breaking news
mumbai
-
రెస్టారెంట్ మూసేసిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి(Shilpa Shetty) సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబై బాంద్రాలో ఉన్న తన లగ్జరీ రెస్టారెంట్ ‘బాస్టియన్’ను (Bastian) మూసివేయనున్నట్లు ప్రకటించింది. గత కొద్దిరోజుల క్రితమే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రూ.60 కోట్ల మేర మోసం చేశారంటూ ఒక వ్యాపారావేత ఆరోపణలు చేశాడు. ఆపై వారిమీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు."ముంబైలోని అత్యంత పేరుగాంచిన మా రెస్టారెంట్ బాస్టియన్ను ఈ గురువారం మూసివేస్తున్నాం. ఒక శకం ముగిసింది. ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, మరపురాని క్షణాలను ఇచ్చింది. ఎందరికో సంతోషాన్ని పంచిన ఈ వేదిక ఇకపై మూతపడనుంది. వీడ్కోలు పలికేందుకు గురువారం ఒక వేడుక నిర్వహిస్తున్నాం. వ్యాపార భాగస్వాములతో పాటు కొందరు సన్నిహితులు కూడా హాజరుకానున్నారు. త్వరలో సరికొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాం.' అని ఆమె తెలిపారు. ముంబైలో ఆరుచోట్ల బాస్టియన్ పేరుతో వారికి బ్రాంచ్లు ఉన్నాయి. 2016లో ముంబై బాంద్రాలో ప్రారంభమైన మొదటి బ్రాంచ్ను వారు మూసివేస్తున్నారు. కారణం ఏంటి అనేది వారు చెప్పలేదు. కానీ, మూసివేతకు ప్రధాన కారణం రూ.60 కోట్ల మోసం కేసు అని తెలుస్తోంది.అయితే, శిల్పా శెట్టి తన సినిమా కెరీర్తో పాటు ఫుడ్, హాస్పిటాలిటీ రంగంలో కూడా తన మార్క్ వేసింది. -
Ganesh Chaturthi: మునిగిన విగ్రహాలకు ఫొటోలు తీయడంపై నిషేధం
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు ఆరున భారీ ఎత్తున వినాయక నిమజ్జనాలున్న తరుణంలో ముంబై పోలీసులు పలు నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం తర్వాత పాక్షికంగా కరిగిన గణపతి విగ్రహాలకు ఫోటోలు తీయడం, ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని నిషేధించారు. ఈ ఉత్తర్వు సెప్టెంబర్ ఏడు వరకు గ్రేటర్ ముంబై అంతటా అమలులో ఉంటుందని తెలిపారు.గణపతి నిమజ్జనం అనంతరం నీటి అలలకు సగం కరిగిన విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇవి పలువురి మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. గతంలో ఇటువంటి విగ్రహాలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్మికులు తిరిగి నిమజ్జనం చేస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఫొటోలు, వీడియోలు మతపరమైన భావాలను దెబ్బతీస్తాయని, ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) అక్బర్ పఠాన్ మాట్లాడుతూ నిమజ్జనం తర్వాత తేలియాడే లేదా సగం మునిగిపోయిన విగ్రహాల ఫోటోలు తీయడం, వాటిని ఏ రూపంలోనైనా ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరం అంతటా దీని గురించి ప్రచారం చేయాలని అధికారులను ఆయన కోరారు. -
Lalbaugcha Raja: తొలిరోజే నిండిన హుండీలు.. భారీగా బంగారు, వెండి కానుకలు కూడా..
ముంబై: దేశవ్యాపంగా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గణపతి ఉత్సవాలను మహారాష్ట్ర పెట్టింది పేరు. ముఖ్యంగా ముంబైలో జరిగే గణనాథుని ఉత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతాయి. ఇక్కడి ‘లాల్బాగ్చా రాజా’ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లక్షలాదిగా భక్తులు ఈ గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తూ నగదును, విలువైన కానుకలను అందిస్తున్నారు. VIDEO | Devotees throng Mumbai’s iconic Lalbaugcha Raja to offer prayers and seek blessings during the ongoing Ganesh Chaturthi celebrations.#Ganeshotsav #GaneshChaturthi2025(Full VIDEO available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/6foYt5XqiL— Press Trust of India (@PTI_News) August 30, 2025గణపతి నవరాత్రుల తొలిరోజునే లాల్ బాగ్చారాజాకు భారీగా విరాళాలు, కానుకలు అందాయి. అలాగే బంగారం, వెండి కానుకలు కూడా గణనీయంగా వచ్చాయని లాల్బాగ్చా రాజా సార్వజనిక్ గణేశోత్సవ మండల్ నిర్వాహకులు తెలిపారు. స్టేజ్ హుండీ నుండి రూ. 25.50 లక్షలు, రంగ్ హుండీ ద్వారా మరో రూ. 20.50 లక్షలు విరాళాలుగా అందాయని, తొలిరోజున మొత్తం విరాళాలు రూ. 46 లక్షలని నిర్వాహకులు వివరించారు. అలాగే పలువురు భక్తులు 144.050 గ్రాముల బంగారం, 7,159 గ్రాముల వెండిని సమర్పించారని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబైలో లాల్బాగ్చా రాజాను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థనలు చేసి, నగదు లేదా నగల రూపంలో విరాళాలు సమర్పిస్తుంటారు. ఈ విరాళాలను లెక్కించే ప్రక్రియ ఉత్సవాల రెండవ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఉత్సవ నిర్వాహకుల పర్యవేక్షణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జీఎస్ మహానగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు విరాళాలను లెక్కిస్తారు. -
2000 బెడ్లతో మెడికల్ సిటీ.. నీతా అంబానీ కీలక ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్.. ముంబై నడిబొడ్డున 2,000 పడకల అత్యాధునిక మెడికల్ సిటీ నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని 'నీతా అంబానీ' రిలయన్స్ ఫౌండేషన్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.సంస్థ నిర్మిస్తున్న మెడికల్ సిటీ, కేవలం మరో హాస్పిటల్ మాత్రమే కాదు. ఇది భారతదేశ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు కొత్త మార్గదర్శి. ఇక్కడ ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్, లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ వంటివాటితో పాటు.. ప్రపంచంలోని కొంతమంది అత్యుత్తమ వైద్యులు ఉంటారని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.భవిష్యత్ తరాల ఆరోగ్య సంరక్షణ కోసం, నిపుణులను పెంపొందించడమే లక్ష్యంగా.. ఈ మెడికల్ సిటీలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉంటుందని నీతా అంబానీ పేర్కొన్నారు. ఇది మన దేశానికి గర్వకారణమవుతుందని, ప్రపంచమే మనవైపు చూస్తుందని అన్నారు. ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల సేవలను గుర్తుచేసుకుంటున్న సందర్భంగా నీతా అమ్బనీ ఈ ప్రకటన చేశారు.ఇదీ చదవండి: జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీభారతదేశంలోని అగ్రశ్రేణి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన 'సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్' ఇప్పటివరకు 3.3 మిలియన్లకు పైగా రోగులకు సేవలందించింది. ఇందులో కూడా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి వాటికోసం జీవన్ అనే కొత్త విభాగం ప్రారంభించనున్నట్లు.. లేటెస్ట్ పీడియాట్రిక్ ఆంకాలజీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నీతా అంబానీ వివరించారు.కోస్టల్ రోడ్డు గార్డెన్లుముంబైవాసులను పకృతికి దగ్గర చేసే మరో ఆసక్తికర అభివృద్ధి కార్యక్రమాన్ని నీతా అంబానీ ప్రకటించారు. నగరంలో కోస్టల్ రోడ్డు గార్డెన్లు తీర్చిదిద్దే కార్యక్రమాన్ని రిలయన్స్ ఫౌండేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సముద్ర తీర రోడ్ల చెంతన సుమారు 130 ఎకరాల్లో పచ్చని, ఆహ్లాదాన్ని పంచేలా ఉద్యాన వనాలు, వాక్వేలు, సైక్లింగ్ ట్రాక్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. 48th #RILAGM | Nita Ambani, Founder Chairperson, Reliance Foundation, addresses the Annual General Meeting. - Reached 87 m people across India through Reliance Foundation in 15 years- New 2,000-bed medical city in Mumbai- Touched the lives of 23 m children- Sir HN Reliance… pic.twitter.com/GEyfsRMfHC— CNBC-TV18 (@CNBCTV18News) August 29, 2025 -
అక్కడి వరకు పొడిగిస్తే బాగుంటుంది..
దాదర్: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ)–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నాందేడ్ వరకు పొడిగించారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్చువల్గా పచ్చజెండా ఊపి ప్రారంభించినప్పటికీ గురువారం నుంచి ప్రత్యక్షంగా సర్వీసులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అదనంగా మరో కొత్త రైలు అందుబాటులోకి రావడంతో మరఠ్వాడ రీజియన్ ముఖ్యంగా పర్బణీ, పూర్ణ, నాందేడ్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ముంబై– నాందేడ్ మధ్య నడిచే అనేక రైళ్లున్నాయి. అలాగే నాందేడ్ మీదుగా వెళ్లే మరికొన్ని రైళ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వందేభారత్ రైలును నాందేడ్కు బదులుగా నిజామాబాద్ వరకు పొడిగిస్తే తమకు లాభదాయకంగా ఉండేదని ముంబైలోని నివసిస్తున్న తెలంగాణ ప్రజలు (Telangana Public) అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆరునెలల క్రింద ప్రారంభం.. దాదాపు ఆరు నెలల కిందట ముంబై–జాల్నాల మధ్య ప్రారంభించిన 20705/20706 రైలుకు ప్రయాణికుల నుంచి ఆశించినంత మేర స్పందన రాలేదు. దీంతో నాందేడ్ (Nanded) వరకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (ashwini vaishnaw) రెండు నెలల కిందట మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ముంబై–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నాందేడ్ వరకు పొడిగిస్తామని ప్రకటించారు. ముంబై–నాందేడ్ మధ్య ఉన్న 610 కిలోమీటర్ల దూరాన్ని వందేభారత్ రైలు కేవలం 9 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.18 చైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్లు ఇలా మొత్తం 20 బోగీలున్న ఈ రైలులో 1,440 మంది ప్రయాణించేందుకు వీలుంది. 20705 నంబరు రైలు ప్రతీ రోజు ఉదయం 5 గంటలకు నాందేడ్ స్టేషన్ నుంచి బయలుదేరి పూర్ణ, పర్బణీ, జాల్నా, ఔరంగాబాద్, మన్మాడ్, నాసిక్, కల్యాణ్, థానే, దాదర్ స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2.25 గంటలకు సీఎస్ఎంటీకి చేరుకుంటుంది. అలాగే 20706 నంబరు రైలు మధ్యాహ్నం 1.10 గంటలకు సీఎస్ఎంటీ నుంచి బయలుదేరి రాత్రి 10.50 నాందేడ్కు చేరుకుంటుంది. ఈ రైలువల్ల రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల విలువైన సమయం ఎంతో ఆదా కానుంది. ఇప్పటికైనా స్పందించండి... ఇదిలాఉండగా తెలంగాణలోని నిజామాబాద్, ఆర్మూర్, మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల, కరీంనగర్ (Karimnagar) ప్రాంత వాసులకు ముంబై నుంచి నేరుగా నడిచే సీఎస్ఎంటీ– లింగంపల్లి దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు మాత్రమే ఆధారం. అజంతా ఎక్స్ప్రెస్ రైలు కూడా ఉన్నప్పటికీ ఇది మన్మాడ్ నుంచి బయలు దేరుతున్న కారణంగా వీరికి అంత సౌకర్యవంతంగా ఉండదు. దీంతో అందుబాటులో ఉన్న ఒకే ఒక్క దేవగిరి ఎక్స్ప్రెస్ సీజన్, అన్సీజన్ తేడా లేకుండా ఎప్పుడూ కిటకిటలాడుతుంటూంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబై (Mumbai) పర్యటనకు వచ్చిన అనేక మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ముంబై– నిజామాబాద్ ఒక ప్రత్యేక రైలు కావాలని వేడుకుంటూ అనేక వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఆ లేఖలన్నీ చెత్త బుట్టల పాలయ్యాయి. ఇంతవరకు ఈ విజ్ఞప్తిని పట్టించుకున్నవారే లేరు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాతైనా తమ కల నెరవేతుందని ముంబైలో ఉంటున్న తెలంగాణ వాసులు భావించారు. కానీ అది నెరవేరలేదు.చదవండి: సాధారణ చార్జీలతో ఎక్స్ప్రెస్ ప్రయాణం!ఈ నేపథ్యంలో తాజాగా ముంబై–జాల్నా మధ్య నడుస్తున్న వందేభారత్ రైలునైనా నిజామాబాద్ వరకూ పొడిగించినా బాగుండేదని, దీని వల్ల రైల్వేకు ఆదాయం కూడా భారీగా సమకూరేదని స్థానిక తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ వందేభారత్ రైలును నిజామాబాద్ వరకూ పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నారు. నాందేడ్ వరకు విస్తరించారు. దీన్ని నిజామాబాద్ (Nizambad) వరకు పొడగిస్తే తెలంగాణ వాసులకు ఎంతో మేలు జరిగేది. రైల్వేకు కూడా భారీగా ఆదాయం వచ్చేది. కనీసం ఈ వందేభారత్ రైలునైనా నిజామాబాద్ వరకు పొడిగించే ప్రయత్నం చేయాలని ముంబైలో ఉంటున్న తెలంగాణ వాసులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు.రాత్రి 12 దాకా మెట్రో సర్వీసులు దాదర్: గణేశోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్ధం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయించింది. వివిధ ప్రాంతాల నుంచి వినాయకుని దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశ్యంతో ఎమ్మెమ్మార్డీయే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మెట్రో రైళ్లు ప్రతీరోజు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. కానీ గణేశోత్సవాల సందర్భంగా ఎదురయ్యే రద్దీని దృష్టిలో ఉంచుకుని నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు అంటే సెప్టెంబరు ఆరో తేదీ వరకు 11 రోజులపాటు కొనసాగుతాయని మెట్రో–2ఏ, మెట్రో–7 మార్గాలలో అర్థరాత్రి 12 గంటలవరకూ సర్వీసులు నడపనున్నట్లు పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా ట్రిప్పుల సంఖ్య కూడా పెంచినట్లు వెల్లడించారు. -
ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసిన సోనూ సూద్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. అరుంధతి మూవీలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో విలన్గా మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు ఈ ఏడాది ఫతే మూవీతో ప్రేక్షకులను అలరించారు.తాజాగా సోనూ సూద్ తన ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని లోఖండ్వాలా మినర్వా ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మీ అపార్ట్మెంట్ను దాదాపు రూ.8.10 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. కాగా.. సోనూ సూద్ 2012లో ఈ భవనాన్ని రూ. 5.16 కోట్లకు కొనుగోలు చేశాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రూ. 2.94 కోట్ల లాభానికి అమ్మేశాడు.ఇక సోనూ సూద్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ఫతే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి సోనూనే దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించనంత స్థాయిలో రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 13.35 కోట్లు వసూలు మాత్రమే చేసింది. ఈ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు సోనూ సూద్. ప్రస్తుతం అతను ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయలేదు. -
దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమా
ముంబైలో GSB సేవా మండల్ ఏర్పాటు చేసిన అత్యంత సంపన్నమైన గణేష్ విగ్రహం విశేషంగా నిలుస్తోంది. ఈ ఏడాది గణపతి నవర్రాతి వేడుకలకు సంబంధించి తన ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. దీంతో ముంబైలో పండుగ ఉత్సాహం మిన్నంటింది. ఈ అద్భుతమైన విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇది నిజంగా "విరాట్ దర్శనం" అని అభివర్ణించారు భక్తులు. అంతేకాదు ఈ ఏడాది గణపతి విగ్రహం భారతదేశంలోనే అత్యంత ధనిక గణపతి విగ్రహంగా రికార్డు క్రియేట్ చేసింది.గణేష్ చతుర్థి 2025 వేడుకలుGSB సేవా మండల్ గణపతి వేడుకలు ఆగస్టు 27న సియోన్లోని కింగ్స్ సర్కిల్లో ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. పలు నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం విగ్రహం 69 కిలోల బంగారు ఆభరణాలు, 336 కిలోల వెండితో అలంకరించారు. ఇది ముంబైలో అత్యంత సంపన్నమైన గణపతిగా నిలిచింది. అంతేకాదు దీనికి గట్టి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం విశేషం. View this post on Instagram A post shared by Youth of GSB (@youthofgsb)అలాగే GSB సేవా మండల్ తన 71వ గణేష్ ఉత్సవాలకు రికార్డు స్థాయిలో రూ. 474.46 కోట్ల భీమా కవరేజీని కూడా పొందింది. ఇదీ ఓ రికార్డే. ఇందుల దాదాపు రూ. 375 కోట్లు పూజారులు, స్వచ్ఛంద సేవకులు, వంటవారు, భద్రతా సిబ్బంది , పండల్ చుట్టూ ఉన్న చిన్న సేవా స్టాళ్లలో పనిచేసేవారికి వ్యక్తిగత ప్రమాద బీమాకు కేటాయించబడింది. ఈ పాలసీలో అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రత్యేక ప్రమాదాలు , డిజిటల్ ఆస్తుల నుండి రక్షణ కూడా ఉంది. అదనంగా రూ. 30 కోట్లు ప్రజా బాధ్యతను కవర్ చేస్తాయి, భక్తులకు భద్రతా ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025: గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన తీపి వంటకాలుగణపడి ఆభరణాల కోసమే రూ. 67.03 కోట్ల బీమా ఉంది. గత ఏడాది గణేష్ మంటపానికి అందించిన మొత్తం భీమా రూ. 400.58 కోట్లుగా ఉంది, ప్రస్తుతం ఆ రికార్డును ఆ బెంచ్మార్క్ను అధిగమించింది. భక్తుల కోసం భద్రత నిమిత్తం మూడు షిఫ్టులలో 875 మంది సిబ్బంది, 100 కి పైగా CCTV కెమెరాలు, AI-ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థలు మరియు మెటల్ డిటెక్టర్ గేట్లను మోహరించింది. 1954లో స్థాపించబడిన GSB సేవా మండల్ ముంబైలోని గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహిస్తుంది. ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా భారీ విరాళాలు అందుతాయి.చదవండి: Vithika sheru బొజ్జ గణపయ్య మేకింగ్ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Youth of GSB (@youthofgsb) -
వినాయక చవితి వేడుకలు: ముంబై సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ
ముంబై: ఈరోజు(ఆగస్టు 27) వినాయక చవితి. దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం కోసం ఆలయాలు, మండపాల వద్ద బారులు తీరుతున్నారు. #WATCH | Nagpur, Maharashtra | Devotees in large numbers offer prayers at the Shri Ganesh Mandir Tekdi on the occasion of #GaneshChaturthi2025. pic.twitter.com/RcrxwILcL3— ANI (@ANI) August 27, 2025నాగ్పూర్: వినాయకచవితి వేళ టెక్టీ గణపతి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.#WATCH | Mumbai | Marking the beginning of the festival of #GaneshChaturthi2025 puja performed at the Siddhivinayak temple. pic.twitter.com/9VtJBzaF9f— ANI (@ANI) August 26, 2025ముంబై: సిద్ధివినాయక ఆలయంలో పూజలతో, భక్తుల కోలాహలంతో సందడిగా మారింది.#WATCH | Mumbai | Marking the beginning of the festival of #GaneshChaturthi2025 puja performed at the Siddhivinayak temple. pic.twitter.com/9VtJBzaF9f— ANI (@ANI) August 26, 2025గణపతి దేవుని ఆశీర్వాదం కోసం సిద్ధివినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు.తమిళనాడు: గణేష్ చతుర్థి సందర్భంగా వినాయగర్ ఆలయం అందంగా ముస్తాబయ్యింది.#WATCH | Mumbai | Marking the beginning of the festival of #GaneshChaturthi2025 puja performed at the Siddhivinayak temple. pic.twitter.com/9VtJBzaF9f— ANI (@ANI) August 26, 2025 -
మళ్లీ శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్.. ఈసారి సెలెక్టర్లు తప్పించుకోలేరు..!
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో టీఎన్సీఏ ఎలెవెన్పై 114 బంతుల్లో 138 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన అతడు.. హర్యానాతో ఇవాళ (ఆగస్ట్ 26) ప్రారంభమైన మ్యాచ్లో 112 బంతుల్లో 111 పరుగులు (9 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. హర్యానాతో మ్యాచ్లో సర్ఫరాజ్ తన జట్టు కష్టాల్లో (81/3) ఉన్నప్పుడు బరిలోకి దిగి సూపర్ సెంచరీతో మెరిశాడు. హార్దిక్ తామోర్తో కలిసి జట్టు స్కోర్ను 200 పరుగుల మార్కును దాటించాడు. 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. ఆతర్వాత 40 బంతుల్లో శతక మైలురాయిని తాకాడు.టీఎన్సీఏ ఎలెవెన్పై కూడా సర్ఫరాజ్ ఇదే తరహాలో సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కూడా కష్టాల్లో ఉన్న తన జట్టును సెంచరీతో గట్టెక్కించాడు. ఆ ఇన్నింగ్స్లో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చి 36 పరుగులు చేశాడు. అయినా ఆ మ్యాచ్లో ముంబై ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ తర్వాత ముంబై ఆడిన రెండో మ్యాచ్లో (బెంగాల్తో) సర్ఫరాజ్ ఖాన్ ఆడలేదు. తిరిగి మూడో మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చి మరోసారి శతక్కొట్టాడు.27 ఏళ్ల సర్ఫరాజ్ తాజా ప్రదర్శనలతో భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సర్ఫరాజ్ అద్బుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ సెలెక్టర్లు అతడ్ని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఆ పర్యటనలో సర్ఫరాజ్ స్థానంలో అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ దారుణంగా విఫలం కావడంతో సెలెక్టర్లు మళ్లీ సర్ఫరాజ్ ఖాన్ వైపు చూసే అవకాశం ఉంది. సర్ఫరాజ్ గతేడాదే స్వదేశంలో ఇంగ్లండ్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే రెండు హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత న్యూజిలాండ్పై భారీ సెంచరీతో (150) మెరిశాడు. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో అవకాశాలు దక్కలేదు. కెరీర్లో మొత్తం 6 టెస్ట్లు ఆడిన సర్ఫరాజ్ సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 37.10 సగటున 371 పరుగులు చేశాడు. బుచ్చిబాబు టోర్నీ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ దులీప్ ట్రోఫీ ఆడనున్నాడు. ఆ టోర్నీలో కూడా సర్ఫరాజ్ సెంచరీలు చేస్తే సెలెక్టర్లు అతన్ని తప్పక టెస్ట్ జట్టుకు ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
ఈ గణేశుని దర్శనానికి.. 40 గంటలు వేచి ఉండాల్సిందే..
ముంబై: దేశవ్యాప్తంగా గణేశుని ఉత్సవాల సందడి మొదలయ్యింది. మహారాష్ట్రలోని ముంబైలో కొలువైన ప్రసిద్ధ ‘లాల్బాగ్చా రాజా’ తొలిచూపులోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు.భక్తులలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఈ ఏడాది ‘లాల్బాగ్చా రాజా’ ఊదా రంగు దుస్తులు ధరించి, తలపై కిరీటం, చేతిలో చక్రం తిప్పుతూ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు.‘లాల్బాగ్చా రాజా’ సన్నిధి భక్తులకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుతోంది. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఆగస్టు 27న మొదలై 10 రోజుల పాటు కొనసాగనుంది.ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ‘లాల్బాగ్చా రాజా’ను దర్శనం చేసుకునేందుకు 40 గంటల పాటు క్యూలో నిలుచునే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. -
మొదట్లో అంతా సరదాగా ఉండేది.. కానీ అదో పెద్ద సవాల్: రోహిత్ శర్మ
ముంబై: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టి20ల్లో అద్భుత ప్రదర్శనతో ఎన్నో గొప్పరికార్డులు సాధించిన రోహిత్... టెస్టుల్లో అలాంటి ప్రభావం చూపలేకపోయాడు. పడుతూ, లేస్తూ సాగిన కెరీర్లో 67 టెస్టులు ఆడిన అతను 4301 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా.. టెస్టు క్రికెట్ (Test Cricket) అంత సులువు కాదని, అది ప్రతీ ఆటగాడికి సవాల్ విసురుతుందని రోహిత్ వ్యాఖ్యానించాడు. దాని కోసం సన్నద్ధత కూడా చాలా కఠోరంగా ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు.ఇది పెద్ద సవాల్‘టెస్టుల కోసం సన్నద్ధత చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఫార్మాట్లో ఎక్కువ సేపు మైదానంలో గడపాల్సి ఉంటుంది. ఐదు రోజుల పాటు ఆటలో ఉండాలంటే అంత సులువు కాదు. శారీరకంగా ఎంతో అలసిపోవడమే కాదు, మానసికంగా కూడా ఇది పెద్ద సవాల్ విసురుతుంది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్ల దీనికి అలవాటు పడతారు.మేం ముంబైలో పోటీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన సమయంలో రెండు లేదా మూడు రోజుల మ్యాచ్లు జరిగేవి. దానికి అనుగుణంగా మా శరీరాలను సిద్ధం చేసేవాళ్లం. కఠిన పరిస్థితులు ఎదురైనా దీని వల్ల పని కాస్త సులువవుతుంది’ అని సియెట్ టైర్ సంస్థ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రోహిత్ అన్నాడు. ప్రాక్టీస్తో క్రమశిక్షణ... యువ ఆటగాళ్లు తమ కెరీర్ ఆరంభంలో ఈ సన్నద్ధతపై దృష్టి పెట్టరని, అయితే దాని ప్రాధాన్యత ఏమిటో తర్వాతి రోజుల్లో తెలుసు కుంటారని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన రోజుల్లో అంతా సరదాగా ఉండేది. వినోదం కోసమే ఆడేవాళ్లం.అయితే వివిధ వయోవిభాగాల్లో ఆడటం మొదలు పెట్టి ముందుకు వెళుతుంటే పరిస్థితి మారిపోతుంది. ఎంతో మంది సీనియర్లు, కోచ్లకు ప్రాక్టీస్ ప్రాధాన్యత ఏమిటో మీకు వివరిస్తారు. ఈ తరహాలో సాధన కొనసాగిస్తే మీలో క్రమశిక్షణ పెరగడంతో పాటు పరిస్థితులు అర్థం అవుతాయి. సన్నద్ధత వల్లే జట్టు నీనుంచి ఏం ఆశిస్తుందో తెలుస్తుంది’ అని దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ఆడిన రోహిత్ విశ్లేషించాడు. ఒత్తిడిలో స్పందించడం కీలకం... టెస్టుల కోసం సిద్ధమయ్యేందుకు మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాలని ఈ ముంబైకర్ సూచించాడు. ‘టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగడానికి ముందు ఎంతో సన్నద్ధత ఉంటుంది. సుదీర్ఘ ఫార్మాట్ ఆడేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే మానసికంగా ప్రశాంతంగా, దృఢంగా ఉండటం చాలా అవసరం.మైదానంలో ఎక్కువ సేపు ఆడేందుకు అవసరమైన పట్టుదల సాధనతోనే వస్తుంది. నేను కూడా అలాగే చేశాను. ముందుగా ముంబై తరఫున ఆడటం మొదలు పెట్టినప్పుడు, ఆ తర్వాత భారత్కు ఆడినప్పుడు కూడా సన్నద్ధతకే ఎక్కువ సమయం ఇచ్చేవాడిని. ఒక్కసారి ఆట మొదలైందంటే మనం సొంతంగా చేసేవాటికంటే జరుగుతున్న పరిణామాలకు అప్పటికప్పుడు స్పందించడమే కీలకంగా మారుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏం చేసినా తీవ్ర ఒత్తిడి మధ్య సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాచ్కు ముందు సన్నాహకమే అన్నింటికంటే కీలకంగా మారుతుంది’ అని రోహిత్ వివరించాడు. చదవండి: ‘సిరాజ్ను ఆగమని నేనెలా చెప్తా.. గెలిస్తే చాలు దేవుడా అనుకున్నా’ -
ఇన్స్టాలో స్క్రోల్ చేసేవారికి జాబ్!
ఎక్కడైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే రాత పరీక్షలు & ఇంటర్వ్యూలు వంటివి ఉంటాయి. కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎక్కువ సమయం గడిపే వాళ్ళకే ఉద్యోగం అంటూ.. మాంక్ ఎంటర్టైన్మెంట్ కో ఫౌండర్, సీఈఓ 'విరాజ్ శేత్' పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విరాజ్ శేత్ ఇటీవలి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో "డూమ్-స్క్రోలర్" కోసం, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తి కోసం చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థి రోజుకు కనీసం ఆరు గంటలు ఇన్స్టా, యూట్యూబ్లో స్క్రోలింగ్ చేస్తుండాలి. (డూమ్-స్క్రోలర్లు అంటే.. ఫోన్ స్క్రీన్ స్కోల్ చేస్తూ ఉండేవారు).నైపుణ్యాల విషయానికి వస్తే.. హిందీ, ఇంగ్లీష్ భాషలలో పట్టు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై మంచి పట్టును కలిగి ఉండాలి. క్రియేటర్ కల్చర్ మీద ఆసక్తి ఉండాలని విరాజ్ శేత్ వెల్లడించారు. ఎక్సెల్ ఉపయోగించడం కూడా బాగా తెలుసుండాలని చెప్పారు. ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం ముంబై అని, ఇది ఫుల్ టైమ్ జాబ్ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తాప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్స్టాలో ఎక్కువ టైమ్ కేటాయించేవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయా అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం చెడు వ్యసనం కాదని మా అమ్మతో చెబుతాను, అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు నేను 19 గంటలు సమయం కేటాయిస్తాను, ఇది సరిపోతుందా అని అన్నారు. -
దేశ ఆర్థిక రాజధాని ముంచెత్తిన వర్షాలు
-
స్టడీ..రెడీ.. స్టార్ట్ అప్
అక్షరం అంటే ఆమెకు ఆరాధన. పుస్తక పఠనమంటే ప్రీతి. దాంతో అందరూ ఆమెను పుస్తకాల పురుగు అని పిలిచేవారు. పుస్తకాలు చదువుతూనే ఆమె మార్కెటింగ్లో ఎం.బి.ఎ. పూర్తి చేసింది. అయితే ఆ చదువును ఆమె కార్పొరేట్ సంస్థలలో లక్షలు సంపాదించి పెట్టే ఉద్యోగం చేయడానికి ఉపయోగించుకోదలచుకోలేదు. సెల్ఫోన్లతో... రకరకాల గ్యాడ్జెట్స్తో... కంప్యూటర్ గేమ్స్తో బిజీ బిజీగా ఉంటున్న నేటి తరంతో కూడా పుస్తకాలను చదివించాలనుకుంది. ముందు తన కూతురు చదవడం కోసం ఆమెను ఆకట్టుకునే పుస్తకాల కోసం వెతుకుతూ, తనకు కావలసిన పుస్తకాలేవీ కనిపించకపోయేసరికి తానే ఒక పుస్తకాలు అమ్మే వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించకూడదు.. అన్న ఆలోచన కలిగింది. అదే బిబ్లియోఫైల్స్ అనే స్టార్టప్కు పునాదిగా మారింది. ఆమే ముంబయ్కి చెందిన అపూర్వ మాత్రే. ప్రారంభించిన 6 నెలల్లో 10 వేలకు పైగా కస్టమర్లు 150+ ప్రేరణాత్మక సమీక్షలు వచ్చాయి. ఎందుకంటే బిబ్లియోఫైల్స్ నినాదమే చదవడాన్ని ఒక జీవనశైలిగా మార్చుకోవడం. ఈ ఆలోచనతోనే, అపూర్వ మాత్రే 2020లో పిల్లల పుస్తకాలు అమ్మే స్టార్టప్ను స్థాపించింది. ఒక ఆలోచన నుంచి పుట్టిందిస్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో అనుభవజ్ఞురాలైన అపూర్వ మాత్రే, గొప్ప కార్పొరేట్ నేపథ్యం కలిగిన వ్యూహాత్మక సలహాదారు అద్న్యేష్ దళపతిని తన జీవితంలోనే కాదు... వ్యాపారంలో కూడా భాగస్వామిని చేసుకుంది. వారి భాగస్వామ్యం బిబ్లియోఫైల్స్కు మూలస్తంభం. విభిన్న నైపుణ్యాలతో కలబోసుకున్న కలలు అద్భుతమైన ఒక ఆలోచనను ఎలా సృష్టించగలవో ఇది రుజువు చేస్తుంది, ‘‘ఒక పుస్తక ప్రియురాలిగా నా బిడ్డకు బాల్యం నుంచే చదవడం పరిచయం చేయాలన్నది నా ఆలోచన. అయితే అది ఒక పనిగా అనిపించకూడదు – దానిని ఆనందదాయకంగా మార్చాలనుకున్నాను. నా కుమార్తె అభిరుచులకు సరిపోయే వయస్సుకు తగిన పుస్తకాలను నేను జాగ్రత్తగా పరిశోధించి ఎంచుకున్నాను. ఫలితంగా, ఆమె పుస్తకంతో ప్రేమలో పడింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించేసింది. త్వరలోనే ఆమె తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు వయస్సుకు తగిన పుస్తకాలను సిఫార్సు చేయడం, అమ్మడం ప్రారంభించింది. పిల్లలు ఈ పుస్తకాలను ఇష్టపడ్డారు. చదవడం ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారింది. పుస్తకాలతోపాటు...ప్రారంభంలో పుస్తకాలను మాత్రమే అమ్మే ఈ కంపెనీ చాలా దూరం వచ్చింది. ఇప్పుడు విద్యార్థుల కోసం వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటు ధరలలో అందిస్తోంది. ఇందులో లంచ్బాక్స్లు, బాటిళ్లు, అందమైన స్టిక్కర్ ట్యాగ్లు ఇలాంటి అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. పిల్లల పుస్తకాల విషయానికి వస్తే అనేక ఎంపికలు ఉన్నాయి. అసలు చదవడం ఒక జీవనశైలిగా మార్చుకోవాలంటుంది అపూర్వ. దీనిని సాధించాలంటే... మనం మన పిల్లలకు ప్రినేటల్ దశ నుంచే అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచే పుస్తకాలు చదివి వినిపించాలన్నది ఆమె ఆలోచన. ఇందుకోసం ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది; అది కొత్తపుస్తకం మార్కెట్లోకి ప్రవేశించిన క్షణం నుంచి సిఫార్సులు పంచుకునే స్థలం. బిబ్లియోఫైల్స్ అంతిమ లక్ష్యం భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న... సంతోషంగా, బాగా అభివృద్ధి చెందిన పిల్లలను పెంచడం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. సోషల్ మీడియా, అధిక స్క్రీన్ సమయం ఉన్న సమకాలీన కాలంలో బిబ్లియోఫైల్స్ వంటి స్టార్టప్లు మనలోని సృజనాత్మక, ఊహాత్మక స్వభావాన్ని గ్రహించడంలో, దానితో కనెక్ట్ అవ్వడంలో కీలక పాత్రపోషిస్తాయి. ఇది ముఖ్యంగా మన ఆత్మను సజీవంగా ఉంచుతుంది. యువ హృదయాలలో ప్రేమ, కరుణ, సానుభూతిని పెంపొందించడం చాలా అవసరం, బిబ్లియోఫైల్స్ విలువలు, సూత్రాల ద్వారా దానిని సాధ్యం చేస్తోంది అవును... నేనే ఓ బిబ్లియోఫైల్‘‘నేను బిబ్లియోఫైల్స్ను ప్రారంభించినప్పుడు, దానిని ఎలా పెంచుకోవాలో నాకు తెలియదు. నా కుమార్తె జీవితాంతం చదవ గలిగేందుకు సరిపడా పుస్తకాలు కొన్నప్పటికీ, నేను ఖర్చు చేసినంత సంపాదించలేదనే అపరాధ భావనలోకి నాకు తెలియకుండానే వెళ్లి పోయాను. ఈ ఆలోచన నిప్పురవ్వలా నా అభిరుచిని రగిలించింది, అది నా వృత్తిగా మారింది. అవును... బిబ్లియోఫైల్స్ పుట్టింది, ఎందుకంటే నేనే ఓ బిబ్లియోఫైల్ కాబట్టి. అందుకే నేను దీని ద్వారా ఎంత సంపాదించ గలిగాన్న దానికంటే ఏం సాధించానన్నదే నాకు సంతృప్తినిస్తుంది.’’ – అపూర్వ మాత్రే -
ముంబై చేస్తున్న హెచ్చరిక!
ప్రణాళికాబద్ధంగా లేని పట్టణీకరణను పరిహసిస్తూ తరచు ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడుతున్నా పాలకులు మేల్కొనటం లేదనటానికి మళ్లీ నీట మునిగిన ముంబై మహానగరమే సాక్ష్యం. ముంబై దక్షిణ ప్రాంతంలో గురువారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా 300 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతంలో 200 మి.మీ. వర్షం కురిసిందంటే కుంభవృష్టి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. నిన్నంతా దాదాపు ప్రశాంతంగానే ఉన్నట్టు కనబడిన ఆ మహానగరం, మళ్లీ భారీ వర్షాలుంటాయన్న హెచ్చ రికలతో బెంబేలెత్తుతోంది. ఏటా వర్షాకాలంలో కనీసం ఒక్కసారైనా వరదలు ముంబైని పలకరించటం ఆనవాయితీ. ఈసారి మే నెలలోనే ఒక రోజు నడుంలోతు వరదల్లో నగరం నానా యాతనలూ పడింది. ఆ నెలలో కొత్తగా ప్రారంభమైన వొర్లి మెట్రో స్టేషన్ భారీ వరదతో వణికిపోయింది. రెండు నెలలు గడిచాయో లేదో మళ్లీ నగరానికి కుంభవృష్టి తప్పలేదు. నిరుడు 21 దఫాలు 100 మి.మీ. వర్షం పడిందని గణాంకాలు చెబుతు న్నాయి. వాతావరణంలో పెనుమార్పులు విపత్తుల తీవ్రతను పెంచాయి. అస్తవ్యస్థ పట్టణీకరణ ఈ సమస్యను వందల రెట్లు పెంచింది. ఈసారి వర్షాలవల్ల సంపన్నులు, సినీతారలు నివసించే ప్రాంతాలు సైతం వరద నీటన మునిగాయి. ఇటీవలే ఆర్భాటంగా ప్రారంభించిన మోనోరైల్ సైతం భారీ వర్షాలతో విద్యుత్ సరఫరా అందక గంటసేపు నిలిచిపోయింది. చివరకు అద్దాలు బద్దలుకొట్టి వందమంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ముంబై తూర్పు శివారులోని మీథి నది ఆ మహానగరంపై విరుచుకుపడింది. అయిదు రోజులపాటు వరసగా కురిసిన వర్షాలతో ఆ నది కట్టు తెంచుకుని అటువైపుగల రైల్వే ట్రాక్లన్నిటినీ ముంచెత్తింది. అరేబియా సముద్రం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా ఉండటంతో దానిలో కలవాల్సిన మీథి వరద నీరు కాస్తా వెనక్కొచ్చి నగరంలోని అనేక ప్రాంతాలను జలమయం చేసింది. హైదరాబాద్ నగరంలో మూసీ మాదిరిగా ముంబైలో మీథి నదిని కూడా మురికిమయం చేశారు. అందులో 70 శాతం మురికినీరు కాగా, 30 శాతం చెత్తాచెదారం, 10 శాతం పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యా లుగా కనబడు తున్నవన్నీ సారాంశంలో మానవ తప్పిదాల పర్యవసానం. గత యేభైయ్యే ళ్లుగా నగరాన్ని విస్తరించుకుంటూ పోవటమే తప్ప అందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినవారు లేరు. అలాగని మీథి నది ప్రక్షాళనకు ప్రయత్నాలు జరగ లేదని కాదు. 2013–23 మధ్య బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రూ. 2,000 కోట్లు వ్యయం చేసింది. కానీ చివరకు తాజా వర్షాల ధాటికి మురికి నీటితో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నివాస ప్రాంతాలన్నీ నిండిపోయాయి. 70వ దశకం వరకూ పరిశుభ్రంగా ఉండే ఆ నది మురికి కూపంగా మారిందంటే పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం.భౌగోళికంగా ముంబై తీరం పశ్చిమ కనుమలకు దగ్గరలో ఉంది. వాటివల్ల నైరుతి రుతుపవనాల్లో గాలుల తీవ్రత హెచ్చుగా ఉంటుంది. అందుకే ఏటా భారీవర్షాలు, వరదలు తప్పవు. దేశ ఆర్థిక రాజధానిగా, ఢిల్లీ తర్వాత అత్యధిక జనసాంద్రత గల నగరంగా ముంబై మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రదమైనది. దేశ జీడీపీలో ఆ నగరం వాటా దాదాపు 7 శాతం. కానీ వరదలు ముంచుకొచ్చిన ప్రతిసారీ మౌలిక సదుపాయాలు దెబ్బతినటం, ఉత్పాదకత పడకేయటం రివాజైంది. పునర్నిర్మాణానికి ఏటా రూ. 550 కోట్ల వ్యయమవుతోంది. నిజానికి ఈ సంక్షోభం అక్కడే కాదు... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాలకులనూ పునరాలోచనకు పురిగొల్పాలి. నగర నిర్మాణాల్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలో, పెద్ద నగరాల నిర్మాణంపై మోజువల్ల చివరకు జరిగేదేమిటో గ్రహించేలా చేయాలి. కానీ అదెక్కడా కనబడదు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి తాజా వర్షాలకు ఎంత దయనీయ స్థితిలో పడిందో కనబడుతూనే ఉంది. పెద్ద నగరాల నిర్మాణంవల్ల జనసాంద్రత పెరిగి మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమవుతుందనీ, పైగా అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించటం వల్ల ఇతర ప్రాంతాలు ఎప్పటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తలకెక్కటం లేదు. మన కోసం ప్రకృతి మారదు. మనమే దానికి అనుగుణంగా మారాలన్న స్పృహ పాలకులకు కలగాలి. మళ్లీ మళ్లీ మునుగుతున్న ముంబై మహానగరాన్ని చూసైనా గుణపాఠం నేర్వకపోతే భవిష్యత్తు క్షమించదు. -
ఫ్లాట్ కొన్న సచిన్ టెండుల్కర్ సతీమణి.. ‘జస్ట్’ రూ. 32 లక్షలు!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సతీమణి అంజలి టెండుల్కర్ ఫ్లాట్ కొన్నారు. ముంబైకి సమీపంలోని వివర్ ఏరియాలో చవకైన ధరకే ఫ్లాట్ను సొంతం చేసుకున్నారు. ఇందుకు గానూ ఆమె రూ. 32 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.ఈ ఫ్లాట్ విస్తీర్ణం కేవలం 391 చదరపు అడుగులు మాత్రమే. గతేడాది మే 30న అంజలి (Anjali) ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆమె రూ. 1.92 లక్షలు మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 వేలు చెల్లించినట్లు జాప్కీ.కామ్ వెల్లడించింది.కాగా మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ ఉంటుంది. అంతేకాదు.. మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుంది.సచిన్ ఆస్తి ఎంతంటే?ఇరవై నాలుగేళ్లపాటు టీమిండియా క్రికెటర్గా కొనసాగిన సచిన్ టెండుల్కర్ తన సుదీర్ఘ కెరీర్లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. అదే రేంజ్లో సంపదనూ పోగేసుకున్నాడు. ఓవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గా వార్షిక జీతం, మ్యాచ్ ఫీజులు.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సదరు బ్రాండ్లకు వ్యాపార భాగస్వామిగా ఉండటం ద్వారా రెండు చేతులా సంపాదించాడు.ఆటకు వీడ్కోలు పలికి పుష్కరం గడుస్తున్నా సచిన్ సంపాదన పెరుగుతూనే ఉంది. వివిధ నివేదికల ప్రకారం.. సచిన్ నికర ఆస్తుల విలువ రూ. 1250 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక సచిన్ కుటుంబం నివసించేందుకు బాంద్రాలో తన కలల సౌధాన్ని నిర్మించాడు. దీని విలువ రూ. 80 కోట్లకు పైమాటే!అలాంటిది సచిన్ భార్య అంజలి మాత్రం ఇంత చవగ్గా ఫ్లాట్ కొనడం పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వివర్లో ఇంతటి చిన్న విస్తీర్ణంలో ఉండే ఫ్లాట్లను అద్దెల కోసం కొనుగోలు చేస్తారు చాలా మంది. స్టూడియోలు, సింగిల్ బెడ్రూమ్ రెంటల్స్ కోసం వినియోగిస్తారు.క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలోనే..క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలోనే తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలి మెహతాను ప్రేమించిన సచిన్ టెండుల్కర్.. 1995లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సారా, కుమారుడు అర్జున్ టెండుల్కర్ సంతానం.ఇక ఇటీవల సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహ నిశ్చితార్థం జరిగింది. వ్యాపార దిగ్గజం రవి ఘామ్ మనుమరాలు సానియా చందోక్ మెడలో అర్జున్ మూడుముళ్లు వేయబోతున్నాడు. అర్జున్ అక్క సారాకు సానియా బెస్ట్ ఫ్రెండ్.ఇదిలా ఉంటే.. అర్జున్ క్రికెటర్గా అదృష్టం పరీక్షించుకుంటుండగా.. సారా మోడల్, న్యూట్రీషనిస్ట్గా రాణిస్తోంది. ఇటీవలే ఆమె పైలైట్స్ స్టూడియో (వెల్నెస్ సెంటర్)ను ఆరంభించింది కూడా!.. అంతా ఆట వల్లేఅతి సాధారణ కుటుంబంలో జన్మించిన సచిన్ ఈ స్థాయికి చేరడానికి ఏకైక కారణం క్రికెట్. తన నైపుణ్యాలతో శతక శతకాల ధీరుడిగా ఈ ముంబైకర్ ప్రపంచ క్రికెట్లో ఆల్టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఆర్థికంగానూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.చదవండి: నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే: సారా టెండుల్కర్ -
ఠాక్రే కజిన్స్కు ఫస్ట్ షాక్! ఆ మర్నాడే..
దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత.. ఠాక్రే సోదరులు ఒక్కటి కావడం తెలిసిందే. ఈ కలయికతో మహా రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ, రెండు నెలలు తిరగకుండానే ఈ కజిన్స్కు తొలి షాక్ తగిలింది.ఉద్దవ్ శివసేన(Shivsena UBT)- మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)కూటమి తొలి పరీక్షలోనే ఫెయిల్ అయ్యింది. ముంబై బెస్ట్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికలు త్వరలో జరగబోయే ముంబై కీలక మున్సిపల్ ఎన్నికలకు వార్మప్ మ్యాచ్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. దీంతో ‘‘ఠాక్రే బ్రాండ్ ఫ్లాప్’’ అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ‘‘ఇది కేవలం సహకార ఎన్నిక మాత్రమే కాదు, ఒక్కసారి విడిపోయిన ఠాక్రే సోదరులు మళ్లీ కలిసిన తర్వాత వారి రాజకీయ పునరాగమనానికి ఇది ఒక పరీక్ష. బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో విజయవంతంగా దూసుకుపోతున్న నేపథ్యంలో.. ఈ మొదటి అడ్డంకినే ఠాక్రేలు దాటలేకపోయారు’’ అక్కడి మీడియాలో విశ్లేషణ జరుగుతోంది. అయితే..ఈ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను అధికార నివాసం వర్ష బంగ్లాకు వెళ్లి కలిశారు. సుమారు గంటన్నరపాటు ఇద్దరూ చర్చించుకున్నారు. దీంతో ఉద్దవ్కు రాజ్ హ్యాండిస్తారా? అనే ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే.. కాసేపటికే ఊహాగానాలకు రాజ్ ఠాక్రే తెర దించారు. ఇది రాజకీయ భేటీ ఎంతమాత్రం కాదని, నగర అభివృద్ధికి సంబంధించిన విషయాలపై సీఎంతో చర్చించినట్లు మీడియాకు తెలిపారు.గ్రేటర్ ముంబైను వర్షాలు ముంచెత్తడం, అదే సమయంలో నగరంలో ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుండడం లాంటి అంశాలపైనే చర్చించినట్లు తెలిపారు. ‘‘పావురాలు, ఏనుగులు అంటూ అవసరం లేని విషయాలపై ముంబైని అధికార యంత్రాంగం ఎటో తీసుకుని పోతోంది. ఇరుకు రోడ్లలో వర్షాల వల్ల పడుతున్న కష్టాల గురించి సీఎంకు వివరించా. రోడ్ల విస్తరణ తద్వారా ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే అంశాల గురించి చర్చించా.. అంతే’’ అని రాజ్ ఠాక్రే తెలిపారు. ఈ భేటీలో నగర పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో హిందీ భాషను బలవంతంగా ప్రవేశపెడుతున్నారంటూ రాజ్ ఠాక్రే బీజేపీకి దూరం జరిగి.. సోదరుడు ఉద్దవ్ ఠాక్రేకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి జులై 5వ తేదీన ముంబైలో ఆవాజ్ మరాఠీచి అనే కార్యక్రమం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ ప్రభుత్వం హిందీ భాష అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగా.. అయినాకూడా ఆ అపూర్వ కలయిక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఫడ్నవిస్ వల్లే తాము ఒక్కటయ్యామని, మరాఠీ గౌరవం పేరిట తాము ఇకపై కలిసే పోరాడతామంటూ ప్రకటించారు కూడా. -
ఒక్కరోజే 30 సెంటీమీటర్ల వాన
ముంబై: ముంబై వరుసగా రెండో రోజూ తడిసిముద్దయింది. మంగళవారం రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు సంబంధించిన వివిధ ఘటనల్లో మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు. మిత్తి నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వానల కారణంగా రోడ్డు, రైలు, విమాన సర్విసులపైనా ప్రభావం తీవ్రంగా పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధులు నదులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు నడుముల్లోతు వరదలోనే ముందుకు సాగాల్సి వచి్చంది. రైలు మార్గాలపై కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల మేర వరద చేరడంతో సెంట్రల్ రైల్వే నడిపే అత్యంత కీలకమైన సబర్బన్ సర్విసులను రద్దు చేసింది. దీంతో, ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. రైళ్లు పట్టాలపైనే నిలిచిపోవడంతో జనం బయటకు దూకి వరద నీళ్లలోనే గమ్యస్థానాలకు కాలినడకన బయలుదేరారు. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12.30 గంటల వరకే పనిచేసింది. సెంట్రల్ రైల్వే దూరప్రాంత రైలు సర్విసులను రీషెడ్యూల్ లేదా రద్దు చేసింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్–థానే మధ్యలో దాదాపు 8 గంటల తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సీఎస్ఎంటీ–మన్ఖుర్ద్ హార్బర్ లైన్లో రైళ్లు మాత్రం నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి 253 విమానాల టేకాఫ్, మరో 163 విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. దృగ్గోచరత సరిగాలేక 8 విమానాలను దారి మళ్లించినట్లు ముంబై ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.నిలిచిన మోనో రైళ్లు సుమారు 700 మందితో మంగళవారం సాయంత్రం బయలుదేరిన మోనో రైళ్లు రెండు అర్థంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. మైసూర్ కాలనీ–భక్తి పార్క్ స్టేషన్ల మధ్యన ఉండగా 6.15 గంటల వేళ విద్యుత్ సరఫరా లోపంతో అర్థంతరంగా నిలిచిపోయింది. ఏసీ పనిచేయకపోవడంతో అందులో ఉన్న 582 మంది గంటపాటు ఉక్కిరిబిక్కిరియ్యారు. స్పృహతప్పిన కనీసం 15 మందిని ఆస్పత్రిలో చేర్పించారు.ఫైర్, మున్సిపల్ సిబ్బంది ప్రయాణికులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించి, బస్సులో గమ్యస్థానాలకు పంపించారని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. వడాలా స్టేషన్కు సమీపంలో 200 మంది ప్రయాణికులతో నిలిచిపోయిన మరో మోనోరైలును అధికారులు విజయవంతంగా వెనక్కి తీసుకెళ్లారు. కాగా, వచ్చే 48 గంటలు అత్యంత కీలకమైన సమయమని సీఎం అన్నారు. ముంబై, థానె, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించామని చెప్పారు. -
monorail: క్రేన్ సాయంతో ప్రయాణికులు బయటకు..
ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి దారుణంగా మారింది ప్రధానంగా మంగళవారం కురిసిన వర్షానికి అక్కడ జన జీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే ముంబైలోని చెంబూర్-భక్తిపార్క్ మధ్య నడిచే మోనో రైలు ఒకటి సాంకేతిక లోపంతో ట్రాక్పై నిలిచిపోయింది. మెట్రో కంటే తక్కువ పరిమాణంతో పాటు ఎలివేటెడ్ ట్రాక్పై నడిచే మోనో రైల్లో చిన్నపాటి విద్యుత్ అంతరాయ ఏర్పడటంతో మంగళవారం సాయంత్రం సమయంలో ట్రాక్పైనే ఉన్నపళంగా ఆగిపోయింది.సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయిన మోనో రైలు ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. అక్కడకు చేరుకుని ప్రయాణికుల్ని క్రేన్ల సాయంతో కిందకు దించింది. అయితే పవర్ సప్లైలో చిన్నపాటి అంతరాయం కారణంగానే ఆ ట్రైన్ నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఆ ట్రైన్ మరమ్మత్తు చర్యలను స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశామని తెలిపారు. అయితే ట్రైన్ ఉన్నపళంగా ట్రాక్పైనే నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అదే సమయంలో ట్రైన్లో ఉన్న ప్రయాణికులు ఎవరూ భయపడవద్దని విజ్ఞప్తి చేశారు.#WATCH | Maharashtra: Passengers rescued from the Monorail that got stuck near Mysore Colony station in Mumbai due to a power supply issue. pic.twitter.com/Ch3zYgFohg— ANI (@ANI) August 19, 2025 -
సబ్మెరైన్ సర్వీస్ ప్రారంభం.. ముంబై వర్షాలపై మీమ్స్ వైరల్
ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యూజర్లకు మంచి స్టప్ దొరికేసింది. ‘‘నగరం మునిగిపోతున్నప్పుడు కూడా మేము మీమ్స్ చేస్తాం" అంటూ సరదాగా నవ్వులు పూయిస్తున్నారు. వరదలపై నెటిజన్లు కాస్త గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ఎక్స్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఓ యూజర్.. ముంబైలో కొత్త సేవలు ప్రారంభమయ్యాయంటూ.. సబ్మెరైన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఫన్నీగా మిమ్స్ను రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు.ఆర్థిక రాజధాని వీధులు వరదల్లో మునిగిపోయాయి.. నగరంలోని కుండపోత వర్షానికి అలవాటు పడ్డామంటూ సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వర్షం కురుపిస్తున్నారు. "స్పిరిట్ ఆఫ్ ముంబై" అనే పదాన్ని కొంతమంది విమర్శిస్తూ కూడా మీమ్స్ చేస్తున్నారు. వర్షాలపై ప్రజలు మీమ్స్ ద్వారా తమ అనుభవాలను వ్యక్తపరస్తూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.New service launched in Mumbai 😂 #MumbaiRainspic.twitter.com/gDIlVjyDPo— V🐧 (@Vtxt21) August 18, 2025నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 36 జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం అంచనా వేసింది. నాందేడ్ జిల్లాలోని ముఖెడ్ తాలుకాలో వర్షాలు, వరదల్లో ఏడుగురు చనిపోయారు. వరదల్లో చిక్కుకుపోయిన కనీసం 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.Mumbaikar right now. #MumbaiRains #MumbaiRain pic.twitter.com/79LMu8LrBt— Siddhanth Pilania (@sidhanthpilania) August 18, 2025ఆర్మీ బృందాన్ని సహాయక చర్యల కోసం పంపించారు. జిల్లాలోని లెండి డ్యామ్లో భారీగా వరద చేరింది. ఇంకా, మహానగరం ముంబైలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఉదయం రెడ్ అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడం, చెట్లు విరిగిపడటంతో కనీసం 40 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.మాతుంగ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద నీటిలో నిలిచిపోయిన స్కూలు బస్సు నుంచి ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో కొన్ని విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. ఒక విమానాన్ని దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు తెలిపారు. అవసరమైతేనే ఇళ్లు వదిలి బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.అరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో సోమవారం 6 నుంచి 8 గంటల వ్యవధిలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. దీంతో, లోకల్ రైళ్లు కనీసం 10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. సబర్బన్ రైళ్లు, సెంట్రల్ రైల్వే మార్గంలోని లోతట్టు ప్రాంతాల్లో పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముంబైలోని విద్యాసంస్థలకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సెలవు ప్రకటించారు. వర్షాలు కొనసాగే అవకాశాలుండటంతో మంగళవారం సైతం సెలవు ప్రకటించారు.Mumbaikar stuck on roads everyday..#MumbaiRains pic.twitter.com/cqVrkWJbK6— KKthewealthcoach (@MemeOverlord_kk) August 18, 2025 -
ముంబైలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)
-
వీడని భారీ వర్షం.. ప్రైవేట్ కార్యాలయాలకూ సెలవు
ముంబై: రుతుపవనాల ఉధృతి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ పరిణామాలకు మహారాష్ట్ర అత్యంత ఘోరంగా దెబ్బతింది. ముంబైలో కేవలం ఎనిమిది గంటల్లో 177 మి.మీ వర్షపాతం నమోదైంది. VIDEO | Maharashtra: Amid incessant rain, several areas in Palghar have been waterlogged.(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/I3gToQTOXL— Press Trust of India (@PTI_News) August 19, 2025ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ మందగించింది. చాలా మంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు.#WATCH | Mumbai, Maharashtra: Marine Drive witnesses high tides amid the heavy rainfall in the city. pic.twitter.com/83D21X2wgf— ANI (@ANI) August 19, 2025ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమాన, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ముంబై, థానే, పాల్ఘర్ నవీ ముంబైలలో భారీ వర్షాల దృష్ట్యా, ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.VIDEO | Maharashtra: Mumbai continues to witness rain. Visuals from the Gateway of India.(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/Sn3CjvKU8E— Press Trust of India (@PTI_News) August 19, 2025నగరంతో పాటు శివారు ప్రాంతాలలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ఈరోజు(మంగళవారం) ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు.#WATCH | Mumbai, Maharashtra: Due to the heavy rainfall, the Mithi River flows near the danger mark. pic.twitter.com/HaLkmp09eO— ANI (@ANI) August 19, 2025నగరంలో భారీ వర్షాల మధ్య మెరైన్ డ్రైవ్లో అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలో వర్షం కొనసాగుతోంది. గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నీరు నిలిచిపోయింది.#WATCH | Mumbai, Maharashtra: Waterlogging seen as heavy rain lashes Mumbai. Visuals from the Eastern Express Highway Area pic.twitter.com/VYMsT0BUgR— ANI (@ANI) August 19, 2025భారీ వర్షపాతం కారణంగా మిథి నది ప్రమాద పరిధికి దగ్గరగా ప్రవహిస్తున్నది. తూర్పు ఎక్స్ప్రెస్ హైవే ప్రాంతంలో జలదిగ్బంధం ఏర్పడింది.బాంద్రా ఖార్ లింక్ రోడ్ జలమయం అయ్యింది. చెంబూర్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర జలదిగ్బంధం ఏర్పడింది.#WATCH | Mumbai, Maharashtra: Waterlogging seen as heavy rain lashes Mumbai. Visuals from the Eastern Express Highway Area pic.twitter.com/VYMsT0BUgR— ANI (@ANI) August 19, 2025పన్వేల్లోని అటల్ సేతు హైవేను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాసాయి-విరార్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. VIDEO | Maharashtra: Rainfall lashes parts of Mumbai. Night visuals from Mira Road. (Full video available on PTI Videos- https://t.co/dv5TRARJn4) pic.twitter.com/JQOyhQvghc— Press Trust of India (@PTI_News) August 18, 2025 -
Mumbai: వర్ష బీభత్సం.. రెండు రోజులు రెడ్ అలర్ట్.. విద్యాసంస్థలకు సెలవు
ముంబై: ముంబైలో వరుసగా మూడవ రోజు సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. Be it an epidemic, a storm, bad weather or heavy rains, Mumbai Police officers and soldiers are always ready to help the common people, Salute Mumbai Police.❤️❤️🙏🏻🙏🏻🙏🏻#Mumbaipolice pic.twitter.com/2mfoh3NiCM— Krishna Kant Mishra (@KKMishraOffice) August 18, 2025దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా పలు రోడ్లు జలమయం అయ్యాయి. అంధేరి సబ్వే , లోఖండ్వాలా కాంప్లెక్స్ తదితర లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.🚨 Dadar majorly waterlogged.. 🔴Avoid unnecessary travel in Mumbai! Flashfloods in many parts of Mumbai after consistent heavy rains 🌊⚠️ pic.twitter.com/XF1pZ6FaXi— Mudassir Goenka (@MudassirGoenka7) August 18, 2025సబర్బన్ రైళ్లు 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైతో పాటు సమీప జిల్లాలైన థానే, రాయ్గడ్లలో మంగళవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముంబై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి దృశ్యమానత తగ్గిందని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వాహనదారులు తెలిపారు. వర్షం కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి.అంధేరి సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ ప్రాంతాలలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ముంబై జీవనాధారంగా పరిగణించే సబర్బన్ రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నట్లు అధికారులు, ప్రయాణికులు తెలిపారు. శనివారం నుండి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుండి వర్షాల తీవ్రత మరింత పెరిగిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
hit and run: భార్య మృతదేహాన్ని బైక్కు కట్టి.. నిందితుల్ని ఆటకట్టించిన AI
ముంబై: కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో హృదయ విదారక వీడియో వైరల్గా మారింది. హిట్ అండ్ రన్ ఘటనలో భార్యను కోల్పోయిన భర్త, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని బైక్పై తాళ్లతో కట్టి తరలించాల్సి వచ్చింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ కేసులో నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషించింది. మహారాష్ట్ర పోలీసులకు 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకునే అవకాశం కల్పించింది.మహారాష్ట్ర నాగపూర్లో మోర్ఫాటా ప్రాంతానికి సమీపంలో నాగ్ పూర్-జబల్ పూర్ జాతీయ రహదారిపై ఓ ట్రక్కు అమిత్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య గ్యార్సితో కలిసి బైక్పై ప్రయాణిస్తున్న సమయంలో,వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీ కొట్టింది. సంఘటన స్థలంలోనే గ్యార్సి మృతి చెందింది.అమిత్ తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారిని సాయం కోసం వేడుకున్నాడు. కానీ ఎవరూ స్పందించకపోవడంతో, తన భార్య మృతదేహాన్ని బైక్ వెనక భాగానికి తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్లోని తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది వైరల్ అయింది. పోలీసులు చివరకు అమిత్ను ఆపి, మృతదేహాన్ని నాగ్పూర్లోని మాయో ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం తరలించారు.ఈ హిట్ అండ్ రన్ ఘటనలో ఏఐ నిందితుల ఆటకట్టించింది. రక్షాబంధన్ రోజున (ఆగస్టు 9) తాను, తన భార్య గ్యార్సితో కలిసి బైక్పై వెళుతుండగా రెడ్ కలర్ ట్రక్.. తన బైక్ను ఢీకొట్టిందని, ట్రక్ తన భార్య గ్యార్సిని తొక్కుకుంటూ వెళ్లిందని అమిత్ యాదవ్ పోలీసులకు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ఏఐని వినియోగించారు. మూడు టోల్ ప్లాజాల నుంచి ఘటన జరిగిన 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సీసీ టీవీఫుటేజీ సేకరించారు. ఆ సీసీటీవీఫుటేజీని కంప్యూటర్ విజువల్ టెక్నాలజీ ఆధారంగా రెండు ఏఐ అల్గారిథమ్ను ఉపయోగించారు.ఏఐ మొదటిగా ఎరుపు గుర్తులు ఉన్న ట్రక్కులను గుర్తించింది. రెండవది ట్రక్కుల సగటు వేగాన్ని విశ్లేషించి అనుమానాస్పద ట్రక్కును గుర్తించింది. ఈ ఆధారంగా ఒక ట్రక్కును గుర్తించి, నాగ్పూర్ నుంచి 700 కిమీ దూరంలో గ్వాలియర్-కాన్పూర్ హైవే వద్ద దాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫలితంగా 36 గంటల్లో పోలీసులు.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కటకటాల్లోకి పంపించారు. A 35-year-old man tied his wife's lifeless body to his bike after she was run over by a speeding truck in #Nagpur and his cry for help went unnoticed by passersby.pic.twitter.com/CmuC3F9l9U— Hate Detector 🔍 (@HateDetectors) August 11, 2025 -
Mumbai: ఘనంగా గణపతి ఆగమన్.. ఊరూవాడా సంబరాలు
ముంబై: మహానగరం ముంబైలో ఈనెల 27 నుంచి జరగబోయే గణేశుని ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేశుని మండపాలకు విగ్రహాలను తరలించే ‘గణపతి ఆగమన్’ అంత్యంత వేడుకగా జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 27న వినాయక చవితి జరగనుండగా, ఇప్పటికే విగ్రహాలను తీసుకువచ్చి పందిళ్లలో నెలకొల్పుతున్నారు. ఈ సందర్బంగా జరుగుతున్న ఆగమన్ వేడుకలు వీధివీధినా కనిపిస్తున్నాయి. డ్రమ్స్ దరువుల మధ్య గణపతి బప్పా మోర్యా నినాదాలు మార్మోగుతున్నాయి. ముంబైలోని ప్రముఖ గణేశ్ విగ్రహ తయారీ కేంద్రాలలో ఒకటైన పరేల్ నుండి వివిధ ప్రాంతాలకు గణపతి విగ్రహాలు తరలివెళుతున్నాయి. Ganpati Aagaman 2025Parelcha Maharaja & Govinda #GanpatiBappaMorya pic.twitter.com/HjzyAvnaoj— मुंबई Matters™🇮🇳 (@mumbaimatterz) August 10, 2025దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే గణేశ్ నవరాత్రులు ముంబై అంతటా అత్యంత వైభవంగా జరుగుతాయి. గణేష్ ఉత్సవం 2025 దగ్గర పడుతున్నందున, మండపాల కోసం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు వస్తున్న దరఖాస్తులను బృహన్ ముంబై విద్యుత్ సరఫరా అధికారులు త్వరతిగతిన క్లియర్ చేస్తున్నారు. -
టీ ఒక్కటి వెయ్యి రూపాయలా..?
దుబాయ్: భారత్లో ఒక్క టీ ఖరీదు వెయ్యి రూపాయలుందంటూ వ్లాగర్ పరీక్షిత్ బలోచ్ ఆశ్చర్యంతో చేసిన పోస్ట్కు భారీగా స్పందన లభిస్తోంది. దుబాయ్లో ఉంటున్న భారతీయ ట్రావెల్ వ్లాగర్, రేడియో ప్రజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్స్టాలో పంచుకున్నారు. ‘ముంబైలోని ఓ హోటల్లో ఒక కప్పు టీ తాగితే నాకు వెయ్యి రూపాయల బిల్లయింది. అది చూసి షాకయ్యా. సాధారణమైన అవసరాలు సైతం ఇంత ఖరీదుగా మారడం చూసి నమ్మలేకపోయా. దుబాయ్లో ఉంటూ దిర్హామ్లలో సంపాదన కలిగిన నేను భారత్లో ఉండగా ఎన్నడూ పేదవానిగా భావించలేదు. కానీ, టీ బిల్లు చూసి మునుపటిలా కాకుండా, భారత్లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది’అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. భారత్లో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాల్నే పంచుకున్నారు. ముంబైలాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ‘నేను ఏటా ముంబై వెళ్తుంటా. కొన్నిటికైతే దుబాయ్ కంటే ముంబైలోనే ఖరీదెక్కువ’అని ఒకరంటే, ‘చివరికి ఏవరో ఒకరు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్కు వచ్చాక పేదవానిగా మారింది నేను ఒక్కడినే అని ఇప్పటిదాకా అనుకునేవాణ్ని’అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఇండియా వెళ్లిన ప్రతిసారీ నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే, స్థానికంగా ఉండే వారు ఎలా బతుకుతున్నారో ఏమో? ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకీ విషయం తెలిస్తే, ఇండియాను వదిలేసే వాణ్నే కాదు’అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు. -
Mumbai: ఆస్పత్రి నుంచి గర్భిణి ఖైదీ పరార్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గల జేజే ఆస్పత్రి నుంచి బంగ్లాదేశ్ గర్భిణి ఖైదీ తప్పించుకుంది. గురువారం మధ్యాహ్నం ఆమె పారిపోగా, అప్పటి నుంచి ముంబై పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. నకిలీ జనన ధృవీకరణ పత్రం ఉపయోగించి భారతీయ పాస్పోర్ట్ పొందినందుకు రుబీనా ఇర్షాద్ షేక్(27)ను ఆగస్టు 7న వాషి పోలీసులు అరెస్టు చేశారు.ఆమెపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లతో పాటు పాస్పోర్ట్ చట్టం, విదేశీయుల చట్టం కింద అభియోగాలు మోపారు. ఈ నేపధ్యంలోనే ఆమెను అరెస్ చేసి, బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. జ్వరం, జలుబు, చర్మ సంబంధిత వ్యాధుల ఫిర్యాదుల మేరకు ఐదు నెలల గర్భిణి అయిన రుబీనాను ఆగస్టు 11న జెజె ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 14న మధ్యాహ్నం ఆమె ఒక కానిస్టేబుల్ను తోసి, పారిపోయింది. ఖైదీ రుబీనా ఇర్షాద్ షేక్ ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ముంబైలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈరోజు(శనివారం) తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్ర జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. Mumbai is experiencing heavy rainfall with an Orange Alert in effect. Water-logging and reduced visibility have been reported in several areas.Mumbaikars are advised to avoid non-essential travel and to exercise caution while venturing out.Police have been instructed to be on…— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) August 15, 2025భారీ వర్షాల కారణంగా విఖ్రోలి వెస్ట్ సమీపంలోని కొండచరియలు విరిగిపడగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రస్తుతం రాజవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీచేసినందున ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ముంబై పోలీసులు కోరారు.#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Gandhi Market. pic.twitter.com/2mAbfXySWv— ANI (@ANI) August 16, 2025‘ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందనే రిపోర్టులు వస్తున్నాయి. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముంబై పోలీసులు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు’అని ముంబై పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్లలో భారీ వర్షాలు కురియనున్నాయని హెచ్చిరించింది. పాల్ఘర్లో ఆగస్టు 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా భారీ వర్షాల కారణంగా నగరంలోని వాషి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్, అంధేరి, కుర్లా, చెంబూర్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Andheri Subway. pic.twitter.com/ZmrdATn84i— ANI (@ANI) August 15, 2025రైల్వే ట్రాక్లు నీటితో నిండిపోయాయి. ప్రజలు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సూచించింది.కాగా గురువారం ముంబైలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ కొలాబా అబ్జర్వేటరీ వద్ద 53 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది. #WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Andheri Subway. pic.twitter.com/ZmrdATn84i— ANI (@ANI) August 15, 2025 -
లగ్జరీ ఫ్లాట్ కొన్న ఆదిపురుష్ బ్యూటీ.. ధర ఎన్ని కోట్లంటే?
ఆదిపురుష్ మూవీతో టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ కృతి సనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ ధనుశ్తో కలిసి తేరే ఇష్క్ మే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2లోనూ నటిస్తోంది. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ కృతి రాణిస్తోంది. 2023లో తన సొంత బ్యూటీ బ్రాండ్ హైఫన్ ప్రారంభించింది. స్కిన్ కేర్కు సంబంధించిన వ్యాపారంలో దూసుకెళ్తోంది. నటనతో పాటు 2022లోనే వ్యాయామ కార్యక్రమాలు, శిక్షణ, వెల్నెస్ కంటెంట్ను అందించే ఫిట్నెస్ బ్రాండ్ ది ట్రైబ్ను స్థాపించింది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని బాంద్రా వెస్ట్లోని పాలి హిల్ ప్రాంతంలో డ్యూప్లెక్స్ పెంట్హౌస్ను కొనేసింది బాలీవుడ్ భామ. ఈ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.84.16 కోట్లకు పైగా చెల్లించినట్లు సమాచారం. ఇప్పటికే కృతికి ముంబయి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఫ్లాట్ను కొనుగోలు చేసింది. అంతకుముందే బాంద్రాలోనే దాదాపు రూ.35 కోట్ల విలువైన 4 బీహెచ్కే అపార్ట్మెంట్ను తన సొంతం చేసుకుంది.ఈ ఖరీదైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు నివాసముంటున్నారు. బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్మెంట్లోకి మారనున్నారు. -
రాత్రి నుంచి ముంబైని వదలని వర్షం.. నేడు కూడా..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారత వాతావరణశాఖ అధికారులు ఆగస్టు 18 వరకు ముంబై కి ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. #WATCH | Mumbai witnesses heavy rain as IMD sounds 'yellow' alert for the city today pic.twitter.com/qxjwO0QxaI— ANI (@ANI) August 14, 2025ఈరోజు(గురువారం)కూడా ముంబైని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాల్ఘర్, థానే, ముంబై, రాయ్గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Mumbai witnesses heavy rain as IMD sounds 'yellow' alert for the city today pic.twitter.com/qxjwO0QxaI— ANI (@ANI) August 14, 2025 -
సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ..
సర్ఫరాజ్ ఖాన్.. భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించి భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్.. తన తొలి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.అయితే ఆ సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్ల్లో ముంబైకర్ విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్కు ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్లో కూడా అతడికి ఆడే అవకాశం లభించలేదు. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు సర్ఫరాజ్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అంతకంటే ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన సిరీస్లో భారత-ఎ జట్టు తరపున సత్తాచాటాడు. మళ్లీ ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న టెస్టు సిరీస్కు భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ ఉవ్విళ్లూరుతున్నాడు.ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న కంగా క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిడ్డే రిపోర్ట్ ప్రకారం.. ఈ లీగ్లో పార్కోఫియర్ క్రికెటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.తాజాగా ఇస్లాం జింఖానాతో జరిగిన డివిజన్ -ఎ మ్యాచ్లో సర్ఫరాజ్తన బ్యాట్ను ఝూళిపించాడు. ఈ భారత క్రికెటర్ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 43 బంతుల్లో 61 పరుగులు చేశాడు. కాగా డాక్టర్ హెచ్.డి. కాంగ్రా క్రికెట్ లీగ్ ముంబైలో ప్రతీ ఏడాది ఆగస్టులో జరుగుతోంది. ఈ లీగ్లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆడారు.చదవండి: 'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు' -
'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు'
'అతడి బ్యాటింగ్ను చూస్తుంటే సచిన్, సెహ్వాగ్లు గుర్తొస్తున్నారు. అతడు తన టెక్నిక్తో బ్రియాన్ లారాను తలపించాడు' పృథ్వీ షా తన అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన తర్వాత అప్పటి భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి నోటి నుంచి వచ్చిన మాటలవి.కానీ రవిశాస్త్రి నమ్మకాన్ని పృథ్వీ షా ఏ మాత్రం నిలబెట్టుకులేకపోయాడు. తన కెరీర్ను అద్బుతంగా ఆరంభిచిన ఈ ముంబై క్రికెటర్.. క్రమంగా ఫిట్నెస్, ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమయ్యాడు. తన ఏడేళ్ల కెరీర్లో భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 12 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.అంతర్జాతీయ క్రికెట్ విషయాన్ని పక్కన పెడితే ప్రొఫెషనల్ క్రికెట్కే అతడు 8 నెలలగా దూరంగా ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్లో పృథ్వీషా సారథ్యంలో ఆడిన శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్లు సూపర్ స్టార్లగా ఎదిగితే.. ఈ ముంబైకర్ మాత్రం అధ:పాతాళానికి దిగజారిపోయాడు. రాబోయే రంజీ సీజన్కు ముందు ముంబై క్రికెట్ ఆసోషియేషన్తో తెగదింపులు చేసుకున్న పృథ్వీ షా తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఇక తాజాగా పృథ్వీ షా కెరీర్ పతనంపై రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా కెరీర్ ఇలా అవ్వడం తనకు ఎంతో బాధ కలిగిస్తుందని ఆయన అన్నారు."పృథ్వీ షా తన 10 సంవత్సరాల వయస్సు నుంచి నాకు తెలుసు. అతడు చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు. అయితే కెరీర్ను విజయవంతంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. పృథ్వీ విషయంలో ఏమి జరిగిందో నాకు అయితే స్పష్టంగా తెలియదు.కానీ ఇప్పటికీ అతడు టాలెంటెడ్ క్రికెటరే. . దురదృష్టవశాత్తు తప్పుడు మార్గంలో వెళ్లి తన క్రికెట్ కెరీర్ను నాశనం చేసుకున్నాడు. పృథ్వీ షా లాంటి బ్యాటర్లు భారత క్రికెట్లో ఇప్పుడూ చాలా మంది ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ,ఆయుష్ మాత్రే యువ సంచలనాలు ఈ కోవకు చెందిన వారే. వీరు కచ్చింగా ఫ్యూచర్ స్టార్లగా ఎదుగుతారు. భారత క్రికెట్ ప్రస్తుతం టాప్లో ఉందని" గౌరవ్ మంగళాని పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడ్ పేర్కొన్నాడు.చదవండి: మైదానంలోనే ప్రాణాలు విడిచిన భారత క్రికెటర్.. ఆయన గురించి తెలుసా? -
మరోసారి చెలరేగిపోయిన టీమిండియా యువ సంచలనం.. 119 పరుగులు, 10 వికెట్లు
టీమిండియా యువ సంచలనం ముషీర్ ఖాన్ ఇటీవలికాలంలో ప్రతి మ్యాచ్లో చెలరేగిపోతున్నాడు. బ్యాట్తో పాటు బంతితోనూ ఇరగదీస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ పర్యటనలో హ్యాట్రిక్ సెంచరీలు సహా ఓ 10 వికెట్ల ప్రదర్శన (మ్యాచ్ మొత్తంలో), ఓ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ ముంబై కుర్రాడు.. తాజాగా ముంబైలోనే జరుగుతున్న ప్రతిష్టాత్మక కంగా లీగ్లో మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. ఈ లీగ్లోని ఓ మ్యాచ్లో ముషీర్ తొలి ఇన్నింగ్స్లో 84 పరుగులు, 3 వికెట్లు (8 పరుగులకే).. రెండో ఇన్నింగ్స్లో 35 (నాటౌట్) పరుగులు, 7 వికెట్లు (4 పరుగులకే) తీశాడు. ఈ మ్యాచ్ మొత్తంలో అతను 119 పరుగులతో పాటు 10 వికెట్లు సాధించాడు.ఇటీవలికాలంలో ముషీర్ ప్రదర్శనలు చేస్తుంటే త్వరలోనే టీమిండియా తలుపులు తట్టేలా ఉన్నాయి. 20 ఏళ్ల ముషీర్ మరో టీమిండియా యువ కెరటం సర్ఫరాజ్ ఖాన్కు స్వయానా తమ్ముడు. సర్ఫరాజ్ కూడా అదిరిపోయే ప్రదర్శనలతో భారత టెస్ట్ అరీనా చుట్టూ ఉన్నాడు. అయితే సీనియర్లు క్రియాశీలకంగా ఉండటంతో అతనికి సరైన అవకాశాలు రావడం లేదు. టీమిండియాలో స్థిరపడటానికి అన్న సర్ఫారాజ్తో పోల్చుకుంటే తమ్ముడు ముషీర్కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ముషీర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు అదిరిపోయే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు.ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఆ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.కాగా, ముషీర్ ఇటీవల ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్లో పర్యటించాడు. ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్లో బౌలింగ్లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం జులై 3న ఛాలెంజర్స్తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) జరిగిన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 4) తీశాడు.జులై 10న ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. -
‘నా భార్యను బ్రతికించుకోలేకపోయాను’
నగరం అంటే ట్రాఫిక్ నరకం. ఇది కాదనలేని సత్యం. ఉండటానికి ఫ్లై ఓవర్స్ ఉంటాయి. నేషనల్ హైవేలు సైతం అనుసంధానంగా కూడా ఉంటాయి. కానీ ట్రాపిక్ సుఖం మాత్రం ఉండటం లేదు. ఇక్కడ ఏదో ఒక నగరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ నగరం చూసినా ఇంచుముంచు ఇదే పరిస్థితి. ఇక వర్షం పడితే ఆ నరకం వర్ణనాతీతం. సాధారణ ప్రజలైతే ఆ నరకాన్ని దాటుకుంటూ ఏదో రకంగా తమ గమ్యాలకు చేరతారు. కానీ ఏదైనా విషమ పరిస్థితుల్లో ఉన్నవారు ట్రాఫిక్లో చిక్కుకుంటే మాత్రం ఏం జరుగుతుందో మన ఊహకు కూడా అందదు. ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు మహారాష్ట్రలోని పాల్గర్ ప్రాంతానికి చెందిన దంపతులు. భర్త కళ్ల ముందు భార్య విపరీతమైన నరకయాతన అనుభవిస్తున్న చేసేది లేక అంబులెన్స్లో అలా ఉండిపోయాడు. భార్య పడిన నరకాన్ని కళ్లరా చూసి.. బ్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. దీనికి కారణం ట్రాఫిక్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను తీసుకుని నేషనల్ హైవే మీద చిక్కుకుపోయిన ఘటన హృదయవిదారకంగా ఉంది.పల్ఘార్కు చెందిన చయ్యా పూరవ్ అనే 49 ఏళ్ల మహిళకు తీవ్రంగా గాయపడింది. చయ్యా పూరవ్ ఇంటి వద్ద ఉన్న ఒక చెట్టు కొమ్ము ఆమెపై విరిగిపడింది. దాంతో ఆమె తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానిక ఆస్పత్రికి తీసుకెళితే, ముంబైలోని హిందుజా ఆస్పత్రి రిఫర్ చేశారు. దాంతో ఆమెను తీసుకుని అంబులెన్స్లో బయల్దేరాడు భర్త. అయితే నేషనల్ హైవే-48;పై వెళితే అక్కడకు చేరడానికి పెద్ద సమయం పట్టదు. పల్ఘార్ నుంచి ముంబై వెళ్లడానికి అది అనువైన రహదారి కూడా.100 కి.మీ దూరం ఉన్న ముంబైని చేరుకోవడానికి ఎంత లెక్కన వేసుకున్నా రెండు గంటలన్నర కంటే ఎక్కువ పట్టదు. అయితే నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సగం దూరం చేరడానికే మూడు గంటలకు పైగా సమయం పట్టింది. అప్పటికే ఆమె పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోతోంది. కానీ భర్త ఏం చేసే పరిస్థితి లేదు. ఆ ట్రాఫిక్ను ఛేదిస్తే గానీ భార్య పడే నరకానికి ఫుల్స్టాప్ పెట్టలేడు. ఈ క్రమంలోనే 70 కి.మీ దూరం వెళ్లేసరికి ఆమె సృహలోకి లేకుండా మారిపోయింది. దాంతో అక్కడ ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకు వెళితే ఆమె చనిపోయిందని డాక్టర్టు నిర్దారించారు. ఎంత ప్రేమేగా చూసుకునే భార్య కళ్ల ముందే విలవిల్లాడిపోతుంటే చేసేది లేకుండా పోయిందని భర్త అంటున్నారు. తన భార్య నాలుగు గంటల పాటు తీవ్ర నరకయాతన అనుభవించిందని, అది తన కళ్లతో చూశానని బోరు మంటున్నారు. ట్రాఫిక్ కారణంగానే తన భార్యను కాపాడులేకపోయానని భర్త పూరవ్ కన్నీటి పర్యంతమయ్యారు. అరగంట ముందుగా ముంబై ఆస్పత్రికి వెళ్లినా తన భార్యను కాపాడుకునే వాడినని పూరవ్ బాధాతప్త హృదయంతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. గత నెల 31వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
10వేల క్రిస్టల్స్, ఐవరీ వైట్ లెహంగాలో జాన్వీ డాజ్లింగ్ లుక్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కోచర్ కలెక్షన్ క్వాంటం ఎంటాంగిల్మెంట్ను ముంబైలో ఆవిష్కరించారు ఈ బ్రైడల్ కోచర్ షోలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందంగా మెరిసిపోయింది. మొన్న మసాబా గుప్తా బ్రైడల్గా అందంగా మురిపించిన జాన్వీ తాజాగా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన లెహంగాలో అభిమానులను మెస్మరైజ్ చేసింది. జాన్వీ ధరించిన లెహెంగాకు సంబంధించి కొన్ని వివరాలను గౌరవ్ గుప్తా ఇన్స్టాలో షేర్ చేశారు.ఐవరీ వైట్ స్వర్ణమ లెహంగా, పొడవైన దుపట్టాలో అద్భుతమైన లుక్లో జాన్వీ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఈ షోలో జాన్వీ షోస్టాపర్గా నిలిచింది. గౌరవ్తో కలిసి అభిమానులను పలకరించింది. దీనికి తోడు డైమండ్ ఆభరణాలతో దేవకన్యలా మెరిసింది. 10వేలకు పైగా స్ఫటికాలతో ఈ లెహంగాను డిజైన్ చేశారట. అంతేకాదు జాన్వీ సోదరి ఖుషీ కపూర్లో కూడా ఈ బ్రైడ్ల్ షోలో సందడి చేసింది. (పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?) View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) ఈ ఇంకా షోలో డైరెక్టర్ కిరణ్రావు, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, మలైకా అరోరా, శ్రియా శరణ్ దిశా పఠాని, తదితర ఫిలిం స్టార్లు, పలువురు మోడల్స్ మెరిసారు. ఈ షోకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని -
‘నువ్వేరకం పఠాన్వి?.. అలా అనొద్దు.. 15 కుట్లు పడ్డాయి’
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అండర్-16 క్రికెట్ నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని.. ఆటతోనే అందుకు సమాధానమిచ్చిన తీరును తాజాగా వెల్లడించాడు.కళ్లు బైర్లు కమ్మాయి‘‘పాల్ వాల్తాటి (Paul Valthaty) జూనియర్ క్రికెట్లో, ఐపీఎల్లో నాతో కలిసి ఆడాడు. అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆరోజు ముంబై- బరోడా మధ్య మ్యాచ్. నిజానికి పాల్ బ్యాటర్. అయితే, మీడియం పేస్తో బౌల్ చేయగలడు కూడా.ఆరోజుల్లో నేను బ్యాటింగ్ చేసేటపుడు ఎక్కువగా హెల్మెట్ ధరించేవాడిని కాదు. హెల్మెట్ పెట్టుకుంటే నాకు చూపు కాస్త మందగించినట్లు అనిపిస్తుంది. ఆరోజు కూడా హెల్మెట్ లేకుండా అతడి బౌలింగ్ను ఎదుర్కొంటున్నా.ఈ క్రమంలో అతడు నాకు బౌన్సర్ సంధించాడు. నేను లెఫ్టాండ్ బ్యాటర్ను కదా!.. బంతి ఒకవేళ తగిలితే నా కుడిచెంపపై తాకాలి. నిజానికి బంతి మెల్లగానే వచ్చింది. కానీ నేను సడన్గా తిరగడంతో నా ఎడమ చెంపకు బలంగా తాకింది. నాకు కళ్లు బైర్లు కమ్మినట్లు అయిపోయింది.రక్తం కూడా కారిందినా చెంప నుంచి రెండు మూడు చుక్కల రక్తం కూడా నేలమీద పడింది. అంపైర్లు, రిఫరీ వచ్చి నన్ను డ్రెసింగ్రూమ్కు వెళ్లిపొమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్లగానే మా కోచ్ మెహదీ షేక్.. ‘అబే.. నువ్వేరకం పఠాన్వి?’ అని అన్నారు. వెంటనే.. ‘నాతో ఇలా మాట్లాడకండి’ అన్నాను నేను.ఆ తర్వాత బరోడా ప్లేయర్లలో ఎవరో ఒకరి వికెట్ పడాలని వేచి చూశాను. ఇంతలో ఫిజియో నా చెంపపై దూదితో కట్టు కట్టారు. అప్పటికి రక్తస్రావం తగ్గింది. వికెట్ పడగానే నేను బ్యాట్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాను.హాఫ్ సెంచరీ చేశాను64 పరుగులతో అదరగొట్టాను. నేను గాయపడినపుడు ముంబై ఆటగాళ్లు నన్ను చూసి నవ్వారు. నాకు రక్తం కారుతున్నా వాళ్లు నవ్వుతూనే ఉండటంతో.. ఆ క్షణంలో నాకు బాగా కోపం వచ్చింది. అప్పుడే వాళ్లకు నేనేంటో చూపించాలని నిర్ణయించుకున్నా.అప్పటికి మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. తొలి ఇన్నింగ్స్లో మేమే ఆధిక్యంలో ఉన్నాము. ఇక ఆరోజు సాయంత్రం నేను ఆస్పత్రికి వెళ్లగా ముఖంపై 15 కుట్లు పడ్డాయి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘హాల్ చాల్ ఔర్ సవాల్’ చానెల్తో పేర్కొన్నాడు.టీమిండియా తరఫున సత్తా చాటిన ఇర్ఫాన్కాగా బరోడాకు చెందిన ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ ఆల్రౌండర్. లెఫ్టార్మ్ పేసర్ అయిన అతడు.. టీమిండియా తరఫున 29 టెస్టుల్లో 100, 120 వన్డేల్లో 173, 24 టీ20లలో 28 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. టెస్టుల్లో 2076, వన్డేల్లో 1941, టీ20లలో 127 పరుగులు సాధించాడు ఇర్ఫాన్ పఠాన్. ఇక ఐపీఎల్ 103 మ్యాచ్లు ఆడి 946 పరుగులు చేయడంతో పాటు.. 80 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్! -
వృద్ధుడు.. నలుగురు మహిళలు.. ఇవేం ట్విస్టులు రా సామీ!
