గుంతకల్లు: స్థానిక మద్దికెర రైలు మార్గంలోని పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. రన్నింగ్ రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందకు పడి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.
మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడికి దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని, ఛామని చాయ రంగు, తెల్లరంగు నీలం పూల చొక్కా, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించాడని వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 98661 44416కు సమాచారం అందించాలని కోరారు.