positive cases
-
ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ.. ఓ వ్యక్తికి పాజిటివ్!
సాక్షి, ఏలూరు: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో, కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.మరోవైపు.. ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫార్మ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో 24x7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 9966779943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.ఇదిలా ఉండగా.. తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులను మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక, భారీగా తగ్గిన చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. దీంతో, పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
HMPV వైరస్ కలకలం.. నాలుగేళ్ల బాలుడికి పాజిటివ్
అహ్మదాబాద్: దేశంలో చైనా వైరస్ హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా గుజరాత్ నాలుగేళ్ల బాలుడు వైరస్ బారినపడ్డాడు. బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ప్రస్తుతం ఆసుపతత్రిలో బాలుడికి చికిత్స జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పాజిటివ్ కేసుతో గుజరాత్ హెచ్ఎంపీ బాధితుల సంఖ్య ఎనిమిది చేరింది.వివరాల ప్రకారం.. జనవరి 28న అహ్మదాబాద్లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. అనంతరం, బాలుడిని ఎస్జీవీపీ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలుడికి హెచ్ఎంపీవీ సోకిందని అదే రోజున నిర్ధారించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఆ బాలుడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించినట్లు చెప్పారు. దీంతో, సదరు బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గుజరాత్లో ఇప్పటి వరకు ఎనిమిది హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్లో ఏడు, సబర్కాంత జిల్లాలో ఒక కేసు వెలుగుచూశాయి. అహ్మదాబాద్లోని ఆసుపత్రుల్లో చేరిన ఆరుగురు రోగులను పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు హెచ్ఎంపీ కేసులు ఇలా ఉన్నాయి. గుజరాత్లో 8, మహారాష్ట్రలో 3, కర్ణాటక 2, తమిళనాడులో 2, అసోంలో ఒక్క కేసు నమోదైంది.అసలేంటీ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.హెచ్ఎంపీవీ లక్షణాలుఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.దగ్గుజ్వరంజలుబు,గొంతు నొప్పిఊపిరి ఆడకపోవడంజాగ్రత్తలు ఇలా..హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం. -
విశాఖలో డయేరియా కలకలం.. చిన్నారి మృతి!
సాక్షి, విశాఖ: విశాఖపట్నం ఏపీలో చాప కింద నీరులో డయేరియా విస్తరిస్తోంది. విశాఖలో డయేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డయేరియాతో 41 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, డయేరియా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఓ చిన్నారి చనిపోవడంతో డయేరియానే కారణమని సమాచారం.వివరాల ప్రకారం.. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్తోటలో డయేరియా కలకలం చోటుచేసుకుంది. గడిచిన 5 రోజుల్లో 40 మంది వరకు డయేరియాతో ఆసుపత్రిల్లో చేరారు. వాంతులు, వీరోచనాలతో బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరినట్టు తెలుస్తోంది. మంచి నీటి కొళాయి వద్ద మురుగు నీరు కలుస్తుండడం వల్లే డయేరియా ప్రబలినట్టు స్థానికులు చెబుతున్నారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫాతిమా మాట్లాడుతూ..‘డయేరియా ప్రబలిన ప్రాంతంలొ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. 41 మంది డయేరియా బారిన పడ్డారు. గీతిక అనే బాలిక డయేరియాతో చనిపోయిందని నిర్ధారించలేం.. వేరే కారణం ఏదైనా అవ్వచ్చు. ఏడుగురు డయేరియా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డయేరియా బాధితులకు డయాలసిస్ అవుతుంది.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. -
ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్1’ వేరియంట్ ఎంపాక్స్ వైరస్ భారత్లోకి అడుగుపెట్టింది. క్లేడ్ 1బీ పాజిటివ్ కేసు భారత్లో నమోదైందని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు తిరిగొచి్చన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్ 1బీ వైరస్ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. క్లేడ్ 1బీ వేరియంట్ కేసులు విజృంభించడతో ఆగస్ట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తెల్సిందే. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. కోలుకున్న ‘క్లేడ్2’ రోగి క్లేడ్2 వేరియంట్తో ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. హరియాణాలోని హిసార్కు చెందిన ఈ వ్యక్తి సెపె్టంబర్ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరడం తెల్సిందే. -
మంకీపాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ
న్యూఢిల్లీ: ‘అనుమానిత’ కేసు మంకీపాక్స్(ఎంపాక్స్) కేసుగానే నిర్ధారణ అయ్యింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్ పాజిటివ్గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలేవీ లేవని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సదరు యువకుడు ప్రయాణంలో ఉండగా ఎంపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్–2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించామని వివరించింది. ఇది 2022 జూలై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లాంటిదేనని తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేడ్–1 రకం వైరస్ కాదని స్పష్టంచేసింది. క్లేడ్–2 రకం వైరస్ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్లో ఉన్నాడు కాబట్టి అతడి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది. హరియాణాలోని హిసార్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అనుమానిత ఎంపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్ పాజిటివ్గా తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత, నిర్ధారిత ఎంపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలో మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ గదులు సిద్ధం చేశారు. ఎంపాక్స్ కేసుల చికిత్స విషయంలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి నోడల్ సెంటర్గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్ గదులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రజ ల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు సోమవా రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎంపాక్స్పై ప్రజల్లో అనుమానాలు తొలగించాలని పేర్కొన్నారు. వైరస్ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు. -
India: టెన్షన్ పెడుతున్న జేఎన్-1 వేరియంట్.. భారీగా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్-1 తీవ్ర కలకలం సృష్టిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. మొత్తం 12 రాష్ట్రాల్లో కలిపి 819 జేఎన్-1 వేరియంట్ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక, జేఎన్-1 కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 250, ఆ తర్వాత కర్ణాటకలో 199, కేరళలో 148 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. అదే సమయంలో కొత్తగా 475 కోవిడ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,919కి చేరాయని తెలిపింది. 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒక కోవిడ్ బాధితుడు చనిపోయినట్లు పేర్కొంది. A total of 819 cases of JN.1 series variant have been reported from 12 states in India till 8th January 2024: Sources — ANI (@ANI) January 9, 2024 కర్ణాటక గవర్నర్కు కరోనా ఇదిలా ఉండగా కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణయింది. ఆయన కోలుకునే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు రాజ్భవన్ మంగళవారం తెలిపింది. ఆయన రాజ్భవన్లోనే క్వారంటైన్లో ఉన్నారని, చికిత్స అవసరం లేదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. -
Corona: గడిచిన 24 గంటల్లో 761 కేసులు.. 12 మంది మృతి
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మరోసారి భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన రేకేత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో 761 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క రోజులోనే 12 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,249 యాక్టివ్ కేసులు ఉండగా కర్ణాటక 1,240, మహారాష్ట్ర 914, తమిళనాడు 190, చత్తీస్గఢ్- ఆంధ్రప్రదేశ్లో 128 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్తో మరణించిన వారిలో కేరళలో అయిదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒక్కరు ఉన్నారు. కాగా గతేడాది తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా డిసెంబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. డిసెంబర్ 5 వరకు వందలోపు నమోదైన కేసులు.. తర్వాత కొత్త వేరియంట్ వెలుగుచూడంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020లో కరోనా తొలిసారి బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 5.3లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. 4.4 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. -
బెంగళూరులో కరోనా డేంజర్ బెల్స్.. నాలుగు మరణాలు
ఢిల్లీ: కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 కారణంగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్ కారణంగా రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 4,334 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, దేశంలో కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు.. కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరులోనే 172 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇదే సమయంలో కరోనాతో నలుగురు మృతిచెందడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. ఇక, ప్రస్తుతం కర్ణాటకలో 1,240 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారీగా పెరిగిన జేఎన్-1 కేసులు.. ఇదిలా ఉండగా.. దేశంలో జేఎన్-1 పాజిటివ్ కేసులు 500 మార్కును దాటాయి. ప్రస్తుతం దేశంలో జేఎన్-1 వేరియంట్ కేసులు 541 ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కర్ణాటకలో 199, కేరళలో 148, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో 4, తెలంగాణ 2, ఒడిషా, హర్యానాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మిజోరం, త్రిపుర, చండీఘర్, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి యాక్టివ్ కేసులు కూడా లేవని వైద్యారోగ్యశాఖ తెలిపింది. -
India: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 600 మార్క్ను దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలను వైద్యశాఖ మరోసారి హెచ్చరించింది. తాజాగా వైద్యారోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 602 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. COVID-19 | India reports 602 new cases, 5 deaths in the last 24 hours; Active caseload at 4,440 — ANI (@ANI) January 3, 2024 ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు మంగళవారం నాటికి 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్కు సంబంధించినవిగా గుర్తించారు. -
TS: కరోనా కలకలం.. రెండు జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో పాజిటివ్ కేసుల కలకలం చోటుచేసుకుంది. రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నలుగురికి పాజిటివ్గా తేలింది. రేకుర్తికి చెందిన ఓ మహిళకు, 18 నెలల బాలుడికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇక, మహబూబ్నగర్ జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులను గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు ఇప్పటి వరకు 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్కు సంబంధించినవిగా గుర్తించారు. -
ఒక్కరోజులో 797 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జేఎన్.1 ఉప వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 797 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒకేరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత ఏడు నెలల్లో ఇదే మొదటిసారి. మొత్తం యాక్టివ్ కేసుల 4091కి చేరుకుంది. ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ బారినపడిన బాధితుల సంఖ్య 162కు చేరింది. అత్యధికంగా కేరళలో 83 కేసులు, గుజరాత్లో 34 జేఎన్.1 కేసులు వెలుగుచూశాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీలో జేఎన్.1 ఉప వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సారి్టయం(ఇన్సాకాగ్) శుక్రవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో కరోనా కాటుకు ఐదుగురు బలయ్యారు. -
TS: కొత్త వేరియంట్ కలకలం.. నర్సుకు పాజిటివ్!
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా పాజిటివ్ కేసులు జిల్లాల్లో సైతం నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో, వారికి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ కలకలం చోటుచేసుకుంది. కొత్త వేరియంట్ జేఎన్-1కు సంబంధింంచి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక ఆసుపత్రి నర్సు, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళకు పాజిటివ్గా తేలింది. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారి శాంపిల్స్ను జీనోమ్ పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. వారి సన్నిహితుల సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ నగరంలో 9, కరీంనగర్లో ఒక్క కేసు నమోదైంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి ఒకరు కోలుకున్నారు. మరో 55 మంది ఐసోలేషన్లో ఉన్నారు. ఇంకో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్ సూచించారు. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ (65)కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేశారు. కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్లో ఉన్నారు. యాదమ్మ కుటుంబసభ్యులు భాస్కర్ (42), వీణ (30), ఆకాష్ (13), మిద్దిని (5)లు ఇంట్లోనే ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారు. -
Covid-19: దేశవ్యాప్తంగా 63 కరోనా జేఎన్1 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వైరస్ వ్యాప్తి దేశంలో పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈ ఉపవేరియంట్ రకం కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో తొమ్మిది, కర్ణాటకలో ఎనిమిది, కేరళలో ఆరు, తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు ఈ రకం కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది. కేరళలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది. -
Covid-19 JN.1 Variant: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..!
న్యూఢిల్లీ: కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. కేరళలో మరో వ్యక్తి కోవిడ్తో కన్నుమూయడంతో దేశంలో ఇప్పటిదాకా కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్లో తొలికేసు వెలుగుచూసిననాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త శ్వాససంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. ‘‘ పండుగల సీజన్ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. జేఎన్1 ఉపవేరియంట్కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్వో స్పష్టంచేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు జేఎన్1సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కలి్పస్తాయి’’ అని ఆమె చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. -
తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. ఈరోజు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు అలర్ట్. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక, తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో నేడు 12 కేసులు నమోదయ్యాయి. వివరాల ప్రకారం.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి ఒకరు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో పేర్కొంది. ఇక, ఈరోజు 1322 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. నేడు నమోదైన కేసులో హైదరాబాద్లోనే తొమ్మిది కేసులున్నాయి. హైదరాబాద్- 9 కేసులు రంగారెడ్డి- 1 సంగారెడ్డి-1 వరంగల్-1. -
కరోనా అలర్ట్.. తెలంగాణలో పెరిగిన పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక, తెలంగాణలో కొత్తగా మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో కొత్త మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నాట్టు బులిటెన్లో తెలిపారు. అలాగే, కరోనా నుంచి నేడు ఒకరు కోలుకున్నారు. ఈరోజు తెలంగాణలో 1245 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈరోజు నమోదైన కేసుల్లో హైదరాబాద్లో ఎనిమిది, రంగారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మరోవైపు.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్లో ఆరు శాంపిల్స్ ఆర్టీపీసీటీ టెస్ట్కు పంపగా.. రెండు పాజిటివ్గా వచ్చాయి. భూపాలపల్లికి చెందిన యాదమ్మ అనే మహిళతోపాటు మరో వ్యక్తి రాజేందర్కు పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరికి కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. -
TS: కొత్త వేరియంట్ కలకలం.. జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక, తెలంగాణలో కొత్తగా మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. తెలంగాణలో ఈరోజు కొత్తగా ఆరు కేసులు నమోదు కాగా, వైరస్ నుంచి ఒకరు కోలుకున్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 20 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో 19 మందికి చికిత్స జరుగుతోంది. ఇక, నేడు హైదరాబాద్లో నాలుగు, మెదక్లో ఒకటి, రంగారెడ్డిలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఈరోజు 925 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇంకా 54 మందికి సంబంధించి కోవిడ్ టెస్టు రిజల్ట్ రావాల్సి ఉందని అధికారులు బులిటెన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో, ఎంజీఎం అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని తెలిపారు. -
HYD: కరోనా కొత్త వేరియంట్ అలర్ట్.. మళ్లీ పెరిగిన కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల జాగ్రత్తలు పాటించడం మంచింది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం తెలంగాణలో మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. కాగా, కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్లోనే నమోదు కావడం గమనార్హం. దీంతో, ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు భారత్లోనూ నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జేఎన్-1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
కోవిడ్ కేసుల ఎఫెక్ట్.. ఆ మూడు రాష్ట్రాల్లో మాస్క్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6వేలు దాటిపోయింది. యాక్టివ్ కేసుల సంఖ్య 31వేల దాటింది. దీంతో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను సమీక్షించాలని సూచించారు. ఇదిలా ఉండగా, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను అంచనా వేయడానికి సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టనుందని స్పష్టం చేసింది. ఐసియూలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు అమలులో ఉన్నాయని, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని పేర్కొంది. మరోవైపు.. కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరిగా చేశాయి. హర్యానా కోవిడ్ కేసుల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది. కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించేలా అమలు చేసేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు. కేరళ కేరళలో గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ సంబంధిత మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. కాబట్టి, వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పుదుచ్చేరి పుదుచ్చేరి ప్రభత్వుం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని ఒక ప్రకటనలో తెలిపింది. -
కొత్తగా 3,824 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇవే ఒకరోజు అత్యధిక కేసులు కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 18,389కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 4,47,22,605 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 5,30,881 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. మరోవైపు రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. 4,41,73,335 మంది కరోనా బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సంబంధిత మరణాల రేటు 1.19 శాతంగా రికార్డయ్యింది. కేంద్ర ప్రభత్వుం ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. -
మళ్లీ భయపెడుతున్న కరోనా.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా టెన్షన్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు వందల్లో నమోదైన పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేలకు చొరవైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,823 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 18,389 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. ఇక, శనివారంతో పొల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య 27 శాతం పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, శనివారం దేశవ్యాప్తంగా 2,995 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, వైరస్ బారినపడి ఇప్పటి వరకు 5,30,881 మృతిచెందినట్టు పేర్కొంది. India reports 3,824 new cases of Covid-19 in 24 hours; the active caseload stands at 18,389. pic.twitter.com/i4AOCyHAj3 — ANI (@ANI) April 2, 2023 -
భారత్లో కరోనా టెన్షన్.. ఒక్కరోజులో 40శాతం కేసులు జంప్!
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ టెన్షన్కు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే 40 శాతం పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3వేలు దాటింది. వివరాల ప్రకారం.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3016 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైదారోగ్య శాఖ తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ అని స్పష్టం చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా మొత్తం 1,10,522 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం రోజువారీ కేసుల సంఖ్య 2,151గా ఉండగా.. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు పెరిగాయి. మరోవైపు, దేశంలో వైరస్ కారణంగా నిన్న ఒక్కరోజు 14 మరణాలు చోటుచేసుకున్నాయి. కేరళలో 8, మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, హిమాచల్ ప్రదేశ్లో ఒకరు మృతిచెందారు. తాజా మరణాలలో దేశంలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,862కి చేరింది. ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,509గా ఉంది. ఇక రకవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం ఢిల్లీలో 300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్ 2వ తేదీన 3375 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆరు నెలల తర్వాత నేడు.. కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటింది. India recorded 3,016 new #COVID cases in past 24 hours, a nearly 40% jump since yesterday. @Verma__Ishika reports pic.twitter.com/bTqf7UfPs7 — Mirror Now (@MirrorNow) March 30, 2023 -
కోవిడ్పై మోదీ సమీక్ష.. మాస్క్ ధరించాల్సిందే..
ఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో కోవిడ్పై ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం సాయంత్రం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారలు, పీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా కేసులు, ఇన్ఫ్లూ పరిస్ధితిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రధాని మోదీకి వివరించారు. మార్చి 22తో ముగిసిన వారంలో దేశంలో సగటున 888 రోజువారీ కేసులు నమోదు కాగా, పాజిటివ్ రేటు 0.98 శాతంగా పెరిగిందని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రధానమైన 20 కోవిడ్ డ్రగ్స్, ఇతర డ్రగ్స్ 12, బఫర్ డ్రగ్స్ 8, ఇన్ఫ్లూయెంజా డ్రగ్ లభ్యత , ధరలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రధానికి ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించారు. దేశంలోని ఇన్ఫ్లూయెంజా పరిస్ధితిపై ప్రత్యేకించి గత కొన్ని నెలల్లో అత్యధిక సంఖ్యలో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసులు నమోదవుతున్నాయని ప్రధానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ల్యాబ్స్లో జీనోమ్ సీక్వెన్సింగ్ను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. దీని వల్ల కొత్త వేరియంట్లు ఏమైనా ఉంటే వాటి ట్రాకింగ్కు, సకాలంలో ప్రతిస్పందనకు మద్ధతుగా ఉంటుందని తెలిపారు. టెస్ట్ , ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. రోగులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఆసుపత్రి ప్రాంగణంలో మాస్క్లు ధరించడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్ను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు రద్దీగా వుండే ప్రాంతాల్లో మాస్క్లు ధరించాలని ప్రధాని కోరారు. అలాగే, ఐఆర్ఐ/ ఎస్ఏఆర్ఐ కేసులపై పర్యవేక్షణ ఇన్ఫ్లూయెంజా, కోవిడ్ 19, అడెనోవైరస్లకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇన్ఫ్లూయెంజా, కోవిడ్ 19 కోసం అవసరమైన డ్రగ్స్, లాజిస్టిక్స్, ఆసుపత్రుల్లో బెడ్స్, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉండాలన్నారు. కోవిడ్ 19 మహమ్మారి ఇంకా ముగిసిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుత స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (SARI) కేసుల ల్యాబ్ నిఘా , పరీక్షలను మెరుగుపరచాలని ఆదేశించారు. దేశంలోని ఆసుపత్రులు అత్యవసర పరిస్ధితులకు సిద్ధంగా వున్నాయని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ను నిర్వహించాలన్నారు. కాగా.. గత నాలుగు రోజులుగా మాత్రం యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇక, దేశంలో గత నాలుగు రోజులుగా వెయ్యికి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్గా తేలింది. ఇదే సమయంలో ఐదుగురు మృతిచెందారు. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరినట్టు స్పష్టం చేసింది. ఇక, దేశంలో ప్రస్తుతం.. 7,026 కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో ఢిల్లీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఉత్తరాదిన పెను భూకంపం -
చైనాలో ఇన్ఫ్లూయెంజా పంజా
బీజింగ్: చైనాలో ఇన్ఫ్లూయెంజా (హెచ్3ఎన్2) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఫ్లూ పాజిటివ్ కేసుల రేటు 41.6 శాతం పెరిగినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. మునుపటి వారంతో పోలిస్తే 25.1 శాతం ఎక్కువ పెరుగుదల నమోదైనట్లు తెలియజేసింది. షాంగ్జీ ప్రావిన్స్లోని జియాన్ నగరంలో ఇన్ఫ్లూయెంజా కేసుల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లూ వ్యాప్తి మరింతగా పెరిగితే లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు. హాంకాంగ్ వైరస్గా పిలిచే హెచ్3ఎన్2 వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరణాలు సైతం నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు, శరీరంలో నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, చైనాలో కోవిడ్–19 పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గడం విశేషం. -
వైరస్ అలర్ట్: భారత్లోకి డేంజరస్ XBB.1.5 వేరియంట్ ఎంట్రీ
కరోనా వేరియంట్ల కారణంగా ప్రపంచదేశాలు మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా XBB.1.5 ప్రస్తుతం అమెరికాను వణికిస్తోంది. ఈ వేరియంట్ భారత్లోకి కూడా ప్రవేశించింది. గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి ఈ వేరియంట్ బారినపడ్డాడు. దీంతో, వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. కోవిడ్ XBB.1.5 వేరియంట్ను ఇటీవలే అమెరికాలో కనుగొన్నారు. కాగా, XBB.1.5 వేరియంట్ను సూపర్ వేరియంట్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. XBB.1.5 వేరియంట్ గత వేరియంట్ BQ.1 తో పోలిస్తే 120 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అమెరిక పరిశోధకులు చెబుతున్నారు. ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే ప్రత్యేకతను కలిగి ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. ఈ వేరియంట్ను గుర్తించిన 17 రోజుల్లో ఎంతో మంది ఈ వైరస్ బారినపడినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ XBB.1.5 వేరియంట్ అమెరికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందినట్లుగా నిపుణులు గుర్తించారు. దీని విస్తరణ క్రిస్మస్ కంటే ముందుగానే ప్రారంభమైందని తెలిపారు. సింగపూర్లో కనుగొన్న XBB.1.5 వేరియంట్ కంటే 96 శాతం వేగంగా వ్యాపిస్తుందని వారు చెప్తున్నారు. న్యూయార్క్లో ఈ కొత్త వేరియంట్ అక్టోబర్ నెలలోనే వ్యాప్తిచెందడం మొదలైందని ఎరిక్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మాదిరిగా లేకపోవడం వల్ల దీని ప్రమాదంపై ప్రజలను ప్రభుత్వం హెచ్చరించలేకపోయిందని నిపుణులు అంటున్నారు. ఇది ఒమిక్రాన్ మాదిరిగా కాకుండా ప్రత్యేక రీకాంబినేషన్ అని, ఇది ఇప్పటికే పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్లతో రూపొందినట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఇక.. XBB.1.5 ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుందోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ వల్ల అమెరికాలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ వివరాలను బహిర్గతం చేయడంలేదని చైనాకు చెందిన ఎరిక్ కామెంట్స్ చేశారు. కేవలం 40 శాతం విస్తరణ వేగం ఉన్నట్లు చెప్పేదంతా అబద్ధమని ఆయన కొట్టిపడేశారు. XBB.1.5 వేరియంట్ అమెరికాలోని నగరాల్లో వేగంగా విస్తరిస్తున్నదని వ్యాఖ్యలు చేశారు. ⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc — Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022 -
తగినన్ని ఔషధ నిల్వలు సిద్ధం చేయండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెద్దసంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలోనూ అందరూ అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం చెప్పారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలతోపాటు అన్ని రకాల ఔషధ నిల్వలను సిద్ధం చేయాలని ఫార్మా కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైల్ స్థాయి వరకు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోవిడ్–19 మేనేజ్మెంట్ డ్రగ్స్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై మంత్రి గురువారం ఫార్మా కంపెనీల ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫార్మా కంపెనీలు అందించిన సేవలను మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫార్మా కంపెనీల కృషి వల్లే మన దేశానికి అవసరమైన ఔషధాలను, కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు 150 దేశాలకు సైతం ఎగుమతి చేయగలిగామని కొనియాడారు. ధరలు పెంచకుండా, నాణ్యత తగ్గించకుండా ఈ ఘనత సాధించామని హర్షం వ్యక్తం చేశారు. -
చైనా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. రెండు రోజుల్లో ఎంత మందిని కలిశాడు!
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు, చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్-7 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. వైరస్ కారణంగా మరణాలు సైతం సంభవిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో చైనా నుంచి భారత్కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. దీంతో, అధికారులు సదరు వ్యక్తికి టెస్టులు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఆగ్రాలోని షాగంజ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి చైనాకు వెళ్లి.. ఈ నెల 23న భారత్కు తిరిగివచ్చాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ల్యాబ్లో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా, బాధితుడు చైనా నుంచి రావడంతో సదరు ప్రైవేటు ల్యాబ్ సిబ్బంది వెంనే ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ అధికారులు.. సదరు యువకుడి ఇంటికి చేరుకొని వివరాలు సేకరించింది. ఇద్దరు కాంటాక్టులకు సైతం పరీక్షలు నిర్వహించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను పంపారు. సదరు యువకుల కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు చేయనున్నట్లు సీఎంవో డాక్టర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు.. కరోనా టెస్టుల్లో పాజిటివ్గా అయితే నిర్ధారణ అయ్యింది కానీ.. వారికి యువకుడికి ఏ వేరియంట్ సోకిందో తెలియదు. దీంతో, అతడి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
కరోనాపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచాలి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఏమరుపాటు వద్దు కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. 24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్లు విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది. ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్ కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు. -
మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్తో చిన్నారులు మృతి
కరోనా సమయంలో వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహారాష్ట్రను తాజాగా మీజిల్స్ వైరస్ టెన్షన్ పెడుతోంది. మీజిల్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం మహారాష్ట్రవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సినేషన్ చేస్తోంది. వివరాల ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకింది. దీంతో, ఈ వైరస్ సోకిన చిన్నారుల సంఖ్య 300కి చేరువైంది. కేసుల పెరుగుతున్న క్రమంలో అలర్ట్ అయిన అధికారులు బీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదకావడం అక్కడి వైద్యాధికారులను టెన్షన్ పెడుతోంది. అయితే, గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు.. ఈ వైరస్ కారణంగా చిన్నారులు మృతిచెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక, నవంబర్ 22వ తేదీన బీవండిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. కాగా, నవంబర్ 20వ తేదీన వైరస్ బారినపడిన చిన్నారి ఒంటిపై దద్దుర్లతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చిన్నారికి అటాప్సీ టెస్టు చేసిన తర్వాత మీజిల్స్ కారణంగా చనిపోయినట్టు నిర్ధారించారు. ఇక, మీజిల్స్ కారణంగా ఈ ఏడాది 13 మంది చిన్నారులు మృతిచెందారు. మరోవైపు.. మీజిల్స్ కేసులు మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ నమోదు అవుతున్నాయి. BMC prepares list of nearly 1.4 lakh Mumbai children for extra measles shot https://t.co/2KLGyJsHYT Download the TOI app now:https://t.co/2Rmi5ecUTa — Vinod KumarTOI🇮🇳 (@vinod904) November 27, 2022 -
భారత్లో కొత్తగా 7 వేల కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,231 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోన కేసుల సంఖ్య 4,44,28,393కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం సుమారు 45 మరణాలు సంభవించాయని, దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 5 లక్షలకు చేరుకుందని వెల్లడించింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 0.15 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో సుమారు 377 క్తొత కేసులు నమోదయ్యాయని పేర్కొంది. అలాగే కరోనా సంబంధితన మరణాలు రెండు సంభవించాయని తెలిపింది. ప్రస్తుతం తాజగా అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 2.58 శాతంగా ఉందని పేర్కొంది. (చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు) -
కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసులు.. గురువారం ఒక్కసారిగా పెరిగాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకంగా మారింది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,608 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,01,343 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.23 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,42,98,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,36,70,315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,27,206 మంది మృతి చెందారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 1652 మందికి పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. రెండు వారాల కింద 291 మంది ఆసుప్రతిలో చేరగా.. తాజాగా 591 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య.. 2,08,95,79,722కు చేరింది. బుధవారం ఒక్కరోజే.. 38,64,471 మందికి టీకాలు అందించారు. ఇది కూడా చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా.. -
కరోనా ఎంత పనిచేసింది.. టెన్షన్ పెడుతున్న సర్వే!
లండన్: కరోనా బారిన పడిన ప్రతి 8 మందిలో ఒకరిపై ఈ వ్యాధి దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందట. శ్వాసకోస సమస్యలు, నీరస, రుచి, వాసన తెలియకపోవడం వంటి వ్యాధి లక్షణాల్లో కనీసం ఒక్కటైనా వారిని చాలాకాలం బాధిస్తున్నట్టు లాన్సెట్ జర్నల్ శుక్రవారం విడుదల చేసిన తాజా సర్వే పేర్కొంది. కరోనాపై ఇప్పటిదాకా చేసిన అత్యంత సమగ్రమైన సర్వేల్లో ఇదొకటని చెప్తున్నారు. నెదర్లాండ్స్లో 76,422 మందిపై 2020 మార్చి 20 నుంచి 2021 ఆగస్టు దాకా సర్వే జరిపారు. అప్పటికి వ్యాక్సీన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కరోనాకు సంబంధించిన 23 రకాల లక్షణాలపై ఈ వ్యవధిలో వారి నుంచి 24 సార్లు వివరాలను సేకరించారు. 21 శాతం మంది తమకు కరోనా నిర్ధారణ అయిన తొలి 5 నెలల్లో వాటిలో ఒక్కటి, అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించాయని చెప్పారు. 12 శాతానికి పైగా, అంటే ప్రతి 8 మందిలో ఒకరు తాము దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. అయితే ఇలాంటి వారినుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకడం లేదని సర్వేలో తేలడం విశేషం. ఈ విషయంలో మరింత లోతుగా పరిశీలన జరిపేందుకు మరింత సమగ్రమైన డేటా అవసరం చాలా ఉందని నెదర్లాండ్స్లోని గ్రొనింజెన్ వర్సిటీ ప్రొఫెసర్ జుడిత్ రొస్మలెన్ అన్నారు. ఇది కూడా చదవండి: చైనీయులు తైవాన్ విషయమై ఏం అన్న ఊరుకునేట్లు లేరు! సారీ చెప్పాల్సిందే కోవిడ్ సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు -
Monkeypox: మంకీపాక్స్ టెర్రర్.. దేశంలో మరో పాజిటివ్ కేసు
Monkeypox Positive Case.. దేశంలో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కేసులు క్రమంగా పెరుగుతుండటం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఢిల్లీలో ఉండే నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అతడికి సోమవారం జరిపిన టెస్టుల్లో మంకీపాక్స్ పాజిటివ్గా తేలినట్టు కేంద్రం ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 6కు చేరింది. ఇప్పటి వరకు ఢిల్లీలో 2, కేరళలో 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. దేశంలో మంకీపాక్స్తో కేరళకు చెందిన యువకుడు(22) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, యువకుడి మృతి నేపథ్యంలో 20 మందిని ప్రస్తుతం క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా అందరినీ క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే, మృతుడికి కేవలం పది మందితోనే కాంటాక్ట్ ఉన్నదని అధికారులు ధ్రువీకరించారు. Monkeypox scare: Nigerian man residing in Delhi with no history of travel is the 6th case #2ndcaseinDelhi #Delhi #Monkeypox #Monkeypoxscare #NigerianmanresidinginDelhi https://t.co/DZ4v4jFVVohttps://t.co/bsaVAmoic7 — DellyRanks (@dellyranksindia) August 1, 2022 ఇది కూడా చదవండి: మంకీపాక్స్ పాజిటివ్ అని తెలిసినా గప్చుప్గా భారత్కు! -
జర జాగ్రత్త.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
Corona cases Updates.. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే, కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలపైనే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 20,409 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,988 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటి వరకు 4,33,09,484 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 5,26,258 మంది కరోనా కారణంగా మృతిచెందారు. మరోవైపు.. 2,03,60,46,307 మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. India reports 20,409 new COVID19 cases today; Active caseload at 1,43,988 pic.twitter.com/3YYULK8bZJ — ANI (@ANI) July 29, 2022 ఇది కూడా చదవండి: 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తుకు అవకాశం.. ఈసీ కీలక నిర్ణయం -
భారత్లో మంకీపాక్స్ కలకలం.. పెరుగుతున్న కేసులు
మంకీపాక్స్.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రపంచ దేశాలకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం భారత్లో సైతం మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో మరో పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. దీంతో దేశంలో మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఢిల్లీలో 34 ఏళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. కాగా, బాధితుడికి విదేశాల్లో పర్యటించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో, అతడిని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయితే, అతడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో బాధపడ్డాడని.. దీంతో శాంపిళ్ళను పూణెలోకి నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీకి పంపగా మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు వివరించారు. శనివారం వరకు దేశంలో మూడు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదవ్వడం గమనార్హం. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో కలిపి 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు బాధితులు మృతిచెందారు. Delhi man without any history of foreign travel tests positive for Monkeypox virus https://t.co/CxrQJuRG9Y via @economictimes — Anish Nanda (@anish_nanda) July 24, 2022 ఇది కూడా చదవండి: మంకీపాక్స్పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన -
IND: కరోనా రెడ్ అలర్ట్.. భయపెడుతున్న కేసులు, మరణాలు
Corona Cases Updates In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు.. 20వేలపైనే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 67 మంది మృత్యువాతపడ్డారు. ఇక, కరోనా నుంచి 20,726 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,50,100 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు.. మొత్తం కేసులు 4,38,68,476కు చేరుకోగా.. కరోనా మృతుల సంఖ్య 5,25,997 మందికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,31,92,379 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. ఇప్పటివరకు 201.68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. #COVID19 | India reports 21,411 fresh cases, 20,726 recoveries and 67 deaths in the last 24 hours. Active cases 1,50,100 Daily positivity rate 4.46% pic.twitter.com/jxr8ep9utB — ANI (@ANI) July 23, 2022 ఇది కూడా చదవండి: అప్పుడు ప్రధాని మోదీ, ఇప్పుడు సీఎం యోగికి షాకిచ్చిన బీజేపీ ఎంపీ -
నల్గొండ జిల్లా: 29 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్
-
IND: దేశంలో కరోనా టెన్షన్ షురూ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్దిరోజలుగా తగ్గుముఖం పట్టిన కేసులు బుధవారం అన్యూహంగా పెరిగాయి. దీంతో, ఆందోళన నెలకొంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 21,566 మంది వైరస్ బారిన పడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా నుంచి 18,294 మంది కోలుకున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం 1,48,881 పాజిటివ్ కేసులు ఉన్నాయని.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. మరోవైపు.. దేశవ్యాపంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,25,185కు చేరుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,25,870కి చేరింది. వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,31,50,434 చేరుకుంది. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200.91 కోట్లు వ్యాక్సిన్ డోసులను అందించారు. బుధవారం ఒక్కరోజే 29,12,855 మందికి టీకాలు అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,71,390 మంది వైరస్ బారినపడగా.. మరో 2,015 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో కొత్తగా 1,36,624 మందికి వైరస్ సోకింది. 177 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 1,13,588 మందికి వైరస్ సోకగా.. 367 మంది చనిపోయారు. ఫ్రాన్స్లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకగా.. 125 మంది మరణించారు. #COVID19 | India reports 21,566 fresh cases and 18,294 recoveries in the last 24 hours. Active cases 1,48,881 Daily positivity rate 4.25% — ANI (@ANI) July 21, 2022 -
India: వ్యాక్సినేషన్లో కొత్త రికార్డు.. మోదీ ఏమన్నారంటే..?
