mumbai
-
ది బార్కరీ బుక్ : పెట్స్ కోసం ఒక బేకరీ, ఒక పుస్తకం!
ఇంట్లో పెంచుకునే కుక్కలను చాలా మంది పెంపుడు జంతువుల్లాగ కాకుండా కుటుంబ సభ్యులతో సమానంగా ట్రీట్ చేస్తుంటారు. అయితే, వాటికి ఆహారం అందించే విషయంలో ఇప్పటికీ చాలా మంది యజమానులు గందరగోళానికి గురవుతుంటారు. మార్కెట్లో దొరికే ప్యాక్ చేసిన తినుబండారాలు మంచివో కాదో తెలియక ఆందోళన చెందుతుంటారు. అందుకే ఈ సమస్యకు ఓ అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టారు వ్యాపారవేత్త గార్గి ప్రేహర్. వాటికోసం ఒక బార్కరీ (బేకరీ)ని స్థాపించారు. అంతేకాదు వంటగదిలో లభించే పదార్థాలతో వాటికి సురక్షిత ఆహారం ఎలా అందించాలి అనే అంశాలపై ‘ది బార్కరీ’ (The BARKERY BOOK) అనే పేరుతో బుక్ను కూడా రాశారు. గార్గి ప్రేహర్ ( Gaargi Prehar) ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్తపారిస్లో ఎంబీఏ పూర్తిచేసింది. భారతదేశానికి తిరిగి రావడానికి ముందు ఆమె పలు దేశాల్లో ఉన్నతస్థాయిలో పనిచేసింది. అంతలోనే ఆమెకు వచ్చిన ఆలోచన ఆమె జీవితాన్నే మలుపు తిరిగేలా చేసింది. పెంపుడు జంతువుల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్, గ్లూటెన్–ఫ్రీ కేకులు, తీపి పదార్థాలను తయారు చేయడం ప్రారంభించింది. ఇదీ చదవండి: పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా?పప్–లార్డ్స్ బార్కరీ2019లో ముంబైలో పప్–లార్డ్స్ బార్కరీ అనే తన పాటిస్సేరీని ఆమె స్థాపించారు. ప్రతి వేడుకలోనూ మూగజీవాలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఆమె దీన్ని ప్రారంభించారు. ఇక్కడ పెంపుడు జంతువులకు సురక్షితమైనవి మాత్రమే కాకుండా, వాటి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తయారు చేస్తారు. వాటిల్లో కేకులు, స్నాక్స్, బేక్ చేసిన కుక్కీలు, సేవరి జెర్కీలు అన్నీ లభిస్తాయి. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేయగల బీర్, వైన్, గ్లూటెన్–ఫ్రీ జైలిటోల్–ఫ్రీ వంటి ప్రత్యేకమైన వంటకాలు కూడా ఈ బేకరీలో తయారు చేస్తారు. ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఈ బేకరీ నుంచి కేకులను తీసుకువెళ్తుంటారు. ది బార్కరీ బుక్పెంపుడు జంతువులకు అందించే ఆహారం తయారీపై ఆమె ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అదే ‘ది బార్కరీ బుక్’. వంటగదిలో ప్రతిరోజూ లభించే పదార్థాలతో పెంపుడు జంతువుల కోసం పోషకమైన ఆహారాన్ని ఎలా తయారు చేయాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది. మనుషులు తినే ఏ ఆహార పదార్థాలు కుక్కలకు హాని చేస్తాయి? వాటికి ప్రత్యామ్నాయంగా ఏవి వాడాలి? అనే విషయాలను గార్గి ఇందులో స్పష్టంగా వివరించింది. భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారం కోసం రూ΄÷ందించిన మొదటి పుస్తకం ఈ ది బార్కరీ బుక్.ఇదీ చదవండి: రూ. 2 వేల నుంచి కోటి టర్నోవర్ దాకా : హోంమేకర్ సక్సెస్ స్టోరీభారతదేశపు మొదటి డాగ్ కుక్బుక్ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాగ్ లవర్స్కు పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ పుస్తకం ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. అలాగే విజయం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, సమాజంలో మనం తీసుకువచ్చే ఒక మార్పు. ఎవరినీ కించపరచకుండా, నొప్పించకుండా సున్నితంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. అదే నేను చేశాను. సాధించాను. అదే నా గెలుపు. – గార్గి ప్రేహర్ ఇదీ చదవండి : షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
ఆ నలుగురు పుచ్చకాయ తిని చనిపోలేదు!
ముంబై కుటుంబం మృతి కేసులో ట్విస్ట్ చేసుకుంది. ఆ నలుగురు పాడైపోయిన పుచ్చకాయ తినడం ద్వారా చనిపోలేదని నిర్ధారణ అయ్యింది. అయితే వాళ్ల శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ మాత్రం రంగు మారినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మిస్టరీ కేసు విచారణ మరో మలుపు తిరిగినట్లైంది. గత వారం ఆ కుటుంబం మటాన్ పులావ్ తిని.. ఆపై పుచ్చకాయ తిని తీవ్ర అస్వస్థకు లోనైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఒక్కొక్కరుగా చనిపోయారు. అయితే వాళ్లలో ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయన్న వైద్యుల ప్రకటనతో కలకలం రేగింది. పులావ్ తిన్న మిగతా వాళ్లకు ఏం కాకపోవడంతో.. అందరి దృష్టి పుచ్చకాయ వైపునకు మళ్లింది. బహుశా.. కలుషితమైన పుచ్చకాయ తిని వాళ్లంతా మరణించి ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. సమ్మర్లో చాలా మంది తినే పుచ్చకాయ ఇంత పని చేసిందా? అనే చర్చ నడిచింది. వాటర్మిలన్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇది మహారాష్ట్రలో పుచ్చకాయల సేల్ పడిపోవడానికి ఒక కారణం అయ్యింది కూడా. అయితే.. తాజాగా ఈ కేసు ఫోరెన్సిక్ నివేదిక బయటకు వచ్చింది. అందులో పుచ్చకాయలో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లేవని తేలింది. అలాగని ఇది సాధారణ ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆ నలుగురిలో గుండె, లివర్, బ్రెయిన్, పేగులు ఆకుపచ్చరంగులోకి మారిపోయి ఉన్నాయి. దీంతో వాళ్లపై విష ప్రయోగం ఏదైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అబ్దుల్లా శరీరంలో మోర్ఫిన్ అనే శక్తివంతమైన పెయిన్కిల్లర్ ఆనవాలు లభ్యమైంది. ఇది సాధారణంగా వైద్యులు చెబితేనే వాడాలి. దీంతో ఈ అంశంపైనా అధికారులు ఇప్పుడు దృష్టిసారించారు. పోస్ట్మార్టం అనంతరం.. ఆ అవయవాలను పరీక్షల(కెమికల్) కోసం పంపారు. ఫలితాలు వచ్చాకే ఏది అనేదానిపై ఓ క్లారిటీ రానుంది. మొబైల్ రిపేర్ షాప్ నడిపించే అబ్దుల్లా డొకాదియా.. అతని భార్య, ఇద్దరు పిల్లలు. గత శనివారం రాత్రి ఇంట్లో దావత్ చేశారు. మరో ఐదుగురు బంధువుల్ని పిలిచి మటావ్ పులావ్ పెట్టారు. వాళ్లు వెళ్లిపోయాక అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5గం. టైంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలో అంతా ప్రాణాలు కోల్పోయారు. పుచ్చకాయ ఆందోళనలపై.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ నాలుగు మరణాలకు పుచ్చకాయకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. అయితే పుచ్చకాయ కలుషితం కాకపోతే గనుక ఎవరైనా విషాన్ని ఇంజెక్ట్ చేసి ఉంటారా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. ఇదీ చదవండి: పుచ్చకాయ.. ఆ టైంలో తింటేనే సూపర్! -
బిర్యానీ తిన్నాక, పుచ్చకాయ తినడం ప్రమాదకరమా ?
-
ఈ డెలివరీ బాయ్ చాలా మంచోడు
చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్లైన్లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని అతను ఫోన్లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Divya Unny (@divyaunnyfilms) -
పుచ్చకాయ తిని నలుగురు మృతి.. అసలేం జరిగిందంటే..!
-
బిర్యానీ, పుచ్చకాయ తినే ఆ కుటుంబం చనిపోయిందా?
ముంబై: ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత. ఇది అత్యంత దురదృష్టకర ఘటన. విరోచనాలు, వాంతులతో కొద్దిసేటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. శనివారం(ఏప్రిల్ 25వ తేదీ) ముంబైలోని పైధోని ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా ఫుడ్ పాయిజన్ బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ రాత్రి గం. 10.30ని.లకు వీరంతా డిన్నర్లో బిర్యానీ తిన్నారు. అనంతరం ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వారు ఇళ్లకు బయల్దేరి వెళ్లిపోయారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో(తెల్లవారితే ఆదివారం) తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఆ నలుగురికి ఆదివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందనే అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదించారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ చూసిన తర్వాత వారిని జేజే ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. వారి డాక్టర్ సూచించిన విధంగానే జేజే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లారు. వైద్య చికిత్స చేసినప్పటికీ, చిన్న కుమార్తె ఉదయం సుమారు 10:15 గంటలకు మరణించింది. ఆ రాత్రి సుమారు 10:30 గంటలకు తండ్రి కన్నుమూశారు. అటు తర్వాత తల్లి, మరొక సోదరి కూడా చికిత్స సమయంలోనే కన్నుమూశారు. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ రెండు స్పల్ప వ్యవధిలో తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా.. ? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్మార్టం తర్వాతే వారి మరణానికి కారణం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా జేజే మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు అబ్దుల్లా దొకాడియా(40), నస్రీన్ దొకాడియా(35), ఐషా(16), జైనబ్(13)లుగా పోలీసులు తెలిపారు. -
IPL 2026: ముంబై ఆటగాడికి ఊహించని అదృష్టం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ గాయాల సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో, చెన్నై యాజమాన్యం ముంబైకి చెందిన యువ ఆల్రౌండర్ ఆయుశ్ వర్తక్ను మిడ్-సీజన్ ట్రయల్స్కు పిలిచింది.ఈ సీజన్లో చెన్నై పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కెప్టెన్ రుతురాజ్ నాయకత్వంలో ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు పరాజయాలు చవిచూసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నప్పటికీ, గాయాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి.లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని కాల్ఫ్ స్ట్రెయిన్ కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఆయుశ్ మాత్రే, ఖలీల్ అహ్మద్ గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు.ఈ నేపథ్యంలో ముంబై, పార్సీ జింఖానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయుష్ వర్తక్ను చెన్నై ట్రయల్స్కు పిలిచింది. అతడు త్వరలోనే చెన్నై జట్టుతో కలవనున్నాడు.21 ఏళ్ల అయుష్ వర్తక్ దేశీయ క్రికెట్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. కుడిచేతి మీడియం పేసర్గా, దిగువ వరుసలో వేగంగా పరుగులు చేసే బ్యాటర్గా మంచి పేరు సంపాదించాడు.నవి ముంబై టీ20 లీగ్లో అతడు 264 పరుగులు చేసి, 191 స్ట్రైక్రేట్ నమోదు చేశాడు. అదనంగా మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఇప్పటికే ఆకాశ్ మధ్వాల్ను అయుష్ మాత్రే స్థానంలో జట్టులోకి తీసుకున్న చెన్నై, ఖలీల్ అహ్మద్కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంది. ఆ లోటును వర్తక్ భర్తీ చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం చెన్నై జట్టులో డెవాల్డ్ బ్రెవిస్, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ప్రతి మ్యాచ్ను గెలవాల్సిందే. ఈ క్లిష్ట సమయంలో అయుష్ వర్తక్ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
ఆస్తి అమ్మేసిన HDFC బ్యాంక్ మాజీ చీఫ్ ఫ్యామిలీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ ఎండీ ఆదిత్య పూరి కుటుంబ సభ్యులు ముంబైలోని తమ లగ్జరీ అపార్ట్మెంట్ను భారీ ధరకు విక్రయించారు. ఆదిత్య పూరి భార్య అనితా పూరి, కుమార్తె అమృతా పూరి కలిసి వర్లీ ప్రాంతంలోని తమ నివాసాన్ని రూ. 27 కోట్లకు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది. ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ బ్యాంకర్ ఆదిత్య పూరి కుటుంబం చేసిన భారీ ఆస్తి విక్రయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.లాభదాయకమైన విక్రయంఈ అపార్ట్మెంట్ను అనితా పూరి కుటుంబం మార్చి 2017లో రూ. 19.81 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా జరిగిన విక్రయం ద్వారా వారికి దాదాపు రూ. 7 కోట్లకు పైగా లాభం చేకూరింది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన 'ఓంకార్ 1973' భవనంలోని ఎత్తైన అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. దీనిని సురేమ్య నెవాటియా, అక్షడా నెవాటియాలు కొనుగోలు చేశారు.మార్చి 24, 2026న ఈ లావాదేవీ అధికారికంగా నమోదైంది. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు రూ. 1.62 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించారు. ఈ అపార్ట్మెంట్తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా కొనుగోలుదారులు పొందారు.అయితే, ఈ విక్రయంపై పూరి కుటుంబం గానీ, కొనుగోలుదారులు గానీ ఇంతవరకు స్పందించలేదు.ఓంకార్ 1973 ప్రత్యేకతముంబైలోని వర్లీలో ఉన్న 'ఓంకార్ 1973' ఒక ఐకానిక్ ఆకాశహర్మ్యం. ఓంకార్ రియల్టర్స్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్, అరేబియా సముద్రం వ్యూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అల్ట్రా-ప్రీమియం జీవనశైలిని అందిస్తుంది. నగరంలోని అత్యంత ఖరీదైన చిరునామాలలో ఇది ఒకటి.అనితా పూరి, అమృతా పూరి గతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టారు. నవంబర్ 2020లో వారు ముంబైలోని మలబార్ హిల్స్లో రూ. 50 కోట్ల విలువైన మరో లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. లోధా సీమాంట్ ప్రాజెక్టులోని 19వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్కు ఏడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అప్పట్లో ఆ లావాదేవీకి రూ. 1 కోటి స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు వార్తాలు వచ్చాయి.ఇదీ చదవండి: బెంగళూరులో ఇంటి ఓనర్స్ అయిపోయాం.. -
అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్ట్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను వేధించిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం సైబర్ నేరాల గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన కుటుంబంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగహన సదస్సులో పాల్గొన్న అక్షయ్ తన కుమార్తె ఎదుర్కొన్న ఒక అంశాన్ని ప్రపంచానికి తెలిపారు.ఏం జరిగిందంటే..?13 ఏళ్ల తన కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గతంలో మీడియాతో ఆయన పంచుకున్నారు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని ఆయన ఇలా తెలిపారు. 'నా కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఆవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మంచివాడిగానే మొదట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే మీరు మేల్, ఫీమేల్నా అంటూ జెండర్ గురించి మెసేజ్ చేశాడు. ఆమె పేరు చెప్పగానే అతను ఇంకో మెసేజ్ పంపాడు. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూనే కాస్త బెదిరించేలా మెసేజ్ చేశాడు. ఆ సమయంలో వెంటనే నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ధైర్యంగా వెళ్లి నా భార్యతో చెప్పింది. ' అని గుర్తుచేసుకున్నారు.అక్షయ్ కుమార్తె నిటారపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు లోనై చాలామంది పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు. తల్లిదండ్రులకు చెబితే ఏమంటారోనని సంకోచిస్తారు. కానీ, అక్షయ్ కుమార్తె తను ఎదుర్కొన్న వేధింపుల గురించి తల్లితో పంచుకుని మంచిపని చేసిందని సోషల్మీడియాలో చాలామంది కొనియాడారు. ఆమె ధైర్యానికి ఫిదా అయ్యారు. -
దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!
ముంబైలోని జుహు తారా రోడ్డులో.. సముద్రానికి ఎదురుగా ఉన్న లీలా బంగ్లా రూ. 221 కోట్లకు అమ్ముడైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బంగ్లా ఆర్ట్ డెకో నిర్మాణం, గ్రేడ్ IIB వారసత్వ హోదాను కలిగి ఉంది. దీనిని అమ్మకానికి పెట్టిన తరువాత చాలామంది డెవలపర్లు, వ్యాపారవేత్తలను ఆకట్టుకుంది.నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన గౌతమ్ నానావతికి చెందిన లీలా బంగ్లాను నోటండాస్ జ్యువెలర్స్ గ్రూప్లో భాగమైన నోటండాస్ రియల్టీ రూ.221 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత బుధవారం ఈ లావాదేవీ అధికారికంగా ఖరారైందని సమాచారం.నోటండాస్ రియల్టీ సంస్థకు చెందిన మహేష్ జగ్వాని, హర్ష్ జగ్వాని అనే తండ్రి-కొడుకు ఈ డీల్ను పూర్తి చేశారు. వీరు నోటండాస్ జ్యువెలర్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనిని 1983లో కిషిన్ జగ్వానీ స్థాపించారు. ఇది బాంద్రాలోని వాటర్ఫీల్డ్ రోడ్ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.చదరపు అడుగుకు రూ. 2,60,5921,355 చదరపు మీటర్ల స్థలంలో ఉన్న లీలా బంగ్లా నిర్మాణ విస్తీర్ణం సుమారు 8,480 చదరపు అడుగులు. అదనంగా 2,500 చదరపు అడుగుల టెర్రస్.. 5,000 చదరపు అడుగుల తోట కూడా ఉన్నాయి. చదరపు అడుగుకు రూ. 2,60,592 ధర చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ బంగ్లాలో 1950ల కాలానికి చెందిన బర్మా టేకు చెక్కతో తయారైన తలుపుల ఫ్రేములు, మెట్ల నిర్మాణం, అలంకరణలు ఉన్నాయి. ఈ భవనం ఆర్ట్ డెకో శైలిని ప్రతిబింబిస్తూ పురాతన సౌందర్యాన్ని కాపాడుకుంటోంది. సముద్రం వైపు ఉండే ఇలాంటి పెద్ద స్థలాలు జూహు ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే ఈ ఆస్తికి వ్యాపారవేత్తలు, డెవలపర్లు ఎంతో ఆసక్తి చూపారు.కేవలం మరమ్మతులు మాత్రమే..అయితే.. గ్రేడ్ IIB హెరిటేజ్ హోదా ఉండటం వల్ల ఈ భవనాన్ని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మించలేరు. కేవలం మరమ్మతులు, విస్తరణలు మాత్రమే చేయవచ్చు. అవి కూడా అసలు నిర్మాణ శైలిని కాపాడే విధంగా ఉండాలి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఈ ఆస్తి ప్రాముఖ్యత తగ్గలేదు.ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఈ లావాదేవీని నిర్వహించిందని నివేదిక పేర్కొంది, అయితే ఈ విషయంపై సంప్రదించినప్పుడు ఆ సంస్థ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఈ బంగ్లాను మొదట 2022లో రూ. 210-220 కోట్ల అంచనా ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ధరను రూ. 250 కోట్లకు పెంచారు. చివరికి రూ.221 కోట్లకు అమ్ముడైంది.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు! -
ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. మంత్రికే షాకిచ్చిన మహిళ
ముంబై: నగరంలో ఓ మహిళ.. ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసిన ఘటన సంచలనం రేపింది. వర్లీ ప్రాంతంలో రాజకీయ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ మహిళా.. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్, స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. వర్లీలోని జంబోరి మైదాన్ నుండి డోమ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తన బిడ్డను స్కూలు నుండి తీసుకురావడానికి కారులో వెళ్తున్న ఒక స్థానిక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన వాహనం దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి మహాజన్తో వాగ్వాదానికి దిగారు. రాజకీయ ర్యాలీల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యంపై ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అంటూ ప్రదర్శనకారులపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.Mumbai woman, who taught Maharashtra minister Girish Mahajan a lesson in civics sense, also lashed out at a cop who tried to shut her down. In reply, a chilling "Shut up" reverberated. https://t.co/fHwlntCQoJ pic.twitter.com/Dr4ZXX8YJl— Piyush Rai (@Benarasiyaa) April 22, 2026సమీపంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. అక్కడ ఖాళీ మైదానం ఉంది కదా! అంటూ మంత్రిపై ఆ మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె ముంబై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వాగ్వాదం తర్వాత, పోలీసులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆమె సమస్యను వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
షటప్.. నోర్ముయ్.. మంత్రిపై మండిపడ్డ మహిళ
-
అల్లు అర్జున్ ముంబై హౌస్.. నెలకు ఏకంగా అన్ని లక్షలా?
తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్.. ముంబైకి షిఫ్ట్ కాబోతున్నాడనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన తండ్రి అల్లు అరవింద్.. షూటింగ్ కోసం ముంబైలో ఎక్కువగా ఉంటున్నందున అలా అనిపించి ఉండొచ్చని, అతడికి ఇక్కడే సొంతిల్లు ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. స్నేహితులందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తాడు? అక్కడ స్థిరపడాలనే ఆలోచన లేదు అని స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా)అయితే ముంబైకి బన్నీ పూర్తిగా షిఫ్ట్ కాకపోయినప్పటికీ కొన్నాళ్ల పాటు అయితే అక్కడ ఉండబోతున్నాడు. ఈ విషయం మాత్రం నిజమే. ఎందుకంటే రీసెంట్గానే ముంబైలోని జుహూ ప్రాంతంలో తార రోడ్లో ఐదు బెడ్ రూమ్ల(5 BHK) లగ్జరీ అపార్ట్మెంట్ని బన్నీ అద్దెకు తీసుకున్నాడు. ఏడాది క్రితమే ఈ డీల్ ఫిక్సయినప్పటికీ తమ అభిరుచికి తగ్గట్లు బన్నీ-స్నేహ దాని ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నారట.సముద్రానికి ఎదురుగా ఉండే ఈ అపార్ట్మెంట్కి నెలవారీ అద్దె ఏకంగా రూ.16 లక్షలు అని, ఇందులో రాబోయే మూడేళ్ల పాటు అల్లు అర్జున్ ఉండబోతున్నాడని సమాచారం. స్కూల్ సెలవులు ఇచ్చిన టైంలో భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు అయాన్, అర్హ అక్కడికి వెళ్తారు. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం అట్లీ తీస్తున్న 'రాకా' మూవీ ఉంది. దీని షూటింగ్ చాలావరకు ముంబైలోనే ఉండనుంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్తో చేయబోయే సినిమా చిత్రీకరణ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో రాబోయే మూడేళ్ల పాటు బన్నీ ముంబైలో ఉండబోతున్నాడట.(ఇదీ చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు: నటుడు వినోద్) -
ముంబైకి మకాం మార్చనున్న బన్నీ
-
ముంబైకి అల్లు అర్జున్… పుకార్ల వెనుక నిజం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయిలో సెటిల్ అవుతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంపై గత రెండు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. దీనికి కారణం, బన్నీ నిజంగానే ముంబయికి షిఫ్ట్ అవ్వడమే. కానీ ఇందులో సగం మాత్రమే నిజం అని తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్, ముంబయి మధ్య ప్రయాణం కష్టంగా ఉండటంతో, తాత్కాలికంగా ముంబయిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇదే సమయంలో బన్నీ ముంబయిలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి. కానీ నిజానికి బన్నీ ముంబయిలో ఫ్లాట్ కొనలేదు. కేవలం కొన్ని రోజుల పాటు ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్కి వస్తాడు. ఇక బన్నీ, అట్లీతో 'రాకా' సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ముంబయిలో ఉన్నది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా సెటిల్ మాత్రం అవ్వడం లేదు. -
బిడ్డ ప్రాణం కోసం కన్నీళ్లతో నిల్చున్న తల్లి.. సోనూ సూద్ సాయం (వీడియో)
కన్నబిడ్డను కాపాడుకునేందుకు ప్రతి తల్లి పోరాటమే చేస్తుంది. దాచుకున్న డబ్బంతా బిడ్డ ఆరోగ్యం కోసమే ఖర్చు చేసిన తల్లి తన బిడ్డను కాపాడాలని నటుడు సోనూసూద్ను వేడుకుంది. ఎన్నోచోట్ల ఆసుపత్రిలలో చూపించినా బతకడం కష్టమని చెప్పడంతో ఆమె తల్లడిల్లిపోయింది. సాయం కోసం సోనూ ఇంటవద్ద కన్నీళ్లతో నిల్చుంది. ఆమెను చూసిన సోనూ దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. ఆ చిన్నారికి మరో జన్మనిచ్చిన దేవుడిలా ఆ కుటుంబానికి నిలిచాడు.తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీరా అనే చిన్నారి పరిస్థితి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే స్పందించారు. ముంబైలోని జూపిటర్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో శస్త్రచికిత్స చేయించి ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని అందించారు. ఎన్నో ఆసుపత్రులను తిరిగిన నీరా తల్లి దాదాపు ఆశ వదులుకుంది. అయితే, సోనూ ముందుకు రావడం ఆపై వైద్యం కోసం సాయం చేయడంతో ఆ చిన్నారి ఊపిరిపోసుకుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోనూ ఒక పోస్ట్ చేశారు. ఎవరి జీవితంపైనా ఆశ వదులుకోవద్దు. మనం కలిసికట్టుగా నిలబడితే, ఎంతటి కఠినమైన యుద్ధాలనైనా గెలవవచ్చని ఆయన పేర్కొన్నారు. Sometimes, hope just needs someone to hold on a little longer.Little Neera’s mother had almost lost faith after hearing “no” from so many places… the risks were too high, the chances too low. But with God’s grace guiding us, and the incredible team at Jupiter Hospitals, we… pic.twitter.com/mi4BhRTK1h— sonu sood (@SonuSood) April 20, 2026 -
రూ.10 కోట్లతో అపార్ట్మెంట్ కొన్న టబు.. ప్రత్యేకతలు ఇవే!
సీనీ తారల్లో చాలా మంది తమ సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు విలాసవంతమైన భవనాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత మంచి ధర వస్తే..వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబు కూడా ముంబైలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ. 10.40 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే టబు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందంట. ఆ అపార్ట్మెంట్ సముద్ర తీరానికి సమీపంలోనే ఉండడమే కాదు.. నగరం మొత్తం అందంగా కనిపించేలా ఉంటుందట. ఆ వెంచర్లో మొత్తం 2 టవర్స్ ఉన్నాయట. ఒక్కో టవర్ 24 అంతస్తులు ఉంటుంది. మొత్తం 126 నివాసాలు ఉండగా..అందులో ఒకటి టబు కొనుగోలు చేసింది. జిమ్, స్వీమ్మింగ్ పూల్తో పాటు రెండు కార్లు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ స్తలం వచ్చిందట. ముంబైలో టబుకి ఇప్పటికే ఓ ఫ్లాట్ ఉంది. ఇది రెండోది. హైదరాబాద్లో కూడా టబుకి సొంతిల్లు ఉంది.టబు సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్ బంగ్లా’ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే విజయ్ సేతు పతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న `స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో నటిస్తోంది. -
ముంబైలో INCA అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)
-
డోంట్ వర్రీ..ప్రశాంతంగా కూర్చోండి..!
ప్రజా రవాణాలలో ఆటో, క్యాబ్లనగానే కాస్త భయం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేటప్పుడు చాలా భయం ఉంటుంది. నలుగురైదుగురు కలిసి వెళ్తుంటే ఎలాంటి భయం ఆందోళన ఉండదు. కానీ ఈ ఆటో అంకుల్ అలాంటి భయలేం వద్దు అంటూ చక్కగా తన సీటు వెనుక రాసిన సందేశం ఎంతలా ఉందంటే..బ్రో నువ్వు గ్రేట్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.అసలేం జరిగిందంటే..ఉన్నతి దేవాలియా అనే మహిళ తన ముంబైలో ఒక ఆటో రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారామె. ఆ డ్రైవర్ వెనుక సీటుపై ఉన్న సందేశం చూడగానే ప్రజా రవాణాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందని పేర్కొంది పోస్ట్లో. ఒక చిన్న సానుభూతి చర్య ఎంతగా ప్రభావితం చేస్తుందో అని చెప్పే ఘటన ఇది అని అంటోందామె. ఇంతకీ ఆ డ్రైవర్ సీటు వెనుకు ఏం ఉందంటే.."నేను కూడా ఒకరి తండ్రిని , సోదరుడిని. మీ భద్రతే నాకు ముఖ్యం. ఎలాంటి ఆందోళన లేకుండా కూర్చోండి. అలాగే ప్రతి వ్యక్తి ప్రమాదకారి కాదు. కొందరు మీకు సురక్షితమైన ఆశ్రయం ఇస్తారని గుర్తించండి." అని రాసి ఉంది. నిజంగా ఆ చిన్న పని ఆ డ్రైవర్ మంచి మనుసుని, ఉదారతను తెలియజేస్తుంది. అందరు అతడిలా ఉంటే బావుండేది కదూ..ఈ రోజు రైడ్లో వెళ్లడం నా రోజుని ఆనందమయంగా మారించి అంటూ తన పోస్ట్ని ముగించింది ఉన్నతి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం ఆడ్రైవర్ని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు.(చదవండి: 'నాన్న'గా గర్వించే క్షణం..! పిల్లల నుంచి ఆశించేది ఇదేకదా..) -
సింగర్ ఆశా భోస్లే అంతిమయాత్ర
-
ఆశా భోంస్లేకు కన్నీటి వీడ్కోలు
భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సోమవారం ముగిశాయి. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆశా భోంస్లే భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముంబైలోని లోయర్ పారెల్లోని ఆమె నివాసంలో ఉంచారు. మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిండే, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటులు ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్, వివేక్ ఒబెరాయ్, విక్కీ కౌశల్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ‘శివ సేన’ పార్టీ ఆధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వంటి వారితో పాటు పలువురు సినిమా, పొలిటికల్, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆశా భోంస్లే నివాసం నుంచి దాదర్లోని శివాజీ ΄పార్క్ శ్మశాన వాటిక వరకు భారీ జనసందోహం నడుమ ఆమె అంతిమయాత్ర కొనసాగింది. ఆశా భోంస్లేని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ‘ఆశా భోంస్లే అమర్ రహే’ అనే నినాదాలతో, అశ్రునయనాల నడుమ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. తల్లి ఆశా భోంస్లేకు కుమారుడు ఆనంద్ భోంస్లే అంత్యక్రియలు నిర్వహించారు. -
సింగర్ ఆశా భోస్లే అంతిమ యాత్ర
-
సుర లోకానికి అమర స్వరం
‘ఈనా మీనా డీకా’.. ఆమెది రాక్ ఎన్ రోల్ స్వరం. ‘పియా తూ అబ్ తో ఆజా’.. ఆమెది నర్తించే గళం. ‘ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా’.. ఆమెది యుగళ గీతం. ‘దిల్ చీజ్ క్యా హై ఆప్ మేరే జాన్ లీజియే’... ఆమెది బరువైన వేదనా జాలం. ఆశా భోంస్లే. డాన్సింగ్ వాయిస్ ఆఫ్ ఇండియా. నర్తించే గళం. 12000 పాటలు పాడి దశాబ్దాల పాటు భారతీయ శ్రోతల జీవితాల్లో హుషారును నింపి నేడు స్వరసుర లోకానికి బయలుదేరింది. దివ్య పుష్పమై దేవలోక ‘లత’కు చేరింది. బాలీవుడ్ గోల్డెన్ ఎరా ముగింపుకొచ్చింది. ఆశా భోంస్లే మరణ వార్త విని అభిమానులు చేస్తున్న వేడుకోలు– ‘అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ’....ముంబై: దశాబ్దాలుగా శ్రోతలను అలరించిన అద్భుత గాత్రం మూగబోయింది. కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించిన అసమాన స్వర ఝరి శాశ్వతంగా ఆగిపోయింది. ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల ఆశా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఛాతీలో ఇన్ఫెక్షన్తోపాటు శ్వాస సంబంధిత సమస్యతో శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారని ఆశా భోంస్లే మనవరాలు జనై భోంస్లే ప్రకటించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆశా అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోయర్ పరేల్లోని కాసా గ్రాండ్లో అభిమానులు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించవచ్చని కుమారుడు ఆనంద్ తెలిపారు. ఆశా మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. లెజెండరీ సింగర్ దూరం కావడం చిత్ర పరిశ్రమలకు, అభిమానులకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పాడిన రికార్డు ఆశా భోంస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో సంప్రదాయ మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆమె సోదరీమణుల్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్, సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ప్రోత్సాహంతో ఆశ సంగీతం నేర్చుకున్నారు. 1943లో పదేళ్ల వయసులో మరాఠీ చిత్రం ‘మజా బల్’లో తొలి గీతం ఆలపించారు. 2010 దశకం వరకూ పాడుతూనే ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటలు పాడిన సింగర్గా రికార్డుకెక్కారు. గాయనిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాలే్క, 2008లో పద్మభూషణ్, 2018లో బంగ భూషణ్, 2021లో మహారాష్ట్ర భూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. జాతీయ అవార్డులు, గౌరవాలకు లెక్కేలేదు. ఆశా భోంస్లే 1949లో 16 ఏళ్ల వయసులోనే గణపతిరావు భోంస్లేను వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు పుట్టాక వారు విడిపోయారు. అనంతరం ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ను పెళ్లాడారు. 80 ఏళ్లలో 14 భాషల్లో 12,000కు పైగా పాటలతో అభిమానులను రంజింపజేశారు. యాదోం కీ బారాత్, హమ్ దోనో, హరే రామ హరే కృష్ణ, డాన్, నమక్ హలాల్, ఉమ్రావ్ జాన్, కిస్మత్, మేరా సాయా, తీస్రీ మంజిల్, మేరా జీవన్ సాథీ తదితర చిత్రాల్లో ఆశ పాడిన పాటలు దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఆశ వంట కూడా అద్భుతంగా చేస్తారన్న పేరుంది. ‘ఆశాస్’పేరిట ఇంటర్నేషనల్ రెస్టారెంట్ చైన్ను ఏర్పాటు చేశారు. చాలా దేశాల్లో రెస్టారెంట్లు నెలకొల్పారు. భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారు: ముర్ము ఆశా భోంస్లే మరణం సంగీత ప్రపంచంలో ఒక తీరని లోటును సృష్టించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్టు చేశారు. దిగ్గజ గాయనిగా ఆశ సాగించిన అద్భుత ప్రస్థానం భారత సంగీత చరిత్రలో ఒక యుగాన్ని సృష్టించిందని కొనియాడారు. ఆమెతో వ్యక్తిగతంగా సంభాషించిన తీపి జ్ఞాపకాలు తనకున్నాయని వెల్లడించారు. మధురమైన, చిరస్థాయిగా నిలిచిపోయే స్వరంతో దశాబ్దాల పాటు భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారని ప్రశంసించారు. ఆమె సంగీతం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆశా భోంస్లే వైవిధ్యమైన స్వరం అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అన్ని రకాల పాటలు, హృద్యమైన గజల్స్, సంప్రదాయ భజనలతో ఆకట్టుకున్నారని తెలిపారు. భావి తరాలకు స్ఫూర్తి: మోదీ దిగ్గజ గాయని ఆశా భోంస్లే మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆమె పాటలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని ‘ఎక్స్’లో స్పష్టంచేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను స్పృశించిందని ఉద్ఘాటించారు. దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రఖ్యాత గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోంస్లే మరణం తనకు తీవ్ర విచారం కలిగించిందన్నారు. ఆమెతో తన సంభాషణలు మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని వెల్లడించారు. ఆశా భోంస్లే కుటుంబానికి, అభిమానులకు, సంగీత ప్రియులకు ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. భవిష్యత్ తరాలకు ఆమె ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటారని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఆశా భోంస్లే మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు. భారతీయ సంగీత రంగంలో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు. ఆమె తన విలక్షణ గాత్రం ద్వారా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారని వివరించారు. -
చెల్లెలు ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
లెజెండరి సింగర్ ఆశా భోంస్లే ఆదివారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆమె అభిమానులు తన జీవిత ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన అక్క లతా మంగేష్కర్తో ఉన్న విభేదాన్ని షేర్ చేస్తున్నారు. ఒక కుటుంబంలో రెండు గానకోకిలలు గొంతెత్తి పాటలు పాడుతుంటే సంబరిపడిపోయిన ప్రేక్షకులు వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసి ఆందోళన చెందారు.అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు నిజమేనా..?లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇద్దరూ భారతీయ సంగీతంలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. అయితే వారి మధ్య గొడవలు అన్నది కొంతవరకు నిజం, కొంతవరకు అపోహలతో కూడిన విషయమని చెబుతారు. ఆశా భోంస్లే చిన్న వయసులోనే కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో లతా మంగేష్కర్ దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. ఆపై ఇద్దరూ ఒకే రంగంలో (ప్లేబ్యాక్ సింగింగ్) ఉండటం వల్ల సహజంగానే పోటీ ఉండేది.లతా మంగేస్కర్ ఎక్కువగా ప్రధాన హీరోయిన్లకు పాటలు పాడితే.., ఆశా భోస్లే భిన్నమైన, వెరైటీ పాటలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కొంతమంది సంగీత దర్శకులు ఒక్కరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా ఇద్దరి మధ్య సమస్య వచ్చేది. అయితే, కొంతకాలం దూరం ఉన్న తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు. కుటుంబ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు గౌరవం వ్యక్తం చేశారు.1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్కా రీ బెహ్కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. కానీ, సుమారు పన్నేండేళ్ల క్రితం లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’లో ఆశా భోంస్లే ఒక పాటను పాడారు. ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్లు కలిసి 2014లో గానం చేశారు. ఆ సమయంలో తన సోదరి గురించి లతా మంగేష్కర్ ఇలా అన్నారు ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. లతా మంగేష్కర్ 2022లో కోవిడ్-19, న్యుమోనియా సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే మరణించారు. -
గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయింత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. లోక్మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. :ఆమెకు ఐసీయూ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దాని ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.సినిమా పాటలతో పాటు గజల్స్, ఖవ్వాలీ, శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగులేదని లెజెండరీ సింగర్గా నిరూపించుకున్నారు. పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశ సుమారు 800లకు పైగా చిత్రాల్లో 12 వేల పైచిలుకు పాటలు పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. -
ఇది... మన దేశంలో మొట్ట మొదటి పెట్రోల్ పంపు
ముంబైలోని హ్యూస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్ట మొదటి పెట్రోల్ పంపుకు సంబంధించి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తప్ప వీడియోలు చూసే అవకాశం చా....లా తక్కువ. అయితే ఏ.ఐ. తలచుకుంటే వీడియోలకు కొరతా! మన మొట్టమొదటి పెట్రోల్ పంప్కు సంబంధించిన ఏఐ–జనరేటెడ్ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. చేతితో నడిపే డిస్పెన్సర్ల నుండి నేటీ హై–స్పీడ్ ఫ్యుయలింగ్ స్టేషన్ల వరకు మారుతున్న కాలం, పెట్రోల్కు పెరుగుతున్న డిమాండ్, రాకెట్ వేగంతో పట్టణ వృద్ధి... ఈ అంశాలను ప్రతిబింబిస్తూ, భారతదేశపు ఆటోమోటివ్ పరిణామంలో నగరం ఎలా కేంద్రంగా నిలిచిందో చూపే వీడియో క్లిప్ ఇది. చరిత్ర, సాంకేతిక అద్భుతంతో రూపొందించిన ఈ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహా’ అంటున్నారు. ఆరోజుల్లో రోడ్లపై పెద్దగా వాహనాలు కనిపించేవి కావు. అందుకే పెట్రోల్కు డిమాండ్ అంతగా ఉండేది కాదు. ఈ వీడియో క్లిప్ ఆ కాలాన్ని కళ్లకు కడుతుంది. సూట్, టోపీ ధరించిన ఇద్దరు వ్యక్తులు కారులో రాగా, ధోతీ, ధరించిన భారతీయుడు చేతితో పనిచేసే డిస్పెన్సర్ను ఉపయోగించి కారులో పెట్రోల్ నింపుతూ కనిపిస్తాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆనాటి ప్రశాంతమైన ముంబైని ఆవిష్కరించే వీడియో క్లిప్ ఇది. -
క్రికెట్ కోచ్కు బెయిల్ నిరాకరణ
ముంబైలోని ఓ స్థానిక క్రికెట్ కోచ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో నిందితుడు గత 8 నెలలుగా జైలులో మగ్గుతున్నాడు. తాజాగా నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్కు అప్పీల్ చేయగా.. ప్రత్యేక POCSO కోర్టు నిరాకరించింది.న్యాయమూర్తి సురేఖా సిన్హా మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే, మైనర్ బాలికలపై మళ్లీ నేరం జరిగే ప్రమాదం ఉంది. నిందితుడు పరారయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. 2023లో మరో మైనర్ బాలిక కూడా ఇదే కోచ్పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు చేసినట్టు ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. కోచ్ తనపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మైనర్ బాలిక ఆరోపించింది. వైద్య ఆధారాలు, వెంటనే నమోదు చేసిన FIR ఈ కేసుకు బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. కోచ్ CCTV కెమెరాలను ధ్వంసం చేసి ఆధారాలు తొలగించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. తప్పుడు ఫిర్యాదునిందితుడి తరఫు న్యాయవాది బాలిక తప్పుడు ఫిర్యాదు చేసిందని వాదించారు. కోచ్ 2025 ఆగస్టు 5 నుంచి 8 నెలలుగా కస్టడీలో ఉన్నాడని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోని కోర్టు.. నేరం తీవ్రతను హైలైట్ చేస్తూ బెయిల్ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సరైంది కాదని తీర్పులో పేర్కొంది. -
కలిసిపోయిన స్మృతి- పలాష్ కుటుంబాలు?.. త్వరలోనే పెళ్లి?!
భారత మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది స్మృతి మంధాన. టీమిండియా ఓపెనర్గా, వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఎన్నో ఘనతలు సాధించిన ఈ ముంబైకర్ ఖాతాలో గతేడాది ప్రపంచకప్ కూడా చేరింది. సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్-2025లో భారత్ గెలవడంతో స్మృతి చిరకాల కోరిక నెరవేరింది.ఘనంగా హల్దీ, మెహందీఆ ఆనందంలోనే మెగా టోర్నీ ముగిసిన కొన్నిరోజులకే పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టేందుకు ఆమె కుటుంబం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి హల్దీ, మెహందీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.చిరకాల స్నేహితులు, భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పటేల్, రాధా యాదవ్ తదితరులు స్మృతి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. అంతా సజావుగా సాగిపోతుందనుకున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.వివాహం రద్దైనట్లు ప్రకటనలుపెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కాగా.. పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. అయితే, ఆ వెంటనే పలాష్ తనతో అసభ్యకరంగా చాటింగ్ చేశాడని.. అందులో స్మృతిని కించపరిచేలా మాట్లాడినట్లు ఉన్న స్క్రీన్షాట్లను ఓ అమ్మాయి షేర్ చేయడం కలకలం రేపింది.ఈ పరిణామాల క్రమంలో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ తమ వివాహం రద్దైనట్లు విడివిడిగా అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా స్మృతి- పలాష్ల వివాహానికి మార్గం సుగమమైందనే ఊహాగానాలకు ఊతమిచ్చింది.కలిసిపోయిన కుటుంబాలు?పలాష్ సోదరి, బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ ముంబైలోని ఓ రెస్టారెంట్ బయటకు రాగా.. అక్కడే స్మృతి తండ్రి శ్రీనివాస్ కూడా ఉన్నారు. వెంటనే పాలక్.. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత తన భర్త మిథున్తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్మృతి- పలాష్ల పెళ్లి జరుగబోతుందనే వదంతులు పుట్టుకొచ్చాయి.అయితే, చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది పాత వీడియో అయి ఉంటుందని కొట్టిపారేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత స్మృతి అతడిని క్షమించే ప్రసక్తే లేదని పేర్కొంటున్నారు. అయితే, స్మృతి అభిమానులు మాత్రం ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఉంటే చాలని కామెంట్లు చేస్తున్నారు.కాగా పలాష్ నిజస్వరూపం తెలిసిన తర్వాత స్మృతి స్నేహితురాళ్లు అతడికి చితక్కొట్టారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పలాష్ మాత్రం తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మరోవైపు.. పెళ్లి రద్దైన తర్వాత స్మృతి ఆటపై దృష్టి పెట్టి.. వుమెన్ ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది. తద్వారా ఆర్సీబీకి రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్గా ఘనత సాధించింది.చదవండి: పాపం.. గర్ల్ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఏమవుతాడో! View this post on Instagram A post shared by Bollywood pap king (@bollywoodpapking) -
రూ. 29 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన టాప్ సింగర్
నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ముంబైలో ఒక కొత్త విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. బాలీవుడ్ నివేదికల ప్రకారం, శ్రేయా ఘోషల్ తన తల్లి షమిష్ఠ ఘోషల్, తండ్రి బిశ్వజిత్ ఘోషల్లతో కలిసి వర్లీలో రూ.29.70 కోట్లకు ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాల ప్రకారం, ఈ అపార్ట్మెంట్ ముంబైలోని అత్యంత ప్రీమియం నివాస ప్రాంతాలలో ఒకటైన వర్లీలోని గోద్రెజ్ ట్రైలజీలో ఉంది.రిజిస్టర్ పత్రాల ప్రకారం ఈ ఫ్లాట్ మొత్తం వైశాల్యం 2,750.28 చదరపు అడుగులు ఉంది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026న అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. ఈ లావాదేవీలో రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లింపుతో పాటు రూ. 30వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉన్నాయని సమాచారం.‘సరిగమ’ విజేతగా కెరీర్ను ప్రారంభించిన శ్రేయాఘోషల్ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా ఎన్నో చిత్రాల్లో తన పాటలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. మొదట దేవదాస్ చిత్రంతో హిందీలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గజని, 3 ఇడియట్స్, దబాంగ్, ఢిల్లీ 6, ఆషికీ-2, క్రిష్, పద్మావత్ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలకు మంచి క్రేజ్ దక్కింది. తెలుగులో ఒక్కడు, సింహాద్రి, ఠాగూర్, సీతయ్య, వర్షం, మల్లీశ్వరి, నేనున్నాను, అతడు, అదుర్స్, రేసుగుర్రం, మనం, ఖైదీ నం. 150,గేమ్ ఛేంజర్ వంటి సినిమాలతో పాటు సుమారు 200కు పైగానే సాంగ్స్ పాడింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సాంగ్ కోసం సుమారు రూ. 25 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. -
స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో న్యూడిల్స్ ధర ఎంతో తెలిస్తే..
ముంబైలో అత్యంత ఖరీదైన రెస్టారెంట్ల జాబితాలో శిల్పాశెట్టి ‘బాస్టియన్’ ఒకటనే విషయం తెలిసిందే. అక్కడి ఫుడ్ మెనూ ధరల గురించి తరుచుగా నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది. బాస్టియన్లో ఫుడ్ తిన్న కొందరు తమ బిల్లును గత ఏడాది నుంచి సోషల్మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. అందులోని ధరలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తరుచుగా ఈ బిల్లు సోషల్మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ముంబైలోని ఒక ప్రీమియం ఫైన్-డైనింగ్ రెస్టారెంట్గా బాస్టియన్కు గుర్తింపు ఉంది. ఇక్కడ విలాసవంతమైన సౌకర్యాలతో పాటు రుచికరమైన సీఫుడ్ కూడా దొరుకుతుంది. ఎంతో ఆకర్షణీయమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది సెలబ్రిటీలు, వ్యాపారావేత్తలు అక్కడికి వెళ్తుంటారు. విలాసవంతమైన ప్రదేశం కాబట్టి అక్కడి ఫుడ్ ధరలు కూడా ప్రీమియంగానే ఉంటాయి. బాస్టియన్లో ఫుడ్ తిన్న కొందరు తమ బిల్లును షేర్ చేశారు. నలుగురికి కలిపి రూ. 21,731 అయినట్లు తెలిపారు. చికెన్ న్యూడిల్స్ ధర రూ. 950 ఉండటం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ధర ఏకంగా రూ. 1450 ఉండటంతో మాటలు రావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే, ఈ ధరలు అన్నీ కూడా ఏడాది క్రితం నాటివి కావడం విశేషం. ప్రస్తుతం ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చని అంటున్నారు.బాస్టియన్ రెస్టరంట్ ఒక్కరోజులో రూ.2-3 కోట్ల టర్నోవర్ చేస్తుందని అంచనా ఉంది. సాధారణ రోజుల్లో రూ.2 కోట్లు, వీకెండ్లో రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా ఉంది. సుమారు 1400 మందికి పైగానే అతిథులు అక్కడ స్టే చేయొచ్చట. ఒకేసారి 700 మంది భోజనం చేసేలా వీలు ఉందని చెబుతారు. View this post on Instagram A post shared by Cute Relationship Memes | Abhishek Watts (@cuterelationship.in) -
రెండు నెలలే బెంగళూరులో.. ముంబైవాసి ఏమన్నారంటే?
కొత్త నగరానికి వెళ్తే.. తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరికి ఇది ఒక స్వేచ్ఛని, కొత్త అవకాశాలను ఇవ్వడానికి ఒక అవకాశంలా అనిపించినా.. కష్టంగానే ఉంటుందని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.''బెంగళూరు వచ్చి రెండు నెలలైంది, నాకు ముంబై గుర్తొస్తోంది. అక్కడి మనుషులు గుర్తొస్తున్నారు. ఇక్కడ (బెంగళూరు) ప్రతి చిన్న సంభాషణ ఒక బేరమాడటంలా అనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు, ప్యాకర్లు, అద్దెదారులు అందరితోనూ కొంత కష్టమే. ప్రతి ఒక్కరూ మన నుంచి ఏదో ఒకటి పిండుకోవాలని చూస్తుంటారు. ముంబైలో క్యాబ్ డ్రైవర్ వేడిగా ఉందని చూసి ఏసీ వేసేస్తాడు. ఇక్కడ మాత్రం.. అదొక వ్యక్తిగత సహాయం అన్నట్టు అడగాలి. ఈ ఒక్క విషయం మీకు అన్ని విషయాలు చెబుతుంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు.2 months in Bangalore and I miss Mumbai. I miss the people.Every small interaction here feels like a negotiation. Auto drivers, packers, old tenants. Everyone’s trying to squeeze something out of you.In Mumbai a cab driver sees it’s hot and just turns on the AC. Here you have…— poobesh (@pbshgthm) April 3, 2026ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది ముంబై నివాసి అభిప్రాయాలతో ఏకీభవించగా, మరికొందరు ఇలాంటి అనుభవాలు చాలావరకు వ్యక్తిగతమైనవని అభిప్రాయపడ్డారు.నిజమే! ముంబై చాలా స్వాగతించేదిగా, ఆప్యాయంగా ఉంటుందని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు ఇలా అన్నారు.. ముంబైలో ఏ క్యాబ్ డ్రైవర్ అయినా అడగకుండా ఏసీ ఆన్ చేస్తాడా? అని అడిగాడు. నేను బెంగళూరు వాసిని, చాలా నగరాలు తిరిగాను, నేను పూర్తిగా ఈ విషయంలో ముంబై వాసికి సపోర్ట్ చేస్తున్నా.. అని అన్నాడు. -
జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!
వెయిట్లాస్ అనగానే కఠినమైన ఆహారాలు, ఇష్టమైన ఫుడ్ని వదులుకోవడం, తీవ్రమైన వ్యాయామాలు గంటలు తరబడి చేయడం అని భావిస్తుంటారు చాలామంది. కానీ అవేమి కానేకాదు అని కొందరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే గాక, చాలా సింపుల్ లైఫ్స్టైల్స్తో కిలోల కొద్ది బరువు తగ్గి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ముంబైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకీ ఆమె బరువు తగ్గడం కోసం ఎలాంటి మార్పులు జోడించిందంటే..కంటెంట్ క్రియేటర్ మల్లికా ఫతేపురియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సరికొత్త వెయిట్లాస్ జర్నీని పంచుకున్నారు. ఒకప్పుడు తాను 90 కిలోల బరువు ఉండేదాన్ని అని , ప్రస్తుతం 55 కిలోలకు చేరి సుమారు 35 కేజీ బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అయితే తన వెయిట్లాస్ జర్నీలో ఏం చేసింది అనేదానికంటే..ఏం మానేశాను, వేటికి దూరంగా ఉన్నాను అనేదే ఎక్కువగా ఉంటుందని అంటోందామె.బరువు తగ్గడం కోసం..డైట్లు చేయడం:తాను కఠినమైన డైట్లు పాటించిన ప్రతిసారీ కొంత బరువు తగ్గినట్లు తగ్గి..మళ్ళీ యథావిధి బరువుకి వచ్చేసేదాన్ని అని కంటెంట్ క్రియేటర్ పంచుకున్నారు. బరువు తగ్గడాన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా చూడటం మానేసి, తాను పాటించగలిగే అలవాట్లపై దృష్టి పెట్టడంతో ఆమె జీవితంలో అనూహ్య మలుపు వచ్చింది.కార్బోహైడ్రేట్లను తగ్గించడంరొట్టె, అన్నం, లేదా పాస్తా వంటి ఆహారాలను పూర్తిగా మానేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తీసుకునేలా కేర్ తీసుకున్నానని అంటోంది. ఆమె ప్రకారం, అసలు సమస్య ఈ ఆహారాలు కాదని.. సమతుల్యంగా తినడంలోనే సమస్య అంతా ఉందని అంటున్నారు.విసుగు పుట్టించే భోజనాన్ని బలవంతంగా తినడం..కఠినమైన ఆహార డైట్లు శిక్షలా మారాక..బరువు తగ్గడం కంటే..సమస్యే అధికంగా మారే అవకాశాలే ఎక్కువని అంటోంది. అందుకే ఆస్వాదించకలిగేలా భోజనాన్ని ఆరోగ్యమైన విధంగా తీసుకుంటే..ఏదో కోల్పోయానన్న భావన దరిచేరదు. హెల్దీగా, ఆనందంగా బరువు తగ్గుతాం అని అంటోంది.అతిగా వ్యాయామం చేయడంతీవ్రమైన రోజువారీ వ్యాయామాలు అవసరమని తాను భావించేదాన్ని అని మల్లిక చెప్పారు. కానీ కాలక్రమేణా, నడవడం, శక్తి శిక్షణ, క్రమం తప్పకుండా చురుకుగా ఉండటం వంటి సాధారణ విషయాలు చాలా బాగా పనిచేస్తాయని గ్రహించానని అంటున్నారామె. అంతేగాదు బరువు తగ్గడం అంటే మంచి ఆహారాన్ని వదులుకోవడం లేదా మిమ్మల్ని బాధకు గురిచేసుకోవడం వంటివి కానేకాదు అని అంటోంది. నిలకడతో సమతుల్యానికి పీటవేస్తే చాలు బరువు తగ్గడం సులభం అని అంటోంది మల్లికా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mallika Fatehpuria (@mallikafatehpuria) (చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
ఆఫీస్ అమ్మేసిన సల్మాన్ ఖాన్ తమ్ముడు
సినీతారలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే కొందరు అవకాశం వచ్చినప్పుడు స్థలాలు, భూములు, ఇల్లు కొనుగోలు చేసి.. తమకు అవసరం వచ్చినప్పుడు విక్రయిస్తుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని అంధేరి వెస్ట్లో ఉన్న ఒక కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని విక్రయించారు.రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. సోహైల్ ఖాన్ రూ. 5.90 కోట్లకు ఆఫీస్ స్పేస్ విక్రయించారు. ఇది లింక్ రోడ్లోని ఆర్క్ వన్ భవనంలో 1559 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మూడు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని బిల్కిష్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించారు.ఈ లావాదేవీ మార్చి 27, 2026న నమోదయ్యాయి. దీనికి గాను రూ.35.40 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. 2025 అక్టోబర్లో, సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను రూ. 22 కోట్లకు విక్రయించారు. సద్గురు డెవలపర్స్ అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ కార్పెట్ భవనంలో ఉన్న ఈ ఆస్తి, సుమారు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్మెంట్లో తొమ్మిది పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. దీనిని శివాయ సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్కు విక్రయించారు. -
కీలక పదవులన్నీ మహిళలకే.. ముంబైలో కొత్త చరిత్ర
సాక్షి ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక పదవుల పగ్గాలు మహిళల చేతుల్లోకి వచ్చాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్, ప్రతిపక్ష నేతతో పాటు మరో 8 కమిటీలు మహిళా అధికారులు, ప్రజా ప్రతినిధులకు ద క్కాయి. ప్రస్తుతం ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 11 మంది మహిళలు అధికార బాధ్యతలు స్వీకరించారు. ముంబైలో మహిళా రాజ్ ప్రారంభమైందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకూ ముంబై మేయర్లుగా ఎంతో మంది మహిళలు ఎన్నికయ్యారు. కానీ ముంబై మున్సిపల్ కమిషనర్ పదవి మాత్రం వారికి దక్కలేదు. ఈ పదవి కోసం పలువురు మహిళా అధికారుల పేర్లు ప్రస్తావనకు వచి్చనప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. కానీ తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 161 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా, సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి అశ్విని భిడేకు కమిషనర్ అయ్యే అవకాశం లభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం బీఎంసీ తొలి మహిళా కమిషనర్గా అశ్విని భిడే బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు తొలిసారిగా మహిళా కార్పొరేటర్ కిషోరి పెడ్నేకర్ ప్రతిపక్ష నాయకురాలిగా నియమితులయ్యారు. అలాగే బెస్ట్ కమిటీకి ఛైర్పర్సన్గా తొలిసారిగా తృష్ణ విశ్వస్ రావ్ కూడా నియమితులయ్యారు. వీటితోపాటు మున్సిపాలిటీలోని వివిధ కమిటీల ఛైర్పర్సన్షిప్లు కూడా మహిళలకే దక్కాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మళ్లీ షాక్.. పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ భారత్లోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.195.5, కోల్కతాలో రూ.218 పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు ఈ మేరకు ప్రకటన చేశాయి.ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరగడంతో కొత్త రిటైల్ ధర రూ.2,078.50కు చేరింది. ఇప్పటికే మార్చి 1న ప్రతి సిలిండర్పై రూ.114.5 పెంచిన విషయం తెలిసిందే.సిలిండర్ల ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలు వంటి కమర్షియల్ రంగంపై ప్రభావం చూపుతోంది. గృహ వినియోగదారులకు మాత్రం తాత్కాలికంగా ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర మార్చి 7న రూ.60 పెరిగి, రూ.913కు చేరింది. ఆ తర్వాతి నుంచి ఈ ధరల్లో ఎలాంటి మార్పులేదు.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రధాన చమురు సంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన అంతర్జాతీయ ప్రమాణాలు, కరెన్సీ మార్పిడి రేట్ల ఆధారంగా ఈ ధరలను సవరిస్తాయి.ఎల్పీజీ మార్కెట్లో మార్పులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.72గా ఉండగా, డీజిల్ రూ.87.62గా ఉంది. గత సంవత్సరం మార్చిలో లీటరుకు రూ.2 తగ్గింది. ఆ తర్వాత ఈ ధరల్లో మార్పు లేదు. -
ముంబై మున్సిపల్ కమిషనర్గా మహిళా అధికారి
బృహన్ ముంబై నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్గా అశ్విని భిడే నియామకమయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆసియాలోనే అతిపెద్ద మున్సిపాలిటీకి కమిషనర్గా వ్యవహరించనున్న మహిళ అధికారిగా అశ్విని భిడే రికార్డు సాధించనున్నారు. ముంబై మేయర్ రీతూ వాడే ప్రభుత్వ నిర్ణయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మహిళా కమిషనర్ ఎంపిక "నారీ శక్తి"కి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ముంబై నగరాన్ని మరింత స్మార్ట్గా, పరిశుభ్రంగా మార్చడంలో ఈ నియామకం ఎంతగానో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా BMC చరిత్రలో మొట్టమొదటి మహిళా కమిషనర్గా సేవలు అందిస్తోన్న అశ్విని భిడే 1995 కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె గతంలో ముంబై మెట్రోలో 2015 నుండి 2020 వరకు రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సేవలందించారు. కాగా ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ కోసం నలుగురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలనలోకి రాగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతుతో అశ్విని భిడే ఎంపికయ్యారు. -
తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?