ముంబై: సైబర్ నేరాలపై ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. సైబర్ మోసగాళ్ల చేతిలో అమాయకులు సులభంగా మోసపోతునే ఉన్నారు. దేశంలో రోజురోజుకు ఇలాంటివి అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. యువతే కాదు.. వృద్ధులు సైతం వలపు వలలో పడుతున్నారు. వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించి.. సైబర్ మోసానికి గురై రూ.9 కోట్లు పోగొట్టుకున్నాడు.ముంబైకి చెందిన వృద్ధుడు 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఫేస్బుక్లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా.. ఆ రిక్వెస్ట్ అంగీకరించలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత షార్వి ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆ వృద్ధుడు అంగీకరించాడు. ఇద్దరూ చాటింగ్ ప్రారంభించారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు.అప్పుడే అసలు కథ మొదలైంది. తన భర్త నుంచి దూరమై పిల్లలతో ఉన్నట్లు నాటకానికి తెర తీసింది. ప్రస్తుతం తన పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని.. తనకు కొంత డబ్బు అవసరం అంటూ వాపోయింది. దీంతో కరిగిపోయిన ఆ వృద్ధుడు నగదును పంపించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత కవిత అనే మహిళ వాట్సాప్లో మెసేజ్లు పంపడం ప్రారంభించింది. షార్వి స్నేహితురాలిగా పరిచయం చేసుకున్న ఆమె. ఆ వృద్ధుడికి అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించింది. అనంతరం డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. షార్వి సోదరి నంటూ మరో మహిళా దివాజ్ సందేశాలు పంపించడం మొదలు పెట్టింది. షార్వి చనిపోయిందని.. ఆస్పత్రి బిల్లు చెల్లించాలని స్క్రీన్ షాట్లు కూడా పంపించింది. దీంతో ఆ వృద్ధుడు డబ్బులు పంపించాడు. అనంతరం తిరిగి దినాజ్ను డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇదిలా సాగుతుండగా..ఇంతలోనే జాస్మిన్ అనే మరో మహిళ మెసేజ్ పంపించింది. దినాజ్ స్నేహితురాలినంటూ సాయం చేయాలని అభ్యర్థించింది. దీంతో ఆమెకు కూడా ఆ వృద్ధుడు డబ్బు పంపించాడు. ఇలా ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు రూ. 8.7 కోట్లు పంపించాడు. ఇంతటితో ఆ వృద్ధుడు ఆగలేదు.. ఇక ఖాతాలో నగదు అయిపోవడంతో కోడలి దగ్గర రూ.2లక్షలు అప్పుతీసుకున్నాడు. మరింత డబ్బు కావాలంటూ ఆ మహిళలు కోరడంతో కుమారుడి దగ్గర కూడా రూ. 5 లక్షలు అడిగాడు.దీంతో అనుమానం వచ్చి కొడుకు తండ్రిని నిలదీయగా.. ఆ డబ్బు ఎందుకు అవసరమో చెప్పాడు. దీంతో అసలు విషయం బయటపడింది. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఆ వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. మోసంపై జూలై 22న సైబర్ క్రైమ్లో ఫిర్యాదు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వృద్ధుడిని మోసం చేసిన నలుగురు మహిళలు తెలిసిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
‘కబూతర్ ఖానా’ మూసివేతపై కన్నెర్ర.. ఏం జరిగింది?
ముంబై: దాదర్లోని ప్రముఖ కబూతర్ ఖానా మూసివేత వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కబూతర్ ఖానాను మూసివేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై ముంబైకర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పావురాలకు దాణా వేయవద్దని బీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా దాణా వేసే ప్రయత్నం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు కబూతర్ ఖానాపై పావురాలు వచ్చి వాలకుండా, పక్షుల ప్రేమికులు దాణా వేయకుండా ప్లాస్టిక్ షీట్ను కప్పారు. దీంతో కబూతర్ ఖానాకు ఎదురుగా ఉన్న జైన్ మందిరానికి వచ్చే భక్తులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన జైన్ సమాజం ప్రజలు ప్లాస్టిక్ షీట్ను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.బీఎంసీ అధికారులు, సిబ్బంది, పావురాలకు దాణా వేయకుండా కాపలా కాస్తున్న పోలీసులు, జైన్ సమాజం ప్రజల మధ్య కొద్దిసేవు వాగ్వాదం నెలకొంది. కబూతర్ ఖానాను మూసివేయవద్దంటూ సాధారణ ప్రజలు, జైన్ వర్గం ప్రజలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో దాదర్ రైల్వే స్టేషన్ దిశగా వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కబూతర్ ఖానా (Kabutar khana) చుట్టూ తిరిగి వచ్చే వాహనాలు కూడా ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయం విధులకు వెళ్లే వివిధ రంగాల ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా బాంబే హైకోర్టు (Bombay High Court) ఆదేశాల మేరకే కబూతర్ ఖానాను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ వీరంతా ఆందోళనను ఆపలేదు. దీంతో కబూతర్ ఖానాను మూసియబోమని బీఎంసీ అధికారులు తాత్కాలికంగా ప్రకటించడంతో ఆందోళన విరమించారు. హైకోర్టు నిర్ణయం మేరకే మూసివేత: బీఎంసీముంబై నడిబొడ్డున ఉన్న దాదర్ ప్రాంతంలో కబూతర్ ఖానా ఉంది. దాదర్లో పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు కలుస్తాయి. అంతేగాకుండా ఇక్కడ ఫాస్ట్ లోకల్ రైళ్లతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ) నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే, అక్కడి నుంచి సీఎస్ఎంటీ దిశగా వెళ్లే మెయిల్, ఎక్స్ప్రెస్, వందేభారత్, దురంతో వంటి ఆధునిక రైళ్లు ఆగుతాయి. అదేవిధంగా దాదర్ వివిధ వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణికులు, షాపింగ్లకు వచ్చే జనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. దాదర్ పశ్చిమ దిశలో సుమారు 60 ఏళ్ల కిందట నిర్మించిన కబూతర్ ఖానా రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సుమారు వంద రెట్లు వాహనాలు, జనాల సంఖ్య పెరిగింది.ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోందిముఖ్యంగా ఈ కబూతర్ ఖానావల్ల రాకపోకలు సాగించే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పావురాలకు వేస్తున్న దాణా కుళ్లిపోవడం, వాటి రెట్టల వల్ల పరిసరాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటి శరీరంలో ఉన్న సుక్ష్మజీవులవల్ల ప్రజల ఆరోగ్యానికి హానీ జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. రెట్టల వల్ల ఉత్పన్నమయ్యే సూక్ష్మజీవులతో వివిధ రకాల తీవ్ర శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ వివాదం ముంబై హైకోర్టు వరకు వెళ్లింది. దీంతో ఇటీవల జరిగిన విచారణలో మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడే అధికారం ఎవరికి లేదని, దాదర్తోపాటు ఉప నగరాల్లో ఉన్న కబూతర్ ఖానాలన్నీ మూసి వేయాలని ఇటీవలి విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించింది.ఈ మేరకు పావురాలకు దాణా వేయకూడదని, ఒకవేళ వేస్తే చర్యలు తీసుకుంటామని బీఎంసీ (BMC) హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో బోర్డులు, ప్లెక్సీలు ఏర్పాటు చేసింది. బందోబస్తుకోసం పోలీసులను ఏర్పాటుచేసింది. అంతటితో ఊరుకోకుండా కబూతర్ ఖానా చుట్టూ ఆధునిక సీసీ టీవీ కెమరాలు ఏర్పాటు చేసింది. మూసివేసే ప్రయత్నంలో భాగంగా కబూతర్ఖానా చుట్టు ప్లాస్టిక్ షీట్ కప్పడంతో పక్షి ప్రేమికులు, సాధారణ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళన చేపట్టారు. మూసివేయబోమని తాత్కాలికంగా బీఎంసీ అధికారులు స్పష్టం చేయడంతో ఆందోళన విరమించుకున్నారు.చదవండి: ఆటోలో రెండు రోజుల్లో 1400 కి.మీ. ప్రయాణం! -
1బీహెచ్కే రెంట్ రూ.42000: బ్రోకర్ నవ్వాడంటూ పోస్ట్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. ముంబైలో 1బీహెచ్కే రెంట్ ఏకంగా రూ.42000 అని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ముంబైలోని గోరేగావ్ వెస్ట్, దాని సమీప ప్రాంతాలలో 1బీహెచ్కే కోసం వెతుకుతున్నప్పుడు, అద్దెలు నన్ను ఆశ్చర్యపరిచాయని రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అవి కొత్త భవనాలు కాదు, మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. రెంట్ మాత్రం రూ. 42000 నుంచి ప్రారంభమవుతోంది. అద్దె ఇంటి కోసం నా బడ్జెట్ రూ. 35000 నుంచి రూ. 38000 అని చెప్పినప్పుడు బ్రోకర్ నవ్వాడు అని కూడా యూజర్ తన పోస్టులో పేర్కొన్నాడు.గతంలో నేను ముంబైలోనే నివసించాను. అప్పటికి, ఇప్పటికి అద్దెలు చాలా పెరిగిపోయాయని స్పష్టమవుతోంది. అద్దె పెరిగినా.. మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తక్కువ ధరలో అద్దె ఇల్లు కావాలంటే.. మలాడ్ వెస్ట్ సమీప ప్రాంతాల్లో చూడమని కొందరు సలహా ఇచ్చారు. బ్రోకర్లను నమ్మవద్దని ఇంకొందరు సూచించారు. -
‘మాస్క్డ్ బూబీ’ ముంబైలో ప్రత్యక్షం
ముంబై: ఉష్ణమండల ప్రాంతాల్లో తీరానికి సుదూర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే మాస్క్డ్ బూబీ పక్షి ముంబైలో ప్రత్యక్ష మైంది. ఇవి జన సంచారం ఉన్న చోట కనిపించడం చాలా అరుదు, అనూహ్యమని నిపుణులు అంటున్నారు. గోరెగావ్ ఈస్ట్లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలోని భవానీ బిల్డింగ్లో బుధవారం సాయంత్రం బూబీ బర్డ్ వాలింది. ఎన్నడూ చూడని పక్షి కావడంతో స్థానికులు సునీల్ గుప్తా అనే వన్యప్రాణి సంరక్షకునికి సమాచారమిచ్చారు. ఆయన దానిని జాగ్రత్తగా పట్టుకుని తదుపరి సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు అందజేశారు. సునీల్ గుప్తా గత పదిహేనేళ్లుగా వన్య ప్రాణుల సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ‘బుధవారం సాయంత్రం 5.10 గంటల సమయంలో రెసిడెన్షియల్ సొసైటీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమ భవనంలోకి ఓ కొత్తరకం పక్షి వచ్చి వాలిందని చెప్పారు. సాయి మొండ్కర్ అనే మరో సంరక్షకునితో కలిసి ఆ ప్రాంతానికి హుటాహుటిన వెళ్లాను. పరిశీలించి చూడగా అది అరుదైన జాతికి చెందిన మాస్క్డ్ బూబీ పక్షిగా తేలింది’అని గుప్తా చెప్పారు. ‘ఇవి సముద్రంలో మారుమూల దీవుల్లో, ముఖ్యంగా అరేబియా సముద్రంలో కనిపిస్తుంటాయి. చేపలు వీటి ఆహారం. తరచూ సమూహాలుగా సంచరిస్తుంటాయి. బలమైన గాలుల తాకిడికో లేదా దారి తప్పో ఇటుగా వచ్చి ఉంటుంది. మనుషులంటే వీటికి చాలా భయం. కాకులు వెంటాడటంతో మరో దారి లేక ఇక్కడికి వచ్చి ఉంటుంది’అని వివరించారు. ‘బూబీ అనే పేరు బోబో అనే స్పానిష్ మాట నుంచి వచ్చింది. బోబో అర్థం హాస్యగాడు. చూడటానికి ఇవి నవ్వు తెప్పించేలా ఉంటాయి. అందుకే వీటికా పేరు వచ్చి ఉంటుంది’అని గుప్తా వివరించారు. రూపం, లక్షణాలు మాస్క్డ్ బూబీల తల, ఆపై భాగం బూడిద–గోధుమ రంగులో ఉంటుంది. రెక్కలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ముక్కులు పసుపు రంగులో కనిపిస్తాయి. వీటి ముఖం నీలం–బూడిద రంగులోనూ, కళ్లు ముదురు గోధుమ రంగులోనూ ఉంటాయి. పెద్దవయ్యేకొద్దీ ఈకలు ప్రధానంగా తెల్లగా మారుతాయి. ఈ జాతి పక్షులు బలమైన ముక్కు, పొడవైన, కోణాల రెక్కలకు ప్రసిద్ధి చెందింది. సముద్రంలోకి డైవ్ చేసి ఎరను పట్టుకోవడానికి ఇవి మాస్క్డ్ బూబీలకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. -
ఎయిర్ ఇండియా విమానంలో.. ‘దురదృష్టవశాత్తూ’ బొద్దింకలు
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాలు ఏదో కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి నడిచే ఎయిర్ ఇండియా విమానం ఏI180లో చిన్న చిన్న బొద్దింకలు కనిపించాయని ఇద్దరు ప్రయాణికులు ఫిర్యాదు చేసిన దరిమిలా వాటిని తొలగించినట్లు ఎయిర్లైన్ తెలిపింది.ఎయిర్ ఇండియా విమానంలోని ఇద్దరు ప్రయాణికులు తమ సీట్ల వద్ద బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన అనంతరం వారి సీట్లు మార్చామని ఎయిర్ ఇండియా తెలిపింది. ‘శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్లే ఏI180 విమానంలో, ఇద్దరు ప్రయాణికులు దురదృష్టవశాత్తూ చిన్న బొద్దింకల కారణంగా ఇబ్బంది పడ్డారు. దీంతో తమ క్యాబిన్ సిబ్బంది ఆ ఇద్దరు ప్రయాణికులను ఇతర సీట్లకు మార్చారు. అక్కడ వారు సౌకర్యవంతంగా కూర్చున్నారు.ఇంధన స్టాప్ సమయంలో, మా గ్రౌండ్ సిబ్బంది వెంటనే శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహించారు’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో తమ పరిశుభ్రతా చర్యలు కొనసాగుతున్నప్పటికీ, కీటకాలు కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో విమానంలోకి ప్రవేశిస్తుంటాయి. ఇటువంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్లైన్ తెలిపింది, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. -
త్వరలో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు సేవలు
భావ్ నగర్: దేశంలోని తొలి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దీంతో అహ్మదాబాద్ నుంచి ముంబైకి కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో చేరుకోవచ్చని ఆయన తెలిపారు. అయోధ్య ఎక్స్ప్రెస్, రేవా–పుణే ఎక్స్ప్రెస్, జబల్పూర్–రాయ్పూర్ ఎక్స్ప్రెస్లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం భావ్నగర్ టెర్మినస్లో వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ముంబై–అహ్మదాబాద్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు ముంబై–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ప్రారంభమై, గుజరాత్లోని వాపి, సూరత్, ఆనంద్, వడోదర గుండా అహ్మదాబాద్కు వెళ్తుంది. గంటకు 320 కి.మీ. వేగంతో నడవనుంది. ఈ సందర్భంగా మంత్రి పలు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజక్టుల గురించి పంచుకున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా అనేక కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్లలో 34వేల కి.మీ.ల కొత్త రైల్వే ట్రాక్లను వేసింది, దేశంలో రోజుకు దాదాపు 12 కి.మీ కొత్త ట్రాక్లను నిర్మించిందని చెప్పారు. దేశంలో 1,300 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని, ఇది ఇంతకుముందెప్పుడూ చేయని పనని ఆయన కొనియాడారు. ఈ క్రమంలో వస్తున్న సవాళ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దార్శనికతతో ప్రధాని మోదీ స్టేషన్ల పునరుద్ధరణ చేయిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది అమృత్ భారత్ రైళ్లు ప్రారంభించామని, వాటిలోనూ వందే భారత్వంటి సౌకర్యాలు కలి్పంచామని, అయినా ఛార్జీలు మాత్రమే తక్కువగానే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఈ రైళ్లను కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారని, వీటిలో ప్రయాణిస్తున్న వారు గొప్ప భావోద్వేగాలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. -
జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..
వంటవాళ్ల జీతం మహా అయితే ఎంతో ఉంటుంది అనుకుంటాం. పైగా అది చాలా శారీరక శ్రమ ఓర్చి చేయాల్సిన పని కూడా. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వంటవాడి జీతం గురించి తెలిస్తే..ఇంకెప్పుడూ అంత తక్కువ అంచనా వేయరు. చిన్న చితకా పనులు చేసేవాళ్లు కూడా తెలివిగా స్మార్ట్గా చేయగలరు అనే ప్రూవ్ చేస్తున్నారు. ఒకరకంగా వారి పనే బెటర్గా ఉంది అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి వ్యక్తి ఈ ముంబై వంటవాడు. కేవలం అరగంట పనికి నెలకు రూ. 18 వేలు వరకు ఛార్జ్ చేస్తాడట. అంతలా.. ఎవరూ ఇస్తారు అనుకోకండి. ఎందుకంటే ముంబైకి చెందిన న్యాయవాది ఆయుషి దోషి నెట్టింట ఈ విషయాన్ని షేర్ చేయడంతో పెనుదూమారం రేపి చర్చలకు దారితీసింది. తన వంట వాడిని మహారాజ్గా సంభోదిస్తూ అతడి పనితీరు సంపాదన తీరుగురించి పోస్ట్లో వెల్లడించారు. దాంతో నెటిజన్లంతా అదంతా అబద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వంటవాడు కార్పొరేట్ ఉద్యోగిలా సంపాదిస్తాడని. జస్ట్ అరగంట పనికి నెలకు రూ. 18 వేలు జీతం తీసుకుంటాడని, అలా రోజుకు పది నుంచి 12 ఇళ్లల్లో పనిచేస్తాడని చెప్పుకొచ్చారు. దాంతో నెటిజన్లు ఆమె చెప్పినదాంట్లో పూర్తి నిజం లేదని మండిపడడారు. నిజంగా అతడు అరగంటలో వంట చేసేయగలడా..? ఏమైనా ఏఐ ఉపయోగిస్తున్నాడా ఏంటీ.. అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఆ కామెంట్లకు బదులిస్తూ న్యాయవాది ఈ విధంగా పోస్ట్లో పేర్కొన్నారు. ముంబై ప్రజలరా నేను చెప్పింది వాస్తవమే. ఖరీదైన మెట్రో నగరాల్లో మహమహారాజులు వసూలు చేసేది ఈ రేంజ్లోనే ఉంటుంది. "అదే వంటవాడు 12 మంది ఉన్న కుటుంబానికి రూ. 2.5 వేలు దాకా వసూలు చేస్తాడు. అయితే మీప్రాంతాల్లో ఇంకా అంత తక్కువ జీతానికే వంటవాళ్లు పనిచేసినంతా మాత్రాన అన్నిచోట్ల అలానే ఉంటుందని అనుకోవద్దు. ఖరీదైన నగరాలో జీవితానుభవం ఇలానే ఉంటుంది. ముఖ్యంగా జీవన వ్యయాల్లో వ్యత్యాసాలు ఉంటాయనే విషయం మరిచపోవద్దు అనినొక్కి మరి పోస్ట్లో వెల్లడించింది". న్యాయవాది ఆయుషిMy Maharaj (Cook)•Charges ₹18k per house•Max 30 mins per house•10–12 houses daily•Free food & free chai everywhere•Gets paid on time or leaves without a goodbye 😭Meanwhile I’m out here saying “gentle reminder” with trembling hands with minimum salary.🙂— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) July 29, 2025 (చదవండి: లైట్హౌసింగ్ పేరెంటింగ్ అంటే..? పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దగలదా..?) -
భారత్కు రానున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ.. ధోని, రోహిత్, కోహ్లితో క్రికెట్ మ్యాచ్
భారత ఫుట్బాల్ ప్రేమికులకు శుభవార్త. దిగ్గజ ఫుట్బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ త్వరలో భారత పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో (13-15) కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.మెస్సీకి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగనుంది. కోల్కతా పర్యటనలో మెస్సీ చిన్న పిల్లల కోసం ఫుట్బాల్ వర్క్ షాప్ నిర్వహింస్తాడు. ఇదే సందర్భంగా మెస్సీ చేతుల మీదుగా ఫుట్బాల్ క్లినిక్ లాంచ్ కానుంది. ఈడెన్ గార్డెన్స్లో మెస్సీ పలువురు భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.కోల్కతా పర్యటన అనంతరం మెస్సీ డిసెంబర్ 14న ముంబైలో పర్యటిస్తాడు. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్లో (విజ్క్రాఫ్ట్ నిర్వహించే కార్యక్రమం) పాల్గొంటాడు. దీనికి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి సెవెన్-ఏ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ముంబై పర్యటన తర్వాత మెస్సీ ఢిల్లీలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మెస్సీ భారత పర్యటనకు సంబంధించిన వాస్తవిక షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదు. మెస్సీ తొలిసారి 2011లో భారత్లో పర్యటించాడు. నాడు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఓ ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. -
రాత బాగోలేదని వాత.. టీచర్ అరెస్ట్
ముంబై: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కర్కశంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది ముంబైలో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. మలాడ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ట్యూషన్ టీచర్, ఎనిమిదేళ్ల బాలుని చేతిరాత సరిగా లేదంటూ, అతనిని కఠినంగా శిక్షించింది.ఈ నేపధ్యంలో ఆ ఉపాధ్యాయురాలు అరెస్టయ్యింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోరేగావ్లోని ఒక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న బాలుడు మలాడ్లోని ఒక టీచర్ ఇంటికి ట్యూషన్కు వెళుతుంటాడు. సంఘటన జరిగిన రోజు, ఆ బాలుని సోదరి అతనిని ట్యూషన్లో దింపి, వెళ్లిపోయింది. ట్యూషన్ ముగిశాక ఆ టీచర్ బాలుని ఇంటికి ఫోన్ చేసి, పిల్లాడిని తీసుకుని వెళ్లాలని చెప్పింది. దీంతో ఆ బాలుని సోదరి ఆ టీచర్ ఇంటికి వచ్చింది. ఆ బాలుడు కన్నీళ్లతో కనిపించేసరికి, ఏం జరిగిందని సోదరి ఆ టీచర్ను అడిగింది. పిల్లాడు జరిగిన విషయం చెప్పగా, టీచర్ వాటిని తోసిపుచ్చింది.అయితే ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలుడు తన చేతిరాత సరిగా లేకపోవడంతో టీచర్ మండుతున్న కొవ్వొత్తితో తన చేతిపై వాత పెట్టిందని ఏడుస్తూ చెప్పాడు. వెంటనే పిల్లాడి తండ్రి అతనిని చికిత్స కోసం కాండివాలిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తరువాత కురార్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. బాలునిపై శారీరక, మానసిక క్రూరత్వానికి పాల్పడిన టీచర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
Pratiksha Tondwalkar: స్వీపర్ టు ఏజీఎం!
నేను స్వీపర్గా పనిచేయడం ఏమిటి?’ అని ఆమె అహానికి పోలేదు. ‘ఇంత చిన్నజీతానికి పనిచేయడం ఏమిటి?’ అని తాను చేస్తున్న పనిని చిన్నచూపు చూడలేదు.చిన్నదో, పెద్దదో ‘పని’ చేయాలి అని గట్టిగా అనుకుంది ముంబైకి చెందిన ప్రతీక్ష తోండ్వాల్కర్. పనే ఆమెకు ‘పవర్’ అయింది. ఎస్బీఐలో స్వీపర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయికి చేరింది...పేదకుటుంబంలో పుట్టిన ప్రతీక్షకు పదిహేడు సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇరవైలలో ఉన్నప్పుడు భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. ఆ షాక్ నుంచి కోలుకోవడం ఆమెకు చాలా కష్టమైపోయింది. అప్పటికే తనకు రెండు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే పిల్లవాడి గురించి ఎవరు ఆలోచిస్తారు?’ అనుకొని ఆ దుఃఖం నుంచి బయటపడి ధైర్యం తెచ్చుకుంది.‘ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కడుపు నిండదు. ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి’ అనుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ముంబై బ్రాంచ్కు వెళ్లి ‘ఏదో ఒక పని ఇప్పించండి’ అని అడిగింది. ఆమె భర్త ఈ బ్రాంచ్లో బుక్బైండర్గా పనిచేసేవాడు. ఆ మంచితనం, సానుభూతితో బ్యాంక్ వాళ్లు ఆమెకు తమ బ్రాంచీలో స్వీపర్గా పనిచేసే అవకాశం ఇచ్చారు. నెలకు అరవై అయిదు రూపాయల జీతం వచ్చేది.ఆ జీతంతోనే సర్దుకుపోయి ఉంటే ప్రతీక్ష తన భవిష్యత్ గురించి ఆలోచించేది కాదు. ఆ సమయంలోనే తాను మరచిపోయిన చదువు గురించి ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనతో పాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి. ‘ఈ వయసులో చదువు ఏమిటి!’ ‘ఇంట్లో బిడ్డను పెట్టుకొని కాలేజీకి వెళతావా!’... ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందేమో అని మొదట భయపడింది. ఆ తరువాత తనకు తానే ధైర్యం తెచ్చుకుంది.‘నేనేమీ తప్పు చేయడం లేదు. చదువుకోబోతున్నాను. అంతే’ అని గట్టిగా నిశ్చయించుకుంది. ఒకవైపు స్వీపర్ పనిచేస్తూనే మరోవైపు నైట్ కాలేజీలో చదువుకునేది. ఇంటర్మీడియెట్ తరువాత మరో నైట్కాలేజీలో డిగ్రీ చేసింది. స్వీపర్ నుంచి బ్యాంక్ క్లర్క్గా ప్రమోట్ అయింది. కొంతకాలానికి తిరిగి వివాహం చేసుకుంది ప్రతీక్ష. భర్త ప్రమోద్ ‘నిన్ను ఇంకా పెద్దస్థాయిలో చూడాలనుకుంటున్నాను’ అనేవాడు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలని ప్రోత్సహించేవాడు. అలా బ్యాంకు పరీక్షలు రాసి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏజీఎం (అసిస్టెంట్ జనరల్ మేనేజర్) స్థాయికి చేరింది ప్రతీక్ష. ‘కష్టాల్లో ఉన్నప్పుడు చదువు తప్ప నాకు మరో దారి కనిపించలేదు. చదువును నమ్ముకునేవారికి, కష్టపడేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది’ తన అనుభవ జ్ఞానంతో అంటుంది ప్రతీక్ష తోండ్వాల్కర్. ప్రతీక్ష తన విజయం దగ్గరే ఆగిపోలేదు. తన విజయంతో ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది. ఆ రెండు అడుగులుఆ కష్టకాలాన్ని గుర్తు తెచ్చుకుంటే నాకు ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. అయితే గతంలోనే ఉండిపోతే భవిష్యత్ను చూడలేము. నాకు మొదటి నుంచి చదువు అంటే ఇష్టం. ఆ చదువే నాకు ధైర్యాన్ని ఇచ్చి దారి చూపింది. పరిస్థితులే మనకు ధైర్యాన్ని ఇస్తాయి అని చెప్పడానికి నేనే ఉదాహరణ. తెలియని వ్యక్తుల ముందుకు వెళ్లి ‘నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి’ అని అడగడం నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు అనుకుంటాను. ఎవరు ఏమనుకున్నా సరే నేను చదవాల్సిందే అనుకోవడం నేను ధైర్యంగా వేసిన రెండో అడుగు. ఆ రెండు అడుగులు నా జీవితాన్ని మార్చేశాయి– ప్రతీక్ష తోండ్వాల్కర్ -
అమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు.. ఎందుకు వచ్చారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో అభిమానులను అలరించారు. గతనెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2018లో రిలీజైన సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే.. అమిర్ ఖాన్ ఇంటికి ఐపీఎస్ అధికారులు రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అమిర్ ఇంటికి ఐపీఎస్ అధికారులు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అసలు ఎందుకు వచ్చారని ఆరా తీస్తున్నారు. అంతమంది ఐపీఎస్ అధికారులు రావడానికి కారణాలపై చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ టీమ్ స్పందించింది. ఐపీఎస్ అధికారుల ఆకస్మికంగా అమిర్ ఇంటికి రావడంపై కచ్చితమైన వివరాలు తెలియవని అమిర్ టీమ్ తెలిపింది. మేము కూడా అమిర్ ఖాన్ సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఐపీఎస్ శిక్షణార్థులు ఆమిర్ ఖాన్తో సమావేశం అయ్యారని సమాచారం. వారందరికీ హీరో తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆ బృందంలోని ఒక సభ్యుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ముద్దుల తనయకు గణపతి బప్పా ఆశీర్వాదం : న్యూ డాడ్ సిద్ధార్థ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ముద్దుల కుమార్తె కోసం ఆదివారం ఆలయంలో ప్రార్థనలు చేసి గణపతి బప్పా ఆశీర్వాదం తీసుకున్నారట. తన తల్లి రిమ్మా మల్హోత్రాతో సిద్ధి వినాయకుణ్ణి సందర్శించారు. దీనికి సంబంధించినొకవీడియో నెట్టింట ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.ఆలయ సందర్శనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్లైన్లో కనిపించాయి. ఒక ఛాయాచిత్రకారుడు షేర్ చేసిన క్లిప్లో, సిద్ధార్థ్ నీలిరంగు కుర్తా ,బ్లాక్డెనిమ్ ధరించి సిద్దార్థ్, పింక్ సూట్లో తల్లి రిమ్మా గణపతిని దర్శించుకున్నారు. భక్తితో చేతులు జోడించి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పూజారి దేవుని పాదాల దగ్గరి పూమాలను వారికి ఇచ్చారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)s="text-align-justify"> కాగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో కనిపించిన కియారా, ఇటలీలోని రోమ్లో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. షేర్షా సినిమా షూటింగ్ సమయంలో డేటింగ్లో ఉన్న వీరిద్దరూ 2023, ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వివాహం జరిగింది. ఈ జంట జూలై 16న తమ తొలి సంతానానికి (ఆడబిడ్డ) జన్మనిచ్చారు. -
Air India: టేకాఫ్ అయిన పావుగంటకే..
అహ్మదాబాద్ ఘటన తర్వాత.. విమానాల్లో, అందునా ఎయిరిండియా సంస్థ విమానాల్లోనే ఎక్కువగా సాంకేతిక సమస్యలూ బయటపడున్నాయి. ఈ క్రమంలో విమానాల ఆలస్యం, రద్దు, దారి మళ్లింపు, వెనక్కి రావడం లాంటి ఘటనలూ నమోదు అవుతున్నాయి. తాజాగా..జైపూర్ నుంచి ముంబై బయల్దేరిన ఎయిరిండియా విమానం.. పావు గంటకే సాంకేతిక సమస్యతో వెనక్కి వచ్చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.35గం.కు బయల్దేరిన విమానం.. 18 నిమిషాల తర్వాత తిరిగి జైపూర్ ఎయిర్పోర్టుకే వచ్చేసింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం(జులై 23వ తేదీ) సైతం ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి ముంబైకి 160 మంది ప్రయాణికులతో బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం.. సాంకేతిక సమస్యతో రద్దయ్యింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమంటూ ఆ సమయంలో ఎయిరిండియా ప్రకటించింది. అదే రోజు.. కేరళ కాలికట్(కోజికోడ్) నుంచి దోహాకు 188 మందితో(సిబ్బంది సహా) బయల్దేరిన ఎయిరిండియా విమానం.. రెండు గంటల తర్వాత తిరిగి కాలికట్ ఎయిర్పోర్టుకే చేరుకుంది. ఇది కూడా సాంకేతిక సమస్యతోనే వెనక్కి వచ్చినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. -
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
తల్లి ఏమరపాటు ఆ పసిబిడ్డ ప్రాణం తీసింది. హడావిడిలో.. కిటికీని ఆనుకుని ఉన్న చెప్పుల స్టాండ్ మీద మూడున్నరేళ్ల చిన్నారిని కూర్చోబెట్టింది. అయితే ఆ చిన్నారి వెనక్కి దొర్లడంతో.. 12వ అంతస్తు నుంచి కిందపడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరింది.ముంబైలోని నియగావ్ నవకర్ సిటీలో బుధవారం సాయంత్రం ఘోరం జరిగిపోయింది. అన్వికా ప్రజాప్రతి అనే చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం 8గం. సమయంలో బయటకు వెళ్లేందుకు అన్వికా, ఆమె తల్లి వచ్చారు. తన బిడ్డ బయట తిరుగుతున్న విషయం గమనించిన తల్లి..ఆమె దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో చిన్నారిని షూ ర్యాక్ మీద కూర్చోబెట్టింది. అయితే చిన్నారి నిల్చుని ఒక్కసారిగా కూర్చునేందుకు ప్రయత్నించి.. వెనక్కి పడిపోయింది. ఆ ఘటనతో గుండెపగిలిన ఆ తల్లి సాయం కోసం కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు రక్తపు మడుగులో పడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఏడాదిలో ప్రాణాలు పోతున్న చిన్నారుల సంఖ్య.. వేలల్లోనే ఉంటోందని యూనిసెఫ్ నివేదిక చెబుతోంది. View this post on Instagram A post shared by NDTV Marathi (@ndtvmarathi) -
అనిల్ అంబానీ ఇంట్లో ఈడీ సోదాలు
-
అంతిమ క్షణాల్లో.. 'విల్' పవర్!
మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు? ఏమిటి పిచ్చి ప్రశ్న అంటూ ఫైర్ అవకండి. మనం ఎలా చనిపోవాలో ఎంచుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నమ్మలేకపోతున్నారా! దీనికి మనం చేయాల్సిందల్లా వీలునామా రాయడమే. చివరి మజిలీని ఎలా ముగించాలనుకుంటున్నామో తెలుపుతూ ముందుగానే వీలునామా రాసిపెట్టుకుంటే చాలు. అయితే ఇది ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, దీనికి ఏమేం కావాలనే వివరాలు తెలుసుకోవాలంటే ముంబైలోని పీడీ హిందుజా నేషనల్ ఆస్పత్రికి వెళ్లాల్సిందే. దాని కంటే ముందు 'లివింగ్ విల్' అంటే ఏంటో చూద్దాం.'లివింగ్ విల్' అంటే?మనిషి ఎంత హాయిగా బతికాడన్నది కాదు, ఎంత సుఖంగా కన్నుమూశాడన్నది ముఖ్యం అంటారు మన పెద్దలు. ఇలాంటి ఆలోచన నుంచే లివింగ్ విల్ (living will) కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. నయం కాని రోగాలతో మంచాన పడి మరణం ముంగిట నిలుచున్నప్పుడు లివింగ్ విల్ క్లారిటీ ఇస్తుంది. చివరి క్షణాల్లో వైద్య సహాయం కావాలా, వద్దా అనేది ఎవరి వారే నిర్ణయించుకోవచ్చు. అఖరి గడియల్లో వెంటిలేటర్ సపోర్ట్ తీసుకోవాలా, వద్దా అనేది కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే రాసే వీలునామానే లివింగ్ విల్ లేదా అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్గా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే.. మన చావు ఎలా ఉండాలో నిర్ణయించుకోవడం. చివరి రోజుల్లో మంచాన పడి జీవచ్ఛవంగా నరకయాతన అనుభవించకుండా సునాయాస మరణం పొందేందుకు ముందుగానే మనం చేసుకునే ఏర్పాటుగా దీన్ని భావించొచ్చు.సుప్రీం తీర్పు ఆధారంగా..మనిషి ఎలా చనిపోవాలనుకుంటున్నాడో తెలుపుతూ ముందుగానే రాసే వీలునామా (లివింగ్ విల్)ను సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా 2018లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. లివింగ్ విల్ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో 2023లో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి జోక్యం చేసుకుంది. లివింగ్ విల్ నమోదు విధానాన్ని సులభతరం చేస్తూ కొన్ని సడలింపులు ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా కొన్ని విషయాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వీలునామాలను ఎక్కడ భద్రపరుస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి బాంబే హైకోర్టు (Bombay High Court) పరిష్కారం చూపించింది. వీలునామాలను భద్రపరచడానికి, సులువుగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేయాలని బాంబే హైకోర్టు 2024లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇప్పటివరకు 40 మంది..న్యాయస్థానాల ఆదేశాల మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఈ వీలునామాల నమోదు ప్రారంభించింది. 24 వార్డుల్లో ఇప్పటివరకు 40 మంది లివింగ్ విల్ సమర్పించారు. ఇందులో 10 మంది మహిళలు ఉండడం గమనార్హం. 50, 60, 70 ఏళ్ల వారి నుంచి ఈ వీలునామాలు వచ్చాయి. 83 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. ఈ పత్రాలకు నగరంలోని 24 వార్డుల్లో మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్లు సంరక్షకులుగా ఉంటారు. వీరి వివరాలు బీఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని బీఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూపేంద్ర పాటిల్ తెలిపారు. ఆన్లైన్లోనూ వీలునామాలు సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.లివింగ్ విల్ క్లినిక్మహిమ్ ప్రాంతంలోని హిందుజా ఆస్పత్రి.. లివింగ్ విల్ క్లినిక్ను జూన్ నెలలో ప్రారంభించింది. గౌరవంగా చనిపోవడం (డైయింగ్ విత్ డిగ్నిటీ) పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రూప్ గుర్సహాని చొరవతో లివింగ్ విల్ వీక్లీ క్లినిక్ ప్రారంభమైంది. పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ స్మృతి ఖన్నా దీన్ని నిర్వహిస్తున్నారు. లివింగ్ విల్పై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు వీలునామా (veelunama) రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను తమ క్లినిక్ చేస్తుందని డాక్టర్ స్మృతి ఖన్నా తెలిపారు. భవిష్యత్తులో ఊహించని ఉత్పాలను తాము ఎలా ఎదుర్కొవాలనే దాని గురించి వీలునామాలో ప్రస్తావించొచ్చని తెలిపారు. ఆకస్మిక ప్రమాదాలు, నయం కాని వ్యాధులు బారిన పడి చివరి గడియల్లో ఉన్నప్పుడు తాము ఏం కోరుకుంటామో.. ముందుగానే లివింగ్ విల్లో రాసుకోవచ్చు.'లివింగ్ విల్ క్లినిక్ (Living Will Clinic) ప్రారంభమైప్పటి నుంచి ఇక్కడి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో 40 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. కొంత మంది మాత్రం ఒంటరిగా వస్తున్నారు. నయం కాని దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నవారికి అన్ని సందర్భాల్లో ఐసీయూ ఆధారిత వైద్యసేవలు సహాయకపడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో జీవితాన్ని పొడిగించడం కంటే కూడా బాధల నుంచి విముక్తి కల్పించడం అవసరమన్పిస్తుంద'ని డాక్టర్ స్మృతి ఖన్నా పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండినవారు ఎవరైనా.. ఆరోగ్యంగా ఉన్నా, లేకున్నా లివింగ్ విల్ రాయొచ్చన్నారు. 'జీవితం అనూహ్యమైనది, కానీ మీ వైద్య ఎంపికలు అలా ఉండనవసరం లేదు. మీరు వాటిని స్వయంగా వ్యక్తపరచలేకపోయినా, మీ చికిత్సా ప్రాధాన్యతలను తెలుసుకుని, వాటిని అనుసరించేలా లివింగ్ విల్ సహాయపడుతుంది. మీ ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేయడానికి, మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇది సరళమైన, అర్థవంతమైన మార్గం' అంటూ అవగాహన కల్పిస్తోంది హిందుజా ఆస్పత్రి.లివింగ్ విల్ క్లినిక్ ఏం చేస్తుంది?వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్, సీపీఆర్ వంటి అత్యవసర చికిత్స తీసుకుంటున్న సందర్భాల్లో మెడికల్ కౌన్సిలింగ్ ఇస్తుంది.సుప్రీంకోర్టు ఆమోదించిన పార్మాట్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో లీగల్ డాక్యుమెంటేషన్ చేస్తుంది.లివింగ్ విల్ అమలు చేయడానికి అవసరమైన పత్రాలు తయారు చేస్తుంది. (నఖలు పత్రాలను కుటుంబ సభ్యులు, డాక్టర్లతో పాటు పేషంట్ల చిరునామా ఆధారంగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు పంపిస్తారు)లివింగ్ విల్ సేవలకు అవుట్ పేషంట్స్ డిపార్ట్మెంట్(ఓపీడీ) ధరల ప్రకారం ఫీజు తీసుకుంటారు. అవసరమైన వారికి ఉచితంగా కూడా పని చేసి పెడతారు.లివింగ్ విల్ ఎప్పుడు అమలు చేస్తారు?బతికుండగానే రాసిన వీలునామాను ఎప్పుడు అమలు చేస్తారనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిబంధనల మేరకు ఈ వీలునామాను వైద్యులు, ప్రభుత్వ అధికారుల బృందం పర్యవేక్షణలో అమలు చేస్తారు. ఆఖరి రోజుల్లో రోగి తనకు తానుగా నిర్ణయం తీసుకోలేనప్పుడు లివింగ్ విల్ ఆధారంగా ముందుకెళతారు. రోగి ఆరోగ్య పరిస్థితి విషమం అని లేదా ఇక కోలుకోలేరని కనీసం 2 మెడికల్ బోర్డులు ధృవీకరించిన తర్వాతే లివింగ్ విల్ ప్రకారం చర్యలు చేపడతారు.ఎవరెవరు రాశారు?ముంబైకి చెందిన పలువురు లివింగ్ విల్ రాసిపెట్టుకున్నారు. డాక్టర్ నిఖిల్ దాతర్(55), చార్టెడ్ అకౌంటెంట్ ప్రఫుల్ పురాణిక్ (60), డాక్టర్ లోపా మెహతా(78), యశ్వంత్ కజ్రోల్కర్ (83) తదితరులు లివింగ్ విల్ రాసిన వారిలో ఉన్నారు. గైనకాలిస్ట్గా పనిచేస్తున్న నిఖిల్ దాతర్.. లివింగ్ విల్ మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సులభతరం చేసిన వెంటనే.. 2023, ఫిబ్రవరిలో వీలునామా రాశారు. అయితే ఈ వీలునామాను ఎవరికి ఇవ్వాలనే సమస్య ఆయనకు ఎదురైంది. దీంతో ఆయన బాంబే హైకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో చివరకు మహారాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులకు ఈ వీలునామా సంరక్షణ బాధ్యతలు అప్పగించింది. వీలునామా రాయడం పెద్ద విషయం కాదు. సమయం వచ్చినప్పడు మనం రాసిన వీలునామాను ఎంత వరకు అమలు చేస్తారనేదే ముఖ్యమని డాక్టర్ నిఖిల్ దాతర్ అన్నారు.సహజ మరణం కోరుకుంటున్నాఅఖరి గడియల్లో తనకు వైద్య సహాయం అవసరం లేదని శివాజీ పార్క్ ప్రాంత నివాసి డాక్టర్ లోపా మెహతా అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించినప్పుడు వెంటిలేటర్లు, ఫీడింగ్ ట్యూబ్స్తో అందించే చికిత్స తనకు వద్దని ఆమె స్పష్టం చేశారు. చివరి క్షణాల్లో తమ వారికి కాపాడుకునేందుకు ప్రయత్నించి ఆర్థికంగా, మానసికంగా నలిగిపోయిన ఎన్నో కుటుంబాలను చూసిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ''చివరి రోజుల్లో నన్ను ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వస్తే.. నేను పనిచేసిన కింగ్ ఎడ్వార్డ్ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకెళ్లండి. అక్కడ అనవసరమైన జోక్యం ఉండదని నేను నమ్ముతున్నాను" అని ఆమె పేర్కొన్నారు.అమ్మ బాధ చూసిన తర్వాత..మనం చనిపోతామని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు ఆలస్యం చేయాలని ప్రశ్నిస్తున్నారు ఎయిరిండియా మాజీ ఉద్యోగి యశ్వంత్ కజ్రోల్కర్. పార్కిస్సన్ వ్యాధితో తన తల్లి అనుభవించిన నరకయాతన చూశాక, అలాంటి అవస్థ తనకు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని ప్రఫుల్ పురాణిక్ వ్యక్తం చేశారు. బ్లడ్ క్యాన్సర్తో తన వదిన ఎంతో వేదన పడ్డారని, ఆమె బాధ చూసిన తర్వాత అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మనవాళ్లను కాపాడుకోవడానికి చేయాల్సిందంతా చేస్తాం. పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసినప్పుడు మనం ఏమీ చేయలేం. నా పిల్లలు నన్ను.. వెంటిలేటర్పై ఉన్న వ్యాధిగ్రస్తులా కాకుండా, నేనున్నట్టుగానే గుర్తుపెట్టుకోవాల'ని కోరుకుంటానని ప్రఫుల్ పేర్కొన్నారు. -
ముంబైలో అల్ట్రా లగ్జరీ ఇళ్ల జోరు
ముంబై నగరంలో లగ్జరీ ఇళ్లకు (రూ.10 కోట్లు, అంతకుమించిన బడ్జెట్లోనివి) డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగి రూ.14,751 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ.12,285 కోట్లుగా ఉండడం గమనార్హం.సంఖ్యా పరంగా చూస్తే అల్ట్రా లగ్జరీ ఇళ్ల విక్రయాలు 11 శాతం పెరిగి 692 యూనిట్లకు చేరాయి. ఈ వివరాలను ఇండియా సోథెబిస్ ఇంటర్నేషనల్ రియల్టీ (ఐఎస్ఐఆర్), సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. కొత్తగా నిర్మించిన ఇళ్లు, మెరుగైన వసతులతో ఉన్న వాటికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైమరీ మార్కెట్లో (మొదటిసారి విక్రయించే కొత్త ఇళ్లు) ఇళ్ల అమ్మకాలు 422 యూనిట్ల నుంచి 501 యూనిట్లకు పెరిగాయి. సెకండరీ మార్కెట్లో విక్రయాలు (రీసేల్) 200 యూనిట్ల నుంచి 191కు తగ్గాయి. ప్రైమరీ మార్కెట్లో అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాల విలువ రూ.8,752 కోట్ల నుంచి రూ.11,008 కోట్లకు పెరిగింది. సెకండరీ మార్కెట్లో అమ్మకాల విలువ రూ.3,533 కోట్ల నుంచి రూ.3,743 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: చందా కొచ్చర్పై ఆరోపణలు.. నిజం బట్టబయలు‘ముంబై లగ్జరీ ఇళ్ల మార్కెట్ కీలక తరుణంలో ఉంది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో రికార్డు స్థాయి అమ్మకాలు అల్ట్రా ప్రీమియం ఇళ్లకు ఉన్న డిమాండ్ను తెలియజేస్తోంది. ముఖ్యంగా వర్లి, ప్రభాదేవి, మలబార్ హిల్, బాంద్రా వెస్ట్ వంటి సూక్ష్మ మార్కెట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది’ అని ఐఎస్ఐఆర్ ఈడీ సుదర్శన్ శర్మ తెలిపారు. -
మరో స్వదేశీ స్టోర్ వచ్చేస్తోంది : కుమార్తె, కోడళ్లతో నీతా అంబానీ ప్రత్యేక పూజ
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఫౌండర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, నీతా అంబానీ ముంబైలో మరో స్వదేశీ స్టోర్ను లాంచ్ చేయనున్నారు. మేడ్ ఇన్ ఇండియా స్పూర్తితోపాటు, హస్తకళలను ఆదరించడం, హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే తొలిసారి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్ను హైదరాబాద్ ఏర్పాటు చేసిన నీతా అంబానీ తాజాగా ముంబైలోని ఈరోస్లో స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ కుమార్తె ఇషా, కోడళ్లు శ్లోక, రాధికలతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.స్వదేశ్ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈవేడుక నిర్వహించారు. దేశీయ అనాది సంప్రదాయాలు, తరతరాలుగా అందివస్తున్న చేతివృత్తుల నైపుణ్యానికి శాశ్వత వారసత్వానికి నివాళిగా ఈ వేడుకను నిర్వహించారు.భారతీయ కళలను, సంప్రదాయాలను గౌరవించడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. తాజాగా మరో అద్భుతమైన చీరలో రాజసం ఉట్టిపడేలా కనిపించారు. రాజ్శృందర్ రాజ్కోట్ 10 నెలలకు పైగా చేతితో నేసిన అద్భుతమైన మధురై కాటన్ ఘర్చోలా చీరను ధరించారు. ఈ చీరకు ప్రముఖ డిజైనర్ మనీష్మల్హోత్రా అందమైన జాకెట్టును నీతా ఎంపిక చేసుకున్నారు. యాంటిక్ గోల్డ్ వరల్డ్ ఎంబ్రాయిడరీతో ఫిరోజీ సిల్క్ కాంచాలి బ్లౌజ్తో స్టైల్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) తాత ముత్తాల నాటి మహిళా కళాకారులకు నివాళిగా నీతా తనకు వారసత్వంగా వచ్చిన బంగారు బాజుబంద్ను ధరించారు. ఇది నీతా తల్లి ముత్తాత నుండి లభించిన ఆర్మ్లెట్. తన వివాహం సందర్భంగా కూడా దీన్ని ధరించడం విశేషం. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, వారసత్వం, ప్రేమ , ఒక తరం మహిళల నుండి మరొక తరం వరకు ప్రవహించే శాశ్వత శక్తికి చిహ్నం . పెద్దల కరుణ, జ్ఞానం ఆశీర్వాదాలతో నిండిన ఈ ఆర్మ్లెట్ అంబానీ నుంచి , ఆమె కుమార్తె ఇషా కుమార్తె, మనవరాలికి వారసత్వంగా లభిచనుంది.ఇక నీతా అంబానీ జ్యుయల్లరీ గురించి చెప్పాలంటే స్వదేశ్ నుండి వచ్చిన అద్భుతమైన నెక్లెస్తో తన లుక్ను మరింత వన్నె తెచ్చారు. ప్రతి ప్యానెల్ వైట్ గోల్డ్తో శ్రీనాథుడి జీవితంలోని దైవిక క్షణాలను చిత్రీకరించేలా చేతితో చేసిన కళాసృష్టి ఇది. కళాత్మకతను ఆధ్యాత్మికతతో మిళితం చేస్తుంది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) -
రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్కు ఇదెలా సాధ్యమైందంటే?
‘‘అధిక బరువు.. ఫిట్గా లేడు.. ఇలాగే ఉంటే కెరీర్ను ఎక్కువకాలం కొనసాగించలేడు. బరువు తగ్గితే బెటర్..’’.. టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఉద్దేశించి మాజీ క్రికెటర్లు తరచూ చేసే విమర్శలు ఇవి. అయితే, ఇకపై వారికి ఆ అవకాశం లేకుండా చేసేందుకు నడుంకట్టాడు ఈ ముంబైకర్.కేవలం రెండు నెలల్లోనే సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా పదిహేడు కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు అలా.. ఇప్పుడు ఇలా అంటూ అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్గా మారింది. మరి ఇంతకీ సర్ఫరాజ్ ఖాన్ ఇంత త్వరగా బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాడో తెలుసా?!రోటీలు, అన్నం తినడం మానేశాముఈ విషయం గురించి సర్ఫరాజ్ ఖాన్ తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్ మీడియాకు తెలియజేశాడు. ‘‘ ఒక రకంగా నోరు కట్టేసుకున్నామనే చెప్పవచ్చు. దాదాపు నెల, నెలన్నర పాటు రోటీలు, అన్నం తినడం పూర్తిగా మానేశాము.బ్రకోలి, క్యారట్, దోసకాయ, సలాడ్లు ముఖ్యంగా ఆకుపచ్చటి కూరగాయలతో చేసిన సలాడ్లు ఎక్కువగా తిన్నాము. వీటితో పాటు కాల్చిన చేపలు, కాల్చిన, ఉడకబెట్టిన చికెన్, ఉడకబెట్టిన గుడ్లు డైట్లో చేర్చుకున్నాము. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీలు తాగాము.చక్కెర ముట్టనేలేదుఅవకాడోలు, మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా తిన్నాము. అయితే, వీటన్నికంటే ముఖ్యంగా మేము అన్నం, రోటీ తినడం మానేయడం వల్లే ఎక్కువ మేలు జరిగింది. అంతేకాదు చక్కెర కూడా అస్సలు ముట్టలేదు. మైదాతో చేసే పదార్థాలు, బేకరీ ఫుడ్ను పూర్తిగా పక్కనపెట్టేశాము.పన్నెండు కిలోలు తగ్గిపోయానుఈ క్రమంలోనే సర్ఫరాజ్ నెలన్నరలోనే దాదాపు పది కిలోలకు పైగా తగ్గిపోయాడు. ఇంకా బరువు తగ్గేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. బిర్యానీ తినడం కూడా పూర్తిగా తగ్గించేశాడు. నేను కూడా దాదాపు పన్నెండు కిలోలు తగ్గిపోయాను.ఇప్పుడు నా మోకాలి నొప్పికి కాస్త ఉపశమనం కలిగింది. తనతో పాటు డైట్ చేయడం వల్ల నాకు కూడా ఇలా మేలు జరిగింది’’ అని నౌషద్ ఖాన్ హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.గతేడాది అరంగేట్రంకాగా దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్.. 2024లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటికి ఆరు టెస్టులు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మూడు అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాయంతో 371 పరుగులు చేశాడు.చివరగా ఇటీవల ఇంగ్లండ్-‘ఎ’ జట్టుతో భారత్-‘ఎ’ ఆడిన అనధికారిక టెస్టు సిరీస్లో సర్ఫరాజ్ పాల్గొన్నాడు. కాంటర్బరీలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 119 బంతుల్లో 92 పరుగులు చేసి.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నార్తాంప్టన్లో జరిగిన రెండో టెస్టులో అతడికి ఆడే అవకాశం రాలేదు. -
భర్తను చంపేసి ఇంట్లో టైల్స్ కింద పాతిపెట్టి..!
మనకు దృశ్యం సినిమా అనగానే ఠక్కున గుర్తొచ్చేది మాత్రం అందులో మర్డర్ సీన్ చుట్టూ తిరిగిన ఓవరాల్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చి సుమారు దశాబ్దకాలం పూర్తి కావొస్తున్నా.. ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోయి మరీ చూసేస్తూ ఉంటాం. అందులో హీరో చేసిన హత్య.. ఆపై ఆ శవాన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్ కిందే పాతిపెట్టడం సినిమాకే హైలైట్. అక్కడ తన కూతుర్ని వేధిస్తున్న వ్యక్తిని తండ్రి చంపి మొత్తం కేసునే తప్పుదోవ పట్టిస్తూ సీన్లు అల్లిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఇది సినిమా కాబట్టి ఆసక్తికరం అనిపిస్తోంది. మరి నిజ జీవితంతో జరిగితే వామ్మో అనే పరిస్థితి.మరి, ఇదే దృశ్యం సినిమాను ఫాలో అయినట్లుంది ఓ మహిళ. భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. లవర్తో కలిసి మరీ భర్తను హత్య చేసి టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. ఇది మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల విజయ్ చావన్, 28 ఏళ్ల కోమల చావన్లు భార్యా భర్తలు. ముంబైకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వీరి జీవితంలోకి ఒక ‘ లవర్’ వచ్చాడు. కోమలకు ప్రియుడు.. విజయ్కు యముడు మాదిరి వారి జీవితంలోకి ప్రవేశించాడు. అతని పేరు మోను. కోమల, మోను కలిసి విజయ్ను చంపేశారు. అంటే కోమల తన భర్త విజయ్ను మోనుతో కలిసి అంతమొందించింది. మరీ ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచన చేస్తే.. ఇంట్లోనే టైల్స్ కిందే శవాన్ని పూడ్చిపెట్టేందని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే చేసేశారు. ఆ తర్వాత కోమల, మోనులు కలిసి ‘లాంగ్ టర్మ్ హనీమూన్’( వేరే చోటకి పరార్) వెళ్లిపోయారు. అయితే విజయ్ సోదరునికి అనుమానం వచ్చి ఇంటికి రాగా, అక్కడ తాళం వేసి ఉంది. ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అన్నను చంపేసిన వదిన.. ఆ ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టందనే విషయాన్ని తెలుసుకుని షాక్ తిన్నాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేపట్టారు. -
ముంబై ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
-
నేరం చేశారంటే నమ్మలేం
ముంబై: ముంబైలో 19 ఏళ్ల క్రితం 180 మందికిపైగా ప్రాణాలను బలిగొన్న రైలు పేలుళ్ల కేసులో సోమవారం కీలక పరిణామం సంభవించింది. పోలీసులు నేర నిరూపణలో ఘోరంగా విఫలమయ్యారని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితులు ఈ నేరం చేశారంటే నమ్మడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం మొత్తం 12 మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ‘నిందితుల నేరాంగీకార ప్రకటనలు ఏమా త్రం ఆమోదయోగ్యంగా లేవు. అవన్నీ కాపీ చేసినట్లుగా కనిపిస్తున్నాయి. నేరం అంగీకరించాలంటూ పోలీసులు తమను తీవ్రంగా హింసించారని పేర్కొనడం ద్వారా నిందితులు నేరాంగీకార విశ్వసనీయతను మరింత దెబ్బతీశారు’అని వ్యాఖ్యానించింది. నేరానికిగాను ఏ రకం బాంబులు వాడారనే విషయం కూడా పోలీసులు చెప్పలేకపోయారని, సేకరించిన ఆధారాలు నేరనిరూపణకు సరిపోయేవి కావంది. ‘బాంబులు, సర్క్యూట్ బాక్సుల వంటి స్వాధీనమైన వస్తువులకు సరిగ్గా సీళ్లు వేయలేదు. వాటిని జాగ్రత్తగా భద్రపర్చలేదు. కీలకమైన సాక్షులను ప్రశ్నించడంలోనూ విఫలమైంది’అంటూ ప్రాసి క్యూషన్ తీరుపై విరుచుకుపడింది. నిందితులకు న్యాయపరమైన సాయం అందించకుండానే నేరాంగీకార ప్రకటన రికార్డు చేయడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. నిందితుల నేరాంగీకార స్టేట్మెంట్లలో ఏమాత్రం స్పష్టత లేదంది. పేలుళ్ల కేసుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆప్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్(మోకా)ను వాడకపోవడాన్ని ఎత్తి చూపింది. ‘అసలైన నేరస్తుడిని శిక్షించడం నేర కార్యకలా పాలను అరికట్టడానికి, చట్టాన్ని నిలబెట్టడానికి, పౌరుల భద్రతను నిర్ధారించే దిశలో ఒక ముఖ్య మైన అడుగు’అని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్ల ధర్మాసనం తన 671 పేజీల తీర్పులో పేర్కొంది. ‘అందుకు విరుద్ధంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా, సమాజానికి తప్పుడు సంకేతాన్ని పంపేలా ప్రాసిక్యూషన్ వ్యవహరించింది. అసలైన ముప్పు ఇప్పటికీ తొలగలేదనే విషయం ఈ కేసుతో తేటతెల్లమైంది’అని మండిపడింది. ‘నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది. నిందితులు నేరానికి పాల్పడ్డారని నమ్మడం కష్టం. అందుకే వారిపై ఆరోపణలను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. రైళ్లలో బాంబులు అమర్చడం తదితర నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ప్రకటించిన నలుగురితోపాటు జీవిత కాల జైలు శిక్షలు పడిన ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. వీరిలో మరణ శిక్ష పడిన కమాల్ అన్సారీ 2021లో జైలులోనే చనిపోయాడు. మహానగరం ముంబైలోని స్థానిక రైళ్లు ఏడింటిలో 2006 జూలై 11న పేలుళ్లు సంభవించాయి. ఘటనల్లో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్.. వీడియో వైరల్
పాము ఉందని తెలిస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కళ్లకు కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. ఇక సినిమా వాళ్లకు పాము అంటే భయం ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. వాళ్లు రియల్ లైఫ్లో పాములను రేర్గా చూస్తుంటారు. చిన్న బల్లికే భయపడే స్టార్స్ చాలా మందే ఉన్నారు. కానీ ‘రియల్ హీరో’, నటుడు సోనూ సూద్(Sonu Sood ) మాత్రం పెద్ద పాముని తన చేతులతో పట్టుకున్నాడు. ఆ పాముని చూసి తన సిబ్బంది అంతా భయంతో దూరం జరిగితే.. ఆయన మాత్రం చాకచక్యంగా దాన్ని పట్టుకొని..అడవిలో విడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ముంబైలో సోనూ సూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఈ పాము దారితప్పి వచ్చింది. పాముని చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. సోనూ సూద్ మాత్రం ఉత్త చేతులతో దాన్ని పట్టుకొని సంచిలో బంధించాడు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. అయితే తనలాగా ఇలాంటి స్టంట్లు చేయకుండా.. ఇళ్లలోకి పాములు ప్రవేశిస్తే నిపుణులను పిలించి మాత్రమే పట్టుకోవాలన్నారు. తన ఇంట్లోకి వచ్చిన పాము ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.हर हर महादेव 🔱❤️#harharmahadev🙏🌿🕉️ pic.twitter.com/u500AcrlxS— sonu sood (@SonuSood) July 19, 2025 -
లంబోర్ఘిని అయితే.. రియల్బాస్ డాగీ రాజా ఇక్కడ! వైరల్ వీడియో
కార్లు అన్నింటిలోనూ ఖరీదైన, లగ్జరీ కారు రారాజు లాంటిది లంబోర్ఘిని కారు. విశ్వాసంలో కింగ్..కుక్క. ఈ రెండు అనుకోకుండా ఎదురు పడితే.. అస్సలు ఊహకే అందడం లేదు కదా. అందుకే విచిత్రమైన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.విషయం ఏమిటంటే.. ముంబై వీధిలో లంబోర్గిని కారునుకొద్దిసేపు ఆటాడుకుంది ఓ స్ట్రీట్ డాగ్. కొట్టొచ్చినట్టు ఉన్న కారు కలర్ (డార్క్ ఆరెంజ్) చూసి అలా బిహేవ్ చేసిందో ఏమో తెలియదు కానీ ఈ వీడియో ఒకటి ప్రస్తుతం ఎక్స్ లో వైరల్ అవుతోంది.వీడియోలో విశేషాలుఆరెంజ్ కలర్లో లంబోర్గిని కారుకు అడ్డంగా నిలబడింది డాగ్. అటూ ఇటూ కొంచెం కూడా కదల్లేదు.. బెదర లేదు. దానితో మనకెందుకునే అనుకున్న డ్రైవర్ పక్కకు పోనిచ్చాడు. ఆహా.. అయినా వదల్లేదు.. వదల బొమ్మాళీ అంటూ కారును ఫాలో అయింది. మళ్లీ డ్రైవర్ తన కారును తిప్పినప్పుడు,ఇక మన శునక రాజు గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చివరికి లంబోర్గిని కుక్కను దాటి దూసుకుపోయింది. దాంతో దాన్ని శునకం కొంత దూరం వరకు వెంబడించడం ఈ వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను "కాలేష్ బీ/వీ సర్ డోగేష్ అండ్ లంబోర్గిని" అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు కూడా వచ్చాయి. "రోడ్డుకి నిజమైన బాస్" ‘‘మన బ్రో దెబ్బకు.. లంబోర్గిని పారిపోయింది’’ ఇలా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.Kalesh b/w Sir Dogesh and Lamborghini pic.twitter.com/EbgnzoErvI— Ghar Ke Kalesh (@gharkekalesh) July 15, 2025 -
బాలీవుడ్ న్యూసెన్స్కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి అనుమతి ఉండదు
డబ్బుoటే కొండ మీద కోతి దిగొస్తుంది అంటారు అదేమో గానీ ఒక్కోసారి మనకు కావాల్సిన చోట, కోరుకున్నవారి మధ్య నివాసం కూడా పొందలేమని నిరూపితమవుతోంది. భారతదేశపు వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో సంపద ఉండడం అనేది వారి స్థాయిని నిర్దేశించే ఒక ప్రధాన అంశం, అయితే ఆ నగరంలోని కొన్ని ప్రాంతాలలో విస్తుపోయేలా దీనికి అతీతమైన ధోరణి కనిపిస్తుంది. అటువంటి ఒక ప్రాంతం, పెడ్డర్ రోడ్, ఈ రోడ్ సంపదకు మాత్రమే కాకుండా దానికే స్వంతమైన ఆలోచనల ద్వారా కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఇక్కడ నివాసాలకు అపారమైన సంపద లేదా ప్రముఖ హోదా కూడా అనుమతి, అంగీకారం పొందుతామనే హామీ ఇవ్వదు. ఈ విచిత్రమైన ఈ వాస్తవికతను ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ విశాల్ భార్గవ వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు కొనడానికి ప్రయత్నించినప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా అనధికారిక అడ్డంకులను ఎదుర్కొంటారని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు దివంగత బిలియనీర్, బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడిదారు రాకేష్ జున్ జున్ వాలా కూడా ఈ ప్రాంతంలోని ఒక ఎలైట్ క్లబ్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు.‘ముంబై, మంచ్ అండ్ మార్కెట్ విత్ చింతన్ వాసని‘ పేరిట ఇన్స్ట్రాగామ్ ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ, టాటా చైర్మన్ ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులకు నిలయంగా, ‘ధనవంతులు, అంతకు మించిన సూపర్ రిచ్ల‘ డొమైన్గా పెడ్డర్ రోడ్ను అభివర్ణించారు. కానీ, సెలబ్రిటీలను ఎదురేగి ఆహ్వానించే, స్వీకరించే బాంద్రా మాదిరిగా కాకుండా, పెడ్డర్ రోడ్ సొసైటీలు తరచుగా బాలీవుడ్ నటులను తమకు పెద్ద న్యూసెన్స్లా చూస్తాయి, అక్కడ ఆస్తిని కొనుగోలు చేసే వారికి అనధికారిక పరిమితులను విధిస్తాయి అంటూ ఆశ్చర్యపరిచే నిజాలను ఆయన వెల్లడించారు.ఈ ప్రత్యేకత నివాస సొసైటీలతో పాటు విందు వినోద కేంద్రాలకు సైతం విస్తరించింది. దీనికి ఈ రోడ్లోని ఒక ప్రముఖ సంస్థ అయిన విల్లింగ్డన్ క్లబ్ను భార్గవ దీనికి ఉదహరించారు. ‘వారు బాలీవుడ్ నటులను ఇష్టపడరు, అంతేకాదు వారు అత్యున్నత విద్యావంతులు తప్ప ఇతరత్రా తమను తాము ఉన్నతంగా భావించే ఎవరినీ ఇష్టపడరు‘ అని ఆయన వివరించారు. భారత స్టాక్ మార్కెట్లో పేరొందిన ‘బిగ్ బుల్‘ అయిన జున్ జున్ వాలా ఆ ప్రాంతంలోని విల్లింగ్డన్ క్లబ్లో సభ్యత్వం పొందడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అభ్యర్ధనను క్లబ్ ఏకంగా మూడుసార్లు తిరస్కరించడం జరిగిందని కూడా భార్గవ వెల్లడించారు.‘మీ దగ్గర డబ్బు ఉందడం ప్రాధాన్యత కాదు, పెద్దర్ రోడ్లో నివసించాలంటే డబ్బు కు మించిన విలువ ఏదైనా ఉండాలి‘ అని భార్గవ నొక్కిచెప్పారు. ‘ధనవంతులు సూపర్ రిచ్‘ గా ఉండటం చాలా సార్లు అర్హతగా మారుతుందని అయితే, ‘ధనవంతులు. ప్రముఖులు‘ గా ఉండటం అక్కడ అనర్హత అని ఆయన వివరించారు. బదులుగా, ‘ధనవంతులు అత్యంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తులు ఈ అల్ట్రా–ఎక్స్క్లూజివ్ ఆవరణలో ప్రవేశం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారాయన.గత 2022లో ఆగస్టు 14 వ తేదీన తన 62 సంవత్సరాల వయసులో మరణించిన జున్ జున్ వాలా తన సామ్రాజ్యాన్ని రూ.5,000 పెట్టుబడి నుంచి 5.5 బిలియన్ల సంపదకు నిర్మించుకున్నారు. చురుకైన పెట్టుబడి వ్యూహాలతో ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా‘ గా ప్రసిద్ధి చెందారు. అంతటి ప్రముఖ వ్యక్తి సైతం ఒక క్లబ్ సభ్యత్వం పొందలేకపోయారనే వాస్తవం వెల్లడి కావడం ముంబైలోని పెడ్డర్ రోడ్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. View this post on Instagram A post shared by Chintan Vasani️ (@chintanvasani) -
ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు
-
ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు
-
చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా
MumbaiDreams చిన్న వయసులోనే కేవలం రూ.500తో ముంబైకి వచ్చాడు. దాదాపు 34 ఏళ్ల పోరాటం.ఎన్నో కష్టాలు మరెన్నో చేదు అనుభవాలు. కానీ మంచిరోజులు తప్పక వస్తాయని తనపై నమ్మకం పెట్టుకున్నాడు. కట్ చేస్తే సూపర్ స్టార్ అయ్యాడు. పట్టుదల, సహనం ఆయనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కష్టాలు, సుఖాలు వెలుగు నీడల్లాంటివే వస్తాయ్..పోతాయ్.. కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. దృఢ నిశ్చయంగా గమ్యం వైపు సాగిపోవాలి అని నిరూపించిన నటుడు, రాజకీయ నాయకుడి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!రేసుగుర్రం’తో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవీంద్ర కిషన్ శుక్లా(Ravi Kishan Shukla) (జననం 1969, జూలై 17న సంప్రదాయాలు, కట్టుబాట్లతో నిండిన ఒక పూజారి ఇంట్లో పుట్టాడు. కానీ చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టం. చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించాడు. ఇది తండ్రి బాగా మందలించాడు. చఅంతే 17 ఏళ్ల ప్రాయంలో 500 రూపాయలు చేతబట్టుకొని ముంబైకి పారిపోయాడు. అదే అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ముంబై లాంటి మహానగరంలో ఆయన జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు. దివింది 12వ తరగతే...అయినా సరే. ఈ భూమ్మీద తన నకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆశతోనే ముందుగా సాగాడు. కట్ చేస్తేప్రస్తుతం గోరఖ్పూర్ నుండి పార్లమెంటు, లోక్సభ సభ్యునిగా పనిచేస్తున్నారు.అతను పార్లమెంటరీ విధులలో తన పనితీరుకు 2025లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.1992లో విడుదలైన బాలీవుడ్ చిత్రం పితాంబర్తో తన కెరీర్ను ప్రారంభించాడు. తన తొలి సినిమాతో రూ.5000 సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం,కన్నడ చిత్రాలలో నటించినప్పటికీ భోజ్పురి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2003లో వచ్చిన సయ్యా హమార్ బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతే అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేడు. స్టార్గా రాణించాడు. బిగ్ బాస్ 1 తో పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ చిత్రానికి మొట్టమొదటిసారిగా భోజ్పురిలో స్పైడర్ మ్యాన్ 3కి డబ్బింగ్ కూడా చేశాడు. అయితే నటుడిగా ఉండాలంటే చాలా భ్రమల్లో ఉండేవాట. పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని, అయితే అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలో అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు. ఇలా గెలుపోటముల నుంచి నేర్చుకుంటూ, పడుతూ లేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు రవికిషన్.1993లో ప్రీతి శుక్లాను వివాహం చేసుకున్న రవి కిషన్ నలుగురు పిల్లల(ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు )తండ్రి. ముక్కాబాజ్, బాట్లా హౌస్ , లాపతా లేడీస్ - నుండి మామ్లా లీగల్ హై వంటి OTT హిట్ల వరకు.. ఎన్నో మైలు రాళ్లు ఆయన జీవితంలో ఉన్నాయి.రవి కిషన్ నికర విలువ: పలు మీడియా నివేదికల ప్రకారం రవికిషన్కు రూ.14.96 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దాదాపు రూ.20.70 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నాయి. దీంతోపాటు కోట్ల రూపాయల విలువైన 11 ఫ్లాట్లు ఉన్నాయి. భార్య ప్రీతి శుక్లా పేరుతో రూ.4.25 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. దీనితో పాటు రూ.9.38 లక్షల విలువైన బంగారం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక కోట్ల విలువ చేసే టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు BMW వంటి లగ్జరీ కార్లున్నాయి. -
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)
-
టెస్లా కారు వచ్చేసింది..
ముంబై: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. అలాగే, మధ్య స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ ’వై’ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఈ షోరూంను ప్రారంభించారు. టెస్లా భారత్లోనే పరిశోధనలు, తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లు, సర్వీస్, చార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఏపీఏసీ (ఏషియా పసిఫిక్) రీజియన్ చీఫ్ ఇసాబెల్ ఫాన్ తెలిపారు. ముంబై, ఢిల్లీలో 4 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జర్మన్ కార్లతో పోటీ.. దేశీ మార్కెట్లో మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి జర్మన్ ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లతో టెస్లా మోడల్ వై పోటీపడనుంది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల కార్ల ధర రూ. 30 లక్షల లోపే ఉంటోంది. దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్ ప్రస్తుతం కార్ల దిగుమతులపై 70–100 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. వీటిని తగ్గించాలని కోరుతున్న టెస్లా, దేశంలో ముందుగా తమ కార్లను అమ్ముకునేందుకు, సర్విస్ చేసేందుకు అనుమతిస్తే, అమ్మకాలను బట్టి తయారీ చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తామంటూ టెస్లా చెబుతోంది. కానీ, ఏ ఒక్క కంపెనీకో ప్రయోజనం చేకూర్చేలా విధానాలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామనే హామీ ఇచ్చే కంపెనీలు 15 శాతం సుంకానికే ఏటా 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది.రెండు వేరియంట్లు..మోడల్ వై రెండు వేరియంట్స్లో లభిస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజిని (మైలేజీ) ఇచ్చే రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ బేస్ ధర రూ. 59.89 లక్షలుగా ఉంటుంది. 622 కి.మీ. రేంజినిచ్చే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలుగా ఉంటుంది. 2025 మూడో త్రైమాసికం లేదా నాలుగో త్రైమాసికం నుుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.దీన్ని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా చైనాలోని తమ ప్లాంటు నుంచి టెస్లా దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయిస్తుంది. ముందుగా ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్లో డెలివరీలు, రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. టెస్లా డిజైన్ స్టూడియో ద్వారా వాహనం లోపల, వెలుపల, అలాగే ఫీచర్లను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చని పేర్కొంది. భారత్లో టెస్లా వాహనాలకు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్, ఎకో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు బీమా కవరేజీని అందిస్తాయి.ధరలు ఇలా.. (కంపెనీ వెబ్సైట్ ప్రకారం..) ⇒ మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 59.89 లక్షలు (ముంబై ఎక్స్–షోరూం), ఆన్రోడ్ ధర రూ. 61,07,190.⇒ మోడల్ వై లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 67.89 లక్షలు (ముంబై ఎక్స్–షోరూం), ఆన్రోడ్ ధర రూ. 69,15,190.⇒ బుకింగ్ అమౌంట్ రూ. 22,220గా (నాన్–రిఫండబుల్) ఉంటుంది. తుది ధ్రువీకరణ కోసం ఏడు రోజుల్లోగా మరో రూ. 3 లక్షలు చెల్లించాలి. ⇒ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) ఆప్షన్ కోసం అదనంగా రూ. 6 లక్షలు.⇒ అమెరికాలో నగదు రూపంలో చెల్లిస్తే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 37,490 డాలర్లుగా (సుమారు రూ. 32.24 లక్షలు) ఉంది.ప్రత్యేకతలు.. ⇒ గంటకు 0 – 100 కి.మీ. వేగం 5.6 సెకన్లలో⇒ వెనుక కూర్చునే వారి కోసం ఎనిమిది అంగుళాల స్క్రీన్, 9 స్పీకర్లు⇒ టాప్ స్పీడ్ గంటకు 201 కి.మీ.⇒ ఫాస్ట్ చార్జర్లతో 15 నిమిషాల్లో 267 కి.మీ. చార్జింగ్⇒ వెలుపల ఎనిమిది కెమెరాలు⇒ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్⇒ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్⇒ రెండు వేరియంట్లు, ఆరు రంగుల్లో లభ్యం ⇒ వైర్లెస్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, వైర్లెస్ చార్జర్ -
టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వచ్చే వారం భారత మార్కెట్లో లాంఛనంగా అడుగుపెట్టనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జూలై 15న దేశీయంగా తొలి స్టోర్ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఎంపిక చేసిన ప్రముఖులకు టెస్లా పంపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి కార్ల సెట్ను తమ చైనా ప్లాంటు నుంచి కంపెనీ ఎగుమతి చేసినట్లు వివరించాయి. ఇవి మోడల్ వై రియర్–వీల్ డ్రైవ్ ఎస్యూవీలై ఉంటాయని తెలిపాయి. టెస్లా ఇండియా గత నెలలో ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్క్లో 24,565 చ.అ. వేర్హౌస్ స్థలాన్ని అయిదేళ్లకు లీజుకు తీసుకుంది. యూరప్, చైనా మార్కెట్లలో తమ కార్ల విక్రయాలు నెమ్మదిస్తున్న తరుణంలో భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
వరుసగా మూడో మ్యాచ్లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలనం
టీమిండియా యువ సంచనలం ముషీర్ ఖాన్ ఇంగ్లండ్ పర్యటనలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలు, ఐదు వికెట్ల ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్లో పర్యటిస్తున్న ముషీర్ ఆల్రౌండర్గా అదరగొడుతున్నాడు.ఈ పర్యటనలో Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసిన ముషీర్.. ఆ మ్యాచ్లో బౌలింగ్లోనూ ఇరగదీసి 6 వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం జులై 3న ఛాలెంజర్స్తో (కంబైన్డ్ నేషనల్ కౌంటీస్) ప్రారంభమైన రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ (127 బంతుల్లో 125; 11 ఫోర్లు, సిక్స్) చేసిన ముషీర్.. బౌలింగ్లోనూ చెలరేగి ఆ మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 4) తీశాడు.తాజాగా ముషీర్ లౌబరో UCCE జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్లో ముషీర్ 146 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ముషీర్కు ఇంగ్లండ్ పర్యటనలో ఇది వరుసగా మూడో సెంచరీ.హ్యాట్రిక్ సెంచరీలు, అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనలతో ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న ముషీర్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత క్రికెట్కు మరో భవిష్యత్ తార దొరికాడని టీమిండియా అభిమానులు సంబురపడిపోతున్నారు. 20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్లో కారు ప్రమాదానికి గురైన తర్వాత ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇది.ఈ టోర్నీలో ముషీర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ భారత సీనియర్ టీమ్ సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ముషీర్ అన్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నా టీమిండియా బెర్త్ దక్కడం లేదు. మరోవైపు కౌంటీల్లో సత్తా చాటుతూ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా భారత టెస్ట్ జట్టు బెర్త్ వైపు చూస్తున్నారు. ఇంత పోటీలో ముషీర్ టీమిండియా వైపు ఎలా వస్తాడో చూడాలి. ఇక్కడ ముషీర్కు ఓ అడ్వాంటేజ్ ఉంది. ముషీర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఇరగదీస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన ముషీర్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా సత్తా చాటాడు.ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
శాంతంగా ఉండండి
ముంబై: న్యాయస్థానాల్లో వాడీవేడీగా వాదనలు జరుగుతుంటే సంయమనంతో ఉండాల్సిన న్యాయమూర్తులు సైతం పట్టరాని ఆవేశంతో లాయర్లపై విరుచుకుపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆవేశాలు కోర్టుల్లో ప్రశాంత పనివాతావరణాన్ని పాడుచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలో బాంబే హైకోర్టులో కేసుల వాదోపవాదనల ప్రత్యక్ష ప్రసారాల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని సీజేఐ గవాయ్ ప్రారంభించి తర్వాత ప్రసంగించారు. ‘‘బాంబే హైకోర్టులో న్యాయమూర్తులు వెలువర్చిన ఎన్నో తీర్పులను చూసి గర్వపడ్డా. తీర్పులను చాలా చక్కగా రాశారు. అయితే ఈ హైకోర్టు జడ్జీలపై కొన్ని అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొందరు న్యాయమూర్తులు కోపాన్ని నియంత్రించుకోలేక కోర్టుల్లోనే తిట్టేస్తున్నట్లు నాకు సమాచారం అందింది. న్యాయమూర్తిగా పనిచేయడం అనేది మిగతా ఉద్యోగాల మాదిరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పనిచేసేది కాదు. సమాజం, దేశం కోసం చేసే అత్యుత్తమమైన సేవల్లో ఇదీ ఒకటి. ఇందుకు అంకితభావం, నిబద్ధత చాలా అవసరం. అయితే కొందరు జడ్జీలు తరచూ లాయర్లతో మర్యాదలేకుండా, పరుష పదజాలం ఉపయోగిస్తూ తిడుతున్నట్లు కనిపిస్తోంది. తరచూ లాయర్లకు, కొందరు ఉన్నతాధికారులకు సమన్లు జారీచేస్తున్నారు. అనవసరంగా సమన్లు జారీచేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. జడ్జీలు ప్రశాంతంగా ఉంటే కోర్టుహాల్లో వాతావరణం హుందాగా ఉంటుంది. అలాంటప్పుడే లాయర్లుసహా అక్కడ ఉండేవాళ్లందరి రక్తపోటు, చక్కర స్థాయిలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ఇది న్యాయమూర్తులకూ వర్తిస్తుంది’’అని అనగానే అక్కడ ఉన్నవారంతా ఫక్కున నవ్వారు. పార్ట్టైమ్ జడ్జీల్లా తయారయ్యారు ‘‘కొందరు జడ్జీలు రోజువారీ విధులను సంపూర్ణంగా చేయకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి పార్ట్టైమ్ జడ్జీలతో సమస్యే. కొన్ని ధర్మాసనాల్లో కొందరు జడ్జీల వైఖరిపై నాకు పక్కా సమాచారం అందింది. పేర్లు వెల్లడించనుగానీ వాళ్లు కోర్టు మొదటి సెషన్లో కొద్దిసేపు, తర్వాతి సెషన్లో కొద్దిసేపు అలా ధర్మాసనంపై కూర్చుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి పార్ట్టైమ్ జడ్జీల వైఖరి మంచిది కాదు. సమాజానికి, దేశానికి సేవచేస్తామని జడ్జీగా ప్రమాణంచేశాక ఇలాంటి ధోరణి ప్రదర్శించడం ఆ ప్రమాణాన్ని చిన్నచూపు చూడటమే అవుతుంది. ఇలాంటి చర్యలతో న్యాయస్థానాలకు చెడ్డపేరు తీసుకురావొద్దు. ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు, లాయర్లు అంకితభావం, కృషితో సమున్నత స్థాయికి చేరిన న్యాయస్థానాల ఘనకీర్తికి మచ్చ తీసుకురాకండి’’అని హితవు పలికారు.కాలానుగుణంగా చట్టాలను అన్వయించుకోవాలి విస్తృతస్థాయిలో రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంట్కు ఉందంటూ ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై సీజేఐ మాట్లాడారు. ‘‘రాజ్యాంగంలో సమూలస్థాయిలో మార్పులు చేయాలన్న వాదనలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి రాజ్యాంగం అనేది సజీవ పత్రం. మారుతున్న కాలానుగుణంగా, సమాజ అవసరాలకు తగ్గట్లుగా పార్లమెంట్ రాజ్యాంగంలో మార్పులు చేయొచ్చు. సామాజిక, ఆర్థికాభివృద్దికి బాటలువేసేలా ఆ మార్పులు ఉండాలి. చట్టాలు, రాజ్యాంగాన్ని నేటి సమాజ సవాళ్లకు పరిష్కారాలు వెతికేందుకు అనువుగా మాత్రమే అన్వయించుకోవాలి. సమాజ అవసరాలు తీర్చేలా న్యాయవితరణలో న్యాయస్థానాలు చట్టాలు, రాజ్యాంగాన్ని ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి’’అని సీజేఐ అన్నారు. ‘‘జడ్జీ పోస్ట్లోకి సిఫార్సుచేసేముందుగా ఆయా అభ్యర్థులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడే కొత్త సంస్కృతికి సుప్రీంకోర్టు తెరలేపింది. అయితే ఒక హైకోర్టులో అభ్యర్థులే ముందుగా చొరవతీసుకుని జడ్జీలను కలిసే ప్రయత్నంచేసినట్లు నాకు తెలిసింది. ఇలాంటి అనుచిత ధోరణి బాంబే హైకోర్టులో ఉండబోదనే ఆశిస్తున్నా’’అని ఆయన అన్నారు. -
పృథ్వీ షా సంచలన నిర్ణయం
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెటర్గా తనకు గుర్తింపునిచ్చిన ముంబైతో బంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి (2025-26) దేశవాలీ సీజన్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. షా ఇటీవలే NOC (No Objection Certificate) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్కు దరఖాస్తు చేసుకోగా, తాజాగా అది జారీ అయ్యింది. PRITHVI SHAW JOINS MAHARASHTRA...!!!!- Waiting for Ruturaj × Shaw opening. 💛 pic.twitter.com/UPT4qF9mYv— Johns. (@CricCrazyJohns) July 7, 2025షా క్రమశిక్షణారాహిత్యం కారణంగా గత సీజన్లో ముంబై రంజీ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే డిసెంబర్ 14న జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్లో మాత్రం ఆడాడు. ఆ మ్యాచ్ షా రాణించనప్పటికీ ముంబై ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో మధ్యప్రదేశ్పై విజయం సాధించింది. ఇదే షాకు ముంబై తరఫున ఆఖరి మ్యాచ్.షా ముంబై క్రికెట్ అసోసియేషన్కు (MCA) రాసిన లేఖలో ఇలా పేర్కొన్నాడు. MCA క్రికెటర్గా తనకు జన్మనిచ్చిందని అన్నాడు. MCA తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపాడు. మహారాష్ట్రకు ఆడే ఆశాజనకమైన అవకాశాన్ని కాదనుకోలేకపోయానని తెలిపాడు. ఈ మార్పును (ముంబై నుంచి మహారాష్ట్రకు) తన క్రికెట్ ప్రయాణంలో ముందడుగుగా అభివర్ణించాడు. ఇది తన అభివృద్ధికి దోహదపడుతుందని నమ్ముతున్నానని అన్నాడు.25 ఏళ్ల పృథ్వీ షా కెరీర్ హీన దశలో ఉన్నప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై తరఫున అవకాశాలు దాదాపుగా కనుమరుగు కావడంతో ఈ సాహసం చేశాడు. సహజంగా క్రికెటర్లకు ముంబై తరఫున ఆడుతుంటేనే జాతీయ జట్టులో అవకాశాలు వస్తుంటాయి. అలాంటిది షా ముంబైని వీడి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేసి భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. వివాదాలు, ఫిట్నెస్, పేలవ ఫామ్ కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు.ఇవే కారణాలుగా అతను దేశవాలీ జట్టులోనూ చోటు కోల్పోయాడు. షాను తాజాగా ముగిసిన ఐపీఎల్లోనూ ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. షా కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. ఈ దశలో అతను ముంబైని వీడి మహారాష్ట్రకు ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు. షా తదుపరి దేశవాలీ సీజన్లో మరో టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఆడతాడు. రుతురాజ్ మహారాష్ట్రకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అన్నీ కుదిరితే షా, రుతురాజ్ మహారాష్ట్ర తరఫున ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. -
నటితో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో ప్రముఖ నేత కుమారుడి వీరంగం
ముంబై: ముంబైలో కలకలం. మద్యం మత్తులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ జావేద్ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి నటి రాజశ్రీ మోరే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దూర్భలాడాడు. తనతో ఎందుకు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇదిగో కావాలంటే డబ్బులు తీసుకో అంటూ నటిని బెదిరిస్తున్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి.గత ఆదివారం (జూలై 6న) ముంబైలోని అంధేరి ప్రాంతంలో రాహిల్ మోతాదుకు మించి మద్యం సేవించాడు. అంధేరి నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా.. మార్గం మధ్యలో నటి రాజశ్రీ మోరే కారును ఢీ కొట్టాడు. దీంతో రాజశ్రీ.. రాహిల్పై వాగ్వాదానికి దిగింది. అర్ధ నగ్నంగా ఉన్న రాహిల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మహరాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు జావెద్ షేక్ అని బెదిరించాడు. ఇరువురి వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో రాహిల్ ఘర్షణకు దిగారు. తాజా సమాచారం ప్రకారం.. రాహిల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల మరాఠీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనని లక్ష్యంగా చేసుకున్నారని రాజశ్రీ ఆరోపించారు. ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The son of MNS leader Javed Shaikh abuses (in Hindi/Urdu, of course) a Marathi girl after hitting her car. He even mocks her Marathi surname.Let’s see whom the Thackeray brothers choose, a Marathi-speaking Maharashtrian or a Hindi-speaking Muslim. pic.twitter.com/xxamEFlTn7— Mr Sinha (@MrSinha_) July 7, 2025మహారాష్ట్రలో భాషా వివాదం మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ స్పష్టంచేశారు. మీ మాతృభాషను మీరు ప్రేమించి, గౌరవిస్తే ఇతర భాషల పట్ల కూడా మీరు అలాగే వ్యవహరిస్తారు అని ఫడ్నవీస్ చెప్పారు.నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలుఈ వివాదంపై నటి రాజశ్రీ మోరే స్పందించారు. మహరాష్ట్రలో మరాఠీ భాషను తప్పనిసరి చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. మరాఠీలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తారు. కానీ భాషను రద్దు ప్రయత్నం చేయడం వల్ల వలసదారులు నగరం విడిచిపెడతారని అన్నారు. అదే జరిగితే ముంబైలోని స్థానిక మరాఠీ సమాజం పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రకటనల తర్వాత, నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలు వెల్లువెత్తాయి.నేపథ్యంలో, రాజ్శ్రీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మరాఠా భాషపై స్పందించిన వీడియోను డిలీట్ చేశారు. ఎంఎస్ఎన్ మద్దతు దారులు సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
Mumbai:‘మెట్రో’లో జనం కిటకిట.. తొక్కిసలాట భయంలో..
