
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 97,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,797 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 35 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,706 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,498 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 38 వేల 469 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 38,338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,19,93,618 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి: Lockdown Update: అదుపులోకి కరోనా.. జూలై 5 నుంచి అన్లాక్ 3!