దేశంలో కొత్తగా 46,164 కరోనా కేసులు | India Reports 46164 New Corona Virus Cases Recorded In India 24 Hours | Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 46,164 కరోనా కేసులు

Published Thu, Aug 26 2021 9:51 AM | Last Updated on Thu, Aug 26 2021 9:54 AM

India Reports 46164 New Corona Virus Cases Recorded In India 24 Hours - Sakshi

ఢిల్లీ: దేశంలో  కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 607 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కి చేరగా.. మృతుల సంఖ్య 4,36,365గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 34,159 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,17,88,440 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక దేశంలో ఇప్పటివరకు 60, 38, 46, 475 మంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. కాగా దేశం మొత్తంమీద చూసుకుంటే కేరళలోనే కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనా కేసులు పెరగడంలో ఓనం వేడుకలు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement