health bulletin
-
సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్
-
శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు నగర కమిషనర్ సీవీ ఆనంద్. అనంతరం బాలుడి ఆరోగ్య వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. శ్రీతేజ్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన రెండు వారాల నుంచి శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సీపీ సీవీ ఆనంద్,హెల్త్ సెక్రటరీ క్రిస్టినాలు కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం, సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ప్రభుత్వం తరఫున శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం. తొక్కిసలాటలో శ్రీ తేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ట్రీట్మెంట్ మరింత కాలం పట్టే అవకాశం ఉంది. త్వరలోనే బాలుడి ఆరోగ్యంపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు’ అని వెల్లడించారు. ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాటహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా పెద్దఎత్తున లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త, పిల్లలతోపాటు థియేటర్కు వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించగా మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన ఏ ఐజీ హాస్పిటల్
-
నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు.. ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లంగ్స్లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసుత్తం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఆరోగ్యం కుదట పడితే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని.. వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా కీలకమని వైద్యులు పేర్కొన్నారు. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. -
TS: కొత్త వేరియంట్ కలకలం.. జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తెలంగాణలో కొత్తగా మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. తెలంగాణలో ఈరోజు కొత్తగా ఆరు కేసులు నమోదు కాగా, వైరస్ నుంచి ఒకరు కోలుకున్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 20 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో 19 మందికి చికిత్స జరుగుతోంది. ఇక, నేడు హైదరాబాద్లో నాలుగు, మెదక్లో ఒకటి, రంగారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఈరోజు 925 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇంకా 54 మందికి సంబంధించి కోవిడ్ టెస్టు రిజల్ట్ రావాల్సి ఉందని అధికారులు బులిటెన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో, ఎంజీఎం అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని తెలిపారు. -
మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ సక్సెస్
-
కేసీఆర్కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరం: వైద్యులు
-
హీరో విజయ్కాంత్ హెల్త్ బులెటిన్.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఈ మధ్య అనారోగ్యానికి గురైన తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్.. అనారోగ్యం వల్ల ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) 'విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయినప్పటికీ గత 24 గంటల్లో ఆయన పరిస్థితి స్థిరంగా లేనందున.. ఆయనకు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది' అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో విజయకాంత్ను.. ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లని తొలగించారు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) -
నటుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల
డీఎండీకే అధినేత, సీనియర్ నటుడు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని మళ్లీ వార్తలు తెరపైకి వచ్చాయి. చెన్నై మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజులపాటు చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే నేతలు అప్పట్లో వివరించారు. సుమారు 10 రోజుల నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై వారు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారని.. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని ఇలాంటి పరిస్థితిల్లో ఆయనపై వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని వారు తెలిపారు. కానీ ఆయనకు ఇప్పటికీ కూడా ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తుండటంతో అభిమానుల్లో అనుమానం పెరిగిపోయింది. వైద్యులు ఏమైనా దాస్తున్నారా..? అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితిలో, ఈ రోజు (29-11-2023), DMDK అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మయత్ హాస్పిటల్ వైద్యులు నివేదికను విడుదల చేశారు. అందులో విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారని కానీ గత 24 గంటల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, అతనికి పల్మనరీ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని అందులో తెలిపారు. వైద్యుల సూచన ప్రకారం అతనికి ఇంకా 14 రోజులు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం ఉందని తెలిపారు. -
చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యకు జైల్లో చికిత్స
-
D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(74) హెల్త్ బులిటెన్ విడుదల అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నాం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొన్నాయి. శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం మధ్యాహ్నాం నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆయన్ని చేర్పించారు. అప్పటి నుంచే ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించినట్లు తెలుస్తోంది. ‘‘ఆయన శ్వాస తీస్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ICU లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వయసు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయి. ఆస్తమా, కిడ్నీల సమస్య, బీపీ పడిపోవడం లాంటి సమస్యలున్నాయి. 48 గంటలు గడిస్తే కానీ హెల్త్ కండిషన్ చెప్పలేం. :::సిటీ న్యూరో వైద్యుడు ప్రవీణ్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డి. శ్రీనివాసే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. డీఎస్ ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయన కొడుకులు ఇద్దరూ రాజకీయాల్లో ఉండగా.. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. అనారోగ్యం కారణంగా డీఎస్ కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. -
ఎంపీ అవినాష్రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, కర్నూలు: ఎంపీ అవినాష్రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ను విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు సీసీయూలో చికిత్స కొనసాగుతుందన్నారు. అల్ట్రా స్కాన్లో పరీక్షలో పురోగతి కనిపించింది. లక్ష్మమ్మను సాధారణ రూమ్కు షిఫ్ట్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. కాగా, పులివెందుల భాకరాపురంలోని తమ నివాసంలో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ ఛాతీలో నొప్పి రావడంతో సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికంగా ఉన్న దినేశ్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ప్రత్యేక అంబులెన్స్లో బయలుదేరగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్ నిపుణుడు హితేశ్రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రవికళాధర్రెడ్డి పర్యవేక్షణలో లక్ష్మమ్మకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చదవండి: ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు? -
అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి
సాక్షి, కర్నూలు: దర్యాప్తునకు హాజరు కావాలంటూ సిబిఐ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. "మా అమ్మ లక్ష్మి (67 ఏళ్లు) తీవ్ర అస్వస్థతకు గురయి, ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. బ్లడ్ ప్రెషర్తో పాటు హైపర్ టెన్షన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మా నాన్నా భాస్కరరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం మీకు తెలిసిందే. మా తల్లితండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఒక్కగానొక్క కొడుకయినా నాపై ఉంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అమ్మకు తోడుగా ఉండి ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు కానీ, నిస్సత్తువతో పాటు మగతలో ఉంటున్నారు. ఇప్పటికే ఒకసారి గుండె పోటు వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అమ్మ లక్ష్మికి డాక్టర్లు యాంజియోగ్రామ్ టెస్టు చేయగా.. గుండెలో రెండో చోట్ల బ్లాక్లు ఉన్నాయని తేలింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆమెను మరిన్ని రోజులు ICUలోనే ఉంచి చికిత్స అందించాలని డాక్టర్లు సూచించారు. పై పరిస్థితుల దృష్ట్యా నాకు 7 రోజుల గడువు కావాలని కోరుతున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడగానే మీ ముందు విచారణకు హాజరు కాగలనని అవినాష్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన లిఖిత పూర్వక జవాబులో పేర్కొన్నారు. ఇటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. సుప్రీం కోర్టులో తన పిటిషన్ పై రేపు విచారణ ఉందని సిబిఐకి తెలిపారు అవినాష్ రెడ్డి. తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. మరో వైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఉదయం హెల్త్బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. లక్ష్మమ్మ కార్డియో సమస్యతో బాధపడుతున్నారు. బీపీ తక్కువగా ఉండి.. ఏం తినలేకపోతున్నారు. వాంతులు అవుతున్నాయి. మెదడుకు, పొట్టకు అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉంది. ఆమె ఇంకా వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది. ఇంకా కొన్నిరోజులు ఆస్పత్రిలోనే ఉండాలి. లో బీపీ కారణంగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాలి అని వైద్యులు ప్రకటించారు. -
ఆందోళనకరంగానే అవినాష్రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి
సాక్షి, కర్నూల్: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ను శనివారం సాయంత్రం విడుదల చేశారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చికిత్స అందిస్తున్న వైద్య బృందంలోని డాక్టర్ హితేష్రెడ్డి ప్రకటించారు. ‘‘యాంజియోగ్రామ్ చేస్తే రెండు వాల్స్ బ్లాక్ అయినట్లు తేలింది. లక్ష్మమ్మకు చికిత్స చాలా అవసరం. ఆమెకు బీపీ తక్కువగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం’’ అని డాక్టర్ హితేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పులివెందులలోని నివాసంలో శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మి అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ప్రత్యేక ఆంబులెన్స్ను ఆమెను హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో ఆమె పరిస్థితి విషమించడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. -
అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల
కర్నూలు: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆమె హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి రావడంతో లక్ష్మమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె కార్డియో సమస్యతో బాధపడుతున్నారని డా. రితేష్ బులెటిన్లో పేర్కొన్నారు. యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉందని, లక్ష్మమ్మకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్ రితేష్ స్పష్టం చేశారు. -
ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం : నిమ్స్ వైద్యులు
-
డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం అత్యంగా విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాంగింగ్ వేధింపులు భరించలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికీ ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ చికిత్స అందుతోందని బులిటెన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. మల్టి డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందుతోందని నిమ్స్ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు ప్రీతి బీపీ కూడా మెయింటేన్ అవ్వటం లేదని, కిడ్నీ పనితీరు సరిగ్గా లేదని కిందటి హెల్త్ బులెటిన్లో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జరిగింది ఇదే.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. ఆ వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్పై వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రీతిని వేధించిన సైఫ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కానీ సీనియర్ విద్యార్థులు సైఫ్ను అరెస్టు చేయొద్దని ధర్నాకు దిగారు. -
ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం
లక్డీకాపూల్ (హైదరాబాద్)/సాక్షి, వరంగల్: పీజీ వైద్యవిద్యార్థిని ️ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం యాజమాన్యం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్ట్తో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్లు నిమ్స్కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతోందని తెలిపారు.ప్రీతి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ: మంత్రి హరీశ్రావు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. నిష్పాక్షికంగా పూర్తి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై మంత్రి సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని ఆరా తీశారు. డాక్టర్ ప్రీతికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సైఫ్ విషయంలో ఏం చేద్దాం?: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టయిన సీనియర్ విద్యార్థి సైఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ర్యాగింగ్, వేధింపుల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన సైఫ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాళోజీ హెల్త్వర్సిటీకి.. కేఎంసీ ప్రిన్సిపల్ మోహనదాస్ శనివారం లేఖ రాశారు. సోమవారంలోగా నిర్ణయం రావొచ్చని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సైఫ్పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కేఎంసీలో సోమవారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశమై నివేదికను రూపొందించి పంపుతుందన్నారు. ప్రీతి కేసులో సైఫ్పై ఆరోపణలు రుజువైతే అతడి పీజీ అడ్మిషన్ను రద్దు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఒకవేళ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సైఫ్ వ్యవహార శైలి ఉందని రుజువైతే ఎంబీబీఎస్ పట్టా కూడా రద్దు కావచ్చంటున్నారు. ఏమైనా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి చర్యలుంటాయని మోహన్దాస్ తెలిపారు. ‘సర్’పై సర్వత్రా చర్చ: కేఎంసీ కాలేజీలో సీనియర్లను.. జూనియర్లు ‘సర్’అని పిలుస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సి ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇలా పిలిపించుకోవడం ర్యాగింగ్ కిందికే వస్తుందని వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభిప్రాయపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’అనే పదం చాలా గ్యాప్ తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. -
అత్యంత విషమంగా మెడికో ప్రీతి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగవుతుందని, నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని బులిటెన్లో పేర్కొన్నారు. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఫోన్ చాటింగ్తోపాటు పలు కీలక ఆధారాలు సేకరించారు. సైఫ్పై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్ కేసులు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. జనవరి 22న పాయిజన్ ఇంజిక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్తితిలోకి వెళ్లి యువతి ఒక్కసారిగా కుప్పకూలంతో సహచర విద్యార్థులు, డాక్టర్లు ఆమెను వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రీతి ప్రాణాల కోసం పోరాడుతోంది. ప్రీతిని కాపాడేందుకు నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాలేజీలో సీనియర్ వేధింపులతోక ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్పై కాలేజీ యజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువతి అంటూ అవమానపరుస్తూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.సైఫ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
తారకరత్న తాజా హెల్త్ బులెటిన్.. వైద్యులు ఏమన్నారంటే?
సినీనటుడు నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు బులెటిన్లో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బులెటిన్లో వైద్యులు వెల్లడించారు. కొన్ని మీడియాల్లో ఆయనకు ఎక్మోపై చికిత్స అందించినట్లు వచ్చిన కథనాలపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు ఎక్మోపై ఎలాంటి చికిత్స అందించలేదని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరాలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
తారకరత్నకు మెలెనా? ఈ వ్యాధి గురించి తెలుసా..
సాక్షి, బెంగళూరు: తీవ్ర గుండెపోటుతో నారాయణ హృదయాల ఆసుపత్రిలో చేరి ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో ఆప్డేట్ అందింది. అరుదైన వ్యాధి అయిన మెలెనాతో తారకరత్న బాధపడుతున్నారని అక్కడి వైద్య బృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర (GI) మార్గంతో పాటు నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం బ్లీడింగ్ సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో.. ఎగువ జీర్ణాశయాంతరం దిగువ భాగంలో ఉండే.. పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరగవచ్చు. కారణాలు.. ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్త నాణాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్తసంబంధిత జబ్బుల వల్ల మెలెనా సంభవిస్తుంది. మెలెనా లక్షణాలు.. మెలెనా వల్ల మలం నల్లగా, బంక మాదిరి స్థితిలో బయటకు వస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. హెమటోచెజియా స్థితికి.. మెలెనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. అనీమియాతో పాటు బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. రక్తం తక్కువగా పోయే స్థితిలో.. చిన్నపేగులో రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సలు పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్తో పాటు ఎండోస్కోపీ థెరపీలు, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలు, రక్త మార్పిడి లాంటి చికిత్సలు అందిస్తారు. అయితే.. మెలెనా వల్ల కొన్నిసార్లు విపరీతమైన రక్తస్రావ స్థితి నెలకొంటుంది. ముక్కు, చెవులతో సహా అనేక చోట్ల నుండి రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్త నాళాలలో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం కారణంగానే.. గుండెకు వైద్యం అందించడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందువల్ల కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. మెలెనా.. రక్తపోటు కూడా నేపథ్యాన్ని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ యొక్క అప్లికేషన్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం తారకరత్న విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టతరంగా మారడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని, అయినప్పటికీ నైపుణ్యం కలిగిన వైద్య బృందంచే అధునాతన చికిత్స అందిస్తోందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, బెంగళూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా తారకరత్న హెల్త్ కండీషన్పై శనివారం మధ్యాహ్నం హృదయాలయ డాక్టర్లు బుటిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా, టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్బంగా తారకతర్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దీంతో, తారకరత్నను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, నారాయణ హృదయాలయ డాక్టర్లు కుప్పం వెళ్లారు. వైద్య చికిత్సల అనంతరం.. శనివారం బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే సరికే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి తారకరత్నను బెంగళూరు ఆసుపత్రికి తీసుకువచ్చాము. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నాము. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బెంగళూరులోనే ఉండి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. -
కృష్ణ హెల్త్ కండీషన్ పై వైద్యుల ప్రెస్ మీట్
-
విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల..
Chiyaan Vikram Health Bulletin Released: స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆసుపత్రి పాలయ్యారు. శుక్రవారం (జులై 8) మధ్యాహ్నం విక్రమ్ అస్వస్థతకు గురికాడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి కారణంగానే విక్రమ్ ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. నిపుణలైన వైద్యులతో చికిత్స అందించినట్లు ఆస్పత్రి యాజామాన్యం పేర్కొంది. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రోజంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, శనివారం ఉదయం డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే విక్రమ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విక్రమ్ తనయుడు ధృవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. దీనికి సంబంధించిన పోస్ట్ను ఇన్స్టాలో షేర్ చేశాడు. విక్రమ్కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. ఈ పోస్ట్లో 'ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులరా, నాన్నకు ఛాతీలో కొద్దిపాటి నొప్పికారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రాలేదు. ఈ పుకార్లు విని మేము చాలా బాధపడ్డాం. ఈ సమయంలో మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. మా చియాన్ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు' అని పేర్కొన్నాడు. మరోవైపు విక్రమ్ ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా నేడు (జులై 8) సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన 'పొన్నియిన్ సెల్వన్' టీజర్ లాంచ్కి విక్రమ్ హాజరు కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు విక్రమ్ కోబ్రా సినిమాలో కూడా నటిస్తున్నాడు. -
Corona Updates: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల చూస్తుంటే ఫోర్త్వేవ్ మొదలైందా అనే సంకేతాలకు ఊతమిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18,930 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,66,739కు పెరిగింది. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 35 మంది మరణించారు. ఇప్పటి వరకు 5,24,305 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 14,650 మంది కోలుకోగా మొత్తం మహమ్మారి నుంచి 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 1,19,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.52శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు 4,29,21,977 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇక ఇప్పటి వరకు 198 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. చదవండి: హైదరాబాద్లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా #COVID19 | India reports 18,930 fresh cases, 14,650 recoveries, and 35 deaths in the last 24 hours. Active cases 1,19,457 Daily positivity rate 4.32% pic.twitter.com/cAqSEIWR0L — ANI (@ANI) July 7, 2022 -
Covid: భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,899 మంది కోవిడ్ బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే వైరస్తో 15 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 72,474. యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్పై ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,855కు చేరుకుంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 7.71 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,99, 363కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 14,88,807 మందికి కరోనా వ్యాక్సిన్లను అందించినట్టు కేంద్రం తెలిపింది. చదవండి: Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్ -
భారీగా పెరిగిన కరోనా కేసులు.. నిన్నటితో పోలిస్తే 38% అధికం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసులు అమాంతం పెగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్ బారినపడ్డారు. నిన్నటితో పోలిస్తే 38% ఎక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తరువాత ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం దేశంలో నాలుగో వేవ్ ప్రారంభమైందా అనే అనుమానాలు రేకేత్తిస్తోంది. పెరిగిన యాక్టివ్ కేసులు భారత్లో ఇప్పటి వరకు 4,32,57,730 మంది కరోనా బారినపడ్డారు. బుధవారం 11 మంది కోవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 5,24,803కు పెరిగింది. నిన్న ఒక్క రోజు 7,624 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4,26,74,712 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. యాక్టిక్ కేసుల సంఖ్య 58,215కు పెరిగింది. పాజిటివిటీ రేటు 2.35% శాతంగా ఉంది. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మహారాష్ట్ర టాప్ అత్యధికంగా మహారాష్ట్రలో 4,024, కేరళలో 3,488 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానాల్లో ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క ముంబైలోనే నిన్న రెండు వేలకు పైగా కేసులొచ్చాయి. అయిదు నెలల తర్వాత అక్కడ ఇన్ని కేసులు కావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజు 1.21 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటి వరకు 195 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. చదవండి: AP: నియంత్రణలోనే కరోనా.. పొరుగుతో పోలిస్తే తక్కువే -
ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా..చాపకింద నీలా మళ్లీ విస్తరిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది. దేశ విదేశాల రాకపోకలు పెరిగాయి. ప్రజలు మాస్క్, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి అంశాలను పూర్తిగా విస్మరించారు. పబ్బులు,క్ల ్లబ్బులు, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, విహార యాత్రల్లో మునిగితేలుతున్నారు. అడ్డూ అదుపు లేని ప్రయాణాలు, ఒకే చోట వేలాదిమంది గుమిగూడటం వంటి చర్యలతో వైరస్ మరోసారి వణికిస్తోంది. భారత్లో గడిచిన 24 గంటల్లో ఏడు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 7,584 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గడిచిన మూడు నెలల్లో ఇంత భారీగా కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో అత్యధికంగా 2,813 మంది కరోనా బారినపడ్డారు. గురువారం కోవిడ్తో 24 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కరోజే 3,791 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 36,267 ఉన్నాయి. చదవండి: ముంచుకొస్తుంది.. జాగ్రత్త పడదాం! ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్పై శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,747కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కి పెరిగింది. దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,44,092కి చేరింది. #COVID19 | India reports 7,584 fresh cases, 3,791 recoveries, and 24 deaths in the last 24 hours. Total active cases are 36,267 pic.twitter.com/kwQIIy8K3s — ANI (@ANI) June 10, 2022 -
కరోనా అప్డేట్స్.. నిన్నటితో పోలిస్తే 40 శాతం అధికంగా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి దాకా అదుపులోనే ఉందనుకున్న మహమ్మరి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో పాటిజివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. భారత్లో గడిచిన 24 గంటల్లో అయిదు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 5, 223 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇది నిన్నటితో పోలిస్తే కేసుల్లో 40 శాతం పెరుగుల కనిపించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,90,282కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్పై బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం కోవిడ్తో ఏడుగురు మృత్యువాతపడ్డారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,715కు చేరింది. అయితే అత్యధికంగా 84శాతం కేసులు అయిదు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో 1,881, కేరళలో 1,494, ఢిల్లీలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో 227 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 3,345 మంది కోలుకున్నారు, దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,26,36,710కి చేరింది. దేశంలో రికవరీ రేటు 98.72%గా ఉంది. యాక్టివ్ కేసులు 28,857 ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 1,94,43,26,416 డోసుల వ్యాక్సిన్లను కేంద్రం అందించింది. చదవండి: వెన్నులో వైరస్ల వణుకు.. ఒకటి పోతే మరొకటి! -