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 20వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,528 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా, అదే సమయంలో కరోనాతో 49 మంది మృతిచెందారు.దీంతో, దేశంలో ఇప్పటికి వరకు నమోదైన పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 4,37,50,599కి చేరగా.. కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 5,25,709 మందికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. దేశంలో ప్రస్తుతం 1,43,449 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్లో పేర్కొంది. కాగా, కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. వయోజన జనాభాలో 98 శాతం మంది మొదటి డోసు టీకాను తీసుకున్నట్టు తెలిపింది. ఇక, శనివారం ఒక్కరోజే 25,59,840 మందికి వ్యాక్సినేషన్ చేశారు. COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449 199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd — ANI (@ANI) July 17, 2022 ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. అసమానంగా కృషిచేసి ఈ రికార్డును అందుకోవడం గర్వకారణం. ఇది కోవిడ్కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against COVID-19. https://t.co/K5wc1U6oVM — Narendra Modi (@narendramodi) July 17, 2022 -
భారత్లో కరోనా టెన్షన్.. భయపెడుతున్న పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వరుసగా మూడో రోజూ కూడా 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు రావడం ఆందోళన లిగిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,044 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఇదే సమయంలో కరోనాతో 53 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,30,071కు చేరింది. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా, 5,25,660 మంది మృతిచెందారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం 1,40,760 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 18,301 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగిందని, యాక్టివ్ కేసులు 0.32 శాతం ఉండగా.. మరణాలు 1.20 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. డ్రాగన్ కంట్రీ చైనాలో కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో నిన్ని ఒక్కరోజే 547 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. #COVID19 | India reports 20,044 fresh cases, 18,301 recoveries, and 56 deaths in the last 24 hours. Active cases 1,40,760 Daily positivity rate 4.80% pic.twitter.com/lvMcyWZ0ti — ANI (@ANI) July 16, 2022 -
తెలంగాణలో కరోనా రెడ్ అలర్ట్.. కేసులు ఎన్నంటే..?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 608 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో కరోనా నుంచి 459 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా మరణాలు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,146 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, ఇప్పటి వరకు తెలంగాణలో 8,05,137 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు 7,95,880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా బులిటెన్ ప్రకారం.. హైదరాబాద్ 329, మేడ్చల్ మల్కాజ్గిరి 54, ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 5, జగిత్యాల 6, జనగామ 7, గద్వాల 1 , కరీంనగర్ 10, ఖమ్మం 11, ఆసిఫాబాద్ 5, మహబూబ్నగర్ 8, మహబూబాబాద్ 4, మంచిర్యాల 5, మెదక్ 1 , నాగర్ కర్నూల్ 2, నల్గొండ 7, నారాయణపేట్ 4, నిజామాబాద్ 10, పెద్దపల్లి 12, సిరిసిల్ల 4, రంగారెడ్డి 67, సంగారెడ్డి 16, సిద్దిపేట 6, వికారాబాద్ 7, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 2, యాదాద్రి 6 చొప్పున నమోదయ్యాయి. Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.08.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/VwoZEmewKJ — IPRDepartment (@IPRTelangana) July 8, 2022 -
Warning: తెలంగాణలో జికా వైరస్ కలకలం
దేశంలో కరోనా వైరస్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్ టెన్షన్కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. ఐసీఎంఆర్, నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన అధ్యయనంలో.. జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని పేర్కొంది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్లో ఇటీవలే ప్రచురించబడింది. వీరి అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్గా తేలినట్టు చెప్పింది. ఇక, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. హైదరాబాద్లో కూడా ఈ కేసులు నమోదైనట్టు సమాచారం. మరోవైపు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్, ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ బీఆర్ శమ్మన్నా స్పందించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు జీకా వైరస్ను గుర్తించడంపై దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. జికా వైరస్పై అవగాహన పెరుగుతోందని చెప్పారు. ఇంతకు ముందు జికా వైరస్ గురించి అంతగా పట్టించుకోలేదన్నారు. ఇక, జీకా వైరస్ దోమలద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. కాగా, డెంగ్యూలాగే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. #ZikaVirus has spread to various Indian cities including #Hyderabad. It was disclosed by a study conducted by #ICMR and NIV, #Pune. #News #NewsAlert #NewsUpdate #India #Update #Healthcare pic.twitter.com/rDp9D2i6K1 — First India (@thefirstindia) July 6, 2022 ఇది కూడా చదవండి: అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు -
భారత్ను టెన్షన్ పెడుతున్న కరోనా.. పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు, మరణాల రేటు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో 16,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో వైరస్ కారణంగా మరో 31 మంది మృతిచెందారు. కాగా, ప్రస్తుతం దేశంలో 1,11,711 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 13,929 బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 4,35,02,429కి చేరాయి. ఇందులో 4,28,65,519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,199 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉంది. ఇక మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 197.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. #COVID19 | India reports 16,103 fresh cases, 13,929 recoveries and 31 deaths, in the last 24 hours. Active cases 1,11,711 Daily positivity rate 4.27% pic.twitter.com/bSAssBCfIX — ANI (@ANI) July 3, 2022 -
ఫోర్త్ వేవ్ రెడ్ అలర్డ్: లక్ష దాటిన యాక్టివ్ కేసులు
Corona Active Cases In India.. దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 39 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 13,827 మంది కోలుకున్నారు. అయితే, రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.16 శాతానికి పెరిగింది. #COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours. Active cases 1,04,555 Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr — ANI (@ANI) June 30, 2022 ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఫిబ్రవరి 28 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటడం ఇదే రెండోసారి. కాగా, ఫిబ్రవరి 28న దేశంలో 1,02,601 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ జూన్ 30(నేడు)వ తేదీన ఆ మార్కు దాటి యాక్టివ్ కేసులు పెరిగాయి. -
భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
భారతీయులకు స్వల్ప ఊరట లభించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,793 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్తో 27 మంది మృతిచెందారు. ఇక, కరోనా నుంచి 9,486 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 96,700 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశంలో 43,418,839 మంది వైరస్ బారినపడగా.. కరోనాతో 5,25,047 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 4,27,97,092 కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది. భారత్లో సోమవారం 19,21,811 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగాయి. కొత్తగా 366,742 మంది కరోనా బారినపడగా.. మరో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,351,925కు చేరుకుంది. ఇది కూడా చదవండి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 25 మంది.. -
Corona Alert: దేశంలో 45 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్తో దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 పాజిటవ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఇక, దేశంలో ప్రస్తుతం 94,420 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,87,606 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,25,020 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. ఇక దేశంలో 1,97,11,91,329 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇక, ఆదివారం 11,739 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. సోమవారానికి కేసుల సంఖ్య ఒక్కసారిగా 17వేల మార్కును దాటింది. దీంతో, పాజిటివ్ కేసుల సంఖ్య 45 శాతం పెరిగింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 20 తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య 17వేలు దాటడం జూన్ 24న, మళ్లీ సోమవారమే(జూన్ 27) చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 6493 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 1891 కేసులు నమోదయ్యాయి. India reports 17,073 fresh COVID19 cases & 21 deaths today; Active caseload at 94,420 pic.twitter.com/NBcPK0kcl7 — ANI (@ANI) June 27, 2022 ఇది కూడా చదవండి: దావత్లు ఇవ్వరు.. డీజే, బారాత్లు బంద్.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు అక్కడ!! -
ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్: దేశంలో కరోనా డేంజర్ బెల్స్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 38 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. ఇదే సమయంలో కరోనా నుంచి 10,972 మంది కోలుకున్నారు. ఇక, దేశవ్యాప్తంగా 84వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 400లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. #COVID19 | India reports 13,313 fresh cases, 10,972 recoveries and 38 deaths in the last 24 hours. Active cases 83,990 Daily positivity rate 2.03% pic.twitter.com/u8Q2WhlI3w — ANI (@ANI) June 23, 2022 ఇది కూడా చదవండి: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే..? -
ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్: భారత్లో కరోనా డేంజర్ బెల్స్
దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతోంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేవంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 23 మంది మృతిచెందారు. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,32,70,577 కు చేరుకుంది. ఇక మరణించిన వారి సంఖ్య 5,24,840కి చేరింది. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి.పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,148 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,90, 845కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 00,42,768 మందికి కరోనా వ్యాక్సిన్లను అందించినట్టు కేంద్రం తెలిపింది. మరోవైపు.. తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(శుక్రవారం) తెలంగాణలో 27,841 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 172 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ఇక, మేడ్చల్లో 20, రంగారెడ్డిలో 62, కరీంనగర్లో 4 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ప్రస్తుతం 1,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. #COVID19 | India reports 13,216 new cases, 8,148 recoveries and 23 deaths in the last 24 hours. Active cases 68,108 Daily positivity rate (2.73%) pic.twitter.com/2RM2vtVa4e — ANI (@ANI) June 18, 2022 -
స్కూల్స్లో కరోనా కలకలం.. 31 మంది విద్యార్థులకు పాజిటివ్
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక, ఇటీవలే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కర్నాటకలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 31 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. న్యూ స్టాండర్డ్ పాఠశాలలో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎంఈఎస్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే వీరందరూ కరోనా బారినపడటం ఆందోళక కలిగిస్తోంది. ఇక, సదరు విద్యా సంస్థల్లో విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేసే సమయంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారు కరోనా బారినపడినట్టు తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం వెంటనే రెండు పాఠశాలలను శానిటైజ్ చేపించారు. మరోవైపు.. కర్ణాటక వైద్యారోగ్య శాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు, సిబ్బందికి తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉంటే.. వారికి వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించాలని స్పష్టం చేసింది. సిబ్బందికి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్నారో లేదో స్పష్టంగా తెలుసుకోవాలని ఆదేశించింది. మరోవైపు.. గడిచిన 24 గంటల్లో ఒక్క బెంగళూరు నగరంలోనే 582 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: మళ్లీ కరోనా టెన్షన్.. ఒక్క రోజులో 33 శాతం అధికంగా కేసులు నమోదు! -
Corona Alert: తెలంగాణలో పెరిగిన పాజిటివ్ కేసులు
తెలంగాణలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 219 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కూడా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతుండటం టెన్షన్కు గురిచేస్తోంది. తెలంగాణ పక్కా రాష్ట్రం మహారాష్ట్రలో 24 గంటల్లో 2956 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18267కు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. తాజాగా 1118 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య.. 3177కు చేరుకుంది. Maharashtra reports 2956 new #COVID19 cases, 2165 recoveries and 4 deaths in the last 24 hours. Active cases 18,267 According to latest report of NIV Pune, 2 more patients of BA.5 variants found in Thane city. They were found infected on 28 & 30 May & recovered in home isolation pic.twitter.com/Z4PQNtGkaT — ANI (@ANI) June 14, 2022 -
భారత్లో మళ్లీ పెరిగిన కేసులు.. కేంద్రం అలర్ట్
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ టెన్షన్ పెడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే 5 రాష్ట్రాలకు(తెలంగాణ కూడా) లేఖ రాసిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,270 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 15 మంది చనిపోయారు. అదే సమయంలో 2,619 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24,052 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. కేరళలో శనివారం ఒక్కరోజే 1,544 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 4,31,76,817 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. 5,24,692 మంది వైరస్ కారణంగా చనిపోయారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రను మరోసారి కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణాల్లో, ఆఫీసుల్లో మాస్క్ తప్పనిసరిని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైళ్లు, బస్సులు, సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్, ఆఫీసులు, ఆస్పత్రులు, కాలేజీలు, స్కూల్స్.. ఇలా క్లోజ్డ్గా ఉండే పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరి అని ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. #COVID19 | India reports 4,270 fresh cases, 2,619 recoveries, and 15 deaths in the last 24 hours. Total active cases are 24,052. pic.twitter.com/dnj8s4yznF — ANI (@ANI) June 5, 2022 ఇది కూడా చదవండి: నేడు ప్రపంచ పర్యావరణ దినం: ఒక్కటే భూమి..ఒక్కటై కాపాడుకుందాం -
మంకీపాక్స్ టెర్రర్.. ఒక్కరోజే 51 పాజిటివ్ కేసులు
కరోనా వేరియంట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంకీపాక్స్ రూపంలో మరో ఉపద్రవం తోడైంది. ఈ కొత్త వైరస్ మంకీపాక్స్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మంకీపాక్స్ను సీరియస్గా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్ను మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్రాన్స్లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. కాగా, ఫ్రాన్స్లో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో నమోదు అయింది. ఇక, జూన్ నాటికి ఈ కేసుల సంఖ్య 100ను దాటింది. మరోవైపు.. మంకీపాక్స్ సోకిన వారందరూ పురుషులే కావడం గమనార్హం. ఇక వీరి వయస్సు 22 నుంచి 63 ఏళ్ల మధ్యే ఉందని ఫ్రెంచ్ నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. మంకీపాక్స్ సోకిన వారిలో ఒక్కరే మాత్రమే చికిత్స పొంది కోలుకున్నారని సదరు ఏజెన్సీ తెలిపింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్ బారిన పడ్డారని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు 21 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. కాగా, కొత్త వైరస్ మంకీపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. మంకీపాక్స్ బారినపడిన వారు రెండు నుండి నాలుగు వారాలలో కోలుకుంటారని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: ఆయుధాలను నిషేధించాలన్న బైడెన్... కుదరదు అని చెప్పేసిన రిపబ్లికన్లు -
అమెరికాలో కరోనా టెన్షన్.. అక్కడ హై అలర్ట్
కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామన్న కొన్ని దేశాల్లో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మొన్నటి వరకు చైనాలో కరోనా కొత్త వేరియంట్లు విజృంభించగా.. నార్త్ కొరియా సైతం కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టించింది. న్యూయార్క్ సిటీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో న్యూయర్ పెద్ద నగరం కావడంతో జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ సిటీలో హై అలర్ట్ విధించింది. దీంతో, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు, హై అలర్ట్ జారీ చేయడంపై న్యూయార్క్ సిటీ హెల్త్ కమిషనర్ డాక్టర్ అశ్విన్ వాసన్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండాలంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మిత్రులు..బంధువులు, తోటి ఉద్యోగులకు వైరస్ సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో ఏడు రోజుల సగటు పాజిటివ్ రేటు 5.18 శాతానికి పెరిగినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ నుంచి అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది కూడా చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఊహించని బిగ్ షాక్ -
కిమ్ను భయపెడుతున్న కరోనా.. ఫుల్ టెన్షన్లో నార్త్ కొరియన్లు
Covid In North Korea.. ఉత్తరకొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్దిరోజుల కిత్రం ఒమిక్రాన్ మొదటి కేసు నమోదు కాగా తాజాగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇప్పటివరకు వరకు నార్త్ కొరియాలో కరోనా వైరస్తో 42 మంది మృతి చెందినట్టు ఆ దేశ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(KCNA) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈరోజు వరకు దేశంలో 8,20, 620 మందికి లక్షణాలు ఉండగా 3,24,550 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని మీడియా పేర్కొంది. మరోవైపు ఆదివారం ఒక్కరోజే 15 మంది వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. దీంతో అప్రమత్తమైన కిమ్ సర్కార్ దేశంలోని అన్ని ప్రావిన్స్లు, నగరాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించింది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలను సైతం మూసివేయాలని ఆదేశించింది. ఇక, ఉత్తరకొరియాలో ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాలేదు. నార్త్ కొరియన్లు టీకా తీసుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అంతకుమందు ఉత్తరకొరియాకు డబ్ల్యూహెచ్వో, రష్యా, చైనాలు టీకాలను అందిస్తామని ఆఫర్ ఇచ్చినప్పటికీ కిమ్ జోంగ్ ఉన్ తిరస్కరించారు. దీంతో తాజాగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు పంపే ఉద్దేశ్యంలేదని అగ్రరాజ్యం అమెరికా తేల్చి చెప్పింది. గతంలో కోవాగ్జిన్కి చెందిన గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన విరాళాలను ఉత్తరకొరియా పదేపదే తిరస్కరించిందని ఈ సందర్భంగా అమెరికా గుర్తు చేసింది. కానీ, ఉత్తరకొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి -
నార్త్ కొరియాలో కరోనా కలకలం.. ఆందోళనలో కిమ్
ఉత్తరకొరియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నార్త్ కొరియాలో కరోనా కేసు నమోదు అయినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చిన కిమ్ ప్రభుత్వం తొలి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు ప్రకటించింది. రాజధాని ప్యాంగ్ యాంగ్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండగా, సదరు వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఒమిక్రాన్ పాజిటివ్ కేసు అని నిర్ధారణ అయిన తర్వాత నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా తొలిసారిగా కిమ్ జోంగ్ ఉన్ మాస్కు ధరించి కనపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన 24 గంటల్లోపే ఆ రోగి చనిపోవడంతోపాటు మరో ఆరు కొత్త కేసులు వచ్చినట్లు శుక్రవారం వెల్లడైంది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇక, నార్త్ కొరియాలో కోవిడ్ టీకాలు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు టీకాలు తీసుకోలేదు. అంతకుముందు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్ తిరస్కరించారు. North Korea claims ‘first ever’ Covid outbreak with hermit kingdom going into lockdown pic.twitter.com/6V7GH30XuB — The Sun (@TheSun) May 13, 2022 ఇది కూడా చదవండి: రణరంగంగా మారిన రావణ లంక.. మంత్రులకు చేదు అనుభవం -
China: చైనాలో మరో వైరస్.. ప్రపంచంలోనే ఫస్ట్
బీజింగ్: కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ చైనాను మరో వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. కాగా, ఇది ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. అయితే, సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్లో నివసిస్తున్న బాలుడు(4) కొద్దిరోజుల క్రితం జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బాలుడికి పరీక్షలు చేయగా అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(NHC) స్పష్టం చేసింది. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయని.. వాటివల్లే H3N8 వేరియంట్ అతనికి సోకిందని చెప్పారు. అయితే, బాధితునితో ఉన్నవారికి ఆ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. దీంతో, చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. మొదటిసారిగా 2002లో H3N8 వైరస్ ఉత్తర అమెరికా వాటర్ఫౌల్లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఈ వైరస్ కేవలం గుర్రాలు, కుక్కలు, సీల్స్కు మాత్రమే సోకుతుందని వైద్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. కానీ, తాజాగా మనుషులకు కూడా ఈ వైరస్ సోకడంతో ఆందోళన నెలకొంది. 🚨 China has recorded the first human infection with the H3N8 strain of bird flu — a four-year-old boy from central Henan province. https://t.co/W8wPNgNzMf — Byron Wan (@Byron_Wan) April 27, 2022 ఇది కూడా చదవండి: నార్త్ కొరియా కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్ -
Covid Cases: దేశంలో కరోనా టెన్షన్..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,927 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 32 మంది మృతిచెందారు. మరో 2,252 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,279 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా నమోదు అయింది. మరోవైపు.. దేశంలో ఇప్పటివరకు 4,30,65,496 కరోనాబారినపడ్డారు. కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 5,23,654 కు చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,88,19,40, 971 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇదిలా ఉండగా.. దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిస్థితి, కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నాం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. COVID-19 | India reports 2,927 fresh cases and 2,252 recoveries, in the last 24 hours. Active cases 16,279 Daily positivity rate (0.58%) pic.twitter.com/bUGouzeoSX — ANI (@ANI) April 27, 2022 ఇది కూడా చదవండి: ఫోర్త్ వేవ్ ముప్పుతప్పదు.. నిపుణుల హెచ్చరిక -
Corona Cases: దేశంలో కరోనా టెన్షన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 30 మంది మృతిచెందారు. 862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,522 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,60,086కు చేరింది. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందారు. 16,522 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇక, రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. India reports 2,541 new COVID19 cases today; Active cases rise to 16,522 The daily positivity rate stands at 0.84% pic.twitter.com/xApkDrfKrK — ANI (@ANI) April 25, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత.. సీఎం, గవర్నర్ సంతాపం -
పాఠశాలల్లో కరోనా కలకలం.. స్కూల్స్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని స్కూల్స్లో కరోనా బీభత్సం సృష్టించింది. ఇప్పటికే కరోనా సోకి 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. శనివారం మరో 14 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీ స్కూల్స్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందుకే వేరే మార్గం లేక పాఠశాలలను మూసివేస్తున్నట్టు చెప్పారు. -
స్కూల్స్లో కరోనా కలకలం. విద్యార్థులు ఇంటికి..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి, టీచర్కు కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం మిగతా విద్యార్థులను స్కూల్ నుండి ఇంటికి పంపించారు. కాగా, ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే 299 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 నుంచి 2.70కు పెరిగింది. తాజాగా కేసులతో కలిపి ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,66,881కి పెరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అతిషి మాట్లాడుతూ.. విద్యార్థి, టీచర్కు పాజిటివ్ అని తేలడంతో మిగతా విద్యార్థులను ఇంటికి పంపినట్టు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఆఫ్లైన్ క్లాసులు జరుగుతున్నాయని అన్నారు. కానీ, పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మళ్లీ ఆందోళన నెలకొందన్నారు. ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు నోయిడా, ఘజియాబాద్లోని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. నోయిడాలోని నాలుగు పాఠశాల్లో 23 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఘజియాబాద్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గత వారం ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ అని తేలడంతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేశారు. ఇది చదవండి: బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల సందర్శనకు ప్రధాని మోదీ -
భారత్లో ఎక్స్ఈ స్ట్రెయిన్ కేసులు.. ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు
XE Covid Variant, సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కనిష్ట స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, పలు దేశాల్లో మాత్రం కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. చైనా, యూకే వంటి దేశాల్లో కరోనా కారణంగా లాక్డౌన్ సైతం విధిస్తున్నారు. తాజాగా భారత్లో ఒమిక్రాన్ ఎక్స్ఈ స్ట్రెయిన్ తొలి కేసు నమోదు కావడం అందరినీ టెన్షన్కు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ఎక్స్ఈ స్ట్రెయిన్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ల పట్ల భయపడాల్సిన అవసరంలేదన్నారు. ఎక్స్ఈ తరహాలో మరిన్ని వేరియంట్లు వస్తాయన్నారు. కానీ, వైరస్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, దేశంలో ఒకేసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో కొత్త వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ కొత్త స్ట్రెయిన్ ఎక్స్ఈ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంతకు ముందు ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ బీఏ.2 వేరియంట్ కంటే ఇది పదిశాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. Omicron giving rise to many new variants. It is of X series like XE & others. These variants will keep on occurring. Nothing to panic about... At the moment from Indian data it doesn’t show a very rapid spread: NK Arora, Chairman, Covid working group NTAGI pic.twitter.com/fu5E3QmdoJ — ANI (@ANI) April 11, 2022 -
ఐదు రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో కేంద్రం కోవిడ్స్ రూల్స్ను తొలగించింది. మరోవైపు, చైనా, యూకే కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కాగా, గత వారం రోజులుగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. దీంతో ఆ ఐదు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కేరళ, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు. ఈ సందర్భంగానే దేశంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ వెయ్యి కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీంతో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్తోపాటు కరోనా మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు. ఐదు రాష్ట్రాలు ఇవే.. - ఢిల్లీలో ముగిసిన వారంలో 826కి పెరిగాయి. పాజిటివిటీ రేటు 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది. - కేరళలో ముగిసిన వారంలో 2,321 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 13.45 శాతం నుంచి 15.33 శాతానికి పెరిగింది. - హర్యానాలో ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో పాజిటివ్ కేసుల సంఖ్య 416కి పెరిగింది. కోవివ్ కేసుల పాజిటివిటీ 0.51 శాతం నుంచి 1.06 శాతానికి పెరిగింది. - మహారాష్ట్రలో ఏప్రిల్ 8తో 794 కేసులు నమోదయ్యాయి. 0.39 శాతం నుంచి 0.43 శాతానికి పాజిటివిటీ పెరిగింది. - మిజోరాంలో వారం వారీ కేసులు 814కి పెరిగాయి. రాష్ట్రంలో పాజిటివిటీ 14.38 శాతం నుంచి 16.48 శాతానికి పెరిగింది. -
కరోనా కేసులు: ఐదువేలకు దిగువన కొత్త కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా దేశంలో 4362 పాటిజిట్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రసుతం దేశవ్యాప్తంగా 54118 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. -
కరోనా అప్డేట్: కొత్తగా మరో 67,597 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 1,80,456 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా, 1,188 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,02,874 మంది కోవిడ్ బారినపడి మరణించారు. ప్రస్తుతం 9,94,891 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 170.21 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు. -
మరో 1,07,474 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1,07,474 కోవిడ్–19 పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే మరో 865 మంది వైరస్ కాటుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,21,88,138కు, మరణాల సంఖ్య 5,01,979కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం... కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 12,25,011కు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 2.90 శాతం ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 95.91 శాతమని ఆరోగ్య శాఖ ప్రకటించింది. -
ఒమిక్రాన్ భారత్: అంతా అయోమయం.. గందరగోళమే!
