
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,801 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,301 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,29,896 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.