స్వల్ప వివాదానికే ముక్కపచ్చలారని చిన్నారిపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్నవసాయి ప్రాంతంలో, తండ్రితో వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని దారుణండి కొట్టాడు. చిన్నపిల్లాడు అన్న కనికరం కూడా లేకుండా తీవ్రంగా దాడి చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రకారం నిందితుడు సందీప్ పవార్, ఒక చిన్న విషయంపై బాలుడి తండ్రితో గొడవడ్డాడు. తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో.. క్షణికావేశంతో చేశాడో గానీ అక్కడే ఆడుకుంటున్న బాలుడు విఘ్నేష్ తన ప్రతాపాన్ని చూపించాడు. పసుపు రంగు టీ-షర్టులో విఘ్నేష్ అక్కడే ఆగి ఉన్న ఆటో-రిక్షాలో కూర్చుని ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ నిందితుడు బాలుడు కాళ్లు పట్టుకుని ఆటోలోంచి బయటకు లాగాడు. బాలుడిని నేలపై ఒకసారిగా విసిరి కొట్టాడు. తరువాత భవనం లోపలికెళ్లి, చిన్నారి తలను ఇనుప రాడ్కు కొట్టి, మళ్లీ నేలపై పడేశాడు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మీరా రోడ్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్య అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య ఇదీ చదవండి : భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు -
శుభ్మన్ గిల్ లగ్జరీ అపార్ట్మెంట్.. ధర తెలిస్తే షాకవుతారు!
ఇప్పటికే చాలామంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ముంబైలో ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టీమిండియా క్రికెటర్ 'శుభ్మన్ గిల్' కూడా చేరారు.శుభ్మన్ గిల్.. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్ విలువ సుమారు రూ.20.7 కోట్లు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ ఫ్లాట్ను పూజా లీజర్ అండ్ లైఫ్స్టైల్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.శుభ్మన్ గిల్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్.. ముంబైలోని జుహూ తారా రోడ్డుపై ఉన్న పూజా ల్యూమినేర్ అనే భవనంలో 12వ అంతస్తులో ఉంది. గిల్ ఈ 12వ అంతస్తు మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,369 చదరపు అడుగులు. ఈ లావాదేవీ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మార్చి 26, 2026న జరిగింది. మహారాష్ట్ర RERA వివరాల ప్రకారం.. ఈ భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. 2029 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.ముంబైలో ఇతర క్రికెటర్ల అపార్ట్మెంట్స్ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనించదగ్గ విషయం. ఇందులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.👉సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో రూ.7.18 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.👉రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ప్రాభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ను సొంతం చేసుకున్నారు.👉జహీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ.11 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. -
రూ. 41 లక్షల జీతం వద్దనుకుని కవయిత్రిగా..!
కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. తీరా ఏ సమస్యలు వచ్చినా..తట్టుకుని ముందుకు సాగి..సక్సెస్ అందుకునే నేర్పు, ఓర్పు కూడా అవసరం. కానీ ఇక్కడొక మహిళ లక్షల వేతనం కాదనుకుని సాహిత్య రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. సృజనాత్మక శక్తిపై ఆధారపడి ఉన్న రంగం, అన్ని వేళలా..అంతగొప్పగా రచనలు చేసే అవకాశం లేని దాంట్లోకి వెళ్లాలనుకోవడమే సాహసం అంటే..మంచి లగ్జరీ లైప్ని అనుభవించే ఉద్యోగాన్ని వదులకోవడం అంతకుమించిన సాహసం అనే చెప్పాలి. కానీ ఈ మహిళ అంత పెద్ద సాహసం చేసి కవియిత్రి అనుపించుకోవడమే ఇష్టం అని చెబుతోంది.ఆ అమ్మాయే 28 ఏళ్ల మాజీ కన్సల్టెంట్ అయిన నమ్రతా యాదవ్. ఆమె కవిత్వంపై అభిరుచితో సింగపూర్లోని కేపీఎంజీలో కార్పొరేట్ ఉద్యోగానికి స్వస్తి పలికింది. నిజానికి ఆమె న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె 2019, 2021 మధ్య నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్లో అంతర్జాతీయ సంబంధాలలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ ప్రపంచంలోకి రాకముందు ఆమె అక్కడ ఆరు నెలల పాటు రీసెర్చ్ అనలిస్ట్గా పనిచేశారు. కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టే ఉద్దేశ్యంతో ఒక పెద్ద సంస్థలో అనుభవం సంపాదించేందుకు కేపీఎంజీ(KPMG)లో చేరింది. అక్కడ వర్కింగ్ కల్చర్ కూడా నచ్చిందామెకు. ఏడాదికి దగ్గర దగ్గరగా రూ. 41 లక్షలు పైనే జీతం అందుకునేది. సింపుల్గా చెప్పాలంటే అక్కడ మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించారామె. ఎలాంటి ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొనలేదామె. అయితే ఆ ఉద్యోగం తన వ్యక్తిత్వానికి సరిపోదని భావించి, సృజనాత్మకతకు పెద్దపీట వేసే సాహిత్యరంగంలోకి వచ్చేందుకు మొగ్గుచూపడం విశేషం. ఎక్కువ గంటలు శ్రమతో కూడిన కార్పొరేట్ జీవితం తన వల్ల కాదనిపించదని అన్నారామె. దగ్గర దగ్గర 40 గంటల పని, వారాంతాల్లో విరామంగా లైఫ్ ఉండకూదనిపించిందట. దాంతో సింగపూర్ నుంచి భారత్కి వచ్చేసి, క్రమం తప్పకుండా హిందీలో కవిత్వాలు రాయడం ప్రారంభించానని అంటోంది. పైగా ఒక్కత్తే ఆ దేశంలో జీవించడం పట్ల ఉన్న ఆందోళన కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం అని అంటోందామె. 2024 డిసెంబర్లో, లక్నోలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో స్పోకెన్ వర్డ్ పొయెట్రీ ప్రదర్శన ఇవ్వడానికి ఎంపిక అవ్వడంతో తన డెసీషన్ సరైనదే అని నమ్రతకు నమ్మకం కలిగింది. అంతేగాదు అక్కడ వేదికపై కవిత్వం చెబుతున్న వారిని చూసి అభిమానిగా మారడం కంటే..వారిలో ఒకరిగా తాను అవ్వాలనే కోరిక కలిగిందట. ఆ ఉత్సాహంతోనే సింగపూర్ని పూర్తిగా విడిచిపెట్టి భారత్కి వచ్చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యిందట. అంతేగాదు ప్రస్తుతం ముంబైలో తన రచనలకు వీలుక ల్పించే ఉద్యగాన్ని వెతికే పనిలో ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మరో ఇద్దరు తనలాంటి క్రియేటివ్ వ్యక్తులతో కలిసి అపార్ట్మెంట్ షేర్ చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే అప్పటి వరకు తాను బాగా సంపాదించిన లైఫ్ నుంచి ఆదాయం లేకుండా గడపడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా..నాడు ఆర్జించిన పొదుపులే తనకు ఆసరాగా మారాయని అంటోంది. అలాగే మార్చి 28న జరగనున్న తన సోలో డెబ్యూ షో కోసం పనిచేయాలని నిర్ణయించకున్నట్లు తెలిపింది కూడా. అయితే ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు మద్దతు తెలుపకపోయినా..ప్రస్తుతం తనను అర్థం చేసుకుంటున్నారని అంటోంది. ఏదీఏమైన తన అభిరుచి కోసం అంత మంచి ఉద్యోగాన్ని వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఇంత డేర్ చేసినందుకైనా.. నమ్రత తాను అనుకున్నట్లుగా మంచి కవయిత్రి అవ్వాలని ఆశిద్దాం.(చదవండి: పెళ్లి చేసుకోకుంటే ఇదంతా చేసేవాడిని కాదు..!: రిషి సునాక్) -
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
-
కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!
మన చుట్టూనే ఎందరో కష్టజీవులు ఉన్నారు. తమ కష్టంతో తలరాతలనే మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నావారెందరో ఉన్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ యువకుడు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో పాడ్కాస్టర్ కుశల్ షేర్ చేసిన ఆ యవకుడి కథ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు, స్ఫూర్తిదాయకమైన కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. చుట్టూ పరిమిత వనరులు..నిరంతర శ్రమతో కూడిన జీవితం నుంచి పైకొచ్చిన యువకడి స్టోరీ ఇది.!.ఆ అబ్బాయే ముంబైకి చెందిన అభిషేక్ ఆర్ వైశ్య. టీనేజ్ వయసు నుంచే వృత్తి జీవితం మొదలైంది. సుమారు 13 నుంచి 20 సంవత్సరాల వయసులో అతను ముంబైలోని అత్యంత రద్దీప్రాంతమైన దాదర్లో కూరగాయలు అమ్ముతూ తండ్రికి చేదుడువాదోడుగా ఉండేవాడు. ప్రతిరోజు అతడి దినచర్య సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యేది. ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య కూరగాయల అమ్మకాలు చూసుకునేవాడు. ఆ తర్వాత ఏ మాత్రం విరామం లేకుండా సీఏ కోచింగ్ క్లాసులకు వెళ్లిపోయేవాడు. అలా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు క్లాసులతో సరిపోయేది. ఆ క్లాసులు ముగిశాక, అతను రోజంతా ఆర్టికల్ షిప్ శిక్షణకు కేటాయించుకునేవాడు. సీఏ కోర్సులో భాగంగా ప్రాక్టీకల్ అనుభవం కోసం చేసే సీనియర్ సీఏ వద్ద చేసే ట్రైనింగ్ ఈ ఆర్టికల్ షిప్. ఇక రాత్రి 11 గంటల టైంకి ఫ్రీ టైం దొరుకుతుంది. ఇక ఆ సమయంలో చదువుకోవడానికి సమయం కేటాయించుకునేవాడు. పైగా ఉండే గది కూడా కేవలం 150 చదరపు అడుగుల చిన్న గది. పరిమిత స్థలం, పరిమిత వనురులే అయినప్పటికీ..ఎదగాలన్న తాపత్రయం, కసి పుష్కలంగా ఉండేవి. అవి అతడిని..అంత కష్టాన్ని భరించే శక్తిని ఇచ్చేవి. అలా అతడు సీఏ ఉత్తీర్ణుడై..విదేశాలకు వెళ్లాడు. అలా ఒమన్కు వెళ్లి అక్కడ ఆరేళ్లు పనిచేసి, వృత్తిపరమైన అనుభవాన్ని పొందాడు. చివరికి వ్యవస్థాపకరంగంలోకి అడుగుపెట్టి.. సొంత వ్యాపారాలతో సంపదను పెంచుకున్నాడు. మంచి స్థాయిలోకి వచ్చాక చేసిన మొదటి పని తండ్రిని ఆ కూరగాయలు అమ్మే పని నుంచి మానిపించేయడం. ఆ తర్వాత భారత్, దుబాయ్, ఒమన్ వంటి చోట్ల మొత్త ఐదు ఫ్లాట్లు కొనుగులు చేశాడు. పైగా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి విలాసవంతమైన కార్ల తోపాటు ఒమన్లో అతడికి అత్యంత ప్రజాదరణ పొందిన క్లౌడ్కిచెన్ వ్యాపారాన్ని కూడా రన్ చేస్తుండటం విశేషం. పట్టుదలతో చక్కగా కెరీర్ని తీర్చిదిద్దుకున్న అతడి కథను వివరిస్తూ..పాడ్కాస్టర్ కుశల్ ఇలా అన్నారు. అభిషేక్ను వ్యక్తిగతంగా కలవడం తనపై చెరగని ముద్ర వేసిందన్నారు. అతనిపై మరింత గౌరవం పెరిగిందని చెప్పారు. మనం కోరుకున్న లక్ష్యంవైపుకి వెళ్లడం కోసం ఎంతలా కష్టపడాలి, ఎంతటి పట్టుదల ఉండాలో తెలిసి వచ్చిందని కుశాల్లోధా అన్నారు. అతడితో సంభాషణ స్ఫూర్తిదాయకంగానే కాదు పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి ఆశయాన్ని అయినా పాదాక్రాంతం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు.He used to sell vegetables at Dadar with his father from age 13-20.He used to sell vegetables early in the morning from 4 to 6 AM, then go for his CA Final classes from 7-10 AM, then go for articleship from 10 AM – 9 PM, study for a bit, and then sleep by 11 PM.He used to… pic.twitter.com/ihRK4OG39g— Kushal Lodha (@kushallodha548) March 19, 2026 (చదవండి: ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..) -
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026 -
ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.769 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. ముంబై ఈస్ట్ కమిషనరేట్కు చెందిన సీజీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఏకంగా రూ.769 కోట్ల డిమాండ్ నోటీసులను జారీ చేశారు.డిమాండ్ మొత్తం రూ.384,33,53,972 (సుమారు రూ.384 కోట్లు)గా ఉన్నా పెనాల్టీ రూపంలో పన్ను మొత్తంతో పాటు దానికి సమానమైన జరిమానా, వడ్డీని కూడా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దాంతో మొత్తంగా రూ.769 కోట్లు అయింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 లోని సెక్షన్ 74 ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.వివాదం నేపథ్యం ఏమిటి?సాధారణంగా బ్యాంకులు తమ వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తుంటాయి. అయితే, ఈ ఉచిత సేవలకు కూడా ప్రతిఫలం ఉంటుందని, దానిపై పన్ను చెల్లించాలని జీఎస్టీ విభాగం వాదిస్తోంది. ఈ అంశంపై గతంలో కూడా షోకాజ్ నోటీసులు అందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ‘గతంలోనూ ఇలాంటి అంశాలపై బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోంది. అయితే ప్రస్తుత డిమాండ్ మొత్తం పరిమితిని మించి ఉన్నందున నిబంధనల ప్రకారం దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదిస్తున్నాం’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.తదుపరి కార్యాచరణఈ నోటీసులపై ఐసీఐసీఐ బ్యాంక్ వెనక్కి తగ్గడం లేదు. నిర్ణీత గడువులోగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదా అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించడం ద్వారా ఈ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బ్యాంక్ ఆర్థిక వ్యవహారంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
నిదుర.. రాదుర..
సాక్షి, హైదరాబాద్: మనిషి ఆరోగ్యకర జీవనానికి తగినంత నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా మెట్రో నగరాల ప్రజలను మాత్రం నిద్రాదేవత తగినంత కరుణించట్లేదు. వేక్ఫిట్ డాట్ కామ్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నిద్రవేళల్లో క్రమశిక్షణ, నిద్రలేమి, నిద్రలేచే సమయాలు, పగటిపూట అలసట వంటి కీలక నిద్ర సూచికల ఆధారంగా ఈ సర్వే చేపట్టింది. దీని ఆధారంగా ఆయా నగరాలకు ర్యాంకులు ప్రకటిస్తూ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ పేరిట నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మిగిలిన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది. నిద్ర ఆధారంగా నగరాలకు ఇచ్చిన ర్యాంకులు ఇవే... » దేశంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నిద్ర అందుకుంటున్న నగరంగా చెన్నై నిలిచింది. ఇక్కడ ఆలస్యంగా నిద్రపోవడం (48.8%) ఆలస్యంగా నిద్రలేవడం (23.8%) అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 32.1% మంది నిద్రలేమి బాధితులున్నారు. అయితే గణనీయమైన సంఖ్యలో (61.9%) విశ్రాంతి పొందకుండానే నిద్రలేస్తున్నట్లు చెబుతున్నారు.» స్థిరమైన నిద్ర అలవాట్లను ప్రతిబింబిస్తూ హైదరాబాద్ ’బ్యాలెన్స్డ్ స్లీప్ సిటీ’గా నిలిచింది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా 31 శాతం మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇది ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే మెరుగైన సమతౌల్యమైన నిద్రా విధానాన్ని సూచిస్తుంది. » గురుగ్రామ్ మూడో స్థానంలో నిలిచి ‘రెసిలియంట్ స్లీపర్ సిటీ’గా పేరు పొందింది. ఇక్కడి యువ ఉద్యోగులు తమ బిజీ షెడ్యూళ్లను నిర్వహిస్తూనే ఆరోగ్యకరమైన నిద్రా విధానాలను పాటిస్తున్నారు. » బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచి ‘స్లీప్ పారడాక్స్’గా నిలిచింది. ఇక్కడ 36.3% మంది అర్ధరాత్రి తర్వాత నిద్రపోతుండగా 54% మంది నిద్రలేచిన తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించలేదన్నారు.» ఢిల్లీలో 45% మంది ఆలస్యంగా నిద్రలేస్తుండగా 32% మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. » కోల్కతా ‘లేట్నైట్ సిటీ’గా నిలిచింది. ఇక్కడ75.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నట్లు తెలిపారు. » ముంబై అత్యంత నిద్రలేమి నగరంగా నిలిచింది. ఇక్కడ 76.5% మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 42.5% మంది ఆలస్యంగా నిద్రలేస్తుండగా 62.6% మంది నిద్రలేచాక విశ్రాంతి తీసుకున్నట్లు అనిపించట్లేదని చెప్పారు. దాదాపు 60% మంది పనివేళల్లో నిద్రమత్తుగా అనిపిస్తోందని చెప్పడం గమనార్హం. డిజిటల్.. స్లీప్ డల్... డిజిటల్ పరికరాలపై ఆధారపడటం, అస్తవ్యస్తమైన పనివేళలు, పెరుగుతున్న అలసట దేశవ్యాప్తంగా నిద్ర విధానాలను గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడకం నిద్రకు భంగం కలిగించే అత్యంత సాధారణ ప్రవర్తన అని ఈ నివేదిక గుర్తించింది. 87.6 శాతం మంది రాత్రిపూట స్క్రీన్ ప్రభావానికి గురవుతున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, బింజ్–వాచింగ్ ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వంటి కార్యకలాపాలు నిద్ర నాణ్యత క్షీణించడానికి ముఖ్య కారణాలు. ఉత్పాదకత... హుష్ కాకి... నిద్రలేమి పనితీరుపై, ఉత్పాదకతపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. మెట్రో నగరాల్లో కార్యాలయ అలసట ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో 64.4% మంది పగటిపూట నిద్రమత్తుకు లోనవుతున్నారు. బెంగళూరులో 61.7%, ముంబైలో 59.2% మందిది కూడా ఇదే పరిస్థితి. 57.8% మంది పనివేళల్లో నిద్రమత్తుగా ఉన్నట్లు చెప్పారు. ఇది 2025తో పోలిస్తే 7.8% అధికం. అదనంగా, 48.7% మంది భారతీయులు నిద్రలేచిన తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపించట్లేదని చెప్పారు. ఆలస్యపు ఉదయాలు... ఈ సర్వేలో ప్రజలు క్రమంగా ఆలస్యంగా నిద్రపోవడం వైపు మారుతున్నారని స్పష్టమైంది. 12%మంది మాత్రమే రాత్రి 10 గంటల్లోగా నిద్రపోతూ ఆరోగ్యకర నిద్రవేళలను పాటిస్తుండగా దాదాపు 60% మంది రాత్రి 11 గంటల తర్వాతే నిద్రపోతున్నారు. 29.1% మంది ‘కుదించబడిన నిద్రవేళలను’అనుభవిస్తున్నారు. అంటే ఆలస్యంగా నిద్రపోయినా పని ఒత్తిడి కారణంగా ఉదయాన్నే మేల్కొంటున్నారు. గతేడాదిలో 6 గంటల కంటే తక్కువ సేపే నిద్రపోయామని 46% మంది భారతీయులు తెలిపారు. -
నెలకు అద్దె @ రూ.1.2 లక్షలు!
కలల నగరం ముంబైలో అద్దె కోసం ఇల్లు దొరకడం ఒక ఎత్తయితే, దాని అద్దె చెల్లించడం మరో ఎత్తు. సామాన్యుడి నెల జీతం కంటే కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ అద్దెలే ఎక్కువగా ఉంటాయన్నది జీర్ణించుకోలేని వాస్తవం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ముంబై జీవన ప్రమాణాలు, అద్దె భారం గురించి చర్చకు తెరలేపింది.ప్రముఖ వ్లాగర్ ఆర్య కొఠారి తన ఇన్స్టాగ్రామ్ సిరీస్ ‘రెంట్ ఇన్ ముంబై - ఈపీ 4’ లో భాగంగా అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఒక యువతిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రాంతంలో ఒక 3బీహెచ్కే (మూడు పడకగదుల) ఫ్లాట్ కోసం ఆమె నెలకు ఏకంగా రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ విశాలమైన గది, ఆధునిక వంటగది చూస్తుంటే ముంబై వంటి నగరంలో అది ఎంత లగ్జరీనో అర్థమవుతుంది.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ‘ముంబైలో అద్దె కట్టడమే ఒక పూర్తిస్థాయి ఉద్యోగంలా మారిపోయింది’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘ఒకరికి రూ. 1.2 లక్షల అద్దె సౌకర్యం కావచ్చు, మరొకరికి రూ.80 వేల జీతంతో బతకడమే పెద్ద పోరాటం కావచ్చు’ అని మరికొరు అన్నారు. View this post on Instagram A post shared by Arya Kothari (@arya_kothari) -
ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం?
ఉరుకుల పరుగుల నగర జీవితంలో భారతీయులు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఒక కీలక విషయాన్ని విస్మరిస్తున్నారు.. అదే ‘కంటినిండా నిద్ర’. తాజాగా వెలువడిన ఒక జాతీయ సర్వే నివేదిక ప్రకారం.. భారతీయ నగరాల్లో నిద్ర నాణ్యత ఆందోళనకరంగా పడిపోతోంది. ముఖ్యంగా ముంబై నగరం దేశంలోనే అత్యధికంగా నిద్రలేమితో సతమతమవుతుండగా, ఢిల్లీ వాసులు ఆలస్యంగా నిద్రలేవడంలో రికార్డు సృష్టించారు. మరి మన హెదరాబాద్ పరిస్థితి ఏమిటి?ఆరోగ్యానికి నిద్రే ప్రాణాధారంశారీరక ఆరోగ్యానికే కాకుండా, మెదడు పనితీరుకు, మానసిక స్థిరత్వానికి తగినంత నిద్ర అత్యవసరం. నిద్ర తక్కువైతే ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, ఆందోళన (Anxiety) వంటి సమస్యలకు దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా భారతీయులు నిద్రకు దూరమవుతున్నారు.నగరాల వారీగా నిద్ర తీరు తెన్నులుWakefit.co నిర్వహించిన తాజా సర్వే (జనవరి 2025 - మార్చి 2026 మధ్య) భారతీయ మెట్రో నగరాల్లో నిద్ర అలవాట్లపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.ముంబై (అత్యంత నిద్రలేమి నగరం): ముంబై వాసుల్లో 76.5 శాతం మంది అర్ధరాత్రి దాటాక నిద్రపోతున్నారు. దాదాపు 60 శాతం మంది పనివేళల్లో కూడా నిద్రతో తూగుతున్నట్లు సర్వే పేర్కొంది.హైదరాబాద్ (సమతుల్య నగరం): మన భాగ్యనగరం ఇతర మెట్రోలతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా, 31 శాతం మంది మాత్రమే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని సర్వే 'బ్యాలెన్స్డ్ స్లీపర్ సిటీ'గా అభివర్ణించింది. ఢిల్లీ (ఆలస్యంగా మేల్కొనే నగరం): దేశ రాజధానిలో 45 శాతం మంది ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం.చెన్నై (క్రమశిక్షణ కలిగిన నగరం): నిద్ర వేళల విషయంలో చెన్నై వాసులు కొంత క్రమశిక్షణ పాటిస్తున్నారు. కేవలం 23.8 శాతం మంది మాత్రమే ఆలస్యంగా నిద్రలేస్తున్నారు.కోల్కతా (లేట్ నైట్ సిటీ): ఇక్కడ 75.5 శాతం మందికి రాత్రిపూట చాలా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంది.బెంగళూరు (నిద్ర వైరుధ్యం): ఐటీ హబ్లో 36.3 శాతం మంది అర్ధరాత్రి దాటాక పడుకుంటున్నారు. అయితే నిద్రలేచిన తర్వాత కూడా 54 శాతం మంది తాము విశ్రాంతి పొందినట్లు భావించడం లేదని వెల్లడయ్యింది.విలన్లుగా మారిన స్మార్ట్ఫోన్లుభారతీయులు నిద్రకు దూరం కావడానికి ప్రధాన కారణం డిజిటల్ వ్యసనమేనని సర్వే స్పష్టం చేసింది. దాదాపు 87.6 శాతం మంది పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూస్తున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, ఓటీటీలో బింజ్ వాచింగ్ వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్పాదకతపై పడుతోంది. సుమారు 57.8 శాతం మంది ఆఫీసు పనివేళల్లో నిద్ర వస్తోందని వాపోతున్నారు.ఆందోళనకర గణాంకాలుమరో జాతీయ స్థాయి సర్వే (89,000 మంది స్పందనలు) ప్రకారం 46 శాతం మంది భారతీయులు రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారు. రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం.నిపుణుల సూచనలుమంచి నిద్ర కోసం రాత్రిపూట స్క్రీన్ టైమ్ తగ్గించాలని, సరైన సమయానికి భోజనం చేసి, బెడ్రూమ్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను సమతుల ఆరోగ్యానికి ప్రాథమిక అవసరంగా గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు
ఇటీవల హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి (Euthanasia) అనుమతినిచ్చిన నేపథ్యంలో, హృదయాన్ని కలచివేసే మరో గాథ చర్చనీయాంశంగా మారింది. ముంబైకి చెందిన 35 ఏళ్ల ఆనంద్ దీక్షిత్ గత రెండున్నరేళ్లుగా పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ (Persistent Vegetative State) అంటే ప్రాణం ఉండి కూడా స్పందన లేని స్థితిలో ఉన్నాడు. హరీష్ రాణా తల్లిదండ్రులు తమ కుమారుడి బాధను చూడలేక కారుణ్య మరణం కోరగా, ఆనంద్ కుటుంబం మాత్రం తమ కొడుకును ఎలాగైనా బతికించుకోవాలని పోరాడుతోంది.తమ కొడుకు మరో హరీష్ రాణాగా మారకూడదని దీక్షిత్ తల్లి దండ్రులు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే..కొత్త బండి కొన్న ఉత్సాహం ఆవిరి2023 డిసెంబర్ 29న గోరఖ్పూర్లో కొనుగోలు చేసిన కొత్త స్కూటర్పై వెళ్తుండగా జరిగిన ఘోర ప్రమాదం వారి జీవితాలను అతలాకుతలం చేసింది. గాయపడ్డ కుమారుడు అప్పటి నుండి కోమాలోనే ఉన్నాడు.ఆహారం కోసం, శ్వాస పూర్తిగా యంత్రాల పైనే. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య తమ కొడుకు గుండె కొట్టుకునేలా చేయడానికి దీక్షిత్ కుటుంబం పడని పాట్లులేవు. రూ. 4కోట్ల ఖర్చు, ఉన్నగూడూ పోయిందిఇప్పటివరకు వైద్యం కోసం 4 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. దీని కోసం పొలాలు, ఆస్తులు, సేవింగ్స్ అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఒకవైపు ఆస్పత్రిలో కొడుకు ప్రాణాల కోసం పోరాడుతుంటే, మరోవైపు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నిర్దాక్షిణ్యంగా వీరి ఇంటిని కూల్చివేసింది.. బిల్డర్-బీఎంసీ మధ్య ఉన్న వివాదం కారణంగా వీరు నిలువ నీడలేని పరిస్థితిలోకి జారి పోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే కాలం గడుపుతూ ఆనంద్ను కంటికి రెప్పలా కాపాడు కుంటున్నారు. అటు 'కేర్ హెల్త్ ఇన్సూరెన్స్' సంస్థ క్లెయిమ్ను తిరస్కరించడంతో కుటుంబం మరో 50 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకు పోయింది.హరీష్ రాణా లాగా తమ కొడుకును వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమనీ, కానీ పరిస్థితులు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటూ ఆ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఆనంద్ తల్లి, కొడుకు గడియారాలు, మొబైల్ ఫోన్ను భద్రంగా దాచుకొంది. ఏదైనా అద్భుతం జరుగకపోతుందా, తమ బిడ్డ తమను మళ్లీ "అమ్మా", "నాన్నా" అని పిలవకపోతాడా అని తల్లిదండ్రులు ఆశతో కళ్లు కాయలు కాచేలా నిరీక్షస్తున్నారు. ప్రభుత్వం గానీ, దాతలు గానీ సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశిద్దాం. -
ఆ ప్లంబర్ వేతనం ఏడాదికి రూ. 18 లక్షలా..!
ఏఐ వచ్చేసింది ఇంకేముంది ఉద్యోగాలు ఉష్కాకి అంటూ మేధావులు, నిపుణులు పెద్ద ఎత్తున్న ఆందోళన వ్యక్తం చేశారు. కానీ నెట్టిట వైరల్ అవుతున్న ఈ విషయం గురించి తెలుసకున్నాక ఆ నిర్ణయం తప్పని ఒప్పుకుంటారు. ఎంత ఏఐ వచ్చినా..శ్రామిక జీవుల పనితనాన్ని ఎంతటి అత్యున్నత సాంకేతికత అయినా భర్తీ చేయలేదని తేటతెల్లమవుతుంది.నెట్టింట 'ముంబైలో ఒక ప్లంబర్ రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు' అనే క్యాప్షన్తో చేసిన పోస్ట్ అందర్నీ ఆలోచించేలా చేసింది. ఆ పోస్ట్ల ముంబై ప్లంబర్తో జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నాడు. అతను తన టౌన్షిప్లోని సోసైటీలో ఒక ప్లంబర్తో మాటమంతి కలిపినట్లు తెలిపాడు. తాము చాలా విషయాలు మాట్లాడుకుంటూ..అతడి సంపాదన గురించి ఆరా తీశాడు. కాంట్రాక్టుల ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 18 లక్షల దాక ఉంటుందని ప్లంబర్ చెప్పాడు. అయితే తాను తమాషాగా అంటున్నాడేమో అనుకున్నా..కానీ తర్వాత అతను సంపాదిస్తున్న మొత్త లెక్కించడంతో అప్పుడు అర్థమైంది. పైగా ఆ వ్యక్తికి హ్యుండాయ్ క్రెటా (2023 మోడల్) కారు ఉంది, ఇల్లు కూడా కట్టుకున్నాడట, ఓ పొలం కూడా కొన్నానని చెబుతున్నాడు. అతను రిచ్ ప్లంబర్ అని అప్పుడే నాకు తెలిసంది. అంటే తానెంతలా సంపాదించాలి అని ఆలోచిస్తు ఉండిపోయా అంటూ పోస్ట్లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు సైతం ఏఐ బ్యూకాలర్ ఉద్యోగాలను అమాంత మిగిసింది అన్నది ఎవరూ అని ఒకరు, శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: స్ట్రాంగెస్ట్కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..) -
సాహసోపేతంగా... ముంబైకి చేరుకున్నషెన్లాంగ్ నౌక
ముంబై: సంకల్పంతో ముందుకెళితే మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు సరైన వ్యూహాలు అక్కరకొస్తాయంటారు. శత్రు నౌకలు, జలాంతర్గాముల సంచారాలను అడ్డుకునే సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’ను హార్మూజ్ జలసంధిలో అక్కడక్కడా ఇరాన్ ఏర్పాటుచేసినా సరే దృఢనిశ్చయంతో అదే మార్గంలో ప్రయాణించి ముడి చమురునౌక షెన్లాంగ్ సూయిజ్మ్యాక్స్ సాహసోపేత యాత్రను పూర్తిచేసింది.పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ జలసంధి గుండా ఎలాంటి దాడుల బారిన పడకుండా సురక్షితంగా ముంబై చేరుకున్న తొలి నౌకగా షెన్లాంగ్ సూయిజ్మ్యాక్స్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. బుధవారమే నౌక ముంబైకి చేరుకున్నప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మార్చినెల ఒకటో తేదీన సౌదీ అరేబీచియాలోని రాస్ తనూరా నౌకాశ్రయంలో ఏకంగా 1,35,335 మెట్రిక్ టన్నుల ముడిచమురును నింపుకుంది. మార్చి మూడో తేదీన అక్కడి నుంచి బయల్దేరి క్షేమంగా ముంబై పోర్ట్కు చేరుకుంది.ఏమాత్రం అనుమానం రాకుండా..అంతర్జాతీయ సముద్రజలాల గుండా వెళ్లే ముడి చమురు, సరకు రవాణా నౌకలు పొరపాటున ఎదురెదురుగా రాకుండా, ఢీకొనకుండా ఉండేందుకు వాటి స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో తెల్సుకునేందుకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తుంటారు. దీని సాయంతో నౌక ఎక్కడ, ఎంత వేగంతో, ఏ దిశలో వెళ్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. దీని సాయంతో నౌకల గుట్టుమట్లను ఇరాన్ తెల్సుకుని నౌకల మీదకు ఆత్మాహుతి డ్రోన్ లేదా క్షిపణులను ప్రయోగించే ప్రమాదముంది. వాటితోనూ పనిలేకుండా సీమైన్స్నూ అక్కడక్కడా అమర్చింది. ఈ ఆటంకాలను అధిగమించేందుకు షెన్లాంగ్ నౌక కెపె్టన్, భారతీయుడు సుఖ్శాంత్ సింగ్ సంధూ బృందం నౌకాయాన విధానమైన ‘డార్క్మోడ్’టెక్నిక్ను అవలంభించారు.నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఎస్ఐ) వివరాలు ఎక్కడా ట్రాకింగ్ డేటాలో నమోదుకాకుండా ఉండేందుకు ఏఐఎస్ను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఫలానా చోట నౌక ఉంది అనే విషయం ఇరాన్కు తెలీకుండా పోయింది. హార్మూజ్ జలసంధిలోకి షెన్లాంగ్ నౌక ప్రవేశించగానే దాని సిగ్నళ్లు ఆర్పేశారు. దీనికి తోడు నౌకలోని అన్ని విద్యుత్దీపాలను ఆర్పేశారు. నౌక సిగ్నళ్లు చివరిసారిగా మార్చి 9వ తేదీన కన్పించాయి. తర్వాత నౌక పత్తాలేకుండా పోయింది. దాడులకు గురై మునిగిపోయిందేమోననే భయాందోళనల నడుమ అనూహ్యంగా నౌక హార్మూజ్ను దాటింది. తర్వాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను స్విచ్ఆన్ చేశారు. దీంతో నౌక క్షేమంగా గమ్యం దిశగా వస్తోందని అర్థమైంది.బుధవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు ఇది ముంబై పోర్ట్కు చేరుకుంది. తర్వాత జవహర్ ద్వీప్ వద్ద సాయంత్రం 6.06 గంటలకు లంగరువేసింది. గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరానికి చెందిన డైనాకామ్ ట్యాంకర్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ ఈ నౌకను నిర్వహిస్తోంది. ఈ నౌకలో 29 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశస్తులు ఉన్నారు. డార్క్మోడ్ విధానంలో మరో ఐదు నౌకలు తమ గమ్యస్థానాల దిశగా కదిలే ఆస్కారముందని నౌకల ప్రయాణాలను పర్యవేక్షించే ‘ట్యాంకర్ట్రాకర్స్.కామ్’సంస్థ పేర్కొంది. రెండు భారీ చమురు రవాణా నౌకలు, పనామా కాలువలో పట్టే మరో పనామామ్యాక్స్ ట్యాంకర్ నౌక, సూయిజ్కాలువలో పట్టే రెండు సూయిజ్మ్యాక్స్ ట్యాంకర్నౌకల జాడ సైతం గత 48 గంటలుగా కన్పించట్లేదని ఇవి కూడా డార్క్మోడ్లో సముద్రయానం చేస్తుండే అవకాశముందని సంస్థ అంచనావేస్తోంది. -
పేద గుండెల అందెల రవళి
మట్టిలో మాణిక్యాలకుప్రోత్సాహం తోడైతే ఎలాంటి ఫలితం వస్తుందో ఆచరణా త్మకంగా చూపిస్తోంది నృత్య పరిచయ్.ముంబైలోని మురికివాడలో నివసించే పేదింటి బిడ్డ మానస్ అహిరేకు డ్యాన్స్ నేర్చుకోవడం అనేది ఒకప్పుడు కలలో మాట. డ్యాన్స్ అంటే అతడికిప్రాణం. కాని చాలామంది పిల్లలలాగే మానస్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి డబ్బు, సరైన వేదిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) మానస్ కలను నిజం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్న లతసనాదేవి ఆధ్వర్యంలో మానస్ మణిపురి నేర్చుకోవడంప్రారంభించాడు. శిక్షణ ఉచితం. ఈ నృత్యశిక్షణ అభిరుచికి మాత్రమే కాదు క్రమశిక్షణ విషయంలోనూ మానస్లాంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. మూడు సంవత్సరాల డి΄÷్లమా పూర్తి చేసిన తరువాత, మానస్ అసిస్టెంట్ టీచర్గా ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం తన ఇంజినీరింగ్ చదువుకు ఉపయోగపడుతోంది. ‘నృత్యం నాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటున్నాడు మానస్.‘ఎన్సీపీఏ’ నృత్య పరిచయ్ కార్యక్రమం ద్వారా పేదపిల్లలకు నృత్యంలో ఉచిత శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మానస్లాంటి ఎంతోమంది పేదింటి పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ముంబై శివారులోని నెరూల్కు చెందిన సిద్ది మాత్రే 2019లో తన నృత్యప్రస్థానాన్నిప్రారంభించింది. నెరూల్లోని ధ్యాన్దీప్ సేవా మండపంలో గురు శర్మిష్ఠ చటోపాధ్యాయ ఆధ్వర్యంలో ఒడిస్సీలో శిక్షణ పొందింది. ఇప్పుడు సిద్ధి అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తోంది. ఖజురహో ఉత్సవంలో ఏడు వందల మంది విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది సిద్ది మాత్రే.నృత్య పరిచయ్ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి పైగా పేదింటి విద్యార్థులు నృత్యం నేర్చుకున్నారు. ‘నృత్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే నృత్య పరిచయ్’ అంటారు ఎన్సీపీఏ నృత్యవిభాగం అధిపతి స్వ΄్నోకల్పదాస్ గుప్తా.‘పిల్లలకు ప్రతిభ ఉండవచ్చు. సరిౖయెన ఆదరణ,ప్రోత్సాహం లేకపోతే తమ అభిరుచి నుంచి దూరం జరుగుతారు. దీన్ని నివారించడానికి నృత్య పరిచయ్ పేద పిల్లలకు చేరువ అవుతుంది’ అంటారు గుప్తా. నృత్యపరిచయ్తో పాటు ఎన్సీపీఏ ‘నృత్య గురుకుల్’ అనే అధునాతన మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘నృత్యగురుకుల్’ కార్యక్రమం క్రింద ఇరవైనాలుగు మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిభ, అంకితభావం, నిబద్ధత ఆధారంగా ఎనిమిది మంది గురువులు వీరిని ఎంపిక చేశారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకుప్రాధాన్యత ఇస్తారు. -
T20 WC: రైలులో 3rd ఏసీలో ముంబైకి వచ్చా: శివం దూబే
టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీ గెలవడంలో శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో తన ఆల్రౌండ్ ప్రతిభతో రాణించి జట్టును ఆదుకున్నాడు. అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో దూబే 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో లోయర్ ఆర్డర్లో వచ్చి మెరుపు బ్యాటింగ్తో మొత్తంగా 235 పరుగులు సాధించిన దూబే.. ఐదు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్లో విజయం తర్వాత తాను రైలులో ముంబైకి చేరుకున్నట్లు దూబే వెల్లడించాడు. విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భార్య అంజుమ్ ఖాన్తో కలిసి 3rd ఏసీలో ప్రయాణించినట్లు తెలిపాడు.3rd ఏసీ టికెట్లు దొరికాయి‘‘విమానాలేవీ అందుబాటులో లేవు. వేకువజామునే నిద్రలేచి అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. రోడ్డు మార్గం కూడా వెళ్లి ఉండవచ్చు. అయితే, రైలు వేగంగా వెళ్తుంది కదా అని ఇలా ప్లాన్ చేసుకున్నాం.నేను, నా భార్య, మా స్నేహితుడు.. ముగ్గురం కలిసి 3rd ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వాటిని బుక్ చేసుకున్నాం. రైలులో నన్ను అభిమానులు గుర్తుపడితే పరిస్థితి చేయిదాటి పోతుందని మా వాళ్లంతా కంగారుపడ్డారు.అలా జరుగకూడదనే నేను మాస్కు ధరించాను. ఫుల్ స్లీవ్స్ ఉన్న టీ షర్టు వేసుకున్నాడు. తెల్లవారి 5.10 నిమిషాలకు ప్లాట్ఫామ్కు చేరుకున్నాం. కానీ అప్పటికే చాలా మంది అక్కడ టీమిండియా జెర్సీలతో సందడి చేస్తున్నారు.పోలీసులకు ముందుగానే సమాచారంఅందుకే రైలు వచ్చేంత వరకు కార్లోనే ఉందామని నా భార్యకు చెప్పాను. రైలు బయల్దేరే ఐదు నిమిషాల ముందు ట్రైన్లోకి వెళ్లిపోయాము. అదృష్టశాత్తూ నన్నెవరూ గుర్తుపట్టలేదు. అయితే, ట్రైన్ దిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే భద్రత కోసం పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాను’’ అని శివం దూబే ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపాడు.నాలుగేళ్ల కుమారుడు అయాన్, రెండేళ్ల కుమార్తె మెవిష్లను తొందరగా కలుసుకోవాలనే రైలు ప్రయాణం రిస్క్ అని తెలిసినా ధైర్యం చేశానని దూబే చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్ హీరో ట్రైన్లో వస్తున్నాడని తెలిస్తే.. అభిమానులు ఎంత హంగామా చేస్తారో తెలిసిందే. అందుకే దూబే ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ముంబైకి చేరుకున్నాడు.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల -
ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..
ఆడపిల్లలను బయటకు పంపించని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాహసోపేతమైన రైడర్ ఆమె. భర్త ప్రోత్సాహంతో సవాలుతో కూడిన డ్రైవ్లను సర్క్యూట్ రేసింగ్లను చాలా చాకచక్యంగా చేసేసిందామె. అలాగే విధి కన్నెర్రజేసి భర్తను తీసుకుపోయినా..అజేయమైన ధైర్య సాహసాంతో కుటుంబాన్ని నడిపించింది. భర్త నింపిన స్థైర్యాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిది పదుల వయసులోనూ డ్రైవింగ్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. సమస్యలు, కష్టాలు నీ గమనాన్ని ఆపే యత్నం చేస్తాయి..అంతమాత్రాన చేతులెత్తేస్తే జీవితమే ఉండదు అని అంటోంది ఈ డైనమిక్ బామ్మ..!.ఆ ధీర వనితే ముంబైకి చెందని 82 ఏళ్ల జరీన్. బొంబాయిలోని ముస్లీం కుటుంబంలో పెరిగిన ఆమె..కళాశాలకు వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి కూడా జరీనానే. సాంప్రదాయ అడ్డంకులని ఆ టీనేజ్ వయసులోనే అధిగమించి శెభాష్ అనుపించుకుంది. అంతేగాదు బాల్య దశలోనే డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. అయితే అందుకు ప్రోత్సాహం, నేర్పేవాళ్లు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. పెళ్లితో ఆమె భర్త తన అభిరుచికి అండగా నిలిచాడు, ప్రోత్సహించాడు. హైవేలపై మినీ బస్సులను నడపడం నుంచి బెంగళూరు నుంచి దాదాపు నిరంతర డ్రైవింగ్ సవాలు వరకు అన్ని డ్రైవ్లను స్వీకరించేలా ప్రోత్సహించాడు. ఇరవైల నాటికి సర్క్యూట్ రైసింగ్ ప్రయత్నించి..థ్రిల్ ఫీల్ని ఎంజాయ్ చేసింది. ప్రతి అనుభవం సాయంతో డ్రైవింగ్లో మరింత స్కిల్ని పుణికిపుచ్చుకుంది జరీన్. దాంతో ఆమెకు డ్రైవింగ్ అభిరుచికి మించినదిగా జీవితంలో భాగమైంది. 1996లో ఆమె భర్త అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టింది. పిల్లలను పెంచుతూ..సొంతంగా డిపార్ట్మెంట్ స్టోర్ని నడిపేది కూడా. ప్రస్తుతం ప్రతి ఉదయం మనవరాళ్లను పాఠశాలకు తీసుకువెళ్తోంది. ఆమె రోజు అపాయింట్మెంట్లు, సామాజిక పని, సమావేశాలతో బిజీగా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది కూడా. అంతేగాదు జరీన్ డ్రైవింగ్ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఒక మార్గానికి మించినదని చెబుతోంది. ఇది స్వాతంత్ర్యం, విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నం. చాలా మందికి, చక్రం తిప్పడం అనేది వారి స్వంత మార్గాన్ని రూపొందించుకునేలా చేయడమే గాక సాహసోపేతంగా సవాళ్లను స్వీకరించే శక్తిని, పరిమితుల నుంచి విముక్తి పొందే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆత్మస్థైర్యంగా చెబుతోంది జరీన్. నెటిజన్లు కూడా ఈ అమ్మమ్మ నిజంగా గ్రేట్. ఎనభైలలో కూడా డ్రైవింగ్ చేస్తున్న ఈ బామ్మ సదా స్ఫూర్తి, ప్రేరణ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
8 రోజులు.. 800 కిలోమీటర్లు..!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్ నుంచి ముంబై వరకూ 800 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సంకలి్పంచాడు.. ఇందులో భాగంగా 30 చోట్ల ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు.. మార్చి 7 ప్రారంభమైన ఈ సైకిల్యాత్ర 14 వరకూ కొనసాగనుంది. ప్రజలకు ఫిట్నెస్, సైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వెల్నెస్ అడ్వొకేట్ కాంతి దత్ ముందుకు కదులుతున్నాడు. ఫియర్ ప్రాజెక్ట్ పేరిట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నోవోటెల్ హోటల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్నెస్ ప్రేమికులు పాల్గొని కాంతి దత్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు.. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. ‘పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థ అయిన సైక్లింగ్ను ప్రోత్సహించడం, రోజువారీ జీవితంలో సైక్లింగ్ను భాగం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం’ ప్రాధాన లక్ష్యమని కాంతి దత్ తెలిపారు. (చదవండి: తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..) -
మరో ఫ్లాట్ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్లో ఉన్న తన ప్లాట్ను రూ.18.50 కోట్లకు విక్రయించింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.ప్రీతి జింటా 2025 నవంబర్లో అదే భవనంలోని (రుస్తోంజీ పరిశ్రమ్ భవనం) 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ప్లాట్ను రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించింది. ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే రెండో ప్లాట్ విక్రయించడం విశేషం.ఇప్పుడు ప్రీతి జింటా విక్రయించిన ప్లాట్కు సంబంధించిన ఒప్పందం.. 2026 మార్చి 2న నమోదు అయింది. దీనిని అమెరికా పౌరసత్వం కలిగిన భారతీయ మూలాల వ్యక్తులు ప్రియా నగర్ & రాజీవ్ నగర్ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందంలో రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది.సినీ ప్రముఖులు ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా.. అవసరమైనప్పుడు విక్రయిస్తున్నారు కూడా. ఇప్పటికే అక్షయ్ కుమార్ 2025లో 100 కోట్లకు పైగా విలువైన అనేక ఆస్తులను విక్రయించారు. అమితాబ్ బచ్చన్ కూడా 2025లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా ప్రీతి జింటా ఈ జాబితాలో చేరారు.ఇదీ చదవండి: ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్' విలన్నవంబర్లో విక్రయించిన ప్లాట్ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రీతి జింటా మళ్లీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోట్ల విలువైన కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ఇది వరల్డ్కప్.. గుర్తుందా?: గావస్కర్ ఫైర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే.సంజూ భారీ అర్ధ శతకంటాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్ పాండ్యా ఫిల్ సాల్ట్ (5) రూపంలో తొలి వికెట్ దక్కించుకోగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యారీ బ్రూక్ (7)ను అవుట్ చేసి కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.బెతెల్ విధ్వంసకర శతకంఅయితే, జేకబ్ బెతెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఇక ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్ బూమ్ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.Every Team India fan after watching Jasprit Bumrah’s masterclass! 🇮🇳🔥ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/My9xx2WPyt— Star Sports (@StarSportsIndia) March 6, 2026బుమ్రా ఏంటి బుమ్రా?ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్ బూమ్ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్కప్ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్ ఫైర్ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్ అభిప్రాయం.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో సూపర్-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్ మధ్యలో లేజర్ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
చూసుకోవా?.. హార్దిక్ కుమారుడి రియాక్షన్.. మహీక షాక్!
ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 27 పరుగులు సాధించాడు. తద్వారా తన మెరుపు ఇన్నింగ్స్తో టీమిండియా 250 పరుగులు మార్కు దాటడంలో సహాయపడ్డాడు.రెండు వికెట్లుఇక బంతితోనూ హార్దిక్ పాండ్యా రాణించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (5)తో పాటు ప్రమాదకర ఆటగాడు సామ్ కర్రాన్ (18) వికెట్ను కూడా హార్దిక్ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ముంబై వేదికగా వాంఖడే మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు సెలబ్రిటీలు తరలివచ్చిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబంతో పాటు దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దంపతులు సహా బాలీవుడ్ ప్రముఖులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించారు.నీతా అంబానీతో కలిసిఇక హార్దిక్ పాండ్యా ప్రేయసి మహీక శర్మ కూడా మరోసారి స్టాండ్స్లో సందడి చేసింది. నీతా అంబానీతో కలిసి మహీక ఒకే వరుసలో కూర్చుంది. అయితే, ఆమెతో పాటు హార్దిక్ కుమారుడు అగస్త్య ఉండటం విశేషం. తండ్రి బ్యాటింగ్ను ఆస్వాదించిన అగస్త్య.. అతడు అవుటైన తీరును మాత్రం తట్టుకోలేకపోయాడు.ఆ మాత్రం చూసుకోవా?భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి.. విల్జాక్స్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా పరుగు పూర్తి చేసి రనౌట్ అయ్యాడు. మరో పరుగుకు యత్నిస్తున్న క్రమంలో జేకబ్ బెతెల్ బంతిని అందుకుని వికెట్ల వైపు త్రో చేయగా.. వికెట్ కీపర్ బట్లర్ పని పూర్తిచేశాడు. దీంతో హార్దిక్ అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐదేళ్ల అగస్త్య కోపంతో ఊగిపోయాడు. ‘‘ఛ.. అంత బాగా ఆడి.. ఇంత చెత్తగా అవుటయ్యావేంటి నాన్నా.. ఆ మాత్రం చూసుకోవా?’’ అన్నట్లుగా గట్టిగా అరిచినట్లు కనిపించింది.ఆమె చేయి పట్టుకుని ఆ సమయంలో మహీక అగస్త్య భుజాలు పట్టుకుని కూల్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం మహీక తనతో పాటు అగస్త్యను తీసుకువెళ్లింది. అగస్త్య ఆమె చేయి పట్టుకుని కారు ఎక్కుతున్న వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Hardik’s Girl Friend Mahieka with His Son Agasthya pic.twitter.com/oJwx1mxUU6— Ajit Samachar (@SamacharAj10350) March 6, 2026 Hardik Pandya's son Agastya pandya with his dad's girlfriend Mahieka Sharma 😭♥️#INDvsENG pic.twitter.com/5U5DejxvKj— Chota Don (@choga_don) March 5, 2026కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యాకు.. ఆమె ద్వారా కుమారుడు అగస్త్య కలిగాడు. అయితే, నటషాకు విడాకులు ఇచ్చిన పాండ్యా ప్రస్తుతం మహీకతో ప్రేమలో ఉన్నాడు. ఇక సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో గెలిచి భారత్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC 2026: ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్ -
ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్' విలన్
రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. సినీతారలు ఎప్పటికప్పుడు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. బాబీ డియోల్, ఆయన భార్య తానియా డియోల్ ముంబైలోని అంధేరీలో 3,400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఐదు కమర్షియల్ ఆఫీసులను కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.15.05 కోట్లు అని తెలుస్తోంది.బాబీ డియోల్ దంపతులు కొనుగోలు చేసిన ఐదు కమర్షియల్ ఆఫీసులు.. అంధేరీ వెస్ట్లోని లింక్ రోడ్లో ఉన్న యురా బిజినెస్ పార్క్ - ఫేజ్ 2 రెండవ అంతస్తులో ఉన్నాయి. అదే భవనంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, చిత్రనిర్మాత రాకేష్ రోషన్ & ప్రమీలా రోషన్తో సహా రోషన్ కుటుంబ సభ్యులకు చెందిన అనేక ఆఫీస్ యూనిట్లు కూడా ఉన్నాయి.సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన అష్టి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. లావాదేవీ ఫిబ్రవరి 27, 2026న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి రూ. 90 లక్షలకు పైగా స్టాంప్ డ్యూటీతో పాటు దాదాపు రూ.1.50 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. 2027 డిసెంబర్ నాటికి బాబీ డియోల్ దంపతులు స్వాధీనం చేసుకోనున్నారు. ఐదు కార్ల పార్కింగ్ స్థలాలతో పాటు.. ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు! -
మూడు రోజులు ఫ్రీ ఫుడ్ : పోటెత్తిన జనం
బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్లెట్ని ముంబైలోని ఈరోస్, చర్చ్గేట్లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్స్టాలో ప్రకటించింది. మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య Hehe…for that 1 FREE dish 😄😄😄@RameshwaramCafe u really need this & those social influencers? Really? pic.twitter.com/ro6pquBCYU— Neeta Kolhatkar (@neetakolhatkar) March 3, 2026 రామేశ్వరం కేఫ్రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో ప్రజాదరణ పొందింది. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by SANJAY | The Travel Freak 🇮🇳 (@sanjay_thetravelfreak) -
ముంబైలో హై వోల్టేజ్ మ్యాచ్..
-
పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు: టీమిండియాకు హ్యారీ బ్రూక్ వార్నింగ్
టీమిండియాతో సెమీ ఫైనల్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్ గురించి తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 లీగ్ దశలో నేపాల్ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్.. ఆ తర్వాత సూపర్-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్ గెలిచింది.కల నిజమైన తరుణం ఇదిఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు.. అయినాపూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్ ఆడగలము.వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు. తాము ఇప్పటివరకు పర్ఫెక్ట్గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం సెమీ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్
టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉంది. గ్రూప్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.ఇంగ్లండ్తో సెమీ ఫైనల్అయితే, సూపర్-8లో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడించి సెమీస్కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ (IND vs ENG)తో గురువారం తలపడనుంది టీమిండియా. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక.ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. అయితే, మంగళవారం నాటి చంద్ర గ్రహణం ప్రభావం టీమిండియాపై కూడా పడింది. గ్రహణం కారణంగా సూర్యకుమార్ సేన తమ ప్రాక్టీస్ సెషన్ను గంటపాటు వాయిదా వేసుకుంది.టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్కాగా గ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 నిమిషాల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 6- 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే ఏడు గంటలకు నెట్ సెషన్ను ఆరంభించింది. గ్రహణం సమయంలో ఏ పని చేయకూడదని.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందేమోనన్న భయంతో భారత జట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అవును.. మా వాళ్లు చెప్పారుఈ విషయం గురించి టీమిండియా కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. ‘‘అవును.. చంద్ర గ్రహణం గురించి నాకు మా వాళ్లు చెప్పారు. అందుకే సెషన్ను వాయిదా వేసుకున్నాం. అయితే, గ్రహణం ఒక్కటే మా రాతను మారుస్తుందనే భయం లేదు. గెలుపు కోసం అత్యుత్తమంగా ప్రయత్నించడమే ముఖ్యమైనది’’ అని మోర్కెల్ పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్కు ఆఖరిగా బుధవారం కూడా టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే ఇది ఆప్షనల్ కావడంతో వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ మాత్రమే నెట్స్లో శ్రమించారు. మిగతా వారు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs ENG: అభిషేక్ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి -
ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకున్నారన్న ప్రచారం ఉత్తిదేనా?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తాబా ఖమేనీ (అలీ ఖమేనీ కుమారుడు)ని ఎన్నుకున్నారంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ద్వారా ఆ దేశ ప్రభుత్వం ఖండించింది.“దేశానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎంపిక చేసిందని మీడియాలో ప్రచారం అవుతున్న నివేదికలకు ఏ ఆధారాలూ లేవు. వాటిని అధికారికంగా ఖండిస్తున్నాం” అని ఎక్స్లో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ తెలిపింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా, అతడిని టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ఇవాళ ఉదయమే హెచ్చరించిన విషయం తెలిసిందే.కాగా, మొజ్తాబాకు వారసుడిగా అలీ ఖమేనీని ఎన్నుకున్నారని, సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరిస్తారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. కొన్ని గంటల్లోనే ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొజ్తాబా ఖమేనీని వారసుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పింది.మొజ్తాబా తన దివంగత తండ్రి అలీ ఖమేనీ కార్యాలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నత వర్గం, ఖుద్స్ దళంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. మొజ్తాబా తన తండ్రి కంటే కఠిన వైఖరితో ఉంటారని తెలిపింది. ఇరాన్లో నిరసనకారులపై జరిగిన హింస, అణచివేతల వెనుక మొజ్తాబా పాత్ర ఉందని వివరించింది. 2019 నవంబర్లో అమెరికా ట్రెజరీ విభాగం మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వంలో ఏ పదవీ లేకపోయినప్పటికీ సుప్రీం నాయకుడి తరఫున అధికారిక ప్రతినిధిగా వ్యవహరించినందుకు అతడిని గుర్తించింది.మరోవైపు, ఇరాన్ మీడియా ప్రకారం.. ఇరానీయులు దివంగత సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ పార్థివ దేహానికి ఇవాళ రాత్రి టెహ్రాన్లోని ఇమామ్ ఖమేనీ ప్రార్థనా మైదానంలో జరిగే కార్యక్రమంలో తుది వీడ్కోలు పలుకనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుంది, అంతిమయాత్ర తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ప్రతీకారంతో ఇరాన్పై బాంబులతో దాడి చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు.వైట్ హౌస్లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “మేము చర్యలు చేపట్టకపోతే, అణుయుద్ధం జరిగేది. వారు అనేక దేశాలను నాశనం చేసేవారు. వారి మనస్తత్వం సరిగ్గాలేదు, కోపంతో ఉన్నారు, వారు పిచ్చివాళ్లు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగించేవారు” అని చెప్పారు. Reports circulating on media regarding potential candidates for leadership selected by Iran’s Assembly of Experts have no official source and are officially denied.#Iran#AssemblyOfExperts#FactCheck pic.twitter.com/g9b9znt8j8— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 4, 2026 -
మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్ డీల్ హాట్ టాపిక్
ముంబైలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గోరేగావ్ ఒకటి. ఆధునిక హై-రైజ్అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్ (Sushmita Sen), ఆమె తల్లి సుబ్రా సేన్ ముంబైలో తమ అపార్ట్మెంట్ను అద్దెకు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. దీని నెలవారీ అద్దె రూ. 1.95 లక్షలతో 36 నెలల (3 ఏళ్లు) లీజ్ కిచ్చారు. అంటే ఈ ప్రాపర్టీ ద్వారా మొత్తం మూడేళ్లకు గాను సుమారు 74 లక్షలు (73.76 లక్షలు) ఆదాయం సమకూరనుందిఈ లగ్జరీ ఫ్లాట్ గోరేగావ్లోని ప్రముఖ 'ఓబెరాయ్ ఎక్స్క్విజిట్' (Oberoi Exquisite) ప్రాజెక్ట్లో ఉంది. లీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్సైట్లో స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం. ఈ ఒప్పందం అధికారికంగా ఫిబ్రవరి 2026లో నమోదు చేయబడింది. దీని ప్రకాం సెక్యూరిటీ డిపాజిట్ కింద 6 లక్షలు కాగా, స్టాంప్ డ్యూటీ కింద రూ.18,900, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 1,000 చెల్లించారు. ప్రతి ఏటా 5శాతం మేర అద్దె పెరుగుతుంది.ఈ ప్రాపర్టీ ప్రత్యేకతలు విషయానికి వస్తే కార్పెట్ ఏరియా 996 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఏరియా 1,241 చదరపు అడుగులు. ఇందులో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియోసుస్మితా సేన్ గుర్తించి సంక్షిప్తంగా1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సుస్మితా సేన్ చరిత్ర సృష్టించారు. 'బీవీ నంబర్ 1', 'మై హూ నా' వంటి సినిమాలతో మెప్పించిన సుస్మితా సేన్ ఇటీవల 'ఆర్య', 'తాళి' వంటి వెబ్ సిరీస్లతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) -
‘పాట వినపడలే..’.. ప్రముఖ సింగర్ షోలో ఫ్యాన్స్ కన్నీళ్లు!
ముంబై: ప్రముఖ పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా ‘పీ-పాప్ కల్చర్ వరల్డ్ టూర్’ పేరిట ముంబైలో నిర్వహించిన కన్సర్ట్ వివాదాస్పదంగా మారింది. హోలీ థీమ్తో నిర్వహించిన ఈ వేడుకలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీ, పూణేలలో జరిగిన ప్రదర్శనలు సవ్యంగా సాగినప్పటికీ ముంబైలో నిర్వాహక లోపాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మండుతున్న ఎండలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.మార్చి 3న జరిగిన ఈ కన్సర్ట్లో తొక్కిసలాట లాంటి పరిస్థితులు నెలకొనడమే కాకుండా, ఎండ వేడికి తట్టుకోలేక పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ జోన్లో మాత్రమే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి, వీఐపీ, జనరల్ జోన్లను గాలికి వదిలేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సి రావడంతో చాలా మంది హీట్స్ట్రోక్కు గురయ్యారు. వేదిక చాలా దూరంగా ఉండటం, భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అసలు కరణ్ ఔజ్లా ఉన్నాడో లేడో కూడా అర్థం కాలేదని కొందరు అభిమానులు వాపోయారు. ప్రొఫెషనల్ కన్సర్ట్లా కాకుండా స్కూల్ యాన్యువల్ డే వేడుకలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.ఈ విమర్శలపై గాయకుడు కరణ్ ఔజ్లా స్పందించారు. ముంబై అభిమానుల అసంతృప్తిని గమనించిన ఆయన.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా వారికి క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన చేశారు. ముంబైలో మరోసారి నైట్ కన్సర్ట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన టీమ్ మరింత పటిష్టమైన ఏర్పాట్లతో తిరిగి వస్తుందని, అభిమానులకు మెరుగైన అనుభూతిని అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ రెండో షోకు సంబంధించిన తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 28న ఢిల్లీలో 75 వేల మంది అభిమానుల మధ్య అట్టహాసంగా ప్రారంభమైన ఈ టూర్.. రాబోయే రోజుల్లో చండీగఢ్, ఇండోర్, బెంగళూరు సహా పలు నగరాల్లో కొనసాగనుంది.ఇది కూడా చదవండి: తాళి కట్టే వేళ.. తల పైనుంచి మిస్సైళ్లు! -
క్రికెట్ దిగ్గజం సచిన్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు
-
చెత్త ఫీల్డింగ్.. టీమిండియా గెలవలేదు: పాక్ మాజీ బౌలర్ ఓవరాక్షన్
పాకిస్తాన్ మాజీ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశలో సూర్యకుమార్ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్-8గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి.. సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్ సెమీస్ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్ చేశాడు.అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్ ఆమిర్ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.ఆ జట్టు ఫీల్డింగ్ చూడండిఅయినప్పటికీ ఆమిర్ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘క్రికెట్ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్ చూడండి.గత మ్యాచ్లో వాళ్లు 3-4 క్యాచ్లు వదిలేశారు. జస్ప్రీత్ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదుఇక వెస్టిండీస్ బ్యాటర్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్ ఫేవరెట్ కాదు. వాళ్లు ఫైనల్ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్ ఆమిర్ అతి చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్కు వాంఖడే స్టేడియం వేదిక. చదవండి: అతడిని సెలక్ట్ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్ సిగ్నల్! -
ముంబై మహానగరంలో ‘గరీబీ దర్శన్’
ముంబై: ముంబై మహానగరం.. ఎంతో మందికి కలల నగరం. ఆకాశన్నంటుకునే భవనాలున్నట్టే.. అత్యంత పేదరికంలోని మురికి వాడలూ ఉన్నాయి. అందులో అందరికీ తెలిసింది ధారావి. ఇక్కడి పేదరికమే అమ్మకపు సరుకు. దాన్ని డాలర్లకు అమ్ముతున్నారు స్తానికులు. మన దేశంలో మురికి వాడల పర్యాటకం ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ధారావి ‘గరీబీ దర్శన్’కో (Gareebi darshan) ప్రత్యేకత ఉంది. అది ధనిక ముంబైకర్లకే కాదు.. పేద ధారావి వాసులకూ ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ధారావి ఇరుకు గల్లీల్లో విదేశీయులను ఓ రెండు గంటలు తిప్పితే చాలు.. రూ.15 వేల రూపాయలు మీ చేతికొస్తాయి. అవును.. ఒకప్పుడు ఇలాంటి పర్యటనలను శిక్షణ పొందిన గైడ్లే నిర్వహించేవారు. అదంతా వ్యవస్థీకృతంగా ఉండేది. కానీ ఇప్పుడు గైడ్లు ధారావి నిర్వాసితులు. ఎందుకంటే కిలోమీటర్ల మేర, మూడు అడుగుల వెడెల్పు మాత్రమే ఉన్న ఇరుకైన గల్లీలలో చాలా సులభంగా తీసుకెళ్లగలిగేది, బయటికి తీసుకురాగలిగేది వారు మాత్రమే. అలా తీసుకెళ్లి, ధారావిని చూపించి, క్షేమంగా బయటపడేసినందుకు వారు చేసే ఛార్జ్ ఒక్కొక్కరికి రూ.15,000. ఒక్కోసారి బృందాలుంటాయి.ఐదుగురు సభ్యులున్న బృందం వస్తే.. రూ.75 వేల రూపాయలు చేతికొచ్చినట్టే. ఇదో కార్పొరేట్ ఉద్యోగి నెల జీతం. ఒకప్పుడు గైడ్లకే పరిమితమైన ఈ వ్యాపారాన్ని ధారావికర్లు (Dharavikars) స్వయంగా చేస్తున్నారు. అయితే ఇలా మురికివాడలను చూడటానికి కేవలం విదేశీయులే రావడం లేదు.. ఇలాంటి చోట్లకు ఎప్పుడూ వెళ్లని కొందరు ముంబై వాసులు.. దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్లూ ఆసక్తి చూపుతున్నారు. అయితే అలాంటి పర్యటనకు మన దేశం వాళ్లు వెళ్లే మాత్రం రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ‘వాయూరిజం’ అని పిలిచే ఈ పర్యాటకం ధారావి వాసులకు ఆదాయ మార్గమైంది. తమ ఇంటిని చూపించే.. ఇల్లు గడుపుతున్నారు. అయితే అక్కడి పరిస్థితుల ఫొటోలు తీసుకోవాలంటే మాత్రం వారి అనుమతి తీసుకోవాలి. అయితే ప్రారంభంలో ధారావికి సందర్శకులను తీసుకెళ్లే ఆలోచనను చాలా మంది వ్యతిరేకించారు. ఇది పేదరిక పర్యాటకంలా అనిపించింది. ఒకరి ఆకలి, పేదరికం మరొకరికి దర్శనీయం కావడం ఇబ్బందిగా అనిపించింది. కానీ.. యూరోపియన్ సామాజిక కార్యకర్త క్రిస్ వే, కృష్ణ పూజారి 2005లో ప్రారంభించిన రియాలిటీ టూర్స్ ఆలోచనా తీరును మార్చింది. గైడ్స్గా స్థానిక విద్యార్థులుంటే.. వారికి చదువుకోసం డబ్బు వారే సంపాదించుకోవచ్చని కొత్త ఆలోచనతో ‘ధారావి’ నడక ప్రారంభించారు. అలా ధారావిలో మురికివాడల పర్యాటకం ఒక కుటీర పరిశ్రమగా మారింది. ఇప్పుడు పనికొచ్చే రెండు ఇంగ్లిష్ మాట్లాడగలిగేవాళ్లు.. గైడ్గా మారిపోవచ్చు. అయితే, ధారావి పునరాభివృద్ధి తరువాత ఈ పరిస్థితిపై అనిశ్చితి ఉంది. -
జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
సిక్కులకు న్యాయం కోసం కృషి
నవీ ముంబై: సిక్కులకు గౌరవం, న్యాయం దక్కేలా కృషి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే, 1984లో ఇందిర మరణానంతరం సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ జరిపేందుకు తమ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందన్నారు. మూసివేసిన ఎన్నో కేసులను తిరిగి తెరిచి, విచారణ చేపట్టామని తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేశామన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్లో సిక్కులకు మరింత ప్రాముఖ్యతను కల్పించామన్నారు. గురు తేజ్ బహదూర్ అమరత్వం పొంది 350 ఏళ్లయిన సందర్భంగా ముంబైలోని ఖర్గార్లో ఆదివారం జరిగిన ‘హింద్–ది–చదర్’ను ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా మాట్లాడారు. అఫ్గానిస్తాన్లో పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులు, సిక్కు కుటుంబాల భద్రత ప్రమాదంలో పడగా ప్రభుత్వం తక్షణమే స్పందించి సురక్షితంగా స్వదేశానికి తరలించిందని గుర్తు చేశారు. అఫ్గాన్లో యాతనలు పడిన సిక్కులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించామని తెలిపారు. జమ్మూకశ్మీర్కు చెందిన సిక్కు కుటుంబాల పునరావాసానికి చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. వేలాది మంది సిక్కుల పేర్లను బ్లాక్ లిస్టు నుంచి తొలగించడంతోపాటు వీసా నిబంధనలను సడలించినట్లు ప్రధాని వివరించారు. భవిష్యత్తుకు బాటలు పరిచేవి..హింద్–ది–చాదర్ వంటి కార్యక్రమాలు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి కాకుండా భవిష్యత్తుకు దారులు వేస్తాయన్నారు. ‘గురు తేజ్ బహదూర్ కాలంలో ధైర్యం, సత్యసంధతకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో, నేటికీ అంతే సందర్భోచితంగా ఉంది. మన కొత్త తరం ఇటువంటి విలువలని అందిపుచ్చుకున్నప్పుడు, సంప్రదాయం అనేది కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోదు; అది భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. మనం చరిత్రను కేవలం స్మరించుకోవడమే కాదు, దానిని మన జీవితాల్లోకి కూడా తెచ్చుకోవాలి’అని ప్రధాని మోదీ తన వర్చువల్ ప్రసంగంలో పేర్కొన్నారు.మన గురువుల త్యాగాలు..దేశ చరిత్ర పరాక్రమం, సమన్వయం మరియు సహకారంతో నిండి ఉందని ఆయన అన్నారు. గురువుల అత్యున్నత త్యాగం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసిందని ప్రధాని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గం వారి నుంచి స్ఫూర్తిని పొందిందని, అది సమాజం సత్య మార్గంలో ముందుకు స్థిరంగా సాగడానికి సాయపడిందని ప్రధాని తెలిపారు. ‘దేశానికి సామాజిక ఐక్యత ఎంతో అవసరమైన ఈ సమయంలో, మన గురువులు, సాధువుల ఆశీస్సులు మనకు ఉన్నాయనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తోంది. ఈ ప్రయాణం గత ఏడాది నాగ్పూర్ నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత నాందేడ్ వరకు సాగింది. నేడు నవీ ముంబైలో ఈ ప్రయాణం ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది’అని ప్రధాని అన్నారు. -
వీధి కుక్కల దాడి.. బాలుడు మృతి
ముంబై: దేశవ్యాప్తంగా వీధి కుక్కల బీభత్సం నానాటికీ పెరుగుతుంది. సుప్రీంకోర్టు స్థానిక ప్రభుత్వాలు వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు కనబడడం లేదు. తాజాగా మహారాష్ట్రలో రోడ్డుపై ఆడుకుంటున్న 7 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.థానే జిల్లాలోనే కళ్యాణ్ ప్రాంతంలో కుశిల్ శంకర్ వాఘే అనే 7సంవత్సరాల బాలుడు ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అయితే ఇంతలోనే అక్కడే ఉన్న వీధికుక్కలు అతనిపై దాడి చేశాయి. ఇది గమనించిన అతని మిత్రుడు నిలేశ్ బాగ్లే పరిగెత్తుతూ వచ్చి అతనిని కాపాడే యత్నం చేశాడు. అయితే ఆ కుక్కలు ఆ బాలుడిపై కూడా దాడి చేశాయి.దీంతో ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన వారి తల్లిదండ్రులు వెంటనే వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు అధికంగా కావడంతో కుశిల్ అనే బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రస్తుతం నిలేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డాక్టర్లు తెలిపారు.అయితే ఈ ఘటనపై ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో వీధికుక్కల బెడద విపరీతంగా ఉందన్నారు. అక్కడి ప్రజలపై తరచుగా దాడులకు తెగబడుతన్నాయన్నారు. స్థానిక ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)
-
పానీపూరీని ఇలా కూడా సర్వ్ చేయొచ్చా..!?
ఆహార విక్రేతలు వాళ్ల ఫుడ్ స్టాల్ అమ్మకాల కోసం ఎన్నో రకాల వ్యూహాలతో సాగుతారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ ఈ పానీపూరీ విక్రేత అంతకుమించి క్రియేటివిటీతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. మొత్తం సెటప్ చూస్తే..అది పానీ పూరీ అమ్ముతున్నట్లుగా ఉండదు..ఏదో వార్లా కనిపిస్తుంది. ఈ వ్యక్తి క్రియేటివిటీకి, ఐడియాకు మెచ్చుకోకుండా ఉండలేం. అంతలా ఫుడ్స్టాల్ని సెటప్ చేశాడు మరి..!. ఎక్కడంటే..ముంబైకి చెందిన పానీపూరీ వ్యాపారి అసాధారణమైన రీతీలో సర్వ్ చేస్తూ అందర్ని ఆకర్షిస్తున్నాడు. ఆఖరికి అతడి ఆహార్యం సైతం పూర్తి విభిన్నంగా ఉంది. అతడు పానీపూరీని పోరాట అడిషన్గా మార్చేశాడు. యుద్ధం చేసే సైనికుల మాదిరిగా పవర్ఫుల్ వార్మ్యాన్లా దుస్తులు ధరించి చేతిలో సూపర్సోకర్ వాటర్గన్తో ప్రజలకు పానీపూరీని సర్వ్ చేస్తున్నాడు. ఆలుకర్రీ స్టఫ్తో ఉన్న పానీపూరీలోకి మసాలా నీటిని గరిటెతో కాకుండా..ఇలా వాటర్గన్తో సర్వ్ చేస్తున్నాడు. కొందరికీ నేరుగా నోటిలోకే వచ్చేలా అందిస్తున్నాడు. కస్టమర్లు సైతం ఆ విధానాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటుండం విశేషం. అంతేగాదు ఒకరకంగా ఆవిచిత్రమైన శైలిని చూసి.. జనాలు ఎగబడి మరి అక్కడకు వచ్చి పానీపూరీలని ఆస్వాదిస్తున్నారు. ఇది మార్కెటింగ్ ట్రిక్ అయినా..పొట్టకూటి కోసం మనిషి ఎంత దూరమైన వెళ్తాడు..పైగా తనలోని టాలెంట్ మొత్తం బయటకు తీసి ఏదోరకంగా బతుకుబండిని నడిపించేందుకు ఆరాటపడతాడు. అందుకు నిదర్శం ఈ పానీపూరీ వ్యాపారి క్రియేటివిటీనే కదూ..!.(చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ) -
ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!
ఏడేళ్ల చిన్నారి..తన వయసుకు అనితరసాధ్యమైన దాన్ని అవలీలగా చేధించింది. పెద్దపెద్ద ఈతగాళ్ల డ్రీమ్ ఎలిఫెంటా ద్వీపం నుంచి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఈదడం. కానీ ఈ చిన్నారి చాలా అవలీలగా చేసి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అత్యంత సవాలుతో కూడిన సముద్ర మార్గంలో ఈదడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..?..అస్సాంకి చెందిన ఏడేళ్ల కియుచెంఘన్ ఫుకాన్ ఈ ఘనత సాధించింది. ఆ చిన్నారి ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకు 3 గంటల 29 నిమిషాల్లో ఈదింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆ ఘనతను పూర్తి చేసింది. కియుచెంఘన్ ఎలిఫెంటా ద్వీపం నుంచి మధ్యాహ్నం 2:36 గంటలకు తన ఈత ప్రారంభించి సాయంత్రం 6:05 గంటలకు గేట్వే ఆఫ్ ఇండియాకు చేరుకుంది. ఈ ప్రదేశం బలమైన ప్రవాహాలు, మారుతున్న సముద్ర పరిస్థితులకు ప్రసిద్ధిచెందింది. ఇది అరేబియా సముద్రంలో అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి కఠినతరమైన సముద్ర మార్గాన్ని ఏడేళ్ల ప్రాయంలో అవలీలగా జయించి.. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కాగా, కియుచెన్ఘాన్ ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. హేమంగా ఫుకాన్ రిమ్లి, హజారికా ఫుకాన్ దంపతుల కుమార్తె. ఆ చిన్నారి కుటుంబం గౌహతిలోని సిక్స్ మైల్లో నివసిస్తుంది. ఈ చిన్నారి గౌహతిలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అక్వాటిక్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇక అస్సాం స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ దాస్ ఈ విజయాన్ని అస్సాంకే గర్వకారణంగా పేర్కొన్నారు. అస్సాం క్రీడా మంత్రి నందితా గార్లోసా ఈ చిన్నారి స్విమ్మర్ని అభినందించారు. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయి కూడా ఈ చిన్నారినే. View this post on Instagram A post shared by OPEN WATER SWIMMING ACADEMY, INDIA (@owsaindia) (చదవండి: డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..) -
Mumbai: కుప్పకూలిన నిర్మాణంలోని మెట్రో పిల్లర్
మహరాష్ట్ర: ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కుప్ప కూలింది. ఈ ఘటనలో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. నలుగురికి గాయాలు కాగా..బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
పాఠం నుంచి పాకం దాకా
ఆమె ఎంబీఏ చేసింది. ముంబాయిలో ఓ పేరున్న కార్పొరేట్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పెద్ద జీతం మీద పాఠాలు చెబుతూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి ఆమె పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే హెల్దీ శ్నాక్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. రుచిగా, శుచిగా ఉండే చిరుతిళ్లను చాలా తక్కువ ధరకే అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తయారు చేసే శ్నాక్స్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా దాదాపు పదిహేను దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆమే జైపూర్కు చెందిన రిచాశర్మ. ఇంతకీ ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో... ఎంటర్ప్రెన్యూర్గా ఎలా ఎదిగిందో చూద్దాం...రిచాశర్మది జైపూర్. ఫైనాన్స్లో ఎంబీఏ చేసింది. అక్కడే ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేసింది. అయితే అది ఆమెకు చాలా దూరం కావడంతో ప్రయాణాలు చేయలేక వడోదరలోని పరుల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరింది. అక్కడ నాలుగైదేళ్ల పాటు పని చేసింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబాయి మహానగరంలో కాలు పెట్టింది. అప్పుడే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడం తో ఇక ఉద్యోగం ఊసులేకుండా వారితోటే పూర్తికాలం గడిచి పోయింది. మెల్లగా ఆ పిల్లలు రెండు, ఆరు తరగతులకొచ్చారు. వాళ్లకోసం రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసి పెట్టేది. ఈ క్రమంలో ఆమె చేసే తినుబండారాలను పిల్లల ద్వారా వారి స్నేహితులు, వాళ్ల వాళ్ల ఇళ్లలోనిÐ éళ్లూ రుచి చూశారు. అవి వారికి బాగా నచ్చడంతో వారిలో కొందరు ‘మీ పిల్లలకోసం తయారు చేసేటప్పుడే... మరికొద్ది మొత్తంలో మా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు కదండీ’ అని అడగడంతో రిచాశర్మ గ్లుటెన్, మైదా, డాల్డా లాంటివి లేకుండా రుచికరమైన కమ్మటి శ్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో లడ్డూలు, ధోక్లా, కచోరీలు, సబ్జీలు తయారు చేసేది. అవి అక్కడివాళ్లకు అమితంగా నచ్చేవి. మాకు కావాలంటే మాకు కావాలని అందరూ పోటీపడేవాళ్లు. దాంతో ఆమె ‘రిచా ప్లేటర్’ పేరుతో శ్నాక్స్ సప్లై చేసేది. కోవిడ్ మార్చేసిన జీవితంఅలా సాగుతున్న ఆమె జీవితంలో కోవిడ్ పెను మార్పు తెచ్చింది. ఇక్కడ మార్పు అనగానే ఆమె చేసే శ్నాక్స్ బిజినెస్ కాస్తా దెబ్బ తిందేమో అని జాలిపడితే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే కోవిడ్ సమయం లో రిచాశర్మ రుచిగా శుచిగా శుభ్రంగా చేసే హోమ్ మేడ్ ఫుడ్ కోసం జ నాలు ఎగబడ్డారు. దాంతో ఆమె బిజినెస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. అప్పుడే ఆమె తన బిజినెస్ స్కిల్స్ను మరింత అభివృద్ధి చేసుకుంది. ఆర్డర్లకు తగ్గట్టే ప్రిపేర్ చేయడం వల్ల మిగిలి పోవడం కానీ, తక్కువ కావడం కానీ ఎప్పుడూ జరగలేదామెకి. దాంతో అప్పటివరకు మామూలు చిన్న చిన్న తినుబండారాల తయారీ నుంచి రకరకాల స్వీట్స్ తయారీకీ శ్రీకారం చుట్టింది రిచా. మొదట్లో నెలకు 20 ఆర్డర్లతో సరిపెట్టుకున్న రిచా శర్మ చూస్తుండగానే నెలకు 500 ఆర్డర్లకు సప్లై చేసేంతగా అభివృద్ధి చెందిందామె వ్యా పారం. ఖర్, బోరివలి, అంధేరిలకే పరిమితమైన ఆమె కష్టమర్లు కోయంబత్తూరు, బెంగళూరు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ల వరకు విస్తరించారు. తన బిజినెస్కు ‘హంబుల్ ఫ్లేవర్స్’ అనే పేరు పెట్టి దానిని ఇంకా ఇంకా పెంచింది రిచా. వచ్చిన లాభాలలో ఐదుశాతం వాటాను ఎన్జీవోలకు డొనేట్ చేస్తుంది రిచా. మరో ఐదుశాతం లాభాలను తనతో పని చేసే వారికి ఇస్తుంది రిచా. వ్యా పారం ద్వారా లాభాలను గడించడం తన లక్ష్యం కాదని, అందరికీ హెల్దీ, టేస్టీ శ్నాక్స్ అందించడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెప్పే రిచాను ఇండియన్ ఇన్స్పైరింగ్ హోమ్ బిజినెస్ ఉమన్ అవార్డు వరించింది. -
నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇంగ్లండ్ తడబడుతోంది. గ్రూప్-‘సి’లో భాగంగా తొలుత నేపాల్తో తలపడ్డ హ్యారీ బ్రూక్ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్లో మాత్రం వెస్టిండీస్ ముందు తలవంచింది.వెస్టిండీస్దే పైచేయిటీ20 ప్రపంచకప్ను రెండేసి సార్లు గెలుచుకున్న ఈ మాజీ చాంపియన్ల మధ్య ముంబైలో జరిగిన పోరులో వెస్టిండీస్దే పైచేయి అయింది. వాంఖెడే మైదానంలో విండీస్ స్పిన్ను ఎదుర్కోలేక ఇంగ్లండ్ విలవిల్లాడింది. ఫలితంగా విండీస్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.నిరాశకు గురయ్యాంఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తమ పరాజయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘నిరాశకు గురయ్యాం. ఓటమి ఎల్లప్పుడూ బాధిస్తుంది. అయితే, ఈరోజు వెస్టిండీస్ అత్యద్భుతంగా ఆడింది. ఆ జట్టులో పవర్ హిట్టర్లు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు.ప్రత్యర్థి బౌలర్ కాస్త తడబడినా వారు ఆ డెలివరీని సిక్సర్గా మలుస్తారు. అయితే, ఈరోజు వాళ్లు చేసిన స్కోరు ఛేదించదగ్గదే. మేము ఆశించినంతగా మంచు ప్రభావం లేదు. మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.సాల్ట్ విధ్వంసకర ప్లేయర్మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయలేకపోయాము. టాపార్డర్ విషయంలో నేనేమీ మాట్లాడలేను. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. సాల్ట్ విధ్వంసకర ప్లేయర్. ఇక జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేపాల్ మీదైనా గెలిచాంఇప్పటికీ టోర్నీలో ముందుకు వెళ్లగలమనే నమ్మకం ఉంది. గత మ్యాచ్లో నేపాల్ మీదైనా గెలిచినందుకు దేవుడికి ధన్యవాదాలు. లేదంటే మేము కష్టాల్లో కూరుకుపోయేవాళ్లం. తదుపరి స్కాట్లాండ్, ఇటలీలపై సత్తా చాటి ముందుకు సాగుతాము’’ అని బ్రూక్ చెప్పుకొచ్చాడు.196 పరుగుల భారీ స్కోరుకాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (42 బంతుల్లో 76 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు), హోల్డర్ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.స్పిన్నర్ల మాయాజాలం ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, జేమీ ఒవర్టన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ బెతెల్ (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించగా... జోస్ బట్లర్ (21), కెప్టెన్ హారీ బ్రూక్ (17) ప్రభావం చూపలేకపోయారు.చివర్లో స్యామ్ కరన్ (30 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. విండీస్ స్పిన్నర్లు గుడకేశ్ మోతీ 3, రోస్టన్ ఛేజ్ 2, అకీల్ హొసీన్ ఒక వికెట్తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చదవండి: SA vs AFG: ‘డబుల్ సూపర్’ ధమాకా -
ముంబై మేయర్గా రీతూ తావ్డే ఏకగ్రీవం
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చరిత్రలో కొత్తదనం చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ముంబై నూతన మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. శివసేన (యూబీటీ) అభ్యర్థిని బరిలోకి దింపకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనితో బీఎంసీపై 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడీ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్కోపర్ వెస్ట్ నుండి మూడుసార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయి రాజకీయాలు, ప్రజా సంక్షేమ రంగాల్లో ఆమెకు దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. 2012లో వార్డు 127 నుండి తొలిసారిగా బీఎంసీలోకి అడుగుపెట్టిన ఆమె, 2017లో వార్డు 121 నుండి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల జనవరి 15న జరిగిన ఎన్నికల్లో వార్డు 132 నుండి ఘనవిజయం సాధించి తన పట్టును మరోమారు నిరూపించుకున్నారు. గతంలో ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ చైర్పర్సన్గా కూడా సేవలందించారు.మొత్తం 227 స్థానాలు ఉన్న బీఎంసీలో బీజేపీ 89 సీట్లు గెలుచుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్రపక్షమైన శివసేన 29 స్థానాలను దక్కించుకుంది. 118 మంది కార్పొరేటర్ల బలంతో బీజేపీ నేతృత్వంలోని 'మహాయుతి' కూటమి మేయర్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంది. 1997 నుండి సుమారు 25 ఏళ్ల పాటు బీఎంసీని పాలించిన శివసేన (యూబీటీ) ఈసారి 65 స్థానాలకే పరిమితమైంది. వారి మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆరు స్థానాలను, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నాయి. సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ అభ్యర్థిని నిలబెట్టకూడదని శివసేన (యూబీటీ) నిర్ణయించుకుంది. -
ముంబై వదిలి ఢిల్లీకి.. ప్రతి నెలా రూ. 75 వేలు ఆదా!
ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరొక నగరానికి మారడం చాలా మందికి సాధారణమే అయినప్పటికీ, ఆ పరిస్థితి ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసిందంటే మనం నమ్మలేం. దీనిని సంబంధించిన ఉదంతంలోనికి వెళితే.. ముంబై లోకల్ రైళ్ల రద్దీని వదిలి.. ఢిల్లీ మెట్రో సౌకర్యాన్ని ఎంచుకున్న ఒక బ్యాచిలర్, తన తాజా అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.రెండింతల తృప్తిఉద్యోగ రీత్యా ముంబై నుంచి దేశ రాజధాని ఢిల్లీకి షిఫ్ట్ అయిన కారణంగా తనకు డబ్బు ఆదా అవడమే కాకుండా, విశాలమైన నివాసాలు, పరిశుభ్రమైన వాతావరణం లభించడంతో తన తృప్తి రెట్టింపు అయ్యిందని ఆ బ్యాచిలర్ పేర్కొన్నారు. ముంబైతో పోలిస్తే ఢిల్లీలో లభించే సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.మరింతగా పెరిగిన పొదుపునెలకు రూ. 1.4 లక్షల వేతనం పొందుతున్న అతను ముంబైలో ఉన్నప్పుడు ఒక సాధారణ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం రూ. 40,000 అద్దె చెల్లించేవారు. అంత ఖర్చు చేసినా అక్కడ అంత సౌకర్యవంతంగా ఉండేది కాదని ఆయన తెలిపారు. అయితే తాను ఢిల్లీకి మారిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని ఆయన వివరించారు. ముంబైలో నెలకు రూ. 40 నుంచి 50 వేలు మాత్రమే పొదుపు చేయగలిగిన ఆయన, ఇప్పుడు ఢిల్లీలో అంతకంటే మెరుగైన జీవనశైలిని గడుపుతూ, నెలకు సుమారు రూ. 75,000 ఆదా చేస్తున్నట్లు వెల్లడించారు. విశాలమైన రోడ్లు, సులభంగా లభించే ఇంటి పనివారు, మెరుగైన వైద్య సేవలు ఢిల్లీలో తన ఖర్చులను భారీగా తగ్గించాయని ఆయన పేర్కొన్నారు.ఈ వైరల్ పోస్ట్పై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ముంబైలో అద్దెలు భరించలేనంతగా ఉన్నాయని ఒకరు వ్యాఖ్యానించగా, ఢిల్లీలోని కాలుష్య సమస్యను మరొకరు గుర్తు చేశారు. ఏడాదిలో మూడు నాలుగు నెలల పాటు ఉండే కాలుష్యాన్ని ఎలాగోలా భరించగలిగితే మిగిలిన విషయాల్లో ఢిల్లీ ఎంతో మెరుగైనదని కొందరు అభిప్రాయపడ్డారు. తరతరాలుగా ఆస్తులు ఉన్నవారికే ముంబై సరిపోతుందని, మధ్యతరగతి, బ్యాచిలర్లకు ఢిల్లీ సరైన ఎంపిక అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.‘ఢిల్లీ కంటే హైదరాబాద్ బెటర్’ఈ చర్చలో భాగంగా మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ కంటే హైదరాబాద్ నగరం ఎంతో ఉత్తమమని ఒక నెటిజన్ చేసిన కామెంట్కు సదరు బ్యాచిలర్ కూడా మద్దతు పలికారు. తాను ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్ను సందర్శించానని, భారతదేశంలోని నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. సౌకర్యవంతమైన జీవితానికి హైదరాబాద్ సరైన వేదిక అని ఈ చర్చలో పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’పై ట్రంప్ కరుణ.. కీలక రంగానికి సుంకాల ఎత్తివేత! -
భారీ ధరకు ఫ్లాట్ కొనుగోలు చేసిన నటుడు
ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన పాలి హిల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ పాలి హిల్లో ఉన్న ఒక ఖరీదైన ఫ్లాట్ను దాదాపు రూ.29.4 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ విలాసవంతమైన ఫ్లాట్ పాలి హిల్లోని నవ్రోజ్ అపార్ట్మెంట్లో ఉంది.ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలు..విక్రయ ధర: రూ.29.37 కోట్లురిజిస్ట్రేషన్ తేదీ: ఫిబ్రవరి 5, 2026స్టాంప్ డ్యూటీ: రూ.1.76 కోట్లుఅమ్మినవారు: కపిల్ ఎం.మహతానీఈ అపార్ట్మెంట్ 2,989.05 చదరపు అడుగుల కార్పెట్ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. మార్కెట్లో పలికిన ధర ప్రకారం చదరపు అడుగుకు సుమారు రూ.98,000 చొప్పున ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాంద్రా, పాలి హిల్ మైక్రో మార్కెట్లలో ఉన్న రేట్లకు అనుగుణంగానే ఈ ధర నిర్ణయించారు. ముంబైలోని పశ్చిమ శివారు ప్రాంతాల్లో బాంద్రాలోని పాలి హిల్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐ) ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతారు. ఈ ప్రాంతంలో లగ్జరీ అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.80,000 నుంచి రూ.1.30 లక్షల వరకు పలుకుతున్నాయి.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
ముకేశ్ అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా పేరొందాడు రోహిత్ శర్మ. భారత్కు 2024లో టీ20 ప్రపంచకప్ అందించిన హిట్మ్యాన్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో హిట్మ్యాన్ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్కప్ అంబాసిడర్గా నియమించింది.వాంఖడేలో వరల్డ్కప్ ట్రోఫీతో ఎంట్రీఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్కప్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. అమెరికాతో మ్యాచ్ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పి.. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాడు.అంబానీ కుటుంబం ఆప్యాయతఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్ మ్యాచ్కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.ముకేశ్ అంబానీ స్వయంగా ఛాయ్ ఇవ్వగాఅంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్తో కూడిన సాసర్ను ముకేశ్ అంబానీ రోహిత్ శర్మకు అందించారు. అయితే, రోహిత్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Last night, Rohit Sharma was going to sit beside Ritika, but Mukesh Ambani asked him to sit next to him instead 🤍 pic.twitter.com/d9YEMXajlv— Kusha Sharma (@Kushacritic) February 8, 2026కాగా 2011 నుంచి రోహిత్కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన హిట్మ్యాన్ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్. అయితే, రోహిత్ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్ -
‘లోకల్’లో బురఖా వ్యక్తి కలకలం
ముంబై: ముంబైలోని సెంట్రల్ రైల్వే పరిధిలో గల ఘాట్కోపర్ స్టేషన్ సమీపంలో కలకలం చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఒక పురుషుడు ముంబై లోకల్ ట్రైన్లోని మహిళల బోగీలోకి ప్రవేశించాడు. రద్దీగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా మహిళల కంపార్ట్మెంట్లోకి చొరబడటంతో అక్కడి మహిళా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. Shocking incident on Mumbai local train: A man disguised in a burqa allegedly entered the ladies-only compartment near Ghatkopar station, attempted to molest women passengers. Alert commuters confronted him; he fled by jumping to another train. Complaint filed at Ghatkopar PS;… pic.twitter.com/Czl4eNlwdh— Megh Updates 🚨™ (@MeghUpdates) February 7, 2026తొలుత మహిళా ప్రయాణికులు అతనిని గమనించలేదు. తరువాత అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అప్రమత్తమై, అతనిని నిలదీశారు. దీనిని అక్కడున్న వారు తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రైలులోని మహిళా ప్రయాణికులు ఆ వ్యక్తిపై రైల్వే సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే రైలు ఆగగానే ఆ వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై ఘాట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిని గుర్తించేందుకు రైలులోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ముంబై మేయర్గా రీతూ తావ్డే?
మహాయుతి కూటమి ముంబై మేయర్ అభ్యర్థిపై సందిగ్దత వీడింది. మేయర్ పదవికి బీజేపీకి చెందిన రీతూ తావ్డే అభ్యర్థిగా నామినేషన్ వేసింది. డిప్యూటీ మేయర్ పదవికి శివసేన (శిండే) అభ్యర్థి సంజయ్ శంకర్ గాదీని నిలిపింది. వీరి ఎంపిక దాదాపు లాంఛనమే కానుంది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన శిండే 29 చోట్ల గెలుపొందింది. బృహత్ ముంబయిలో మెుత్తం 227 మున్సిపల్ కార్పోరేషన్ స్థానాలకు ఎన్నికలు జరిగగా మహాయుతీ కూటమి 118 స్థానాల్లో గెలుపొంది స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాగా ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసిన రీతూ తావ్డే 132 వార్డు అభ్యర్థిగా గెలుపొందారు. 2012లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. గత పాతికేళ్లుగా ముంబై పీఠం శివసేన చేతుల్లో ఉంది. ఈ సారి ఆ పార్టీ కేవలం 65 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. బృహత్ ముంబై దేశంలోనే అతిపెద్ద కార్పోరేషన్ దీని గతేడాది బడ్జెట్ రూ.74,450 కోట్లుగా ఉంది. -
రష్మిక జోడీ ఓటమి
ముంబై: స్వదేశంలో జరుగుతున్న ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఆరుగురు ప్లేయర్లు తొలి రౌండ్లోనే వెనుదిరగ్గా... డబుల్స్ విభాగంలోనూ నిరాశే మిగిలింది. తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–అంకిత రైనా... ప్రార్థన తొంబారే (భారత్)–అలెవిత్నా ఇబ్రాగిమోవా (రష్యా)... రుతుజా భోస్లే (భారత్)–పీంగ్టార్న్ ప్లిపుయెచ్ (థాయ్లాండ్) జోడీలు ఓటమి పాలయ్యాయి. రష్మిక–అంకిత 4–6, 2–6తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)–నయీమా కరామోకో (స్విట్జర్లాండ్) చేతిలో... ప్రార్థన–అలెవిత్నా 1–6, 1–6తో పొలీనా ఇటాసెంకో–ఎలీనా ప్రిడాంకినా (రష్యా) చేతిలో... రుతుజా–పీంగ్టార్న్ 6–4, 1–6, 9–11తో నికోల్ హ్యుర్గో (అర్జెంటీనా)–మనన్చాయ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. తొలి రౌండ్లో ఓడిపోయిన జోడీలకు 2,000 డాలర్ల () చొప్పున ప్రైజ్మనీ లభించింది. సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి అంకిత, సహజ యామలపల్లి, శ్రీవల్లి రష్మిక, మాయ రాజేశ్వరన్, వైదేహి, వైష్ణవి బరిలోకి దిగినా ఒక్కరు కూడా రెండో రౌండ్కు చేరుకోలేకపోయారు. -
విద్యా వెలుగులు పంచిన టీచరమ్మకు గ్లోబల్ ప్రైజ్
దుబాయ్: పాఠశాల ముఖం చూడని పేద చిన్నారులకు విద్యనందిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులకు విద్యాభాగ్యం కల్పిస్తున్న ఉపాధ్యాయురాలు, ముంబైకి చెందిన రూబల్ నాగీని ప్రతిష్టాత్మక జెమ్స్ ఎడ్యుకేషన్ ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’వరించింది. అవార్డ్తోపాటు 10లక్షల డాలర్లు(దాదాపు రూ.9 కోట్ల)నగదు బహుమతినీ ఆమె గెల్చుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో గురువారం జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సదస్సులో ఈమెకు అవార్డ్ను ప్రదానంచేశారు. దేశవ్యాప్తంగా రూబల్ నాగీ ఆర్ట్ ఫౌండేషన్(ఆర్ఎన్ఏఎఫ్) ద్వారా బోధనాకేంద్రాలను ఏర్పాటు విద్యార్థులకు చదువు చెబుతున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో గోడలపై చిత్రాలను గీసి వాటి ద్వారా చిన్నారులకు సాహిత్యం, సామాన్య శాస్త్రం, గణితం, చరిత్ర, పర్యావరణ అవగాహన, సామాజిక బాధ్యత తదితర సబ్జెక్టులను బోధిస్తున్నారు. విద్యావేత్త అయిన నాగీ దాదాపు 20 సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా 100కుపైగా మురికివాడల్లో తన ఆర్ఎన్ఏఎఫ్ సంస్థ ద్వారా 800కుపైగా లెర్నింగ్ సెంటర్లను నెలకొల్పి విద్యాదానం మొదలెట్టారు. అద్భుత ప్రతిభాశాలి.. ‘‘లెర్నింగ్ సెంటర్లలో గోడలపై కొలువుతీరింది సజీవ కుడ్య పాండిత్యం. వీటి ద్వారా చిన్నారులు ఎంతో సులభంగా సబ్జెక్టులు, పలు విద్యాంశాలను నేర్చుకుంటున్నారు. అర్థంచేసుకుంటున్నారు. పేద పిల్లలే కాదు వాళ్ల తల్లిదండ్రులుసైతం పేదరికం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహం, బడి మాని్పంచే సంస్కృతి, మౌలిక వసతుల లేమి వంటి అంశాలపై అవగాహన పెంచుకున్నారు. పునరి్వనియోగ వస్తువులను సద్వినియోగం చేసుకుంటూ ఈ లెర్నింగ్ సెంటర్లలో బోధన కొనసాగుతోంది. ఈమె కృషితో ఆయా ప్రాంతాల్లో పేదపిల్లలు బడిమానేసే సంస్కృతి 50 శాతం తగ్గిపోయింది. ఈమె600 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. చదువు చెప్పడంతోపాటు చక్కగా చిత్రలేఖనం చేస్తారు. 850కి పైగా కుడ్యచిత్రాలు వేశారు. ప్రతిమలు సృష్టించారు. ఈమె చేతుల్లో రూపుదిద్దుకున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా 200 ఎగ్జిబిషన్లలో ప్రదర్శితమయ్యాయి’’అని టీచరమ్మను జెమ్స్ ఫౌండేషన్ పొగిడింది. అవార్డ్తోపాటు తాను అందుకున్న కోట్ల రూపాయల నగదుతో కొత్త విద్యా కేంద్రాన్ని నెలకొల్పి ఉచితంగా వృత్తివిద్యా శిక్షణ ఇప్పిస్తానని నాగీ ప్రకటించారు. లాభాపేక్షలేని జెమ్స్ ఎడ్యుకేషన్ కంపెనీని ఏర్పాటుచేసి ఈజిప్ట్, ఖతార్, యూఏఈల్లో డజన్లకొద్దీ పాఠశాలలను నడుపుతున్న వర్కీ ఫౌండేషన్ 11 సంవత్సరాల క్రితం ఈ ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’అవార్డ్ను ఇవ్వడం మొదలెట్టింది. ఇప్పటిదాకా 9 మంది ప్రతిభావంతులైన టీచర్లకు ఈ అవార్డ్ దక్కింది. తన జీతభత్యాల్లో అగ్రభాగాన్ని పేదల కోసం కేటాయిస్తూ ఉచితంగా పాఠాలు చెప్పే కెన్యా టీచర్కు గతంలో ఈ అవార్డ్ దక్కింది. అహింసా సంబంధ పాఠాలు బోధిస్తూ పిల్లల్లో హింసా ప్రవృత్తిని తరిమికొట్టేందుకు కృషిచేస్తున్న పాలస్తీనియన్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని సైతం గతంలో ఈ అవార్డ్ వరించింది. సౌదీ అరేబియాలో పేదల కోసం పాటుపడుతున్న మన్సూర్–అల్–మన్సూర్ అనే టీచర్కు గత ఏడాది ఇదే అవార్డ్ను అందజేశారు. -
ఆసుపత్రిపాలైన సర్ఫరాజ్ ఖాన్
ఫిబ్రవరి 6 నుంచి కార్ణటకతో జరుగబోయే రంజీ ట్రోఫీ 2025-26 నాలుగో క్వార్టర్ ఫైనల్కు ముందు ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, ఇన్ఫామ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వైరల్ ఫీవర్ కారణంగా ఆసుపత్రిపాలయ్యాడు. వైద్యులు అతనికి అత్యవసర చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం సర్ఫరాజ్ మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు.సర్ఫరాజ్ ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్ నుంచే ఇబ్బందిపడుతున్నాడు. ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేయగలిగినా ఫీల్డింగ్కు రాలేదు. ఆ సమయంలో అతన్ని హామ్స్ట్రింగ్ సమస్య కూడా ఇబ్బంది పెట్టింది. అయినా అతను మొదటి ఇన్నింగ్స్లో 27 బంతుల్లో 24 పరుగులు చేయగలిగాడు.క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సర్ఫరాజ్ లేని లోటు ముంబైకు తీవ్రంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇటీవలికాలంలో అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లీగ్ దశలో హైదరాబాద్పై 227 పరుగులు (219 బంతులు) చేసి తన శక్తివంతమైన బ్యాటింగ్ను మరోసారి నిరూపించారు. ఆ ఇన్నింగ్స్లో అతను 5,000 ఫస్ట్క్లాస్ పరుగులు పూర్తి చేశాడు. దీనికి ముందు వైట్ బాల్ క్రికెట్లోనూ సర్ఫరాజ్ చెలరేగిపోయాడు.విధ్వంసకర బ్యాటింగ్తో ఫార్మాట్లకతీతంగా సెంచరీలు నమోదు చేశాడు. -
లిఫ్ట్లో పేలిన గ్యాస్ బెలూన్లు... షాకింగ్ వీడియో
-
ముంబై జట్టుకు సచిన్ సలహాలు
ముంబై: కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా జయించాలనే అంశంపై ముంబై రంజీ జట్టుకు... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు చేశాడు. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ముంబై జట్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కర్ణాటకతో తలపడనుంది. ఇప్పటి వరకు ముంబై జట్టు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకోగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుతో ముచ్చటించాడు.ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్తో సుదీర్ఘంగా సంభాషించాడు. ‘డ్రెస్సింగ్ రూమ్లో సచిన్ సార్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. విజయ పరంపర కొనసాగించడం, మానసిక దృఢత్వం, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి ఎన్నో అంశాలపై కీలక సూచనలు చేశారు. ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆయన మాటలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కీలక సమరాల్లో ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చో చక్కగా వివరించారు. రంజీ ట్రోఫీలో ఆ సూచనలు పాటిస్తూ విజయాలు సాధించాలని భావిస్తున్నాం’ అని ముంబై కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ పేర్కొన్నాడు. -
భారీ ట్రాఫిక్ జామ్.. 33 గంటల తర్వాత..
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై 33 గంటలుగా కొనసాగుతున్న భారీ ట్రాఫిక్ జామ్ ఎట్టకేలకు గురువారం ఉదయం క్లియర్ అయ్యింది. మంగళవారం సాయంత్రం ఖండాలా ఘాట్ సెక్షన్లో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం తెల్లవారుజామున 1:46 గంటల ప్రాంతంలో ఆదోషి టన్నెల్ సమీపంలో ప్రమాదానికి గురైన ట్యాంకర్ను తొలగించడంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి.మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అతివేగంతో వస్తున్న ప్రొపిలీన్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. అత్యంత ప్రమాదకరమైన, మండే స్వభావం గల గ్యాస్ కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వెంటనే ట్రాఫిక్ను నిలిపివేశారు. బుధవారం రోజంతా ట్యాంకర్లోని గ్యాస్ను మరో వాహనంలోకి మార్చే ప్రక్రియ కొనసాగింది. హెవీ డ్యూటీ క్రేన్ల సహాయంతో ట్యాంకర్ను రోడ్డుపై నుండి తొలగించిన తర్వాతే వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ అయిందని మహారాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) అధికారులు వెల్లడించారు.సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఎక్స్ప్రెస్వేపై ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆహారం, తాగునీరు తదితర సదుపాయాలు లేక గంటల తరబడి వాహనాల్లోనే చిక్కుకుపోయారు. కొందరు పారిశ్రామికవేత్తలు ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు హెలికాప్టర్లను ఆశ్రయించగా, సామాన్య ప్రయాణికులు మాత్రం ఎముకలు కొరికే చలిలో రోడ్డుపైనే కాలం గడపాల్సి వచ్చింది.ఈ భారీ ట్రాఫిక్ అంతరాయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని కోరారు. ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, ఘాట్ సెక్షన్లో వాహనాల రద్దీ నెమ్మదిగా సర్దుకుంటోందని హైవే పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఘజియాబాద్ దారుణం: సంచలన వాస్తవాలు వెల్లడి -
విమాన రెక్కలు ఢీ.. తప్పిన పెనుప్రమాదం
ముంబై ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ఎయిర్ఇండియా, ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. ఇండిగో ఫ్లైట్ లాండ్ అయి రన్వేపై వస్తుండగా ఈ ఘటన జరుగినట్లు తెలుస్తుంది. అయితే విమానంలోని ప్రయణికులకు ఏటువంటి ప్రమాదం తలెత్తలేదు. ఈ ప్రమాదంపై డీజీసీఏ తక్షణమే స్పందించింది. ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది.అయితే ఇటీవల విమానాలలో భద్రతా లోపాలు తరచుగా కనబడడం ఆందోళనకు గురిచేస్తుంది. నిన్న లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి బెంగుళూరు వచ్చిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో ఇంధన స్విచ్ కటాఫ్ పొజిషన్లోకి వెళ్లింది. దీనిని గమనించిన ఫైలట్లు డీజీసీఏ సిబ్బందికి ఈ వివరాలు తెలియజేశారు. ఇప్పుడు ముంబైలో ఇలా రెండు విమానాల రెక్కలు తాకడం ఆందోళన కలిగిస్తుంది. విమానాల నిర్వహణలో ఏలాంటి చిన్న తప్పిదం చేసినా దాని ఫలితం భారీగా ఉంటుంది. గుజరాత్ అహ్మాదాబాద్లో ఇంధన స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో బోయింగ్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో వందలమంది ప్రాణాలు వదిలారు. ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనలో మరణించిన సంగతి తెలిసిందే. -
మీరా భయందర్ నూతన మేయర్గా డింపుల్ మెహతా
మీరా భయందర్: మహారాష్ట్రలోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ డింపుల్ మెహతా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఆమె ఎన్నికను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్), మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరాఠీ మాట్లాడే నేతలను మాత్రమే మేయర్గా నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 95 మంది కార్పొరేటర్లు ఉండగా, బీజేపీ 78 స్థానాలతో తిరుగులేని శక్తిగా నిలిచింది. ఇతర పార్టీల పరంగా చూస్తే.. కాంగ్రెస్కు 13 మంది, శివసేన (షిండే వర్గం) కు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే ఒక బీజేపీ రెబల్ అభ్యర్థి అనిల్ పాటిల్ విజయం సాధించారు. అతను బీజేపీకే మద్దతు ప్రకటించడంతో డింపుల్ మెహతా విజయం మరింత సులభమయ్యింది.మేయర్ ఎన్నికల్లో బీజేపీ బలాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, శివసేన (షిండే వర్గం) చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాయి. బీజేపీ తరపున సీనియర్ నేత నరేంద్ర మెహతా మరదలు డింపుల్ మెహతా పోటీ చేయగా, ఆమెకు సవాల్ విసురుతూ కాంగ్రెస్-శివసేన కూటమి రుబినా ఖాతూన్ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. బలాబలాల పరంగా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, విపక్షాలు ఏకమై పోటీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అటు ప్రాంతీయ భాషా వాదం, ఇటు రాజకీయ వ్యూహాల మధ్య సాగిన ఈ ఎన్నికల్లో చివరికి బీజేపీ తన పట్టు నిలుపుకుంది. డింపుల్ మెహతా గెలుపుతో మీరా భయందర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఇది కూడా చదవండి: ముంబై మేయర్ పీఠం: ‘మహాయుతి’లో ముదిరిన పేచీ -
జైస్వాల్ రీఎంట్రీ
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దేశవాలీ క్రికెట్లో ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ 2025-26 క్వార్టర్ ఫైనల్ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో అతనికి చోటు లభించింది. జైస్వాల్ ఈ సీజన్లో ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ బాధ్యతలు లేకపోయినా జైస్వాల్ ముంబై జట్టులో లేకపోవడం కొద్ది రోజుల కిందటి వరకు చర్చనీయాంశంగా ఉండింది. ఎట్టకేలకు అతనికి ముంబై జట్టులో చోటు దక్కడంతో ఊహాగానాలకు తెరపడింది. తాజాగా ప్రకటించిన జట్టులో జైస్వాల్తో పాటు శార్దూల్ ఠాకూర్కు కూడా చోటు దక్కింది. శార్దూల్ గాయాల కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. శార్దూల్ ముంబై జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గానూ ఉన్నాడు. రహానే వైదొలగడంతో శార్దూల్కు కెప్టెన్సీ లభించింది. జైస్వాల్, శార్దూల్ చేరికతో ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. కర్ణాటకతో జరిగే క్వార్టర్ ఫైనల్ కోసం ముంబై జట్టు.. - శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్) - యశస్వి జైస్వాల్- ముషీర్ ఖాన్ - అఖిల్ హెర్వడ్కర్ - సిద్ధేశ్ లాడ్ - సర్ఫరాజ్ ఖాన్ - ఆకాష్ ఆనంద్ (wk) - హార్దిక్ తమోరే (wk) - సైరాజ్ పటిల్ - శంస్ ములానీ - తనుష్ కోటియన్ - తుషార్ దేశ్పాండే - మోహిత్ అవస్థ - ఓంకార్ తర్మలే - దివ్యేష్ సక్సేనా - సూర్యాంశ్ షెడ్గే -
ఆ బామ్మకు ఏ కష్టం వచ్చిందో..! పాపం 89 ఏళ్ల వయసులో..
కొన్ని ఘటనలు ఎంతో ఆలోచించేలా చేస్తాయి. కొత్త స్ఫూర్తిని నింపుతాయి. చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తే మనం, ఇలాంటి బామ్మను చూసి ఎంతో ప్రేరణ పొందుతాం. కష్టం ఏదైతేనేం..దాన్ని అధిగమించేలా నవ్వుతూ మనపని మనం ఎలా చేసుకుంటూ పోవాలో ఈ బామ్మని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆత్మగౌరవం అనే మాటకు అసలైన అర్థంలా అనిపిస్తుంది ఈ బామ్మ జీవన విధానం..ఆ బామ్మ పేరు 89 ఏళ్ల కమలాబెన్ మెహతా. ముంబై లోకల్ రైళ్లలో నిశబ్దంగా బ్రాస్లెట్లు అమ్ముతు ఉంటుందామె. ఆమెను చూడగానే ఈ వయసులో ఇంతలా కష్టపడుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆమె ఎవరి నుంచి సానుభూతిని, దాతృత్వాన్ని ఆశించకుండా కష్టపడుతున్న తీరు నిజంగా మనసుని కదిలిస్తుంది. చనిపోయేదాక ఆత్మగౌరవానికి భంగం కలగకుండా బతకడం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఆ బామ్మని చూస్తే. అందుకు సంబంధించిన పోస్ట్ని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు ఆమెతో మాటలు కలపగా తనపేరు కమలాబెన్ అని, తన వయసు 89 ఏళ్లని ఆ బామ్మ చెప్పిందని పోస్ట్లో పేర్కొన్నాడు. తన కుటుంబంతో కలిసి జీవించడానికి తన వంతుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేందుకే ఈ పని చేస్తున్నట్లు తెలపింది. తాను ముంబైలోని నలసోపారాలో నివశిస్తున్నట్లు పేర్కొంది. ఆమెకు సాయం చేయాలని.. తన దగ్గరున్న బ్రాస్లెట్లు కొందామనుకున్నా.. అంత మొత్తం లేకపోవడంతో ఆ బామ్మ ఇంటి అడ్రస్ అడగగా, ఆమె అందుకు నిరాకరించింది. పైగా తన కుటుంబ తన వల్ల అవమానపాలు కాకూడదు అంటూ అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించిందని పోస్లో రాసుకొచ్చాడు సదరు ప్రయాణికుడు. నిజానికి ఆ వయసులో ఈ బామ్మ ఏ రకంగానైనా సంపాదించొచ్చు. కానీ తన ఆత్మగౌరవం కోసం శరీరం సహకరించి వృద్ధాప్యంలో కూడా అచంచలమైన పట్టుదలతో చేతితో తయారు చేసిన బ్రాస్లెట్లు అమ్ముతూ సంపాదించాలనుకోవడం నిజంగా ప్రశంసనీయం..స్ఫూర్తిదాయకం. చివరి క్షణం వరకు తలెత్తుకునే బతకాలి కానీ, చేయిచాచి కాదు అని చెంపపగిలేట్టు సమాధానమిచ్చే ఘటన ఇది. ఇంకెందుకు ఆలస్యం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓలుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Meeta Tushit Shah (@meetatushitshah) (చదవండి: అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా ఐదు హిమాలయాలు..) -
ముంబయిలో కలకలం.. స్టార్ డైరెక్టర్ ఇంటిపై కాల్పులు.!
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగుడు.. వెంటనే బైక్పై పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల భారీ భద్రతను మోహరించారు. ముంబయి పోలీసు కమిషనర్ దేవన్ భారతి ఈ సంఘటనను ధృవీకరించారు. అయితే రోహిత్ శెట్టి కుటుంబం ఈ సంఘటనపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.సినిమా కెరీర్..కాగా.. రోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు. -
400 మీటర్లు.. 18,000 బిల్లు..
మనం ‘అతిథి దేవో భవ’ అంటాం.. కానీ ఆ ట్యాక్సీ డ్రైవర్ మాత్రం అతిథి ‘దోపిడీ’భవ అనుకున్నాడు. వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన ఒక అతిథిని, అడుగు దూరంలో ఉన్న హోటల్కు చేర్చడానికి అక్షరాలా పద్దెనిమిది వేల రూపాయలు పిండేశాడు. అమెరికా నుంచి ముంబై ఎయిర్పోర్ట్లో దిగిన ఒక మహిళకు ఎదురైన చేదు అనుభవమిది. ఆ 20 నిమిషాల ఉత్కంఠ జనవరి 12 అర్ధరాత్రి సమయం.. అమెరికా నుంచి ముంబైలో అడుగుపెట్టిన ఆ మహిళ ఒక ట్యాక్సీ ఎక్కింది. ఆమె వెళ్లాల్సిన ఫైవ్ స్టార్ హోటల్ ఎయిర్పోర్ట్కు కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. కానీ, ట్యాక్సీ డ్రైవర్ దేశ్రాజ్ యాదవ్ కన్ను ఆమె పర్సుపై పడింది. నేరుగా హోటల్కు తీసుకెళ్లకుండా, ఆమెకు దారి తెలియదు కదా.. అని అంధేరీ వీధుల్లో 20 నిమిషాల పాటు ‘చక్రం’ తిప్పాడు. కారులో డ్రైవర్ పక్కన మరో అపరిచిత వ్యక్తి.. చుట్టూ చీకటి.. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. చెక్ ఇన్ అవ్వకముందే.. భారీ చెక్! చివరికి హోటల్ ముందు కారు ఆపిన ఆ డ్రైవర్, బాంబు పేల్చాడు. బిల్లు ఎంతో తెలుసా? అక్షరాలా 18,000 రూపాయలు! అంటే కిలోమీటర్కు కూడా సరిపోని దూరానికి దాదాపు 200 డాలర్లు వసూలు చేశాడు. కొత్త దేశం, ఒంటరి మహిళ.. వాళ్లతో వాదించలేక, భయంతో ఆ డబ్బు చెల్లించి హోటల్లోకి పరుగులు తీసింది.ట్విట్టర్లో పోస్టు.. ఖాకీల వేట అమెరికా చేరుకున్నాక ఆ బాధితురాలు జనవరి 26న ఎక్స్ వేదికగా తన గోడు వెళ్లగక్కింది. ఆమె కథనం ప్రకారం.. ట్యాక్సీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తి బాధితురాలిని ఒక గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వాలని బెదిరించి, ఆ తర్వాతే హోటల్ దగ్గర వదిలిపెట్టారు. ఆ పోస్ట్ చూసి నెటిజన్లు రగిలిపోయారు. ముంబై పోలీసులు వెంటనే స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదైన కేవలం 3 గంటల్లోనే ఆ కేటుగాడిని పట్టుకుని బేడీలు వేశారు. డ్రైవర్ లైసెన్స్ను రద్దు చేయడమే కాకుండా, అతని ట్యాక్సీని కూడా సీజ్ చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలాంటి మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 112 కి కాల్ చేయండని డీసీపీ మనీష్ కల్వానియా విజ్ఞప్తి చేశారు. డబ్బు మీద ఆశతో దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆ మాయగాడికి, ముంబై పోలీసులు సరైన రీతిలో ‘మర్యాద’చేశారు! – సాక్షి, నేషనల్ డెస్క్. -
‘ఎలిమినేటర్’కు గుజరాత్
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ‘ఎలిమినేటర్’కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ 11 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై నెగ్గింది. లీగ్ చరిత్రలో ముంబైతో తలపడిన ఎనిమిది సార్లూ ఓటమి చవి చూసిన గుజరాత్ 9వ ప్రయత్నంలో తొలిసారి గెలుపు రుచి చూసింది. ఆడిన 8 మ్యాచ్ల్లో 5 గెలిచి, 3 ఓడిన గుజరాత్ 10 పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. యాష్లీ గార్డ్నర్ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జ్ వేర్హామ్ (26 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించగా... అనుష్క శర్మ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ డివైన్ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) రాణించారు. అమేలియా కెర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 82 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) చివరి వరకు పోరాడినా... విజయం మాత్రం దక్కలేదు. ఆఖరి 2 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సి ఉండగా, హర్మన్ 2 ఫోర్లు, 2 సిక్స్ల సహాయంతో 24 పరుగులు రాబట్టగలిగింది. ఈ మ్యాచ్లో ఓడినా... ఎలిమినేటర్కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ముంబైకి ఇంకా ఉన్నాయి. నేడు విశ్రాంతి దినం. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ కచి్చతంగా గెలవడంతోపాటు రన్రేట్లో ప్రస్తుతం తమకంటే (–0.164) ఎంతో ముందున్న ముంబైను (+0.059) కూడా దాటాల్సి ఉంటుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) సజన (బి) షబ్నిమ్ 5; సోఫీ డివైన్ (సి) కెర్ (బి) సివర్ బ్రంట్ 25; అనుష్క (సి) షబ్నిమ్ (బి) కెర్ 33; గార్డ్నర్ (స్టంప్డ్) ఫిర్దోస్ (బి) కెర్ 46; వేర్హామ్ (నాటౌట్) 44; భారతి (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–21, 2–69, 3–71, 4–142. బౌలింగ్: షబి్నమ్ 4–0–29–1, సివర్ బ్రంట్ 4–0–36–1, వైష్ణవి 2–0–21–0, అమన్జోత్ 2–0–13–0, అమేలియా కెర్ 4–0–26–2, మాథ్యూస్ 4–0–40–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సజన (సి) భారతి (బి) కాశ్వీ 26; మాథ్యూస్ (బి) డివైన్ 6; సివర్ బ్రంట్ (సి) అనుష్క (బి) డివైన్ 2; హర్మన్ప్రీత్ (నాటౌట్) 82; అమేలియా కెర్ (సి) మూనీ (బి) వేర్హామ్ 20; అమన్జోత్ (స్టంప్డ్) మూనీ (బి) రాజేశ్వరి 13; సంస్కృతి (ఎల్బీ) (బి) వేర్హామ్ 0; పూనమ్ (సి అండ్ బి) గార్డ్నర్ 2; ఫిర్దోస్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–23, 2–33, 3–37, 4–82, 5–126, 6–127, 7–155. బౌలింగ్: రేణుక సింగ్ 2–0–11–0, కాశ్వీ గౌతమ్ 2–0–12–1, రాజేశ్వరి గైక్వాడ్ 4–0–46–1, సోఫీ డివైన్ 4–1–23–2, జార్జియా వేర్హామ్ 4–0–26–2, యాష్లీ గార్డ్నర్ 3–0–26–1, తనూజ 1–0–11–0. -
అక్క కోసమని వెళ్లి.. అనంతలోకాలకు!