ఢిల్లీలో కలవరపెడుతున్న కరోనా.. పెరిగిన పాజిటివిటీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్లో కూడా కేసుల పెరుగుదల నమోదవుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. శనివారం కరోనా పాజిటివిటీ రేటు 4 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో మరణాల సంఖ్య సున్నా. మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,158గా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో భారత్లో 975 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అదే విధంగా 796 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. దేశంలో 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మరో 175 పెరగడం గమనార్హం. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే.. నిపుణులు అంచనా ప్రకారం మరో వేవ్ కూడా వస్తుందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. అయితే ఇప్పటివరకు దేశంలో సుమారు 180 కోట్ల డోసుల వాక్సిన్ను ప్రజలకు అందించినట్లు పేర్కొంది. -
దేశంలో 50 వేల లోపు కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Coronavirus Update: దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటలలో 44,877 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,17,591 కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,15,85,711 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 5,37,045 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. -
దేశంలో తగ్గుతున్న కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే?
Coronavirus Update: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటలలో 50,407 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,36,962 మంది వైరస్ బారినుంచి కోలుకోగా 804 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,981 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 6,10,443 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,72,29,47,688 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్నంటే?
Coronavirus Update: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటలలో 58,077 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,50,407 మంది వైరస్ బారినుంచి కోలుకోగా 657 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,177 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 6,97,802 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,71,79,51,432 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Coronavirus Update: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య బుధవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 67,084 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత24 గంటలలో 1,67,882 మంది వైరస్ బారినుంచి కోలుకోగా 1,241 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,06,520 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం7,90,789 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.4 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,71,28,19,947 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు.. ఎన్నంటే?
Coronavirus Update: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మంగళవారంతో పోల్చితే పెరిగాయి. గడిచిన 24 గంటలలో 71,365 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటలలో 1,72,211 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా 1,217 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,05,279 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 8,92,828 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 1,70,87,06,705 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
Corona Update:స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారంతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటలలో 1,72,433 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,59,107 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1008 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,98,983 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 15,33,921 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 167.87 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. India reports 1,72,433 fresh COVID cases (6.8% higher than yesterday), 2,59,107 recoveries, and 1008 deaths in the last 24 hours Active cases: 15,33,921 Death toll: 4,98,983 Daily positivity rate: 10.99% Total vaccination: 167.87 crore pic.twitter.com/ZgQtIloAzu — ANI (@ANI) February 3, 2022 -
కరోనా: తెలంగాణలో కొత్తగా 3,603 పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 3,603 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,707 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 32,094 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,34,815కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 6,98,649 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ కారణంగా 4,072 మంది బాధితులు మృతి చెందారు. చదవండి: మరణించాక రూ.కోట్ల భూమి కలిసొచ్చింది..! -
తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసులు 4 వేల మార్క్ను దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,207 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,825 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 26,633 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,22,403కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 6,91,703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ కారణంగా 4,067 మంది బాధితులు మృతి చెందారు. -
తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్ పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2983 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,206 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్-259,రంగారెడ్డి-227, హన్మకొండ-118, సంగారెడ్డి-96 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్తో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,14,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,88,105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 22,472 మంది కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,062కి చేరింది. -
విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా కేసులు ఎన్నంటే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో16.66 శాతానికి పాజిటివిటీ రేటు చేరింది. చదవండి: మరో రెండు కోవిడ్ ఔషధాలకు డబ్ల్యూహెచ్ ఆమోదం దేశంలో ప్రస్తుతం 14,17,820 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 1,22,684 మంది కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041 చేరింది. -
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే గురువారంతో పోలిస్తే 6.7శాతం కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయి. దేశంలో 14.78 శాతానికి పాజిటివిటీ రేటు చేరింది. చదవండి: చుట్టేస్తోంది.. జాగ్రత్త: ప్రధాని మోదీ దేశంలో ప్రస్తుతం 12,72,073యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 1,09,345 మంది కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753 చేరింది. -
కరోనా రక్కసి విజృంభిస్తోంది.. కొత్తగా 2,47,417 కేసులు
-
భారత్లో థర్డ్వేవ్ ముప్పు.. వణుకు పుట్టిస్తున్న కోవిడ్ కేసులు, ఒక్కరోజే...
