
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,05,45,433 చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 955 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 4,02,005 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు.
గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 52,299 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,96,58,078 చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,85,350 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 35,12,21,306 మందికి కరోనా టీకా అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.