భారత్లో థర్డ్ వేవ్ను దాదాపుగా ఒమిక్రాన్ వేవ్గా పరిగణిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. శరవేగంగా చొచ్చుకుపోతున్న ఈ వేరియెంట్.. ఎక్కువ మందిలో మైల్డ్ సింటమ్స్ చూపిస్తుండడం గమనార్హం. అదే టైంలో దగ్గు, జలుబు, జ్వరాల లక్షణాలతో తమకు సోకింది కరోనాయేనా? కాదా? అనే గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు కోట్ల మంది!. భారత్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్, తీవ్రత లేని వేరియెంట్ల వల్ల ప్రభావం తక్కువగా ఉందని ప్రభుత్వ వైద్య నిపుణులు పేర్కొంటున్నప్పటికీ.. ఒకవైపు రెండు డోసులు తీసుకున్న వాళ్లపైనా వైరస్ దాడి చేస్తుండడం, మరోవైపు ఆస్ప్రత్రుల్లో, ఐసీయూల్లో చేరుతున్న సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల పేషెంట్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండడం.. కరోనా తీవ్రత ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్ వేరియెంట్ రానున్న రోజుల్లో మరింత విజృంభించనుందనే ప్రకటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే సామాజిక వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ వేరియెంట్.. ముందు ముందు మరింత ప్రభావం చూపెట్టనుందనేది కొందరు టాప్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెప్తున్నా.. ఆస్పత్రుల్లో పేషెంట్లు నిండిపోవడం, పాజిటివిటీ రేటు-మరణాలు పెరగడం, ప్రభుత్వాల తరపున టెస్ట్ల సంఖ్య తగ్గిపోతుండడం, లక్షణాలున్నా జనాలు టెస్టులకు ఆసక్తి చూపించకపోవడం లాంటి కారణాలు ఉంటున్నాయి. కాబట్టి, కరోనా సాధారణం అయిపోయిందన్న వాదనను పక్కనపెట్టి.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ తగ్గినా.. వారం పెరిగింది గత 24 గంటల్లో దేశంలో 3,06,064 కొత్త కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. అంటే సగటు డెయిలీ కేసులు 8 శాతం తగ్గిందని, మరణాలు 439 నమోదు అయ్యాయని, గత ఐదు రోజుల్లో ఇవే తక్కువ మరణాలని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా వారాంతంలో టెస్టులు జరిగేవి తక్కువ. తద్వారా వచ్చే ఫలితాల సంఖ్య కూడా తక్కువే ఉంటోంది. ఈ తరుణంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయంటూ ఆరోగ్య శాఖ ప్రకటన ఆశ్చర్యం కలిగించేదే!. కానీ, వీక్లీ పాజిటివిటీ రేటు గనుక చూసుకుంటే.. భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. కిందటి నెలలో(డిసెంబర్ 2021, 27వ తేదీన) పాజిటివిటీ రేటు 0.63 శాతంగా ఉంది. అది జనవరి 24 నాటికి 17.03 శాతానికి చేరుకుంది. కిందటి వారం మరణాలు 1,396 నమోదుకాగా.. జనవరి 17-23 తేదీల మధ్య 2,680 మరణాలు నమోదు అయ్యాయి. ఇందుకు కారణం.. ఒమిక్రాన్ వేరియెంట్తో ఉధృతంగా పెరుగుతున్న కరోనా కేసులే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్టీపీసీఆర్కు చిక్కకుండా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్లో ‘దొంగ ఒమిక్రాన్’ అనే ఉపరకం ఈ ఆందోళనకు మూలకారణం. ‘బీఏ.2’.. ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్ లకు దొరక్కుండా విస్తరిస్తుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒమిక్రాన్లో బీఏ.1, బీఏ.2, బీఏ.3 ఉపరకాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. ఇందులో బీఏ.1 ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు బీఏ.2 కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వేరియెంట్ విస్తరిస్తున్నా.. బయటపడక పోవడానికి కారణం బీఏ.2 కేసులు.. బీఏ.1 వేరియెంట్ను దాటి పోవడమే కారణంగా భావిస్తున్నారు సైంటిస్టులు. బీఏ.1 మ్యూటేషన్ లో ఎస్ లేదా స్పైక్ జీన్ తొలగిపోవడం అన్నది ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో గుర్తించొచ్చు. కానీ, బీఏ.2 మ్యూటేషన్ భిన్నంగా ఉంది. దీంతో ఇది ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో చాలామందికి ‘పాజిటివ్’ నిర్ధారణ కావడం లేదు. ఫిబ్రవరిలో.. కరోనా తారాస్థాయికి చేరడం గురించి జనవరి మొదటి వారం నుంచే విస్తృతస్థాయిలో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఉధృతి కొనసాగితే.. ఫిబ్రవరి 15 నుంచి భారత్లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టవచ్చని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. కానీ, ఆరోగ్య నిపుణలు మాత్రం రాబోయే వారాలే మరి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సంబంధిత వార్త: సాధారణ జలుబుగానే వచ్చి వెళ్లిపోతోందని ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దు! తలనొప్పి, గొంతులో గరగరా? -
కరోనా థర్డ్ వేవ్.. బయటకి రావ్వొద్దు
-
కలకలం: ఒకే విమానంలో ప్రయాణించిన 125 మందికి కరోనా..
అమృత్సర్: కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధంగా ఉంది. దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందకు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో భారత్లో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు అయినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తూ, రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. గతంలోనూ విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారానే దేశంలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమన్న సంగతి తెలిసింది. అందుకే ఈ సారి బయట దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలోకి వచ్చిన చార్టర్డ్ విమానంలో కరోనా కలకలం రేగింది. గురువారం ఇటలీ నుంచి అమృత్సర్కు చార్టర్డ్ ప్లైట్లో వచ్చిన ప్రయాణికులను పరీక్షల జరుపగా అందులో 125 మందికి కరోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్స్కు పంపారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. పాజిటివ్గా తేలిన ప్రయాణికులను ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కు పంపిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకోర్టులో విచారణ! -
మరో రెండు ఒమిక్రాన్ కేసులు
ముంబై/అహ్మదాబాద్: దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శనివారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్, మహారాష్ట్రలో ఈ కేసులు బయటపడ్డాయి. ‘వైరస్ ముప్పు’ దేశాల జాబితాలో ఉన్న జింబాబ్వే నుంచి గుజరాత్లోని జామ్నగర్కి వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడికి ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్టుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులొచ్చాయి. జింబాబ్వే నుంచి గుజరాత్కి ఆ వృద్ధుడు నవంబర్ 28న వచ్చారు. డిసెంబర్ 2న అతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణమైంది. ఆ తర్వాత శాంపిళ్లని జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా ఒమిక్రాన్ వేరియెంట్గా తేలిందని జామ్నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్ చెప్పారు. మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల వయసున్న వ్యక్తి నవంబర్ చివర్లో దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీకి వచ్చారు. ఆపై ముంబై విమానాశ్రయంలో దిగిన అతనిలో జ్వరంగా కనిపించింది. అతను ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదు. అతనిని కరోనా సోకినట్లు వెల్లడికావడంతో ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. జన్యుక్రమ విశ్లేషణలో అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియెంటేనని తేలింది. ఆ ప్రయాణికులు ఎక్కడ? న్యూఢిల్లీ: ఒకవైపు ఒమిక్రాన్ వేరియెంట్ అందరి గుండెల్లో దడ పెంచుతూ ఉంటే అత్యంత ముప్పు కలిగిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల నుంచి అధికారుల కళ్లు గప్పి పారిపోవడం అధికారుల్లో టెన్షన్ పెంచుతోంది. వారిలో ఎంతమందికి ఇప్పటికే కరోనా సోకి ఉంటుందన్న ఆందోళనతో అధికారులు వారి కోసం వేట మొదలు పెట్టారు. ఆ మిస్సింగ్ కేసులు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గుదిబండగా మారాయి. విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్లోని మీరట్కి వచ్చిన ప్రయాణికులు 300 మందిలో దాదాపుగా 13 మంది అధికారుల కళ్లు గప్పి పారిపోవడమే కాదు, తప్పుడు చిరునామాలు, కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడం అధికారులకి తలకాయ నొప్పిగా మారింది. ఈ 13 మందిలో ఏడుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. వారిని కనిపెట్టి పరీక్షలు నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. n దక్షిణాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన 10 మంది ప్రయాణికులు కనిపించకుండా పోవడం ఆందోళన పుట్టిస్తోంది. విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ వాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోకుండా వెళ్లిపోయారని కర్ణాటక రెవిన్యూశాఖ మంత్రి ఆర్. అశోక్ చెప్పారు. -
541 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 8,318 కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసులు 3,45,63,749కు చేరుకున్నట్లు కేంద్రం శనివారం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసులు 3,114 తగ్గడంతో మొత్తం యాక్టివ్ కేసులు 541 రోజుల తర్వాత అత్యల్పంగా 1,07,019గా నమోదైనట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో మరో 465 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 4,67,933కు పెరిగాయని తెలిపింది. రికవరీ రేటు 98.34%గా ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకు 121.06 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్లు వేసినట్లు తెలిపింది. -
మరో 14,348 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157కు చేరుకుంది. ప్రస్తుతం 1,61,334 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. కరోనా వల్ల మరో 805 మంది మృతిచెందారు. దీంతో కరోనా సంబంధిత మరణాల సంఖ్య 4,57,191కు ఎగబాకింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.47 శాతం ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.19 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా 3,36,27,632 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. -
రష్యాలో కరోనా విస్ఫోటం.. ఒక్క రోజులోనే..
మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం ఒక్కరోజే 40,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,159 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో రోజువారీ కేసులు, మరణాల్లో ఇప్పటిదాకా ఇవే అత్యధికం. వైరస్ ఉధృతిని అరికట్టడానికి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని మాస్కోలో గురువారం నుంచి నాన్ వర్కింగ్ పీరియడ్ (అత్యవసర విధుల్లో ఉన్నవారు మినహాయించి ఇతర ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాకూడదు) ప్రారంభమయ్యింది. రష్యాలో కరోనాతో ఇప్పటిదాకా 2,35,057 మంది మృతిచెందారు. ఒకవైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్నా మరోవైపు జనం నిర్లక్ష్యం వీడడం లేదు. రష్యా నుంచి ఈజిఫ్టు, టర్కీకి ప్యాకేజీ టూర్ల సంఖ్య భారీగా పెరిగింది. రష్యాలో 14.6 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటిదాకా4.9 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు. (చదవండి: సెనోలిటిక్స్.. వయసుపై యుద్ధం!) -
కరోనా కొత్త కేసులు 14,146
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 229 రోజుల కనిష్టానికి పడిపోవడం ఊరట కలిగిస్తోంది. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 3,40,67,719కు చేరుకుంది. శనివారం 11 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 14,146 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఇక కరోనా యాక్టివ్ కేసులు రెండు లక్షలకు దిగువకి తగ్గిపోయాయి. ప్రస్తుతం 1,95,846 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 220 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఇప్పుడేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఒక్క రోజులోనే యాక్టివ్ కేసులు 5,786 తగ్గాయి. మొత్తం కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.57 శాతం ఉన్నాయి. ఇక కోవిడ్ రికవరీ రేటు 98.10 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా బారినపడి మరో 144 మంది మరణించారు. దీంతో మొత్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 4.52,124కి చేరుకుంది. కోవిడ్ టీకా డోసుల పంపిణీ వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. శనివారం ఒక్కరోజే 41,20,772 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 97 కోట్లను దాటేసింది. కరోనా మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.50 వేల సాయం లక్నో: కోవిడ్–19 మహమ్మారి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సాయం అందించే విషయంలో సమగ్రమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. కరోనా ఆర్థిక సాయం పంపిణీకి జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జిల్లాల్లో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. -
శుభ పరిణామం.. 200 రోజుల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో..
-
జైల్లో కరోనా కల్లోలం: 6 మంది పిల్లలతో సహా 39 మందికి పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసుల నమోదు తక్కువగా ఉందని ఉపశమనం పొందుతున్న వేళ జైల్లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఓ జైలులో ఆరుగురు చిన్నారులతో సహా 39 మంది మహిళా ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో పది రోజుల కిందట ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా మాత్రం శనివారం తెలిపారు. కరోనా బారినపడిన 39 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పాజిటివ్ తేలిన అనంతరం వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అయితే వారిలో ఓ గర్భిణి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 120 మంది ఖైదీలు, సిబ్బంది కరోనా బారినపడినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. -
ఏపీలో కొత్తగా 1,246 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 55,323 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,44,490కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 14,118కి పెరిగింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం బులెటిన్ను విడుదల చేసింది. వైరస్ నుంచి 1,450 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,535 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 20,16,837 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 14, 118 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 2,79,80,792 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. చదవండి: భారత్లో కొత్త వేరియంట్పై ఆధారాల్లేవు -
భారత్లో మరో 30వేల కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 431 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,33,47,325కు పెరిగింది. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,43,928కు చేరుకుందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,42,923కు తగ్గింది. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 97.64 శాతానికి పెరిగింది. ఇప్పటిదాకా దేశంలో 3,25,60,474 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.33 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా మరో 15,79,761 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటిదాకా 54,77,01,729 కరోనా టెస్ట్లు పూర్తిచేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.94 శాతంగా నమోదైంది. గత 17 రోజులుగా ఈ రేటు మూడు శాతం కంటే తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. వారపు పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. -
రెండో దశలో సరికొత్త రికార్డ్: కరోనాపై ఢిల్లీ విజయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా రెండోసారి విజృంభణ అల్లకల్లోలం రేపింది. ఢిల్లీని చలికన్నా తీవ్రంగా గజగజ వణికించింది. ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కరోనా రహితం వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఈ కరోనా విషయంలో ఢిల్లీ రికార్డు సృష్టించింది. ఒక్కటంటే ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. తాజాగా శనివారం ప్రకటించిన కరోనా బులెటిన్లో ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పైగా పాజిటివ్ కేసుల నమోదు పదుల సంఖ్యకు చేరడం హర్షించే విషయం. పాజిటివిటీ శాతం ఏకంగా సున్నాకు పరిమితమైంది. ఆ విషయాలు ఇలా ఉన్నాయి. చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో’? వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం తాజా బులెటిన్లో గడిచిన 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. ఇక కరోనా మృతులు సున్నా. రెండో దశ ప్రారంభమైన తర్వాత ఇప్పుడే అతి తక్కువ కేసులు నమోదవుతున్నారు. మరణాలు లేకపోవడం ఇది తొలిసారి. ఇక పాజిటివిటీ 0.05 శాతంగా ఉంది. ఏకంగా 74,540 కరోనా టెస్టులు చేయగా వాటిలో నమోదైన అతి తక్కువ కేసులు ఇవే. బుధవారం 41 నమోదయ్యాయి. ఆగస్టు 30వ తేదీన కేసులు కేవలం 20 నమోదయ్యాయి. ఢిల్లీలో మొత్తంగా 14.12 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? -
ఏపీలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మృతుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,608 పాజిటివ్ కేసులు నమోదవగా ఆరుగురు మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో 67,911 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. వైరస్ నుంచి 1,107 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 19,98,561 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్కు ఇంజెక్షన్ -
కరోనాపై కేంద్రం కీలక ప్రకటన: సెకండ్ వేవ్ ఇంకా పోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది. ఉత్సవాలు, పర్వదిన వేడుకల్లో జాగ్రత్తలు పాటిస్తూ చూసుకోవాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిని వివరించారు. గతవారంతో పోలిస్తే కేరళలో 68శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు.. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కరోనా జాగ్రత్తలు ఇంకా పాటించాలని పండుగలు, ఉత్సవాలు అంటూ గుమికూడొద్దని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. చదవండి: పెళ్లి చేసుకోవాల్సిన వీరు ఏం చేస్తున్నారో తెలుసా? ముఖ్యంగా కేరళలో కరోనా విజృంభణపై రాజేశ్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోందని గుర్తుచేశారు. ఇది ఇంకా ముగిసిపోలేదని ప్రకటించారు. కాగా దేశంలో కరోనా కేసుల వివరాలు వెల్లడించారు. 24 గంటల్లో 43,263 కొత్తగా కేసులు నమోదయ్యాయని, 338 మంది మృతి చెందారని తెలిపారు. అయితే ఆ కేసుల్లో ఒక్క కేరళలోనే 30,196 పాజిటివ్ కేసులు, 181 మృతులు సంభవించాయని వివరించారు. -
దేశంలో స్థిరంగా కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కరోనా కేసులు సంఖ్య 3,99,778 కు చేరింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 366 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,39,895కు చేరింది. కేరళ రాష్ట్రంలో గురువారం 32,097 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 188 మంది మరణించారు. గత 24 గంటల్లో 34,791 మంది కరోనా నుంచి రికవరీ కాగా , మొత్తం రికవరీల సంఖ్య 3,20,63,616 కి పెరిగింది. రికవరీ రేటు 97.45% శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.72% శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 81.09 లక్షల టీకాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటిదాకా 67.09 కోట్ల టీకాలు ఇవ్వడం పూర్తయింది. చదవండి: మౌనిక ఆత్మహత్య కేసు: ఫోరెన్సిక్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు -
రెండు నెలల గరిష్ట స్థాయికి కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ నెమ్మదిగా పెరుగుతోంది. గత రెండు నెలల్లో ఎప్పుడూ నమోదుకానంతటి స్థాయిలో గురువారం ఒక్క రోజే 47,092 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. కేరళ రాష్ట్రంలో గురువారం 32,097 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 188 మంది మరణించారు.మరో 509 మంది కోవిడ్తో మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,39,529కు పెరిగింది. రికవరీ రేటు 97.48 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.8 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 81.09 లక్షల టీకాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటిదాకా 66.30 కోట్ల టీకాలు ఇవ్వడం పూర్తయింది. అర్హుల్లో సగం మందికిపైగా టీకా కరోనా టీకా తీసుకోవడానికి అర్హులైన వారిలో 54 శాతం మందికి కనీసం ఒక డోస్ టీకా ఇచ్చామని కేంద్రం వెల్లడించింది. అర్హులైన జనాభాలో 16 శాతం మందికి రెండు డోస్లు ఇచ్చినట్లు పేర్కొంది. సిక్కిం, దాద్రా, నగర్ హవేలీ, హిమాచల్లో యుక్తవయసు వారందరికీ కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చెప్పారు. ఆగస్ట్ నెల చివరి ఏడు రోజుల్లో సగటున రోజుకు 80.27 లక్షల టీకాలు ఇచ్చామన్నారు. దేశంలోని మొత్తం హెల్త్కేర్ వర్కర్లలో 99 శాతం మందికి ఒక టీకా, 84 శాతం మందికి రెండు డోస్లు ఇచ్చారు. -
ఐదు కంటే ఎక్కువ కేసులొస్తే స్కూలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఒక బడిలో ఐదు కరోనా కేసులు నమోదైతే, దాన్ని ఒక క్లస్టర్గా తీసుకొని కట్టడి చర్యలు చేపడతామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఐదు కంటే ఎక్కువగా కేసులు నమోదైతే ఆ పాఠశాలను నిర్ణీత సమయం వరకు మూసివేస్తారని చెప్పారు. వైరస్ సోకిన విద్యార్థులతో ఎంతమంది సన్నిహితంగా ఉన్నారనేది గమనించి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వ్యాక్సిన్ తీసుకున్న టీచర్లకే అనుమతి పిల్లల్ని పాఠశాలలకు పంపించడంపై ఇప్పటికీ కొందరు తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఉన్నా యి. కానీ ఆందోళన వద్దు. పిల్లలపై కరోనా ప్రభా వం తక్కువ. కాబట్టి నిరభ్యంతరంగా పాఠశాల లకు పంపించండి. ప్రత్యక్ష బోధన ద్వారా మాత్రమే విద్యకు సార్ధకత చేకూరుతుంది. అందరూ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చు. మరో కొత్త రకం, మరింత ఎక్కువ ప్రమాదకరమైంది వస్తే తప్ప మూడోదశ ఉధృతి రాదు. బోధన, బోధనేతర సిబ్బందిలో 95 శాతం మందికి ఇప్పటికే టీకాలు అందించాం. కాబట్టి వీరి నుంచి వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. మిగతావారిని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే బడిలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా ఎవ్వరూ మాస్కు ధరించకుండా తరగతి గదిలోకి ప్రవేశించకూడదు. లక్షణాలు కన్పించిన వెంటనే టెస్టు చేయించాలి లక్షణాలు కనిపించిన పిల్లలను పాఠశాలలు వెంటనే తల్లిదండ్రుల వద్దకు పంపించాలి. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేలా చూడాలని ఆదేశాలిచ్చాం. ఒకవేళ ఒక విద్యార్థిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ విద్యార్థిని వేరే గదిలో కూర్చో బెట్టాలి. మిగతావారిని పరిశీలనలో ఉంచాలి. ఒకవేళ ఇంటి వద్ద లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు పాఠశాలకు పంపొద్దు. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించాలి. బడి నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్ను విడిగా ఉంచాలి. చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయించాలి. పిల్లలు ఇంటికే పరిమితమై ఉండటం లేదు రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉందనుకుంటే, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సుమారు 60 లక్షల మంది వరకు ఉన్నారు. తరగతులు జరగక పోవడం వల్ల స్కూలుకు రాకపోయినా వీరంతా ఇంటికే పరిమితమై లేరు. ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు తిరుగుతూనే ఉన్నారు. పండుగలు జరుపుకుంటున్నారు. ఐసీఎంఆర్ సీరో సర్వే ప్రకారం పెద్దల్లో ఇప్పటికే 63 శాతం మంది కరోనా బారినపడ్డారు. పిల్లల్లోనూ 50 శాతానికి పైగా వారికి తెలియకుండానే ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మొహర్రం, బోనాలు వంటి పండుగలు ప్రజలు జరుపుకున్నారు. శుభ కార్యాలకు వందల సంఖ్యలో హాజరవుతున్నారు. కానీ ఎక్కడ కూడా భారీగా ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగలేదు. అందువల్ల తల్లిదండ్రులు భయపడనక్కర్లేదు. అన్నీ పరిశీలించి, జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పాఠశాలలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధం ఐసీఎంఆర్, ఇతర సంస్థలు అక్టోబర్లో థర్డ్వేవ్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతు న్నాయి. కానీ అక్టోబర్లో కచ్చితంగా థర్డ్వేవ్ ఉధృతి వస్తుంద నడానికి ఎక్కడా శాస్త్రీయ ఆధారాల్లేవు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవ డానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో ప్రస్తుతం కోవిడ్ పూర్తిగా అదుపులోనే ఉంది. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ శుభ కార్యాలు, పండుగలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసి దాదాపు రెండున్నర నెలలు దాటుతోంది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, మరణాల రేటు అత్యల్పంగానే నమోదవు తున్నాయి. పిల్లలకు సోకినా త్వరగా కోలుకుం టున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. పిల్లల్లో ఒక ఏడాది నుంచి పదేళ్ల వరకు కరోనాకు గురైనవారు 3 శాతం మంది మాత్రమే. 10–20 ఏళ్ల వారిని తీసుకుంటే 10% మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా 20 ఏళ్లలోపు వారు 13%, 20–60 ఏళ్ల మధ్య వయస్కులు అధికంగా 73% కరోనా బారినపడ్డారు. పిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్రత చాలా తక్కువగా ఉండి త్వరగా కోలుకుంటున్నారు. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా చాలా స్వల్పంగా ఏర్పడింది. మరణాలైతే అస్సలే నమోదు కాలేదు. 1.80 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం... రాష్ట్రంలో ఇప్పటివరకు 1.80 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం. వచ్చే 15–20 రోజుల్లోనే ఈ సంఖ్య 2 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటికే 95 శాతం మందికి టీకాలు ఇచ్చాం. 60 శాతం కాలనీల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాం. దసరా నాటికి రాష్ట్రంలో అర్హులైన అందరికీ తొలిడోసు ఇచ్చేలా ప్రణాళిక రచించాం. సినిమాకెళ్లాలంటే టీకా తప్పనిసరి కానుంది పిల్లలకు సంబంధించి ఇప్పటికే జైడస్ క్యాడిలా టీకాను అనుమతించారు. 12 ఏళ్ల పైబడిన వారికి దీన్ని ఇస్తారు. ఇది ఈ నెలలో అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్తులో రెండేళ్లు పైబడిన వారి కోసం భారత్ బయోటెక్స్ రూపొందిస్తున్న టీకా అక్టోబర్/ నవంబర్ నుంచి అందుబాటులోకి రావచ్చు. ఇతర దేశాల నుంచి ఇంకా అనేక రకాల వ్యాక్సి న్లు కూడా మన దగ్గరకు వస్తాయి. మాల్స్, సినిమా టాకీసులకు వెళ్లాలంటే టీకాలు పొంది ఉండాలనే నిబంధన త్వరలోనే రానుంది. -
ఏపీలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా మూడో వేవ్ వస్తోందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరోనా నియంత్రణలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలుండగా అందులో 10 జిల్లాల్లో 3 శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తేలింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే 5.74 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. కొన్ని జిల్లాల్లో అయితే ఒకటి కంటే తక్కువకు పాజిటివిటీ రేటు పడిపోయింది. గడిచిన వారం రోజుల్లో అంటే ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4.68 లక్షల టెస్టులు చేయగా, 2.43 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని అధికారులు వెల్లడిస్తున్నారు. పెద్ద జిల్లాల్లో ఒకటైన కర్నూలులో పాజిటివిటీ రేటు కేవలం 0.26 శాతంగా నమోదైంది. ఏ జిల్లాలోనూ అసాధారణంగా పాజిటివ్ కేసులు పెరిగిన దాఖలాలు లేవు. గడిచిన కొద్ది వారాలుగా క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. మాస్కులు విధిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం వంటి మూడు పనులు చేస్తే పూర్తిస్థాయిలో కరోనాను నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. -
36,083 కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ: భారత్లో ఆదివారం 36,083 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,21,92,576కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,85,336కు పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.20 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 493 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,31,225కు చేరుకుంది. శనివారం 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 1.88గా నమోదైంది. దేశంలో నేటికి 49,36,24,440 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.46గా ఉంది. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కొత్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 54.38 కోట్ల డోసుల టీకాలు వేశారు. -
శాంతిస్తున్న కరోనా: దేశంలో భారీగా తగ్గిన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కేసుల నమోదు సంఖ్య తగ్గుతున్నా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడడంతో లేదు. తాజాగా 30 వేలకు దిగువగా కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 373 మంది వైరస్తో బాధపడుతూ మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 3,88,508 ఉండగా కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం 97.45 శాతంగా ఉంది. అయితే మరణాల సంఖ్య అదేస్థాయిలో ఉంది. తాజాగా 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే 54,91,647 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 51.45 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. -
46 జిల్లాల్లో మళ్లీ కరోనా ఉధృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 10 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఉధృతమవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో గత కొన్ని వారాలుగా కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతోందని వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఆయా జిల్లాల్లో ఆంక్షలను కఠినతరం చేయాలని, జనం గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సామూహిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని సూచించింది. మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్య నమోదవుతోందని పేర్కొంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు తెలియజేసింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో నిర్లక్ష్యం వీడకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 80 శాతానికి పైగా ఐసోలేషన్లోనే.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా 10 రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రాలు కోవిడ్ కేసుల్లో పెరుగుదలను లేదా పాజిటివిటీ పెరుగుదలను రిపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నియంత్రణ చర్యల గురించి చర్చించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీ, వెంటిలేటర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల అందుబాటుపై సమీక్షించారు. ఈ 10 రాష్ట్రాల్లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు. 10 రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా కరోనా బాధితులు హోం ఐసోలేషన్లో ఉంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఒకవేళ బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించి, ఆసుపత్రుల్లో చేర్చి వైద్య సేవలందించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే అధికారులు అందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించండి కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. కరోనా వ్యాక్సినేషన్ను సంతృప్తికర స్థాయిలో నిర్వహించడం ద్వారా ఆయా జిల్లాల్లో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని వివరించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలివ్వాలని తెలిపింది. జిల్లాల వారీగా సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ల ఉనికిని గుర్తించేందుకు ఇన్సకాగ్ (ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం) ల్యాబ్ నెట్వర్క్ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. వ్యాక్సినేషన్లో వయోధికులకు ప్రాధాన్యం: ఐసీఎంఆర్ కొత్తగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో 80 శాతం మంది 45–60 ఏళ్లలోపు వారేనని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. సామూహిక వేడుకలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు హితవు పలికారు. ప్యాకేజీ నుంచి రాష్ట్రాలకు రూ.1,827 కోట్లు విడుదల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుర్చడానికి కేంద్ర సర్కారు కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్(ఈసీఆర్పీ–2) పేరిట ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజీ కింద రూ.12,185 కోట్లు కేటాయించింది. తాజాగా ఇందులో 15 శాతం.. అంటే రూ.1,827.8 కోట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.281.98 కోట్లు, బిహార్కు రూ.154 కోట్లు, రాజస్తాన్కు రూ.132 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.131 కోట్లు ఇచ్చారు. -
అదుపు తప్పిన కరోనా: మళ్లీ సంపూర్ణ లాక్డౌన్
తిరువనంతపురం: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మళ్లీ తీవ్రమవుతోంది. ఇప్పటికే దేశంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళలో కూడా ఆ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి మళ్లీ లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో క్రమేణ కేసులు పెరుగుతుండడంతో భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించనుంది. బక్రీద్ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు ఆంక్షలను ఎత్తివేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కేసులు పెరుగుతుండడంతో ఈనెల 25-26వ తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఆ రెండు రోజుల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించనుంది. మూడు లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు రోజులు తీవ్ర ఆంక్షలపై నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిపై సీఎం పినరయి విజయన్ పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 17,481 కేసులు నిర్ధారణ అయ్యాయి. 105 కరోనా మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 11.97 శాతంగా ఉంది. 1,29,640 పాజిటివ్ కేసులు ఉండడం చూస్తుంటే ఆ రాష్ట్రంలో ఇంకా కరోనా విజృంభణ అదుపులోకి రానట్టు తెలుస్తోంది. -
దేశంలో పెరిగిన కరోనా కేసులు.. ఒకే రోజు 3,998 మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో గడిచిన 24 గంటల్లో 42,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,12,16,337కు చేరింది. దేశంలో కొత్తగా 3,998 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా.. ఇప్పటివరకు 4,18,480మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,07,170 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనానుంచి ఇప్పటివరకు 3,03,90,687మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 41,54,72,455 మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో గడిచిన 24 గంటల్లో 38,164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,11,44,229కు చేరింది. దేశంలో కొత్తగా 499 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా.. ఇప్పటివరకు 4,14,108మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,21,665 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనానుంచి ఇప్పటివరకు 3,03,08,456మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 40.64 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
కేరళ: జికా కలకలం.. కొత్తగా మరో 5 కేసులు
తిరువనంతపురం : కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కొత్తగా మరో ఐదు జికా కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. తాజాగా జికా బారిన పడిన వారిలో అనయారాకు చెందిన ఇద్దరు.. కున్నుకుళి, పొట్టాం, ఈస్ట్పోర్టుకు ఒక్కోరి చొప్పున ఉన్నారు. అధికారులు అనయారా ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో జికా వైరస్ క్లస్టర్ను గుర్తించారు. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ మాట్లాడుతూ.. ‘‘ తిరువనంతపురంలోని ఇతర ప్రాంతాల్లో దోమల నివారణకోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాము. ప్రజలు ఇళ్లలో కానీ, చుట్టప్రక్కల కానీ, నీటిని నిల్వ ఉండనీయకండి. తద్వారా కేవలం జికా మాత్రమే కాదు దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర ప్రమాదకర వ్యాధుల నివారణ కూడా సాధ్యపడుతుంది’’ అని అన్నారు. కాగా, జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలెర్ట్ ప్రకటించింది. జికా వైరస్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది. -
ఎవరి పతకం వారే...