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే బుధవారంతో పోలిస్తే 27 శాతం కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయి. దేశంలో 13.11 శాతానికి పాజిటివిటీ రేటు చేరింది. చదవండి: రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వచేయండి దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 84,825 మంది కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో వెయ్యికిపైగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులు రికార్డుస్థాయలో పెరగడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
తెలంగాణలో భారీగా కోవిడ్ కేసులు.. ఒక్క హైదరాబాద్లోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 73,156 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: Sankranti: ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త.. ఈ విషయం మరిచారో అంతే..! గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందగా, దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,041కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1583 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 292, రంగారెడ్డి జిల్లాల్లో 214 కేసులు నమోదయ్యాయి. -
ఆపతరమా..!
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వాయువేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియెంట్ అన్ని రాష్ట్రాల్లోనూ వణుకు పుట్టిస్తోంది. గత కొద్ది రోజుల వరకు దేశంలో పశ్చిమాది రాష్ట్రాల్లో మాత్రమే ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చేవి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో డెల్టా కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. కానీ ఇప్పుడు తూర్పు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ విజృంభణ మొదలైందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఒకే రోజులో 1,41,986 కరోనా కేసులు నమోదయ్యాయి. 222 రోజుల తర్వాత లక్షన్నరకి చేరువలో కేసులు నమోదు కావడంతో ఒమిక్రాన్ ఎంత ప్రమాదకరంగా మారుతోందో అర్థమవుతోంది. కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169కి చేరుకుంది. కేవలం ఒకే రోజులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,806 దాటేయడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజువారీ కేసుల పాజిటివిటీ రేటు 9.28శాతం ఉంటే, వీక్లీ పాజిటివిటీ రేటు 5.66శాతంగా ఉంది 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు 3,071కి చేరుకున్నాయి. ఆంక్షలు కఠినతరం చేయాలి: డబ్ల్యూహెచ్ఓ పిలుపు ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్–19 కేసులు భారీగా వెలుగులోకి వస్తూ ఉండడంతో కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పిలుపునిచ్చింది. వైరస్ సామాజిక వ్యాప్తిని నివారించడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ప్రజారోగ్య సదుపాయాలను పెంచాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియెంట్ తక్కువ తీవ్రత ఉంటుందని భావించి నిర్లక్ష్యం చేయవద్దని డబ్ల్యూహెచ్ఒ ఆగ్నేయాసియ రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ హితవు పలికారు. -
ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. వైద్యులు ఏమన్నారంటే..
Sirivennela Seetharama Sastry Health Bulletin Released: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సిరివెన్నెల ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అనారోగ్యం కారణంగా ఈనెల 24న సిరివెన్నెలను ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. -
నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Kaikala Satyanarayana Health Condition: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలెటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు కైకాల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే కైకాల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు తమ ప్రకటనలో వెల్లడించారు. చదవండి: బ్రేకప్లు, విడాకులు మన స్టార్ హీరోయిన్స్కు కలిసోచ్చాయా?! -
రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
Kauvery Hospital Released Rajinikanth Health Bulletin: సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజినీ గురువారం సాయంత్రం హుటాహుటిన ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు ఆయన భార్య లత వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా కావేరీ ఆసుపత్రి వైద్యులు రజనీ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చదవండి: Rajinikanth Hospitalised: ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్ను గుర్తించిన వైద్యులు.. అవసమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈరోజు ఆయన సర్జరీ చేసినట్లు చెప్పారు. ఇక త్వరలోనే రజినీకాంత్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన తాజాగా నటించిన ‘అన్నాత్తే’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నారని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఎయిమ్స్ అధికారులు శనివారం తెలిపారు. మన్మోహన్సింగ్ ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోందని వైద్యులు తెలిపారు. చదవండి: కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’ కాగా మాజీ ప్రధాని జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో బుధవారం ఎయిమ్స్లో చేరారు. డెంగ్యూ జ్వరం బారినపడిన మాజీ ప్రధాని.. ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ఓ ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు.. -
ఏపీలో కొత్తగా 1,184 కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 1,333 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 20,19,657 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 14,136కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి.. -
సాయి తేజ్కు ప్రమాదం ఎలా జరిగిందో వివరించిన ఎన్టీఆర్ పీఆర్ఓ
అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 10)న ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఇప్పటికి ఈ విషయంపైన చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం తేజ్ అతివేగమే కారణమంటూ పలువురు కామెంట్స్ చేయగా, రోడ్డుపై ఉన్న ఇసుక వల్ల సాయి తేజ్ స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయమై చాలా మంది మిడి మిడి జ్ఞానంతో ఏవేవో కామెంట్స్ చేస్తున్నారంటూ ఎన్టీఆర్ పీఆర్ఓ మహేష్ కోనేరు సోషల్ మీడియాలో మండిపడ్డారు. తేజ్కు ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చో వివరిస్తూ దానికి సంబంధించిన యాక్సిడెంట్ వీడియోని మహేష్ ట్విటర్లో షేర్ చేశాడు. ‘పెద్ద వాహనాల గురించి తెలియని చాలామంది సాయిధరమ్ తేజ్కు జరిగిన ప్రమాదంపై మిడి మిడి జ్ఞానంతో కామెంట్స్ చేస్తున్నారు. అతను అతి వేగంగా, బాధ్యత రాహిత్యంతో డ్రైవింగ్ చేసే వ్యక్తి కాడు. రోడ్డుపై మట్టి, ఇసుక ఉండడం వల్ల ముందు వెళుతున్న వాహనాలు స్లో అయ్యాయి. సాయి నెమ్మదించి పక్కనుంచి వెళ్లాలనుకున్నాడు. అయితే అక్కడ ఇసుక ఉండడంతో జారి పడిపోయాడు. ఎంతో అనుభవం ఉన్న రేసర్కైనా సాధారణంగా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రోడ్డు సరిగ్గా లేనందున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకానీ సాయి ఓవర్ స్పీడ్ వల్లకాదు. అతను ఎటువంటి నియమాలను అతిక్రమించలేదు, ఆ టైమ్లో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. యాక్సిడెంట్ అనేది ఎవరికైనా జరగొచ్చు. కాబట్టి అతడికి, అతడి కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. అన్ని ప్రమాదాలు అతివేగం వల్ల మాత్రమే జరగవు’ అని మహేశ్ కోనేరు వీడియో పోస్టు క్యాప్షన్లో పేర్కొన్నాడు. If you see the video, auto and the bike slowed down considerably, probably due to the same stretch of sand/dirt. From what I could see, SDT also slowed down to avoid the bike and auto and swerved around them pic.twitter.com/YFBSfN6jcD — Mahesh Koneru (@smkoneru) September 12, 2021 -
నిలకడగా సాయి తేజ్ ఆరోగ్యం, ఇంకా 36 గంటలు అబ్జర్వేషన్లో..
అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న (ఆదివారం) సాయి తేజ్కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అపోలో వైద్యులు సోమవారం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘‘సాయి తేజ్ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. నిన్న ఆయన కాలర్ బోన్కు చేసిన ఆపరేషన్ విజయంతం అయ్యింది. చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, హెల్త్ బులెటిన్ విడుదల ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మొదట్లో ఉన్న దానికంటే వెంటిలేటర్ అవసరం ఇప్పుడు తగ్గింది. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంది’’ అని అపోలో వైద్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. -
సాయి తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, హెల్త్ బులెటిన్ విడుదల
మెగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్కు సర్జరీ పూర్తయింది. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికి వైద్యులు కాలర్ బోన్కు సర్జరీ నిర్వహించారు. కాసేపటి క్రితమే ఈ ఆపరేషన్ సెక్సెస్గా ముగిసిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాయి తేజ్ బావ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, అల్లు అరవింద్లు ఉదయం ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో సాయి తేజ్ కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి భాగంలో గాయమైన సంగతి తెలిసిందే. -
ఇవాళ కూడా ఐసీయూలోనే సాయిధరమ్ తేజ్: వైద్యులు
-
సాయిధరమ్తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
-
సాయిధరమ్తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: సాయిధర్మ్ తేజ్కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు అర్ధరాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగిందని.. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామన్నారు. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మృతుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,608 పాజిటివ్ కేసులు నమోదవగా ఆరుగురు మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో 67,911 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. వైరస్ నుంచి 1,107 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,98,561 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్కు ఇంజెక్షన్ -
ఏపీలో కొత్తగా 1,439 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 1,311 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,97,454 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,964కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,71,61,870 శాంపిల్స్ను పరీక్షించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం రోజున హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్: నరేంద్ర మోదీ -
ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,15 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 1,288 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,96,143 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,950కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,70,99,014 శాంపిల్స్ను పరీక్షించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం రోజున హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్: నరేంద్ర మోదీ -
ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 1,266 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,94,855 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,935కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,70,37,651 శాంపిల్స్ను పరీక్షించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం రోజున హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్: నరేంద్ర మోదీ -
ఏపీలో కొత్తగా 739 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 739 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 1,333 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,93,589 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,925కు చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం రోజున హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: Corona: పట్టణాల్లో నియంత్రణలోనే కోవిడ్ -
ఏపీలో కొత్తగా 1,623 కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 1,340 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు19,92,256 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,911కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: ఒడిశా పోలీసుల అత్యుత్సాహం -
ఏపీలో కొత్తగా 1,502 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి ఆంధ్రప్రదేశ్లో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 1,502 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో 63,717 కరోనా పరీక్షలు చేశారు. 24 గంటల్లో 1,525 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు 2,68,73,491. కాగా కొత్తగా 16 మంది కరోనా వైరస్తో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 19,90,916 ఉండగా, ప్రస్తుతం 14,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
ఏపీలో కొత్తగా 1,115 కరోనా కేసులు..