మహారాష్ట్రలోని ముంబై మెట్రోలో సోమవారం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ముంబై మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నందున ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వెర్సోవా ఘట్కోపర్ లైన్ వన్లో మెట్రో రాకపోకల్లో జాప్యం జరుగుతున్నదన్నారు. Crazy commuter woes thanks to 1 service withdrawn tech issues with mumbai metro line 1 Stampede like situation in ghatkopar station@Dev_Fadnavis @CMOMaharashtra act fast before lives are lost Line 1 needs 6 bogie rakes & 3 times current rakes@MandarSawant184@BHiren@impuni… pic.twitter.com/bn0ujkJhBT— ANDHERI LOKHANDWALA OSHIWARA CITIZEN'S ASSOCIATION (@AndheriLOCA) July 7, 2025ప్రయాణికుల విపరీతమైన రద్దీ కారణంగా ఘాట్కోపర్ స్టేషన్లో తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడిందని, త్వరగా చర్యలు తీసుకోవాలని ఒక యూజర్ ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ మెట్రో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ముంబై మెట్రో రద్దీపై సోషల్ మీడియా యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈరోజు ఆఫీసుకు వెళ్లలేమని, వర్క్ ఫ్రమ్హోమ్ కావాలని బాస్లకు మెసేజ్ పెట్టామని తెలిపారు. ప్రభుత్వం ముంబైలోని రైలు సేవలపై దృష్టి సారించాలని పలువురు కోరారు. -
‘మహా’తీరంలో పాక్ నౌక?.. అంతటా హై అలర్ట్
ముంబై: మహారాష్ట్ర తీరంలో కలకలం చెలరేగింది. భారత నావికాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించగా, అది పాకిస్తాన్ ఫిషింగ్ నౌక అయివుండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవ్దండా తీరం సమీపంలో ఈ అనుమానాస్పద నౌక కనిపించిన దరిమిలా మహారాష్ట్రలోని రాయ్గఢ్ తీరం వెంబడి భద్రతను మరింతగా పెంచారు.తీరం వెంబడి పోలీసు దళాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా రాయగఢ్ జిల్లాలో భద్రతను పెంచారని ఒక అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారత నావికాదళ రాడార్ రెవ్దండాలోని కొర్లై తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానస్పద నౌకను గుర్తించింది. ప్రస్తుతం పోలీసులు, సముద్రతీర భద్రతా సిబ్బంది ఆ నౌక కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయ్గడ్ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ), బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది అనుమానాస్పద నౌక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. రాయ్గడ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఫీ) అంచల్ దలాల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు తీరానికి చేరుకున్నారు. ఆ నౌకను చేరుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వారు వెనుదిరిగారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవను గుర్తించి, దానిని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. -
ఏడుస్తూ వెళ్లిపోయిన హరిహర వీరమల్లు నటి.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ పేరు వినగానే స్పెషల్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. బాలీవుడ్ పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలోనూ కనిపించనుంది. ఇటీవలే విడుదలైన హౌస్ఫుల్-5 మూవీతోనూ ప్రేక్షకులను అలరించింది. చివరిసారిగా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది రాయల్స్లో నటించిన ముద్దుగుమ్మ ముంబయిలో ఎయిర్పోర్ట్లో కనిపించింది. అయితే ఆమె ఏడుస్తూ విమానాశ్రయంలో వెళ్తున్న వీడియో వైరల్గా మారింది.అదే సమయంలో ఓ వ్యక్తి ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. ఏడుస్తూ వెళ్తున్న నటితో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె బాడీగార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. సెల్ఫీ కోసం యత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అంతకుముందే నోరా ఫతేహీ తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్లో పోస్ట్ చేసింది. అయితే నోరా ఎందుకు అలా వెళ్లారో వివరాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఏడాది బీ హ్యాపీ, హౌస్ఫుల్-5 చిత్రాలతో మెప్పించిన నోరా.. చివరిసారిగా ది రాయల్స్ వెబ్ సిరీస్లో కనిపించింది. బాలీవుడ్లో ఎక్కువగా ఐటమ్ సాంగ్స్తోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా స్ట్రీట్ డాన్సర్ 3డీ, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, క్రాక్, మడ్గావ్ ఎక్స్ప్రెస్ లాంటి చిత్రాలలో కూడా నటించింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఠాక్రే వారసులు
-
ఆమె విజయం ఆకాశమంత!
ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ‘పారాచూట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. నవీన సాంకేతికతతో పారాచూట్ కంపెనీకి కొత్త కళ తీసుకువచ్చింది...ముంబైలోని ‘ఓరియెంటల్ వీవింగ్ అండ్ ప్రాసెసింగ్ మిల్స్’ను స్మిత తండ్రి విష్ణునాథ్ చాల్కె స్థాపించారు. కంపెనీలోకి స్మిత అడుగుపెట్టిన తరువాత పారాచూట్ల తయారీ మొదలైంది.నీటికింద ఉపయోగించే పారాచూట్, డిఫెన్స్ టార్గెట్ పారాచూట్, స్పేస్ రికవరీ పారాచూట్, కార్గో పారాచూట్, పర్సనల్ పారాచూట్, కాంబాట్ పారాచూట్, ట్యాంకులను విమానాల నుండి డ్రాప్ చేసే పారాచూట్... ఇలా ఎన్నో రకాల పారాచూట్లను ఓరియెంటల్ కంపెనీ తయారు చేస్తోంది.భద్రతా దళాలకు కూడా పారాచూట్లను సరఫరా చేస్తుంది. పారాచూట్లను అంతర్జాతీయంగా ఎగుమతి చేసిన తొలి ప్రైవేట్ ఇండియన్ కంపెనీగా ‘ఓరియెంటల్’ కంపెనీ గుర్తింపు తెచ్చుకుంది.తండ్రి వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి ముందు కొన్ని కంపెనీలలో పనిచేసింది స్మిత. మొదట్లో పని తెలిసిన టైలర్లను వెదుక్కోవడం కష్టంగా ఉండేది. పారాచూట్ టెక్నాలజీలో పట్టు సాధించి, మౌలిక సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్లింది స్మిత.విదేశాల్లో జరిగే ఎగ్జిబిషన్లకు క్రమం తప్పకుండా హాజరవుతుంటుంది. సాంకేతిక నిపుణులతో మాట్లాతుంది. కొత్త సాంకేతికతను ఎప్పటికప్పుడు కంపెనీలోకి తీసుకువస్తుంటుంది.‘ఒకప్పుడు పారాచూట్ ఫ్యాబ్రిక్ సాధారణ మగ్గాలపై తయారయ్యేది. ఇప్పుడు వాటర్ జెట్ లూమ్లపై తయారవుతోంది. అందుకే నాణ్యత మరింత పెరిగింది’ అంటున్న స్మిత ప్రతిష్ఠాత్మకమైన ‘ది సింథటిక్ అండ్ ఆర్ట్ సిల్క్ మిల్స్ రిసెర్చి అసోసియేషన్’కు ఉపా«ధ్యక్షురాలిగా ఉంది.తీరికలేనంత పనుల్లో ఉన్నప్పటికీ వంట చేయడం, తోటపనులు అంటే స్మితాకు ఇష్టం. ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఆమెకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఊరకే పోవు. కంపెనీ బలోపేతానికి ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి.గర్వించిన సందర్భంవ్యాపారరంగంలో నాకు స్ఫూర్తి మా నాన్న. అన్ని రకాలుగా నన్నుప్రోత్సహించేవారు. సాధారణ అవసరాల నుంచి యుద్ధంలో ఉపయోగపడే పారాచూట్ల వరకు ఎన్నో రకాల పారాచూట్లను మేము తయారు చేశాం. ఎయిర్క్రాఫ్ట్తో డ్రాప్ చేసే 16 టన్నుల ట్యాంకును ఎత్తే సామర్థ్యం ఉన్న పారాచూట్లను తయారు చేయడం మేము గర్వించిన సందర్భం.– స్మిత -
ఇంగ్లండ్లో కొనసాగుతున్న టీమిండియా యువ సంచలనం హవా.. మరో సెంచరీ, 6 వికెట్లు
ఇంగ్లండ్ పర్యటనలో భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ హవా కొనసాగుతోంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎమర్జింగ్ టీమ్ (MCA Colts) తరఫున ఇంగ్లండ్లో పర్యటిస్తున్న ముషీర్.. వరుసగా రెండు మ్యాచ్ల్లో అదిరిపోయే ఆల్రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టాడు.Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో 123 పరుగులు (127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో) చేసిన ముషీర్.. ఆతర్వాత బౌలింగ్లో 6 వికెట్ల ప్రదర్శన (8.2 ఓవర్లలో 6/31) నమోదు చేశాడు.తాజాగా రెండో మ్యాచ్లోనూ ముషీర్ తొలి మ్యాచ్ తరహా ప్రదర్శనలు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్లో కూడా ముషీర్ సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి భారత క్రికెట్ అభిమానులు ముషీర్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.భారత క్రికెట్కు మరో భవిష్యత్తు తార దొరికాడని ఆకాశానికెత్తుతున్నారు. ముషీర్కు సంబంధించిన తాజా వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది.కారు ప్రమాదం నుంచి బయటపడి..!20 ఏళ్ల ముషీర్ గతేడాది సెప్టెంబర్లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ముషీర్ మెడకు బలమైన గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత ముషీర్ ఆడుతున్న తొలి రెడ్ బాల్ టోర్నీ ఇదే. ముషీర్ తన చివరి రెడ్ బాల్ మ్యాచ్ను దులీప్ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముషీర్ ఐపీఎల్ 2025లో ఆడాడు (పంజాబ్ కింగ్స్ తరఫున ఓ మ్యాచ్). ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్లో ముషీర్ డకౌటై నిరాశపరిచాడు. ఆ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ముషీర్ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్లో ముషీర్ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్ అగర్వాల్ వికెట పడగొట్టాడు.ముషీర్ ఖాన్ మరో టీమిండియా అప్ కమింగ్ మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు. ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు. -
ముంబయి టూ గోవా.. పరుగులు తీసిన స్టార్ హీరో.. వామ్మో అన్ని కిలో మీటర్లా?
పార్టీలు చేసుకోవాలి క్యాసినోలు చూసుకోవాలి బీర్లు తాగాలి బీచ్లలో పడి దొర్లాలి... గోవా అనగానే లెట్స్ గో... అనేందుకు చాలా మందికి అవే కారణాలు కావచ్చు. కానీ ఆ అగ్రనటుడు మాత్రం గోవాకి పరుగులు తీసిన కారణం వీటికి పూర్తిగా భిన్నం కావడం విశేషం. ఫిట్గా ఉండండి హిట్ అనిపించుకోండి అని ప్రభోధించడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏకంగా 600 కి.మీ ప్రయాణం అది కూడా ఎలా? పరుగులు తీస్తూ కాసేపు సైక్లింగ్లో మరింత సేపు...ఇంతకీ ఎవరా నటుడు? ఏమా కధ? లెట్స్ గెట్ ఇన్ టూ దిస్ స్టోరీ...ఫ్యాషన్ రంగంలో మోడల్ సినిమా రంగంలో నటుడు, అనగానే చాలామంది గుర్తుకు రావచ్చు కానీ.. ఫిట్నెస్ ఐకాన్ అనేది కూడా వీటికి జతకలిస్తే మాత్రం దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చే ఏకైక పేరు మిలింద్ సోమన్. గత కొన్నేళ్లుగా అన అనూహ్యమైన ఫిట్నెస్ స్థాయిలతో అందర్నీ అబ్బుపరుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మిలింద్..మరోసారి తన శారీరక సామర్ధ్యాన్ని చాటుకున్నాడు. ‘ది ఫిట్ ఇండియా రన్’ పేరుతో ఏటా నిర్వహించే రన్నింగ్ ఈవెంట్ దీనికి వేదికగా నిలిచింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ముంబయి నుంచి గోవా వరకు సుమారు 600 కిలోమీటర్ల దూరం మోటారు వాహనం లేకుండా ప్రయాణించారు. ఈ ప్రయాణం 5 రోజుల్లో పూర్తి చేసిన ఘనత సాధించాడు.ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 90కిమీ సైక్లింగ్ 21కిమీ పరుగు ఇలా విభజించుకుంటూ ఆయన ప్రయాణించాడు. గత నెల అంటే జూన్ 26న ముంబైలోని శివాజీ పార్క్ నుంచి మిలింద్ సోమన్ ఫిట్ ప్రారంభమైంది. మహారాష్ట్ర భూభాగానికి ఆనుకుని ఉన్న కొంకణ్ బెల్ట్ను పూర్తిగా కవర్ చేస్తూ పెన్, కొలాడ్, చిప్లూన్, రత్నగిరి, కంకవళి ల మీదుగా ప్రయాణిస్తూ జూన్ 30న గోవాకు చేరుకున్నాడు. తన సాహస ప్రయాణాన్ని తాజాగా ఆయన ఇన్ షేర్ చేశాడు. దానితో పాటే ఓ సందేశాన్ని కూడా.'ఫిట్ ఇండియన్ రన్ 5రోజుల పాటు 600కిమీ పూర్తి చేశాను. ఇది ప్రతీ ఏటా తప్పనిసరిగా నేను ఎదుర్కునే ఛాలెంజ్, శరీరం, మనస్సు బాగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకునేందుకు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఉపకరిస్తుంది. అనేక మంది నాకు బెస్ట్ విషెస్ చెప్పడం మరెన్నో అఛీవ్ చేయాలని కోరుతుండడం నాకు మరింత ప్రేరణగా మారుతోంది. ప్రతి భారతీయుడు ఫిట్ ఇండియన్ అవ్వాలి. జైహింద్' అంటూ పంచుకున్నాడు.ప్రతీ ఒక్కరిలో ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెంచేందుకు గత 2020లో భారత ప్రభుత్వం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమంలో మిలింద్ పాల్గొంటున్నాడు. ఈ సారి 60ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో ఆయన సాధించిన ఈ ఫీట్... ఫిట్నెస్లో ఆసక్తి ఉన్న చాలామందికి ప్రేరణ అందిస్తోంది. -
బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. మహిళలపై తరచూ దారుణాలు చోటుచేసుకుంటున్నాయనే వార్తలు వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో, తాజాగా దీనికి భిన్నంగా జరిగిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ముంబైకి చెందిన 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన దగ్గర చదువుకునే 16 ఏళ్ల విద్యార్ధికి ఆందోళన నిరోధక మందులు(యాంటీ యాంగ్జైటీ మందులు) ఇచ్చి, ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తోంది. ఈ విషయం బయటపడిన దరిమిలా పోలీసులు ఆ మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. ఆమెపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల కింద నేరాలను మోపారు.పోలీసులు తెలిపిన ప్రకారం నిందితురాలు ఆంగ్ల ఉపాధ్యాయురాలు. బాధిత విద్యార్థి 11వ తరగతిలో ఉన్నప్పుడు అతనికి పాఠ్యాంశాలను బోధించారు. 2023 డిసెంబర్లో జరిగిన పాఠశాల వార్షికోత్సవం సమయంలో ఆ విద్యార్థికి ఆకర్షితురాలినైనట్లు ఆమె పోలీసులకు తెలిపింది. 2024 జనవరి నుంచి ఆ విద్యార్థితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. తొలుత ఆమె ఆ బాలుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగికంగా వేధించేదని, తరువాత అతనికియాంటీ-యాంగ్జైటీ ముందులు ఇచ్చి లోబరుచుకునేదని పోలీసులు తెలిపారు.అయితే ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ప్రవర్తనలో మార్పును గమనించి, ప్రశ్నించగా, అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ విద్యార్థి త్వరలోనే పాఠశాల విద్య పూర్తి చేస్తాడన్న భావనతో అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని విస్మరించారు. ఈ ఏడాది ఆ విద్యార్థి 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఆ ఉపాధ్యాయురాలు తిరిగి అతనిపై వేధింపులు ప్రారంభించింది. దీంతో ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: ఖరీదైన ఐదు టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం ఇంటి రెనోవేషన్ ఖర్చెంతంటే.. -
సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్లో టీమిండియా యువ సంచలనం ఆల్రౌండ్ షో
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా యువ ఆటగాడు ముషీర్ ఖాన్ ఇరగదీస్తున్నాడు. నాట్స్ సెకెండ్ 11తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ సహా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్ టీమ్తో ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా.. ముషీర్ ముంబై టీమ్లో సభ్యుడిగా ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ముషీర్.. తొలి ఇన్నింగ్స్లోనే బ్యాట్తో, బంతితో సత్తా చాటాడు. తొలుత బ్యాటింగ్లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, ఆతర్వాత బంతితో 'ఆరే'శాడు.ముషీర్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతనాడిన ఏకైక మ్యాచ్లో డకౌటై నిరాశపరిచాడు. ఆర్సీబీతో జరిగిన తొలి ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన ముషీర్ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్లో ముషీర్ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్ అగర్వాల్ వికెట పడగొట్టాడు.20 ఏళ్ల ముషీర్ ఖాన్ టీమిండియా అప్ కమింగ్ మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు. ముషీర్కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముషీర్ బౌలర్గానూ రాణించాడు. 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్కప్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. -
గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..
కొన్ని ఘటనలు మానవత్వం ఇంకా ఉందా అనే సందేహానికి తావిస్తే, మరికొన్ని.. ఇంకా మంచితనం బతికే ఉంది అనిపించేలా ఉంటాయి. అలాంటి హృదయవిదారక ఘటనే నవీ ముంబైలో చోటుచేసుకుంది. ఆ సంఘటన అందరిని మానవత్వంపై ఆలోచింప చేయడమే గాక, తోటివారికి చేతనైనా సాయం చేయాలి అనే స్పుహని కలిగించేలా చేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..55 ఏళ్ల టెకీ అనూప్ కుమార్ జీవితం గత మూడేళ్లుగా ఓ ఫ్లాట్ గదిలోనే ఒంటరిగా సాగింది. తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన అనంతరం తీవ్ర మానసిక ఆందోళనకు గురైయ్యారు. దాంతో బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని తన అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. అంతేగాదు తన రోజువారీ అవసరాల కోసం పూర్తిగా ఆన్లైన్ డెలివరీ యాప్స్పై ఆధారపడ్డారు. ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. ఇంట్లో చెత్త బయటన పారయేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం తదితరాల వల్ల కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అంతటి పరిస్థితి ఎదురైనా అనూప్ దాన్ని పట్టించుకోకుండా అదే దుర్భరమైన పరిస్థితుల్లో జీవించసాగాడు. అంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పందించిన అప్పార్ట్మెంట్ వాసులు..అనూప్ విషాదకర పరిస్థితిని గుర్తించిన అపార్ట్మెంట్ సొసైటీ వాసులు వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి, ముంబైలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్.ఈఏఎల్ (Social & Evangelical Association for Love) కు సమాచారం అందించారు. వారి చొరవతో అనూప్ను అపార్ట్మెంట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ప్రస్తుతం అనూప్కు మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల అవసరమైన చికిత్స అందిస్తున్నారు. SEAL సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఆయనకు పునరావాసం కల్పించి, మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని తిరిగి అందించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించింది. మన చుట్టూ ఉన్నవారి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటం, కష్టాల్లో ఉన్నవారికి మానవతా మనసుతో స్పందించడం ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తోంది. ఒకరి బాధను గమనించి, చేయగలిగినంతలో చేయూత ఇవ్వగలిగితేనే నిజమైన మానవత్వం ప్రకాశిస్తుంది.మనం మన పరిసరాలను నిశితంగా పరిశీలిస్తే, అనూప్ వంటి వారు మన మధ్యనే ఉండవచ్చు. వారికి అండగా నిలబడి, సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని చాటి చెప్పింది. సాటి మనిషి పట్ల కరుణ, ప్రేమను చూపడం ద్వారానే మనం బలమైన సమాజాన్ని నిర్మించగలం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది ఈ ఘటన.(చదవండి: కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..) -
‘కస్టమ్స్’ చేతికి 16 అందమైన పాములు
ముంబై: ప్రయాణికుల మాదిరిగా విమానం నుంచి దిగిన కొందరు.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. వీరు బంగారం లాంటి విలువైన వస్తువులను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. తాజాగా ముంబైలోని భారత కస్టమ్స్ అధికారులు థాయిలాండ్ నుండి వస్తున్న విమాన ప్రయాణికుడిని స్మగ్లింగ్ ఆరోపణలతో అడ్డుకున్నారు.ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. థాయిలాండ్ నుండి భారత్కు వస్తున్న ప్రయాణికుని నుండి 16 సజీవ పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.ఈ సజీవ పాములు విషపూరితం కానివని అధికారులు తెలిపారు. జూన్ ప్రారంభంలో థాయిలాండ్ నుంచి డజన్ల కొద్దీ పాములను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదేవిధంగా కొద్దిరోజుల వ్యవధిలో బల్లులు, సన్బర్డ్ల తదితర 100 జీవులను తరలిస్తున్న మరో ప్రయాణికుడిని కూడా అధికారులు అడ్డుకున్నారు.ఇది కూడా చదవండి: భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి? -
విమానం రెక్కలో ఇరుక్కున్న గడ్డి
ముంబై: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఈ నెల 25న ముంబై విమానాశ్రయంలో దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. విమానం ఒక రెక్క దిగువ భాగంలో గడ్డి ఇరుక్కుపోయి ఉండటమే ఇందుకు కారణమని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. గమనించిన వెంటనే తొలగించి, విమానం టేకాఫ్కు క్లియరెన్స్ ఇచ్చామంది. అయితే, ఆ విమానం ఏ రకానిది? అందులోని ప్రయాణికులు, సిబ్బంది సంఖ్య ఎంత? టేకాఫ్ షెడ్యూల్ సమయం? ప్రయాణికులు ఎంతసేపు విమానంలో ఉండిపోయారు? వంటి వివరాలను టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా వివరించలేదు. రెక్క దిగువ భాగంలో గడ్డి ఎలా చేరిందని విషయాన్ని సైతం తెలపలేదు. అయితే, ముంబైలో ఉదయం 7.45 గంటలకు టేకాఫ్ తీసుకోవాల్సిన ఏఐ 2354 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరినట్లు ఫ్లయిట్రాడార్24. కామ్ ట్రాక్ రికార్డును బట్టి తెలుస్తోంది. -
రేఖా.. హుషారుగా! కల్ట్ క్లాసిక్ ఉమ్రావ్ జాన్ రీ-రిలీజ్ సందడి (చిత్రాలు)
-
తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు.. ఆటలో సచిన్ టెండుల్కర్ వారసుడిగా పేరొందిన ఈ ముంబైకర్ ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా కెరీర్ పరంగా ఎంతో వెనుకబడిపోయాడు పృథ్వీ.గిల్ ఏకంగా టీమిండియా సారథి అయితే..అండర్-19 జట్టు కెప్టెన్గా భారత్కు ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా సారథ్యంలో ఆడిన శుబ్మన్ గిల్ (Shubman Gill) ఏకంగా టీమిండియా కెప్టెన్ అయితే.. ఇతడు మాత్రం దేశవాళీ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఒక్క ఫ్రాంఛైజీ కూడా కనీస ధర రూ. 75 లక్షల ధరకు పృథ్వీని కొనుగోలు చేయకపోవడం అతడి పరిస్థితికి అద్దం పడుతోంది.ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీ క్రికెట్లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇందుకు అంగీకరించింది. ఇక వచ్చే సీజన్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న పృథ్వీ షా తాజాగా న్యూస్24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకున్నాడు.పంత్ తప్ప ఎవరూ మాట్లాడలేదు.. సచిన్ సర్కు తెలుసుతాను కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఒక్క ‘బిగ్ క్రికెటర్’ కూడా తనకు అండగా నిలవలేదని పృథ్వీ చెప్పాడు. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) తప్ప ఎవరూ తనతో కనీసం మాట్లాడలేదని తెలిపాడు. ‘‘సచిన్ టెండుల్కర్కు నాకు సమస్యలు తెలుసు.అర్జున్ టెండుల్కర్తో పాటు నేను క్రికెటర్గా ఎదగడం ఆయన చూశారు. ఓసారి వారి ఇంటికి కూడా వెళ్లాను. అయితే, నేను కెరీర్ పరంగా చిక్కుల్లో ఉన్నపుడు రిషభ్ పంత్ తప్ప ఒక్కరూ పలకరించలేదు’’ అని పృథ్వీ షా వెల్లడించాడు.అదే విధంగా ఆటపై దృష్టి పెట్టలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ.. ‘‘నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. బయటి నుంచి చూసే వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.తప్పుడు వ్యక్తులతో స్నేహంఅందుకే ఆటకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. నిజానికి నేను గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. కనీసం మూడు నాలుగు గంటలు నెట్స్లో గడిపేవాడిని. రోజులో సగం సమయం అక్కడే గడిపేవాడిని. కానీ ఆ తర్వాత ఆట నుంచి నా దృష్టి మరలింది.తర్వాత నాలో పశ్చాత్తాపం మొదలైంది. దేనికి ఎంత సమయం కేటాయించాలో ఓ అవగాహన వచ్చింది. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. క్రికెటర్గా నేను ఉన్నత స్థితిలో ఉన్నపుడు వాళ్లు నా చెంత చేరారు. నన్ను చాలా చోట్లకు తిప్పారు.అప్పుడే నేను దారి తప్పాను. ఒకప్పుడు నెట్స్లో 8 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు ఆ సమయం నాలుగు గంటలకు తగ్గింది’’ అని పృథ్వీ షా తన తప్పులను అంగీకరించాడు. ఇకపై ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వెల్లడించాడు. కాగా వచ్చే డొమెస్టిక్ సీజన్లో పృథ్వీ మహారాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం ఉంది.చదవండి: క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ -
వైరల్ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్!
ముంబై: ముగ్గురు యువతులు బైక్పై త్రిబుల్ రైడింగ్ చేసూకుంటూ వెళుతున్నారు. స్కూటీని వేగంగా, ప్రమాదకరంగా మలుపులు తిప్పుతూ డ్రైవ్ చేస్తున్నారు. ఆ సమయంలో తన కుమార్తెను ట్యూషన్ కాలేజీకి తీసుకెళ్తున్న ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని ఆపి, తల్లిలా మందలించింది. కానీ వెరసి మహిళా కానిస్టేబుల్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అమ్మాయిల విషయంలో తాను చేసింది తప్పేనంటూ బహిరంగంగా క్షమాపణాలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే?మహరాష్ట్ర లాతూర్ సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రణిత ముస్నే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిని త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతులపై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రెనాపూర్ నాకా వద్ద చిత్రీకరించిన ఈ వీడియోలో.. కానిస్టేబుల్ ప్రణిత ముస్నే యువతులను మాటలతో దూషిస్తూ, చివరికి వారిలో ఒకరిని చెంపదెబ్బ కొడుతూ కనిపించారు. ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు.తర్వాత మీడియాతో మాట్లాడిన కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నా కుమార్తెలను ట్యూషన్కు వదిలి విధులకు వెళ్తున్న సమయంలో, ముగ్గురు యువతులు స్కూటర్పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని గమనించాను. వారిని ఆపి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాను. కానీ వారు 'నీ పని చూసుకో' అంటూ స్పందించారు. అందుకే వారిని వెంబడించి ఆపాను. ఆ సమయంలో నేను తల్లిలా స్పందించాను, కానిస్టేబుల్గా కాదు.అయితే, ఆమె అసభ్యంగా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు సైతం ఆమె మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు. చట్టం ప్రకారం.. యువతులపై చేయిచేసుకునే హక్కు లేదని ట్వీట్లు కూడా పెట్టారు. ఇలా ఆమె తీరు వివాదంగా మారింది. చివరికి ఆమె క్షమాపణలు చెప్పేందుకు దారి తీసింది. ‘నేను వాడిన భాష తప్పు. దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. కానీ నా ఉద్దేశం తప్పు కాదు’అని ఆమె స్పష్టం చేశారు.లాతూర్ పోలీస్ అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. Lady Traffic Constable Abuses, Beats Three Young Girls For Triple-Seat Riding In Latur pic.twitter.com/juTK3okkLg— ExtraOrdinary (@Extreo_) June 24, 2025 -
వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్కు భారత్ భారీ మార్కెట్గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించనుందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్బర్గ్ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్బర్గ్కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. -
దమ్ముంటే రాజకీయంగా అంతం చేయండి
ముంబై: మహారాష్ట్రలోని శివసేనలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ శివసేన (ఉద్ధవ్), శివసేన(షిండే)గా చీలిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబైలో శివసేన 59వ వ్యవస్థాపక దినోత్సవంలో శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. ఠాక్రే బ్రాండ్ను ధ్వంసం చేసేందుకు బీజేపీతోపాటు ఏక్నాథ్ షిండే కుట్రలు సాగిస్తున్నారని ఆరోపించారు. 1991లో విడుదలైన ప్రహార్ చిత్రంలోని నానా పటేకర్ డైలాగ్ను గుర్తుచేస్తూ, ‘‘మీకు దమ్ముంటే నన్ను రాజకీయంగా అంతం చేయండి’’అని ప్రత్యర్థులకు సవాలు విసిరారు. కానీ, వెంటనే హాస్యధోరణిలోకి వెళ్లిపోయారు. ‘‘నన్ను చంపడానికి రండి. కానీ, అంబులెన్స్ కూడా వెంట తెచ్చుకోండి. ఎందుకంటే దాని అవసరం మీకే ఉంటుంది’’అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. మరాఠీ పార్టీల్లో విభేదాలు సృష్టించడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ఠాక్రే బ్రాండ్ను ధ్వంసం చేయాలని చూస్తే బీజేపీని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఠాక్రే సవాల్పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన(షిండే) చీఫ్ ఏక్నాథ్ షిండే స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రేను ప్రజలు రాజకీయంగా ఎప్పుడో అంతం చేశారని, కొత్తగా చేయడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. సింహం చర్మం కప్పుకున్నంత మాత్రాన తోడేలు ఎప్పటికీ సింహం కాలేదని స్పష్టంచేశారు. ఉద్ధవ్ ఠాక్రే చాలెంజ్పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం స్పందించారు. ఉత్తుత్తి కబుర్లు చెప్పేవారి గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. -
నెలకు ఆరున్నర లక్షలా?.. ఖరీదైన ఫ్లాట్ తీసుకున్న స్టార్ హీరో భార్య!
ఈ రోజుల్లో నెలకు లక్ష రూపాయలు అద్దెకు ఇల్లు తీసుకోవడం అంటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. కానీ సినీతారల విషయానికొస్తే ఈ లెక్క మారుతుంది. వారు మినిమం లక్షకు పైగానే రెంట్ ఉంటుంది. ఇక పెద్ద పెద్ద స్టార్స్ అయితే రెండు, మూడు లక్షల పైమాటే. అయితే తాజాగా స్టార్ హీరో ఆర్ మాధవన్ భార్య సరిత ఏకంగా ఆరున్నర లక్షలకు ఓ అపార్ట్మెంట్ను లీజ్కు తీసుకుంది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో నెలకు దాదాపు రూ.6.50 లక్షలు చెల్లించేలా ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం దాదాపు రూ.39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ముంబయిలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. ఈ ఏరియాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాసమున్నారు.ఇక మాధవన్ సినిమాల విషయానికొస్తే మా అనే చిత్రంలో నటించారు. కాజోల్ లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రలో కనిపిస్తాడు. దీంతో పాటు ఫాతిమా సనా షేక్ జంటగా ఆప్ జైసా కోయి అనే సినిమాలో కూడా నటించారు. ఈ రొమాంటిక్ సినిమా జూలై 2025లో నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. మాధవన్ చివరిసారిగా అక్షయ్ కుమార్, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం కేసరి చాప్టర్-2లో కనిపించాడు.అంతే కాకుండా ఈ ఏడాది ప్రారంభంలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన హిసాబ్ బరాబర్ విడుదలైంది . అశ్వని ధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముకేశ్, రష్మీ దేశాయ్, ఫైజల్ రషీద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. జనవరి 24 నుంచి జీ5లో ప్రసారమవుతోంది. View this post on Instagram A post shared by Sarita Birje Madhavan (@msaru15) -
అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్-2025 తర్వాత దొరికిన విరామాన్ని పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించిన హిట్మ్యాన్.. తాజాగా ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా, చిన్నారి కుమారుడు అహాన్లతో కలిసి రోహిత్ ఎయిర్పోర్టులో ప్రవేశించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో ద్వారా రోహిత్ కొడుకు అహాన్ ఫేస్ పూర్తిగా రివీల్ అయింది. అహాన్ను చూసిన అభిమానులు.. ‘‘అచ్చం నాన్నలాగే ఉన్నాడు’’ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్గా రెండో ఐసీసీ ట్రోఫీని అందుకున్నాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్గా నిలిపాడు హిట్మ్యాన్. ఆ తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. పదిహేను మ్యాచ్లలో కలిపి 418 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్పై అతడు ఈ సీజన్లో తన అత్యధిక స్కోరు (81) నమోదు చేశాడు.అయితే, క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడటంతో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మధ్యలోనే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందే తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన 38 ఏళ్ల రోహిత్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఆగష్టులో అతడు మళ్లీ మైదానంలో దిగనున్నాడు. బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నేపథ్యంలో సారథిగా పునరాగమనం చేయనున్నాడు.ఇక 2007లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 273 వన్డేలు ఆడి.. 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. అంతేకాదు.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోరు (264) అతడిదే కావడం గమనార్హం. అదే విధంగా.. 159 టీ20లలో ఐదు శతకాల సాయంతో రోహిత్ 4231 పరుగులు చేశాడు. 67 టెస్టుల్లో కలిపి 4301 రన్స్ సాధించాడు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official) -
Ahmedabad Plane Incident కో పైలట్కు కన్నీటి వీడ్కోలు..
ముంబై: గతవారం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన కో పైలట్ క్లైవ్ కుందర్కు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఈరోజు(గురువారం. జూన్ 19వ తేదీ) ఉదయం క్లైవ్ కుందర్ మృతదేహాన్ని ముంబైలోని అయన నివాసంలో ఉంచగా.. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే క్లైవ్ కుందర్ తల్లి బోరున విలపించారు. తన కుమారుడిని ఇలా చూస్తానని ఊహించలేదని కుందర్ తల్లి శోకతప్త హృదయంతో విలపించారు. కుందర్ బంధువులు, స్నేహితులు నివాళులు అర్పించిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సేవిరి క్రైస్తవ స్మశానవాటికకు తరలించారు. ముంబైలోని గొరెగావ్ వెస్ట్లో తల్లి, దండ్రులు, ఒక సోదరితో కలిసి జీవిస్తున్న కుందర్కు 1, 100 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో క్లైవ్ కుందర్ ఫస్ట్ ఆఫీసర్, కో-పైలట్గా ఉన్నారు. అయతే విమానం టేకాఫ్ తీసుకున్న సెకన్ల వ్యవధిలో కూలిపోవడంతో మొత్తం విమానంలో ఉన్న పైలట్, కో పైలట్ తో సహా 241 మంది అసువులు బాసారు. ఆ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడగా, మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. అయితే డీఎన్ఏ టెస్టులు పూర్తి చేసిన తర్వాత మృతదేహాలను వారి వారి బంధువులు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహాల గుర్తింపులో జాప్యం చోటు చేసుకుంటోంది. -
సమంతకు చేదు అనుభవం.. జిమ్ నుంచి బయటకు రాగానే!
టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం ముంబయిలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తెరకెక్కించనున్న రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ వెబ్ సిరీస్లో కనిపించనుంది.అయితే తాజాగా ముంబయిలో సమంతకు చేదు అనుభవం ఎదురైంది. బాంద్రాలో జిమ్ చేసి బయటికి వస్తుండగా ఆమెను ఒక్కసారిగా ఫోటోలు తీసుకునేందుకు చుట్టుముట్టారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన సామ్.. అరే రూకోజి ప్లీజ్ అంటూ హిందీలో మాట్లాడుతూ అసహనంగా కనిపించింది. ఆమె కారు ఇంకా రాకపోవడంతోనే బయట నిలబడాల్సి రావడంతో ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత అసహన వ్యక్తం చేసింది.కాగా.. గతేడాది సిటాడెల్: హనీ బన్నీలో వరుణ్ ధావన్తో కలిసి చివరిసారిగా కనిపించింది. అయితే ఆ తర్వాత సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.Rarely see her get irritated or angry even when disturbed she usually remains cool n composed. That's a quality we need to inculcate taking from her✨@Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/9SMBRoYzxy— AkaSam (@SammuVerse) June 17, 2025 -
హడలెత్తించిన మరో ఎయిరిండియా విమానం
కోల్కతా: అహ్మదాబాద్ విషాద ఘటన మరవకముందే.. ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత శనివారం.. గువాహటి– కోల్కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికులు కలవరపాటుకు గురైన సంగతి తెలిసిందే. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు.తాజాగా, మరో విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు హడలెత్తిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోన్న ఎయిరిండియా విమానం (AI 180).. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్కతా ఎయిర్పోర్ట్కు చేసుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తగా.. సిబ్బంది వెంటనే గుర్తించి అలర్ట్ అయ్యారు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.An Air India flight from San Francisco to Mumbai via Kolkata suffered a technical snag in one of its engines, requiring passengers to be deplaned during a scheduled halt at the city airport early on Tuesday.#AirIndia #Kolkata #Mumbai #SanFrancisco #Ahmedabad pic.twitter.com/Sbj0JjHMlG— Diksha singh (@DikshaSingh7522) June 17, 2025కాగా, నిన్న(సోమవారం) కూడా.. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్లో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో టేకాఫ్ అయిన గంట తరువాత సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం హాంకాంగ్లో క్షేమంగా ల్యాండయ్యిందని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ315 స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.16 గంటలకు హాకాంగ్ నుంచి బయలుదేరింది.8.50కి టేకాఫ్ కావాల్సిన విమానం.. అప్పటికే మూడున్నర గంలు ఆలస్యంగా బయలుదేరింది. టేకాఫ్ అయిన గంట తరువాత విమానం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు విమానాన్ని హాంకాంగ్లో ల్యాండ్చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ఈ సమస్య ఎయిర్పోర్ట్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది. అహ్మదాబాద్లో ఎయిరిండియా ప్రమాదం తర్వాత బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్తో సంబంధం ఉన్న జెట్ వెనక్కి తిరిగి వెళ్లడం ఇది రెండోసారి. ఆదివారం.. చెన్నైకి వస్తున్న బ్రిటన్ ఎయిర్వేస్ డ్రీమ్లైనర్ కూడా సాంకేతిక సమస్య కారణంగా లండన్కు తిరిగి వెళ్లింది. -
ది రాజాసాబ్ హీరోయిన్కు చేదు అనుభవం.. పోలీసులు నిద్రలేచారు!
తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తోంది. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్లో కనిపించనుంది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మాళవిక మోహనన్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తన స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఓ వ్యక్తి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని తెలిపింది. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైనట్లు మాళవిక పంచుకుంది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత లేదని నటి మాళవిక మోహనన్ తెలిపింది.అయితే ఈ వార్త చూసిన ముంబయి పోలీసులు ఆమె జరిగిన ఘటనపై స్పందించారు. మాళివిక గారు మేము మీ గురించి వార్తల్లో చూశాం.. మీకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. నగరంలో రోజులో ఏ సమయంలో లేదా ఏ ప్రదేశంలోనైనా.. దయచేసి 112 లేదా 100 నంబర్లో మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత త్వరగా మీకు అండగా నిలుస్తామని తెలిపారు.(ఇది చదవండి: రాత్రి ట్రైన్లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్)ముంబయి పోలీసులు తమ పోస్ట్లో రాస్తూ..'ముంబై నగరం ఎల్లప్పుడూ మహిళలకు సురక్షితంగా ఉంటుంది. భద్రత మరింత మెరుగుపరచడానికి మేము ఎలాంటి చర్యలకైనా సిద్ధం. నేరస్థుడిని తగిన విధంగా.. చట్టబద్ధంగా శిక్షిస్తాం. దయచేసి మీ పేరును ఉపయోగించి ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో బాగా సహాయపడుతుంది.' అని విజ్ఞప్తి చేశారు. Ms @MalavikaM_ We came across an article in an online portal of a newspaper, which you shared your experince and raised concern over women safety in the city. We can imagine that experiences like these can be startling and leave a long term impact. Thus we must reiterate…— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) June 14, 2025 -
లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్కు బిగ్ షాక్ తగిలింది. -
సినిమాలతో కాదు.. ఆ ఒక్క డీల్తో కోట్ల రూపాయలు!
బాలీవుడ్ నటులు ఒక్కో సినిమాకు దాదాపు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అది సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్లోనూ కొందరు స్టార్స్ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి లిస్ట్లో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా చేరిపోయారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్ శివారులో మూడు అపార్ట్మెంట్లను ఆయన లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. వాటి ద్వారా ఐదేళ్లలో దాదాపు రూ.4.30 కోట్ల వరకు అర్జించనున్నారు. తాను లీజ్ తీసుకున్న మూడు అపార్ట్మెంట్లలో నెలవారీ అద్దె రూ. 6.30 లక్షలుగా ఉన్నట్లు టాక్. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.4 కోట్లకు పైగా సంపాందించనున్నారు జాన్ అబ్రహం. ఈ డీల్ను గత నెలలోనే క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు ఫ్లాట్లకు కలిపి రూ.36 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించారు.ప్రధానంగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్మెంట్లోకి మారనున్నారు.ఇక జాన్ అబ్రహం సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ది డిప్లొమాట్ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నటించిన టెహ్రాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలో నటించింది. -
బన్నీ సినిమా.. ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించబోతున్న అట్లీ!
అల్లు అర్జున్(Allu Arjun) కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. ఇక ఆల్ సెట్ గో... అంటూ అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ(Atlee ) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తారు. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబైలో జరగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణలో అల్లు అర్జున్, మృణాల్ ఠాగూర్ పాల్గొంటారని, వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ను సైతం షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట అట్లీ. అయితే ఈ తొలి షెడ్యూల్ షూటింగ్లో దీపికా పదుకోన్ పాల్గొనరట. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని అట్లీ సృష్టిస్తున్నారని, ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
బాల్యానికి రాబందులుగా కాదు... బంధువులుగా ఉందాం!
నింగిలోని చుక్కలతో ఏనుగును చిత్రించుకోవడం... చందమామలో చెవుల పిల్లిని ఊహించుకోవడం... తొడుక్కున్న బట్టలను మాపుకోవడం.. చెట్లు, పుట్టలెక్కడం.. గెంతడం... ఒకరినొకరు గేలిచేసుకోవడం.. ఏడిపించుకోవడం.. యథేచ్ఛగా ఆడుకోవడం... పితూరీలు, అలకలు, ఉరకలు, పరుగులు... ‘బాల్యం’ అని మనసులో గూగుల్ చేస్తే మెదిలే ఇమేజెస్ అవి! నిజంగా పిల్లలందరూ అంత లగ్జరీ అనుభవిస్తున్నారా అని అనుకునేలోపే ముంబైలో ధారావీ, హైదరాబాద్లో జవహర్ నగర్ లాంటి ప్రాతాలు స్ఫురణకు వస్తాయి! ధారావీ ఎక్కడో దూరం కాబట్టి రెండు రాష్ట్రాలకు సుపరిచితమైన జవహర్ నగర్ను సందర్శిద్దాం... ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా!‘పిల్లల చేతుల్లో ఉండాల్సింది పలక.. బలపం లేదంటే పెన్ను.. పుస్తకం అంతేకానీ పనిముట్లు కాదు’ అంటారు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టిన ఉద్యమనేత కైలాశ్ సత్యార్థి. కానీ జవహర్ నగర్లోని చాలామంది పిల్లల చేతుల్లో పుస్తకాలు కనిపించవు. పనిముట్లే కనిపిస్తాయి. అది నూరు బస్తీల ప్రాతం. దేశంలోని అన్ని ప్రాతాల నుంచి వచ్చిన వలసలతో మినీ ఇండియాను తలపిస్తుంది. వాళ్లలో చాలామందికి ఆధార్లాంటి గుర్తింపు పత్రాలేమీ ఉండవు. వాళ్లు ఏ లెక్కల్లోకీ రాక స్కూల్ అడ్మిషన్ నుంచి ప్రభుత్వ సంక్షేమ, ప్రయోజనాల దాకా ఏవీ వారికి అందట్లేదు. దాంతో చాలామంది పిల్లలు బాలకార్మికులై కనిపిస్తారు.. ఈ జవహర్నగర్కి ఆనుకునే ఉన్న 350 ఎకరాల డంపింగ్ యార్డ్లో చెత్త ఏరుకుంటూ.. భవన నిర్మాణ కార్మికులుగా.. అమ్మాయిలైతే ఇళ్లల్లో పనిచేస్తూ! ఇంకా సీజనల్ లేబర్గా కూడా! వసివాడని ఈ పిల్లలు గంజాయికి బానిసలై కూడా కనిపిస్తారు.మూడు లక్షల జనాభా...ఈ వంద బస్తీల్లో దాదాపు మూడు లక్షల జనాభా ఉంటుంది. సర్కారు బడులు పది మాత్రమే. అందులో ఎనిమిది ప్రైమరీ స్కూళ్లు, రెండు హైస్కూళ్లు. ఇది కా్రపా మండలం కిందకు వస్తుంది. ఈ మండలానికి కనీసం ఒక్క జూనియర్ కాలేజ్ కూడా లేదు. అందుకే స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా టెన్త్ అవగానే అబ్బాయిలైతే కూలీలుగా మారుతున్నారు. అమ్మాయిలకైతే పెళ్లి చేసి పంపించేస్తున్నారు. పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లయి పోతున్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోని పరిస్థితి! ఇలా మన దేశమంతటా సుమారు పద్దెనిమిది లక్షల నుంచి ముప్పైమూడు లక్షల వరకు బలకార్మికులు ఉన్నారని యూనిసెఫ్ డేటా వెల్లడిస్తోంది. వీళ్లంతా వ్యవసాయరంగంలో, కుటుంబ వ్యాపారాల్లో పనిచేస్తున్నారని నివేదిక తెలుపుతోంది. అయిదు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలంతా ఏదో ఒక పనిచేస్తున్నారని కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. చట్టం ఏం చెబుతోంది?ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1986 ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లల చేత ఎలాంటి పనైనా చేయించడం నేరం. పద్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలకు పనివ్వొచ్చు. కానీ ప్రమాదకరమైన వృత్తులు.. పనులు.. పరిస్థితుల్లో ఆ పిల్లలను పెట్టకూడదు. ఈ చట్టానికి కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. కుటుంబ వ్యాపారాలు, నిర్దిష్ట పరిస్థితుల్లో టీవీ, సినిమాలు వంటి వినోద రంగాల్లో పిల్లల పనిచేయవచ్చు.అమ్మాయిలే ఎక్కువ..ప్రపంచవ్యాప్త బాలకార్మికుల్లో ప్రతి పదిమందిలో ఒకరు మన దేశం నుంచే కనిపిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో బాలకార్మికుల(5–14 ఏళ్లలోపు) సంఖ్య కోటికి పైనే ఉంది. అంటే అప్పటి పిల్లల జనాభాలో ఇది 3.9 శాతం. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలే ఎక్కువగా పనిబాట పడుతున్నారని యూనిసెఫ్ సర్వే చెబుతోంది. ఇళ్లల్లో పని దగ్గర్నుంచి ఇంట్లో పెద్దవాళ్ల (అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు)ను చూసుకోవడం, తోబుట్టువులను సంభాళించడం వంటివన్నీ చేస్తున్నారన్నది నివేదికల మాట. మన దేశంలో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాతాల్లో బాలకార్మికులు ఎక్కువ. ఇటుక బట్టీలు, తీవాచీ, వస్త్ర పరిశ్రమ, ఇళ్లు, హోటళ్లు.. టీ స్టాళ్లు లాంటి అసంఘటిత రంగాల్లో, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో బాలకార్మికులు ఎక్కువగా కనిపిస్తారు.బాలకార్మిక వ్యవస్థ వేళ్లూనడానికి కారణాలు అసమానత్వం, సరైన విద్యావకాశాలు, మంచి పని, సామాజిక భద్రత లేకపోవడం, సంప్రదాయ, సాంస్కృతిక చట్రాలు వంటివన్నీ బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి. ఏ రూపాల్లో ఉన్నా 2025 కల్లా బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించాలనే యునైటెడ్ నేషన్స్ లక్ష్యానికి మద్దతు తెలుపుతూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీఎస్) భారత ప్రభుత్వమూ సంతకం చేసింది. సంతకం చేయగానే సరిపోదు చిత్తశుద్ధితో ఆ బాధ్యతను నెరవేర్చాలి. పిల్లలందరినీ బడి బాట పట్టించి బాలకార్మికులు లేకుండా చేయడానికి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి అంటున్నారు బాలల హక్కుల కార్యకర్తలు. ∙రెస్క్యూ, రిహాబిలిటేషన్ వీక్గా ఉందిజవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్కి ఆనుకున్న బస్తీల్లో స్క్రాప్ షాప్స్ ఎక్కువ. అందుకే ఇక్కడ చెత్త సేకరణ ఎక్కువగా జరుగుతుంది. ఇవి కాకుండా కన్స్ట్రక్షన్ లేబర్, డొమెస్టిక్ హెల్ప్, సీజనల్ లేబర్కి కూడా వెళ్తుంటారు. ఈ ప్రాతంలో సరిపడా సర్కారు బడులు లేవు. ఉన్నవాటిల్లో చేరడానికి చాలామంది పిల్లలకు గుర్తింపు పత్రాలు లేవు. వాళ్లకు ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్స్ దొరికినా ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు. దాంతో పనిలోకి వెళ్తున్నారు. పద్నాలుగేళ్లు దాటిన పిల్లలు గనుక ఒక్కసారి పనిలోకి వెళితే మళ్లీ వాళ్లను చదువు వైపు మళ్లించడం చాలా కష్టం. ఇక్కడ వార్డ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు (డబ్ల్యూఎల్సీపీసీ) కూడా యాక్టివ్గా లేవు. దీనివల్ల బాలకార్మికుల రెస్క్యూ, రిహాబిలిటేషన్ చాలా వీక్గా ఉంది. – హిమబిందు, పిల్లల హక్కుల కార్యకర్త -
ప్రాణం తీసిన ఫుట్బోర్డు ప్రయాణం
ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం జరిగిన ప్రమాదంలో జీఆర్పీ కానిస్టేబుల్ సహా నలుగురు రైలు ప్రయాణికులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. ఉదయంపూట కిక్కిరిసిన రైళ్లలో నిర్లక్ష్యంగా ప్రయాణించడమే ఇందుకు కారణం. ముంబ్రా రైల్వే స్టేషన్సమీపంలో ఈ ఘటన జరిగింది. రెండు రైళ్లలో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. వీపులకు భారీ బ్యాగులు తగిలించుకొని డోర్ల వద్ద ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. వీటిలో ఒక రైలు కాసారా వైపు, మరొకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వైపు వెళ్తోంది. ఈ రెండు రైళ్లు పక్కపక్కనున్న పట్టాలపై పరస్పరం వ్యతిరేక దిశలో వచ్చిన సమయంలో మూలమలుపు వద్ద ప్రయాణికుల బ్యాగులు పరస్పరం ఢీకొన్నాయి. దాంతో మొత్తం 13 మంది వెంటనే కిందపడిపోయారు. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడి మృతి చెందారని రైల్వే అధికారులు ప్రకటించారు. బాధితులను కేతన్ సరోజ్, రాహుల్ గుప్తా, మయూర్ షా, జీఆర్పీ కానిస్టేబుల్ విక్కీ ముఖ్యాద్గా గుర్తించారు. రైళ్లకు అటోమేటిక్ డోర్లు లేకపోవడం ప్రాణాంతకంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు అధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ప్రయాణికులు లోపలికి వెళ్లగానే డోర్లు వాటంతట ఆవే మూసుకుపోయేలా రైలు బోగీలను డిజైన్ చేయనున్నట్లు వెల్లడించారు. ముబ్రా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రైల్వే శాఖను కోరనట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. Maharashtra | Some passengers travelling towards CSMT fell from the train at Thane's Mumbra railway station. The reason for the accident is believed to be excessive crowd in the train. The railway administration and police have reached the spot. The injured are being taken… pic.twitter.com/UMBq41jcvm— ANI (@ANI) June 9, 2025 -
గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ముంబైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ)కి రూ.151 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయన 1970వ దశకంలో ఇక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పట్లో ఈ విద్యాసంస్థను యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(యూడీసీటీ)గా పిలిచేవారు. ముకేశ్ అంబానీ శుక్రవారం ఐసీటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి తమ ప్రొఫెసర్ శర్మ బోధించిన పాఠాలు, అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. భారత ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ప్రొఫెసర్ శర్మ కీలక పాత్ర పోషించారని చెప్పారు. మన దేశం అన్ని రకాల సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీడర్గా ఎదగాలని తన తండ్రి ధీరూబాయ్ అంబానీ తరహాలోనే ప్రొఫెసర్ శర్మ కూడా ఎంతగానో తపనపడ్డారని తెలిపారు. ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తోడైతే ఆర్థిక రంగంలో ఇండియా పరుగులు తీస్తుందని వారు విశ్వసించారని పేర్కొన్నారు. వారిద్దరూ గొప్ప దార్శనికులు అని కొనియాడారు. ప్రొఫెసర్ శర్మ కృషి వల్లే ఐసీటీ అత్యున్నత విద్యాసంస్థగా మారిందని చెప్పారు. ప్రొఫెసర్ శర్మను ‘భారత్ గురు’గా అభివర్ణించారు. ఆయనకు గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్లు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. తన గురువు ప్రొఫెసర్ శర్మ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్య నేరి్పన ఐసీటీకి పెద్ద మేలు చేయాలని చెప్పడంతో ఆయన ఆదేశాలను శిరసావహించినట్లు పేర్కొన్నారు. -
కిరాయికి వెళ్లకుండానే నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్న ఆటోవాలా
ముంబై: ముంబైలోని అమెరికా కాన్సులేట్ వెలుపల ఉంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఓ ఆటోవాలా ఉదంతం పతాక శీర్షికల్లో నిలిచింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం కాకుండా వీసా దరఖాస్తుదారుల బ్యాగ్లను భద్రంగా ఉంచడమన్న చిన్న వ్యాపార చిట్కాయే ఇతడి విజయ రహస్యం. ఇతడు ఇంజనీరింగ్లాంటివేమీ చదవలేదు. స్టార్టప్ ఫండింగ్ అసలే లేదు. ఎటువంటి వ్యాపార ప్రణాళికా లేదు.. అయినప్పటికీ తన రోజువారీ శ్రమను నెలకు రూ.5 లక్షల నుంచి 8 లక్షల వరకు సంపాదించే వ్యాపారంగా మార్చాడు. లెన్స్కార్ట్ కంపెనీలో పనిచేసే రాహుల్ రుపానీ ఇటీవల వీసా అపాయింట్మెంట్ కోసం అమెరికా కాన్సులేట్ వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఆటో డ్రైవర్ తారసపడ్డాడు. రుపానీయే ఇతడి వివరాలను లింక్డి్డన్లో షేర్ చేశారు. ‘ఇటీవల వీసా అపాయింట్మెంట్ కోసం అమెరికా కాన్సులేట్కు వెళ్లా. నా దగ్గర బ్యాగ్ ఉండటంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది నన్ను లోపలికి వెళ్లనివ్వలేదు. బ్యాగును తాత్కాలికంగా భద్రపరిచేందుకు అక్కడ లాకర్లు కూడా లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ రోడ్డు పక్కనే నిలబడి ఉన్నా. అంతలోనే అక్కడికి ఆ ఆటో డ్రైవర్ వచ్చాడు. బ్యాగును జాగ్రత్తగా తన దగ్గర ఉంచుకుంటానని, రూ.వెయ్యి ఖర్చవుతుందని చెప్పాడు. మొదట నేను వెనుకాడా. చివరికి అతడికి బ్యాగ్ ఇచ్చేసి ఆఫీసులోకి వెళ్లి పనిచూసుకుని వచ్చేశా. అప్పుడతడిని అడిగితే తన వినూత్న వ్యాపారంగా గురించి చెప్పాడు’అని రుపానీ వివరించారు. వీసాలకోసం వచ్చే వారిలో నిత్యం కనీసం 20 నుంచి 30 మంది అతడి వద్ద తమ బ్యాగులను ఉంచి వెళ్తుంటారు. వీరి నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ నెలకు కనీసంగా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడని రుపానీ తెలిపారు. అయితే, ఆటోలో 30 వరకు బ్యాగులను ఉంచుకోవడం చట్టబద్ధ వ్యవహారం కాదని తెలుసుకున్న ఆ ఆటోవాలా మరో ఉపాయం కనిపెట్టాడు. కాన్సులేట్కు సమీపంలోనే వస్తువులను భద్రపరిచే లాకర్ సౌకర్యం ఉన్న ఓ పోలీసు అధికారిని భాగస్వామిగా చేసుకున్నాడు. అతడి లాకర్లోనే సేకరించిన బ్యాగులన్నిటినీ చట్టబద్ధంగా, మరింత భద్రంగా ఉంచుతున్నాడని రుపానీ వివరించారు. అతడి ఆటో ఇప్పుడు కేవలం బ్యాగుల రవాణా కోసం పనిచేస్తోంది. చాలా మంది అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం శ్రమకోర్చుతుండగా ఆటోవాలా మాత్రం..ఎటువంటి కష్టం లేకుండా ఎంతో లాభదాయకమైన వ్యాపారం నడుపుతున్నాడని రుపానీ లింక్డి్డన్ పోస్టులో ప్రశంసలు కురిపించారు. -
పనికి ముంబై వెళ్లిన భర్త.. మరిదిని పెళ్లాడిన భార్య
లక్నో: భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం.. అవి విపరీత పరిణామాలకు దారి తీయడం మనం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు దంపతులు విచిత్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటివి చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ పరిధిలోని హరిహర్పూర్ నగర పంచాయతీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇది ఇప్పుడు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోంది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై, వైరల్గా మారింది.వివరాల్లోకి వెళితే యూపీలోని గోరఖ్పూర్లోగల సహజన్వాకు చెందిన ఖష్బూకు ఆరు నెలల క్రితం హరిహర్పూర్కు చెందిన కల్లూతో వివాహం జరిగింది. నెల్లాళ్ల తరువాత కల్లూ పని కోసం ముంబైకి వెళ్లాడు. అప్పటి నుంచి ఖుష్బూ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ నేపధ్యంలో ఆమెకు మరిది అమిత్తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది ఇరు కుటుంబాలకు తెలిసింది. అలాగే చుట్టుపక్కల వారి నోళ్లలోనూ నానింది. దీంతో ఖుష్బూ, అమిత్లు ఇంటి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు వారికోసం తమకు తెలిసిన అన్ని ప్రాంతాల్లోనూ వెదికి, చివరికి వారిని పట్టుకున్నారు. అయితే వారు తాము భార్యాభర్తలుగా ఎప్పటికీ కలిసివుంటామని అందరిముందు తేల్చిచెప్పారు.విషయం హరిహర్పూర్ నగర పంచాయతీ చైర్మన్ రవీంద్ర ప్రతాప్ షాహి వరకూ చేరింది. ఆయన ఖుష్బూ, అమిత్లతో ఈ సంబంధం సరైనది కాదంటూ, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు తాము విడిగా ఉండలేమని పెద్దలందరి ముందూ స్పష్టం చేశారు. దీంతో ఇరు కుటుంబాల్లోని వారు ఖుష్బూ, అమిత్లకు వివాహం చేయాలని నిశ్చయించారు. పంచాయతీ కార్యాలయంలో ఖుష్బూ, అమిత్ల వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే వీరి వివాహానికి ఖుష్భూ భర్త కల్లూ హాజరు కాలేదు. తనకు ఇకపై ఖుష్బూతో ఎటుంటి సంబంధం లేదని కల్లూ తేల్చిచెప్పాడు.ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్నాథ్కు ‘మ్యాంగో మ్యాన్’ గిఫ్ట్ -
ముంబై ‘మాస్క్’ రెస్టారెంట్ ఘనత, ఇండియాలో ఒకే ఒక్కటి!
ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో ముంబైలోని మాస్క్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. 2025 సంవత్సరానికి గాను ఈ ప్రపంచ ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో ముంబైలోని మాస్క్ 68వ స్థానంలో నిలిచింది. ఆసియా నుండి తొమ్మిది ఎంట్రీలలో మాస్క్ ఒకటి కాగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ మాస్క్ కావడం విశేషం.ప్రతిష్టాత్మక సంస్థ రూపొందించిన ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో ముంబైలోని మాస్క్ ప్రపంచవ్యాప్తంగా 68వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 50 ఉత్తమ రెస్టారెంట్లు 51 - 100 వరకు ర్యాంక్ పొందిన జాబితా తాజాగా వెల్లడైంది.ఈ జాబితాలో ఆరు ఖండాల్లోని 37 నగరాల్లోని రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది ఈ జాబితాలో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన మాస్క్ అపుడు 78వ స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాదితో పోలిస్తే మరికొన్ని ర్యాంకులు పైగా ఎగబాకింది.చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?2016లో ప్రారంభమైన మాస్క్...దక్కించుకున్న ప్రశంసలు, అవార్డులు చాలానే ఉన్నాయి. దేశంలో టాప్ రెస్టారెంట్గా అనేక సార్లు నిలిచింది. 2025 ఆసియా బెస్ట్ రెస్టారెంట్ల 50 జాబితాలో కూడా మాస్క్ 19వ స్థానాన్ని దక్కించుకుంది. యాక్సెంట్ ఢిల్లీ 46వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఉన్న ఏ రెస్టారెంట్ కూడా ఇటీవలి కాలంలో 50 ఉత్తమ జాబితాలో చోటు దక్కించుకోలేదు. విదేశీ రెస్టారెంట్లు టాప్ప్లేస్స్ దక్కించు కున్నాయి. ఉదాహరణకు, బ్యాంకాక్లోని గగ్గన్, దుబాయ్లోని ట్రెసిండ్ స్టూడియో ఎక్కువగా టాప్ ప్లేస్ను ఆక్రమించుకున్నాయి.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్! -
భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..
ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్–అమెరికన్ ఆర్టిస్ట్ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్ టీచర్గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.కట్ చేస్తే....ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హరకాత్’ ఫ్యాషన్ లేబుల్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by 🌑eliza🌙 (@kweenkaraza) (చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..) -
ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)
-
ముంబై: నీట మునిగిన మహా నగరం.. 107 ఏళ్ల రికార్డు బద్దలు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైని వానగడం ఇప్పట్లో వీడేలా లేదు. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ముంబైని ముంచెత్తిన వర్షం కాస్త తెరిపిచ్చినప్పటికీ, ఇప్పుడు(మంగళవారం ఉదయం) మళ్లీ తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం దక్షిణ ముంబైలో మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది.ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నగరానికి వాతావరణ శాఖ(Meteorological Department) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో ముంబైకి జారీ చేసిన రెండవ రెడ్ అలర్ట్ ఇది. నారిమన్ పాయింట్, వార్డ్ మున్సిపల్ హెడ్ ఆఫీస్, కొలాబా పంపింగ్ స్టేషన్, కొలాబా ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు 200 మి.మీకి మించిన వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. సాధారణ జీవితం స్తంభించిపోయింది.గడచిన 24 గంటల్లో ముంబైలో కురిసిన వర్షపాతం 107 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. గత 75 ఏళ్లలో నగరంలో రుతుపవనాల ప్రభావం ఇంత భారీ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారని వాతావరణ శాఖ పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. విమాన, లోకల్ రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితమే ప్రారంభించిన మెట్రోలోని ఒక భూగర్భ స్టేషన్ నీటితో నిండిపోయింది. దీనితో అధికారులు ఈ మార్గంలో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. కుర్లా, సియోన్, దాదర్, పరేల్తో సహా అనేక లోతట్టు ప్రాంతాలు వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వాహనాలు వరదలతో నిండిన వీధుల గుండా వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.థానేలో పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం, ఫలితంగా కురిసిన భారీ వర్షపాతం ముంబైలోని అనేక ప్రాంతాలలో ముంపునకు కారణంగా నిలిచిందన్నారు. ముంబైలో రుతుపవనాలు షెడ్యూల్ కంటే 16 రోజులు ముందుగానే వచ్చాయి. గత సంవత్సరం రుతుపవనాలు జూన్ 25న మహారాష్ట్ర రాజధానికి చేరుకున్నాయి. కాగా రుతుపవనాలు శనివారం కేరళకు చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: పాక్లో జ్యోతి మల్హోత్రాకు వీఐపీ సెక్యూరిటీ -
‘ముంబై’ చెప్తున్నదేమిటి?!
‘కుండపోతలతో వస్తున్నాం... కాచుకోండ’న్నట్టు హెచ్చరిస్తూ ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. సోమవారం వేకువజామునే కళ్లు తెరిచిన ముంబై మహానగరవాసులు... వస్తూనే తడాఖా చూపించిన భారీ వర్షాన్ని చూసి బిత్తరపోయారు. సాధారణ సమయాల్లో గంభీరంగా, కళ్లు చెదిరేలా కనబడే మన నగరాలు చినుకు రాలితే ఎంత అల్లకల్లోలమవుతాయో మొన్నీ మధ్యే బెంగళూరు నగరం కూడా నిరూపించింది. మన్నూ మిన్నూ ఏకమైనట్టు ధారాపాతంగా రాత్రంతా కురియటంవల్ల 200 మిల్లీ మీటర్లు(ఎంఎం) మించిన వర్షపాతంతో ముంబై నగరం తాజాగా తడిసిముద్దయింది. ఆ నగరానికి ముందుగా జారీచేసిన ‘యెల్లో అలెర్ట్’ను కాస్తా ‘రెడ్ అలెర్ట్’గా సవరిస్తూ, ముంబైతోపాటు దాని ఇరుగుపొరుగునున్న జిల్లాల్లో సైతం పిడుగులతో, పెనుగాలులతో అత్యంత భారీ వర్షం ముంచుకు రాబోతున్నదని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముంబై పొరుగునున్న కొలాబాలో సోమవారం 295 ఎంఎం వర్షపాతం నమోదై, 107 ఏళ్లనాటి... అంటే 1918 నాటి రికార్డు 279.4 ఎంఎంను అధిగమించింది. ఇంకా కర్ణాటకలోని మంగళూరు నగరం, దక్షిణ కన్నడ జిల్లాలు సైతం భారీవర్షాలతో ఇక్కట్లుపడ్డాయి. కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు పది రోజులకు మహారాష్ట్ర రావాల్సివుండగా కేవలం 24 గంటల్లో అక్కడికి లంఘించాయి. ముంబైకి ఆ మర్నాడే చెప్పాపెట్టకుండా వచ్చాయి.సరిగ్గా అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్స్ విభాగం ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ప్రతియేటా అంతక్రితంతో పోలిస్తే భారీ వర్షాలు నమోదవుతున్నాయన్నదే దాని సారాంశం. ఇలాంటి ప్రకటనలు మన పాలకుల్ని అప్రమత్తుల్ని చేయాలి. ఏటా నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. వాటి వికేంద్రీకరణకు ప్రణాళికలు రూపొందించాలి. కానీ తరచు నడుంలోతు నీళ్లల్లో మునకలేస్తున్న నగరాలను చూస్తుంటే వారికంత శ్రద్ధ, తీరిక లేవన్న సంగతి తెలుస్తుంది. శతాబ్దం కిందట లేదా అంతకు చాలాముందు నుంచీ ప్రధాన నగరాలుగా వున్నవాటిపై ఎటూ శ్రద్ధ లేదు. కనీసం కొత్తగా నిర్మిస్తున్న నగరాలపైన అయినా ముందుచూపుతో వ్యవహరిద్దామన్న జ్ఞానం లేదు. నిరుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకూ దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు విజయవాడ నగరంలో కొంత భాగాన్ని ముంచెత్తడంతోపాటు అమరావతిని కూడా వరదలు అస్తవ్యస్తం చేశాయి. దాని పరిధిలోని 29 గ్రామాల్లో 25 నిండా నీళ్లల్లో మునిగాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అక్రమంగా వుంటున్న తన కరకట్ట నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తదితర సంస్థలు మూతపడాల్సి వచ్చింది. లక్షలాదిమంది ప్రజలు సకాలంలో సాయం అందక ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో 35 మంది మరణించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా మొండి వైఖరితో అమరావతికి పూనుకోవటమే తప్పనుకుంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని మళ్లీ పిలిచి అట్టహాసంగా సభ చేసి పనులు మొదలుపెట్టారు. అమరావతి ప్రాంత నేల స్వభావం తెలియకపోతే పోయింది... కనీసం కేంద్రీకృత నగరాల వల్ల కలిగే ముప్పును చూస్తూ కూడా వేలకోట్లు కుమ్మరిస్తున్నారంటే ఏమనుకోవాలి?‘ప్రకృతి వైపరీత్యాలు నిజమైన అర్థంలో ప్రకృతి కల్పిస్తున్న వైపరీత్యాలు కాదు. అవి మనిషి రూపొందించే విధానాల వైఫల్యం’ అంటాడు అమెరికన్ దౌత్య నిపుణుడు జాన్ బోల్టన్. కుంభవృష్టి కురిసినా దాన్నంతటినీ ఇముడ్చుకోగల చెరువులూ, వాగులూ, వంకలూ దాదాపు అన్ని రాష్ట్రా ల్లోనూ వున్నాయి. వాటిల్లో కొన్ని సహజసిద్ధమైనవీ, కొన్ని మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో నిర్మించినవీ. కానీ చేజేతులా మనమే వాటి పీకనొక్కుతున్నాం. ఇష్టానుసారం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నా కళ్లుమూసుకుంటున్నాం. హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లు దింపి ప్రకృతి సంపద నాశనం చేస్తున్నారని ఆవేదన చెందిన ప్రధానే, ఆ తర్వాత కొద్దిరోజులకే వేలాది ఎకరాల పంట భూముల్ని మాయం చేసే అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేశారు. తమ కూటమి ప్రభుత్వమైతే ఒక లెక్క... వేరే పార్టీ ప్రభుత్వమైతే ఒక లెక్క! నిర్దిష్టమైన విధానాల్లేకుండా ‘ఏ రోటి కాడ ఆ పాట’న్నట్టు ప్రవర్తించే పాలకుల వల్లే వైపరీత్యాలు ముంచుకొస్తున్నాయి. వీటిని నివారించటం మానవ మాత్రులకు సాధ్యం కాకపోవచ్చు. కానీ కాస్త తెలివితో వ్యవహరిస్తే వాటివల్ల కలిగే నష్టాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావొచ్చు. కారణాలేమైనా వాతావరణం గతంలో మాదిరి లేదు. మన విధ్వంసకర ఆచరణతో దాన్ని మరింత క్షీణింపజేస్తున్నాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణగానీ, వికేంద్రీకరణగానీ లేకపోవటంతో నగరాలు కిటకిటలాడుతున్నాయి. నగరాల్లోనే ఉపాధి అవకాశాలుండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడికే క్యూ కడుతున్నారు. పెరిగిన జనాభాకు తగినట్టు డ్రయినేజీ వ్యవస్థ లేకపోవటంతో చిన్నపాటి వర్షానికే నగరాలు నరకాలుగా మారుతున్నాయి. ఈసారి వర్షరుతువు ఎలా వుండబోతున్నదో ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన నిరూపించింది. సహాయ సిబ్బందిని అందుబాటులో వుంచటంతో సహా పలు ముందస్తు చర్యలు తీసుకోవటం మినహా ఈ ఏడాది ఎటూ ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదు. కనీసం రాబోయేకాలంలోనైనా అమల్లోవున్న విధానాలను సమీక్షించుకుని మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రణాళికాబద్ధమైన పథకాలు రూపొందించి అమలుచేసి, వికేంద్రీకరణపై దృష్టిసారిస్తే చాలావరకూ సమస్యలు పరిష్కారమవుతాయి. -
Bullet Train: వందే భారత్ రైలును మించిన హైస్పీడ్ రైలు
-
మునిగిన ముంబై.. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ను ముంచెత్తిన వరద నీరు.. వీడియో వైరల్
ముంబై: ముంబై మునిగింది. దేశ ఆర్థిక రాజధాని వర్షాలతో అతలాకుతలమైంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాత్రి నుంచి ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై మహానగరానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కుండపోతవానకు నగరం నరకంలా మారింది. రవాణా స్తంభించి పోయింది.రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాక్లపైకి వాన నీరు చేరడంతో రైల్వే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. మే 10న ప్రారంభమైన వర్లీ మెట్రో స్టేషన్కు వరదనీరు పోటెత్తింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ట్రైన్ వచ్చే వరకు, వచ్చిన తర్వాత ట్రైన్ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు మాత్రమే కాకుండా ప్లాట్ఫామ్లను నీరు ముంచెత్తింది. వెలుగులోకి వచ్చిన ఆ వీడియోల్లో ప్లాట్ ఫామ్ పూర్తిగా బురద నీటితో నిండిపోయి ఉండటాన్ని చొడొచ్చు.Newly inaugurated Worli underground metro station of Aqua line 3 submerged in water this morning. #MumbaiRain pic.twitter.com/D0gwopOXBE— Tejas Joshi (@tej_as_f) May 26, 2025 అంతేకాదు, మెట్రో లోపల తీసిన మరో వీడియోలో పైకప్పులో లీకేజీ కారణంగా ప్లాట్ఫారమ్పై నుండి నీరు ప్రవహించింది. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రోసర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అయితే, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో వరదకు కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ముంబై మూడు లైన్ల అండర్గ్రౌండ్ మెట్రోస్టేషన్ను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) నుండి వర్లిలోని ఆచార్య అత్రే చౌక్ వరకు సేవల్ని అందిస్తోంది. ఈ మెట్రో సేవలు ఈ నెల ప్రారంభంలో మే 10న అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే ప్రారంభమైన మెట్రోస్టేషన్ను వరద నీరు ముంచెత్తడంతో మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తాయి. -
భారీ వర్షాలు.. నీట మునిగిన ముంబై..
