిని నిర్మించి రైతుల వ్యవసాయ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. క్వారీ చుట్టూ ఉన్న సమీప గృహాలు, సాగు భూములకు తీవ్రనష్టం వాటిల్లుతోందన్నారు. వడ్డిప, బుచ్చయ్యపేట గ్రామాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, క్వారీ లీజుదారులు చేసిన అక్రమాలపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయత్ రాజ్ శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. -
దేవాలయాల్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
తుమ్మపాల : దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తులను వినియోగించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దేవదాయశాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. దేవాలయాలలో వినియోగిస్తున్న ఆహార వస్తువులు వివరాలు, వాటి సేకరణ విధానాలు, ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానం, పండిస్తున్న పంటలు, వాటి లభ్యత వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, రైతులు పండించే సరుకులకు మార్కెంటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ విధానం అమలు తొలిదశలో దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాలకు కావలసిన సరుకులను ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని, అందుకుగాను అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దేవదాయశాఖ అధికారులకు ఆదేశించారు. ఏ దేవాలయానికి ఏ వ్యవసాయ రైతు సంఘం ద్వారా సరుకులు సరఫరా చేయాలనే విషయం మ్యాపింగ్ చేసి, ఆ విధంగా సరుకులు సరఫరా చేయాలన్నారు. నూరుశాతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మాత్రమే సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో దేవాలయాలకు కావలసిన సరుకులన్నింటిని సరఫరా చేయుటకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ప్రకృతి సాగును పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు అధికారి సిహెచ్.లచ్చన్న, జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు, జిల్లా దేవదాయశాఖ అధికారి కె.ఎల్.సుధారాణి, జిల్లాలో దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులు పాల్గొన్నారు. 100 శాతం క్లోరినేషన్ చేపట్టాలి వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీరు సమస్య లేకుండా చూడాలని, గ్రామ పంచాయతీల్లో గల వాటర్ ట్యాంకుల్లో 100 శాతం క్లోరినేషన్ చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఎంపీడీవోలను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపడుతున్న సర్వేలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయత్రాజ్, గృహనిర్మాణ శాఖల అధికారులతో మాట్లాడారు. సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలన్నింటినీ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను పూర్తిచేయాలని, ఉపాధి కూలీలకు మంచినీరు అందుబాటులో ఉండేలా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరి శిఖర గ్రామాల్లో మంచినీటి వసతి కల్పించాలని, గోకులం షెడ్లను వేగంగా పూర్తి చేయాలని, ఇంకా అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు మంజూరైన అదనపు సహాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 11న జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని బీసీ కార్పొరేషన్ ద్వారా 400 యూనిట్లను మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేయాలని బీసీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఆర్డీఏ పీడీ శచీదేవి, డ్వారా పీడీ పూర్ణిమాదేవి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఏఎస్ఎ. రామస్వామి, డీపీఅర్సీ జిల్లా కో ఆర్డినేటర్ కె.నాగలక్ష్మి, జిల్లా వెనుకబడిన తరగతుల కార్యనిర్వహణ డైరెక్టర్ పెంటోజీరావు పాల్గొన్నారు. నైవేద్యం, ప్రసాదాల తయారీకి వినియోగం సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ -
ఎండల్లో మంటలు
●పారాహుషార్జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు – 8 2023–24లో ఫైర్కాల్స్ – 560 ప్రమాదాల్లో ఆస్తి నష్టం రూ.327.42 కోట్లు కాపాడిన ఆస్తి రూ.205.66 కోట్లు వేసవిలో అగ్ని ప్రమాదాలకు అవకాశంఅప్రమత్తతతో భారీ నష్టాలకు చెక్ అగ్నిమాపక కేంద్రాల్లో పీడిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో అందుబాటులో 8 అగ్నిమాపక కేంద్రాలుసాక్షి, అనకాపల్లి : ఎండాకాలంలో భానుడు భగ్గుమంటున్నాడు. ఈ ఏడాది మార్చి నెల ప్రారంభం నుంచే అధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగానే ఉష్టోగ్రతలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో అగ్నిప్రమాదాలు సంభవించడానికి అవకాశాలెక్కువగా ఉంటాయి. అగ్గిలా మండే ఎండలకు తోడు ఫైర్ యాక్సిడెంట్లు సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల వరకూ ప్రజలతో పాటు అగ్ని మాపక సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని 8 అగ్ని మాపక కేంద్రాలు ఉన్నప్పటికీ తీవ్రమైన ప్రమాదాలు సంభవించినప్పుడు నిమిషాల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతోంది. పారిశ్రామిక ప్రాంతంలో మరింత అప్రమత్తం.. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, కశింకోట మండల పరిధిలో ఒక వైపు పరిశ్రమలు, మరో వైపు ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 560 అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటిలో 2 అత్యంత ప్రమాదకరమైనవి (రూ.10 లక్షలకు పైగా నష్టం సంభవించిన ప్రమాదాలు) కాగా, 40 మీడియం ఫైర్ కాల్స్ (రూ.2 లక్షల నుంచి రూ.10లక్షలలోపు నష్టం), 489 చిన్నపాటి అగ్ని ప్రమాదాలు సంభవించాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన 560 అగ్ని ప్రమాదాల్లో రూ.205 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించగా, రూ.327.42 కోట్ల ఆస్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. ఈ ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోగా, 19 మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడగలిగారు. అలాగే ఈ ప్రమాదాల్లో 20 పశువులు చనిపోగా, ఒక దాన్ని సిబ్బంది కాపాడారు. రెస్క్యూ చేస్తుండగా 18 మంది చనిపోగా..ముగ్గురిని బతికించగలిగారు. అవగాహనకు మాక్డ్రిల్ జిల్లాలో సెజ్ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో..సేప్టీ ఆడిట్లో భాగంగా ప్రతి నెలా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. ఏ ప్రాంతంలో అయినా అగ్ని ప్రమాదం జరిగిన తక్షణమే ఆయా పరిధిలో ఉన్న ఫైర్స్టేషన్లకు సమాచారం ఇవ్వాలి. వేసవిలో ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్తంగా ఉండాలి. ఫార్మా కంపెనీలతో కలిసి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ పేరిట శిక్షణ కల్పిస్తున్నాం. ఇవి కాకుండా జిల్లాలో వేసవిలో ఎక్కువగా తోటలు తగలబడినట్టు ఫైర్ కాల్స్ వస్తున్నాయి. ఎటువంటి అగ్నిప్రమాదం సంభవించినా 101 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. – వెంకట రమణ, జిల్లా ఫైర్ అధికారి ●ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు.. అవగాహన కోసమే వారోత్సవాలు.. అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం ఏటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా, విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బందికి నివాళులర్పించడం, బస్టాండ్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్ని మాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన, ఎల్పీజీ స్టోరేజీ, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బందికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎలా తమని తాము కాపాడుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో మొత్తం 6 ఫైర్ స్టేషన్ల్లో 75 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటితో పాటుగా మరో రెండు అవుట్సోర్సింగ్ ఫైర్స్టేషన్లలో 25 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు అనకాపల్లి 08924–222299 యలమంచిలి 08924–222299 నర్సీపట్నం 08924–231101 మాడుగుల 08924–235101 చోడవరం 08934–345199 సబ్బవరం 08924–231101 అవుట్ సోర్సింగ్ ఫైర్ స్టేషన్లు.. నక్కపల్లి 08924–231101 రావికమతం 08932–235101 -
ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్
● అప్పుల బాధతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య నక్కపల్లి : నక్కపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తుని రైల్వే పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన కొల్నాటి రమణబాబు(33) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల నుంచి ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి ఆన్లైన్లో బెట్టింగ్లు చేసే అలవాటు ఉంది. ఈ బెట్టింగ్ల కారణంగా తను సంపాదించిన జీతాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు పాల్పడే వాడు. ఈ బెట్టింగ్ల వల్ల సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చాలని ఒత్తిడి రావడంతో ఆదివారం నర్సీపట్నం, రేగుపాలెం డౌన్లైన్ ట్రాక్పై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్దానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న రైల్వేపోలీసులు సంఘటన స్దలానికి చేరుకుని అతని వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నక్కపల్లిలో ఉండే ఇతని కుటుంబం కొన్నాళ్ల క్రితమే ఉద్దండపురం గ్రామానికి వలస వెళ్లి అక్కడ కాఫీ హోటల్ నిర్వహిస్తూ జీవిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి శ్రీనివాసరావు తెలిపారు. -
తెలుగు మహాసభల లోగో ఆవిష్కరణ
విశాఖ స్పోర్ట్స్: 3వ ప్రపంచ తెలుగు మహాసభల లోగోను శాసనసభ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడు సోమవారం ఈస్ట్పాయింట్ గోల్ఫ్క్లబ్లో ఆవిష్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాష, యాస భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడాలన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రమేవ జయతే అంటూ నినదిస్తున్నామన్నారు. ఆంధ్రలో ఇప్పటికే రెండు సభలు నిర్వహించామన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పి.రామచంద్రరాజు మాట్లాడుతూ 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో అమరావతి గుంటూరు హైవే శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీ గ్రౌండ్స్లో ఈ సభ జరుగుతుందన్నారు. భాషాభిమానులే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులతో సహా పలువురు గౌరవనీయుల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వై.రామారావు మాట్లాడుతూ గతేడాది 20 బ్లడ్బాంక్ల ద్వారా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి అందచేశామన్నారు. ఆరు బ్లడ్బాంక్ల ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగానే రక్తం అందించామన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేయండంటూ ప్రచార రెడ్క్రాస్ సోసైటీ గోడపత్రికను స్పీకర్ అయ్యన్నపాత్రుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ యువ వలంటీర్లు పాల్గొన్నారు. -
పయనీర్ పరిశ్రమ కార్మికుల ఆందోళన
గేటు బయట కూర్చొని ఆందోళన చేస్తున్న పయనీర్ పరిశ్రమ కార్మికులు అచ్యుతాపురం రూరల్ : కార్మికుల శ్రమను పయనీర్ పరిశ్రమ దోపిడీ చేస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము ఆరోపించారు. అధిస్తాన్(బ్రాండిక్స్)లో ఉన్న పయనీర్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం మధ్యాహ్నం ఏ, బీ షిఫ్ట్ కార్మికులు గేటు బయట ఆందోళన చేపట్టారు. వారికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పయనీర్ పరిశ్రమలో కార్మికులకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వేయడం లేదన్నారు. అతి తక్కువ బోనస్ ఇచ్చి నైట్ డ్యూటీలు చేయిస్తూ కార్మికులను మోసం చేస్తున్నారన్నారు. యాజమాన్యం స్పందించి వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. -
మా ఆకలి కేకలు వినిపించవా..!
● పంచాయతీ కార్మికుల నిరసన ● బుచ్చెయ్యపేటలో ఖాళీ ప్లేట్లతో ఆందోళన బుచ్చెయ్యపేట : ఆకలితో అలమటిస్తున్నాం జీతాలు అందించి ఆదుకోవాలంటూ మండల స్వీపర్లు(పంచాయతీ కార్మికులు) ఖాళీ ప్లేట్లతో ఆందోళనకు దిగారు. సోమవారం మండల కేంద్రం బుచ్చెయ్యపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట 35 పంచాయితీ గ్రామాలకు చెందిన స్వీపర్లు ఖాళీ ప్లేట్లు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జీతాలు అందించి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. గ్రామాల్లో ఉన్న కాలువల్లో మురుగు పూడిక పోయి కంపుకొడుతున్న చెత్తను నెత్తిన పెట్టుకుని రోజూ తీవ్ర దుర్గంధం నడుమ పారిశుధ్య పనులు చేస్తున్నాం.. తెల్లవారుజాము నుంచి విధులు నిర్వహిస్తూ గ్రామాల్లో ఉన్న చెత్తాచెదారంతో పాటు తుప్పలు,డొంకలు తొలగించి సంపూర్ణ పారశుధ్యానికి కృషి చేస్తున్నాం... ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా ట్యాంకులు కడిగి తాగునీరు అందిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పారిశుధ్య కార్మికులు ఆవేదన చెందారు. మండలంలో సుమారు 300 మంది వరకు పని చేస్తున్నామని ఒక్కొక్కరికీ ఐదు నుండి 13 నెలలు జీతాలు అందాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంతో అర్ధాకలితో అలమటిస్తున్నామని అన్నారు. వారి ఆందోళనకు సీఐటీయూ మండల నాయకులు పినపాత్రుని సాంబశివరావు, ఎస్.వి.నాయుడు, జిల్లా కోశాధికారి వి.శ్రీనివాసరావు మద్దతుగా నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఎన్నికల ముందు ప్రజల కోసం పలు ప్రగల్భాలు పలికేవారని తన సొంత శాఖలో పని చేస్తున్న పంచాయతీ కార్మికుల ఆకలి కేకలు ఆయనకు తెలియదా..? అంటూ సీఐటీయు నాయకులు ప్రశ్నించారు. వెంటనే పంచాయతీల్లో టెండర్ విధానం రద్దు చేసి ప్రతి పారిశుధ్య కార్మికుడికి నెలకు రూ.10 వేలు జీతం అందించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు అందించాలని, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, యూనిఫాం, గ్లౌజులు అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో విజయలక్ష్మికి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. కార్మిక సంఘ నాయకులు ఏసు, నూకరాజు, అమ్మాజీ, శ్రీను,మరియమ్మ, కొండబాబు, ప్రసాద్,రాజు తదితరులు పాల్గొన్నారు. -
తాండవ గేట్లకు మరమ్మతులు
తాండవ ఎడమ కాలువ నీరు కోటనందూరు మండలం వెళ్లే డ్రాప్ దగ్గర గేట్ల మరమ్మతులు నాతవరం : తాండవ రిజర్వాయరు ప్రధాన గేట్లు మరమ్మతులతో పాటు పిల్ల కాలువల గేట్లు మరమ్మతు పనులు చేపడుతున్నామని ప్రాజెక్టు జేఈ ప్రేమ్కుమార్ అన్నారు. ఆయన సోమవారం మెకానికల్ జేఈ ఉమాశ్రీతో కలిసి గేట్ల మరమ్మతు పనులకు సంబంధించి మెటీరియల్ క్రేన్ ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జేఈ మాట్లాడుతూ తాండవ ప్రధాన గేట్ల లీకేజీ కారణంగా ప్రాజెక్టులో నీరంతా వృఽథాగా బయటకు పోయేదన్నారు. ప్రధాన గేట్లు 2, 19 కిలోమీటర్ల వద్ద గేటు మరమ్మతులకు ప్రభుత్వం రూ.19.70 లక్షలు మంజూరు చేసిందన్నారు. కొంతవరకు మరమ్మతులు చేపట్టడంతో లీకేజీ కొంత అరికట్టగలిగామన్నారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ప్రధాన గేట్ల మరమ్మతులు చేసేందుకు మెటీరియల్ రావలసి ఉందన్నారు. ప్రధాన గేట్ల మరమ్మతులు మెకానికల్ డీఈ, జేఈ ఆధ్వర్యంలోనూ, తాండవ ప్రధాన కాలువలు అభివృద్ధి పనులు, పూడికతీత పనులు తాండవ ప్రాజెక్టు డీఈ ఆనురాధ పర్యవేక్షణలో చేపడుతున్నామని వివరించారు. -
రేపు అప్పన్న వార్షిక కల్యాణోత్సవం
● 3 గంటల నుంచి కొట్నాల ఉత్సవం ● సాయంత్రం 6.30 నుంచి ఎదురు సన్నాహోత్సవం ● రాత్రి 8.15 గంటల నుంచి రథోత్సవం ● రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణ మహోత్సవం ● నేడు 7 గంటల వరకే స్వామి దర్శనం సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి జరగనుంది. సింహగిరిపై ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సింహాచల దేవస్థానం వైదిక, అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులు, ముత్తైదువులు పసుపు కొమ్ములను దంచి కొట్నాలు ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానం పలుకుతూ ఆలయ ధ్వజస్తంభం వద్ద గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి ఎదురుసన్నాహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామి ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని బంగారుచాయ పల్లకీలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో ఉంచి మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. జోడుభద్రాల ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికలపై అధిష్టింపజేస్తారు. అక్కడ ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్వామిని, అమ్మవార్లను రథంపై అధిష్టింపజేసి రాత్రి 8.15 గంటల నుంచి మాడ వీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 10.30 గంటల నుంచి ఉత్తర రాజగోపురం ఎదురుగా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న భారీ వేదికపై వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి సోమవారం రాత్రి అంకురార్పణ చేస్తారు. ఈ కారణంగా సోమవారం రాత్రి 7 గంటల వరకే భక్తులకు దర్శనాలు లభిస్తాయి. విశేషంగా ఏర్పాట్లు : రథోత్సవం, కల్యాణోత్సవం కోసం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవస్థానం ప్రాంగణంలో భారీ కల్యాణ వేదికను తీర్చిదిద్దుతున్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 164 సీసీ కెమెరాలకు అదనంగా కల్యాణోత్సవ ప్రాంగణంలో మరో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఆరు వేల చిన్న లడ్డూ ప్రసాదంతో పాటు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం అన్నదాన భవనంలో 5 వేల మందికి, రాత్రి 6 వేల మందికి అన్నప్రసాద వితరణ ఉంటుంది. మంగళవారం సా యంత్రం 5 గంటల నుంచి రాత్రి కల్యాణం ముగిసే వరకు కొండపైకి 10 షటిల్ బస్సులు నడుస్తాయని సింహాచలం డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. కల్యాణం పూర్తయిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 120 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ గొలగాని అప్పారావు పేర్కొన్నారు. -
అనకాపల్లి యువతకు ఉద్యోగావకాశాలు
అనకాపల్లి: తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్టు వైఎస్సార్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అన్నారు. పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సింగపూర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో చర్చలు జరిగాయన్నారు. అక్కడ 20 మంది నిరుద్యోగ ఇంజనీర్లకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఒక్కొక్క నిరుద్యోగిపై నెలకు రూ.లక్ష ఖర్చు చేశానన్నారు. తమ శక్తి కొద్దీ యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రపంచంలో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. త్వరలో నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం నిర్వహించేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. -
13 రైల్వే స్టేషన్లలో 28 లిఫ్ట్లు
● టెండర్లు ఆహ్వానించిన వాల్తేర్ డివిజన్ ● అమృత్ భారత్తో 15 స్టేషన్లకు కొత్త శోభ సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ పథకం ద్వారా వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో 15 రైల్వేస్టేషన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సౌకర్యాల కల్పనలో భాగంగా స్టేషన్లలో లిఫ్ట్లు ఏర్పాటు చేసేందుకు తాజాగా టెండర్లు ఆహ్వానించారు. 13 స్టేషన్ల పరిధి లో రూ.13.67 కోట్లతో 28 లిఫ్ట్లు ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. వాల్తేరు డివిజన్ పరిధిలో మొత్తం 15 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పరిధి లోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సింహాచలం, దువ్వాడ, అరకు, బొబ్బిలి, చీపురుపల్లి, కొత్తవలస, నౌపడ, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లు, ఛత్తీస్గఢ్ పరిధిలో జగదల్పూర్, ఒడిశా పరిధిలో దమన్జోడీ, జైపూర్, కోరాఫుట్, పర్లాఖిముండి రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో కొత్త భవనాలు నిర్మించడంతో పాటు ఎస్కలేటర్లు, లిఫ్టులు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక ఆహార శాలలు, వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. అలాగే అత్యాధునిక సౌకర్యాలతో మరుగుదొడ్లు, సామగ్రి భద్రపరుచు కునే గదులు, తాగు నీరు, ఏటీఎం సౌకర్యాలు కల్పించనున్నారు. వసతి గదులు, ప్లాట్ఫాంలపై డిజిటల్ డిస్ప్లే బోర్డులు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేస్టేషన్ మొత్తం సీసీ టీవీ పరిధిలో నిఘా ఉంచడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 13 స్టేషన్లలో లిఫ్టుల ఏర్పాటుకు టెండర్లు తాజాగా 13 స్టేషన్లలో లిఫ్ట్లు ఏర్పాటుకు రెండు ప్యాకేజీల కింద రూ.13.67 కోట్లతో వాల్తేరు డివిజన్ టెండర్లు ఆహ్వానించింది. ఒక లిఫ్ట్ 13 మంది ప్రయాణికులకు సరిపడేలా, మరో లిఫ్ట్ 20 మందికి సరిపడేలా.. మొత్తం 28 లిఫ్ట్లు ఏర్పాటు చేయనున్నారు. చిన్న స్టేషన్లలో ఒకే లిఫ్ట్ ఉండాలని నిబంధన విధించారు. -
కమనీయం.. రమణీయం
కనుల పండువగా సీతారాముల కల్యాణం సిగ్గులొలుకుతూ సీతమ్మ.. మందహాసంతో రామయ్య.. వారి వివాహ మహోత్సవం జగతికంతా వేడుక.. భక్తులకు కనుల పండువ.. అందుకే ఊరూరా జనమంతా పెళ్లి పెద్దలై సీతారాముల కల్యాణాన్ని జరిపించారు.. ప్రతి గ్రామంలో రామాలయాల్లో, బహిరంగ వేదికలపై ఈ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చూచు వారలకు చూడ ముచ్చటట.. పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట.. అని పాడుకుంటూ అమ్మవారికి అయ్యవారికి పెళ్లి జరిపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న రామాలయంలో స్వామివారి కల్యాణాన్ని అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, శేషాచార్యులు ఘనంగా నిర్వహించారు. వేంపాడు రామాలయంలో ఈ వేడుకను ఘనంగా జరిపారు. మరో భద్రాచలంగా పేరుగాంచిన అరబుపాలెంలో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు నాని, భార్గవాచార్యులు శాస్త్రోక్తంగా జరిపారు. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు వంటి తంతులను నిర్వహించారు. కె.కోటపాడు మండలం చిరికివానిపాలెం, బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెంలో రకరకాల పిండివంటలతో సీతమ్మకు సారె సమర్పించారు. ఇలా.. జిల్లాలోని ప్రతి పల్లె రామనామంతో ప్రతిధ్వనించింది. వివాహ వేడుక నిర్వహించి మురిసిపోయింది. కల్యాణ కాంతులతో వెలిగిపోతున్న సీతారాములను చూసి పరవశించింది. – సాక్షి న్యూస్ నెట్వర్క్ -
అర్ధరాత్రి వ్యవసాయ విద్యుత్
నక్కపల్లి: వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అర్ధరాత్రి వేళ ఇవ్వడంతో ఇబ్బంది పడుతున్నామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్ను వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో సగానికి పైగా రోజులు రాత్రి వేళ ఇస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయదారులు అవస్థలు పడుతున్నారు. వారంలో మూడు రోజులపాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తున్నారని, మిగిలిన రోజుల్లో రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. త్రీ ఫేజ్ సరఫరా ఉపయోగించుకునే మామిడి, జీడి, కొబ్బరి, అరటి, కూరగాయలు తదితర ఉద్యానవన పంటల రైతులు అర్ధరాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లేందుకు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. తోటల్లో ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్లైన్లతో ప్రమాదం పొంచి ఉంటోందని, ఈ లైన్లు పొరపాటున తెగిపడినా, విషసర్పాల బారిన పడినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. గడచిన మూడు నెలల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో లోడ్ ఎక్కువ కావడంతో తొమ్మిది గంటలపాటు అన్ని రోజుల్లో ఒకే సమయంలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారన్నారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని ట్రాన్స్కో సిబ్బంది తెలిపారని, సబ్స్టేషన్లో కొద్ది రోజుల క్రితమే పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ విద్యుత్ సరఫరా మాత్రం సక్రమంగా జరగడం లేదని రైతులు చెబుతున్నారు. వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో సుమారు 10 గ్రామాల రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ పని పూర్తిగా జరగలేదని, కొద్ది పనులు పెండింగ్లో ఉన్నాయని, కాంట్రాక్టర్ రాకపోవడం వల్ల ఈ ఇబ్బంది నెలకొందని సిబ్బంది చెబుతున్నారని రైతులు అంటున్నారు. తక్షణమే వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు త్రీఫేజ్ సరఫరాను పగటి పూట మాత్రమే ఇవ్వాలని వారు కోరుతున్నారు. వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో ఇబ్బంది పడుతున్న రైతులు -
ఇదీ సార్.. వైజాగ్ స్టీల్ బ్రాండ్
● నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులు స్టీల్ప్లాంట్కే సొంతం ● 6 నుంచి 36 మి.మీ వరకు రీబార్స్, చానల్స్, ● ఐబీమ్స్కు రోల్స్ తయారీ ఇక్కడే.. ● ప్రతి ఉత్పత్తిపై వైజాగ్ స్టీల్ టీఎంటీ ముద్ర ● 2002 నుంచి బ్రాండ్ మార్క్తో మార్కెట్లోకి ఉత్పత్తులు స్టీల్ప్లాంట్లో వైర్ రాడ్ కాయిల్స్ తయారీ బ్రాండింగ్ ఎలా ప్రారంభమైంది విశాఖ ఉక్కు ఉత్పత్తులను మొదట్లో ఇతర కంపెనీల ఉత్పత్తుల్లాగే మార్కెట్లో అమ్మేవారు. ఇతర ఉత్పత్తుల్లో విశాఖ ఉక్కు ఉత్పత్తులను వినియోగదారులు గుర్తించడం కష్టంగా ఉండేది. దీంతో అప్పటి సీఎండీ శివసాగర్రావు ఏదైనా గుర్తు ఉంటే బాగుంటుందని ఆలోచించి.. రీబార్స్ మధ్యలో ఆంగ్ల అక్షరం ‘వి’ఉండేలా చేశారు. అది ఎంతో కష్టపడితే తప్ప స్పష్టంగా కనిపించేది కాదు. ఆ తర్వాత, ఉత్పత్తులపై ప్రారంభంలో బ్రాండింగ్ కోసం పెద్ద సైజు నంబర్ పంచ్ అనే సాధనంతో ‘వైజాగ్ స్టీల్’అని కొట్టేవారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అన్ని ఉత్పత్తుల మీద ముద్రించాలంటే ఎక్కువ శ్రమ, సమయం పట్టేది. 2002 తర్వాత నేరుగా ఉత్పత్తి మీద ముద్రపడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్పత్తుల మార్కెటింగ్లో ప్రధాన భూమిక వహించేది బ్రాండ్ ఇమేజ్. బ్రాండ్ను చూసే వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేస్తారనేది విశ్వజనీనం. అందుకే ప్రతీ సంస్థ తమ ఉత్పత్తుల నాణ్యతతో పాటు బ్రాండ్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమిస్తాయి. దేశీయ ఉక్కు పరిశ్రమలో తమ బ్రాండ్ను ముద్రించడంలో విశాఖ ఉక్కు కర్మాగారం తనదైన ప్రత్యేకత కలిగి.. మార్కెట్లో ప్రతిష్ట కలిగి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టీల్ప్లాంట్ తుది ఉత్పత్తులు రోలింగ్ మిల్స్ విభాగాలైన లైట్ అండ్ మీడియం మర్చంట్ మిల్(ఎల్.ఎం.ఎం.ఎం), మీడియం మర్చంట్ అండ్ స్ట్రక్చరల్ మిల్(ఎం.ఎం.ఎస్.ఎం), వైర్ రాడ్ మిల్స్(డబ్ల్యూ.ఆర్.ఎం), స్పెషల్ బార్ మిల్(ఎస్.బి.ఎం), వైర్ రాడ్ మిల్(డబ్ల్యూఆర్ఎం)–2, స్ట్రక్చరల్ మిల్ (ఎస్టీఎం)లలో తయారవుతాయి. ఆయా విభాగాల్లో రీబార్స్, రౌండ్స్, యాంగిల్స్, చానల్స్, బీమ్స్ తదితర వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఆ ఉత్పత్తుల తయారీకి అవసరమైన గైడ్ల తయారీని రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్(ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్) విభాగం చేపడుతుంది. 6 మిల్లీమీటర్ల వ్యాసం నుంచి 36 మిల్లీమీటర్ల వరకు ఉన్న రీబార్లు, చానల్స్, ఐబీమ్స్లకు రోలింగ్ అవసరమైన రోల్స్ను ఇక్కడే తయారు చేస్తారు. నిర్ణీత పరిమాణంలో ఆ రోల్స్ను సిద్ధం చేసిన తర్వాత, దానిపై విశాఖ ఉక్కుకు ప్రతిష్టగా నిలిచే వైజాగ్ స్టీల్ టీఎంటీ(థర్మో మెకానికల్ ట్రీట్మెంట్) ముద్రను ముద్రిస్తారు. కీలక విభాగాలకు రోల్స్ తరలింపు కర్మాగారంలో తయారయ్యే ఉత్పత్తులపై ముద్ర వేసేందుకు సిద్ధం చేసిన రోల్స్ను ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్–1, 2 విభాగాల నుంచి ఉత్పత్తులు తయారయ్యే మిల్స్ విభాగాలకు సరఫరా చేస్తారు. అక్కడ తయారవుతున్న ఉత్పత్తులపై వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు వంటి లోగోలను ముద్రిస్తారు. నకిలీకి ఆస్కారం లేకుండా.. జాతీయ, అంతర్జాతీయ విపణిలో విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఉన్న గిరాకీని బట్టి తరచూ నకిలీ ఉత్పత్తులు తయారవుతున్నట్టు యాజమాన్యానికి తెలిసింది. దీంతో ఎక్కడా డూప్లికేటింగ్ జరగకుండా బ్రాండింగ్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు ఉత్పత్తి గ్రేడును కూడా తెలిపే విధంగా ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రాండింగ్ చేస్తున్నారు. వైజాగ్ టీఎంటీ 500డి, వైజాగ్ టీఎంటీ హెచ్సీఆర్డీ అనేవి ఇప్పటి వరకు ముద్రిస్తూ వచ్చారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైజాగ్ టీఎంటీ ఎఫ్ఈ 550డి, 500డి 6686 59, 8568 66 అనే బ్రాండ్ నంబర్లు ముద్రించడం ఇటీవల ప్రారంభించారు. 16ఎంఎం నుంచి 36 ఎంఎం వరకు ఉన్న సైజు ఊచలపై, రైల్వే సంస్థకు పంపే ఉత్పత్తులపై హెచ్సీఆర్డీ(హై కరోజన్ రెసిస్టెంట్ డకై ్టల్)ను ముద్రిస్తున్నారు. లోగో ఎలా ముద్రిస్తారంటే.? రోల్స్ను సీఎన్సీ లేత్ మిషన్ మీద కావాల్సిన పరిమాణంలో గాడి(గ్రూవ్స్) చేసి, గ్రూవ్స్లో రీబార్ నాచ్ చేసి అనంతరం స్పార్కోనిక్స్ బ్రాండింగ్ మిషన్ మీదకు రోల్ను ఎక్కిస్తారు. స్పార్కోనిక్స్ బ్రాండింగ్ మిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పుణే) సరఫరా చేసిన ఈ మిషన్ను కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేస్తారు. తద్వారా రోల్ మీద సుమారు 1.3 ఎం.ఎం నుంచి 1.9 ఎం.ఎం లోతులో అక్షరం ముద్ర పడుతుంది. అలా ఒక్కో అక్షరం ముద్రిస్తారు. కొన్ని సందర్భాల్లో నాలుగైదు అక్షరాలను ముద్రించే అవకాశం ఉన్నట్లు మిషన్ ఆపరేటర్ తెలిపారు. ఇక్కడ 16 ఎం.ఎం రీబార్ నుంచి 36 ఎం.ఎం రీబార్ వరకు బ్రాండింగ్ చేస్తారు. ఒక్కో రోల్కు సుమారు 5 గంటల సమయం పడుతుండగా.. ఇటీవల మార్చిన లోగోకు 6–7 గంటలు పట్టవచ్చునని ఉద్యోగులు తెలిపారు. -
నూకాంబిక అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి : గవరపాలెం నూకాంబిక అమ్మవారి బాలాలయంలో అమ్మవారిని ఆదివారం భక్తులు పొటెత్తారు. నూకాంబిక అమ్మవారి నెల పండుగను రాష్ట్ర పండగగా గుర్తించడంతో భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి నెల జాతర ఈనెల 27వ తేదీ వరకూ నిర్వహించడం జరుగుతుందని ఈవో వెంపలరాం రాంబాబు చెప్పారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయశాఖ ఉద్యోగులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొంతమంది భక్తులు అమ్మవారి ఆలయం వద్ద చలువు పందిళ్ల వద్ద కుటుంబ సమేతంగా వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు భక్తులకు మజ్జిగ, తాగునీరు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు), కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పరిహారంగా నగదు ఇవ్వాలని డిమాండ్
మునగపాక : పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు ఇచ్చే పరిహారాన్ని నేరుగా అకౌంట్లో జమ చేయాల్సిందేనని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం మునగపాకలో నిర్వాసితులతో సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణ ఎంతో అవసరమైనప్పటికీ బాధితులకు ఇచ్చే పరిహారం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సరికాదన్నారు. నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ ప్రకటించడం సరికాదన్నారు. రహదారి విస్తరణను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, అయితే గృహాలు, వ్యవసాయ భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం బాధితులకు మేలు జరగాలన్నారు. ఆర్అండ్బీలో చిరువ్యాపారాలు చేసుకునే వారిని ఆదుకోవాలన్నారు. నిర్వాసితులకు న్యాయం జరగకుంటే భవిష్యత్లో ఆందోళళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్రి అప్పారావు, కె.సదాశివరావు, రొంగలి రాము, ఎస్.బ్రహ్మాజీ, బొడ్డేడ రామ్కుమార్, కాండ్రేగుల రామప్పారావు, టెక్కలి జగ్గారావు పాల్గొన్నారు. -
మూగజీవాలకు ఆసరా దక్కెన్
● 13 ఏళ్లుగా పక్షుల కోసం నీటి తొట్టెల అందజేత ● వేసవిలో మూగజీవుల దాహార్తి తీరుస్తున్న కెన్ ఫౌండేషన్ ● ఈ ఏడాది 500 వాటర్ బౌల్స్ పంపిణీ ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చిందంటే చాలు.. గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతుంటాం. ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో శరీరానికి నీటిని అందిస్తుంటాం.. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటికోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని పక్షి జాతులు అంతరించిపోవడానికి వేసవి కూడా ఒక కారణమని జీవశాస్త్ర అధ్యయనాల్లో తేలింది. అందుకే మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నగరంలోని కెన్ ఫౌండేషన్ 13 ఏళ్లుగా కృషి చేస్తోంది. వేసవిలో నీటి తొట్టెలను ఉచితంగా పంపిణీ చేస్తూ.. ఎన్నో జీవాలకు ఊపిరిపోస్తోంది. 100 తొట్టెలతో ప్రారంభమై.. సేవే మార్గంగా.. విద్యార్థులు వలంటీర్లుగా ‘కెన్’ అధ్యక్షుడు పుల్లేటికుర్తి సంతోష్ 2012లో వాటర్ బౌల్ పేరుతో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి ఏడాది ఫౌండేషన్ వలంటీర్లే నగరంలోని పలు చోట్ల 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఆ నీటి తొట్టెల వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి నగర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ ప్రాజెక్టులో భాగస్వాములమవుతామని ముందుకొచ్చారు. పెందుర్తి, విశాలాక్షినగర్, కొత్తవలస, స్టీల్ప్లాంట్, అనకాపల్లి, డాల్ఫిన్ నోస్, శివారు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చి నీటి తొట్టెలను తీసుకెళ్లారు. మేడలపై, పెరట్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో పిచ్చుకలు, రామ చిలుకలు, పావురాలు, కాకులతో పాటు ఉడతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ నీటి తొట్టెల వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఇదిలా ఉండగా సంస్థ చైర్పర్సన్ గీతానారాయణ్ నీటి తొట్టెలకయ్యే ఖర్చును భరిస్తూ అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 వరకు 750 నీటి తొట్టెలు సరఫరా చేయగా.. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 3 వేల వరకు పంపిణీ చేశారు. ఈ ఏడాది 500 నీటి తొట్టెలను సిద్ధం చేసి, మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో ఆదివారం పంపిణీ ప్రారంభించారు. సీఎంఆర్ ఎండీ మావూరి వెంకటరమణ, గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ రవిశంకర్ నారాయణ్ చేతుల మీదుగా వీటిని ప్రజలకు అందజేశారు. ఇంకా ఎవరైనా పక్షి ప్రేమికులుంటే నీటి తొట్టెలను అందించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. 9885674949కి కాల్ చేయండి కెన్ ఫౌండేషన్ తరపున ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించాం. తొలుత వంద చోట్ల వీటిని ఏర్పాటు చేసి.. ఏటా కొనసాగించాలని భావించాం. ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములవుతామని ప్రజలు ముందుకు రావడంతో మా ప్రయత్నం విజయవంతమైంది. పిచ్చుకలు, రామచిలుకలు వచ్చి ఆహారం తిని.. ఈ తొట్టెల్లో నీళ్లు తాగుతూ సేద తీరుతున్నాయని వారంతా చెబుతుంటే సంతోషంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా నీటి తొట్టెలు అందిస్తాం. 98856 74949కు సంప్రదించి నీటి తొట్టెలు పొందవచ్చు. – గీతానారాయణ్, కెన్ చైర్పర్సన్ -
రైవాడ జలాశయంలో భారీ చేపలు
దేవరాపల్లి: రైవాడ జలాశయంలో మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో భారీగా చేపలు దొరుకుతున్నాయి. సాధారణంగా ఇక్కడ ఐదు కేజీల లోపు బరువున్న చేపలు మాత్రమే లభిస్తాయి. ప్రస్తుతం వరద నీరు వచ్చి చేరడంతో సుమారు 10 కేజీల బరువున్న బొచ్చు, శీలావతి తదితర రకాల చేపలు వలకు చిక్కుతున్నాయి. కేజీ ధర రూ.200 పలికినా చేపల ప్రియులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. రైవాడ జలాశయంలోని చేపలు రుచికరంగా, తాజాగా ఉండటంతో డిమాండ్ ఎక్కువ. నిండుకుండలా రైవాడ జలాశయం రైవాడ జలాశయం నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 111.70 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి సుమారు 200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండటంతో రబీలో సాగు నీటికి ఢోకా ఉండబోదని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలాశయానికి ఎగువ భాగంలో వర్షాలు కురిస్తే జలాశయంలోకి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని జలాశయ డీఈఈ జి.సత్యంనాయుడు తెలిపారు. వరద నీరు వచ్చి చేరడంతో ఇబ్బడి ముబ్బడిగా మత్స్యాలు ఎగబడి కొనుగోలు చేసిన చేపల ప్రియులు -
ఏయూలో గాడితప్పిన బిజినెస్
● ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’పై ప్రభుత్వ నిర్లక్ష్యం ● రెగ్యులర్ ఫ్యాకల్టీలు లేక చదువులు తిరోగమనం ● రిటైర్ అయిన ఆచార్యుడికి డైరెక్టర్ పగ్గాలు ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అందలం ● వీసీ నిర్ణయాలపై విస్మయం విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’ గాడి తప్పుతోంది. కూటమి ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు మేలు చేసేలా తీసుకుంటున్న నిర్ణయాలతో ఏయూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చిన ప్రాధాన్యతతో అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 2021–22 విద్యా సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హాస్పటాలిటీ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో బీబీఏతో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేసుకునేలా ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతో విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభించింది. చదువులు తిరోగమనం సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద రూసా నిధులతో ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’ను ఏయూలో ప్రారంభించారు. తరగతుల నిర్వహణలో భాగంగా కాంట్రాక్టు పద్ధతిన సీనియర్ ఆచార్యులు, అవసరమైన మేరకు అతిథి అధ్యాపకులను నియమించారు. ప్రభుత్వ ఆమోదంతో రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ప్రయత్నాలు చేశారు. ఈలోగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ప్రసాద్రెడ్డిని వీసీ పదవి నుంచి తప్పించటం జరిగిపోయాయి. కానీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలపై ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదు. అంతా అతిథి అధ్యాపకులే కావటంతో ఇక్కడ చదువులు సవ్యంగా సాగటం లేదు. ఈ కారణంగానే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ చదువుల స్టాండర్డ్ తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. బాధ్యతాయుతంగా పాఠాలు చెప్పేవారు లేకపోతే, పరిస్థితి ఇలానే ఉంటుందని ఇక్కడి ఆచార్యులు సైతం అంగీకరిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఆచార్యుడికి కీలక బాధ్యత ఉద్యోగ విరమణ చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగించకూడదనేది యూజీసీ నిబంధన. తాము అధికారంలోకి వస్తే, రిటైర్ అయిన వారందరినీ యూనివర్సిటీ నుంచి సాగనంపుతామని కూటమి పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. కానీ ఏయూకు బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్న స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ పగ్గాలు రిటైర్ అయిన ఆచార్యుడికి అప్పగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇన్చార్జ్ వీసీ శశిభూషణ రావు హయాంలో కూటమి పెద్దల సిఫార్సుతోనే నియామకం జరిగినట్లు ప్రచారం సాగింది. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ హయాంలోనూ అదే వ్యక్తికి డైరెక్టర్గా కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడంపై వర్సిటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉద్యోగ విరమణ చేసిన ఓ ఆచార్యుడు సైతం ఇక్కడ ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రసాద్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం, ఆయన హయాంలో ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ను నిర్వీర్యం చేయనుందా..? అనే అనుమానాలు సైతం ఆచార్యులు వ్యక్తం చేస్తున్నారు. విదేశీ విద్యార్థులతో క్రేజ్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ‘ఆంధ్ర యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్’గా మారింది. ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో డిగ్రీ, పీజీ చేసే అవకాశం ఉండటంతో ఇక్కడ చదివేందుకు విదేశీ విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. విదేశీ ఎంబసీ ఆమోదంతో ఇంటర్నేషనల్ వ్యవహారాలు చూసే విభాగం ద్వారా ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో చేరే వారిలో 40 శాతం మంది విద్యార్థులు ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. అన్ని కోర్సులు కలుపుకొని 350 మందితో ప్రారంభమైన కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఈ మూడేళ్ల కాలంలో 586కు చేరింది. చైన్నెకి చెందిన లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ మేనేజ్మెంట్తో ఎంవోయూ చేసుకోవడంతో ఇక్కడ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయి. -
గంజాయితో ఐదుగురు అరెస్టు
అచ్యుతాపురం రూరల్: కొండకర్లలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అచ్యుతాపురం పోలీసులు ఆదివారం అదుపు లోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. వీరిలో నలుగురు అచ్యుతాపురం మండలానికి చెందిన వారు కాగా మరొకరు అనకాపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చింతగుంట పవన్, పప్పల సాయి కుమార్, పోలవరపు వేణు, బెల్లంకొండ మహేంద్ర వర్మ, అప్పికొండ మణికంఠ బానులు వీరంతా మరో ప్రాంతం నుంచి గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ కొంత గంజాయి సేవించి మరికొంత నిల్వచేసారన్నారు. అందిన సమాచారం మేరకు సీఐ గణేష్, ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు వారి సిబ్బందితో గంజాయి సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. -
