గార్లదిన్నె: మండలంలోని కల్లూరులో బుడగజంగాల కాలనీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... ఈ నెల 11న కల్లూరు ఊరి దేవర నిర్వహించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త విభూది జమ్మన్న ఇంటికి టీడీపీ నాయకులు ఫ్లెక్సీ కట్టారు. ఆ సమయంలో పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఊరి దేవర కార్యక్రమం కావడంతో తన ఇంటికి కట్టిన ప్లెక్సీ తొలగించాలని సూచించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. కులపెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పాడంతో అప్పటికి సమస్య సద్దుమణిగింది. ఈ అంశంపై ప్రతిష్టకు పోయిన టీడీపీ నేతలు రెండు రోజులు తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వైఎస్సార్సీపీకి చెందిన ఆంజనేయులు, రామాంజనేయులు, చిన్నకుళ్లాయప్ప, జమ్మన్న, రాజుపై అక్రమంగా కేసు బనాయించారు. దీంతో గురువారం జిల్లా కోర్టులో వాయిదా చూసుకుని గార్లదిన్నె పీఎస్కు చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషాను కలసి మాట్లాడారు. అనంతరం ఇంటికి వెళుతుండగా కల్లూరు రైల్వే అండర్పాస్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే టీడీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. అనంతరం కాలనీకి చేరుకుని ఇంటి వద్ద ఉన్న రామాంజనేయులు, వెంకటలక్ష్మి, శిరీషపై దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గార్లదిన్నె పోలీసులు సర్వజనాస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.
Breadcrumb
- HOME
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
Mar 28 2025 1:31 AM | Updated on Mar 28 2025 1:29 AM
Advertisement
Related News By Category
-
నువ్వు సీఐ అయితే భయపడాలా?
అనంతపురం ఎడ్యుకేషన్: రోడ్డుకు అడ్డంగా నిలిపిన కారును పక్కకు తీయాలని సూచించిన అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్పై కారు యజమాని దౌర్జన్యానికి దిగాడు. ‘నువ్వు సీఐ అయితే నేను భయపడాలా?’ అంటూ రెచ్చిపో...
-
ఇదేం పద్ధతి మాస్టార్లూ..
● కార్పొరేషన్ స్కూళ్ల టీచర్ల లీలలు ● అనుకూలమైన పాఠశాలల కోసం అడ్డదారులు తొక్కడంపై విమర్శలు అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేషన్ పాఠశాలల్లో పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన స్కూళ్ల కోసం ...
-
మావాళ్లొస్తారు.. మీరెళ్లిపోండి!
కళ్యాణదుర్గం: ‘మా వాళ్లు చాలా మంది ఉన్నారు... మీరెళ్లిపోండి... వారు విధుల్లోకి వస్తారు’ అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఎట్రియా బ్లైత్ విండ్ పార్క్ సెక్యూరిటీ సిబ్బందిపై...
-
దళితులకు రక్షణ కల్పించలేరా?
అనంతపురం అర్బన్: దళిత, గిరిజన మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విద్యార్థి, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు ధ్వజమెత్తారు. అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధిం...
-
కూటమి నేతల బాహాబాహీ
సాక్షి టాస్క్ఫోర్స్: చెన్నేకొత్తపల్లిలోని ఓ ధాబాలో కూటమి నేతలు బాహాబాహీకి దిగారు. ఓ వర్గం నాయకుడు కత్తితో దాడి చేయగా...మరోవర్గం వారు రాళ్లదాడితో రణరంగం సృష్టించారు. ఈ ఘటన బుధవారం స్థానికంగా తీవ్ర ఉద...
Related News By Tags
-
ఇదేం పద్ధతి మాస్టార్లూ..
● కార్పొరేషన్ స్కూళ్ల టీచర్ల లీలలు ● అనుకూలమైన పాఠశాలల కోసం అడ్డదారులు తొక్కడంపై విమర్శలు అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేషన్ పాఠశాలల్లో పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన స్కూళ్ల కోసం ...
-
మావాళ్లొస్తారు.. మీరెళ్లిపోండి!
కళ్యాణదుర్గం: ‘మా వాళ్లు చాలా మంది ఉన్నారు... మీరెళ్లిపోండి... వారు విధుల్లోకి వస్తారు’ అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఎట్రియా బ్లైత్ విండ్ పార్క్ సెక్యూరిటీ సిబ్బందిపై...
-
దళితులకు రక్షణ కల్పించలేరా?
అనంతపురం అర్బన్: దళిత, గిరిజన మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విద్యార్థి, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు ధ్వజమెత్తారు. అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధిం...
-
కూటమి నేతల బాహాబాహీ
సాక్షి టాస్క్ఫోర్స్: చెన్నేకొత్తపల్లిలోని ఓ ధాబాలో కూటమి నేతలు బాహాబాహీకి దిగారు. ఓ వర్గం నాయకుడు కత్తితో దాడి చేయగా...మరోవర్గం వారు రాళ్లదాడితో రణరంగం సృష్టించారు. ఈ ఘటన బుధవారం స్థానికంగా తీవ్ర ఉద...
-
‘యోగాంధ్ర’కు 280 బస్సులు
అనంతపురం క్రైం: కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర–2025 కార్యక్రమానికి అనంతపురం ఆర్టీసీ రీజియన్ నుంచి 280 బస్సులు వెళ్లనున్నాయి. జిల్లాలో ఆయా బస్సు రూట్లను 20వ తేదీ రాత్రి నుంచి రద్...
Advertisement