-
COVID-19: వెయ్యిదాటిన కేసులు.. దేశమంతటా అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2020 నుండి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న అంటు వ్యాధి తిరిగి దేశంలో అంతకంతకూ ప్రభలుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరిందని కేంద్ర కోవిడ్ నియత్రణ విభాగం తెలియజేసింది. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో 104 యాక్టివ్ కేసులు ఉండగా, వాటిలో 99 కేసులు గత వారంలోనే నమోదయ్యాయి.మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. ముంబైలో కొత్తగా 35 కేసులు నమోదు కాగా, పూణేలో కొత్తగా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటివరకూ మొత్తం 300 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 248 కేసులు నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోని మొత్తం ఇన్ఫెక్షన్లలో 82.67 శాతం. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ(Kerala)లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తరువాత స్థానంలో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. ఢిల్లీలో కూడా నమోదవుతున్న కేసులలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివి. వీటికి గృహ సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు.సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల్లో కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్లో నమోదువున్న కేసుల విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Ministry of Health) అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో కొత్తగా కోవిడ్-19 వేరియంట్ ఎన్బీ.1.8.1కు చెందిన ఒక కేసు, ఎల్ఎప్.7కి చెందిన నాలుగు కేసులను గుర్తించారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) (డబ్ల్యూహెచ్ఓ) ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 సబ్వేరియంట్లను ‘వేరియంట్స్ అండర్ మానిటరింగ్’ (వీయూఎం)లుగా వర్గీకరించింది. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ) లేదా వేరియంట్స్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీఓఐ)గా పేర్కొంది. చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమైన వేరియంట్లు ఇవేనని తెలిపింది. దేశంలో ప్రస్తుతం అత్యంత సాధారణ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిలో ఉంది. తరువాత బీఏ.2 (26శాతం), ఇతర ఓమిక్రాన్ సబ్లైనేజ్లు (20శాతం) ఉన్నాయి.ప్రస్తుతం కోవిడ్-19 కేసులతో పోరాడుతున్న రాష్ట్రాల జాబితాలో కేరళ 430 కేసులతో అగ్రస్థానంలో ఉంది. తరువాత 209 కేసులతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. గుజరాత్లో 83 కేసులు, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 12 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నాలుగు, కేరళలో రెండు, కర్ణాటకలో ఒకటి చొప్పున కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్లలో ఎటువంటి యాక్టివ్ కేసులు నమోదు కాలేదు.ఇది కూడా చదవండి: నీట్కు ప్రిపేర్ అవుతూ.. నెలలో రెండో ‘ఉదంతం’ -
Coronavirus: ముంబైలో కేసుల పెరుగుదల.. అదే బాటలో తమిళనాడు, గుజరాత్
ముంబై: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్తో సహా ఆసియాలోని కొన్ని దేశాలలో కోవిడ్-19(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదువుతున్నాయి. ఈ వివరాలను ఆయా రాష్ట్రాల అధికారులు మీడియాకు వెల్లడించాయి.మునుపటి వేవ్లతో పోలిస్తే మొత్తం కేసులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, దేశంలోని ముంబై, చెన్నై, అహ్మదాబాద్(Ahmedabad)తో పాటు పలు నగరాలలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత మే నెలలో ముంబైలో ఇప్పటివరకూ కొత్తగా 95 కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి చూసుకుంటే మహారాష్ట్రలో మొత్తంగా 106 కేసులు నమోదయ్యాయి. ఇది గణనీయమైన పెరుగుదల అని నిపుణులు అంటున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 16 మంది కోవిడ్ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాపించకుంగా ఉండేందుకు బాధితులను కెమ్ ఆస్పత్రి నుంచి సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్టులో వెల్లడించింది.మరోవైపు ముంబై మహా నగరంలో ఇన్ఫ్లుఎంజా(Influenza), శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ముందు జాగ్రత్త చర్యగా పూణేకు చెందిన వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నాయుడు ఆసుపత్రిలో 50 పడకలను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనావైరస్ యాక్టివ్ కేసులు లేవు. ఇటీవల 87 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ వచ్చిందని, అయితే అతను వైద్య చికిత్సతో కోలుకున్నాడని పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి నీనా బోరాడే తెలిపారు. ఆస్పత్రులలో ప్రస్తుతం ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదని, కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నట్లు నీనా తెలిపారు.తాజాగా తమిళనాడు, గుజరాత్, కేరళలో కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఇన్ఫ్లుఎంజాకు కారణమైన జ్వరాలు పెరుగుతున్నాయి. ఇవి కరోనా ఇన్ఫెక్షన్ అనుమానాలను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులను నిర్ధారించగా, గుజరాత్లోని అహ్మదాబాద్లో కొత్తగా ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. వీరంతా ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. వైద్యులు వీరి నుంచి శాంపిల్స్ను సేకరించి, ల్యాబ్కు పంపించారు. రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.ఇది కూడా చదవండి: సెమికోలన్ ఎక్కడ?.. ఎందుకు మాయమవుతోంది? -
Covid-19: మళ్లీ కోవిడ్ కలవరం
ముంబై: ఐదేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కలవర పెడుతోంది. మంగళవారంనాటికి దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదవ్వగా ముంబైలోనే 53 కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లోనే 164 కేసులు పెరిగాయి. క్రియాశీలక కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మరణాలేవీ సంభవించలేదు. ముంబైలో కేసులు పెరుగుతుండటంతో నగరంలోని ఆస్పత్రులు కోవిడ్ రోగుల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.ప్రజల్లో ఆందోళన పెరుగుతుండటంతో, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ప్రజల్లో రోగ నిరోధక శక్తి బలపడిందని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని తెలిపారు. పరిస్థితి సాధారణంగానే ఉందని, అయిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. రోగుల సంఖ్య పెరిగినా మునుపటిలా భయపడాల్సిన అవసరం లేదని, ఈ ఇన్ఫెక్షన్తో అంత ప్రమాదం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకాశ్ అబిత్కర్ చెప్పారు. కేంద్రం సూచనలు జారీ చేస్తే తప్ప కరోనాకు సంబంధించి ముందు జాగ్రత్తలు అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. -
ముంబైలో మిరాయ్
ముంబై గుహల్లో తేజా సజ్జా సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మిరాయ్’ కోసం. తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూపర్యోధగా తేజ కనిపిస్తారు.తాజాగా ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ , ఇతర ప్రధాన పాత్రధారులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.‘‘మిరాయ్’ కోసం తేజా సజ్జ పూర్తీగా మేకోవర్ అయ్యారు. 2డీ, 3డీ ఫార్మాట్స్లో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ప్రోడ్యూసర్: కృతీ ప్రసాద్. -
రామేశ్వర్కి అమెరికా వర్సిటీ మాస్టర్ డిగ్రీ, తెలుగోడి ప్రతిభకు ప్రశంసలు
సోలాపూర్: పట్టణానికి చెందిన రామేశ్వర్ సంతోష్ ఉదుగిరి అమెరికాలోని బోస్టన్ వద్ద నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ నందు మాస్టర్ డిగ్రీ పొందాడు. ఇటీవల అమెరికాలో స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రామేశ్వర్ ప్రముఖుల చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. రామేశ్వర్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఆర్కేడ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తర్వాత ఉన్నత డిగ్రీని అభ్యసించడానికి యూఎస్లోని బోస్టన్ నందు గల నార్త్ ఈస్టర్న్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ఆర్కిడ్ కాలేజ్ ప్రిన్సిపాల్ దీపక్ సొంగే, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ మేతన్ తను విద్యాపరంగా ఎదుగుదల సాధించేందుకు ఎంతగానో మార్గదర్శనం చేశారని రామేశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలో సమర్థ అడ్వర్టైజర్స్, అడ్వరై్టజింగ్ ఏజెన్సీ అధినేత అయిన తన నాన్న సంతోష్ వెన్ను తట్టి విద్యలో రాణించాలని ప్రోత్సహించినందుకు అంకితభావంతో ఇంతవరకు చేరుకోగలిగానని తెలిపారు. పట్టణానికి చెందిన తెలుగువాడు రామేశ్వర్ విద్యాపరంగా ఉన్నత శిఖరాన్ని అందిపుచ్చుకున్నందుకు సర్వత్రా ఆయనకు అభినందనలు వెల్లు వెత్తు తున్నాయి. ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్తో దెబ్బకి 62 కిలోలకు! -
అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్బర్డ్స్ వీడియో వైరల్
బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్బర్డ్స్ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్డేట్ పేజీ ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్ మాల్లో సందడి చేశారు. అనంత్ కాల్లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్ స్టైల్ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్ బ్యాగ్ వేసుకుని చాలా క్యాజువల్ స్టైల్లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్కి మాత్రం అనంత్-రాధిక షాపింగ్ వీడియో తెగ నచ్చేసింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే. -
రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రశంసలు కురిపించాడు. సారథిగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన హిట్మ్యాన్ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సత్కరించిన తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. కాగా రోహిత్కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల చేతుల మీదుగాముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అతడి పేరిట స్టాండ్ను నెలకొల్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా- గురునాథ్ శర్మతో కలిసి ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రోహిత్ భార్య రితికా సజ్దేతో పాటు తమ్ముడు విశాల్ శర్మ, అతడి భార్య దీపాళీ షిండే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఇలాంటి ఓ రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదన్నాడు.నూటికి నూరు శాతం అర్హుడివికుటుంబ సభ్యుల త్యాగాల వల్లే తాను ఉన్నత స్థితికి చేరుకున్నానని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హిట్మ్యాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపించాడు. ఇంతటి గౌరవానికి నువ్వు నూటికి నూరు శాతం అర్హుడివని కొనియాడాడు.‘‘శుభాకాంక్షలు.. ఈ గౌరవానికి నువ్వు అన్ని విధాలా అర్హుడవి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు స్టాండ్ ఆవిష్కరణ.. ఇలాంటి రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. రోహిత్ శర్మ స్టాండ్లోకి నువ్వు మరిన్ని సిక్స్లు కొట్టాలని ఆశిస్తున్నా.నాకెప్పుడైనా ముంబై స్టేడియంలో టికెట్లు దొరక్కపోతే ఎవరిని సంప్రదించాలో ఇప్పుడు బాగా తెలిసింది. నీ పేరిట స్టాండ్ ఉంది కదా.. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోను’’ అంటూ ద్రవిడ్ వీడియో సందేశం ద్వారా రోహిత్ను అభినందిస్తూనే ఇలా చమత్కరించాడు.వరల్డ్కప్ గెలిచారుకాగా రోహిత్ శర్మ- ద్రవిడ్ల జోడీ టీమిండియాను పరిమిత ఓవర్ల క్రికెట్లో అగ్రస్థానంలో నిలిపింది. అయితే, టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్లోనే నిష్క్రమించడంతో వీరిద్దరిపై విమర్శలు వచ్చాయి. ఇద్దరూ రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగాయి.ఈ క్రమంలో అనూహ్య రీతిలో రోహిత్ కెప్టెన్సీలో జట్టును తిరిగి పుంజుకునేలా చేశాడు ద్రవిడ్. అందుకు ప్రతిఫలంగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచింది. అదే విధంగా వీరిద్దరి కాంబినేషన్లో వన్డే వరల్డ్కప్-2023లో రన్నరప్గానూ నిలిచింది. ఇక టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ హెడ్కోచ్ పదవి నుంచి తప్పుకోగా.. గౌతం గంభీర్ ఆ బాధ్యతలు స్వీకరించాడు.రోహిత్- గంభీర్ కాంబోలో ఇటీవలే భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచింది. కాగా గతేడాది ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతడు భారత వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ద్రవిడ్ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్గా పనిచేస్తున్నాడు.చదవండి: Suresh Raina: కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుRahul Dravid's message to RO got us like... 🥹💙P.S. The humour at the start & end 😂👌#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 | @rajasthanroyals pic.twitter.com/sdnasfUIKi— Mumbai Indians (@mipaltan) May 17, 2025 -
PKL: పీకేఎల్ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 12వ సీజన్కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియను ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలో నిర్వహించే ఈ వేలానికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే 12 ఫ్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేశామని నిర్వాహకులు వెల్లడించారు. కాగా 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 11 సీజన్లలో 8 వేర్వేరు జట్లు టైటిళ్లు గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలో కబడ్డీ లీగ్లో పలానా జట్టు ఫేవరెట్ అనే మాటే లేకుండా ప్రతీ జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. దీంతో యేటికేడు కబడ్డీ కూతకు ఆదరణ అంతకంతకు పెరుగుతూనే ఉండటం విశేషం. బెంగాల్ వారియర్స్ కోచ్గా నవీన్ ఈ ఏడాది జరిగే 12వ సీజన్ పీకేఎల్ కోసం బెంగాల్ వారియర్స్ తమ జట్టు హెడ్ కోచ్గా నవీన్ కుమార్ను నియమించింది. ప్రస్తుతం కోచ్గానే కాదు... అంతకుముందు ఆటగాడిగాను అతనికి మంచి రికార్డు ఉంది. దక్షిణాసియా క్రీడలు (2006), ఆసియా క్రీడలు (2006), కబడ్డీ ప్రపంచకప్ (2007), ఆసియా ఇండోర్ క్రీడల్లో (2007) భారత్ స్వర్ణాలు గెలిచిన బృందంలో అతను సభ్యుడిగా ఉన్నాడు. కోచ్గానూ నిరూపించుకున్నాడు.గతంలో అతను భారత జాతీయ, దేశవాళీ జట్లకు కోచింగ్ సేవలందించాడు. భారత నేవి, స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) జట్లకు కోచ్గా వ్యవహించాడు. ఆటలో కడదాకా కనబరిచే పోరాటస్ఫూర్తి, ఏ దశలోనూ కుంగిపోని సానుకూల దృక్పథం అతన్ని మేటి కోచ్గా నిలబెడుతోంది. 12 ఫ్రాంచైజీలు తలపపడిన గత సీజన్లో బెంగాల్ పదో స్థానంతో నిరాశపరిచింది.ఈ నేపథ్యంలో వేలానికి ముందే అతన్ని నియమించుకోవడం ద్వారా సరైన ఆటగాళ్ల కొనుగోలు, జట్టు కూర్పు, పటిష్టమైన దళాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత సమయం లభిస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది. బెంగాల్కు కోచింగ్ పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారియర్స్ను దీటైన జట్టుగా, బరిలో ఎదురులేని ప్రత్యర్థిగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాల కడలిని దాటి శిఖరాగ్రానికి చేరుకున్న కుమారుడిని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా బ్యాటర్గా, కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం రచించుకున్న రోహిత్ శర్మను అతని సొంత సంఘం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సముచిత రీతిలో గౌరవించిన విషయం తెలిసిందే.ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఒక ప్రేక్షకుల గ్యాలరీకి ‘రోహిత్ శర్మ స్టాండ్’ అని పేరు పెట్టింది. ఈ స్టాండ్ ఆవిష్కరణ కార్యక్రమంశుక్రవారం జరిగింది. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్, భార్య రితిక (Ritika), మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరై ‘రోహిత్ శర్మ స్టాండ్’ను ప్రారంభించారు. రోహిత్ భావోద్వేగంఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నేడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదో ప్రత్యేక అనుభూతి. మ్యాచ్లలో సాధించే ఎన్నో మైలురాళ్లకంటే విశేషమైంది.వాంఖడేలాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎంతో మంది దిగ్గజాల సరసన నా పేరు కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేదు. ఈ స్టేడియంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. వచ్చే బుధవారం ఇక్కడ నా స్టాండ్ ముందు ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాను. అది చాలా గొప్ప అనుభవం అవుతుంది.ఇక భారత్ తరఫున మ్యాచ్ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నా కుటుంబ సభ్యులందరి ముందు ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఎంతో కృతజ్ఞుడను’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!మరోవైపు.. కుమారుడి పేరిట స్టాండ్ ఆవిష్కరణ కాగానే పూర్ణిమా- గురునాథ్ ఆనందభాష్పాలు రాల్చగా.. రితిక కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుకగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరిట, సీనియర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరిట కూడా స్టాండ్లను ఆవిష్కరించిన ఎంసీఏ... ఇటీవలే కన్నుమూసిన మాజీ అధ్యక్షుడు అమోల్ కాలే పేరిట ప్రత్యేక లాంజ్ను కూడా ప్రారంభించింది. ‘నేనైతే సిడ్నీలో రోహిత్ను ఆడించే వాడిని’ మరోవైపు.. ఆస్ట్రేలియాతో సిరీస్తో చివరి టెస్టుకు ముందు తాను ఫామ్లో లేనంటూ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకొన్నాడు. సిడ్నీలో జరిగిన ఈ టెస్టుకు దూరమైన అతను మళ్లీ టెస్టు ఆడకుండానే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాను జట్టు కోచ్గా ఉండి ఉంటే రోహిత్ను తప్పనిసరిగా ఆ టెస్టులో ఆడించే వాడినని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.‘సిరీస్ ముగిసిపోలేదు కాబట్టి కచి్చతంగా అతడిని ఆడించే వాడిని. సిరీస్లో 1–2తో వెనుకబడి ఉన్న సమయంలో జట్టును వదలవద్దని చెప్పేవాడిని. ఆ టెస్టులో తేడా ఒక 30–40 పరుగులు మాత్రమే. ఫామ్ ఎలా ఉన్న అతనో మ్యాచ్ విన్నర్. పిచ్పై పరిస్థితిని అర్థం చేసుకొని ఓపెనర్గా ఒక 35–40 పరుగులు చేసి ఉంటే చాలు మ్యాచ్ ఫలితం మారిపోయేదేమో. సిరీస్ కూడా సమంగా ముగిసేది. అక్కడ రోహిత్ ఆడకపోవడం నన్ను చాలా కాలం వెంటాడింది’ అని రవిశాస్త్రి తన మనసులో మాటను పంచుకున్నాడు. చదవండి: Rohit Sharma Interesting Facts: పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా! లగ్జరీ ఇల్లు, కార్లు.. ఆస్తి ఎంతంటే?#WATCH | Mumbai | Rohit Sharma stands unveiled at Wankhede stadium. Indian ODI men's cricket team captain Rohit Sharma and his family, Maharashtra CM Devendra Fadnavis, NCP-SCP chief Sharad Pawar, and others, are also present.The Mumbai Cricket Association (MCA) is formally… pic.twitter.com/K39kSfRkCY— ANI (@ANI) May 16, 2025 -
హరే కృష్ణ మందిరం ఇస్కాన్–బెంగళూరుదే
న్యూఢిల్లీ: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత హరే కృష్ణ మందిరం బెంగళూరు ఇస్కాన్ సొసైటీకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ మందిరం ముంబై ఇస్కాన్ సొసైటీకి చెందుతుందని కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ బెంగళూరు ఇస్కాన్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జీ మాసిహ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ఇచి్చన ఉత్తర్వును తోసిపుచ్చింది. హరే కృష్ణా మందిరంపై ముంబై ఇస్కాన్ సొసైటీకి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఆ సంస్థ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. మందిరం స్థలానికి సంబంధించిన సేల్ డీడ్ బెంగళూరు సొసైటీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. సేల్ డీడ్ను బెంగళూరు సొసైటీ సభ్యులు మధు పండిత దాస, భక్తిలతా దేవి, చంచలపాటి దాస, చమారిదేవి తారుమారు చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. ఆలయానికి సంబంధించిన కీలక పత్రాల్లో బెంగళూరు సొసైటీ రబ్బర్ స్టాంప్ ఉన్నట్లు తెలియజేసింది. షెడ్యూల్ ‘ఎ’లో ఉన్న ఆ ఆస్తిని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఇస్కాన్ బెంగళూరు సొసైటీకి కేటాయించినట్లు చెప్పడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ధర్మాసనం తన తీర్పులో ఉద్ఘాటించింది. బెంగళూరు సొసైటీని కర్ణాటక సొసైటీస్ రిజి్రస్టేషన్ చట్టం కింద స్వతంత్ర సొసైటీగా రిజిస్టర్ చేసినట్లు వివరించింది. ముంబై సొసైటీకి బెంగళూరు సొసైటీ ఒక శాఖ అని హైకోర్టు చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడింది. అందుకే హైకోర్టు తీర్పును పక్కనపెడుతున్నట్లు తేల్చిచెప్పింది. బెంగళూరు సొసైటీ హరే కృష్ణా మందిరంతోపాటు ఒక విద్యాసంస్థను కూడా నిర్వహిస్తోంది. ఈ మందిరం ముంబై సొసైటీదే అంటూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు జారీ చేయగా, బెంగళూరు సొసైటీ ఆఫీసు–బేరస్ కోదండరామ దాస 2011 జూన్ 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు పట్ల బెంగళూరు ఇస్కాన్ సొసైటీ అధ్యక్షుడు మధు పండిత్ దాస హర్షం వ్యక్తంచేశారు. -
కలలో కూడా ఊహించలేదు.. మాటల్లో వర్ణించలేను: రోహిత్ శర్మ భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఘనంగా సత్కరించింది. వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో రోహిత్ శర్మ పేరిట ఉన్న స్టాండ్ను శుక్రవారం ఆరంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్ శర్మ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ను ఆవిష్కరించారు.ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుఆ సమయంలో సీనియర్ నేత శరద్ పవార్, భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్లతో పాటు హిట్మ్యాన్ సతీమణి రితికా సజ్దే కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఇక్కడి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ముంబైకి.. టీమిండియాకు ఆడాలని కలలు కంటూ పెరిగాను. దేశానికి నా వంతు సేవ చేయాలని భావించాను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలు సాధించాను.కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ ఎన్నెన్నో మైలురాళ్లు అధిగమించాను. అయితే, వాటన్నింటికంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. వాంఖడే వంటి ప్రసిద్ధ స్టేడియంలో నా పేరు ఇలా.. ఈ మైదానంతో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.మాటల్లో వర్ణించలేనుప్రపంచంలోని పేరెన్నికగన్న రాజకీయ నాయకులతో పాటు నా పేరు ఉండటం.. హో.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఎంసీఏ సభ్యులు, యాజమాన్యానికి నేను కృతజ్ఞుడిని. నేను ఇంకా క్రికెటర్గా కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో ఎంతో ప్రత్యేకం.రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాను. ఇంకో ఫార్మాట్ ఆడుతూనే ఉన్నాను. నిజంగా ఈ భావనను మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. టీమిండియా తరఫున, ఐపీఎల్లో ముంబై తరఫున ఇక్కడికే వచ్చి మళ్లీ ఆడబోతున్నా. ఇంతకంటే గొప్పది నా జీవితంలో మరొకటి ఉండదు.వారి త్యాగాలు మరువలేనివిమా అమ్మానాన్న, నా భార్య, తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా ఇక్కడే ఉంది. వారందరి సమక్షంలో ఈ గౌరవం అందుకోవడం నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. నా కోసం వారంతా తమ జీవితంలోని చాలా సంతోషాలను త్యాగం చేశారు.మా ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడే ఉంది. నా ప్రసంగం ముగిసిన వెంటనే వాళ్లు మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతారు’’ అంటూ రోహిత్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024తో పాటు టీమిండియాకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన ఘనత రోహిత్ సొంతం. తద్వారా మహేంద్ర సింగ్ ధోని (3) తర్వాత భారత్కు అత్యధిక (రెండు) ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్గా రికార్డు సాధించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడేలో ఇప్పటి వరకు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్సర్కార్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. తాజాగా రోహిత్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. చదవండి: ‘రోహిత్ జట్టులో లేకపోయినా నష్టమేమీ లేదు.. అది పెద్ద విషయమే కాదు’𝗧𝗛𝗘 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 𝗦𝗧𝗔𝗡𝗗 🫡🏟#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 pic.twitter.com/dqdWu6YSQ5— Mumbai Indians (@mipaltan) May 16, 2025 -
రూ. 9 కోట్ల నగదు.. రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం!
హైదరాబాద్: నగరానికి చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గురువారం హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వైఎస్ రెడ్డి.. అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయనకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్ ఇలా 12 చోట్ల ఈడీ సోదాలు చేసింది. దీనిలో భాగంగా రూ. 9 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలకు కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి సోదాలు చేశారు ఈడీ అధికారులు. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత ఈడీ సోదాలు చేసింది. -
సెయిలింగ్లో తెలంగాణ సత్తా : స్పెషల్ ఎట్రాక్షన్గా అమ్మాయిల నైపుణ్యం
సాక్షి, సిటీబ్యూరో: గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెయిలింగ్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా రాణిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ జూనియర్ సెయిలింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్స్ నాలుగు బంగారు పతకాలు సహా మొత్తం ఆరు పతకాలతో సత్తా చాటారు. ముంబైలోని మార్వేలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ రసూల్పురాలోని ఉద్భవ్ స్కూల్కు చెందిన లాహిరి కొమరవెల్లి అండర్–16 సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం గెలిచింది. మొత్తం 9 రేసుల రెగెట్టాలో 4 రేసుల్లో మొదటి స్థానం, రెండు రేసుల్లో రెండో స్థానంతో 13 పాయింట్లతో 2025 జాతీయ చాంపియన్గా నిలిచింది. అదే స్కూల్కు చెందిన తనూజ కామేశ్వర్– శ్రవణ్ కత్రావత్లు జూనియర్ డబుల్ హ్యాండర్ విభాగంలో చివరి రోజు రెండు రేసులను గెలిచి నేషనల్ చాంపియన్స్ అయ్యారు. ఇదీ చదవండి: తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీఅండర్–15 బాలుర విభాగంలో బన్నీ బొంగూర్ బంగారు పతకం నెగ్గగా, రిజ్వాన్ మహమ్మద్ రజతం, రవి కుమార్ కాంస్యం గెలిచారు. ఒక ఈవెంట్లో తెలంగాణకు చెందిన ముగ్గురు సెయిలర్లు పోడియంపైకి రావడం ఇదే తొలిసారి. ఉద్భవ్ స్కూల్కు చెందిన చంద్రలేఖ తట్టారి తొలిసారి కాంస్య పతకం సాధించాడు. మొత్తంగా అండర్–16 సబ్ జూనియర్స్ పోడియంపైకి వచ్చిన ఆరుగురు సెయిలర్లలో ఐదుగురు తెలంగాణ క్రీడాకారులే కావడం విశేషం. ఈ సందర్భంగా హైదరాబాద్ యాచ్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుహీమ్ షేక్ సంతోషం వ్యక్తం చేశాడు.ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియోగతేడాది నుంచి తాము చేసిన ఫిట్నెస్, న్యూట్రిషన్, సైద్ధాంతిక శిక్షణ ఫలితాలను ఇచ్చిందని అన్నారు. నేషనల్స్లో టాప్–14లో ఎనిమిది మంది తెలంగాణ రాష్ట్రం వాళ్లే ఉండటం తమ శిక్షణ ఫలితమని, ఇది ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపాడు. జూన్లో జరిగే లాంగ్కవి ఇంటర్నేషనల్ టోర్నీ కోసం ఎంపికైన సెయిలర్స్ జాబితా త్వరలో విడుదల కానుంది. తెలంగాణ నుంచి కనీసం ఏడుగురు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ సెయిలర్స్ షిల్లాంగ్లో జరిగే జాతీయ ర్యాంకింగ్ రెగెట్టాలో పాల్గొని, ఆ తర్వాత హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో జరిగే మాన్సూన్ రెగెట్టా ట్రోఫీలోనూ బరిలో నిలవనున్నారు. చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో -
వామ్మో..! రైలు 40 నిమిషాలు ఆలస్యమైతే ఇంతలానా..!
హైదరాబాద్ ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రజలు రాకపోకలకు లోకల్ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. అది కామన్. అయితే ముంబై నగరంలోనో ఓ లేడీస్ స్పెషల్ ట్రైన్ కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఏ రేంజ్లో రద్దీగా ఉందో చూస్తే షాకవ్వుతారు. అది కూడా అమ్మాయిలే ఫుట్బోర్డుపై వేళ్లాడుతూ వెళ్తున్న విధానం చూస్తే నోటమాట రాదు. మరి అదెక్కడ జరిగిందో చదివేయండి మరీ..ముంబై మహానగరం అంతటా లక్షలాదిమంది ప్రయాణికులు ఈ లోకల్ రైళ్లపై ఆధారపడతారు. ఈ స్థానిక రైళ్లే ముంబైలోని వివిధ శివారు ప్రాంతాలను అనుసంధానించడంతో.. అక్కడ నివాసితులకు ఈజీగా రాకపోకలు సాగించడంలో కీలక పాత్రపోషించేది అవే. ఐతే అలాంటి ఓ రైలు మహిళతో ఫుల్ అయ్యి ఉన్నవీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదికూడా మహిళలే ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ముంబై కళ్యాణ్ లేడీస్ స్పెషల్ లోకల్ రైలులో చోటుచేసుకుంది. అయితే ఆ రైలు 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇంతలా హౌస్ఫుల్ అయ్యినట్లు సమాచారం. ఏకంగా మహిళలు కూడా ఏ మాత్రం భయపడకుండా ఫుట్బోర్డుపై ప్రయాణించడమే అత్యంత షాకింగ్ గురిచేసే విషయం. అందుకు సంబంధించిన వీడియోని ముంబౌ రైల్వే యూజర్స్ ఎక్స్ అకౌంట్ షేర్ చేసింది. అయితే నెటిజన్లు ఈ అసురక్షితమైన జర్నీలకంటే మరొక రైలు కోసం ఎదురుచూడటం మంచిదని పోస్ట్ చేయగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన జర్నీలు తమ కుటుంబాలకు శాశ్వతాన్ని బాధను మిగులుస్తాయని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.#ViralVideo #CRFixLocalTrainDelays Today’s Ladies Special from Kalyan was delayed by 40 mins, forcing women to hang on the footboard—an unsafe and risky commute. Railways term this dangerous, yet delays continue. @AshwiniVaishnaw pls review delay data. @MumRail @rajtoday pic.twitter.com/vnhxTIyFD6— Mumbai Railway Users (@mumbairailusers) May 9, 2025 (చదవండి: ఆ హగ్ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్) -
అతడి విషయంలో సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయం!
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను తిరిగి జట్టులోకి తీసుకునే విషయంలో సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయమని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కార్యదర్శి అభయ్ హదాప్ (Abhay Hadap) స్పష్టం చేశాడు. జైసూ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని.. అయితే, అందుకు ఎంసీఏ ఇంకా స్పందించలేదని తెలిపాడు.గోవా జట్టుకు మారాలనికాగా భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు తరఫునే కొనసాగాలని ఆశిస్తున్నాడు. గతంలో రంజీ ట్రోఫీ అనంతరం ముంబై నుంచి గోవా జట్టుకు మారాలని అనుకున్న జైస్వాల్... ఎంసీఏ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోరాడు.ఇందుకు అంగీకరించిన ఎంసీఏ జైస్వాల్కు ఎన్ఓసీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్న జైస్వాల్ ఈ సీజన్లో ముంబై జట్టుకే ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఎంసీఏకు లేఖ రాశాడు.అందుకే యూ- టర్న్‘గోవా జట్టుకు మారేందుకు కొన్ని కుటుంబ ప్రణాళికలు మధ్యలో ఉన్నాయి. అందుకే ఆ దిశగా ఆలోచించడం లేదు. నాకు ఇచ్చిన ఎన్ఓసీని ఉపసంహరించుకోవాలని ఎంసీఏను కోరుతున్నా.కాబట్టి ఈ సీజన్లో ముంబై తరఫున ఆడేందుకు అనుమతించమని ఎంసీఏను అభ్యర్థిస్తున్నా. నేను ఎన్ఓసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ సంఘానికి గానీ సమర్పించలేదు’ అని యశస్వి పేర్కొన్నాడు.సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయంఈ విషయం గురించి ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదాప్ స్పందిస్తూ.. ‘‘అవును.. గురువారం జైస్వాల్ ఎంసీఏకు ఇ-మెయిల్ పంపించాడు. తాను ఇప్పుడు ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.అయితే, ఈ విషయంలో ముంబై సెలక్షన్ కమిటీ, క్రికెట్ ఇంప్రూవ్మెంట్ కమిటీదే తుది నిర్ణయం. జైస్వాల్ భవిష్యత్తులో ముంబైకి ఆడతాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని పేర్కొన్నాడు.అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాంఇక గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంబా నాయక్ దేశాయి కూడా జైసూ యూటర్న్పై తన స్పందన తెలియజేశాడు. ‘‘జైస్వాల్ తన బిజీ షెడ్యూల్ను పరిగణనలోకి తీసుకుని.. గోవా జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని భావించాడు.కాబట్టి మా గెస్టు ప్లేయర్ల జాబితాలో ఒకరు తగ్గిపోతారు. ఏదేమైనా ఇరువర్గాల మధ్య ఇందుకు సంబంధించి సమన్వయం, పరస్పర అవగాహన ఉన్నాయి. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.మూడు ఫార్మాట్లలో ఆడుతున్న జైసూకాగా మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల యశస్వి .. సారథ్య బాధ్యతలు చేపట్టాలనే ఉద్దేశంతోనే ముంబై నుంచి గోవాకు మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ముంబై తరఫున 2019లొ అరంగేట్రం చేసి.. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 12 అర్ధ శతకాలు, 13 శతకాల సాయంతో 3712 పరుగులు సాధించాడు. కాగా గత ఏడాది చివర్లో రోహిత్ శర్మతో కలిసి జైసూ.. ముంబై ఓపెనర్గా ఆఖరిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 19 టెస్టులు ఆడిన యశస్వి జైస్వాల్ 4 సెంచరీలు, రెండు ద్విశతకాల సాయంతో 1798 పరుగులు సాధించాడు. 23 టీ20లలో 723, ఒక వన్డేలో 15 పరుగులు చేశాడు. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన యశస్వి.. మెరుగైన అవకాశాల కోసం ముంబైకి చేరి.. అదే జట్టు తరఫున దేశీ క్రికెట్లో సత్తా చాటాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడుతూ టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. చదవండి: Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’! -
యూ టర్న్ తీసుకున్న యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్ కొద్ది రోజుల కిందట ముంబై నుంచి గోవాకు వలస వెళ్లాలని (దేశవాలీ క్రికెట్) నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా అతను ముంబై క్రికెట్ అసోసియేషన్పై (MCA) ఒత్తిడి తెచ్చి మరీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాడు. తాజాగా ఈ విషయంలో జైస్వాల్ యూ టర్న్ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపాడు. వారు జారీ చేసిన ఎన్వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ దేశవాలీ సీజన్లో సెలెక్షన్కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ అసోసియేషన్కు కాని సమర్పించలేదని తెలిపాడు.కాగా, ఉత్తర్ప్రదేశ్లో పుట్టిన జైస్వాల్.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి టీమిండియాలో, ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. వాస్తవానికి గోవా క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్కు కెప్టెన్సీ ఆశ చూపి తమవైపు మళ్లేలా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, అతను తిరిగి పాత జట్టు ముంబైకే ఆడాలనుకుంటున్నాడు.జైస్వాల్కు ముంబై తరఫున ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టు తరఫున ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. 2018-19 రంజీ సీజన్లో తొలిసారి ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జైస్వాల్.. అతి తక్కువ వ్యవధిలో చాలా పాపులర్ అయ్యాడు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60కి పైగా సగటుతో 13 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 3712 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.2019-20 సీజన్లో ముంబై తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే జైస్వాల్కు ఐపీఎల్ ఛాన్స్ దక్కింది. 2020 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోని జైస్వాల్ ఫార్మాట్లకతీతంగా దేశవాలీ క్రికెట్లో, అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో చెలరేగిపోతున్నాడు. -
అకాల వర్షాలు, అన్నదాతకు అంతులేని శోకం
సాక్షి, ముంబై: జల్గావ్ జిల్లాలో మంగళవారం కురిసిన వడగళ్ల వానలు, తుఫానుల గాలులు, అకాల వర్షాల ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 7,235 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 4,279 హెక్టార్లలో విస్తరించి ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. తీవ్ర పంటనష్టంతో రైతులకు ఆరి్థకంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్ కార్యాలయం తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీ వర్షాలు జిల్లాలోని 14 తాలూకాలలో పంటలను ప్రభావితం చేశాయి. అమల్నేర్ మినహా మిగిలిన అన్ని తాలూకాల్లో వడగళ్ల వానలు బొప్పాయి, మొక్కజొన్న, జొన్న, మిల్లెట్, ఉల్లిపాయ, బీన్స్ పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క జల్గావ్ తాలూకాలోనే అత్యధికంగా 1,320 హెక్టార్లలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. చోప్డాలో 663 హెక్టార్లు, రావర్లో 519 హెక్టార్లు, యావల్లో 436 హెక్టార్లు, ఎరండోల్లో 254 హెక్టార్లు, ముక్తాయ్నగర్లో 250 హెక్టార్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే 717 హెక్టార్లలో మొక్కజొన్న, 507 హెక్టార్లలో మినుములు, 214 హెక్టార్లలో జొన్న, 301 హెక్టార్లలో ఉల్లిపాయ, 249 హెక్టార్లలో బొప్పాయి, 751 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఇక, ధరణగావ్ తాలూకాలోని ఎక్లగ్న బుద్రుక్ గ్రామంలో పిడుగుపాటుకు రెండు గేదెలు మతి చెందగా, చోప్డా తాలూకాలోని పుంగావ్ గ్రామంలో యువరాజ్ బావిస్కర్ అనే రైతు గేదెపై చెట్టు పడటంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపరిహారం కోసం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్ ఖుర్బాన్ తడ్వి సూచించారు.ఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ నంబర్ 14447 లేదా వాట్సాప్ నంబర్ 7065514447 ను సంప్రదించవచ్చని తెలిపారు. -
ఐపీఎల్ ఆడుతుండగానే మరో జాక్పాట్ కొట్టిన సీఎస్కే చిచ్చరపిడుగు
సీఎస్కే చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రే ఐపీఎల్ 2025 ఆడుతుండగానే మరో జాక్ పాట్ కొట్టాడు. నిన్న (మే 7) జరిగిన ముంబై టీ20 లీగ్ వేలంలో మాత్రేకు భారీ ధర దక్కింది. మాత్రేను ట్రయంప్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఫ్రాంచైజీ రూ. 14.75 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో మాత్రే నాలుగో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వేలంలో అత్యధిక మొత్తం అథర్వ అంకోలేకర్కు దక్కింది. అంకోలేకర్ను ఈగల్ థానే స్ట్రయికర్స్ ఫ్రాంచైజీ రూ. 16.25 లక్షల ధరకు సొంతం చేసుకుంది. అంకోలేకర్ తర్వాత అత్యధిక బిడ్డింగ్ ముషీర్ ఖాన్, సాయిరాజ్ పాటిల్కు దక్కింది. ముషీర్ను ఏఆర్సీఎస్ అంధేరి.. సాయిరాజ్ను ఈగల్ థానే స్ట్రయికర్స్ రూ. 15 లక్షలకు దక్కించుకున్నాయి.వీరి తర్వాత వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కేకేఆర ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ నిలిచాడు. రఘువంశీని ముంబై ఫాల్కన్స్ రూ. 14 లక్షలకు దక్కించుకుంది. షమ్స్ ములానీకి 14 లక్షలు, సూర్యాంశ్ షేడ్గేకు రూ. 13.75 లక్షలు లభించాయి.కాగా, ముంబై టీ20 లీగ్ ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎనిమిది జట్లు నిన్న జరిగిన వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఒక్కో జట్లు గరిష్ఠంగా 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి జట్టు ఓ ఐకాన్ ఆటగాడిని ఎంపిక చేసుకుంది. ఐకాన్ ఆటగాడికి రూ. 20 లక్షలు లభిస్తాయి. సూర్యకుమార్ యాదవ్ (ముంబై నార్త్ ఈస్ట్), అజింక్య రహానే (బాంద్రా బ్లాస్టర్స్), పృథ్వీ షా (ముంబై పాంథర్స్), శ్రేయస్ అయ్యర్ (ముంబై ఫాల్కన్స్),శివమ్ దూబే (అంధేరి), శార్దూల్ ఠాకూర్ (థానే స్ట్రయికర్స్), సర్ఫరాజ్ ఖాన్ (ముంబై సబర్బ్స్), తుషార్ దేశ్పాండే (మరాఠ రాయల్స్) ఐకాన్ ప్లేయర్స్గా ఎంపికయ్యారు. ఈ లీగ్ మే 26 నుంచి జూన్ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది.జట్ల వివరాలు..ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఐకాన్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్ (20 లక్షలు) ప్లేయర్స్: సిధాంత్ ఆధత్రావ్ (7.75 లక్షలు), ఆయుష్ మాత్రే (14.75 లక్షలు), సూర్యాంశ్ షెడ్గే (13.75 లక్షలు), పరీక్షిత్ వల్సంకర్ (7.25 లక్షలు), జే జైన్ (4 లక్షలు), హృషికేశ్ గోరే (3.40 లక్షలు), ఆకాష్ పవార్ (3 లక్షలు), శ్రేయాస్ గురవ్ (3 లక్షలు), భరత్ సుదమ్ పాటిల్ (2 లక్షలు), మకరంద్ పాటిల్ (2 లక్షలు)బాంద్రా బ్లాస్టర్స్ ఐకాన్ ప్లేయర్: అజింక్యా రహానే (20 లక్షలు) ప్లేయర్లు: సువేద్ పార్కర్ (8.50 లక్షలు), ఆకాశ్ ఆనంద్ (8.25 లక్షలు), రాయ్స్టన్ డయాస్ (7 లక్షలు), కర్ష్ కొఠారి (5 లక్షలు), తుషార్ సింగ్ (3 లక్షలు), అథర్వ పూజారి (3 లక్షలు), ఓం కేష్కామత్ (3.20 లక్షలు), ధనిత్ రౌత్ (4.60 లక్షలు), నమన్ పుష్పక్ (3 లక్షలు), పార్థ్ అంకోలేకర్ (3 లక్షలు), అతిఫ్ హబీబ్ అత్తర్వాలా (6.25 లక్షలు), ద్రుమిల్ మత్కర్ (7.25 లక్షలు), మహ్మద్ అదీబ్ వాసియుల్ ఉస్మాని (2.70 లక్షలు)నార్త్ ముంబై పాంథర్స్ ఐకాన్ ప్లేయర్: పృథ్వీ షా (20 లక్షలు)ప్లేయర్స్: తనుశ్ కోటియన్ (10 లక్షలు), మోహిత్ అవస్తీ (10.50 లక్షలు), ఖిజార్ దఫేదార్ (5.50 లక్షలు), దివ్యాంష్ సక్సేనా (5.25 లక్షలు), అభిజ్ఞాన్ కుందు (5 లక్షలు), ఆయుష్ వర్తక్ (6.25 లక్షలు), సౌరభ్ సింగ్ (3 లక్షలు), హర్షల్ జాదవ్ (5 లక్షలు), ప్రిన్స్ దేవాంగ్ షైక్ (2 లక్షలు), షాలిక్ జౌక్ల్ (2 లక్షలు), అలీమ్ (3.40 లక్షలు), ముజామిల్ కద్రి (2 లక్షలు)SoBo ముంబై ఫాల్కన్స్ ఐకాన్ ప్లేయర్: శ్రేయాస్ అయ్యర్ (20 లక్షలు) ప్లేయర్స్: అంగ్క్రిష్ రఘువంశీ (14 లక్షలు), వినాయక్ భోయిర్ (5.75 లక్షలు), సిద్ధార్థ్ రౌత్ (7 లక్షలు), హర్ష్ అఘవ్ (5.25 లక్షలు), కుష్ కరియా (3 లక్షలు), నిఖిల్ గిరి (3 లక్షలు), ప్రేమ్ దేవ్కర్ (3 లక్షలు), ఆకాశ్ పార్కర్ (11.25 లక్షలు), అమోల్ టార్పురే (3 లక్షలు), ఇషాన్ ముల్చందని (3.40 లక్షలు), మయూరేశ్ తండేల్ (2 లక్షలు)ARCS అంధేరీ ఐకాన్ ప్లేయర్: శివమ్ దూబే (20 లక్షలు) ప్లేయర్లు: ప్రసాద్ పవార్ (13 లక్షలు), ముషీర్ ఖాన్ (15 లక్షలు), హిమాన్షు సింగ్ (5.50 లక్షలు), అఖిల్ హెర్వాద్కర్ (6.50 లక్షలు), సిద్దిద్ తివారీ (3 లక్షలు), ప్రవార్జా (3 లక్షలు), రజారీ 3 లక్షలు (3 లక్షలు), సాక్షం ఝా (3.60 లక్షలు), ప్రసూన్ సింగ్ (3 లక్షలు), ఐశ్వరీ సర్వే (2 లక్షలు), అజయ్ మిశ్రా (2 లక్షలు), బద్రే ఆలం (2.50 లక్షలు), మొయిన్ ఖాన్ (2 లక్షలు), మోనిల్ సోనీ (2.20 లక్షలు)ఈగిల్ థానే స్ట్రైకర్స్ ఐకాన్ ప్లేయర్: శార్దూల్ ఠాకూర్ (20 లక్షలు) ప్లేయర్లు: శశాంక్ అత్తార్డే (6.50 లక్షలు), సాయిరాజ్ పాటిల్ (15 లక్షలు), అథర్వ అంకోలేకర్ (16.25 లక్షలు), హర్ష్ తన్నా (16.25 లక్షలు), హర్ష్ తన్నా (7.7 లక్షలు), రవీంద్ర కుమార్ యాదవ్ (3.80 లక్షలు), ఆర్యన్ చౌహాన్ (3 లక్షలు), హర్ష్ సలుంఖే (3 లక్షలు), నూతన్ గోయెల్ (3.20 లక్షలు), ఆర్యరాజ్ నికమ్ (2.10 లక్షలు), అమర్త్య రాజే (2 లక్షలు), కౌశిక్ చిఖాలికర్ (2 లక్షలు)ఆకాశ్ టైగర్స్ ముంబయి సబర్బ్స్ ఐకాన్ ప్లేయర్: సర్ఫరాజ్ ఖాన్ (20 లక్షలు)ప్లేయర్లు: హార్దిక్ తామోర్ (8.50 లక్షలు), జే బిస్తా (12 లక్షలు), షమ్స్ ములానీ (14 లక్షలు), సిల్వెస్టర్ డిసౌజా (5 లక్షలు), అయాజ్ అహ్మద్ అఫ్జల్ అహ్మద్ ఖ్ (5.25 లక్షలు), సిద్ధార్థ్ అక్రే (4.60 లక్షలు), అర్జున్ డాని (4.20 లక్షలు), మహమ్మద్ యాసీన్ సౌదాగర్ (3 లక్షలు), జైద్ పాటంకర్ (3.60 లక్షలు), కరణ్ షా (2 లక్షలు), కృతిక్ శంకరప్ప హనగవాడి (2 లక్షలు)ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ ఐకాన్ ప్లేయర్: తుషార్ దేశ్పాండే (20 లక్షలు)ప్లేయర్లు: సిద్దేశ్ లాడ్ (10.25 లక్షలు), సచిన్ యాదవ్ (7 లక్షలు), ఆదిత్య ధుమాల్ (7.25 లక్షలు), ఖాన్ అవైస్ నౌషాద్ (4.20 లక్షలు), సాహిల్ జాదవ్ (3 లక్షలు), నమన్ ఝవార్ (3 లక్షలు), మాక్స్వెల్ స్వామినాథన్ (4.60 లక్షలు), వరుణ్ రావ్ (3 లక్షలు), రోహన్ ఘాగ్ (3 లక్షలు), అజయ్ సింగ్ జానూ (2.20 లక్షలు), చిన్మయ్ సుతార్ (5 లక్షలు), ఇర్ఫాన్ ఉమెయిర్ (9.25 లక్షలు), పరాగ్ ఖానాపుర్కార్ (6 లక్షలు) -
రైల్వే టికెట్తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలు
టికెట్ లేకుండా ట్రైన్లలో ప్రయాణించేవారి సంఖ్య చాలానే ఉంది. దీనిని నివారించడానికి ఇండియన్ రైల్వే ఓ విన్నూత చర్యకు శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ సుమారు 24 మిలియన్ల మంది ప్రయానికులకు సేవలందిస్తున్న ముంబై డివిజన్.. ఎఫ్సీబీ ఇండియా యాడ్ ఏజన్సీతో జతకట్టి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభించింది.ఇండియన్ రైల్వే.. ప్రారంభించిన ఈ లక్కీ యాత్ర ప్రచారంలో భాగంగా ప్రతి రోజూ ఒక ప్రయాణికునికి రూ. 10వేలు, వారానికి ఒక ప్రయాణికునికి రూ. 50వేలు ఫ్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం ప్రారభించడం జరిగింది. ఇది వచ్చే వారం నుంచి ప్రారంభమై ఎనిమిది వారాలు పాటు అమలులో ఉంటుందని తెలుస్తోంది.టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల.. ఇండియన్ రైల్వే ప్రతి ఏటా కోట్ల రూపాయలను కోల్పోతోంది. అయితే ఇప్పుడు ప్రైజ్ మనీ అనే ప్రచారం ప్రారభించడంతో.. ప్రైజ్ కోసమైనా కొందరు ట్రైన్ టికెట్ కొనుగోలు చేస్తారు. ప్రైజ్ మనీ కేవలం ట్రైన్ టికెట్ తీసుకునే వారికి మాత్రమే కాకుండా.. సీజన్ పాస్లు తీసుకున్నవారికి కూడా లభిస్తుంది.ప్రతిరోజు.. సబర్బన్ స్టేషన్లో టికెట్ ఎగ్జామినర్ ఒక ప్రయాణికుడిని ఎంపిక చేస్తారు. అతడు చెల్లుబాటు అయ్యే రోజువారీ టికెట్ లేదా సీజన్ పాస్ను కలిగి ఉన్నట్లయితే.. రూ. 10,000 నగదు బహుమతిని అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే వారానికి ఒకరిని ఎంపిక చేసి రూ. 50000 ప్రైజ్ మనీ అందిస్తారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ల సమయంలో రోజుకు 4,000 నుంచి 5,000 మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను తగ్గించడానికి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభమైంది. దీని ద్వారా ఎక్కివమందిని టికెట్స్ కొనేలా చేయొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రచారం ప్రస్తుతం ముంబైలో మాత్రమే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. -
చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్ -
పోలీసులకు నటి ఫిర్యాదు.. పరారీలో నటుడు అజాజ్ ఖాన్!
