నర్సీపట్నం : ఏటీఎం కార్డుల చోరీ నిందితుడుని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న నర్సీపట్నం మున్సిపాలిటీ కృష్ణాబజార్ ఏటీఎం వద్ద షేక్ రుక్సానా డబ్బులు డ్రా చేస్తుండగా, ఆమెను మాటల్లో దించి తన ఒరిజినల్ ఏటీఎం కార్డు కాజేసి, ఆమెకు నకిలీ కార్డు ఇచ్చాడు. ఆమె ఖాతా నుంచి రూ.30 వేలు నగదు డ్రా చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఏటీఎం కార్డుల చోరీ నిందితుడిని పట్టుకునేందుకు సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.ఎస్. రామకృష్ణ, గొలుగొండ హెడ్ కానిస్టేబుల్ ఎం.రాజు, కానిస్టేబుల్ నానితో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం ఐదు రోజులు శ్రమించి నిందితుడు రాజమండ్రి వద్ద ధవళేశ్వరానికి చెందిన ఇల్ల వెంకటసాయి కిరణ్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అతడి వద్ద నుంచి 30 ఏటీఎం కార్డులు, రూ.28 వేలు నగదు రికవరీ చేశామన్నారు. నిందితుడిపై రాజానగరం పోలీసుస్టేషన్లో హత్య కేసు 2016లో నమోదైందన్నారు. 2019 నుంచి నిందితుడిపై రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి, హైదరాబాద్ ప్రాంతాల్లో 14 వరకు చోరీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుడు జల్సాలకు అలవాటు పడి ఏటీఎం కార్డుల దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. నిందితుడుని పట్టుకున్న బృందాన్ని అభినందించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ చైతన్య, టౌన్ సీఐ గోవిందరావు, ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
ఏటీఎం కార్డుల చోరీ నిందితుడు అరెస్టు
Mar 28 2025 1:25 AM | Updated on Mar 28 2025 1:23 AM
Advertisement
Related News By Category
-
విద్యుత్ అధికారులూ ఇదేం తీరు...?
నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి విద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా భూమి మధ్యలోంచి విద్యుత్ స్తంభాలు వేసి ఇల్లు కట్టుకోకుండా చేసారని, తక్షణమే త...
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోటవురట్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి. రాట్నాలపాలేనికి చెందిన కాలాబత్తుల రాజ్కుమార్(56) ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులోని ఓ హోటల్లో చెఫ్గా పనిచేస్తున...
-
క్రైస్తవ వివాహాల లైసెన్స్ జారీ కర్తగా వెంకటరమణ
దేవరాపల్లి: క్రైస్తవ వివాహాల నిర్వహణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు లైసెన్స్ కర్తలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా నుంచి దేవరాపల్లిలోని దైవ స్వరూపి చ...
-
పీజీఆర్ఎస్ అర్జీలకు పరిష్కారమేదీ..!
256 దరఖాస్తుల స్వీకరణ సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, పీజీఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమామణి, జిల్ల...
-
ట్రాలీ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● బయ్యవరం వద్ద ప్రమాదం ● బస్సు డ్రైవర్తో సహా 8 మందికి గాయాలు కశింకోట: మండలంలో బయ్యవరం వద్ద సోమవారం ఆర్టీసీ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో డ్రైవర్ సహా 8 మంది గాయపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడ...
Related News By Tags
-
విద్యుత్ అధికారులూ ఇదేం తీరు...?
నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి విద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా భూమి మధ్యలోంచి విద్యుత్ స్తంభాలు వేసి ఇల్లు కట్టుకోకుండా చేసారని, తక్షణమే త...
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోటవురట్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి. రాట్నాలపాలేనికి చెందిన కాలాబత్తుల రాజ్కుమార్(56) ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులోని ఓ హోటల్లో చెఫ్గా పనిచేస్తున...
-
క్రైస్తవ వివాహాల లైసెన్స్ జారీ కర్తగా వెంకటరమణ
దేవరాపల్లి: క్రైస్తవ వివాహాల నిర్వహణ, వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు లైసెన్స్ కర్తలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా నుంచి దేవరాపల్లిలోని దైవ స్వరూపి చ...
-
పీజీఆర్ఎస్ అర్జీలకు పరిష్కారమేదీ..!
256 దరఖాస్తుల స్వీకరణ సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, పీజీఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమామణి, జిల్ల...
-
ట్రాలీ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● బయ్యవరం వద్ద ప్రమాదం ● బస్సు డ్రైవర్తో సహా 8 మందికి గాయాలు కశింకోట: మండలంలో బయ్యవరం వద్ద సోమవారం ఆర్టీసీ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో డ్రైవర్ సహా 8 మంది గాయపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడ...
Advertisement