
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 45 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,269 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,014 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 67 వేల 404 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 65,244 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,10,50,846 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి: AP: రేపు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్లు
Comments
Please login to add a commentAdd a comment