ఇటీవల హౌస్ అరెస్ట్ షో వివాదం తర్వాత అజాజ్ ఖాన్ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఈ షోలో అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేయడం వివాదంగా మారింది. దీంతో ఆ షోను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థ కూడా బ్యాన్ విధించింది. ఆ తర్వాత ఓ నటి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అజాజ్ ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అజాజ్ ఖాన్ తన ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైనట్లు తెలుస్తోంది.తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఒక నటి ముంబయిలోని చార్కోప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అజాజ్ ఖాన్ను సంప్రదించేందుకు పోలీసులు యత్నించగా.. ఇంటి వద్ద అందుబాటులో లేడని తెలిపారు. అంతేకాకుండా ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పరారైనట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. 'హౌస్ అరెస్ట్' షోలో పాత్రను ఆఫర్ చేశాడని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని నటి ఆరోపించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 'హౌస్ అరెస్ట్' అనే షోలో అనుచిత కంటెంట్ను ప్రసారం చేసినందుకు మరో కేసులో కూడా పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రోత్సహించినందుకు అతనితో పాటు, ఉల్లు ఓటీటీ యజమానులపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ షోను వెంటనే నిషేధించాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సెల్ఫీకి అల్లు అర్జున్ నో.. ఎయిర్పోర్ట్లో అభిమానికి నిరాశ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ముంబయిలో సందడి చేశారు. ప్రతిష్టాత్మక వేవ్స్ సమ్మిట్-2025కు బన్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈ సమ్మిట్లో పంచుకున్నారు. సినీరంగంలో తనకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమంటూ కామెంట్స్ చేశారు. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్లో 22వ చిత్రంగా రానుంది.ఇదంతా పక్కన పెడితే వేవ్స్ సమ్మిట్కు వెళ్తూ మన ఐకాన్ స్టార్ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కారు దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్లే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అతనితో ఫోటో దిగేందుకు బన్నీ అనుమతించలేదు. అతన్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ సైతం వద్దని వారించారు.దీంతో అల్లు అర్జున్ వైఖరిపై నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని పోస్టులు పెడుతున్నారు. అభిమానులే లేకపోతే అసలు మీరు ఎవరు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వెంటనే అల్లు అర్జున్ సినిమాలు చూడటం మానేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే మరికొందరు అల్లు అర్జున్కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల వారికి సమయం ఉండదని అంటున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అదొక హెల్మెట్లాంటిది.. సరిగ్గా వాడుకోండి: రవిశాస్త్రి
ముంబై: క్రీడల్లో టెక్నాలజీ కారణంగా ఎన్నో మార్పులు వచ్చాయని టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. వాటిని సమర్థంగా వాడుకోవడం ఆటగాళ్ల చేతుల్లో ఉందని అభిప్రాయ పడ్డాడు. తాను ఆడిన రోజులతో పోలిస్తే ఇప్పుడు అత్యంత అధునాతన సాంకేతికత అందుబాటులో ఉందని.. ఇది ఆటగాళ్ల పనిని మరింత సులువు చేసిందని అతడు తెలిపాడు.కిట్ బ్యాగ్లో బ్యాట్, ప్యాడ్లు ఉన్నట్లేనగరంలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)లో భాగంగా ‘ఇంటర్సెక్షన్ ఆఫ్ స్పోర్ట్స్, టెక్నాలజీ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మీడియా’ అనే అంశంపై కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడాడు. ‘గత 40–45 ఏళ్లలో ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ పురోగతిని నేను దగ్గరి నుంచి చూశాను. కిట్ బ్యాగ్లో బ్యాట్, ప్యాడ్లు ఉన్నట్లే మీడియా, టెక్నాలజీ కూడా కిట్ బ్యాగ్లో భాగంగా మారింది.అదొక హెల్మెట్లాంటిది.. సరిగ్గా వాడుకోండిసరిగ్గా చెప్పాలంటే అది ఒక హెల్మెట్లాంటిది. దానిని సరైన రీతిలో అందిపుచ్చుకొని సమర్థంగా వాడుకోవాలి. మా రోజుల్లో రేడియో, దూరదర్శన్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అందరికీ చేరువయ్యేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయి. భారత జట్టు ఎక్కడ ఆట ఆడినా కోట్లాది మంది అభిమానులు చూస్తున్నారు. ఏఐ టెక్నాలజీ కూడా మీ కోసం, మీ టీమ్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది.సాంకేతికత ఆటను చాలా అద్భుతంగా మార్చింది. ఇప్పుడు ప్లేయర్ వెనక్కి వెళ్లి 100 సార్లు రీప్లేలు చూసుకునే అవకాశం ఉంది. మీ బలాలు, బలహీనతలే కాదు, ప్రత్యర్థుల గురించి తెలుసుకునేందుకు ఇది కీలకంగా మారిపోయింది’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: ఇంగ్లండ్ టెస్టు జట్టులో రెండు కొత్త ముఖాలు లండన్: టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టు యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. దానికి ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు... జింబాబ్వేతో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నెల 22 నుంచి నాటింగ్హామ్లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు శుక్రవారం 13 మందితో కూడిన జట్టను ప్రకటించింది.ఈ మ్యాచ్ కోసం స్యామ్ కుక్, జోర్డాన్ కాక్స్ను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. మీడియం పేసర్ స్యామ్ కుక్ దేశవాళీల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. 27 ఏళ్ల కుక్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 19.77 సగటుతో 318 వికెట్లు తీశాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ తరఫున ఆస్ట్రేలియా పర్యటనలోనూ కుక్ ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్ల్లో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ కోసం అతడిని ఎంపిక చేశారు.ఇక వికెట్ కీపర్ బ్యాటర్ అయిన 24 ఏళ్ల జోర్డాన్ కాక్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మరోవైపు నాటింగ్హామ్షైర్ పేసర్ జోష్ టంగ్కు తిరిగి అవకాశం కల్పించారు. 2023 యాషెస్ సిరీస్లో ఆడిన టంగ్... ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2003 తర్వాత ఇంగ్లండ్లో జింబాబ్వే టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, స్యామ్ కుక్, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్. చదవండి: Shubman Gill: అంపైర్తో గొడవపడి.. అభిషేక్ను కాలితో తన్ని! -
ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్.. వేవ్స్ సమ్మిట్కు ప్రత్యేక ఆహ్వానం
అంతర్జాతీయ సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్ర హీరోయిన్ జో శర్మకు మరో గౌరవం లభించింది. ఆమెకు 'వేవ్స్ సమ్మిట్ 2025' (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్గా పాల్గొనాలని గౌరవ ఆహ్వానం అందింది. కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్లో జో శర్మ పాల్గొనడం సినిమా రంగంలో ఆమె ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.కాగా.. మోటివ్ ఫర్ మర్డర్ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీతో జో శర్మ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి.కాగా.. జో శర్మకు ప్రతిష్టాత్మక వేవ్ల్ సమ్మిట్ -2025కు ఆహ్వానం రావడం ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచ సినీ రంగంలో ఎలా విస్తరిస్తున్నదనేదానికీ నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 'వేవ్స్ సమ్మిట్ 2025 ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మే 4, 2025 వరకు జరిగే ఈ సమ్మిట్లో 90కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు. -
ED: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: దక్షిణ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) కార్యాలయం ఖైసర్ ఏ హిందు భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఈ భారీ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ఆదివారం తెల్లవారు జామన ఈడీ ఆఫీస్లో ప్రమాదం జరగడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. #WATCH | Maharashtra | Firefighting continues at Kaiser-I-Hind building, which houses Mumbai's ED office in Ballard Pier.The fire broke out at around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department pic.twitter.com/YtT8QaITM8— ANI (@ANI) April 27, 2025పీటీఐ కథనం ప్రకారం.. కారింభోయ్ రోడ్డుపై ఉన్న గ్రాండ్ హోటల్ సమీపంలోని కైసర్ ఐ హింద్ అనే భవనంలో ఆదివారం ఉదయం 2:31 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ బ్రిగేడ్కు సమాచారం అందింది.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మొదట మామూలు మంటగా కనిపించినా, ఉదయం 3:30 గంటల సమయంలో మంటలు తీవ్రంగా మారడంతో దాన్ని లెవల్-2 (భారీ అగ్ని ప్రమాదం) గుర్తించారు. ఇక ఈ భవనంలోని నాలుగు,ఐదు అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. ఘటన స్థలానికి 12 ఫైరింజన్లు, ఆరు జంబో వాటర్ ట్యాంకర్లు, ఒక ఎరియల్ వాటర్ టవర్ టెండర్, ఒక బ్రెతింగ్ అపారాటస్ వాన్, రెస్క్యూ వాన్, క్విక్ రెస్పాన్స్ వాహనం, అలాగే అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు. -
IPL: MATCH FIX అడ్డంగా దొరికిపోయిన ముంబై
-
బిచ్చగాళ్లకు ఫోన్ నంబర్ ఇచ్చి ఏటీఎం లా మారిన హీరో!
ప్రస్తుత స్టార్ హీరోల్లో ఎందరో అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చినవారే అయి ఉంటారు. కానీ అప్పటి తమ పరిస్థితులు ఇప్పటికీ గుర్తుంచుకుని అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆపన్నులను ఆదుకునే మనసున్నవాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటివారిలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్(Jackie Shroff) ముందున్నాడు. తన మానవతా సేవలతో నిరుపేదల మనసులను గెలుచుకుంటున్నాడు. ఇటీవల, జాకీ ష్రాఫ్ తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ, ముంబైలోని చవల్లో 33 సంవత్సరాలు గడిపిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఏడు భవనాలకు మూడే బాత్రూమ్స్ ఉన్న ఓ కాంప్లెక్స్లోని ఒకటే గదిలో తమ కుటుంబం మొత్తం నివసించిన రోజుల్ని తలచుకుంటూ...రాత్రుళ్లు ఎలకలు తమ వేళ్లనే ఆహారంగా మార్చుకునేవన్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో చదువుకోవాలనే కోరిక ఉన్నా పరిస్థితులు అనుకూలించక తన చదువు కొనసాగించలేకపోయానని చెప్పారు. అర్ధాకలితో గడిపిన రోజులు మర్చిపోలేనంటున్న ఆయన అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా వారికి నేనున్నా అంటున్నారు. ఏదో ఇంటర్వ్యూ కోసం మాత్రమే ఆయన మాట్లాడడం లేదు. ఇప్పటికే ముంబైలోని దాదాపు 100 కుటుంబాల బాగోగులు చూస్తున్నారు. అది కూడా కొన్నేళ్లుగా. అంతేకాకుండా, వీధుల్లో ఉన్న ప్రతి బిచ్చగాడికి ఆయన తన ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచారు, తద్వారా వారు అవసరమైనప్పుడు ఎంత అర్ధరాత్రయినా, అపరాత్రయినా సాయం పొందగలుగుతారు.తిండికి లేని స్థితి నుంచి వందలాది మందికి తిండి పెట్టగలిగే పరిస్థితి వరకూ సాగిన ప్రయాణంలో పల్లీలు అమ్ముకోవడంతో మొదలై ఎన్నో చిరుద్యోగాలు, చిరు వ్యాపారాలు... అయిపోయాయి. చివరకు ఒక బస్టాండ్లో నిలబడి ఉండగా తనని గమనించిన సుభాష్ ఘయ్ కి జాకీలో తన కొత్త చిత్రంలో కధానాయకుడు కనిపించడంతో ఆయన జీవితం మారిపోయింది. హీరో పేరుతో రూపొందిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దానిని తెలుగులో నాగార్జున ఆరంగేట్రంగా కూడా రీమేక్ చేసి విక్రమ్ తీశారు.అలా బస్టాండ్ బతుకు నుంచి బాలీవుడ్ హీరోగా మారిన జాకీ ష్రాఫ్ అక్కడ నుంచి అంచలంచెలుగా టాప్ స్టార్గా ఎదిగాడు. అయితే ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోలేదు. ఇపుడేదో స్థితి మంతుడయ్యాడు కాబట్టి చేయడం కాకుండా...తాను ఆర్ధికంగా లేని పరిస్థితుల నుంచే ఆయన సేవను ఒక దినచర్యగా మార్చుకున్నాడు. ప్రతీ యాచకునికీ , ఫుట్పాత్పై నివసించే ప్రతీ చిన్నారికీ తన కాంటాక్ట్నెంబర్ అందేలా ఏర్పాటు చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, సామూహిక భోజనాలు, పేద పిల్లలకు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజుల సందర్భాలలో కూడా ఆయన ఇదే విధమైన సేవా కార్యక్రమాలను చేస్తాడు. వయసు పై బడిన జాకీష్రాఫ్ ఇప్పడు తెరపై హీరో కాకపోవచ్చు కానీ వందలాది మంది మనసుల్లో ఆయన ఎప్పటికీ హీరోనే... -
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ముంబై నటి జత్వానిని ఆయన వేధించారనే అభియోగాల కింద సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటి కాదంబరి జత్వానీ(Kadambari Jatwani) కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నాడు. మరోవైపు.. పలువురు పోలీసు ఉన్నతాధికారుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని విపరీతంగా ప్రయత్నించింది. కక్ష పూరితంగా కేసులు నమోదు చేయించగా.. హైకోర్టు ఆ ఇద్దరు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీఎస్ఆర్ను కక్ష పూరితంగా అరెస్ట్ చేయించింది. -
ముంబైలో రావణుడు
ముంబైలో ల్యాండ్ అయ్యారు హీరో యశ్. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలోని రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్మణుడిగా రవి దుబే, హనుమంతుడు పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు యశ్. ఈ షెడ్యూల్లో యశ్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే జరుగుతుందని, రణ్బీర్ కపూర్ పాల్గొనరని సమాచారం. ఇక ‘రామాయణ’ తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్!.. ఇప్పుడు ఇలా..: రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)తో మ్యాచ్ సందర్భంగా.. చాలా కాలం తర్వాత హిట్మ్యాన్ బ్యాట్ ఝులిపించాడు. సొంత మైదానం వాంఖడేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 45 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.చాలా కాలం తర్వాత ఇలానాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అజేయ అర్ద శతకంతో జట్టును గెలిపించిన రోహిత్ శర్మను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నేను ఇక్కడ నిలుచోగలిగాను. ఫామ్లేమి కారణంగా ఒక్కోసారి మనపై మనకే సందేహం కలుగుతుంది. మన పంథాను మార్చుకునేలా చేస్తుంది. కానీ అలాంటపుడే సంయమనంతో ఉండాలి. లేదంటే ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. నా వరకు ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. మా ప్రణాళికల ప్రకారమే నా ఇన్నింగ్స్ కొనసాగించాను.బంతి నా ఆధీనంలోకి వచ్చినప్పుడు బౌండరీకి తరలించాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫీల్డింగ్ వేళ చివరి 2-3 ఓవర్లలో వచ్చినా.. నేరుగా బ్యాటింగ్కే దిగినా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు.నాకు దక్కిన అరుదైన గౌరవంఅదే విధంగా.. వాంఖడేలో కొత్తగా తన పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్ గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘రోహిత్ శర్మ స్టాండ్లోకి బంతిని తరలించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆ పేరును పలికినప్పుడల్లా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియడం లేదు.ఏదేమైనా ఈరోజు చివరి వరకు నిలిచి మ్యాచ్ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. నా బాధ్యత కూడా అది. సరైన సమయంలో మేము గెలుపు బాట పట్టాము. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచాం’’ అని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో చెపాక్లో చెన్నై చేతిలో ఓడిన తాజా గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ముంబై ఎనిమిదింట నాలుగు మ్యాచ్లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు రోహిత్ శర్మ.. ఏడు ఇన్నింగ్స్ ఆడి 158 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ చెన్నై స్కోర్లుటాస్: ముంబై.. తొలుత బౌలింగ్చెన్నై స్కోరు: 176/5 (20)ముంబై స్కోరు: 177/1 (15.4)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసిన ముంబై.చదవండి: IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి A perfect way to wrap a dominant victory and seal back-to-back home wins 💙@mipaltan sign off tonight by winning round 2⃣ against their arch rival 🥳Scorecard ▶ https://t.co/v2k7Y5tg2Q#TATAIPL | #MIvCSK pic.twitter.com/u2BDXfHpXJ— IndianPremierLeague (@IPL) April 20, 2025 -
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
భారతీయ బిలియనీర్, ముఖేష్ అంబానీ కుమార్తె, ఇషా అంబానీ పిరమల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపార మహిళలలో ఒకరు. 32 సంవత్సరాల వయస్సులో, ఆమె రిలయన్స్ రిటైల్ డైరెక్టర్గా కంపెనీని పరుగులు పెట్టిస్తోంది. 2022లో వ్యాపారవేత్తను ఆనంద్ పిరమిల్ను పెళ్లాడిన ఇషా ఆదియా ,కృష్ణలకు(కవలలు) తల్లి. రిటైల్ వారసురాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో కీలక బాధ్యతల్లో ఉన్న ఇషా గత సంవత్సరం, ఫిబ్రవరి 2024లో మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు గెల్చుకుంది. అలాగే, టైమ్ మ్యాగజైన్ టైమ్100 నెక్స్ట్ రైజింగ్ స్టార్ల జాబితాలో పేరు సంపాదించింది.ఇషా అంబానీ నివసించే విలాసవంతమైన ఇల్లు గురించి ఎపుడైనా ఆలోచించారా? ముంబై నడిబొడ్డున ఉందీ అద్భుతమైన ఇల్లు, అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన గదులు, పచ్చదనంతో నిండిన అద్భుతమైన దృశ్యాలు ఆధునిక డిజైన్ను సాంప్రదాయ అంశాల సమ్మితంగా ఉంటడంలో ఆశ్చర్యమేముంది. చక్కని వాస్తు, అద్భుతమైన ఇంటీరియర్స్, నుండి అత్యాధునిక సాంకేతికత వరకు ప్రతీ కార్నర్ అంబానీ శైలిని, గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి.డైమండ్ థీమ్డ్ ఇల్లుఇషా అంబానీ , ఆనంద్ పిరమల్ విలాసవంతమైన నివాసం అయిదు అంతస్తుల భవనం ‘గులిటా’. ఈ అతి విలాసవంతమైన ఇల్లు భారతదేశంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటైన ముంబైలోని వర్లిలో ఉంది. అరేబియా సముద్రం తీరాన, గాలి, అలల హొయల లయల మధ్క 3-D డైమండ్ థీమ్తో ఉంటుందీ అపార్ట్మెంట్. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు లగ్జరీలకు కొదువే లేదు. లండన్కు చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్చరల్ కంపెనీ ఎకర్స్లీ ఓ'కల్లఘన్ దీన్ని డిజైన్ చేసిందట. దీన్ని ఆనంద్ తల్లిదండ్రులు అజయ్ , స్వాతి పరిమల్ వివాహ బహుమతిగా ఇచ్చారట. అప్పటికి దీని విలువు దాదాపు వెయ్యి కోట్లు రూపాయలు. 2012లో హిందూస్తాన్ యూనిలీవర్ నుండి భూమిని కొనుగోలు చేసింది. దీన్ని రెన్నోవేషన్ కోసం 500 కోట్లు చెల్లించారట.ఇంటీరియర్స్ఇంద్రభవనం లాంటి ఇల్లు కళాత్మకమైన ఇంటీరియర్స్తో నిండి ఉంటుంది. ఈ ఇంటిలో11 మీటర్ల పొడవైన పైకప్పుతో అలంకరించబడిన లివింగ్ రూమ్ ,ఓపెన్ స్విమ్మింగ్ పూల్, బహుళ లివింగ్ రూములు, డైమండ్ రూమ్,మాస్టర్ బెడ్రూమ్ డబుల్-హైట్ మల్టీ-పర్పస్ లాంజ్, లాంటి అన్ని హంగులతో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు పిల్లల సౌకర్యార్థం, ఇన్-హౌస్ వైద్యులు, బట్లర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది, అనేక ఇతర ముఖ్యమైన సేవలు వంటి సౌకర్యాలు మరిన్ని ఉన్నాయి. -
అసభ్యకర ఫొటోలు పంపేవారు.. ఆ సీనియర్ క్రికెటర్ కార్లో కూర్చోమంటూ..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ బిడ్డ అనయా బంగర్ (Anaya Bangar) సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తాను ఆర్యన్ (Aryan Bangar)గా ఉన్నపుడు క్రికెటర్లతో మంచి అనుబంధం ఉండేదని.. అయితే, అనయాగా మారిన తర్వాత కొంత మంది నిజస్వరూపాలు బయటపడ్డాయంటూ విస్మయకర విషయాలు వెల్లడించింది. సీనియర్ ఆటగాడు ఒకరు తనకు అండగా మాట్లాడినట్లు నటించి.. తనతో నిద్రించాలని ఉందంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్కాగా టీమిండియా మాజీ కోచ్ అయిన సంజయ్ బంగర్- కశ్మీర దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో ఆర్యన్ పెద్దవాడు. అతడు కూడా తండ్రి బాటలోనే క్రికెటర్గా ఎదగాలనే ఆశయంతో దేశీ టోర్నీల్లో ఆడాడు. కానీ శరీర ధర్మానికి అనుగుణంగా తాను అబ్బాయిని కాదు.. అమ్మాయినని గుర్తించి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్నాడు.తద్వారా అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్.. అనయా బంగర్గా కొత్త పేరుతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అనయా యునైటెడ్ కింగ్డమ్లో జీవిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘లలన్టాప్’నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది విషపూరితమైన మగాళ్లు ఉన్నారంటూ అనయా బంగర్ సంచలన విషయాలు వెల్లడించింది.నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి‘‘నాకు అప్పుడు ఎనిమిది- తొమ్మిదేళ్ల వయసు ఉంటుంది. మా అమ్మ కబోర్డ్లోని దుస్తులు తీసుకుని వేసుకునే వాడిని. అద్దంలో చూసుకుని మురిసిపోయేవాడిని. అప్పుడే నాకు.. ‘నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి’ అనే కోరిక కలిగింది.దేశీ క్రికెట్లో నేను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి ప్రసిద్ధ క్రికెటర్లతో ఆడాను. అప్పుడు నా శరీర ధర్మం గురించి బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడిని.ఎందుకంటే.. నాన్నకు క్రికెటర్గా, టీమిండియా కోచ్గా గొప్ప పేరుంది. అందుకే నా విషయాన్ని దాచాల్సి వచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం అభద్రతాభావం, మగాళ్ల ఆధిపత్యంతో నిండిపోయింది.దుస్తుల్లేకుండా ఫొటోలు పంపేవారునా గురించి తెలిసిన తర్వాత కొంత మంది మంచి మాటలు చెబుతూ అండగా నిలబడ్డారు. మరికొందరు మాత్రం వేధించారు. అప్పుడప్పుడు దుస్తుల్లేకుండా వారి ఫొటోలు నాకు పంపించేవారు.ఓ వ్యక్తి అయితే అందరి ముందు నన్ను తిట్టేవాడు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి వ్యక్తిగత ఫొటోలు పంపమని అడిగేవాడు. ఇంకో సందర్భంలో ఓ వెటరన్ క్రికెటర్ తన బుద్ధిని బయటపెట్టాడు.పద కార్లో కూర్చో.. నీతో కలిసినా పరిస్థితి గురించి అతడికి చెప్పగానే.. ‘పద కార్లో కూర్చో.. నీతో కలిసి నిద్రించాలని నాకు ఆశగా ఉంది’ అంటూ చెత్త మాటలు మాట్లాడాడు’’ అని అనయా బంగర్ తాను ఎదర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకుంది.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్ -
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నా.. క్రమశిక్షణారాహిత్యం వల్ల అధఃపాతాళానికి పడిపోయిన క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli). శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబై బ్యాటర్ కెరీర్తో పాటు.. వ్యక్తిగత జీవితంలోనూ విఫలమయ్యాడు.చెడు వ్యసనాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ చావు అంచులదాకా వెళ్లాడు. ఇటీవలి వినోద్ కాంబ్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారగా.. 1983 వన్డే వరల్డ్కప్ విన్నింగ్ జట్టులోని దిగ్గజాలు అతడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునిల్ గావస్కర్ కాంబ్లీకి ఇచ్చిన మాటను తాజాగా నిలబెట్టుకున్నారు. తన ఫౌండేషన్ చాంప్స్ (CHAMPS) ద్వారా అతడికి ఆర్థిక సహాయం అందించేందుకు రంగం సిద్ధం చేశారు. కాంబ్లీకి జీవితాంతం నెలకు..టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. గావస్కర్కు చెందిన ‘చాంప్స్’.. కాంబ్లీ బతికి ఉన్నంత కాలం నెల నెలా రూ. 30 వేల ఆర్థిక సాయం అందించనుంది. అంతేకాదు.. వైద్య అవసరాల నిమిత్తం ఏడాదికి మరో ముప్పై వేలు అదనంగా ఇవ్వనుంది.కాగా కాంబ్లీ గురించి సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో గతంలో మాట్లాడుతూ.. ‘‘1983 విన్నింగ్ జట్టు యువ ఆటగాళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. వాళ్లు మాకు మనుమల లాంటి వాళ్లు. ఇంకొంత మంది వయసు దృష్ట్యా మాకు కుమారుల లాంటివారు.మమకారం ఉండటం సహజంఅందుకే వారి పట్ల మాకు మమకారం ఉండటం సహజం. వారి పట్ల మా ప్రేమకు సాయం అనే పదం వాడటం సరికాదు. వినోద్ కాంబ్లీని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కష్టాల్లో ఉన్న క్రికెటర్లును చూసే నవ్వే రకం కాదు మేము. మాకు తోచిన రీతిలో వారికి సహాయపడటమే మా ముందున్న కర్తవ్యం’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే తన వంతు సాయం అందించడం విశేషం.కాగా ఈ ఏడాది ఆరంభంలో అస్వస్థతకు గురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. మూత్రనాళాల ఇన్ఫెక్షన్తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని జనవరిలో డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో 1983 విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కాంబ్లీని పరామర్శించాడు. ఇక గావస్కర్ సైతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు.టీమిండియా తరఫునఇక సచిన్ టెండ్కులర్కు బాల్య మిత్రుడైన వినోద్ కాంబ్లీ.. ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 17 టెస్టులు, 104 వన్డేల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) టీమిండియా తరఫున ఆడిన కాంబ్లీ.. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు చేశాడు. అంతేకాదు.. టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్లో) వెయ్యి పరుగుల మార్కు క్రికెటర్గా ఇప్పటికీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు. కాంబ్లీకి భార్య ఆండ్రియా హెవిట్, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మద్యం, పొగ తాగటం చాన్నాళ్ల క్రితమే మానేశానంటూ కాంబ్లీ ఇటీవలే వెల్లడించాడు.చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది -
ముంబై పై హైదరాబాద్ పై చేయి... ఇండియన్ సినిమా అడ్రెస్ మారనుందా?
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఇక్కడివాడే, అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు ఇక్కడివాడే, అత్యధిక చిత్రాలు రూపొందేది ఇక్కడే...ఇలాంటి అనేకానేక విశేషాలతో ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్కి రాజధానిగా ఉన్న హైదరాబాద్... ఇప్పుడు శరవేగంగా భారతీయ సినిమాకు రాజధానిగా మారిపోతోంది. నిజానికి ముంబై చాలా కాలంగా భారతదేశ చలనచిత్ర రాజధాని అనేది తెలిసిందే, దేశంలో ఏ భాషా చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులైనా, దర్శకులైనా, సాంకేతిక నిపుణులైనా తమ కెరీర్లో కనీసం ఒక్కసారైనా హిందీ సినిమా చేయాలని కలలు కంటారు. అలా చేయడం అంటే తమకు ప్రమోషన్ వచ్చినట్టుగా భావిస్తారు. ఒకప్పుడు దక్షిణాది సూపర్స్టార్లు అనేక మంది హిందీ సినిమాల ద్వారా బాలీవుడ్పై తమదైన ముద్ర వేయాలని విఫలయత్నం చేసినవారే.ఆ ఆధిపత్యం ఇక గతం...?అయితే ఇండియన్ మూవీపై ముంబై ముద్ర ఇక గతంగా మారనుందా? ఇప్పటిదాకా ముంబై కేంద్రంగా సాగుతున్న భారతీయ సినిమా పరిశ్రమ క్రమంగా హైదరాబాద్ తన స్థానాన్ని ఆక్రమించడంతో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.గతంలో, బాలీవుడ్ అవకాశాల కోసం చాలా మంది తెలుగు తమిళ నటీనటులు ముంబైకి తరచుగా వచ్చేవారు. అంతేకాదు బాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు అంటే దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉండేది. అక్కడి చిన్నా చితకా నటీనటులు కూడా హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాల్లో నటించాలంటే డబుల్, త్రిబుల్ ఫీజులు డిమాండ్ చేసేవారు. అయినా వాళ్లనే తెచ్చుకుని నిర్మాతలు గొప్పలు చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ అయింది.ఛలో హైదరాబాద్...అంటున్న దర్శక నిర్మాతలుతెలుగులో రూపొందిన పాన్–ఇండియా చిత్రాల వెల్లువ పరిశ్రమను పునర్నిర్మించింది, హిందీ సినిమాను చాలా పెద్ద మార్కెట్లో ఓ చిన్న భాగం గా మార్చేసింది. రాజమౌళి బాహుబలి సిరీస్ నుంచి, మనవాళ్లు పాన్–ఇండియా చిత్రాల వైపు మళ్లడం మరింత పెరిగింది. అకస్మాత్తుగా ఊపందుకున్న ఈ ట్రెండ్తో ఉక్కిరి బిక్కిరవుతున్న ముంబై చిత్రనిర్మాత దర్శకులు ఆ స్థాయి చిత్రాల కోసం దక్షిణ భారత పరిశ్రమపై, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముంబై నుంచి దర్శక నిర్మాతలు ఇక్కడి నటీనటుల కాల్షీట్స్ కోసం ప్రయత్నించే క్రమంలో హైదరాబాద్ వస్తున్నారు.ముంబైకి చెందిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు కూడా తెలుగు సినిమా నిర్మాతలతో ప్రాజెక్ట్ల గురించి చర్చించేందుకు హైదరాబాద్కు ఛలో అంటున్నారు.నటీనటులు సైతం అదే బాట...ముంబైకి చెందిన చాలా మంది నటులు నటీమణులు క్రమం తప్పకుండా హైదరాబాద్కు వస్తున్నారు, నిర్మాతలు దర్శకులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా యానిమల్ సినిమా ద్వారా బాబీ డియోల్కి అందించిన బాక్సాఫీస్ హిట్ లాగే పాన్–ఇండియా చలనచిత్రాలు తమ కెరీర్ పునరుజ్జీవనాన్ని అందిస్తాయని ఆశిస్తూ బాలీవుడ్లోని అగ్రశ్రేణి నటీనటులు కూడా హైదరాబాద్కు చెందిన చిత్ర నిర్మాత దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు.తిరిగొస్తున్న వలస ప్రముఖులుదూరపు కొండల నునుపును చూసి ముచ్చటపడిన పలువురు దర్శకులు, నటీనటులు తూచ్ అనుకుంటున్నారు. గతంలో దర్శకుడు పూరీ జగన్నాధ్, ముంబైలో స్థిరపడాలని భావించాడు. అయితే తిరిగి హైదరాబాద్కు మారాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇక్కడ అవకాశాలు బాగున్నా సరే బాలీవుడ్ ఛాన్సుల కోసం పెట్టె బేడా సర్ధుకున్న పలువురు తారలు సైతం తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ, మళయాళ చిత్రాలు సైతం భారతీయ సినిమా రంగంలో సత్తా చాటుతున్నాయి. ఇలా మొత్తంగా దక్షిణాది చిత్రాలు భారీ విజయాలు నమోదు చేస్తున్న నేపధ్యంలో ఏర్పడిన పరిస్థితి హైదరాబాద్కు లాభించిందని చెప్పాలి. మిగిలిన ఏ దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమకూ హైదరాబాద్ లాంటి వైవిధ్యభరిత అవకాశాలు అందించే అత్యాధునిక నగరం లేకపోవడం కూడా మరో కారణం. ఇటీవల బాలీవుడ్ తారలు, ప్రముఖులు హైదరాబాద్లో రెస్టారెంట్లు, జిమ్స్, బొటిక్స్ తదితర వ్యాపారాలు ప్రారంభిస్తూ హైదరాబాద్కు తరచుగా రాకపోకలు సాగించేందుకు మరికొన్ని కారణాలు సృష్టించుకుంటున్నారు. ఇలాంటి వ్యాపారాల్లో టాలీవుడ్ ప్రముఖులు సైతం పార్ట్నర్స్గా మారుతున్నారు. -
సింగపూర్ ‘ట్రీ టాప్వాక్’ తరహాలో వాక్వే, క్యూ కడుతున్న పర్యాటకులు
మలబార్ హిల్ పరిసరాల్లో ఇటీవల ప్రారంభించిన ‘వాక్వే’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా రాకపోకలు సాగించి ప్రకృతి అందాలను ఆస్వాదించగా కొందరికి టెకెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరో రెండు వారాల వరకు బుకింగ్ ఫుల్ కావడంతో ఈ వాక్వే సందర్శనకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. టికెట్లు ఆన్లైన్లో తప్ప నేరుగా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల్లో 300మందికి పైగా పర్యాటకులు మలబార్ హిల్ అందాలను చూడకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఒక్క చెట్టుకూ హాని కలగకుండా.. నిర్మాణం మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యాన వనం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచి్చతంగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచి్చన పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని పంచాలన్న ఉద్దేశ్యంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సింగపూర్లోని ‘ట్రీ టాప్ వాక్’తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిరి్మంచింది. ఇలాంటి మార్గాన్ని ముంబైలోని ఉద్యానవనంలో నిర్మించడం ఇదే ప్రథమం. అందుకు బీఎంసీ దాదాపు రూ.30 కోట్లకుపైనే ఖర్చు చేసింది. వందలాది చెట్ల మధ్యనుంచి ఈ మార్గాన్ని నిర్మించినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు. రూ.25తో మానసికోల్లాసం.. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. ఒక్కొక్కరూ రూ.25 చెల్లించి చెట్ల మధ్యలోంచి ఈ మార్గం మీదుగా వెళుతూ ఉద్యాన వనంలో ఉన్న వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అదేవిధంగా కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చరి్నరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్ ¯ð నెక్లెస్ (మెరైన్ డ్రైవ్)లను తిలకించవచ్చు. దీంతో శని, ఆదివారాల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ చోటుచేసుకుంటోంది. ‘ఆన్లైన్’మాత్రమే ఎందుకు? అయితే సందర్శకులు ఆఫ్లైన్లో టికెట్లు లభించకపోవడంపై ఇక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంచడంపై నిలదీస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, చదువుకోని వారు ఆన్లైన్లో టికెట్లు ఎలా పొందగలరని ప్రశి్నస్తున్నారు. నేరుగా టికెట్లు కొనే వీలు లేక చాలా దూరం నుంచి వచి్చన పర్యాటకులు వెనుదిరుగుతున్నారని, ఇలాంటి వారికోసం ఆఫ్లైన్లో కొన్ని టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. పర్యాటకుల క్షేమంకోసమే.. ఈ వాక్వేపై మొబైల్లో ఫొటోలకు అనుమతి లేదు. దీని వల్ల ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ నిబంధనను అతిక్రమించి ఎలివేటెడ్ మార్గంపై నిలబడి వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. రీల్స్ పేరుతో ప్రాణాంతక స్టంట్లు చేస్తున్నారు. ఈ కారణంగా రద్దీ ఏర్పడి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఇందువల్లే మొబైల్ ఫోన్లకు అనుమతించడం లేదని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎంసీ సిబ్బంది తెలిపారు. View this post on Instagram A post shared by MANISH DEO | Travel Photographer (@deomanish) -
ముంబై టూ దుబాయ్.. రెండు గంటల్లో ప్రయాణం!
ముంబై నుంచి దుబాయ్ వెళ్లాలంటే ఎలా వెళ్తారు అంటే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు. విమానం ఎక్కి వెళ్లాల్సిందేనని అంటారు. సరే.. విమానంలో వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది. అంతర్జాతీయ విమానాలకు దాదాపు 3-4 గంట సమయం పడుతుంది. అయితే, మరింత తక్కువ సమయంలో ముంబై నుంచి 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే చేరుకును ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండర్ వాటర్ హై స్పీడ్ రైలు కోసం ఓ ప్రాజెక్ట్ సిద్ధం అవుతోంది.వివరాల ప్రకారం.. మన దేశం నుంచి దుబాయ్ వెళ్లే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందరూ విమానంలోనే వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో సమయాన్ని ఆదా చేసేందుకు ముంబై-దుబాయ్ మధ్య నడిచే హై స్పీడ్ ట్రైన్ కోసం ఓ ప్రాజెక్ట్ సిద్ధం అవుతోంది. UAE నేషనల్ అడ్వైజర్ బ్యూరో ప్రణాళిక ప్రకారం.. దుబాయ్-ముంబై మధ్య నీటి అడుగున రైలు మార్గం అనుసంధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గిస్తుంది.గంటకు 1000 కిలోమీటర్ల ప్రయాణం!ఈ హైస్పీడ్ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లైతే.. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్ను రెండు గంటల్లో చేరుతుంది. ఇక, ఈ రైలు నీటి అడుగున, అంటే అరేబియా సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తుంది. అండర్ వాటర్ రైల్ నెట్వర్క్ ద్వారా ప్రయాణీకులు మొత్తం ప్రయాణంలో నీటి అడుగున ప్రపంచంలోని ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు.ദുബായിൽ ഇന്ത്യയിൽ നിന്നും 2 മണിക്കൂർ കൊണ്ട് എത്താൻ വരുന്നു അണ്ടർവാട്ടർ ട്രെയിൻ പദ്ധതി#underwatertrain #dubai #ZeeMalayalamNews pic.twitter.com/UT5K13axxu— Zee Malayalam News (@ZeeMalayalam) April 12, 2025అయితే, వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కొత్తదేమీ కాదు, ముంబై నుంచి దుబాయ్ వరకు అండర్ వాటర్ రైలు ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు. దానికి అవసరమైన ఆమోదాలు పొందలేదు. ప్రస్తుతం, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వివిధ ఆమోదాలు, ఆర్థిక పెట్టుబడులపై ఈ ప్రాజెక్టు వేగం ఆధారపడి ఉంటుంది. అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, ఈ రైలు 2030 నాటికి పరుగులు తీయవచ్చు. మరోవైపు, ఇది భారత్- యూఏఈ మధ్య ముడి చమురు, వస్తువుల రవాణాను మరింత సులభంగా మారుస్తుంది. ఈ ప్రతిపాదిత రైలు నెట్వర్క్ విమాన ప్రయాణికులకు మరొక ఆప్షన్ను అందిస్తుంది. విమాన ప్రయాణాల్లో రద్దీని కూడా తగ్గించే అవకాశం ఉంది.#UnderwaterTrain is being mulled by 2030Between #Mumbai and #Dubai Distance 2000 kmphSpeed will be 600-1000 kmph Time 2 hours Will boost trade between #India and #UAE pic.twitter.com/645yviCP2J— Mathew Thomas (@OMRcat) April 8, 2025 -
రాణాకు వీఐపీ ట్రీట్మెంట్.. బిర్యానీలతో మేపొద్దు
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి,లష్కరే తోయిబా ఉగ్రవాది తహవుర్ రాణా (Tahawwur Hussain Rana) భారత్కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తహవుర్ రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండయ్యింది. ఈ తరుణంలో రాణాకు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అంటే ప్రత్యేక సెల్, బిర్యానీ వంటి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, అతన్ని ఉరితీయాలని దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.తహవూర్ రాణాను ఉరితీయాలివారిలో 2008లో ముంబై ఉగ్రవాద దాడుల నుండి అనేక మందిని ప్రాణాలు కాపాడిన స్థానిక టీసెల్లర్ ఛోటు చాయ్ వాలా అలియాస్ మహ్మద్ తౌఫిక్ సైతం ఉన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడారు. అజ్మల్ కసబ్కు ఇచ్చినట్లుగా తహవూర్ రాణాకు ప్రత్యేక సెల్ లేదా, బిర్యానీ, ఇతర సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదన్నారు#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs— ANI (@ANI) April 9, 2025‘రాణాను భారత్కు తీసుకుని రావడం శుభపరిణామం. కానీ అతనిని 15 రోజుల్లో లేదా రెండు మూడు నెలల్లో బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఉగ్రవాదులకు ఎటువంటి ప్రత్యేక వసతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అజ్మల్ కసబ్కు జైల్లో అందించిన వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇలాంటి వారిపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా. రాణాను ఉరితీసేవరకు తాను ఎదురు చూస్తాను. నాటి ఉగ్రదాడి బాధితులకు ప్రభుత్వం సహాయం అందించింది. కానీ డబ్బుతో ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేం కదా?’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తహవూర్ రాణాను భారత్కు అప్పగించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రమూకల నుంచి ప్రజల్ని కాపాడి2008 నవంబర్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సమీపంలో మహ్మద్ తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నారు.ఆ సమయంలో ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని చూసిన తౌఫిక్ అప్రమత్తమయ్యారు.వెంటనే వారిని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి తప్పించారు. అప్పటికే ముష్కరుల చేతిలో గాయపడిన బాధితుల్ని ఆస్పత్రి తరలించారు. -
26/11 టార్గెట్లో జల వాయు విహార్.. తహవ్వుర్ రాణా కీలక పాత్ర?
ముంబై: మహానగరం ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడులు(Terrorist attacks) (26/11) భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఘటనలలో ప్రధానమైనవిగా నిలుస్తాయి. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా జనం గాయపడ్డారు. లష్కర్-ఏ-తోయిబా అనే పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడింది.నారిమన్ హౌస్ సమీపంలోని..ఈ దాడుల లక్ష్యాలలో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్(Chhatrapati Shivaji Terminus) (సీఎస్టీ), నారిమన్ హౌస్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఎన్డీటీవీ పేర్కొన్న ఒక కథనం ప్రకారం ముంబైలోని జల వాయు విహార్ పేరిట ఉన్న సైనిక కాలనీ కూడా ఉగ్రవాదుల లక్ష్యంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రాంతం ముంబైలోని కోలాబాలో ఉంది. ఇక్కడ నావికా దళ సిబ్బంది, వారి కుటుంబాలు ఉంటాయి. ఈ ప్రాంతం దాడి జరిగిన నారిమన్ హౌస్(Nariman House) సమీపంలో ఉంది. డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే ఉగ్రవాది ఈ దాడులకు ముందు అత్యంత రహస్యంగా ముంబైలో వారి లక్ష్యాలను పరిశీలించాడు. హెడ్లీ బృందం జల వాయు విహార్ను కూడా లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కాలనీలో సైనిక అధికారులు ఉండటం వల్ల దీనిపై ఉగ్రవాదులు దాడులు చేయాలనుకున్నారు. అయితే, చివరి నిమిషంలో వారి ప్రణాళికలు మారి, ఇతర ప్రదేశాలలో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో తహవ్వుర్ రాణా కీలక పాత్ర పోషించాడని ఆ కథనం బెబుతోంది.డేవిడ్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడుతహవ్వుర్ రాణా(Tahawwur Rana) పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ పౌరుడు. తొలుత పాకిస్తాన్ సైన్యంలో వైద్యునిగా పనిచేసిన రాణా ఆ తర్వాత అమెరికాలోని చికాగోలో స్థిరపడ్డాడు. అక్కడ అతను ఇమ్మిగ్రేషన్ సర్వీస్ సెంటర్ను నడిపాడు. రాణా.. డేవిడ్ హెడ్లీకి అత్యంత సన్నిహితుడు. ఈ దాడుల్లో కీలక సహాయకునిగా వ్యవహరించాడు. హెడ్లీ అసలు పేరు దావూద్ సయ్యద్ గిలానీ, అతను పాకిస్థానీ-అమెరికన్ ఉగ్రవాది. రాణా ఈ దాడులకు సంబంధించిన లాజిస్టిక్ సహాయం అందించాడనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాణా స్వమంగా హెడ్లీకి ఆర్థిక సహాయం, ప్రయాణ ఏర్పాట్లు చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరోపిస్తోంది.భారత న్యాయస్థానం ముందుకు..తహవ్వుర్ రాణా లష్కర్-ఏ-తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నాడని, ఈ దాడులకు సంబంధించిన ప్రణాళికలో పాల్గొన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 2009లో అమెరికాలోని చికాగోలో రాణాను ఎఫ్బీఐ అరెస్టు చేసింది. అతనిపై ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణలతో పాటు, డెన్మార్క్లోని ఒక వార్తాపత్రికపై దాడికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. 2011లో అమెరికన్ కోర్టు(American court) రాణాను లష్కర్-ఏ-తోయిబాకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. కానీ ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. అయితే హెడ్లీ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా భారత్ రాణాను ఈ దాడుల్లో భాగస్వామిగా గుర్తించింది. 2025 ఏప్రిల్లో రాణాను భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. దీంతో తహవ్వుర్ రాణా ఇప్పుడు భారత న్యాయస్థానంలో విచారణ ఎదుర్కోనున్నాడు.ఇది కూడా చదవండి: వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది? -
80 ఏళ్ల సేవలకు గుడ్బై : ‘నీరు లేక - ట్యాంకరూ లేక బతికేదెలా?
నీటి కొరతతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న ముంబై వాసులకు మరో దెబ్బ తగలబోతోంది. రేపట్నుంచి (ఏప్రిల్ 10) ముంబైలో నీటి ట్యాంకర్ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ముంబై వాటర్ ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నిబంధన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ పేర్కొంది. 80 ఏళ్ల సేవలకు అందుకే గుడ్బై.... సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నిబంధనల ప్రకారం బోర్వెల్ యజమానులు ఎన్ఓసీ పొందాల్సి ఉంటుందని అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 381 ఎ నోటీసులు జారీ కావడంతో అనుమతి లేకుండా నీటి సరఫరా కొనసాగించలేమని ముంబై వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధి అంకుర్ వర్మ చెప్పారు. అందుకే ట్యాంకర్ల సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘నీరు లేక – ట్యాంకరూ లేక బతికేదెలా? ప్రస్తుతం ముంబైకి నీటిని సరఫరా చేసే ఏడు రిజర్వాయర్లలో కేవలం 33.57 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఇప్పటికే కొలాబా, ఘాట్కోపర్, ములుంద్, వర్లీ, బోరివలి, అంధేరి తదితర ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల తాగునీటికి బదులు బోర్వెల్ నీరు, మురకినీటిని సరఫరా చేస్తున్నారు. ఇది పౌరుల ఆరోగ్యానికి ముప్పుగా మారింది.