అమెరికా లాంటి కొన్ని దేశాల్లో.. పిల్లలను స్కూల్ బస్సులు ఎక్కించేటప్పుడు లేదంటే దింపేటప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ దానంతట అదే ఆగిపోతుంది. పిల్లలు కొద్దిదూరం వెళ్లిన తర్వాతే వాహనాలు ముందుకు కదులుతాయి. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్.. లేదంటే పోలీసు అవసరం ఉండదు. పిల్లల సేఫ్టీ అనేది అక్కడి ప్రజల జీవనశైలిలో ఇదొక భాగమైపోయింది. కానీ, మన దేశంలో.. !ముంబై నగరంలో అంతా చూస్తుండగానే ఘోరం జరిగింది. స్కూల్ బస్సు దిగిన ఓ చిన్నారిని ఆమె నాయనమ్మ రోడ్డు దాటిస్తున్న క్రమంలో.. బస్సు ముందుకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆ పెద్దావిడ చేతిలో ఉన్న ఏడాది పసికందు ప్రాణం విడిచింది. ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. మంగళవారం మధ్యాహ్నాం ఖేట్వాడీ ఏరియాలోని గిర్గావ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రకళ అనే పెద్దావిడ తన ఏడాది మనవడిని చంకలో వేసుకుని.. స్కూల్ నుంచి వచ్చే మనవరాలిని ఇంటికి తెచ్చేందుకు వెళ్లింది. అయితే ముగ్గురూ బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా.. డ్రైవర్ అది గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు ఢీ కొట్టి ముగ్గురూ కింద పడిపోయారు. చిన్నారి పక్కకు పడిపోగా.. చంద్రకళ, ఆమె ఏడాది మనవడి మీదుగా బస్సు వెళ్లింది. వెంటనే డ్రైవర్ బ్రేకులు వేయగా.. స్థానికులు అప్రమత్తమై వాళ్లను బయటకు తీసే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏడాది చిన్నారి అప్పటికే మరణించగా.. గాయపడిన చంద్రకళను ఆస్పత్రికి తరలించారు. డీబీ మార్గ్ పోలీసులు స్కూల్బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తాలుకా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు కాగా.. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.मुंबई में स्कूली बस ने ही दो बच्चों और उनकीअभिभावक को कुचल दिया! एक बच्चे की मौत हो गई दूसरा घायल है। अभिभावक भी बस के नीचे आ गई और वो भी गंभीर रूप से घायल है। मैं जानता हूं कि ये भारत है अमेरिका नहीं लेकिन फिर भी ये लिख रहा हूं कि जब भी अमेरिका जाता हूं, देखता हूं और आप भी… pic.twitter.com/RHcmGOUmEp— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) January 28, 2026 -
అజిత్ దాదా.. ఆనాడు మరణం గురించి సరదాగా..!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత (ఎన్సీపీ), మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా అని ముద్దుగా పిలుచుకునే కార్యకర్తలు, అభిమానులు ఇక ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు నాలుగు దశాబ్దాలుగా ఆయనతో అనుబంధం ఉన్న నేతలు కూడా బోరున విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట కనిపిస్తున్నాయి.అయితే గతంలోనూ అజిత్ పవార్కు ఓ ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని చాలాకాలం ఆయన ఎవరికీ చెప్పలేదు. చివరకు తన సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా తెలియజేశారాయన. పైగా ఈ విషయాన్ని అప్పటిదాకా తన భార్య, తల్లికి కూడా ఆయన చెప్పలేదట. ముందే అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదంటూ చమత్కరించారు. పైగా ఆయన ఈ ఘటన గురించి సరదాగా చెబుతుంటే అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు.అసలేం జరిగిందంటే.. ఓ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమం కోసం ఆయన వెళ్లారట. ఆ సమయంలో ఆయన ఎక్కిన లిఫ్ట్ 4వ అంతస్తు నుంచి పడిపోయింది. అదే లిఫ్ట్లో అజిత్ పవార్తోపాటు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు కూడా ఉన్నారట. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అదేసమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తర్వాత తేలింది. అదృష్టవశాత్తూ.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో భవనం లోని మూడో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు మెట్ల ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యాం. అయితే మాతో పాటు 90 ఏళ్ల డాక్టర్ ఉండడంతో మేం లిఫ్ట్ ఎక్కాం. నాల్గవ అంతస్తుకి లిఫ్ట్లో వెళుతుండగా అకస్మాత్తుగా కరెంటు పోయింది. చుట్టూ చిమ్మచీకటి. అదే సమయంలో నాల్గో అంతస్తు నుంచి లిఫ్ట్ హఠాత్తుగా నాలుగో అంతస్తునుంచి కిందకు పడిపోయింది. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా తెరిచి నన్ను బయటకు లాగాడు. ఆ తర్వాత డాక్టర్ను కాపాడాం. నాకు ఎలాంటి గాయాలు కాలేదు. డాక్టర్కు స్వల్ప గాయాలు అయ్యాయి.. .. ఇదేదో కథకాదు. నేను అబద్ధం చెప్పడం లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజిది శ్రద్ధాంజలి కార్యక్రమంగా అయుండేది. ఈ విషయం నేను దాచుకోలేకపోతున్నాను.. మీరు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో చెప్పాను’ అని అజిత్ పవార్ అన్నారు. 2023 జనవరి 16న మహారాష్ట్రలోని పూణెలో హార్దికర్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. -
హీరోయిన్ హోటల్ ముందు భారీ క్యూ
నచ్చిన వాటిని దక్కించుకోడానికి 'క్యూ' కట్టడం మన దేశంలో సర్వ సాధారణం. అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు టికెట్ల కోసం ధియేటర్ల ముందు క్యూలో ఉంటాం. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆపిల్ దుకాణాల ముందు నిల్చుంటాం. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కిలోమీటర్ల వరకు క్యూ కట్టేస్తాం. ఈ మధ్యన బట్టలు కొనేందుకు కూడా షాపుల ముందు నించుంటున్నారు జనం. ఇక మద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ ఎవర్గ్రీన్. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో కనిపిస్తున్న క్యూ కూడా దాదాపు అలాంటిదే. కానీ డబ్బులిచ్చి కొనేందుకు కాదు.. ఫ్రీగా తినేందుకు. ఇంతకీ అక్కడ ఏం పెడుతున్నారు, అంత ఫేమస్సా?ముంబై మహానగరంలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న అమ్మకై అనే రెస్టరెంట్ (AmmaKai Restaurant) ముందు జనం క్యూ కట్టిన వీడియోను ఎక్స్లో డీజీ పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. కొత్తగా ప్రారంభమైన అమ్మకై రెస్టరెంట్.. రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత అల్పహారం ఆఫర్ చేసింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెడతామని ప్రకటించింది. ముందుగా వచ్చిన వారికి మాత్రమే వడ్డిస్తామని షరతు పెట్టింది. ఇది చూసిన జనం రెస్టరెంట్ ముందు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు.బిచ్చగాళ్ల మాదిరిగా..ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసిన యూజర్.. జనం తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉచితంగా అల్పాహారం పెడతామంటే జనం బిచ్చగాళ్ల మాదిరిగా రెస్ట్రెంట్ తెరవడానికి 2 గంటల ముందే క్యూ కట్టారని ఫైర్ అయ్యారు. లైనులో నిల్చున్న వారిని చూస్తే.. ఎవరూ పేదవారులా కనిపించలేదన్నారు. కనీసం రెండుమూడు కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లలో నివసిస్తున్న లక్షధికారుల్లా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ఫ్రీగా వస్తుందంటే చాలు వెనుకాముందు చూడకుండా ఎగేసుకుని వచ్చేస్తారంటూ నిష్టూరమాడారు. ఒక ప్లేట్ బ్రేక్ఫాస్ట్ కోసం సిగ్గు లేకుండా రోడ్డుపై గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారని ధ్వజమెత్తారు. 'ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నందుకు ప్రభుత్వాలను తప్పుబడతాం. కానీ దానికి మన బాధ్యత ఉందని అనుకోం. మన ఆలోచనలు మారకపోతే, దేశం ఇలాగే ఉంటుంద'ని ఎక్స్లో రాశారు. ఫ్రీగా వస్తుందంటే జనం ఇలాగే ఎగబడతారని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. అమ్మకైగా మారిన బాస్టియన్ఇంతకీ అమ్మకై రెస్టరెంట్ ఎవరిదో తెలుసా? ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిదే ఈ హోటల్. మూడేళ్ల క్రితం బాస్టియన్ బాంద్రా పేరుతో రంజిత్ బింద్రాతో కలిసి ఈ రెస్టరెంట్ ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్లో దీన్ని మూసివేస్తున్నట్టు ఎక్స్లో శిల్పా శెట్టి ప్రకటించారు. ఎందుకు మూసివేస్తున్నారనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. 60 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నందుకే శిల్పాశెట్టి ఈ హోటల్ మూసేస్తున్నారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ హెటల్ను కొత్తగా మార్చి అమ్మకై పేరుతో మళ్లీ ప్రారంభించారు. ప్రమోషన్ కోసం ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ (Free Breakfast Offer) పెట్టారని ముంబై జనం అనుకుంటున్నారు. చదవండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. అమ్మాయి ప్లాటయింది!AmmaKai,a newly launched restaurant by Shilpa Shetty in Bandra announced free breakfast for anyone and everyone with first come first serve basis and this is how the people responded like absolute beggars,standing in que since 7.00 A.M in the morning,2 hours before the… pic.twitter.com/AAz8iqdcFU— DG (@RetardedHurt) January 27, 2026 -
Mumbai: మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త మేయర్ను ఎప్పుడు ఎన్నుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా షెడ్యూల్ ఇంకా వెలువడనప్పటికీ, వచ్చే నెల ప్రారంభంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.ఇటీవలి పౌర ఎన్నికల్లో బీజేపీ- ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పటికే తమ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించినప్పటికీ, ముంబైలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. ఈ జాప్యానికి ప్రధాన కారణం అధికార బీజేపీ- ఏక్నాథ్ షిండే శివసేన వర్గాలు కొంకణ్ డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో తమ గ్రూపు రిజిస్ట్రేషన్ను పూర్తి చేయకపోవడమేనని సమాచారం.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ముంబై మున్సిపల్ సెక్రటేరియట్లో తదుపరి చర్యలు చేపడతారు. నిబంధనల ప్రకారం, గ్రూపు రిజిస్ట్రేషన్ పూర్తయిన ఏడు రోజుల్లోపు మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. గ్రూపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సెక్రటరీ సమావేశమై ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం మేయర్ పదవులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ, పౌర యంత్రాంగం అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి మూడు రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు నామినేషన్ పత్రాలను పరిశీలించి, తుది జాబితాను ప్రకటిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.ఇటీవల నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రకారం, ఈసారి ముంబై మేయర్ పదవి జనరల్ కేటగిరీకి చెందిన మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో మేయర్ రేసులో నిలిచే అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార కూటమి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రిజర్వేషన్ ఖరారు కావడంతో మహిళా కార్పొరేటర్లు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: రైల్వేకు షాక్.. విద్యార్ధినికి రూ. 9 లక్షల పరిహారం -
హైదరాబాద్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు మరో పరాజయం మూటగట్టుకుంది. ఆదివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ వేదికగా ముగిసిన పోరులో హైదరాబాద్ జట్టు 9 వికెట్ల తేడాతో 42 సార్లు చాంపియన్ ముంబై చేతిలో ఓడింది. ఈ విజయంతో బోనస్ పాయింట్ ఖాతాలో వేసుకున్న ముంబై జట్టు 30 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఓవర్నైట్ స్కోరు 166/7తో ఆదివారం నాలుగోరోజు ‘ఫాలోఆన్’ కొనసాగించిన హైదరాబాద్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 69.5 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. సీవీ మిలింద్ (128 బంతుల్లో 85; 12 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడగా... అతడికి నితిన్ సాయి యాదవ్ (32; 6 ఫోర్లు), కెప్టెన్ సిరాజ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్) సహకారం అందించారు. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 5 వికెట్లు... మోహిత్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 10 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై జట్టు 3.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 560 పరుగులు చేయగా... హైదరాబాద్ 267 పరుగులకు పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక విజయం, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్ జట్టు గ్రూప్లో ఐదో స్థానంలో ఉంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో గురువారం నుంచి ఛత్తీస్గఢ్తోహైదరాబాద్ తలపడనుంది. -
రైల్వేస్టేషన్లో దారుణం.. ప్రొఫెసర్ దారుణ హత్య
ముంబై: ఒక చిన్న తగాదా ప్రాణం తీసింది. మలాడ్ రైల్వే స్టేషన్లో ఓ కళాశాల ప్రొఫెసర్ను ప్రయాణికుడు.. దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ప్రొఫెసర్, ఒక ప్రయాణికుడి మధ్య చిన్న వివాదం విషాదాన్ని మిగిల్చింది. ఆ రైలు స్టేషన్ చేరుకోగా దిగేటప్పుడు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ప్రొఫెసర్ను కత్తితో పొడిచి.. పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రొఫెసర్గా అలోక్ సింగ్.. విలే పార్లేలోని ప్రముఖ కాలేజీలో పని చేస్తున్నారు. శనివారం ఆయన లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. రైలులో సీటు విషయంలో ఓ ప్రయాణికుడు, ప్రొఫెసర్ అలోక్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ట్రైన్ మలాడ్ స్టేషన్ చేరగానే దిగే సమయంలో గేటు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగింది. దీంతో వారి మధ్య గొడవ మరింత ముదిరింది. ఆ వ్యక్తి.. ప్రొఫెసర్ అలోక్ సింగ్ కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం స్టేషన్లోని జనం రద్దీలో కలిసిపోయి పరారయ్యాడు. దీంతో కత్తి పోట్లుతో అలోక్ సింగ్ కుప్పకూలి మరణించాడు.ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు.. హత్య చేసిన వ్యక్తిని ఓంకార్ షిండే(27)గా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన కొద్దిసేపటికే వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పారిపోతుండటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. షిండేను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలులో సీటు కోసం జరిగిన చిన్న గొడవకే ప్రొఫెసర్ను షిండే దారుణంగా కత్తితో పొడిచి చంపడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వారి మధ్య గతంలో శత్రుత్వం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ముంబై మేయర్ ఎన్నికపై మరింత ఉత్కంఠ
ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. జనవరి 31న జరగాల్సిన ఈ ఎన్నిక, గ్రూప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా పడింది. బీజేపీ - ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలు తమ కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడంలో విఫలం కావడంతోనే ఈ ఆకస్మిక వాయిదా అని సమాచారం. రిజర్వేషన్లు ఖరారైనప్పటికీ, ధ్రువీకరణ పత్రాలను మున్సిపల్ కార్యదర్శికి సమర్పించడంలో జాప్యం కారణంగా ఎన్నికల ప్రక్రియ స్తంభించిపోయింది.మేయర్ ఎన్నిక కోసం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తమ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తమ 65 మంది కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్ను శరవేగంగా పూర్తి చేసి, అధికార కూటమి కంటే ఒక అడుగు ముందే ఉన్నాయి. మరోవైపు, బీజేపీ, షిండే వర్గం ఉమ్మడి గ్రూపుగా ఏర్పడతాయా లేక వేర్వేరుగా పోటీ చేస్తాయా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.ఈ అనిశ్చితి 227 మంది సభ్యులున్న సభలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రూ. 60,000 కోట్ల బడ్జెట్ కలిగిన బీఎంసీపై పట్టు సాధించేందుకు జరుగుతున్న ఈ పోరులో ప్రతి నిమిషం కీలకంగా మారింది. ఎన్నికల వేడి ఇలా ఉంటే ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తండ్రి బాలసాహెబ్ థాకరే శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ‘శివసేన కేవలం ఒక పార్టీ కాదని, అదొక సిద్ధాంతమని, ముంబై మట్టి బిడ్డల ఆత్మగౌరవమని ఉద్ఘాటించారు. శివసేనను అంతం చేయాలని బీజేపీ కలలు కంటోందని, కానీ అది అసాధ్యం. అణగారిన వర్గాల గుండెల్లో రగిలే జ్వాల శివసేన. ఆ జ్వాలను ఆర్పడం ఎవరివల్లా కాదు’ అని అన్నారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-షిండే సేన కూటమి (మహాయుతి) ఘన విజయం సాధించి, బీఎంసీపై పట్టు సాధించింది. 227 సీట్లలో మెజారిటీకి కావాల్సిన 114 సీట్లను దాటి, ఈ కూటమి 118 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, షిండే సేన 29 సీట్లు గెలుచుకుంది. దీంతో బీఎంసీపై మూడు దశాబ్దాల పాటు సాగిన థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. -
కాల్పుల ఘటనలో సినీ నటుడు అరెస్ట్
బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ అరెస్ట్ అయ్యారు.. కొద్దిరోజుల క్రితం ముంబైలో ఓ నివాసంలో కాల్పులు జరిగిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కాల్పులకు పాల్పడింది కమల్ రషీద్ అని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం రాత్రి కమల్ను అంధేరీ పోలీసులు అరెస్ట్ చేశారు.కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్ చల్ చేసేవారిలో కేఆర్కే ఒకరు. తనకు తానుగా సినీ విమర్శకుడిగా ఆయన చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే, రచయిత-దర్శకుడు నీరజ్ కుమార్ మిశ్రా నివసించే అంధేరీలోని ఒక నివాస భవనంపై కమల్ రషీద్ నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 18న తన లైసెన్స్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు అతను అంగీకరించాడు. అయితే, తాను ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని.. తన గన్ను శుభ్రం చేసిన తర్వాత ఫారెస్ట్ వైపు కాల్పులు జరిపానన్నారు. పొరపాటున బుల్లెట్లు ఆ భవనం వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు. గతంలో నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన ఖాన్, ఎవరికీ హాని కలిగించే ఉద్దేశ్యం తనకు లేదని విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల వెనుక గల ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అదే భవనం నాలుగో అంతస్తులో మోడల్ ప్రతీక్ నివసిస్తుండటం గమనార్హం. -
ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లల పనీ, పాటా : వైరల్ వీడియో
పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు కచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి. తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో వాళ్లకి ఏ కష్టం తెలియకుండా, అడిగిందల్లా క్షణాల్లో కళ్ల ముందర ఉంచుతూ, కాలు కందకుండా పెంచాలని భావిస్తుంటారు. నిజానికి ఈ విధానం వల్ల పిల్లల్లో సోమరితనం, కష్టపడి సాధించాలనే తపన సామర్థ్యం, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయంటారు చైల్డ్ సైకియాట్రిస్టులు. అందుకే పిల్లలకు బాల్యం నుంచే శ్రమ విలువ, గౌరవం తెలిసేలా చేయాలి. ఒక విదేశీ మహిళ, తన బిడ్డలతో ఇలానే చేస్తోంది అంటే నమ్ముతారా? దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.‘వోనీ_బ్రదర్స్' అనే ఇన్స్టా ఖాతాలో భారతీయ పనిపద్ధతులు, జీవనశైలిని కొరియన్ కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీని ప్రకారం వివిధ భారతీయ అనుభవాలు, ఆహారాలు, లేదా ప్రయాణ విశేషాలు కాకుండా ఆ కుటుంబం తమ పిల్లలకు చేతులతో బట్టలు ఉతకడంలో ఉండే కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరు చిన్న కొరియన్ పిల్లలు ముంబైలోని ప్రసిద్ధ ధోబీ ఘాట్కి వచ్చి, మురికి బట్టలకు బండకేసి బాది ఉతికారు. తల్లి కూడా దగ్గరే నిలబడి, వారితో పాటు బట్టలు ఉతకడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ముందు అక్కడి కార్మికులు బట్టలను శుభ్రం చేయడం, ఉతకడం లాంటి పనులను పిల్లలు జాగ్రత్తగా పరిశీలించడం విశేషం. "ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లలు. నిజమైన భారతీయ జీవితాన్ని గడుపుతున్నారు. ధోబీ ఘాట్. నిజమైన పని, నిజమైన గౌరవం," అనే క్యాప్షన్తో షేర్ అయిన ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Jung ae Um🇰🇷 living in India🇮🇳 (@wonny_brothers)> ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్కాగా వోనీ_బ్రదర్స్ భారతదేశంలో మొదటిసారిగా పానీ పూరీని ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. అలాగే ఈ బ్రదర్స్లో ఒకరు సూపర్ సింగర్ జూనియర్ 9 పోటీదారు మైత్రేయన్తో కలిసి "కనిమా"అనే తమిళ పాటకు డాన్స్ చేస్తూ ఆన్లైన్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీనిపై ఇది కేవలం రీల్స్ కోసం చేసినట్లు అనిపించవచ్చు గానీ, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఒక జీవిత పాఠం. దీనిని తేలికగా తీసుకోకూడదు," అని వ్యాఖ్యానించారు. -
అధికారం లేని ఆర్థిక రాజధాని
ముంబై మునిసిపల్ ఎన్నికలను నాలుగేళ్ళు ఆలస్యంగా నిర్వహించారు. రాజ్యాంగ ఉల్లంఘనతో సమానమైన ఈ జాప్యం భారతీయ ప్రజాస్వామ్యం గురించి చెప్పకనే చెబుతోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా, పర్యవసానాలపై ధ్యాస లేకుండా భారతదేశపు సంపన్న మునిసిపాలిటీ పాలనను సస్పెన్షన్లో ఉంచారు. అయితే, మూడవ అంచెలోని రాజ్యాంగపరమైన స్వయం– పాలనా ప్రభుత్వం ఐచ్ఛికమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 227 మంది సభ్యుల బృహన్ ముంబై పాలక సంస్థ (బీఎంసీ)లో బీజేపీ 2017 నాటి (82) స్థితిని మెరుగుపరచుకుని ఈసారి 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనలో చీలిక దానికి బాగా ఉపయోగపడింది. మహారాష్ట్రలో ఎన్నికలు జరి గిన ఇతర పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా కమలమే ఎక్కువచోట్ల వికసించింది. కానీ, ముంబై ఫలితం కనీసం ఒక చక్కని రాజకీయ భాష్యా నికైనా అనువైనదిగా లేదు. ఎందుకంటే, ముంబై మామూలు నగరం కాదు. అదొక నగర రాజ్యం. దాని బడ్జెట్ ముందు దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్లు కూడా తక్కువే. అది భారతదేశపు ఆర్థిక రాజధాని. బాలీవుడ్కు నెలవు. కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి వాలే పెద్ద చెట్టు. సృజనాత్మక కళాకారుల ఆట మైదానం. ఆ విధంగా అది సాంస్కృతిక చోదక శక్తి. దాని బహుళత్వం, విస్తృత దృక్పథ స్వభావం దాని సంపదకు ఏమీ తీసిపోనంత విలువైనవి. బాధ్యత లేని సంస్థలుఅయినా ఎందుకో నామమాత్రపు జవాబుదారీతనమనే జబ్బుతో, ఈ మహా నగరం బాధపడుతోంది. దాని పాలనా విభా గాలు సాలెగూడును తలపిస్తాయి. బీఎంసీ (పౌర సంస్థ), ఎంఎంఆర్డీఏ (ప్రాంతీయ ప్రణాళిక), ‘బెస్ట్’ (రవాణా), ఎంహెచ్ఏడీఏ (గృహ నిర్మాణం), ఎస్ఆర్ఏ (మురికివాడల వాసులకు పునరా వాసం), రైల్వేలు... ఇలా చెప్పుకొనేందుకు చాలా ఉన్నాయి. కానీ, ఏ సంస్థా పూర్తి బాధ్యత తీసుకోదు. ఒకదాని పరిధిలోకి ఒకటి చొరబడే వీలుంటుంది. నింద నుంచి తప్పించుకునే మార్గాలను అవి జాగ్రత్తగా రూపొందించుకున్నాయి. ప్రణాళిక– అమలు, రవాణా– భూవినియోగం, హౌసింగ్–కనెక్టివిటీల మధ్య సంబంధం లేదు. నగరం స్తంభిస్తే ఏ సంస్థనూ బాధ్యురాలిగా చేయడానికి లేదు. కనుక బీఎంసీ ఎన్నికలను పర్మిషన్లు, కాంట్రాక్టులు, భారతదేశపు అత్యంత విలువైన పట్టణ జాగ్రఫీని తీర్చిదిద్దగల హక్కుపై పట్టు సంపాదించ డానికి జరిగినవిగా చెప్పుకోవాలి. ముంబైలో వైచిత్రి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది అసాధా రణమైన సంపదను సృష్టిస్తోంది. అయినా, దాని పౌరులు దుర్బలురు. రియల్ ఎస్టేట్ బంగారం అంత విలువైనది. అయినా, పట్టణ జనాభాలో చెప్పుకోతగినంత మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. దేశం మొత్తంమీద లెక్కకు వచ్చే కుబేరుల్లో కొంతమంది ఇళ్ళు అక్కడే ఉన్నాయి. సాధారణ పౌర జీవనం బీటలువారిన ఫుట్పాత్లు, క్రిక్కిరిసిన రైళ్ళ గుండా సాగిపోతుంది. వర్షా కాలం వచ్చిందంటే, ఇంట్లోకి వరద నీరు రాదనే గ్యారంటీ లేదు. ముంబైని అంతర్జాతీయ ఫైనాన్సియల్ కేంద్రం (ఐఎఫ్సీ)గా తీర్చిదిద్దుతామని 2006లో అప్పటి ప్రధాని వాగ్దానం చేశారు. సింగపూర్, దుబాయ్, హాంగ్కాంగ్ లేదా లండన్లతో పోటీ పడగలిగిన నగరం ఏదైనా ఉందీ అంటే అది ముంబయ్యే! ప్రణాళి కలు రచించారు. కమిటీలు వేశారు. రెండు దశాబ్దాలు గడిచినా, ముంబై అంతర్జాతీయ ఫైనాన్షియల్ సెంటర్ కాలేకపోయింది. అది ఇప్పటికీ భారతదేశపు ఆర్థిక రాజధానిగానే ఉంది. అది దేశం ఇచ్చిన పతకం. అంతర్జాతీయ గమ్యస్థానంగా గౌరవం దక్కనే లేదు.అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం?ఐఎఫ్సీ కల సాకారం కాకపోవడానికి బ్యాంకర్లు, వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారు, న్యాయవాదులు లేదా మూలధనం కొరవ డటం కారణం కాదు. అంతర్జాతీయ నగరాలుగా గుర్తింపు పొంద డానికి పొందికతో కూడిన పాలన, ఉత్తమ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు పెద్ద స్థాయిలో ఉండటం అవసరం. అవి కొరవడటం ముంబై వైఫల్యానికి కారణం. ఈ విషయంలో గుజరాత్ లోని ‘గిఫ్ట్’ సిటీ ముందంజ వేయగలిగింది. ముంబైకున్న సాంస్కృతిక లేదా మార్కెట్ పరిపూర్ణత దానికి ఉండబట్టి కాదు. స్నేహ పూర్వక రెగ్యులేషన్, నగదు ప్రోత్సాహకాలు, ఉన్నత స్థాయి నుంచి లభించిన ప్రోద్బలం ఇతోధికంగా తోడ్పడ్డాయి. ముంబైకున్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరిమితం. అక్కడి ఆస్తి పన్ను రేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆకర్షణీ యమైన కోస్టల్ రోడ్ ప్రాజెక్టునకు కేంద్రం నుంచో, ఇతర వనరుల నుంచో నిధులు అందాల్సిందే. మెట్రో నెట్వర్క్ కూడా చాలావరకు బాహ్య వనరులపైనే ఆధారపడింది. నిర్మాణం పూర్తయి, అమ్ముడుకాని ఫ్లాట్లు రెండు లక్షలకు పైగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. సబబైన ధరలకు గృహ సదుపాయం, వరద నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ లేదా రోడ్డు మరమ్మతులు వంటివి ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా కనిపించవు. రాయితీలు, ఉచిత బస్సు ప్రయాణాలు మేనిఫెస్టోలలో కనిపించాయి కానీ, వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో పేర్కొన లేదు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే పాలనా వ్యవస్థ పురపాలక సంస్థే. కానీ, వాటి రాజకీయాలు కూడా రాష్ట్ర రాజకీ యాల్లా తయారయ్యాయి. స్వయం పాలన సాగినప్పుడే...ట్రిపుల్ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక) ఇంజిన్ నినాదం 2017లో మాదిరిగానే మళ్ళీ పనిచేసింది. చీలికలు పీలికల రాజకీయ పర్వంలో ఓటర్లు సుస్థిరతనే ఎంచుకున్నట్లు సంకేతమిచ్చారు. కాస్మోపాలిట నిజంకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ‘మరాఠీ అస్మిత’కు ముప్పు వాటిల్లుతోందంటూ చూపించబోయిన బూచి పనిచేయలేదు. ముంబై ప్రధాన సమస్య దాన్ని ఎవరు పాలిస్తున్నారు అన్నది ఒక్కటే కాదు. నికరంగా నగర–ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటన్నది! భారత పబ్లిక్ ఫైనాన్స్, గవర్నెన్సు... రెండూ కూడా నగరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగానే చూస్తున్నాయి తప్ప, వాటిని స్వయం ప్రతిపత్తి అవసరమైన ఆర్థిక ఇంజిన్లుగా చూడటం లేదు. వాటికి సామర్థ్యాన్ని సమకూర్చుకునే శక్తినిచ్చి, దీర్ఘకాలిక విస్తృత ప్రణాళికలో భాగం చేయడం లేదు. పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రే అట్టేపెట్టుకోవడం ఊహించదగిన అంశం అవుతోంది. అది బంగారు బాతు లాంటి శాఖ. అంతర్జాతీయ నగరంగా మారాలని ముంబై నిజంగా భావించే పక్షంలో, దానిలో సంస్థాగతమైన మార్పులు అవసరం. నగరంలో పరిస్థితులకు ఒకే సంస్థ బాధ్యత వహించేటట్లు చేయాలి. వివిధ ఏజెన్సీలను ఒక కోవలోకి తేవాలి. కోశ సంబంధ స్వయం ప్రతిపత్తి ఉండాలి. నియమ నిబంధనల ననుసరించి పర్మిషన్లు తప్పక లభిస్తాయనే నమ్మకం కలగాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో బతికే గుమాస్తాలా మునిసిపాలిటీ పరిణమించకూడదు.అజీత్ రానాడేవ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త -
రూ. 30 కోట్ల సంపద కంటే అతి విలువైనది పోగొట్టుకున్నా..!