టోక్యో: కరోనా కాలంలో పాత కాలం నాటి నిబంధనలుండవ్! మారతాయి లేదంటే మహమ్మారి మార్చేస్తుంది. సరిగ్గా అలాంటిదే టోక్యో ఒలింపిక్స్లో జరుగనుంది. పతకాల ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా, అతిరథుల చేతుల మీదుగా జరగదు. ఫీల్డులో గెలిచిన వారే పోడియంపైకి వచ్చి వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరి పతకాన్ని వారే ఓ ఆభరణంగా ధరిస్తారు అంతే! వైరస్ సంక్రమణాన్ని నిరోధించడంలో భాగంగా పతకాల తంతును అలా ముగించనున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. ఒక ప్లేట్లో పతకాలు పోడియం దగ్గరకు తీసుకొస్తారు. ఎవరేం గెలిచారో (స్వర్ణ, రజత, కాంస్యం) వాళ్లే స్వీయ పతకధారణ చేసుకోవాలి. ఇంకా వేదిక వద్దగానీ, పోటీల దగ్గర కానీ కరచాలనం, భుజం తట్టి ప్రోత్సహించడం (వెల్డన్)లాంటివి ఈ క్రీడల్లో నిషిద్ధం. కలకలం రేపుతున్న కేసులు... అంతా బాగుందిలే... ఇక వేడుకలే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో బుధవారం నాటి కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క టోక్యోలోనే 1,149 మంది కరోనా పాజిటివ్గా తేలారు. గత ఆరు నెలల కాలంలో ఇదే అత్యధికమని టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ కోవిడ్ కేసుల పెరుగుదల జపాన్ ప్రభుత్వాన్ని, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), గేమ్స్ నిర్వాహక కమిటీలను కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. టోక్యోలో జనవరి 22న 1,184 మంది కోవిడ్ బారిన పడగా ఆ తర్వాత ఎప్పుడూ ఆ స్థాయికి రానేలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ ప్రొటోకాల్ను మరింత కఠినంగా అమలు చేయాలని ఐఓసీ, జపాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజా వారి చేతుల మీదుగా... టోక్యో విశ్వక్రీడలను జపాన్ రాజు ప్రారంభిస్తారని గేమ్స్ నిర్వాహక కమిటీ వర్గాలు తెలిపాయి. జపాన్ చక్రవర్తి నరుహితో 23న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలు ఆరంభమయినట్లు అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. 61 ఏళ్ల రాజు నరుహితో టోక్యో ఒలింపిక్స్కు ప్యాట్రన్గా ఉన్నారు. వేడుకల్లో భాగంగా ఇంపీరియల్ ప్యాలెస్లో విదేశీ వీఐపీలతో భేటీ అవుతారని అక్కడి వర్గాలు తెలిపాయి. గతంలో జపాన్ ఆతిథ్యమిచ్చిన మెగా ఈవెంట్లను ఈ రాజు కుటుంబీకులే ఆరంభించారు. 1998 వింటర్ ఒలింపిక్స్ను ఆయన తండ్రి అకిహితో ప్రారంభించగా, 1964 సమ్మర్ ఒలింపిక్స్, 1972 వింటర్ ఒలింపిక్స్లను తాత... హిరోహితో రాజదర్పంతో ఆరంభించారు. చైనా జంబో సేన... బీజింగ్: విశ్వ క్రీడలకు చైనా జంబో సేన బయల్దేరనుంది. 431 మంది క్రీడాకారులతో సహా 777 మందితో కూడా చైనా బృందం టోక్యోలో అడుగుపెట్టనుంది. ఇందులో 133 మంది పురుష అథ్లెట్లు అయితే రెట్టింపునకు మించి 298 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. 14 ఏళ్ల డైవింగ్ క్రీడాకారిణి క్వాన్ హాంగ్చన్ నుంచి 52 ఏళ్ల ఈక్వెస్ట్రియన్ రైడర్ లి జెన్కియాంగ్ వరకు చైనా జట్టులో ఉన్నారు. చైనా వెలుపల జరిగే ఒలింపిక్స్లో పాల్గొనే అతిపెద్ద చైనా బృందం ఇదే! బీజింగ్(2008)లో 639 మంది అథ్లెట్లు సహా 1099 మంది పాల్గొన్నారు. చీర్4ఇండియా... న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందాన్ని ఉత్సాహపరిచే పాటను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం విడుదల చేశాడు. ‘చీర్4ఇండియా’ పేరుతో ఈ పాట భారతీయ శ్రోతలను అలరించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఈ ప్రత్యేక పాటకు సంగీతం అందించగా... యువ గాయని అనన్య బిర్లా ఆలపించారు. అధికారిక పాట విడుదల సందర్భంగా మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ అందరూ ఈ పాటను వినాలని, తమ వారికి షేర్ చేయాలని అలా యావత్ భారత్ ఈ పాట ద్వారా తమ వాణి వినిపించాలని, భారత బృందానికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా నేపథ్యంలో భారత క్రీడాకారుల సన్నాహాలకు ఎదురైన ఇబ్బందులు, అధిగమించిన తీరు ప్రతిబింబించే విధంగా ఈ పాట ఉందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రా చెప్పారు. ముగ్గురు కాదు ఆరుగురితో ప్రతిజ్ఞ... ఆనవాయితీగా వేడుకల ప్రారంభోత్సవంలో ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను రెట్టింపు చేశారు. సాధారణంగా ముగ్గురితో జరిపే ఈ లాంఛనాన్ని ఈసారి ఆరుగురితో నిర్వహిస్తారు. లింగ సమానత్వంలో భాగంగా ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను పెంచినట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. అంటే ముగ్గురు చొప్పున మహిళలు, పురుషులు ప్రతిజ్ఞలో పాల్గొంటారు. -
తెలంగాణలో కరోనా తగ్గుముఖం: అతి స్వల్ప కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2 కోట్లకు చేరువైంది. సోమవారం సాయంత్రానికి 1,98,65,968 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర జనాభాతో పోలిస్తే పరీక్షల సంఖ్య 53.37 శాతంగా ఉన్నట్లు తెలిపింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,05,797 నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇందులో 696 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. తాజా కేసులు కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు 6,32,379 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 6,18,496 మంది కోలుకున్నారని తెలిపింది. కాగా, కరోనాతో సోమవారం ఒక్కరోజు ఆరుగురు మరణించగా, ఇప్పటివరకు 3,735 మంది మృత్యువాత పడ్డట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం చేసిన నిర్ధారణ పరీక్షల్లో ప్రభుత్వ కేంద్రాల్లో 1,02,580, ప్రైవేటు కేంద్రాల్లో 3,217 పరీక్షలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్-19 రిస్క్ రేటు 0.59 శాతం, రికవరీ రేటు 97.8 శాతంగా ఉంది. -
Corona: 45,892 కేసులు.. 817 మరణాలు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి 50 వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 45,892 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నిన్న కరోనాతో 817 మంది మృత్యువాత పడ్డారు. బధవారం నాడు 44,291 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4.60,704 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశంలో 3,07,09,557 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 4,05,028 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,98,43,825 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 36.48 కోట్లకుపైగా టీకా తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే 33,81,671 వ్యాక్సిన్ వేయించుకున్నారు. -
Covid: 43 వేల కేసులు.. 930 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల్లో, మరణాల్లో కొద్దిగా పెరుగుదల కనిపిస్దోంది. గడిచిన 24 గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్తో 930 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే 47,240 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,,59,920.యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,06,63,655కు పెరిగాయి. ఇప్పటి వరకు 4,04,211 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 2,98 కోట్ల మంది కోలుకున్నారు. మంగళవారం నాడు 16,47,424 మంది పరీక్షలు చేసుకున్నారు. ఇప్పటి వరకు 42,14,24,881 మందికి టెస్టులు చేశారు. ప్రస్తుతం రికవరీరేటు 97.17కు పెరిగింది. -
కరోనా: గత 3 నెలల్లో ఇదే తొలిసారి.. 723 మరణాలు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 39, 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్తో 723 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ అందించిన సమాచారం మేరకు గత మూడు నెలల్లో ఇంత తక్కువలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజే 42,352 మంది కోలుకున్నారు ప్రస్తుతం 4,82,071 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,05,85,229కు పెరిగాయి. ఇప్పటి వరకు 4,02,728 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 2,97,00,430 మంది కోలుకున్నారు. ఆదివారం నాడు 15,22,504 మంది పరీక్షలు చేసుకున్నారు. ప్రస్తుతం రికవరీరేటు 97.11గా ఉంది. -
తెలంగాణలో కొత్తగా 1,088 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1,511 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 5,98,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 16,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: కోవిడ్తో మరణించిన జర్నలిస్టులకు రూ.2 లక్షలు అవును .. వాళ్లు చనిపోయింది నిజమే -
రాష్ట్రంలో స్థిరంగా తగ్గుముఖం పడుతున్న కేసులు, మరణాలు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 88,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,981 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,490 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,464 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 04 వేల 844 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 49,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,14,49,636 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: జగనన్న కాలనీల్లో ‘పవర్’ఫుల్ లైన్లు -
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 80,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,684 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 36 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12452 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 7,324 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 95 వేల 485 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 51,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,13,61,014 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి:మెగాస్టార్ చిరంజీవి ట్వీట్కు స్పందించిన సీఎం జగన్ -
సెకండ్ వేవ్ ముగిసినట్లేనా?
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటులో భారత్ ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో వరుసగా 14వ రోజు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువే నమోదయ్యింది. అంటే ప్రతి 100 టెస్టుల్లో 5 శాతంలోపే పాజిటివ్గా తేలుతున్నాయి. వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే, పరిస్థితి ఆశాజనంగా మారినట్లు ఇప్పుడే నిర్ణయానికి రావొద్దని సైంటిస్టులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాలో కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని, జాగ్రత్తలు కొనసాగించక తప్పదని సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా గణాంకాలను నమ్మలేమని అంటున్నారు. ఇంకా సమయం ఉంది ‘సెకండ్ వేవ్ ముగింపు ఇప్పుడే కాదు. డెల్టా ప్లస్ లాంటి వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఈ వేవ్ అంతం కావడానికి ఇంకా సమయం ఉంది’ అని ఢిల్లీలోని శివనాడార్ వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ నాగసురేష్ వీరపు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫస్టు వేవ్ ముగిసిందన్న భావనతో జనం నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇంతలోనే సెకండ్ వేవ్ విరుచుకుపడిందని గుర్తుచేశారు. ఫస్ట్వేవ్లో పాజిటివిటీ రేటు ఒక శాతంగా ఉన్నప్పుడు సెకండ్ వేవ్ మొదలైందన్నారు. కేసుల సంఖ్య తగ్గింది అంటే సెకండ్ వేవ్ ముగిసినట్లు కాదని చెప్పారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కరోనా బాధితులు కొందరు పరీక్షలు చేయించుకోవడం లేదని గుర్తుచేశారు. రోజువారీ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తుండడానికి ఇది కూడా ఒక కారణమని పేర్కొన్నారు. దేశమంతటా పాజిటివిటీ రేటు తగ్గితేనే.. దేశంలో కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే అధికంగా ఉందని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణుడు చంద్రకాంత్ లహరియా తెలిపారు. రోజువారీ పాజిటివ్ కేసులు అధికంగా∙నమోదవుతున్నాయన్నారు. దేశమంతటా అన్ని ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తగ్గేదాకా వేచిచూడాలని, ఇది రెండు వారాల కంటే ఎక్కువ రోజులు కొనసాగితేనే సెకండ్ వేవ్ అంతమవుతున్నట్లు గుర్తించాలన్నారు. కేరళలో ఆదివారం పాజిటివిటీ రేటు 10.84 శాతం నమోదు కావడం గమనార్హం. -
తెలంగాణలో స్థిరంగా తగ్గుతున్న కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడడంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 3576 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1707 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,93,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: వరంగల్ అర్బన్ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్ -
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,363 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 7,504 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 82 వేల 680 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 58,140 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,12,05,849 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: రికార్డు స్థాయిలో వాక్సినేషన్ చేస్తున్నాం: ఆళ్ల నాని -
ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,00,001 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 5,646 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1850563కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 7,772 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 1775176 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరులో 11, పశ్చిమ గోదావరిలో 7 , గుంటూరులో 6, తూర్పు గోదావరిలో 5, శ్రీకాకుళంలో 4, అనంతపురం, వైఎస్సార్ కడప, కృష్ణా, ప్రకాశంలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున మృతిచెందగా, నెల్లూరులో ఒక్క రు మరణించారు. మొత్తం 50 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 12319 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63068యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో 2,11,50,847 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: కొవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ రికార్డ్.. చేతికి చిక్కాక.. గుట్టుచప్పుడు గాకుండా.. -
3% దిగువకు పాజిటివిటీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గత 24 గంటల్లో 60,753 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,60,019గా ఉంది. మరో 1,647 మంది కోవిడ్తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,85,137కు పెరిగింది. రికవరీ రేటు 96.16 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 2.98 శాతంగా నమోదైంది. గత 24 గంటలలో 97,743 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య దాదాపు 39 కోట్లకు చేరువైంది. రికవరీల సంఖ్య 2,86,78,390కి పెరిగింది. ఇప్పటి వరకూ 27,23,88,783 డోసుల టీకాలిచ్చారు. -
ఏపీలో స్థిరంగా తగ్గుతున్న కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 45 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,269 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,014 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 67 వేల 404 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 65,244 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,10,50,846 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: AP: రేపు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్.. ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్లు -
ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1,07,764 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,341 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 57 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,224 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,486 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 59 వేల 390 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,09,46,911 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: Covid Time: నేస్తమా.. నువ్వచట కుశలమా..! -
తెలంగాణలో కొత్తగా 1,492 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,492 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 3,534 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1,933 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,86,362 మంది డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: తోడు లేదు.. నీడ లేదు.. -
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన మహమ్మారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టింది. కొత్తగా సోమవారం 1,511 కరోనా కేసులు నమోదు కాగా కోవిడ్ కారణంగా 12 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,175 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20,461 ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,10,681 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 173 కేసులు నమోదయ్యాయి. చదవండి: కరోనా దా‘రుణం’ రోడ్డుపాల్ చేసింది.. -
ఏపీ: తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,549 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10,114 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం రోజు 87,756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక గత 24 గంటల్లో 59 మంది మృత్యువాత పడ్డారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్పై సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,14,393 చేరగా.. మరణాల సంఖ్య 11,999గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,05,38,738 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. 1,72,23,81 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 80,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: Covid alarm: శరీరంలో వైరస్ ఉంటే మోత మోగుడే! -
తెలంగాణలో స్థిరంగా తగ్గుతున్న కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1771 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,983 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 2384 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5 లక్షల 76 వేల 487 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 1,20,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, తెలంగాణలో ఇప్పటివరకు 1,66,32,289 మందికి కరోనా పరీక్షలు చేశారు. చదవండి: టీకా తీసుకున్న 45 నిమిషాలకే మృతి -
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు. గత 24 గంటల్లో 1,21,311 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,79,11,384 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 24.96 కోట్ల మందికిపైగా వ్యాక్సినేషన్ జరిగింది. చదవండి: Covid-19: ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’ Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు! -
తెలంగాణలో కొత్తగా 1,707 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదు కాగా 16 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,759 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 3,456 కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,74,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 158 కేసులు నమోదయ్యాయి. చదవండి: కరోనా వచ్చినా జీతం కట్ .. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన -
తెలంగాణలో కొత్తగా 1798 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1798 పాజిటివ్ కేసులు నమోదు కాగా 14 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,561 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 3440 కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,71,610 మంది డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: Post Covid Condition: కోలుకున్నాక కూడా ఇలా చేయండి.. అప్పుడే! -
ఏపీలో కొత్తగా 8,110 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 67 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,763 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 12,981 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 77 వేల 063 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,01,37,627 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు వివరాలు.. శ్రీకాకుళం- 461, విజయనగరం- 280, విశాఖ- 502 ,తూ.గో- 1,980, ప.గో- 837, కృష్ణా- 339, గుంటూరు- 520, ప్రకాశం- 711, నెల్లూరు- 391, చిత్తూరు- 974,వ అనంతపురం- 960, కర్నూలు- 338, వైఎస్ఆర్ జిల్లా- 582 కేసులు నమోదయ్యాయి. చదవండి: టెస్టులు, వ్యాక్సిన్లో ఏపీ సరికొత్త రికార్డు -
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,801 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,29,896 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. చదవండి: Telangana: లాక్డౌన్ను పొడిగిస్తూ, పలు సడలింపులు -
తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,33,134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 2982 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 5,67,285 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మరణించగా, ఇప్పటివరకు 3409 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 1,61,27,372 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 182 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. చదవండి: హుజూరాబాద్ మరో ఉద్యమానికి నాంది కాబోతోంది: ఈటల Huzurabad: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా.. -
రెండు నెలల కనిష్టానికి.. !