రమ్యమైనది రామనామం
నర్సీపట్నం: అతి పురాతన దేవాలయమైన నర్సీపట్నం కోమటి వీధి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వెలమ వీధి రామాలయంలోని శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవంలో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు పాల్గొ న్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మంగళసూత్రాలు సమర్పించారు. తారువలో మాజీ డిప్యూటీ సీఎం బూడి.. దేవరాపల్లి: తారువలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు దంపతులు పాల్గొని సీతారాములు వారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో ముత్యాలనాయుడు వడ్డన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. -
నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ బంద్
● నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించని కూటమి ప్రభుత్వం ● సోమవారం నుంచి సేవలు నిలిపివేస్తున్నాం: ఆషా మహారాణిపేట: జిల్లాలో నెట్వర్క్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవను నిలిపివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో సోమవారం నుంచి అన్ని రకాల ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్(ఆషా) ప్రకటించింది. విశాఖపట్నంలో దాదాపు 102 నెట్వర్క్ ఆస్పత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆషా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ బకాయిల కారణంగా ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, దీని వల్ల ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో నెట్వర్క్ ఆస్పత్రులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ, ఆర్థిక భారం మోయలేనంతగా పెరిగిందన్నారు. ఇప్పటికే అనేక ఆస్పత్రులు బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్లు, ప్రైవేటు సంస్థల నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చి ఆస్పత్రులను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. ఈ పథకం అమలు చేస్తున్న అన్ని నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా పరపతిని కోల్పోతున్నాయన్నారు. మరోవైపు రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ అప్పారావు తెలిపారు. అయితే.. నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపివేయడం పట్ల పేదలు ఆందోళన చెందుతున్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
నక్కపల్లి: శనివారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులకు పలు గ్రామాల్లో అరటి, మామిడి, జీడి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. సాయంత్రం విపరీతమైన ఈదురు గాలులు వీచాయి. చీడిక కొత్తూరులో నర్సింగరావుకు చెందిన సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో వేసిన అరటి పంటకు నష్టం వాటిల్లింది. గాలులకు అరటి చెట్లు నేలకూలిపోయాయి. అరటి గెలలు పక్వానికి రాకముందే నేలకొరిగి పోవడంతో తీవ్రనష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డొంకాడ, సీతానగరం, రమణయ్యపేట, రేబాక, చీడిక, కొత్తూరు, తదితర గ్రామాల్లో వేసిన బొప్పాయి చెట్లు కూడా నేలకూలాయి. పిందె దశలో ఉన్న మామిడికి కూడా నష్టం వాటిల్లిందని, మామిడి కాయలు నేలరాలాయని రైతులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం దేవరాపల్లి: ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సానికి మండలంలోని పది గ్రామాలలో 21 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతోపాటు మూడు లక్షల మేర నష్టం జరిగి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తపెంట కోనేరు వద్ద విద్యుత్ తీగలపై తాటిచెట్టు పడిపోవడంతో ఐదు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వేచలం చీకటితోట వద్ద 4 స్తంభాలు, ఎన్.గజపతినగరంలో 2, వేచలం గ్రామంలో 4, కలిగొట్ల శివారు బండారుపాలెంలో 2, బి.కింతాడ కొత్తూరులో 4 స్తంభాలు పడిపోయాయి. ఎలక్ట్రికల్ ఏఈ కర్రి శంకరరావు ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. ధ్వంసమైన అరటి తోటలు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు -
అవిశ్వాసం వీగిపోతుంది
● జీవీఎంసీలో కూటమికి బలం లేదు ● అయినా అవిశ్వాసం పెట్టేందుకు కుట్రలు ● నిబంధనలకు అనుగుణంగా కలెక్టర్ వ్యవహరించాలి ● మరో ఏడాదిపాటు మేయర్గా హరివెంకటకుమారి కొనసాగుతారు ● మీడియాతో మాజీ మంత్రి అమర్నాథ్ సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్పై కూటమి పార్టీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోనుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. జీవీఎంసీలో కూటమి పార్టీలకు తగిన సంఖ్యాబలం లేకున్నా అవిశ్వాసం నోటీసులు ఇచ్చారని, దీనికి ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానానికి తెరపడనుందన్నారు. మరో ఏడాది పాటు జీవీఎంసీ మేయర్గా హరి వెంకట కుమారినే కొనసాగనున్నారన్నారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగకుండా తీర్మానం చేసినట్టు కార్పొరేటర్లకు ఎలా నోటీసులు ఇస్తారని కలెక్టర్ను ప్రశ్నించారు. అయితే ఈ ప్రక్రియలో నిబంధనలకు అనుగుణంగానే కలెక్టర్/ఇన్చార్జి జీవీఎంసీ కమిషనర్ హరేందిర ప్రసాద్ వ్యవహరించాలని సూచించారు. ప్రజాబలంతో నెగ్గి వైఎస్సార్సీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుందని, అలాంటి మేయర్పై కూటమి పార్టీలకు తగిన సంఖ్యా బలం లేకున్నా అప్రజాస్వామికంగా పెట్టే అవిశ్వాసానికి కుయుక్తులు పన్నుతోందన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మా కార్పొరేటర్లు లొంగలేదు.. ఎందుకంటే అది జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానమని స్పష్టం చేశారు. ఇప్పటికే స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాల కు గురిచేయాలని చూసినా అవి ఫలించలేదన్నారు. -
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
సీతంపేట (విశాఖ): భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతిపౌరుడు తెలుసుకోవాలని మానవ హక్కుల కౌన్సిల్ కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం నిర్వహించిన కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం మనకు ప్రసాదించిన సమానత్వపు హక్కులను కాపాడాల్సిన బాధ్యత హ్యూమన్రైట్స్ డిఫెండర్లపై ఉందన్నారు. సీనియర్ న్యాయవాది, కౌన్సిల్ సభ్యుడు ఎన్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చట్టం ద్వారా మనకు కల్పించబడిన స్వేచ్ఛ, బాధ్యతలు అంటే సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యతగా పేర్కొన్నారు. మాజీ పోలీస్ అధికారి సీహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ పౌరులందరికీ సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడీ నుంచి రక్షణ, మత స్వేచ్ఛ, విద్యా హక్కు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.వి.రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మతం, భాష సంస్కృతి కాపాడుకునే హక్కు ఉందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సభ్యులు గుండు అప్పలరాజు, మాజీ పోలీస్ అధికారులు, న్యాయవాదులు పాల్గొని మానవహక్కుల కౌన్సిల్ 26 ఏళ్లుగా చేస్తున్న సేవలను ప్రశంసించారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వివాహిత మృతి
సబ్బవరం: మండలంలోని సబ్బవరం కొత్త రోడ్డు సమీపాన గొర్లివానిపాలెం రోడ్డులో ద్విచక్ర వాహనం నుంచి జారిపడిన ఘటనలో కె.కోటపాడుకు చెందిన ఓ వివాహిత మృతి చెందింది. స్థానిక సీఐ పిన్నింటి రమణ తెలిపిన వివరాలిలా.. కె.కోటపాడుకు చెందిన కళ్యాణం ఝాన్సీ(23) తన భర్త మరిడయ్య, ఇద్దరు పిల్లలు డేవిడ్(6), జీవన్కుమార్(4)తో కలిసి సబ్బవరంలోని బుడగజంగాల కాలనీలోని తన అమ్మగారి ఇంటికి నాలుగు రోజుల కిందట ద్విచక్ర వాహనంపై వచ్చింది. తిరిగి స్వగ్రామం కోటపాడుకు వెళ్తుండగా.. గొర్లివానిపాలెం రోడ్డులోని నూకాలమ్మ ఆలయ సమీపంలో ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడటంతో ఝూన్సీకి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం మృతి చెందింది. ఝాన్సీ తండ్రి రాజుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
బాంబు పేలుళ్లు.. గన్ ఫైరింగ్లు
దువ్వాడలో యుద్ధ వాతావరణం సాక్షి, విశాఖపట్నం: శనివారం మధ్యాహ్నం.. ఒక్కసారిగా బాంబు పేలింది.. అంతలోనే గన్ఫైరింగ్ వినిపించింది.. బుల్లెట్ల వర్షం కురిసింది.. అక్కడ వ్యాపించిన పొగల నుంచి సైనికులు భారీ రైఫిల్స్ పట్టుకొని ఒక్కసారిగా బయటికి వచ్చారు. ఇక్కడేదైనా యుద్ధం జరుగుతోందా అనే అనుమానాలతో దువ్వాడ సమీప ప్రజల్లో ఆందోళన మొదలైంది. అది టైగర్ ట్రయాంఫ్–2025 విన్యాసాల్లో భాగంగా జరుగుతున్న కార్యచరణ అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. మూడు రోజుల పాటు దువ్వాడ ఫైరింగ్ రేంజ్లో భారత్, అమెరికా దేశాల సైనికుల మధ్య ఉమ్మడి శిక్షణ కార్యక్రమం జరిగింది. చివరి రోజున యుద్ధ వాతావరణంలో ఇరుదేశాలు పరస్పర సహకారం అందించుకుంటూ.. శత్రుసేనలను మట్టుబెట్టాలనే అంశంపై విన్యాసాలు నిర్వహించారు. ఇదే సమయంలో యుద్ధం జరిగినప్పుడు.. ఓవైపు శత్రువులతో పోరాటం చేస్తూనే.. మరోవైపు గాయపడిన తోటి సైనికులకు వైద్య సహకారం అందించేందుకు ఏ విధమైన కార్యచరణ సంసిద్ధం చేయాలన్నదానిపైనా శిక్షణ కార్యక్రమం జరిగింది. సుదర్శన్ చక్ర కార్ప్స్ నేతృత్వంలో బైసన్ డివిజన్ యాంఫీబియస్ బ్రిగేడ్కు ప్రాతినిధ్యం వహించిన 8 గూర్ఖా రైఫిల్స్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ గ్రూప్, 5వ పదాతిదళ రెజిమెంట్లోని 1వ బెటాలియన్ (బాబ్క్యాట్స్), ఒకటో స్ట్రైకర్ బ్రిగేడ్ పోరాట బృందం, 11వ పదాతిదళ విభాగం (ఆర్కిటిక్ వోల్వ్స్) సిబ్బందితో కూడిన భారత ఆర్మీ బృందాలు ఈ ఉమ్మడి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. భారత్, యూఎస్ సైనికులు 100 మీటర్ల నుంచి లైవ్–ఫైరింగ్ డ్రిల్లు, 50 మీటర్ల వద్ద క్లోజ్–క్వార్టర్స్ కంబాట్ షూటింగ్, దట్టమైన అటవీ భూభాగంలో పరస్పర కమ్యూనికేషన్ ద్వారా కదలికలు, జంగిల్ లేన్ షూటింగ్ మొదలైన విన్యాసాలు చేపట్టారు. -
నరసింగబిల్లిలో బాలిక ఆత్మహత్య
కశింకోట : నరసింగబిల్లిలో ఒక బాలిక ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకొంది. సీఐ అల్లు స్వామినాయుడు శనివారం అందించిన వివరాల ప్రకారం..నరసింగబిల్లిలోని జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పిల్లిబోయిన బ్యూల (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరిపోసుకొని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఫిర్యాదు అందడంతో ఎస్ఐ లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి శనివారం పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు ఇటీవల టెన్త్ పరీక్షలు రాసింది. నూతలగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం గ్రామానికి చెందిన ఆమె తల్లి దుర్గ, తండ్రి కూలి పని చేసుకుంటూ నరసింగబిల్లిలో పదేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరు ఎప్పటిలాగే కూలి పనికి వెళ్లిపోయాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్యూల ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఇందుకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఇంటి పక్కన ఉన్న ఓ యువకుడు ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తుండడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఆ యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ కోణంలో ఆత్మహత్య సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఒక సోదరుడు ఉన్నారు. తండ్రి వరహాలబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
విద్యుత్ షాక్ తగిలి రైతు సజీవదహనం
నక్కపల్లి : మండలంలోని జానకయ్యపేటలో విద్యుత్ షాక్ తగిలి ఈగల తాతబ్బాయి(80) అనే రైతు సజీవ దహనమయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఈగల తాతబ్బాయి శనివారం ఉదయం తన కొబ్బరి తోటకు వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన దేవర కృష్ణ తోటలో తాటిచెట్టు కరెంటు తీగలపై పడడంతో తోటలోకి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి కాలిబాటలో పడ్డాయి. వీటిని గమనించకుండా వెళ్లిన తాతబ్బాయి తెగి పడిన వైర్లను కాలితో తొక్కడంతో విద్యుత్షాక్కు గురయ్యాడు. తీగలనుంచి మంటలు వ్యాపించి తాతబ్బాయి శరీరం పూర్తిగా కాలిపోయింది, దీంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ సింహాచలం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కురందాసు నూకరాజు, ఎస్ఐ సన్నిబాబులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద విషయాన్ని తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగల వల్ల మృత్యువాత పడిన తాతబాబ్బయి కుటుంబాన్ని ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
గ్రూప్ 2లో మెరిసిన ఆణిముత్యాలు
రావికమతం : మండలంలో మర్రివలస , గుమ్మాలపాడు గ్రామాలకు చెందిన ఎలిశెట్టి రవి, సిద్దా రవి ప్రసాద్ ఇద్దరూ గ్రూప్ 2 పరీక్షలో 300 మార్కులకు 230 మార్కులు సాధించారు. పేదింటిలో పుట్టిన ఈ యువకులు స్వయంకృషితో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి త్వరలో ప్రభుత్వ కొలువులో చేరనున్నారు. మర్రివలస గ్రామానికి చెందిన రవి తండ్రి వరహాలు కోనేళ్ల కిందట మరణించారు. తల్లి పాప కూలి పని చేస్తూ రవిని కష్టపడి చదివించింది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు మంచి మార్కులతో పాసయ్యారు. కాకినాడ సూరంపాడు ఆదిత్యలో టెస్ట్ రాసి ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన గ్రూప్2 పరీక్ష రాశారు. అలాగే గుమ్మాలపాడు గ్రామానికి చెందిన రవి ప్రసాద్ పదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 బై 10 మార్కులు సాధించి త్రిబుల్ ఐటీలో సీటు సాధించారు. ఆపై విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తునే గ్రూప్ 2 పరీక్షలు రాశారు. శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల కావడంతో ఇరువుకి 300 మార్కులగాను 230 మార్కులు సాధించి సత్తా చాటారు.ఇరువురిని ఆయా గ్రామాల పెద్దలు,యువకులు అభినందించారు. -
ఆదర్శప్రాయుడు బాబూ జగ్జీవన్రామ్
అనకాపల్లి: నేటి యువత మాజీ ఉప రాష్ట్రపతి బాబూ జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. స్థానిక గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బిహార్లో షెడ్యూల్డ్ కులంలో జన్మించి చదువే ఆయుధంగా చేసుకొని అత్యంత ఉన్నత స్థానానికి చేరారని, దేశానికి ఎనలేని సేవలు అందించారని ఆమె పేర్కొన్నారు. దేశంలో హరిత విప్లవం అమలు చేయడం ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేసినట్లు ఆమె చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యునిగా, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడానికి రిజర్వేషన్లు అమలు చేసినట్లు ఆమె తెలిపారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించి డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ సమాజానికి దశ దిశ నిర్దేశించారని చెప్పారు. నేడు కార్మికులు అనుభవిస్తున్న హక్కులు కార్మిక శాఖ మంత్రిగా ఆయన కృషి ఫలితమేనని తెలిపారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. జేసీ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాజేశ్వరి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడు రేబాక మధుబాబూ, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబూ తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో సముద్ర రంగం కీలకం
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ వాణిజ్యంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధిలో సముద్ర రంగం ముఖ్య భూమిక పోషిస్తోందని విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) చైర్మన్ డా. ఎం. అంగముత్తు అన్నారు. 62వ నేషనల్ మేరీటైమ్ దినోత్సవం పోర్టులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ డా. ఎం. అంగముత్తు, సముద్రరంగంలో విధులు నిర్వర్తించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు. అనంతరం పోర్ట్ టగ్ ఫ్లోటిల్లా ఇచ్చిన గౌరవ వందనం స్వీకరించారు. చైర్మన్ మాట్లాడుతూ.. నౌకాయాన, సముద్ర రవాణా రంగాలు దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయికి సామర్థ్యాన్ని పెంపొందించడంలో విశాఖపట్నం పోర్ట్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మేరీటైమ్ డే సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, కోస్ట్గార్డ్ డీఐజీ రాజేశ్ మిత్తల్, హెచ్ఐఎంటీ ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్తో పాటు పోర్ట్ విభాగాధిపతులు, సీనియర్ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
టీడీఆర్ బాండ్లు వద్దు...నగదే కావాలి
మునగపాక : మాకు టీడీఆర్ బాండ్లు వద్దు...నగదే ముద్దు అంటూ పలువురు నిర్వాసితులు నినదించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భూములు, గృహాలు కోల్పోతున్న బాధితులు శనివారం మునగపాక పీఏసీఏస్ కార్యాలయం ఆవరణలో సమావేశమయ్యారు. రోడ్డు పొడవునా ఉన్న నిర్వాసితులంతా ముక్తకంఠంతో టీడీఆర్ బాండ్లు వద్దంటూ నినదించారు. గ్రామసభల ద్వారా అధికారులు ప్రకటించిన విధంగానే నేరుగా నగదు అకౌంట్లో జమ చేయాలని కోరారు. తమకు మరో ప్రత్యామ్నాయం అవసరం లేదని ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. నిర్వాసితుల సంఘ జేఏసీ నాయకుడు ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రహదారి విస్తరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అయితే గ్రామసభల ద్వారా ప్రకటించినట్టు పరిహారాన్ని నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేయాలన్నారు. ప్రతి బాధితుడు తమకు టీడీఆర్ బాండు వద్దంటూ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగు న్యాయం చేయాలన్నారు. అనంతరం జేఏసీ సభ్యులంతా గ్రామాల్లో జరగనున్న సభల్లో టీడీఆర్ బాండ్లను వ్యతిరేకించాలని నిర్ణయించారు. సమావేశంలో నిర్వాసితులు భీమరశెట్టి శ్రీనివాసరావు, బొడ్డేడ రామచంద్రరావు,ఏవీ సత్యనారాయణ,పెంటకోట జగన్నాధరావు మాష్టారు,పొలమరశెట్టి అప్పలనాయుడు,బొద్దపు శ్రీరామమూర్తి,బొడ్డేడ సింధూ మాష్టారు.ఆడారి శ్రీరాములు,విల్లూరి జగన్నాథరావు పాల్గొన్నారు. -
సిరులతల్లికి తులసిపూజ
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శనివారం తులసిపూజ నిర్వహించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన ఈ పూజలో, అమ్మవారి త్రికాల పంచామృతాభిషేక సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. తులసీదళార్చనలో పాల్గొనదలిచే భక్తులు రూ.1,500, త్రికాల పంచామృతాభిషేక సేవలో పాల్గొనే భక్తులు రూ.1,000 పూజా రుసుం చెల్లించి పాల్గొనవచ్చని ఆలయ ఈవో కె. శోభారాణి తెలిపారు. కార్యక్రమంలో ఈవో కె. శోభారాణి, ఏఈవో కె. తిరుమలేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో విఫలం
● నల్లబ్యాడ్జీలతో దివ్యాంగుల నిరసన అనకాపల్లి: జిల్లాలో దివ్యాంగుల హక్కుల చట్టం –2016ను తక్షణమే అమలు చేయడంలో జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్ విమర్శించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను ప్రజల ప్రాణాలు హరించేలా మార్చారన్నారు. శనివారం స్థానిక నెహ్రూచౌక్ సంఘం కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులు ధరించి దివ్యాంగులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కారం కోసం వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్కు వెళ్తే నిరుత్సాహమే ఎదురవుతుందన్నారు. అక్కడ అర్జీలు తీసుకునే అధికారులు లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగులకు లిఫ్ట్ అనుకూలంగా లేదని, కనీసం వీల్ చైర్ పట్టదని వాపోయారు. ఎండలో ఉండలేక రెండో అంతస్తులో కలెక్టర్ వద్దకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మెట్ల స్థానంలో ర్యాంపులు ఏర్పాటు చెయ్యలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దాహం వేస్తే కనీసం తాగునీరు సౌకర్యం కల్పించలేదన్నారు. దివ్యాంగులకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ అనకాపల్లి గాంధీనగర్లో ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సభ్యులు మంత్రి శ్రీనివాసరావు, ముక్కా గణేష్, కరణం శివ, గెంజి కనకరాజు, ఎం. వి. ఎన్. సత్యనారాయణ, బొట్ట సంతోష్, కాండ్రేగుల నూక అప్పారావు, చెట్టుపల్లి శ్రీనివాసరావు, దూళి శివ, పచ్చిపాల నర్సింగరావు, మొల్లి తాతారావు, ఎండపల్లి శ్రీనివాసరావు, ఈశ్వరరావు, త్రినాథ్, బండా సింగ్ పాల్గొన్నారు. -
ఏయూను సందర్శించిన విదేశీ ప్రతినిధులు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రిపబ్లిక్ ఆఫ్ అంగోలా రాయబారి ఎక్స్లెన్సీ క్లెమెంటే కామెన్హా శనివారం సందర్శించారు. వీసీ ఆచార్య రాజశేఖర్ను కార్యాలయంలో కలుసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో చదువుతున్న అంగోలాకు చెందిన 46 మంది విద్యార్థులకు అద్భుతమైన విద్యా సౌకర్యాలు కల్పించినందుకు క్లెమెంటే కామెన్హా సతీమణి మరియా, మినిస్టర్ కౌన్సిల ర్ అబెల్ మావుంగో ఏయూ వీసీకి కృతజ్ఞత లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున జ్ఞాపిక అందజేసి సత్కరించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందజేస్తామని ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు తెలిపారు. -
గ్రూపు రాజకీయం చేస్తే.. ఎమ్మెల్యేపై కూడా చర్యలు
బుచ్చెయ్యపేట: వ్యక్తిగత ఇమేజ్ కోసం తన ఉనికిని కాపాడుకోవడానికి పలు పార్టీలు మారే అవకాశవాదులు గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు అన్నారు. ఇటీవల బుచ్చె య్యపేటలో చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు మండల టీడీపీ కార్యకర్తల విస్తృత సమావేశం ఏర్పాటు చేసి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకపోవడమే కాక ఫ్లెక్సీలో తన ఫొటో వేయకపోవడంపై తాతయ్యబాబు స్పందించారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయన శనివారం తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ ఫ్లెక్సీలో పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న తన పేరును, ఫొటోను వేయకపోవడం ప్రొటోకాల్కు విరుద్ధమన్నారు. కొంతమంది ఎన్నికల ముందు పార్టీలు మారి గెలిచిన పార్టీలో చేరి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వారి ఆటలు సాగనీయబోమని, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగనీయమన్నారు. గ్రూపు రాజకీయాలు చేస్తే ఎమ్మెల్యేలపైన కూడా చర్యలు తీసుకునేలా అధిష్టానం దృష్టికి తీసికెళ్తామన్నారు. ప్రతి బుధవారం ఎమ్మెల్యే తన పరిధిలోని మండల కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహించి ఉదయం ప్రజల సమస్యలు, మధ్యాహ్నం పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్ నిర్వహించకుండా ప్రజా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకొని అధిష్టానానికి సమాచారం అందిస్తున్నామన్నారు. నాయకులు దొండా నరేష్, సయ్యపురెడ్డి మాధవరావు, మేడివాడ రమణ, శిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, గురుమూర్తి, శంకరరావు తదితర్లు పాల్గొన్నారు. గీత దాటితే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా ప్రతి బుధవారం గ్రీవెన్స్ నిర్వహించకపోతే ఎమ్మెల్యేలను వివరణ కోరతాం ప్రొటోకాల్ రగడపై స్పందించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు -
350 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఫైనల్ జాబితా విడుదలపాయకరావుపేట: పట్టణం పరిధిలో పలు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే 350 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. నవోదయం 2.0లో భాగంగా జరిగిన దాడుల్లో పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ, దుర్గా కాలనీని చెందిన ఇద్దరు వ్యక్తులను సారా తయారీ కేసులో అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 15 కేజీల నల్ల బెల్లం, 3 కేజీల అమ్మోనియంను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితులను యలమంచిలి కోర్టుకు తరలించామన్నారు. -
మరింత మెరుగ్గా పోలీస్ భద్రతా ప్రమాణాలు
● విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ● ఏఆర్ పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ నగరంలోని విశాలాక్షినగర్ ప్రాంతం కై లాసగిరి జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి వార్షిక తనిఖీలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించారు. పోలీస్ జాగిలాలు డీఐజీకి సలాం చేశాయి. ఈ సందర్భంగా డీఐజీ పోలీసుల ఆయుధాలు, మోటార్ ట్రాన్స్నోర్ట్ విభాగం, డాగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. సెక్యూరిటీ వెల్ఫేర్ విభాగం రికార్డులు పరిశీలించారు. ఇక్కడ నార్కోటిక్ జాగిలం బన్నీకి మత్తు పదార్థాలు కనిపెట్టినందుకు ఆయన రివార్డ్ ప్రకటించారు. వాహనాల నిర్వహణ, ఆయుధాల పనితీరు, శిక్షణ ప్రమాణాలు, భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ తుహిన్ సిన్హాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్ భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరముందన్నారు. -
బాలిక ఆచూకీ లభ్యం
● 24 గంటల్లో కనుగొన్న పోలీసులు రావికమతం: జెడ్.కొత్తపట్నం గ్రామానికి చెంది న పదో తరగతి విద్యార్థిని బొబ్బిలి సాయి సంజన(16) అదృశ్యంపై తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల ఫోన్ నంబర్ల ఆధారంగా గాలించారు. చివరగా శుక్రవారం లంబసింగి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్ఐ శ్రీనివాస్ లంబసింగి వెళ్లి బాలికను తీసుకొని వచ్చి తల్లి కుమారికి కొత్తకోట పోలీసు స్టేషన్లో అప్పగించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను పలువురు అభినందించారు. -
దేవరాపల్లిలో భారీ వర్షం
దేవరాపల్లి: దేవరాపల్లి మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షం పడడంతో ఉపశమనం పొందారు. భారీ వర్షంతో ప్రధాన రోడ్డు వర్షపు నీటితో నిండిపోయింది. దేవరాపల్లిలోని శ్రీకృష్ణాలయం పక్కన ఉన్న గ్రామ సచివాలయం–2 వద్ద అగ్రహారపు మంగరాజు ఇంటిలోకి డ్రైనేజీల్లో నుంచి నీరు ప్రవేశించింది. ఇంట్లో సరుకులు, తిండి గింజలు, ఇతర సామగ్రి తడిసి ముద్దయ్యాయని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే కార్మికుల జీతాల్లో కోత
ఆలోచన విరమించాలంటూ మున్సిపల్ వర్కర్ల ఆందోళన నర్సీపట్నం: ఔట్సోర్సింగ్ వర్కర్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించరాదు.. పర్మినెంట్ చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ ఆప్కాస్లో ఉన్న మున్సిపల్ శానిటేషన్, వాటర్ సప్లయి, ఇతర విభాగాల ఔట్సోర్సింగ్ వర్కర్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలన్నారు. ఈ అంశంపై కొన్నేళ్లుగా పోరాడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆప్కాస్ పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని చూస్తుందన్నారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే నెలనెలా జీతాలు చెల్లించకపోగా కార్మికుల జీతాల్లో కోత విధిస్తారన్నారు. కార్మికులపై వేధింపులు పెరుగుతాయన్నారు. ఆప్కాస్ను రద్దు చేస్తే పర్మినెంట్ చేయాలన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు కె.రాజు, రమణ, అర్జమ్మ, మహేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మాకవరపాలెం ఎంపీపీగా సర్వేశ్వరరావు బాధ్యతల స్వీకారం
మాకవరపాలెం: ఎంపీపీగా రుత్తల సర్వేశ్వరరావు బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. ఎంపీపీ సత్యనారాయణ రాజీనామా చేయడంతో గత నెల 27న ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో సభ్యులు సర్వేశ్వరరావును ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్, పార్టీ సీనియర్ నాయకులు రుత్తల యర్రాపాత్రుడుతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు.. సర్వేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్రావు, ఎంపీడీవో సీతామహాలక్ష్మి, మండల పరిషత్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చిటికెల రమణ, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, వైస్ ఎంపీపీ రాజారావు, పెట్ల భద్రాచలం, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ
● నిర్వాసితులకు త్వరలోనే పునరావాసం ● మూలపర గ్రామసభలో ఆర్డీవో రమణ నక్కపల్లి: విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు త్వరలోనే పునరావాసం కల్పించడంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ తెలిపారు. శుక్రవారం అమలాపురం శివారు మూలపర గ్రామంలో నిర్వాసితులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ గ్రామాన్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తోందని, ఇళ్లు కోల్పోయిన వారందరికీ పెద బోదిగల్లం వద్ద పునరావాసం కల్పిస్తామన్నారు. 2024 డిసెంబరు 31వ తేదీని కటాఫ్గా పరిగణనలోకి తీసుకుని నిర్వాసిత కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి గుర్తించిన లబ్ధిదారుల జాబితాను ఈ గ్రామసభలో విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేసుకోవాలని ఆయన కోరారు. ఉప సర్పంచ్ గంటా నర్సింగరావు, తదితరులు మాట్లాడుతూ అధికారులు విడుదల చేసిన జాబితాల్లో కొంతమంది అనర్హులు ఉన్నారన్నారు. స్థానికేతరులను ఈ గ్రామంలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని, వీటిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టి అనర్హులను జాబితా నుంచి తొలగించాలని కోరారు. వచ్చిన ఆభ్యంతరాలపై సమగ్ర విచారణ చేస్తామని ఆర్డీవో తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడు సూరాకాసుల గోవిందు, సీపీఎం నాయకుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ నిర్వాసితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం, రూ.8.30 లక్షలు ప్యాకేజీ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మూలపర గ్రామంలో 198 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిర్మాణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ప్యాకేజీ పెంచాలని కోరారు. 18 ఏళ్లు నిండి వివాహమైన మహిళలకు కూడా ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ నర్సింహమూర్తి, సర్పంచ్ శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఫార్మా ఉద్యోగి మృతి
