మాణిక్యాలరావు దంపతులను సత్కరిస్తున్న డీఈ, ఇతర సిబ్బంది
మాకవరపాలెం : జాతీయ అవార్డు అందుకున్న విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ బొంతు మాణిక్యాలరావును ఘనంగా సత్కరించారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్లో రెండున్నరేళ్లుగా లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మాణిక్యాలరావు జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 4న ఢిల్లీలో కేంద్ర విద్యుత్శాఖ మంత్రి చేతుల మీదుగా మాణిక్యాలరావు అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి డివిజన్ పరిధిలోని విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది సబ్ స్టేషన్ వద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు దంపతులను నర్సీపట్నం డీఈ రామకృష్ణ, ఏడి త్రినాథరావు, స్థానిక ఏఈ బాలకృష్ణ, ఇతర సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిద మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.