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్రమణ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పాజిటివ్ కేసుల నమోదులో రోజురోజుకూ తగ్గుదల కనిపిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటలలో 1,20,529 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. ఇది గత 58 రోజులలో అత్యల్పం. వరుసగా 9 రోజులుగా... రోజుకు 2 లక్షలలోపే కేసులు నమోదవుతున్నాయి. కాగా దేశంలో గత 24 గంటల్లో 3,380మంది కరోనాతో మరణించడంతో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,44,082కు చేరింది. యాక్టివ్ కేసులూ క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,55,248గా ఉంది. గత 5 రోజులుగా ఈ సంఖ్య 20 లక్షలలోపే ఉంది. యాక్టివ్ కేసులు 5.42% తగ్గాయి. వరుసగా 23 రోజులు రికవరీలే ఎక్కువ వరుసగా 23వ రోజు కరోనా కొత్త కేసులకంటే కొత్త రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటలలో 1,97,894 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోవిడ్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 2,67,95,549కు చేరింది. దీంతో రికవరీ రేటు 93.38% కి పెరిగింది. దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా వారపు పాజిటివిటీ తగ్గుతున్న ధోరణి కనబడుతోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ 6.89% కాగా రోజువారీ పాజిటివిటీ 5.78% గా నమోదైంది. 12 రోజులుగా ఇది 10% లోపే ఉంటూ వస్తోంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 22.78 కోట్లు దాటింది. -
గుడ్ న్యూస్: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
సాక్షి ,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల.. పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్లో తెలిపింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2713. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,07,071 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,65,97,655 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్గా కేసులు 16,35,993 ఉన్నాయి. 24 గంటల్లో20,75,428 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,74,33,846. టీకాల పంపిణీ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో 140 రోజులుగా కొనసాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 28,75,286 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ పొందిన వారు 22,41,09,448 మంది ఉన్నారు. చదవండి: కరోనా పేషెంట్ల మరుగుదొడ్లు కడిగిన చిన్నారి.. వీడియో వైరల్ -
దేశంలో తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ స్థిరంగా కొనసాగుతోంది. కేసుల నమోదు తగ్గకపోగా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గురువారం లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే రెండు వేలు అధికంగా నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,59,873 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా వాటిలో 1,34,154 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక మరణాలు 2,887 సంభవించాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈమేరకు కరోనా బులెటిన్ను కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న వారు 2,11,499 మంది. వీరితో కలిపి ఇప్పటివరకు 2,63,90,584 కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు 17,13,413. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారు 3,37,989మంది. టీకాల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పొందిన వారు 24,26,265 మంది. మరణాల రేట్ 1.18 శాతం ఉండగా, యాక్టివ్ కేసుల శాతం 6.34. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది. చదవండి: నిన్న తగ్గి నేడు పెరిగి.. కొనసాగుతున్న విజృంభణ -
నిన్న తగ్గి నేడు పెరిగి: కొనసాగుతున్న కరోనా విజృంభణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల.. పెరుగుదల కనిపిస్తోంది. నిన్న మంగళవారం కేసులు తగ్గగా నేడు బుధవారం స్వల్పంగా పెరిగాయి. నిన్న లక్షా 27 వేల కేసులు నమోదు కాగా నేడు లక్షా 32 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దేశంలో కొత్తగా 1,32,788 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనా బులెటిన్లో తెలిపింది. అయితే మరణాల్లో కూడా పెరుగుదల కనిపించింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,207. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,31,456 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,61,79,085 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు 17,93,645. 24 గంటల్లో 20,19,773 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,00,57,330. టీకాల పంపిణీ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ పొందిన వారు 21,85,46,667 మంది ఉన్నారు. చదవండి: మూడో దశ కరోనాపై సర్కార్ హైఅలర్ట్ చదవండి: కరోనాతో ప్రముఖ ఫుట్బాల్ కోచ్ మృతి -
కంట్రోల్లోకి కోవిడ్: కొత్తగా లక్షన్నరకు దిగువన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా లక్షన్నరకు దిగువకు రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. 24 గంటల్లో 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,795 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,287 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,81,75,044. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,95,520. కరోనాకు చికిత్స పొంది ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి మొత్తం సంఖ్య 2,59,47,629. దేశంలో మొత్తం కరోనా మృతులు 3,31,895. దేశంలో 91.60 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.22 శాతం. మొత్తం కేసులలో మరణాల రేటు 71.16 శాతంగా ఉంది. ఇక వ్యాక్సిన్ ప్రక్రియలో కొంత వేగం పెరిగింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27,80,058 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు. చదవండి: భయాందోళన వద్దు.. ఈనెలలోనే కరోనా తగ్గుద్ది -
గత 50 రోజుల్లో అత్యంత కనిష్టం
సాక్షి,న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా కొత్త కేసులు నమోదవడం గత 50 రోజుల్లో ఇదే తొలిసారి. అయితే, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534కు చేరుకుంది. అయి తే, కోవిడ్ మరణాల సంఖ్య ప్రతిరోజూ ఇంకా మూ డువేల పైనే నమోదవుతోంది. గత 24 గంటల్లో 3,128 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,29,100కు పెరిగింది. మరోవైపు, రోజు వారీ కొత్త కేసుల సంఖ్య కంటే రోజువారీ రికవరీల సం ఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలా గత 18 రోజులుగా రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. పాజిటివిటీ రేటు 9.07% దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,26,092కు తగ్గింది. ఆదివారం దేశంలో 16,83,135 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 34,48,66,883కు పెరిగింది. కరోనా పాజిటివిటీ రేటు 9.07 శాతంగా నమోదైంది. గత ఏడు రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉంది. కాగా దేశంలో గత 24 గంటల్లో 2,38,022 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,56,92,342కు పెరిగింది. రికవరీ రేటు 91.60 శాతానికి పెరగడం గమనార్హం. అదే సమయంలో మరణాల రేటు 1.17 శాతంగా నమోదైంది. -
గుడ్న్యూస్: దేశంలో కరోనా తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి 2 లక్షలకు దిగువకు రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య నమోందైంది. 24 గంటల్లో 1,73,790 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,617 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు తగ్గితే దేశంలో కరోనా అదుపులోకి వచ్చినట్టుగా భావించవచ్చు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,84,601 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,77,29,247. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,28,724. కరోనాకు చికిత్స పొంది ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి మొత్తం సంఖ్య 2,51,78,011. దేశంలో మొత్తం కరోనా మృతులు 3,22,512. దేశంలో 90.80 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.04 శాతం. మొత్తం కేసులలో మరణాల రేటు 1.16 శాతంగా ఉంది. ఇక వ్యాక్సిన్ ప్రక్రియలో కొంత వేగం పెరిగింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,62,747 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా రికార్డ్ స్థాయిలో నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,80,048. -
44 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్ తీవ్రత క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు జాడలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసులు 44 రోజుల తరువాత అత్యల్పంగా నమోదయ్యాయి. రోజువారీ కొత్త కేసులు తగ్గుతున్న క్రమంలోనే వరుసగా 12 రోజులుగా కొత్త కేసులు 3 లక్షలలోపే ఉంటున్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,660 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 2,75,55,457కు, మరణాల సంఖ్య 3,18,895కు చేరింది. 90.34%కి చేరిన రికవరీ రేటు కరోనా బారిన పడిన 2,59,459 మంది రోగులు గత 24 గంటల్లో కోలుకున్నారు. రికవరీ రేటు దేశంలో ప్రస్తుతం 90.34%గా ఉంది. రోజువారీ రికవరీలు పెరుగుతూ, 15 రోజులుగా కొత్త కేసుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో వైరస్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,48,93, 410కు చేరి, మరణాల రేటు 1.16 శాతానికి పెరిగింది. ప్రస్తుతం, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23,43,152గా నమోదైంది. మే 10వ తేదీన యాక్టివ్ కేసులు అత్యధికంగా నమోదు కాగా, అప్పటి నుంచి కేసుల్లో తగ్గుదల నమోదు చేసుకుంటోంది. గత 24 గంటల్లో 76,755 కేసులు తగ్గాయి. 9 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు 24 గంటల్లో మొత్తం 20,70,508 కోవిడ్ శాంపిల్స్ పరీక్షలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షల మొత్తం 33.9 కోట్లు దాటాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెంచగా రోజువారీ పాజిటివిటీ 9 శాతానికి చేరింది. నాలుగు రోజులుగా పాజిటివిటీ రేటు 10% లోపే ఉంది. మరోవైపు దేశవ్యాప్త కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 20.57 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. తక్కువ సమయంలో 20 కోట్ల మైలురాయి దాటటంలో అమెరికా తరువాత భారత్ రెండో స్థానంలో ఉంది. -
భారత్: మరోసారి 2 లక్షలకు దిగువన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరల్ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి 2 లక్షలకు దిగువన రోజువారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే పాజిటివ్ కేసులు తగ్గినా. కోవిడ్ మరణాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటలలో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,660 మంది ప్రాణాలు విడిచారు. గురువారందేశ వ్యాప్తంగా 2,59,459 మంది డిశ్చార్జి అయ్యారు. ఈమేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457కు పెరిగింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,18,895గా ఉంది. ప్రస్తుతం 23,43,152 యాక్టీవ్ కేసులున్నాయి. మొత్తం 2,48,93,410 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 90.34 శాతం రికవరీ రేటు ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 8.51 శాతంగా ఉంది. మరణాల రేటు 1.15 శాతంగా ఉంది. చదవండి: ఫ్యాన్సీ మాస్క్లు వాడుతున్నారా..అయితే ప్రమాదం -
ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 91,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 18,285 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 24,105 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 24 వేల 859 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో 15, ప.గో.జిల్లాలో 14, విజయనగరం జిల్లాలో 9.. అనంతపురం, తూ.గో, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో 8 మంది, కర్నూలు జిల్లాలో ఆరుగురు.. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు చొప్పున 99 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 10427 మంది మరణించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా శ్రీకాకుళం- 1207, విజయనగరం- 639, విశాఖ- 1800, తూ.గో- 3296, ప.గో- 1664, కృష్ణా- 652, గుంటూరు- 1211, ప్రకాశం- 1056, నెల్లూరు- 1159, చిత్తూరు- 1822, అనంతపురం- 1876, కర్నూలు- 1026, వైఎస్ఆర్ జిల్లా- 877 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 1,88,40,321 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అసమానం : సీఎం జగన్ -
కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఆగని మరణాలు
సాక్షి, ఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరసగా ఏడో రోజు 3 లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. మరణాలు ఆగడం లేదు. గత 24 గంటల్లో దేశంలో 21,23,782 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,40,842 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారిపడి 3,741 మంది మృతి చెందగా, ఇప్పటివరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,99,266కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,55,102 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,34,25,467 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 28,05,399 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్లో ఇప్పటివరకు 32,86,07,937 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 16,04,542 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఇప్పటివరకు 19,50,04,184 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. చదవండి: లాక్డౌన్ పొడిగింపు.. ఆంక్షలు కఠినతరం ఢిల్లీలో మూతబడ్డ వ్యాక్సినేషన్ కేంద్రాలు -
తగ్గుతున్న కరోనా ఉధృతి!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా ప్రకోపం కాస్తంత తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నెల పదో తేదీన 24.83 శాతంగా ఉన్న కరోనా కేసుల పాజిటివిటీ రేటు మే 22(శనివారం) నాటికి 12.45 శాతానికి దిగిరావడమే ఇందుకు తగిన తార్కాణం. పాజిటివిటీ రేటుతోపాటు రోజువారీ కొత్త కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ శనివారం మీడియాకు చెప్పారు. దేశవ్యాప్తంగా 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతంపైగానే ఉందని ఆయన వెల్లడించారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. 18 రాష్ట్రాల్లో 15 శాతానికిపైగా పాజిటివిటీ రేటు నమోదవుతోందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. రోజురోజుకూ కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని, మే 10న 24.83 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 22వ తేదీకి 12.45 శాతానికి పడిపోయిందని లవ్ అగర్వాల్ వివరించారు. తగ్గిన వ్యాక్సిన్ వృథా వ్యాక్సిన్ డోస్ల వృథా సైతం తగ్గిందని అగర్వాల్ చెప్పారు. మార్చి ఒకటో తేదీన 8 శాతమున్న వృథా.. ప్రస్తుతం ఒక్క శాతానికి తగ్గిపోయిందన్నారు. అదేకాలానికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వృథా 17 శాతం నుంచి 4 శాతానికి దిగిరావడం సానుకూల అంశమన్నారు. కొత్తగా 2.57 లక్షల పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో 2.57 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది ఆరోరోజు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు పెరిగింది. మరోవైపు రికార్డుస్థాయిలో గత 24 గంటల్లో 4,194 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ బాధితుల మొత్తం మరణాల సంఖ్య 2,95,525కు పెరిగింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 29,23,400కు తగ్గింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం 11.12 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 69.94% కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 87.76 శాతం రికవరీ రేటు ఇప్పటిదాకా భారత్లో మొత్తం 2,30,70,365 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు మరింత మెరుగై 87.76 శాతానికి చేరుకుంది. కాగా, మరణాల రేటు 1.12 శాతంగా నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తంగా 32,64,84,155 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 20,66,285 శాంపిళ్లను పరీక్షించారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,263 మంది చనిపోయారు. కేంద్రం కేటాయింపులు బ్లాక్ ఫంగస్ చికిత్సకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు ఔషధాలను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాలు, యూటీలకు 23,680 వయల్స్ యాంఫోటెరిసిన్–బి పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్కు 2,310 వయల్స్, తెలంగాణకు 890 వయల్స్ కేటాయించారు. -
పాజిటివ్ కేసులు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగం కాస్త నెమ్మదించినట్లుగా కనిపిస్తోంది. గత వారంలో మే 10 నుంచి 16 వరకు 23.02 లక్షల కరోనా పాజిటివ్ కేసులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ సంఖ్య గత 3 వారాల్లో అతి తక్కువ. అంతకుముందు మే 3 నుంచి మే 9వ తేదీ మధ్య 27.42 లక్షల పాజిటివ్ కేసులను గుర్తించారు. అయితే మరణాల సంఖ్యలో మాత్రం మార్పు ఏమాత్రం కనిపించట్లేదు. గత వారం కరోనా కారణంగా దేశంలో 28,266 మంది మరణించారు. అంతేగాక ఈ మరణాల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికం. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2,81,386 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 26 రోజుల్లో ఒకే రోజులో 3 లక్షల కన్నా తక్కువ పాజటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అంతకుముందు ఏప్రిల్ 20న 2.94 లక్షల కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో 75.95% శాతం కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 34,389 కేసులు, తమిళనాడులో 33,181, కర్ణాటకలో 31,531, కేరళలో 29,704, ఆంధ్రప్రదేశ్లో 24,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 31కోట్ల 64లక్షల 23వేల 658 కరోనా టెస్ట్లను నిర్వహించగా అందులో ఆదివారం 15లక్షల 73వేల 515 పరీక్షలు చేశారు. అంటే గత 24 గంటల్లో దేశంలో నమోదైన పాజిటివిటీ రేటు 17.88%గా నమోదైంది. దేశంలో 479 జిల్లాల్లో 10% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉండగా, 244 జిల్లాల్లో 20% కంటే ఎక్కువ ఉంది. -
దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
సాక్షి, ఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కేసులు తగ్గాయి. మూడు లక్షలకు దిగువన కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 15,73,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4,106 మంది మృతి చెందగా, ఇప్పటివరకు ఇప్పటివరకు 2,74,390 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,78,741 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,11,74,076 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 35,16,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18.29 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఇప్పటివరకు దేశంలో 31,64,23,658 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: 16.98%కి పాజిటివిటీ రేటు ఖైదీలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి -
ఊరట: దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కేసులు..
సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 18,32,950 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 4,077 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 2,70,284 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 3,62,437 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,07,95,335 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. దేశంలో ప్రస్తుతం 36,18,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18.22 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. దేశంలో ఇప్పటివరకు 31,48,50,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి: Black Fungus: బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది 'కోవిడ్పై ప్రభుత్వ విధానం వినాశకరం' -
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో మరోసారి కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3,26,098 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రోజే 3,890 మంది మృతిచెందారు. కొత్తగా కరోనా నుంచి కోలుకుని 3,53,299 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కోవిడ్పై కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకు కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. మరణాల సంఖ్య 2,66,207కు పెరిగింది. మొత్తం 2,04,32,898 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 36,73,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18.04 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. గత 24 గంటల్లో 16,93,093 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 31,30,17,193 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. చదవండి: Covid-19: ఆస్పత్రిలో బెడ్స్ కావాలా? -
కరోనా కల్లోలం: 3.43 లక్షల కొత్త కేసులు
సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 18,75,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,43,144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,40,46,809కి పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే కరోనా బారినపడి 4 వేల మంది మృతి చెందారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,62,317కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,44,776 మంది డిశ్చార్జ్ కాగా, దేశంలో ఇప్పటివరకు 2,00,79,599 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 37,04,893 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 31,13,24,100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 17,92,98,584 మందికి వ్యాక్సిన్ వేశారు. చదవండి: ఆక్సిజన్ అందక మరో 15 మంది మృత్యువాత కోవిడ్పై యుద్ధం ప్రకటించిన గ్రామాలు -
మరో 6–8 వారాలు లాక్డౌన్ ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ పరిస్థితి చక్కబడాలంటే పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను మరో 6 నుంచి 8 వారాల పాటు కొనసాగించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధిపతి డాక్టర్ బలరామ్ భార్గవ్ అభిప్రాయపడ్డారు. సుమారు 500 జిల్లాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10% పైన ఉందని, ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయని భార్గవ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ ఆంక్షలు ఎంతకాలం అవసరమనే విషయాన్ని డాక్టర్ భార్గవ్ వివరించారు. అయితే వైరస్ సంక్రమణ ఉన్న జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి వచ్చిన తర్వాతనే ఆంక్షలను సడలించాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 5% పాజిటివిటీ రేటు వచ్చేందుకు దాదాపు 8 వారాలు పడుతుందన్నారు. ఢిల్లీ విషయాన్ని ఉదహరిస్తూ గతంలో దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరుకుందని, కానీ ఇప్పుడు అది కాస్తా 17 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు. ఉన్నపళంగా ఢిల్లీలో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తేస్తే అది మరో విపత్తుకు కారణమౌతుందని తెలిపారు. -