సాక్షి,అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి19 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,857 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,265 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19లక్షల 85 వేల 566 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం14,693యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,66,29,314 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: Dale Steyn: అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టార్ బౌలర్ -
ఏపీలో కొత్తగా 1,557 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్ నుంచి 1,213 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,83,119 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,825కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
దేశంలో కొత్తగా 45,083 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 3.26 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కరోనా వల్ల 460 మంది మృతి చెందగా.. మొత్తంగా 4,37,830 మంది బాధితులు మరణించారు.శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 35,840 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 97.53 శాతంగా ఉందని తెలిపింది. చదవండి: Covaxin Vaccine: కోవాగ్జిన్ సింగిల్ డోస్?!: ఐసీఎంఆర్ -
ఏపీలో కొత్తగా1,321 కరోనా కేసులు..
సాక్షి,అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 64,461 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,321 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి19 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,807 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,499 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19 లక్షల 81 వేల 906 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం14,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,64,71,272 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: అమ్మా..! నాకూ, తమ్ముడికి ఈత రాదు -
రెండు నెలల తర్వాత గరిష్ట స్థాయికి కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో మళ్లీ రెండు నెలల తర్వాత ఒకేరోజు అత్యధిక కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46, 759 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 32,801 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు చేరింది. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 509 మంది మరణించగా.. మొత్తం మీద 4,37,370 మంది కరోనాకు బలయ్యారు. ఇక కరోనా నుంచి 24 గంటల్లో కొత్తగా 31, 374 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,18,52,802గా ఉంది. ఇక దేశంలో 3,59,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 62,29,89,134 డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో గత 24 గంటల్లో కోటీ 3లక్షల 35వేల 290 మందికి వ్యాక్సినేషన్ వేసి రికార్డు సృష్టించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. చదవండి: ఒక్క రోజే కోటి వ్యాక్సినేషన్లు -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,515 కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,515 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,09,245 కు చేరింది. గురువారం కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 13,788 కు చేరింది. నిన్న ఒక్క రోజే 903 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,80,407 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,050 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,64,06,811 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
దేశంలో కొత్తగా 44,658 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 44,658 కరోనా కేసులు నమోదు కాగా 496 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి 4,36,861 ప్రాణాలు కోల్పోయారు. అయితే 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు కేరళలో నమోదు అయ్యాయి. కేవలం ఒక్క రోజులో 30 వేల కేసులు, 162 మరణాలు నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం భారత్లో కరోనా మహమ్మారి అడ్డుకట్టకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ -
ఏపీలో కొత్తగా 1,539 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 67,590 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,539 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 1,140 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1979504 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున 12 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 13778 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14448 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2007730కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,63,37,946 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇవీ చదవండి: 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ Viral: బుల్లెట్టు బండి పాటొస్తేనే.. పాలు తాగుతోంది! -
దేశంలో కొత్తగా 46,164 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 607 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కి చేరగా.. మృతుల సంఖ్య 4,36,365గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 34,159 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,17,88,440 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటివరకు 60, 38, 46, 475 మంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. కాగా దేశం మొత్తంమీద చూసుకుంటే కేరళలోనే కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరగడంలో ఓనం వేడుకలు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. -
దేశంలో కొత్తగా 37,593 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజువారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 37,593 కరోనా కేసులు నమోదు కాగా 648 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 59.55కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,647 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 354 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,35,110 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 39,486 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: ఆస్తులు లాగేసుకుని బయటకు గెంటేశారు ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,17,20,112 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,19,551 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,24,74,773 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 58,89,97,805 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.68 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మహిళలతో చనువుగా ఫోన్ చేయించి అర్ధనగ్న ఫొటోలు.. -
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 389 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,34,756 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 44,157 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,16,80,626 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,33,924 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,24,49,306 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 57.6 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.57శాతంగా ఉంది. కాగా దేశంలో ఇప్పటి వరకు 50,75,51,399 మందికి కోరోనా పరిక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 57,745 మందికి కరోనా పరీక్షలు జరపగా 1,085 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ప్రభావంతో 8 మంది మృతి చెందారు. తాజాగా 1,541 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,71,045 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,723 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,677 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,60,91,962 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
భారత్లో కొత్తగా 30,948 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో.. కొత్తగా 30,948 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ఈ మహమ్మారి బారిన పడి గత 24 గంటలలో 403 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 4,34,367 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,53,398 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా 38,487 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రికవరీల సంఖ్య 3,16,36,49 కి చేరింది. ఇప్పటి వరకు 58.14 కోట్ల మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. చదవండి: ఇస్రోలో ఉద్యోగం సాధించిన ఇల్లెందు వాసి.. -
ఏపీలో కొత్తగా1,217 కరోనా కేసులు..
సాక్షి,అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో67,678 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,217 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,715 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,535 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19 లక్షల 72 వేల 399 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,141 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,60,34,217 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి:Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది -
ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు..
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ ప్రభావంతో 6గురు మృతి చెందారు. తాజాగా 1,695 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,70,864మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం రాష్ట్రంలో 13,702మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,72,539 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.