అచ్యుతాపురం రూరల్ : అచ్యుతాపురం నాలుగు రోడ్ల కూడలిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మా ఉద్యోగి బగాది రమణారావు(40) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, సంతకవిటి మండలం, జి.ఎన్.పురం గ్రామానికి చెందిన రమణారావు అచ్యుతాపురంలో అద్దెకు నివాసముంటూ పరవాడలోని ఓ ఫార్మా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఏ షిఫ్ట్కు వెళ్లేందుకు ఆయన బైక్పై కూడలికి చేరుకున్నారు. యలమంచిలి రోడ్డు నుంచి అనకాపల్లి వైపు మలుపు తిరుగుతున్న సమయంలో బైక్పై వెళ్తున్న రమణారావును లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన దుర్ఘటనపై విచారణ చేపట్టి సీఐ నమ్మి గణేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు రొంగలి రాము మాట్లాడుతూ మృతి చెందిన రమణారావు కుటుంబానికి లారీ యజమానితో పాటు పరిశ్రమ యాజమాన్యం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేవీ ప్రాజెక్ట్ లారీలు ఎటువంటి అనుమతులు లేకుండా అనకాపల్లి, అచ్యుతాపురం రహదారిలో యథేచ్ఛగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. లారీల యాజమానులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి
అనకాపల్లి: విద్యుత్ స్మార్ట్ మీటర్లు, సెకి ఒప్పందాలు రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో ప్రజలపై ఎనలేని భారాలు మోపిన విద్యుత్ సంస్కరణలపై ఏప్రిల్ మాసంలో ప్రజలను చైతన్యవంతం చేసి దశలవారీగా పోరాటాలకు సన్నద్ధం చేస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు చెప్పారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి, పోరాటాల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి 10 నెలల పాలనలో ప్రజలపై విద్యుత్ చార్జీలు తగ్గించకపోగా రూ.15,485 కోట్లు అదనంగా సర్దుబాటు చార్జీల భారాన్ని మోపిందన్నారు. సెకీతో జరిగిన ఒప్పందాల వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుందన్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాలపై ఆందోళనకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శంకరరావు, గంటా శ్రీరాములు, సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు, బి.ఉమామహేశ్వరావు, నాగిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
షేర్ ఆటోగా నమ్మించి మహిళకు టోకరా
పట్టపగలు బంగారం గొలుసు చోరీనర్సీపట్నం: పట్టపగలు మహిళ మెడలో బంగారం తాడును దుండగులు తెంచుకువెళ్లిన ఘటన నర్సీపట్నంలో వెలుగు చూసింది. బాధితరాలు కథనంగా ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం, చీడిగుమ్మల గ్రామానికి చెందిన లోకారపు లక్ష్మమ్మ ఈ నెల 3న ఇంట్లోకి నిత్యావసర సరకుల కొనుగోలు చేసేందుకు నర్సీపట్నం వెళ్లింది. నిత్యావసర సరకులు కొనుగోలు చేసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఐదు రోడ్ల కూడలిలోని ఐస్ పార్లర్ వద్ద ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. చీడిగుమ్మల తీసుకువెళ్తున్నట్టు నటించి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ నుంచి వెనక్కి తిప్పేశారు. నర్సీపట్నం టౌన్లో నుంచి కొత్తవీధి, పెదబొడ్డేపల్లి రోడ్డులో ఉన్న శ్మశానవాటిక వద్ద మహిళ మెడలోని రూ.2 లక్షలు విలువ చేసే రెండు తులాల బంగారు తాడు తీసేసుకొని, ఆమెతో పాటు ఆటోలో నిత్యావసర సరకులు దించేసి వెళ్లిపోయారు. ఇదంతా ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. మహిళ లబోదిబోమంటూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. శుక్రవారం కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని టౌన్ సీఐ గోవిందరావును కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాశీపురం రైతు బిడ్డ పరదేశినాయుడుకు డాక్టరేట్
దేవరాపల్లి: మండలంలోని కాశీపురం రైతు కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి పరదేశినాయుడు శుక్రవారం చైన్నెలోని భారత్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ను తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గోవి చెజియాన్ చేతుల మీదుగా అందుకున్నారు. పరదేశినాయుడు గత 18 ఏళ్లుగా అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మైక్రో బయాలజీ అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. డెంగ్యూ వైరస్పై జరిపిన పరిశోధనలకు డాక్టరేట్ను ఆయన అందుకున్నారు. పరదేశినాయుడు పీహెచ్డీ పట్టా అందుకోవడంపై స్థానిక ప్రజలు, పెద్దలు, యువకులు హర్షం వ్యక్తం చేశారు. -
సమావేశమే జరగకుండా తీర్మానమా?
తారస్థాయికి.. కూటమి కుయుక్తులు● మేయర్ మార్పు కోసం నిబంధనలకు పాతర ● అజెండా అంశాన్ని.. తీర్మానంగా పేర్కొంటూ కలెక్టర్ నోటీస్ ● 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాసాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడి ● అజెండాలో చర్చించకుండానే.. ప్రతిపాదన ఎలా సాధ్యమంటున్న సభ్యులు ● కలెక్టర్ నోటీసుపై సర్వత్రా అనుమానాలు ఎంవీపీకాలనీ : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి ప్రభుత్వం కుయుక్తులు తారస్థాయికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ మేయర్ మార్పు అంశం పెద్ద చర్చనీయాంఽశంగా మారింది. నిజానికి గ్రేటర్ విశాఖలో కూటమి ప్రభుత్వానికి మేయర్ను మార్పు చేసేంతగా బలం లేదు. అయినప్పటికీ ఫిరాయింపులకు తెరతీయడం ద్వారా నగర మేయర్ను మార్పు చేయాలని గత కొంతకాలంగా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. సాంకేతికంగా మార్పు సాధ్యం కానప్పటికీ దొడ్డిదారిలో కథ నడిపించేందుకు కూటమి నాయకుల సారధ్యంలో జిల్లా ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారు. తాజాగా 58 మంది కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారంటూ కలెక్టర్ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు సమావేశమే జరగకుండా జిల్లా కలెక్టర్/జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ అవిశ్వాస తీర్మాన నోటీసు ఎలా జారీ చేస్తారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తీర్మానంపై సర్వత్రా అనుమానాలు మేయర్ మార్పు అంశంపై కూటమి నాయకుల సారథ్యంలో ఉన్నతాధికారులు చేస్తున్న నిర్ణయాలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్ మార్పు అంశంపై ఇప్పటి వరకు కౌన్సిల్లో ఎలాంటి చర్చ జరగలేదు. ఈ నెల 19న కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా..నిబంధనల ప్రకారం ఈ అంశాన్ని అజెండాలో మాత్రమే చేర్చాల్సి వుంది. అనంతరం 19న దీనిపై చర్చ జరిపి కార్పొరేటర్ల ప్రతిపాదనలు మేరకు అవిశ్వాసంపై తీర్మానం పెట్టే వీలుంటుంది. అయితే ప్రస్తుతం అజెండా అంశంగా ఉన్న మేయర్ మార్పుపై తీర్మానం జరిగినట్లు కలెక్టర్/ జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ నోటీసు విడుదల చేయడం కూటమి అడ్డగోలు వ్యవహారానికి అద్దం పడుతోంది. పైగా తీర్మానాన్ని 58 మంది కార్పొరేటర్లు ప్రతిపాదించినట్లు కలెక్టర్ ఆ నోట్లో వెల్లడించడంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తీర్మానంపై 58 మంది సభ్యులు సంతకం చేసిన ప్రతిని కౌన్సిల్ సభ్యులందరికీ పంపించినట్లు కూడా కలెక్టర్ తన నోటీసులో పేర్కొన్నారు. అయితే అలాంటి ప్రతులు శుక్రవారం అర్ధరాత్రి వరకు తమకు ఏమీ అందలేదని పలువురు కౌన్సిల్ సభ్యులు వెల్లడించారు. దీంతో జిల్లా ఉన్నతాధికారుల తీరుతో పాటు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ అడ్డగోలు వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
స్మార్ట్ మీటర్ ఉద్యోగుల ఆందోళన
నర్సీపట్నం: కొత్త జీతం వద్దు..పాత జీతమే ఇవ్వాలంటూ అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు ప్లకార్డులతో శుక్రవారం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించి, ఆందోళన బాటపట్టారు. పాత జీతం ముద్దు.. కొత్త జీతం వద్దు, ఏడాది ఒప్పందం కొనసాగించాలి.. అంటూ నినాదాలు చేశా రు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జాయినింగ్ లెటర్లో ఇచ్చిన ప్రకారం జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలన్నారు. పాత జాయినింగ్ లెటర్లో ఉన్న హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. -
జిల్లాలో స్పెషల్ డ్రైవ్గా తడి, పొడి చెత్త సేకరణ
నక్కపల్లి: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ తడి, పొడి చెత్తను ఇళ్ల వద్ద నుంచే సేకరించే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషారాణి తెలిపారు. గ్రామాల్లో శుక్రవారం పంచాయతీ, సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాల మేరకు తడి, పొడి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రం నక్కపల్లిలో తడి, పొడి చెత్తను సేకరించే కార్యక్రమాన్ని డీపీవో స్వయంగా పరిశీలించారు. పంచాయతీ స్వీపర్లు, గ్రీన్ అంబాసిడర్ల సాయంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్లాస్టిక్ డబ్బాల్లో తడి, పొడి చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాస్(స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర) కార్యక్రమంలో భాగంగా ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందజేయాలన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అంటువ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. వీధులు అపరిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పారు. సాస్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ ప్రక్రియను రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి చేపడుతున్నామన్నారు. ప్రజల్లో కూడా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను సంపద తయారీ కేంద్రాల వద్ద వేర్వేరుగా ఉంచి వానపాముల సాయంతో వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నట్టు చెప్పారు. చినదొడ్డిగల్లు సంపద తయారీ కేంద్రాల వద్ద కార్యక్రమాలను మండల ప్రత్యేకాధికారి ప్రసాద్ పరీశీలించారు. తడి, పొడి చెత్తను సిబ్బంది వేరు చేశారు. కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో మూర్తి, వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, సర్పంచ్ చంద్రరావు, ఎంపీడీవో సీతారామరాజు, ఉప సర్పంచ్ వీసం రాజు, పంచాయతీ కార్యదర్శి బీఏబీఎల్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం డీపీవో శిరీషారాణి -
22న రమాకుమారిపై అవిశ్వాసం
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపాలిటీలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ నుంచి 25 మంది వార్డు సభ్యులకు అధికారికంగా సమాచారం వచ్చింది. పురపాలకసంఘానికి 2021లో జరిగిన ఎన్నికల్లో 25 వార్డులకు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ఒకరు, మరొక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినవారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాలతో మున్సిపల్ చైర్పర్సన్గా పిల్లా రమాకుమారి ఎన్నికయ్యారు. ఇటీవల పిల్లా రమాకుమారి బీజేపీలో చేరారు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన 18 మంది కౌన్సిలర్లు రమాకుమారిపై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టరుకు నోటీసు ఇచ్చారు. నిర్దేశిత ఫార్మాట్లో ఇచ్చిన నోటీసు పరిశీలించిన కలెక్టర్ విజయ కృష్ణన్ ఈ నెల 22వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రక్రియకు సంబంధించి కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు స్థానిక మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సభ్యులకు ప్రలోభాలు! మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారిపై వైఎస్సార్సీపీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన దగ్గర్నుంచి రమాకుమారి వర్గీయులు వైఎస్సార్సీపీ సభ్యులకు ప్రలోభాల ఎర వేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నలుగురైదుగురు వార్డు సభ్యులకు ప్రలోభాల ఆశ చూపి రమాకుమారికి మద్దతునిచ్చేలా ఆమె తరపువారు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ముగ్గురు వార్డు సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. యలమంచిలి పట్టణ కౌన్సిలర్లకు అధికారికంగా సమాచారం ఇచ్చిన కలెక్టర్ -
వైఎస్సార్సీపీ నేతకు బెయిల్
నర్సీపట్నం: వైఎస్సార్సీపీ నేత, బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు కండిషన్ బెయిల్పై విడుదలయ్యారు. శ్రీనివాసరావును నంద్యాల జిల్లా, జలదుర్గం పోలీసులు ఈ నెల 2వ తేదీన అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారంలో మూడు రోజులు పోలీసుల ఎదుట హాజరు కావాలని, 60 రోజులపాటు నంద్యాల పరిధి దాటి వెళ్లవద్దంటూ శ్రీనివాసరావుకు కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. జలదుర్గం పోలీసు స్టేషన్ నుంచి శ్రీనివాసరావు సాక్షితో మాట్లాడుతూ రాజకీయ కక్షలతో తన ఆస్తులను ధ్వంసం చేస్తున్న సమయంలో ఆవేశంతో మాట్లాడితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంతోపాటు రాష్ట్రంలో పలు చోట్ల కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనకు పార్టీ అండగా నిలిచిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సారథ్యంలోనే పని చేస్తానన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన స్థాయికి తగిన వారితో రాజకీయాలు చేస్తే బాగుంటుందన్నారు. సామాన్య నాయకుడైన తనపై కేసులు పెట్టించి వేధించటం స్పీకర్కు భావ్యం కాదని ఆవేదన వెలిబుచ్చారు. -
8 నుంచి రైల్వే స్పోర్ట్స్ మీట్
విశాఖ స్పోర్ట్స్: ఈస్ట్కోస్ట్రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో అంతర విభాగాల స్పోర్ట్స్ మీట్ ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అరకు, దమన్జోడి, కోరాపుట్, కిరండూల్, బచేలి, రాయఘడ, పలాస, శ్రీకాకుళం ప్రాంతాలలోని వివిధ విభాగాలకు చెందిన 19 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. పురుషుల కోసం ఫుట్బాల్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, టేబుల్టెన్నిస్, బాడీబిల్డింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాల్బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్, క్రికెట్తో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. మహిళలకు టేబుల్టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్, అథ్లెటిక్స్ మొదలైన అంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోటీల పోస్టర్ను డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్రా, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) మనోజ్కుమార్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ప్రవీణ్ బాఠి, సంయుక్త క్రీడాధికారులు అవినాష్, నరేంద్ర కురి ఆవిష్కరించారు. -
హాకీ చీఫ్ సెలక్టర్గా రమేష్
యలమంచిలి రూరల్: పట్టణానికి చెందిన సీనియర్ హాకీ క్రీడాకారుడు శెట్టి రమేష్ రాష్ట్ర మెన్స్ జూనియర్ హాకీ పోటీలకు చీఫ్ సెలక్టర్గా నియమితులయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగే హాకీ పోటీలకు శెట్టి రమేష్ చీఫ్ సెలక్టర్గా వ్యవహరించనున్నారు. యలమంచిలికి చెందిన రమేష్ గతంలో వరుసగా ఎనిమిదిసార్లు జాతీయ హాకీ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు. అనుభవం కలిగిన రమేష్ను రాష్ట్ర మెన్స్ జూనియర్ హాకీ పోటీలకు చీఫ్ సెలక్టర్గా నియమిస్తూ హాకీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ నిరంజన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారు నరేష్ శుక్రవారం రాత్రి మీడియాకు తెలిపారు. యలమంచిలికి చెందిన క్రీడాకారుడికి తొలిసారిగా చీఫ్ సెలక్టర్గా వ్యవహరించే గౌరవం లభించడం పట్ల సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అనువాద ప్రతిభతో ఆరు అవార్డులు
సమావేశమే జరగకుండా తీర్మానమా?ఆంగ్ల ఉపాధ్యాయిని నాగజ్యోతి మరో రికార్డు 8లోరోలుగుంట: ఆమె ఆంగ్ల ఉపాధ్యాయిని.. తన అసమాన క్రీడా ప్రతిభతో గతంలో ఆమె వార్తలకెక్కారు. ఇప్పుడు అనువాదంలో అందె వేసిన చేయిగా నిరూపించుకొని ఏకంగా ఆరు అవార్డులు సాధించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి పవర్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ పోటీలలో ఎన్నో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం సింగపూర్, మలేషియాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మూడు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించారు. ఇప్పుడు మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు వరల్డ్ రికార్డు హోల్డర్, రెప్లికా ఆర్టిస్ట్ డాక్టర్ దార్ల నాగేశ్వరరావు ‘ఎవెరీడే సెల్యూట్ టు ఉమెన్స్’ కాన్సెప్ట్ నడుపుతున్నారు. దీని కోసం నాగ జ్యోతి ఏడాదిపాటు ప్రతిరోజు తెలుగులో ఉన్న విషయాన్ని ఇంగ్లిష్ భాషలో అనువదించారు. ఆమె ప్రతిభకు ముగ్ధులైన ప్రపంచ రికార్డు సంస్థల వారు అవార్డులను అందజేశారు. దార్ల బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఫ్యాబులస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఫెంటాస్టిక్ అచీవ్మెంట్స్ అండ్ రికార్డ్స్, ఇండియా రికా, మార్వలెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను వరించాయి. వీటిని ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ దార్ల నాగేశ్వరరావు, సుమన్, శ్రీకాంత్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల హెచ్ఎం డి.వి.ఎస్.ఎస్.వి.ప్రసాద్, సహచర సీనియర్ టీచర్లు ఆర్.వి.ఎస్.ఆర్.శర్మ, శ్రీరామ్మూర్తి, విద్యాకమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. -
పంట పొలాల్లో బస్సు బోల్తా
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం పురుషోత్తపురం సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ఏపీఎస్ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు పురుషోత్తపురం సమీపంలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కగా ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. అప్పటివరకూ సాఫీగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురై అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో బస్సులో ప్రయాణికులంతా భయంతో కేకలు పెట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి రూరల్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పురుషోత్తపురం గ్రామస్థులు ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను బస్సులోంచి బయటకు తెచ్చేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్సు వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కె.వెంకటలక్ష్మి (64) తీవ్రంగా గాయపడింది. ఆమె తలకు బలమైన గాయం తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమెకు ప్రథమ చికిత్స అనంతరం మెదడుకు సీటీ స్కాన్ చేశారు. హైదరాబాద్కు చెందిన సీహెచ్ కిరణ్ కుమార్(50), సీహెచ్ సుదర్శన్ (53), అన్నవరానికి చెందిన కె.సీతామహాలక్ష్మి (64), నారాయణపేటకు చెందిన జి.రాజు (35), బి.నవీన (30) గాయపడిన వారిలో ఉన్నారు. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉందని డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం ఆరుగురికి గాయాలు ఎన్టీఆర్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స -
కూలెప్పుడిస్తావు.. బాబూ?
పనులకు హాజరయ్యే యాక్టివ్ జాబ్ కార్డులు 2,02,924 సాక్షి, అనకాపల్లి : వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రజలంతా ఉపాధి పనుల బాట పట్టారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 5 నుంచి నేటి వరకు దాదాపు మూడు నెలల ఉపాధి కూలీల వేతన బకాయిలు పెండింగ్లో ఉండడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.. ఏదో ఇంటి ఖర్చుల కోసం ఉపాధి పనులకు వెళ్లే కూలీలు మూడు నెలల వేతనాలు పడకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బులు ఎప్పుడు పడతాయా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 24 మండలాల పరిధిలో సుమారు రూ.52 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇంకా నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎస్.రాయవరం మండలంలో అత్యధికంగా రూ.3.95 కోట్ల బకాయిలున్నాయి. ఒక్కో కూలీకి సగటున రూ.23 వేల బకాయి.. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీకి రోజుకు రూ.250 నుంచి రూ.300 కూలీ డబ్బులు పడుతున్నాయి. మూడు నెలల బకాయి ఉంది. ఒక్కో కూలీకి సగటున రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకూ బకాయి చెల్లించాల్సి ఉంది.2,81,075 జిల్లాలో మొత్తం జాబ్ కార్డులు గడ్డి తిని బతకాలా? ఉపాధి కూలీల వినూత్న నిరసన చీడికాడ: పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ చీడిపల్లిలో ఉపాధి కూలీలు వినూత్నంగా నిరసన తెలిపారు. కూలి డబ్బులు ఇవ్వకపోతే గడ్డి తిని బతకాలా.. అని ప్రశ్నిస్తూ నోట్లో గడ్డి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు వేతనాల బకాయిలపై వెంకన్న వద్ద మొరపెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నాటికి జిల్లాలో 9 వారాలకు రూ.53 కోట్ల మేర వేతన బకాయిలున్నట్లు తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లించని సంబంధిత శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం ఉపాధి చట్టంలో ఉందని గుర్తు చేశారు. మూడు నెలలుగా ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు అందని వేతనాలు జిల్లాలో సుమారు రూ.52 కోట్ల బకాయిలు నిధులు విడుదల కాలేదంటున్న అధికారులు వేతనాల కోసం వేచి చూస్తున్న 2.89 లక్షల మంది ఉపాధి కూలీలు ప్రభుత్వంపై ఎందుకు కేసులు పెట్టకూడదు? జిల్లాలో ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. సకాలంలో బకాయిలు చెల్లింపులు చేయని సంబంధించిన శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం చట్టంలో ఉంది. అ పరిస్థితి రాక ముందే తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఈ ఏడాది కొత్తగా మంజూరైన పనులకు రూ.7 పెంచామని ప్రభుత్వం చెబుతుంది. మండుటెండలో పనిచేస్తున్న కూలీలకు కనీసం టెంట్ సౌకర్యం కూడా కల్పించలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. గతంలో తట్టా, గునపాం, పార, మంచినీళ్లు ఏర్పాటు చేసి, ట్రావెలింగ్, సమ్మర్ అలవెన్సులు ఇచ్చేవారు. అవి పూర్తిగా కట్ చేసి రూ.7 పెంచినట్లు ప్రకటించడం అన్యాయం. ఉపాధి హామీ శాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా ఉండి కూలీల కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం విచారకరం. ఉపాధి హామీకి లక్ష కోట్లు ఉన్న బడ్జెట్ను పీఎం మోదీ ప్రభుత్వం దశలవారీగా రూ.62 వేల కోట్లకు తగ్గించింది. గట్టిగా ఉన్న నేలకు అదనంగా డబ్బులు ఇవ్వాలి. – డి.వెంకన్న, ఏపీ వ్యవసాయి కార్మిక సంఘం కార్యదర్శి -
సర్కారు కినుక
● కరెంట్ ఇష్యూ కోర్టు ఆదేశించినాసాక్షి, విశాఖపట్నం : ఏ సంస్థలోనైనా చేసిన సర్వీస్ ప్రకారం సీనియారిటీని పరిగణిస్తుంటారు. కానీ.. విద్యుత్ పంపిణీ సంస్థల్లో మాత్రం విచిత్రంగా పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకున్నారు. ఉద్యోగి వయసు 40 సంవత్సరాలై సర్వీసు 15 ఏళ్లున్నప్పటికీ.. యాభై ఏళ్ల ఉద్యోగికి ఐదేళ్ల సర్వీసు ఉంటే.. సదరు ఉద్యోగినే సీనియర్గా పరిగణించారు. ఇలా 2008లో డిస్కం అధికారులు అడ్డగోలుగా పదోన్నతుల జాబితా తయారుచేశారు. దీనిపై కొందరు అప్పట్లోనే హైకోర్టుని ఆశ్రయించారు. సర్వీసు ప్రకారం పదోన్నతుల జాబితా సిద్ధంచెయ్యాలంటూ 2024 జూన్లో న్యాయస్థానం ఆదేశించినా.. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. నిజానికి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చే ముందు కరెంట్ పోతే ఫ్యూజులు బిగించేందుకు రైతులే వెళ్లి మృత్యువాత పడేవారు. దీంతో డిస్కంలలో లైన్మెన్ల కొరత వేధిస్తోందని తెలుసుకున్న వైఎస్సార్.. ఉమ్మడి రాష్ట్రంలో వెంటనే 7,114 పోస్టుల్ని భర్తీచేశారు. ఈ సమయంలో ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు ఉమ్మడి సర్కిల్స్ పరిధిలో 1,220 పోస్టులు భర్తీఅయ్యాయి. సీనియారిటీ లిస్టుల్లో అధికారుల నిర్లక్ష్యం.. 2008లో కొత్తగా రిక్రూట్ చేసిన లైన్మెన్ల గత అనుభవాన్ని అనుసరించి.. సీనియారిటీ లిస్టులు తయారుచెయ్యాలని అప్పటి ప్రభుత్వం డిస్కంలని ఆదేశించింది. అయితే.. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జాబితా సిద్ధంచేసేశారు. పనిచేసిన అనుభవం బట్టి కాకుండా.. వయసు బట్టి జాబితా తయారుచేశారు. దీనిపై అప్పట్లోనే అధికారులపై నాటి సీఎం వైఎస్ మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన మృతిచెందడం.. తర్వాత ప్రభుత్వాలు విస్మరించడంతో నేటికి కూడా సీనియర్లు జూనియర్లుగానే మిగిలిపోయారు. జూనియర్లు మాత్రం ప్రమోషన్లు తీసుకుని సీనియర్లుగా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బాధిత లైన్మెన్లు హైకోర్టుని ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నించినా.. సీనియారిటీ జాబితా విషయంలో అన్యాయం జరిగిందంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి బాధిత లైన్మెన్లు తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే కోర్టులో కేసు నడుస్తుండటంతో ఫలితం దక్కలేదు. చివరి నిమిషం వరకూ సీనియారిటీ జాబితాలో మార్పులు చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో.. గతేడాది జూన్ 21న హైకోర్టు తీర్పు వెలువరించింది. పనిదినాల ఆధారంగా మాత్రమే కొత్తగా సీనియారిటీ జాబితా తయారుచేయాలని.. వయసు ఆధారంగా చేసిన జాబితాని వెంటనే రద్దుచేసి.. కొత్తగా తయారుచేయాలని డిస్కంలని ఆదేశించింది. అయినా, కూటమి ప్రభుత్వం న్యాయస్థానం తీర్పుని పెడచెవిన పెట్టింది. 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. పలుమార్లు అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు లైన్మెన్లు వినతులు సమర్పించినా.. సీనియారిటీ లిస్టుని మార్చడంలేదు. ఇటీవల ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్లో ప్రక్రియ ప్రారంభించారు. అయితే.. ఈపీడీసీఎల్ అధికారులు మాత్రం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే, 2007లో జూనియర్ లైన్మెన్లుగా ఎంపికై న 138 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈపీడీసీఎల్ అధికారులు అడ్డుపుల్ల వేశారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లగా.. 138 మందికి ఉద్యోగాలివ్వాలని 2011లో న్యాయస్థానం ఆదేశించింది. వీరు విధుల్లో చేరినా సీనియారిటీని కోల్పోయారు. ఇలా.. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం సర్కిల్లో 118 మంది, విజయనగరం సర్కిల్లో 136, విశాఖపట్నంలో 198, రాజమండ్రిలో 549, ఏలూరులో 353 మంది కలిపి మొత్తం 1,354 జూనియర్ లైన్మెన్లు పదోన్నతు లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు తీర్పుని తక్షణమే అమలుచేస్తే.. ఈపీడీసీఎల్ సహా మూడు డిస్కంల పరిధిలో సుమారు 3,500 మంది ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఏపీఈపీడీసీఎల్లో 1,354 మంది జూనియర్ లైన్మెన్ పదోన్నతుల్లో విచిత్రం 18 ఏళ్ల సర్వీస్ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరాలు ఫలితంగా సీనియర్లు సైతం జూనియర్లుగా మిగిలిపోయిన పరిస్థితి హైకోర్టు ఆదేశించినా అమలుచెయ్యని డిస్కంలు కోర్టు కేసుల కారణంగా క్రమబద్ధీకరించలేకపోయిన గత ప్రభుత్వం సీనియార్టీ ప్రకారం జాబితా సిద్ధంచేయాలని 10 నెలల క్రితం హైకోర్టు ఆదేశాలు అయినా పాత జాబితానే కొనసాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం -
అంత్రరాష్ట్ర సర్వీసులకు కొత్త బస్సులు
ఆర్ఎం అప్పలనాయుడు మద్దిలపాలెం (విశాఖ): బస్ డిపోలతో పాటు బస్సులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన విశాఖపట్నం డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. విశాఖపట్నం డిపోలో పరిశుభ్రత మరింత మెరుగుపడాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. గురువారం నుంచి భద్రాచలం–విజయవాడ బస్సుల ద్వారా మరింత ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం డిపో నుంచి దూర ప్రాంతాలకు, అంత్రరాష్ట్ర సర్వీసులకు కొత్త బస్సులు కేటాయించినట్లు చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు పోటీ తత్వంతో పనిచేసి విశాఖపట్నం డిపోకు మరింత ఆదాయం తీసుకురావాలని పిలుపునిచ్చారు. బస్సుల మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎస్ 6 బస్సులకు సంబంధించి సిబ్బందికి కొత్త టెక్నాలజీతో కూడిన టూల్స్ సరఫరా చేస్తామన్నారు. వేసవి కాలంలో సిబ్బంది ఎవరూ వడదెబ్బకు గురికాకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ, మంచినీళ్లు తీసుకోవాలన్నారు. బస్ స్టేషన్, డిపోల్లో తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
టెన్త్ విద్యార్థిని అదృశ్యంపై ఫిర్యాదు
రావికమతం: జెడ్.కొత్తపట్నం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని బొబ్బిలి సాయి సంజన (16) అదృశ్యంపై తండ్రి బొబ్బిలి రాజు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. సాయి సంజన (16) జెడ్.కొత్తపట్నం హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. కొత్తకోట హైస్కూల్లో పబ్లిక్ పరీక్షలు రాసింది. ఈ నెల 1వ తేదీన (మంగళవారం) చివరి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అయితే మంగళవారం రాత్రి నుంచి ఆమె కనిపించకపోవడంతో స్నేహితులను, బంధువులను ఆరా తీశారు. ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
త్వరలో బంగారమ్మపాలెం నుంచి చేపలవేట బంద్!