కోవిడ్ మరణాల్లో మరో రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్తో ప్రాణాలుపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,48,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,40,938 కు పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే ఏకంగా 4,205 మంది కోవిడ్తో మరణించారు. దీంతో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,54,197కు చేరింది. అదే సమయంలో దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3,55,338 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,93,82,642కు పెరిగింది. రికవరీ రేటు సైతం 83.04 శాతానికి పెరిగింది. రోజువారీ కొత్త కేసులతో పోలిస్తే రోజువారీగా రికవరీ అయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. వరసగా రెండో రోజూ ఇలా రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,04,099కు చేరింది. గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 40,956 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 793 కోవిడ్ బాధితుల మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనా కారణంగా సంభవించిన మరణాలు 2.5 లక్షలను దాటాయి. అయితే మరణాల విషయంలో అమెరికా, బ్రెజిల్లు భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. అమెరికాలో మరణాల రేటు 1.8 శాతంకాగా, బ్రెజిల్లో 2.7 శాతంగా, దక్షిణాఫ్రికాలో 3.4 శాతంగా ఉంది. ఇక భారత్లో జాతీయ మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాల్లో అమెరికాలో 18 శాతం, బ్రెజిల్లో 12.8%, భారత్లో 7.6% నమోదయ్యాయి. అక్టోబర్లో ప్రారంభమైన కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని అమెరికా ఇప్పటికీ ఎదుర్కొంటోంది. మే 11న అమెరికాలో 693 మంది, బ్రెజిల్లో 2311 మంది, మెక్సికోలో 234 మంది కోవిడ్తో మరణించారు. కానీ అదే సమయంలో భారత్లో 4,205మంది మృత్యువాత పడ్డారు. అంటే మే 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యలో 47.72% మరణాలు భారత్లోనే నమోదయ్యాయి. అమెరికాలో కరోనా ఫస్ట్ వేవ్లో ఒకేరోజులో అత్యధికంగా 2759 మంది ప్రాణాలు కోల్పోయారు. -
కోవిడ్ కల్లోలం: ఒక్కరోజే 4,205 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల నుంచి కొత్త కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,205 మంది మృతిచెందారు. మంగళవారం నాడు 3,55,338 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938 చేరింది. మరణాల సంఖ్య 2,54,197కు పెరిగింది. ఈ మేరకు బుధవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం 37,04,099 యాక్టివ్ కేసులున్నాయి మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 1,93,82,642 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 17,52,35,991 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. చదవండి: Lockdown: కిక్కిరిసిన సూపర్ మార్కెట్లు, బారులు తీరిన జనాలు -
మరో 4,187 మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో తొలిసారి కరోనా సంబంధిత మరణాలు 4వేల మార్క్ను దాటేశాయి. 24 గంటల్లో 4,187 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దేశంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో మరణించడం ఇదే మొదటిసారి. తాజాగా, కోవిడ్ మృతుల సంఖ్య 2,38,270కు చేరుకుంది. 24 గంటల్లో కర్ణాటకలో మొట్టమొదటి సారిగా 592 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 898, ఉత్తరప్రదేశ్లో 372, ఢిల్లీలో 341, ఛత్తీస్గఢ్లో 208, తమిళనాడులో 197 మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజులో 4,01,078 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మే 7వ తేదీ వరకు దేశంలో 1,09,68,039 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గతేడాది జనవరి 30 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 1,09,16,481 కేసులను గుర్తించారు. అంటే గత 82 రోజుల్లో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రెట్టింపైంది. మరోవైపు, దేశంలో 24 గంటల్లో 3,18,609 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 1,79,30,960కు చేరుకుంది. అదే సమయంలో, దేశంలో యాక్టివ్ కేçసుల సంఖ్య 37,23,446కు పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది 17.01%గా ఉంది. ప్రపంచంలో అమెరికా తరువాత భారత్లోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 22.17%గా నమోదైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం చేసిన 18,08,344 కరోనా సంక్రమణ టెస్ట్లతో కలిపి ఇప్పటివరకు దేశంలో 30 కోట్లకు పైగా టెస్ట్లు పూర్తయినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. భువనేశ్వర్లో వాహనదారునికి కోవిడ్ టీకా ఇస్తున్న దృశ్యం -
కరోనా సంక్షోభంపై టాస్క్ఫోర్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల విజృంభణ, ఆక్సిజన్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు, ఆక్సిజన్ పంపిణీ కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు 6 నెలల కాలపరిమితితో జాతీయ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. వైద్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణులైన 12 మందిని అందులో సభ్యులుగా చేర్చింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రణాళికను రూపొందించే బాధ్యతను కూడా ఆ కమిటీకి అప్పగించింది. అలాగే, ఎయిమ్స్కు చెందిన రణదీప్ గులేరియా, మాక్స్ హెల్త్కేర్కు చెందిన సందీప్ బుధిరాజా, సంయుక్త కార్యదర్శి హోదాకు తగ్గని ఇద్దరు ఐఏఎస్ అధికారులతో ఒక సబ్ కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా, నగరంలో వైద్య వ్యవస్థ మౌలిక వసతులను ఆ కమిటీ సమీక్షిస్తుంది. విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారం జాతీయ టాస్క్ఫోర్స్కు కన్వీనర్గా కేంద్ర కేబినెట్ సెక్రటరీని, ఎక్స్ అíఫీషియో మెంబర్గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం నియమించింది. ఈ మేరకు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెబ్సైట్లో శనివారం అప్లోడ్ చేశారు. టాస్క్ఫోర్స్లో బాబాతోష్ బిశ్వాస్(వెస్ట్బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్లర్), దేవేందర్ సింగ్ రాణా(ఢిల్లీ్లలోని సర్ గంగారామ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్పర్సన్), దేవీప్రసాద్ శెట్టి(బెంగళూరులోని నారాయణ హెల్త్కేర్ చైర్పర్సన్, ఈడీ), గగన్దీప్ కాంగ్(వెల్లూర్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్) తదితరులున్నారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శాస్త్రీయ ప్రణాళికలను టాస్క్ఫోర్స్ నిపుణులు రూపొందిస్తారని, అలాగే, విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అవసరాల మేరకు ఆక్సిజన్ డిమాండ్, సరఫరాలపై శాస్త్రీయ అంచనా సహా 12 విధులను కోర్టు ఈ టాస్క్ఫోర్స్కు అప్పగించింది. ఇందుకు రాష్ట్రాల వారీగా సబ్ కమిటీలను టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ఈ సబ్ కమిటీల్లో ఆయా రాష్ట్రాల కార్యదర్శి స్థాయి అధికారి, అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇద్దరు వైద్య నిపుణులు సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పేషెంట్ల చికిత్స సమయంలో వైద్యులు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశం కాదని, మెడికల్ ఆక్సిజన్ పంపిణీ, వినియోగంలో పారదర్శకత నెలకొనాలని, అవసరాల మేరకు ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా జరగాలనేదే తమ ఉద్దేశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ టాస్క్ఫోర్స్ నివేదికను సమర్పించేంతవరకు.. రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని పేర్కొంది. ఎప్పటికప్పుడు తమకు మధ్యంతర నివేదికలు ఇవ్వాలని టాస్క్ఫోర్స్ను ఆదేశించింది. -
కరోనా..మరో ప్రపంచ రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు 4 లక్షల మందికిపైగా కరోనా సోకినట్లు నిర్ధారణయింది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,14,91,598కి చేరుకుంది. దీంతోపాటు, ఒక్క రోజులో 3,915 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 2,34,083కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 853 మంది మరణించారు. పది రోజులుగా రోజుకు మూడు వేలకు పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. పది రోజుల్లో మొత్తం 36,110 మంది మరణించారు. అంటే ప్రతి గంటకు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం అమెరికాలో 10 రోజుల్లో 34,798 మంది, బ్రెజిల్లో 32,692 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం యాక్టివ్ కేసులు 36,45,164కు చేరుకున్నాయి. కేవలం 10 నగరాల్లోనే 25% యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో అత్యధికంగా బెంగళూరు అర్బన్లో 9.13%, పుణేలో 3.16%, ఢిల్లీలో 2.49%, అహ్మదాబా§ద్లో 1.82%, చికిత్స పొందుతున్న రోగులున్నారు. గత 24 గంటల్లో 81.95% రికవరీ రేటుతో 3,31,507మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 1,76,12,351కు చేరుకుంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో 24 గంటల్లో 23,70,298 వ్యాక్సిన్ డోస్లు వేశారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 16,49,73,058 వ్యాక్సిన్ డోస్లను ప్రజలకు అందించారు. మరోవైపు కరోనా సంక్రమణను గుర్తించేందుకు గురువారం ఒక్కరోజులోనే 18,26,490 శాంపిల్స్ను పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 17,35,07,770 కోవిడ్ వ్యాక్సిన్ డోస్లను ఉచితంగా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
ఉత్తరాదిలో యూకే వేరియంట్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్కు కారణమయ్యే సార్స్–కోవ్–2 వైరస్లో కొత్త రకాలు వెలుగులోకి వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్లో పుట్టిన కొత్త రకం(యూకే వేరియెంట్) ప్రస్తుతం ఉత్తర భారతదేశంపై పంజా విసురుతోందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజిత్ చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో డబుల్ మ్యుటెంట్ వ్యాప్తి అధికంగా ఉందన్నారు. దేశంలో ఉత్తరాది మినహా ఇతర ప్రాంతాల్లో యూకే వేరియంట్ (బీ1.1.7) ప్రభావం గత నెలన్నర రోజుల్లో గణనీయంగా పడిపోయిందన్నారు. యూకే వేరియంట్ కరోనా పాజిటివ్ కేసులు పంజాబ్లో 482, ఢిల్లీలో 516, మహారాష్ట్రలో 83, కర్ణాటకలో 82, తెలంగాణలో 192 బయటపడ్టాయని వెల్లడించారు. కేవలం మహారాష్ట్రలో బ్రెజిల్ రకం వైరస్ డబుల్ మ్యుటెంట్ వేరియంట్ (బి.1.617) కేసులు మహారాష్ట్రలో 761, పశ్చిమ బెంగాల్లో 124, ఢిల్లీలో 107, గుజరాత్లో 102 నమోదయ్యాయని సుజిత్ సింగ్ గుర్తుచేశారు. ఇక దక్షిణాఫ్రికా వేరియంట్ (బి.1.315) తెలంగాణ, ఢిల్లీలోనే అధికంగా కనిపిస్తోందని తెలిపారు. బ్రెజిలియన్ వేరియంట్(పీ1) మహారాష్ట్రలోనే స్వల్పంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో దాని ఉనికి కనిపించలేదన్నారు. కొత్త వేరియంట్లు బయటపడే జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వైరస్ నియంత్రణ చర్యలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు సుజిత్ సింగ్ సూచించారు. కాంట్రాక్టు ట్రేసింగ్ చాలా ముఖ్యమంత్రి చెప్పారు. -
Corona Cases in India: కరోనా కేసులు మళ్లీ పైపైకి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ పట్టపగ్గాల్లేకుండా భారతదేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కరోనా సంక్రమణతో దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,12,262 కొత్త కరోనా రోగులను గుర్తించారు. ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజులో ఇంతటి భారీస్థాయిలో కేసులు నమోదుకాలేదు. కాగా, 24 గంటల్లో ఇంతటి భారీస్థాయిలో కొత్త కేసులు భారత్లో నమోదవడం ఇది రెండోసారి. గతంలో ఏప్రిల్ 30న 4,02,351 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షలాది కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,77,410కు చేరింది. కోవిడ్ బారిన పడి గత 24 గంటల్లో మరో 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,30,168కు పెరిగింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 920 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో 353 మంది చనిపోయారు. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 81.99 శాతానికి చేరుకుంది. పాజిటివిటీ రేటు 21.43గా నమోదైంది. 35.66 లక్షల యాక్టివ్ కేసులు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో చికిత్స పొందుతున్న యాక్టివ్ రోగుల సంఖ్య సైతం వేగంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 3,29,113 మంది కరోనాను ఓడించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 1,72,80,844కు చేరింది. రోజూ నమోదైన కొత్త కరోనా కేసులతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ కారణంగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35,66,398 కు పెరిగింది. ప్రపంచంలో అమెరికా తర్వాత భారత్లోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, రాజస్తాన్, బిహార్సహా 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 6.43 లక్షలు, కర్ణాటకలో 4.87 లక్షలు, కేరళలో 3.76 లక్షలు, ఉత్తరప్రదేశ్లో 2.62 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో 81.05% యాక్టివ్ కేసులు 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటిదాకా 16,25,13,339 కోవిడ్ టీకాలిచ్చారు. బుధవారం వరకు మొత్తంగా 29,67,75,209 కరోనా శాంపిల్స్ పరీక్షలు చేశారు. వీటిలో 19,23,131 శాంపిల్స్ను బుధవారం ఒక్కరోజులోనే పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. -
కరోనా విశ్వరూపం: మరోసారి 4 లక్షలు దాటిన రోజువారీ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ రెండో దశ విరుచుకుపడుతోంది. కోవిడ్ కట్టడికి ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోసారి దేశంలో కొత్త కేసులు నాలుగు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 4,12,262 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 3,980 మంది మృత్యువాతపడ్డారు. ఒకేరోజే 3,29,113 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410కు చేరాయి. మృతుల సంఖ్య 2,30,168కు పెరిగింది. ప్రస్తుతం 35,66,398 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 16,25,13,339 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. చదవండి: కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కన్నుమూత -
కరోనా కరాళ నృత్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో మరోసారి పెరగడం ఆందోళనకు కలిగిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,82,315 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య.. అమెరికాలో రోజువారీగా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ. గత 24 గంటల్లో 3780 మంది రోగులు మరణించారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 2,26,188కు చేరింది. అదే సమయంలో గత 24 గంటల్లో దేశంలో 3,38,439 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 1,69,51,731 కు పెరిగింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34,87,229కు చేరుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 16,04,94,188 వ్యాక్సిన్ డోస్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు 17,02,42,410 డోసులు ఉచితంగా అందించింది. -
మే 15న రాష్ట్రానికి 9 లక్షల టీకా డోసులు: సింఘాల్
సాక్షి, మంగళగిరి: ఏపీలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 20,034 నిర్ధారణ కాగా, 82 (.41 %) మరణాలు సంభవించాయి. తాజాగా ఏపీలో పాజిటివ్ రేటు 17.3 శాతంగా ఉంది. 24 గంటల్లో 1,17,784 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 533 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కోవిడ్ రిపోర్ట్ మంగళవారం విడుదల చేశారు. 21,857 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే 20,017 నిండిపోయాయని తెలిపారు. 104 కాల్ సెంటర్కు 16,856 కాల్స్ వచ్చాయని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 9 లక్షలు వ్యాక్సిన్ డోసులు ఈనెల 15వ తేదీలోపు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. వ్యాక్సినేషన్లో మీడియా, బ్యాంక్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రెమిడెసివర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 14,030 రెమిడెసివర్ డోసులు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21,898 డోసెస్ అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే 12 వేలు రెమిడెసివర్ డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని, 3 ట్యాంకర్లు ఈరోజు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కోవిడ్ తీరుపై రేపు మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరగనుందని అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కోవిడ్ కేసులు , పేషేంట్స్ను కోవిడ్ కేర్ సెంటర్స్ తరలింపుపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం జగన్ -
కేసులు పెరుగుతుండడంతో ముందుకు రాని దాతలు
-
ఏపీ: గడిచిన 24 గంటల్లో 18,792 పాజిటివ్ కేసులు
సాక్షి, ఆంధ్రప్రదేశ్: ఏపీలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,15,275 కరోనా టెస్టులు నిర్వహించగా వీరిలో 18,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 71 మృత్యువాతపడ్డారు. ఇక ఆదివారం రోజు 10,227 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు ఇప్పటివరకు 10,03,935 మంది సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం1,51,852 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 11,63,994కు చేరింది. ఇప్పటి వరకు 8, 207మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో నిన్నటి వరకు 1,67,18,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు చదవండి: ఏపీ: టెన్త్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ -
తెలంగాణాలో పెరుగుతున్నకరోనా కేసులు,మరణాలు
-
Corona Cases in India: కరోనా విస్ఫోటం
సాక్షి, న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలోని భయానక పరిస్థితులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,92,488 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 1,95,57457కు పెరిగింది. కరోనా సంక్రమణ కొత్త కేసులలో 73.71 శాతం 10 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. 76 శాతం మరణాలు ఈ 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి. శనివారం గణాంకాలతో పోలిస్తే పాజిటివ్ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో చికిత్సతో కరోనా వైరస్ నయం చేసుకున్న వారి సంఖ్య 3,08,522కు చేరింది. దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 33 లక్షలను దాటేశాయి. గత 24 గంటల్లో, కరోనా కారణంగా రికార్డు స్థాయిలో 3689 మంది మరణించారు.మహారాష్ట్రలో 802 మంది, ఢిల్లీలో 412, ఉత్తర్ ప్రదేశ్లో 304, ఛత్తీస్గఢ్లో 229, కర్ణాటకలో 271, గుజరాత్లో 172, రాజస్తాన్లో 160, ఉత్తరాఖండ్లో 107, పంజాబ్లో 138, తమిళనాడులో 147 మంది మరణించారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య 2,15,542కు పెరిగింది. ప్రతీరోజు లక్షల్లో కొత్త రోగుల సంఖ్య పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య ఆదివారం 33,49,644కు పెరిగింది. మొత్తం వైరస్ సోకిన వారిలో ఇది 17.06 శాతం. అయితే రోగుల రికవరీ రేటు 81.84 శాతానికి తగ్గింది. దేశంలో సంక్రమణ తర్వాత కోలుకున్న వారు 1,59,92,271కు పెరిగారు. మరణాల రేటు 1.11%గా ఉం ది. ఢిల్లీలో కరోనా వినాశనం కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఢిల్లీలో సుమారు 25 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కరోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోం దనేది ప్రపంచవ్యాప్తంగా నమోదైన గణాంకాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన టాప్–50 దేశాలలో శనివారం 3.91 లక్షల మందికి వైరస్ సోకినట్లు గుర్తించగా భారత్లోనే 3,92,459 మంది రోగులను గుర్తించారు. అంటే మొత్తం 50 దేశాల కేసుల కంటే 1000మంది ఎక్కువ రోగులకు దేశంలో వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మూడో దశతో కలిపి ఇప్పటిదాకా 15.68 కోట్లు కోవిడ్ టీకా డోసులు చేశారు. 18–44 ఏళ్ళ మధ్య ఉన్న వారిలో 11 రాష్ట్రాలలో మూడోదశ తొలిరోజు 86,023 మంది మొదటి డోస్ తీసుకున్నారు. ఛత్తీస్గఢ్ (987), ఢిల్లీ (1,472), గుజరాత్ (51,622), జమ్మూకశ్మీర్ (201), కర్ణాటక (649), మహారాష్ట్ర (12,525), ఒడిశా (97), పంజాబ్ (298), రాజస్తాన్ (1853), తమిళనాడు (527), ఉత్తరప్రదేశ్ (15,792) రాష్ట్రాల్లో మొదటి డోస్ తీసుకున్నారు. -
Coronavirus: భారత్లో కొత్తగా 3,92,488 కేసులు
సాక్షి, ఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశంలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 3689 మంది ప్రాణాలు విడిచారు. 3,07,865 మంది ఈ వైరస్ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 1,59,92,271గా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,57,457 కరోనా కేసులు నమోదవగా ఇందులో 33,49,644 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 15,68,16,031 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 2,15,542 మంది కరోనాకు బలయ్యారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7430 కరోనా కేసులు నమోదవగా 56 మంది మరణించారు.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఇప్పటివరకు 3,67,727 మంది డిశ్చార్జ్ అవగా 2368 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 80,695 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో 1546, మేడ్చల్లో 533, రంగారెడ్డిలో 475, నల్లగొండలో 368, సంగారెడ్డిలో 349 కరోనా కేసులు నమోదవగా వరంగల్ అర్బన్లో 321, నిజామాబాద్లో 301 కేసులు వెలుగుచూశాయి. చదవండి: బాబోయ్... 4 లక్షలూ దాటేశాం -
బాబోయ్... 4 లక్షలూ దాటేశాం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సృష్టిస్తున్న తీవ్ర కలకలంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకీ అదుపు తప్పుతున్నాయి. కరోనా సంక్రమణ కేసులు రిక్డార్డు స్థాయిలో నమోదవుతున్న తీరు, మరణాల సంఖ్యలో పెరుగుదల ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రోగులు పెరుగుతున్న కారణంగా ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలమవుతోంది. వరుసగా 9 రోజులపాటు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన మన దేశంలో గత 24 గంటల్లో 4 లక్షల కంటే అధికంగా సంక్రమణ కేసులను గుర్తించారు. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 4,01,993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 62,919, కర్ణాటకలో 48,296 పాజిటివ్ కేసులు వచ్చాయి. గత కొద్దిరోజులగా ప్రపంచంలో ఏ దేశంలోని రానన్ని (ఒకేరోజు) అత్యధిక కేసులు భారత్లో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకేరోజు కొత్త కేసుల సంఖ్య ఏకంగా నాలుగు లక్షలు దాటేసింది. ఈ సంఖ్య కరోనా ఎక్కువగా సోకిన అమెరికాలో శుక్రవారం నమోదైన కేసుల కంటే ఏడురెట్లు ఎక్కువ. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం గుర్తించిన 8.66 లక్షల మంది కొత్త రోగుల్లో దాదాపు సగం (46%) పాజిటివ్ కేసులు భారతదేశంలోనే గుర్తించారు. దీంతో ప్రస్తుతం దేశంలో వైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 1,91,64,969కు చేరుకుంది. దేశంలో కరోనాతో మరణించే వారి సంఖ్య సైతం ప్రతీరోజు పెరుగుతోంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా దేశంలో 3,523 మంది తుదిశ్వాస విడిచారు. దీంతో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 2,11,853 కు చేరుకుంది. అంటే, ప్రపంచంలో గత 24 గంటల్లో సంభవించిన ప్రతి నాలుగు కరోనా మరణాల్లో ఒకటి భారత్లో నమోదైంది. ప్రస్తుతం దేశంలో 32,68,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అమెరికా తరువాత భారతదేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోలుకున్న వారు 3 లక్షలు! అయితే గత 24 గంటల్లో 2,99,988 మంది కరోనా రోగులు చికిత్స తీసుకొని కోలుకోవడం గమనార్హం. ప్రతీరోజూ నమోదవుతున్న కరోనా కొత్త కేసులతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 81.84%గా నమోదైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19.45 లక్షల కరోనా టెస్టులు నిర్వహించగా 4,01,993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే 20.66% పాజిటివిటీ రేటు ఉంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 15,49,89,635 వ్యాక్సిన్ డోస్లు వేశారు.