
దివ్యాంగులతో ‘యూఎస్ నేవీ’ ముచ్చట్లు
సీతంపేట: ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా అక్కయ్యపాలెంలోని ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీలోని దివ్యాంగులతో బుధవారం 25 మంది యూఎస్ నేవీ అధికారులు కాసేపు ముచ్చటించారు. దివ్యాంగ పిల్లలతో కలిసి అలంకరణ వస్తువులు, కుందన్ గాజులు, వేలాడదీసే వస్తువులు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వంటి తయారీలో పాలుపంచుకున్నారు. కాన్సులేట్ జనరల్ సెంథిల్ కుమార్ సహకారంతో సొసైటీ అధ్యక్షురాలు సుచిత్ర దివ్యాంగ పిల్లలకు నేవీ అధికారులను కలిసే అవకాశం కల్పించారు. పిల్లలను వారికి పరిచ యం చేసి, వారిలోని నైపుణ్యాలను, వారి విజయాలను అధికారులకు వివరించారు. సొసైటీ సేవలను నేవీ అధికారులు కొనియాడారు.