ఎస్.రాయవరం: బంగారమ్మపాలెం మొగ నుంచి ఇకపై వేట నిషేధం ఉంటుందని, మత్స్యకారులు సహకరించి ప్రత్యామ్నాయం దొండవాక రేవు నుంచి వేట చేసుకునే ఏర్పాటు చేస్తున్నామని నేవల్బేస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ అన్నారు. బంగారమ్మపాలెం గ్రామంలో మత్స్యకార పెద్దలతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్రామానికి శరవేగంగా నిర్మాణం కాబోతున్న నేవల్ బేస్ అనుసంధానంగా శారదా, వరహానదుల కలయిక మార్గం నుంచి కొనసాగే మత్స్యవేటను మరికొన్ని రోజుల్లో నిలిపి వేసే చర్యలు ఉంటాయని సమావేశంలో వెల్లడించారు. దీంతో గ్రామస్తులు చేపల వేటకు దారి మూసెస్తే, తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొండవాక వెళ్లి ఎలా వేట చేసుకుంటామని ప్రశ్నించారు. మా గ్రామం ఒక చోట, వేట మరో చోట ఎలా సాధ్య పడుతుందని అన్నారు. అసలు మా గ్రామం తరలించే ఆలోచన ఉందా? ఉంటే ,ఎక్కడికి తరలిస్తారో స్పష్టంగా చెప్పి తమకు ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు నివేదిస్తామని అధికారులు చెప్పా రు. ఈ సమావేశంలో తహసీల్దార్ రమేష్బాబు, ఎస్ఐ విభీషణరావు, సర్పంచ్ చోడిపల్లి శ్రీనివాసరావు, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు. -
6.5 తులాల బంగారం చోరీ
గొలుగొండ: చోద్యం గ్రామంలో బుధవారం రాత్రి 6.5 తులాల బంగారం చోరీకి గురైంది. గ్రామానికి చెందిన బొందల రాజు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సమీప గ్రామం లింగపేటలో తీర్థమహోత్సవాలు వెళ్లి తిరిగి ఇంటికి 12 గంటలకు తిరిగి వచ్చి చూడగా తలుపులు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లో 6.5 తులాల బంగారం అపహరణకు గురైందని బాధితుడు కృష్ణదేవిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు, క్లూస్ టీం సభ్యులు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవ తమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు. -
మెట్రోకు 98 ఎకరాల సేకరణ
● ఇందుకోసం రూ.670 కోట్లు ఖర్చు ● విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట (విశాఖ): విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 98 ఎకరాల భూములు అవసరం ఉందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. గురువారం తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. ఈ 98 ఎకరాల భూముల్లో 46 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, 52 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రూ.670 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచన వేశామన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం సుమారు వెయ్యి ఎకరాల వరకు భూసేకరణ చేపడుతున్నామని, ఆనందపురం మండలం పరిధిలో తర్లువాడ, కనమం, బీడిపాలెం, జగన్నాథపురం తదితర గ్రామాల్లో భూములు ఉన్నట్లు వెల్లడించారు. వీటిలో కొన్ని ప్రభుత్వ భూములు ఉండగా.. మరికొన్ని అసైన్డ్ భూములు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. విశాఖలో ఐటీ సంస్థలు నెలకొల్పడానికి పలువురు ముందుకు వస్తున్నారని, ప్రభుత్వ అనుమతితో వాటి కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఐటీ సంస్థలు ఏర్పాటు చేసేవారికి రాయితీలు ఇస్తామన్నారు. బీచ్రోడ్డులో పర్యాటకులను ఆకర్షించే విధంగా బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. విశాఖలో కీలకమైన మత్స్య రంగం ద్వారా రాబడులు పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థూల ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1.50 లక్షల కోట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఇతర సేవా రంగాల ద్వారా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తే.. జిల్లా స్థూల ఆదాయం పెంపు సాధ్యమన్నారు. జిల్లాలో 200 హెక్టార్లలో బీడు భూములను వ్యవసాయ భూములుగా మార్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొబ్బరి, మామిడి తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తామని కలెక్టర్ వివరించారు. -
లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు
● పనుల కోసం దళారులను ఆశ్రయించవద్దు ● సాక్షి కథనంపై స్పందించిన తహసీల్దార్ నర్సింహమూర్తి నక్కపల్లి: రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించడం కోసం రైతుల నుంచి తమ సిబ్బంది, వీఆర్వోలు గానీ లంచాలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రేగుల గెడ్డ నర్సింహమూర్తి హెచ్చరించారు. గురువారం ‘ప్రతి పనికి పైసా వసూల్’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. మ్యుటేషన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వేల కోసం వివిధ ధ్రువపత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే వారు నేరుగా తనను కలవొచ్చన్నారు. మీరు చేసిన దరఖాస్తులకు సకాలంలో పరిష్కారం కాకపోయినా సిబ్బంది లేదా వీఆర్వోలు, సర్వే సిబ్బంది లంచం డిమాండ్ చేసినా నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రభుత్వం తమకు వేలాది రూపాయల జీతాలు చెల్లిస్తోందని, పైసా తీసుకోకుండా ప్రజలకు పనిచేయడం కోసమే తమను నియమించిందన్నారు. అన్ని సక్రమంగా ఉంటే సకాలంలోనే రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో బోరు మంజూరు కోసం రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ వ్యవహారం జరిగిన తర్వాత వీఆర్వోలు, సిబ్బంది, సర్వే సిబ్బందితో సమావేశం నిర్వహించి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆధారాలు పరిశీలించాకే మ్యుటేషన్... వేంపాడులో సర్వే నెంబరు 276/1లో 7 ఎకరాల భూమికి సంబంధించి వెబ్ల్యాండ్లో అక్రమంగా నమోదు చేయలేదన్నారు. 2014లోనే వెబ్ల్యాండ్లో నమోదు కావడంతో సదరు వ్యక్తి థర్డ్ పార్టీకి విక్రయించారన్నారు. ఇరువురికీ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు. అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతే మ్యుటేషన్ చేయడం జరుగుతోందని, వీటిలో అవినీతి జరగడం లేదన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో బ్రోకర్ల హవా ఎక్కువగా ఉందన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. కార్యాలయంతో సంబంధం లేని వ్యక్తులు, వీఆర్వోలు, సిబ్బంది కాని వారి వద్దకు పనుల కోసం రైతులు వెళ్లరాదన్నారు. దళారుల ద్వారా పనుల కోసం వస్తే చేసే ప్రసక్తి లేదన్నారు. మ్యుటేషన్లు, ఎఫ్లైన్ పిటీసన్ల కోసం, వివిధ ధ్రువపత్రాల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పెండింగ్ లేకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లంచం వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బ్రోకర్ల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెడతామని అవసరమైతే పోలీసు కేసులు పెట్టడానికై నా వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. తమ పేరు చెప్పి బ్రోకర్లు రైతుల నుంచి లబ్దిదారుల నుంచి లంచం వసూలు చేస్తే తమకు సంబంధం లేదన్నారు. అలా ఎవరైనా డిమాండ్ చేస్తే నేరుగా ఆధారాలతో సహా తన దృష్టికి తీసుకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
లక్ష్యానికి మించి ఉపాధి కల్పన
తుమ్మపాల: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 120 లక్షల పని దినాల లక్ష్యాన్ని అధిగమించి 124.67 లక్షల పని దినాలను వేతనదారులకు కల్పించడం ద్వారా రాష్ట్రంలో 6వ స్థానంలో జిల్లా నిలిచిందని కలెక్టరు విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపడుతున్న సర్వేలు, ఎస్.డబ్ల్యూపిసి.షెడ్లు, హౌసింగ్, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ, చలివేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు లక్ష్యానికి మించి పని దినాలు కల్పించడం ద్వారా రూ.350 కోట్లు వేతనాల రూపంలో లబ్ధి పొందారని, కూలీలకు సగటు రోజువారీ వేతనంగా రూ.281 చెల్లించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచామన్నారు. మెరుగైన పనితీరుతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 127 లక్షల పని దినాల లక్ష్యం అధిగమించి మొదటి స్థానంలో నిలిచేందుకు అఽధికారులు కృషి చేయాలన్నారు. 2024–25లో రూ.516.65 కోట్లు వ్యయం చేయగా దానిలో వేతనం ఖర్చు రూ.350.29 కోట్లు, మెటీరియల్ ఖర్చు రూ.154.79 కోట్లు, అడ్మినిస్ట్రేషను ఖర్చు రూ.11.57 కోట్లుగా ఉందన్నారు. ఉపాధి పథకంలో 1,648 రైతులకు చెందిన 1,830 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టడం ద్వారా లబ్ధి పొందారని, 120 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కొబ్బరి మొక్కలు నాటడం జరిగిందన్నారు. పల్లెపండగ కార్యక్రమంలో 745 గోకులం షెడ్లు, రూ.181.22 కోట్లతో 229.09 కిలోమీటర్ల సీసీ, బీటీి రోడ్ల నిర్మాణం, రూ.24.95 కోట్లతో 308 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం, రూ.1.67 కోట్లతో 89 నర్సరీలు, రూ.13 కోట్లతో 44 పట్టు పరిశ్రమ పనులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రోడ్డు సదుపాయాలు లేని 17 గిరిజన ఆవాసాలకు రూ.21.89 కోట్లతో 22.18 కిలోమీటర్ల రోడ్డును మంజూరు చేయడం జరిగిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 127 లక్షల పని దినాలు, పశువులకు నీటి తొట్టెలు 215, పంట సంజీవని 7,200, పంట కాలువల పునరుద్ధరణ 451.50 కిలోమీటర్లు, చెరువుల సమగ్ర అభివృద్ధి 977 పనులను మంజూరు చేసి, పనులన్నింటిని ఈ నెల 1 నుంచి ప్రారంభించామన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు జిల్లాలో మంచినీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక చలివేంద్రం, ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల అదనంగా ఏర్పాటుచేయాలన్నారు. బోర్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. హౌసింగ్కు అదనపు సహాయం లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. జూన్ నాటికి 7,200 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సోలార్ యూనిట్లు మోడల్ గ్రామాలుగా గుర్తించిన కశింకోట మండలం బయ్యవరం, సబ్బవరం మండలం గుల్లేపల్లి, మునగపాక మండలం తోటాడ, ఎస్.రాయవరం మండలం గుడివాడ, గొలుగొండ మండలం గొలుగొండ గ్రామాలలో పీఎం సూర్యఘర్ పథకం అమలు పురోగతిని సమీక్షించారు. సోలారు యూనిట్ ఏర్పాటుకు ఉచిత దరఖాస్తుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి ఇంటికీ 1 కె.వి. సోలారు యూనిట్ ఏర్పాటు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, లీడ్ బ్యాంకు మేనేజరు కె.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ శచీదేవి, మండల అభివృద్ధి అధికారులు, మోడల్ గ్రామాల సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది హాజరయ్యారు. 124.67 లక్షల పనిదినాలు పూర్తి కలెక్టర్ విజయ కృష్ణన్ -
కుమారుడి మృతితో తల్లి ఆత్మహత్య
నర్సీపట్నం: కుమారుడు మృతితో మానసిక క్షోభకు గురైన తల్లి ఆత్మహత్య చేసుకుందని పట్టణ సీఐ జి.గోవిందరావు తెలిపారు. పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన కోన గౌరి(50) చిన్న కుమారుడు 15 రోజుల క్రితం ఆకస్మికంగా మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లి గౌరి మానసిక క్షోభకు గురై తీవ్ర మనస్థాపంతో ఈ నెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయింది. గురువారం ఉద యం బలిఘట్టం ఉత్తరవాహిని నది లో ఆమె శవమై కనిపించింది. ఈ ఘటనపై మృతురాలు పెద్ద కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.