
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,549 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10,114 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం రోజు 87,756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక గత 24 గంటల్లో 59 మంది మృత్యువాత పడ్డారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్పై సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,14,393 చేరగా.. మరణాల సంఖ్య 11,999గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,05,38,738 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. 1,72,23,81 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 80,013 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదవండి: Covid alarm: శరీరంలో వైరస్ ఉంటే మోత మోగుడే!
Comments
Please login to add a commentAdd a comment