జైల్లో కరోనా కల్లోలం: 6 మంది పిల్లలతో సహా 39 మందికి పాజిటివ్‌ | 39 Inmates Tested Positive In Mumbai Byculla Prison | Sakshi
Sakshi News home page

Mumbai Byculla Prison జైల్లో కరోనా కల్లోలం: 6 మంది పిల్లలతో సహా 39 మందికి పాజిటివ్‌

Published Sun, Sep 26 2021 12:20 PM | Last Updated on Sun, Sep 26 2021 12:40 PM

39 Inmates Tested Positive In Mumbai Byculla Prison - Sakshi

Byculla Prison, Corona Virus

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేసుల నమోదు తక్కువగా ఉందని ఉపశమనం పొందుతున్న వేళ జైల్లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఓ జైలులో ఆరుగురు చిన్నారులతో సహా 39 మంది మహిళా ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో పది రోజుల కిందట ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అధికారికంగా మాత్రం శనివారం తెలిపారు. కరోనా బారినపడిన 39 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పాజిటివ్‌ తేలిన అనంతరం వెంటనే ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. అయితే వారిలో ఓ గర్భిణి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటివరకు మొత్తం 120 మంది ఖైదీలు, సిబ్బంది కరోనా బారినపడినట్లు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement