
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 909 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ ప్రభావంతో 13 మంది మృతి చెందారు. తాజాగా 1,543 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,63,728మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,218 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం 13,660మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,57,08,411 టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.