
కార్పొరేషన్ల ఇంటర్వ్యూలకు 585 దరఖాస్తులు
రావికమతం : వివిధ కార్పొరేషన్ల ద్వారా రాయితీపై రుణాలు మంజూరుకు శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలు వెలవెల పోయాయి. బీసి కార్పారేషన్ ద్వారా 33 మంది వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు,కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు వివిధ కార్పొరేషన్ల్ ద్వారా రాయితీపై రుణాలకు మండలానికి 31 కోట్ల 8 లక్షల రూపాయల సబ్బిడీ ప్రభుత్వం కేటాయించింది. రాయితీపై రుణాలు పొందేందుకు 585 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకన్నబాబు, బ్యాంక్ మేనేజర్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 70 మంది మాత్రమే ఇంటర్వ్యూకు హాజరయ్యారు.