
నవోదయకు ఎంపికై న విద్యార్థినికి అభినందనలు
చీడికాడ : నవోదయకు ఎంపికై సీటు సాధించిన బైలపూడికి చెందిన గొల్లవిల్లి దీక్షితాశ్రీని మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, యువజన వి భాగం అధ్యక్షుడు గొల్ల విల్లి స్వామినాయుడు, ఎంపీపీ కురచా జయమ్మ, జెడ్పీటీసీ లాలం శారదాజానకీరాంలు అభినందించారు. గ్రామానికి చెందిన గొల్లవిల్లి రామకృష్ణ, రమణ దంపతులు కుమార్తె అయిన దీక్షితాశ్రీ వడ్డాదిలో ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ నవోదయ పరీక్ష రాసిందన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరచడంతో ఆమెకు మొదటి జాబితాలో సీటు సాధించిందని తల్లిదండ్రులు చెప్పారు. ఈ మేరకు దీక్షితాశ్రీని వారు అభినందించారు.