జీవితంలో ఏం పోగొట్టుకున్నా..ఏదో ఒక సమయానికి తిరిగి దాన్ని సంపాదించుకోగలం. కానీ పాడైన ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి పూడ్చలేని నష్టం వాటిల్లచ్చు కూడా. అందుకే భూమ్మీద నూకలు ఉంటే ఏమైనా చేయగలం..అదే పోతే ఎన్ని ఉన్నా..నిరూపయోగమే అని మన పెద్దలు ఊరికే అనలేదు కాబోలు. ఇప్పుడు ఆ విషయాన్ని ఓ వ్యవస్థాపకుడు నెట్టింట షేర్చేస్తూ..తాను కూడా అదే తప్పిదం చేశానంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడుని వెళ్లదీసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రతిఒక్కర్నీ ఆలోచించేలా చేయడమే గాక 'ఆరోగ్యమే అన్నికంటే ముఖ్యం' అనే విషయాన్ని అందరికి గర్తు చేసేలా అమితంగా ఆకర్షిస్తోంది. ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశాడు. తాను వ్యాపార సంస్థలో సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టపోయానని చెప్పారు. దానిఫలితం తన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని నిజాయితీగా వివరించారు. తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ..బరువు పెరుగుతూనే వస్తున్నానని వాపోయారు. వ్యాపారం నష్టం తట్టుకోవడం సులువే..ఎప్పటికైన పోగొట్టుకున్నది సంపాదించేయొచ్చు. కానీ పాడైన ఆరోగ్యం బాగవ్వడం దాదాపు అసాధ్యం అని బాధగా చెప్పుకొచ్చారు. అంతేగాదు వ్యాపార నష్టం ఎప్పటికీ వ్యక్తిగత నష్టానికి దారితీయకూడదని గట్టిగా హెచ్చరించారు కూడా. తాను వ్యాపారంలో కేవలం రూ. 30 కోట్లే పోగొట్టుకున్నానని, దానికంటే విలువైన ఆరోగ్యంకోల్పోయానని ఆవేదనగా చెప్పుకొచ్చారు ఎవర్స్టోన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేశాయ్. కాగా, 2017లో దేశాయ్ భారతీయ స్పోర్ట్స్ బ్రాండ్ని దేశాయ్ D: FYని ప్రారంభించారు. అయితే ఈ వెంచర్ భారీ నష్టాలను చవిచూసింది. కేవలం 30 నెలల్లో ఆయన దాచుకున్న పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అంతా తాను 30 కోట్లు ఎలా కోల్పోయానో ఆరా తీశారే గానీ..ఈ 30 నెలలలో ఎంత టెన్షన్, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాననేది అడగలేదని అన్నారు. నిద్రలేమి అదిక బరువుకి దారితీస్తుంది..ఆ టైంలో ఒత్తిడితో రాత్రి ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రపోయానని, తనకు తెలియికుండానే చాలా ఒత్తిడిని అనుభవించానని అన్నారు దేశాయ్. వారానికి నాలుగుసార్లు వాకింగ్, జాగింగ్ వంటివి అన్ని చేసినా..తన శరీరంలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. ఎంత కష్టపడి వర్కౌట్లు చేసినా..నాణ్యమైన నిద్ర మాత్రం తిరిగి పొందలేకపోయానన్నారు. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేసుకోలేకపోయానని చెప్పారు. ఒత్తిడి, నిద్రలేమి శరీరాన్ని చిత్తు చేస్తాయ్..తన పోస్ట్లో ఒత్తిడి, నిద్ర లేమి ఏవిధంగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయో వివరించారు. ఆరుగంటల కంటే తక్కువ నిద్ర లేమి ఇన్సులిన్ని ప్రభావితం చేసి, టెస్టోస్టిరాన్ను దెబ్బతీస్తుంది.ఎక్కువైన కార్టిసాల్ (ఒత్తిడి ) క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ కొవ్వు తగ్గడాన్ని నిరోధిస్తుందిఎంతలా ప్రయత్నించినా నిద్ర లేమిని తరిమికొట్టలేరుచివరగా ఆయన తాను కోల్పోయిన సంపదను తిరిగి పొందగలిగినప్పటికీ..ఆరోగ్యపరంగా పూర్తిస్థాయిలో కోలుకోలేదని అన్నారు. అంతేగాదు. తాను సుమారు ఏడేళ్లలోనే కోల్పోయినదంతా సంపాదించానని, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందలేకపోయానని అన్నారు. అలాగే దేశాయ్ తన పోస్ట్ని ముగిస్తూ..తన తోటి వ్యవస్థాపకులందర్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునివ్వడం విశేషం. View this post on Instagram A post shared by Prashant Desai (@itsprashantdesai) (చదవండి: మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..) -
ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
Mumbai : అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం
-
అక్షయ్ కుమార్ కాన్వాయ్లో ప్రమాదం.. ఆటో నుజ్జునుజ్జు
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కాన్వాయ్లోని ఒక కారు ప్రమాదానికి గురైంది. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ట్వింకిల్ ఖన్నాతో ఆయన విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.. తమ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకున్న వారు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రాథమిక కథనాల ప్రకారం.. వేగంగా వస్తున్న మెర్సిడెస్ కారు మొదట ఒక ఆటోను ఢీ కొట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ కాన్వాయ్లోని వాహనం అదపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో జుహులోని సిల్వర్ బీచ్ కేఫ్ సమీపంలో వరుసుగా పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అయితే, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ప్రయాణిస్తున్న కారు సురక్షితంగానే ఉంది. ప్రమాదం చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అక్షయ్ కుమార్ వెంటనే తన సిబ్బందితో పాటు కారు నుంచి దిగి ప్రమాదంలో చిక్కుకున్న ఆటో డ్రైవర్తో పాటు అందులోని ప్రయాణికులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ఆటో తీవ్రంగా నుజ్జునుజ్జు కావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీలచ్చుకున్నారు.#Exclusive: A very dangerous acc!dent has happened… reportedly involving #AkshayKumar ’s security team..!@akshaykumar Hope You Are Fit and Fine Paaji 👍❤️ pic.twitter.com/DZ12n1RiMu— Rizwan Khan (@imrizwankhan786) January 19, 2026 -
కొత్త మలుపు తిరిగిన ‘ముంబై మేయర్’ పంచాయితీ
బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో ఇంకా తేలలేదు. ఒకవైపు మహాయుతి కూటమిలో ఏ పార్టీ తరపు ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో? అనే సస్పెన్స్ కొనసాగుతుండగా.. మరోవైపు ఏదైనా అద్భుతంగా జరిగి అనూహ్యంగా విపక్ష కూటమికి వెళ్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధికార కూటమిలో చర్చలు కొనసాగుతుండగానే.. ఈలోపు షిండే శివసేన హోటల్ రాజకీయాలకు తెర తీసింది.ఏకనాథ్ శిండే నేతృత్వంలోని శివసేన ఒకవైపు తమ కార్పొరేటర్లను చేజారిపోకుండా(హార్స్ ట్రేడింగ్కు దూరంగా) హోటల్లో దాచింది. పేపర్ వర్క్ ద్వారా అఫీషియల్ ఫార్మాలిటీస్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. తద్వారా జంపింగ్లకు(ఫిరాయింపులకు) చెక్ పెట్టాలని చూస్తోంది. అదే సమయంలో.. 29 సీట్లతో మేయర్ పదవి కోసం మిత్రపక్షం బీజేపీతో చర్చలు జరుపుతూనే ఉంది.మొన్నటిదాకా పవర్ షేరింగ్ ఫార్ములాను ప్రస్తావిస్తూ చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవి కోసం డిమాండ్ చేసిన షిండే సేన.. ఇప్పుడు స్వరం మార్చింది. మేయర్ పదవి మొదటి సంవత్సరం మాత్రం కచ్చితంగా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 23న బాలాసాహెబ్ థాక్రే శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని షిండే సేన భావిస్తోంది. ఈ క్రమంలో కూటమి తరఫున తొలి ఏడాది మేయర్ పదవి దక్కించుకోవడం ద్వారా థాక్రేకు ఘనంగా నివాళి సమర్పించాలని బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.ఇప్పటికే రేసులో యామిని జాధవ్, తృష్ణా విశ్వస్రావో, అమేయ్ ఘోలే వంటి యువ, అనుభవజ్ఞుల పేర్లను మేయర్ రేసు కోసం పరిశీలిస్తోంది. బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన మేయర్ ఉన్నందున.. తమ వర్గమే అసలు శివసేన అని నిరూపించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఏక్నాథ్ షిండే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..ఇప్పటివరకు తమ పార్టీ తరఫున దేశ వాణిజ్య నగరానికి మేయర్ లేని కారణంగా.. రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని చూపించడానికి దక్కిన అవకాశాన్ని(మేయర్ పదవి) చేజార్చుకోవాలని బీజేపీ అనుకోవడం లేదు. ఈ పాయింట్ మీద షిండే సేనపై ఒత్తిడి పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో.. కార్పొరేటర్లు చేజారిపోకుండా వ్యూహాన్ని అమలు చేస్తోంది. మేయర్ ఎన్నికలు 8–10 రోజుల్లో జరిగే అవకాశం ఉండటంతో తమ కార్పొరేటర్లను నగరం వీడరాదని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం అవసరమైతే ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచింది.ఇక.. విపక్షం కూడా మేయర్ పదవి కోసం తన వంతు ప్రయత్నాల్ని ఉధృతం చేసింది. 277 సభ్యులున్న ముంబై కార్పొరేషన్లో మేయర్ పదవి కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 114. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే శివసేన కలయితోనే 118 అవుతుంది. అంటే నాలుగు సీట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇక విపక్ష కూటమిలో.. ఉద్ధవ్ శివసేన, MNS, NCP (శరద్ పవార్), కాంగ్రెస్, AIMIM, SP కలయికతో మొత్తం కలిపినా 106 సీట్లు అవుతున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్కు 8 తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే షిండే వర్గానికి గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.‘‘ఒకసారి పార్టీని వదిలిన వారు.. మళ్లీ హ్యాండ్ ఇవ్వొచ్చు’’ అంటూ ఉద్దవ్ శివసేన వర్గం అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యానించడం.. ‘‘ఎంత హోటల్లో దాచినా చేరాల్సిన సందేశాలు చేరాల్సిన వాళ్లకు టైంకి చేరతాయి. దేవుడు తల్చుకుంటే మేయర్ మనదే అవుతుంది’’ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ముంబై ఎన్నికల ఫలితాలు:బీజేపీ - 89 సీట్లుషిండే శివసేన – 29 సీట్లుఉద్ధవ్ శివసేన(యూబీటీ) 65 + NCP (శరద్ పవార్)1+ఎంఎన్ఎస్ (MNS) 6 సీట్లు మొత్తం 72 సీట్లుకాంగ్రెస్ – 24, ఎంఐఎం – 8, సమాజ్వాదీ పార్టీ – 2మొత్తం హౌస్: 227 సభ్యులుమెజారిటీ మార్క్: 114బీజేపీ+షిండే సేన: 118 (మెజారిటీ కంటే 4 ఎక్కువ).. అజిత్ పవార్ NCP మద్దతు గనుక కలిపితే ముగ్గురు కార్పొరేటర్లు కలిస్తే సంఖ్య 121అయితే.. షిండే సేన వర్గం కార్పొరేటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడమంటూ చెబుతున్నారు. మేం ఎన్నికలు సక్రమంగా గెలిచాం. మాపై ఎవరూ ఒత్తిడి చేయకూడదు. ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు అంటూ రాజు వాఘ్మారే అనే కార్పొరేటర్ వ్యాఖ్యలు చేశారు. అయితే రకరకాల ఊహాగానాలు, ప్రచారాల వేళ.. మేయర్ పదవి కూటమిదేనని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, తాను, షిండే, ఇతరులు కూర్చుని నిర్ణయం తీసుకుంటామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. -
ముంబై ఓటమి తర్వాత ఠాక్రేల స్పందన.. ఏమన్నారంటే?
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. అధికార మహాయుతి కూటమి పురపాలక సంస్థ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్లకు పైగా ముంబైని శాసించిన ఠాక్రే కుటుంబానికి ఈ సారి ముంబై పీఠం కోల్పోవాల్సి వచ్చింది. అయితే దీనిపై శివసేన (ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పదవిలో లేకపోయినా మరాఠా ప్రజలకు శివసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించింది. మరాఠా సంస్కృతి, భాష స్థానికతే ప్రధాన ఎజెండాగా ఆ పార్టీ రాజకీయాలు జరిపింది. అయితే ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహించిన శివసేన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తిరుగులేని అధిపత్యాన్ని కనబరిచేది. గత 25 ఏళ్లుగా ముంబై మేయర్ పీఠం శివసేన( ఠాక్రే) వర్గానిదే అంటే ఆ ప్రాంతంలో ఠాక్రేలు ఎంత ప్రభావం చూపగలరో చెప్పవచ్చు. అయితే నిన్న( శుక్రవారం) జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి స్పష్టమైన అధిపత్యం కనబరిచి ముంబై పీఠం కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే సోదరులు ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించారు. దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రేతో ఫోటోతో కూడిన లేఖను ఉద్దవ్ ఠాక్రే పోస్టే చేశారు." చేసే పోరాటం ముగియలేదు. మరాఠీలకు వారు కోరుకున్న విధంగా గౌరవం లభించేంత వరకూ ఇది ముగియదు" అని అన్నారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే స్పందిస్తూ "ప్రస్తుతం అధికారంలో ఉన్న శక్తులు మరాఠా ప్రజలను వేదించడానికి లభించే ఒక్క అవకాశాన్ని కూడా వదలరు. కనుక మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు వచ్చిపోతుంటాయి. కానీ మనం మరాఠా ప్రజలకోసం ఉన్న సంగతి మర్చిపోకూడదు. మరాఠా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే తమ పార్టీ కార్పొరేటర్లు వారిని మోకాళ్ల మీద నిలబడేలా చేస్తారు" అని లేఖ విడుదల చేశారు.కాగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 25 చోట్ల మహాయుతి కూటమి విజయాన్ని సాధించింది. అక్కడ మెుత్తం 227 కౌన్సిల్ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 114 అయితే బీజైపీకి 89 స్థానాలు రాగా శివసేన (శిండే) 29 వార్డులు సాధించింది. -
ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని అన్నారాయన. దీనిపై బాలీవుడ్లో తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు రెహమాన్ కామెంట్లను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో.. విశ్వహిందూ పరిషత్ ఓ అడుగు ముందుకేసి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా.. మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్లో అవకాశాలు దక్కాలంటే ఘర్వాపసీ కావాలంటూ వ్యాఖ్యానించారు... హమీద్ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి)కి చెందిన వర్గానికే ఇప్పుడు రెహమాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో. గతంలో అన్సారీ కూడా 10 ఏళ్ల పాటు రాజ్యాంగ బద్ధమైన వివిధ పదవులను అనుభవించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన దేశాన్ని దెబ్బ తీశారు. ఒకప్పుడు అతను(రెహమాన్ను ఉద్దేశిస్తూ..)ను హిందువులతో సహా దేశం మొత్తం ఆరాధించింది. అలాంటి వ్యక్తి ఎందుకు మతం మారాడు?. బహుశా ఘర్వాపసీ అయితే మళ్లీ అవకాశాలు వస్తాయేమో అని బన్సాల్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయని.. రెహమాన్లాంటి ఆర్టిస్టులకు కాదని చురక అంటించారు.ఓ ప్రముఖ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయన్నారు. ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఇందుకు ఒక కారణమైతే.. 'మతం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాలను తనకు పుకార్ల రూపంలోనే తెలిశాయని అన్నారు. అయితే.. అవుట్సైడర్లా తాను ఫీలైనప్పటికీ.. కొన్ని ప్రాజెక్టులు చేజారినప్పటికీ.. కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా దొరుకుతోందని అన్నారు. పని కోసం నేను వెతుక్కుంటూ వెళ్లడం కాదు.. నా నిజాయితీకి తగ్గట్లు పని వస్తే సంతోషిస్తానని చెప్పారు. మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పెద్దలు విభేధిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తుచేశారు. మరో ఫిల్మ్మేకర్ రెహమాన్ వ్యాఖ్యలను చీప్ అని పేర్కొన్నారు. అయితే.. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్ కనిపించడం లేదని.. భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్నారని.. వీటికి తోడు ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాల్లేకుండా పోయాయని పలు సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. -
కాంగ్రెస్ ఘోర పరాభవం వెనుక..
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. దీనికి నాయకత్వ లేమి ప్రధాన కారణమని కొందరు అంటుండగా, పార్టీలో ఐక్యత లోపించిందని మరికొందరు చెబుతారు. ఇప్పుడు మరోమారు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పనితీరును కనబరిచింది. మొత్తం 227 సీట్లకు గాను కేవలం 22 సీట్లకే పరిమితమయ్యింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.సరైన వ్యూహం లేకుండా..బీఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భారీ ర్యాలీలు, రోడ్షోలు గానీ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు గానీ నిర్వహించలేదు. కనీస ప్రణాళిక, సరైన వ్యూహం లేకుండానే బరిలోకి దిగినట్లు స్పష్టంగా కనిపించింది. 1885లో ఇదే నగరంలో పుట్టి, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ, నేడు తన ఉనికిని కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ ఈ పరాజయానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె నాయకత్వ సామర్థ్యంపై పలు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.అంతకంతకూ దిగజారుతూ..గత మూడు పర్యాయాల బీఎంసీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, ముంబైలో పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది. 2007లో 71 సీట్లు గెలుచుకున్న పార్టీ, 2012 నాటికి 51కి, 2017లో 31కి పడిపోయింది. ఒకప్పుడు 26 శాతానికి పైగా ఉన్న ఓటు బ్యాంకు, నేడు సింగిల్ డిజిట్కు పడిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాది ఓటర్లు, దక్షిణాది వారు, గుజరాత్, జైన్, మార్వాడీ వర్గాల మద్దతును తిరిగి పొందడంలో పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు.పొత్తుల గందరగోళం ముస్లిం, దళిత ఓట్లను ఏకం చేయాలనే లక్ష్యంతో ప్రకాష్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ), రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆర్ఎస్పీ)తదితర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ కూటమి క్షేత్రస్థాయిలో కూడా సరైన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ప్రచారంలో మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే విమర్శలు వినిపించాయి. కేవలం తమ అభ్యర్థులకే ఓట్లు అడగడంపై వీబీఏ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వర్షా గైక్వాడ్ కేవలం అమీన్ పటేల్, అస్లాం షేక్ వంటి ఇద్దరు ముగ్గురు నేతల మాటలకే ప్రాధాన్యతనిచ్చారని, ఇతర సీనియర్లను, క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించారని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తూవస్తోంది. సమిష్టి నిర్ణయాలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టికెట్ల పంపిణీలో పక్షపాతం టికెట్ల కేటాయింపు వ్యవహారం పార్టీలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టి, ముఖ్య నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉదాహరణకు.. అంధేరీలో సీనియర్ నేత అస్లాం షేక్ తన కుమారుడు, సోదరి, అల్లుడికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇందుకోసం ఆయన గతంలో గెలిచిన మాజీ కార్పొరేటర్లను కూడా పక్కనపెట్టడంతో, వారు శివసేన (యూబీటీ) గూటికి చేరి, కాంగ్రెస్పైనే పోటీకి దిగారు. అలాగే వర్షా గైక్వాడ్ తన అనుచరుల కుటుంబాలకు టికెట్లు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే అశోక్ జాదవ్ తదితరులు తమ వారసులకు టికెట్ దక్కలేదన్న కోపంతో పార్టీని వీడారు. ఇలాంటి స్వయంకృతాపరాధాలు, అవకాశవాద రాజకీయాలే ముంబైలో కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పుడుతూనే మధుమేహం.. -
ముంబైలో మళ్లీ పవర్ప్లే!
సుమారు పాతికేళ్లపాటు కొనసాగిన థాక్రే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ.. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. ఈ విజయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కే సింహ భాగం కట్టబెడుతున్నారంతా. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ముంబై మేయర్ పదవిని బీజేపీ తృటిలో చేజార్చుకుంది. ఆ టైంలో.. 82 స్థానాలు నెగ్గినప్పటికీ మిత్రపక్షంగా ఉన్న శివసేన కంటే కేవలం రెండే సీట్లు వెనకబడిపోయింది. అయితే.. ఈసారి మహాయుతికి స్పష్టమైన బలం ఉండడంతో ముంబై మేయర్ పీఠం బీజేపీదే అనుకుంటున్న టైంలో.. హైడ్రామా మొదలైంది. నిన్న బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాల్లో జోరు కొనసాగుతున్న టైంలోనే.. పదవిపై బీజేపీ, ఏకనాథ్ శిండే శివసేన మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో మ్యాజిక్ ఫిగర్ 114. బీజేపీ 89 వార్డుల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. శిండే శివసేన కేవలం 29 స్థానాలు సాధించింది. అజిత్ పవార్ ఎన్సీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లెక్క ప్రకారం బీజేపీకి మేయర్ పదవి దక్కాలంటే శిండే వర్గం మద్దతు తప్పనిసరి. దీంతో.. షిండే వర్గానికి కింగ్మేకర్ స్థానం దక్కినట్లయ్యింది. శిండే వర్గంలోని కీలక నేతలు ఇప్పటికే “ముంబై మేయర్ శివసేన వర్గానిదే కావాలి. ఇది బాలాసాహెబ్ థాక్రే వారసత్వం” అని ప్రకటనలు చేసుకుంటూ వస్తోంది. అయితే షిండే మాత్రం “మహాయుతి కూటమిగా పోరాడాం. ముంబై అభివృద్ధి కోసం కలిసి నిర్ణయం తీసుకుంటాం” అని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఏం జరగొచ్చు!మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో 131 స్థానాలున్న థానేలో సీన్ రివర్స్గా ఉంది. అక్కడ షిండే శివసేన ఏకంగా 75 సీట్లు సాధించింది. బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. దీంతో మిత్రపక్షం మద్దతు అవసరం లేకుండానే షిండే సేన మేయర్ పదవి దక్కించుకోబోతోంది. అయితే ముంబై విషయంలో అలా కాదు. అయితే మేయర్ పదవిని రెండు భాగాలుగా పంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే, 2.5 సంవత్సరాలకుగానూ(పవర్షేరింగ్ ఫార్ములా) షిండే వర్గం, మిగతా కాలం బీజేపీకి దక్కేలా ఒప్పందం కుదిరే అవకాశముందని ప్రచారం నడుస్తోంది. అలాగే మేయర్ పదవిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఉపమేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు, కీలక వార్డులపై గట్టి చర్చలు జరగడం ఖాయమనే చెప్పొచ్చు. అయితే అంత మెజారిటీ సాధించిన బీజేపీ.. మేయర్ సీటును త్యాగం చేస్తుందా? అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. లేదంటే.. ఈ వంకతో బీఎంసీ ముఖ్య కమిటీలపై షిండే శివసేన ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కోట్లు పెట్టి కొత్త అపార్ట్మెంట్ కొన్న నిర్మాత
సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం సర్వ సాధారణం. ఇందులో భాగంగానే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఒక కొత్త అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేసిన కొత్త అపార్ట్మెంట్ ధర రూ. 8.05 కోట్లు. ఇది పాలి వింటేజ్ భవనంలో 1,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఐదవ అంతస్తులోని అపార్ట్మెంట్ను రెండు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కొనుగోలు చేశారు. దీనికోసం రూ. 48 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ లావాదేవీ నవంబర్లో జరిగినట్లు సమాచారం.ఖార్లో పాలి వింటేజ్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేసిన లెవల్ 6 అనే కంపెనీ ద్వారా ఈ అపార్ట్మెంట్ను కరణ్ జోహార్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని లెవల్ 6 గ్రూప్ చీఫ్ ప్రమోటర్ ప్రీతేష్ సంఘ్వి ధృవీకరించారు.ఈ కొత్త అపార్ట్మెంట్ మాత్రమే కాకుండా.. కరణ్ జోహార్ బాంద్రాలోని కార్టర్ రోడ్లోని ది రెసిడెన్సీలో సముద్రానికి ఎదురుగా ఉన్న పెద్ద డ్యూప్లెక్స్ కలిగి ఉన్నారు. అదే విధంగా 8,000 చదరపు అడుగుల పెంట్హౌస్ను 2010లో దాదాపు రూ. 32 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ప్రైవేట్ టెర్రస్ & గౌరీ ఖాన్ రూపొందించిన నర్సరీ ఉన్నాయి. ఢిల్లీలోని మెహ్రౌలిలో కూడా ఈయనకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్! -
పార్టీ కార్యకర్తను చూసి గర్వపడుతున్నా: మోదీ
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. పురపాలిక ఎన్నికల్లో బీజేపీ కూటమికి పట్టం కట్టినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ మాట్లాడుతూ "శక్తివంతమైన ప్రజలు ఎన్డీఏ ఎజెండాకు సుపరిపాలనకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏతో ప్రజలు ఏవిధంగా భాగస్వామ్యమయ్యారో చూపుతున్నాయి. ప్రజలందరికీ నా ధన్యవాదాలు" అని మోదీ తెలిపారు.అదే విధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తను చూసి తాను గర్వపడుతున్నానని మోదీ అన్నారు. మహాయుతి కూటమి రాబోయే రోజుల్లోనూ ఇదే విధమైన ట్రాక్ రికార్డును మెయింటెన్ చేస్తుందని ప్రతిపక్షాల అబద్ధాలను సమర్థవంతంగా తిప్పికొడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు ఈ విజయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మన్సిపల్ ఎన్నికల్లో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందుత్వ ఎప్పుడు తమ ఆత్మని, హిందుత్వాన్ని అభివృద్ధి నుండి ఎవరూ దూరం చేయలేరని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో జరిగిన 29 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలలో 25చోట్ల మహాయుతి కూటమి మేయర్ స్థానాన్ని ఏర్పాటు చేయచోతుందని సీఎం ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతీ కూటమి దూసుకపోతుంది. ముంబైతో సహా 19 కార్పోరేషన్లలో స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. -
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
ముంబై మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే బీజేపీ కూటమి బృహాత్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఠాక్రేల చేతిలో ఉన్న ముంబై మేయర్ పీఠం తొలిసారిగా వారి చేజారనున్నట్లు ఫలితాల ట్రెండ్ స్పష్టం చేస్తోంది.ముంబై మున్సిపల్ కార్పోరేషన్కు మెుత్తం 227 స్థానాలుండగా బీజేపీ 88 స్థానాలు, శివసేన శిండే(28 స్థానాల్లో అధిక్యంలో ఉంది. శివసేన (ఠాక్రే) 74 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో మహాయుతి కూటమి స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. మెుత్తంగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా బీజేపీ 19 చోట్ల స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. సాయంత్రం 5 గంటలకు అందిన నివేదికల ప్రకారం మెుత్తంగా 2,869 స్థానాలలో మహాయుతి కూటమి 1600 స్థానాల్లో అధిక్యం దూసుకపోతుంది.మెుత్తంగా పార్టీల వారిగాబీజేపీ:1304శివసేన (శిండే): 363కాంగ్రెస్ : 278 శివసేన (ఠాక్రే):151ఎన్సీపీ : 127ఎంఐఎం: 77ఇతరులు: 278అయితే ఈ ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరాఠా ప్రజలు ఆశీర్వదించారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మహారాష్ట్రలో వచ్చే 20-25 ఏళ్ల పాటు బీజేపీ పాలిస్తుందని తెలిపారు. మహాయుతి కూటమిపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలు ఉదాహరణ అని ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు. -
ముంబై మేయర్ పీఠం ఎవరిదో?
-
ముంబై ఎగ్జిట్పోల్స్ విడుదల.. ఆ పార్టీదే హవా..?
బృహత్ ముంబై మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. దేశ ఆర్థిక రాజధాని ఓటర్లంతా ఎవపరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల అనంతరం సంప్రదాయంగా ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ మూకుమ్మడిగా బీజేపీ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహారాష్ట్ర స్థానికులతో పాటు ముస్లిం ఓటర్లు శివసేన (యూబీటీ) వైపు నిలువగా, దక్షిణాది, ఉత్తరాది ప్రజలు యువత మహిళలు బీజేపీ వైపు నిలిచిట్లు ఎగ్జిట్ పోల్ట్ అంచనా వేశాయి. నాలుగు ప్రముఖ ఎగ్జిట్పోల్ సంస్థలు ఫలితాలు ప్రకటించాయి. వాటి వివరాలు.జన్మత్ : బీజేపీ కూటమికి -138 సీట్లు, శివసేన ( యూబీటీ) 62, కాంగ్రెస్ 20 ఇతరులు 7 అని అంచనా వేసింది.యాక్సిస్ మై ఇండియా: బీజేపీ కూటమి 131-151, శివసేన ( యూబీటీ) 58-68, కాంగ్రెస్ 12-16 ఇతరులు 6-12 స్థానాలు గెలవనున్నట్లు తెలిపింది.టైమ్స్ నౌ బీజేపీ కూటమి: 129-146, శివసేన యూబీటీ 54,64, కాంగ్రెస్ కూటమి ఇతరులు 6-9 స్థానాలు గెలవనున్నట్లు ప్రకటించింది.న్యూస్-18- బీజేపీ కూటమి: 119,శివసేన యూబీటీ 75, కాంగ్రెస్ కూటమి 20 ఇతరులు 14 స్థానాలు గెలుచుకోనున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. -
అన్నామలై రాజకీయం – ముంబైలో దక్షిణాది వారికి చిక్కులు
ముంబైలో బతుకుతున్న దక్షిణాది ప్రజలకు తమిళనాడు బీజేపీ నేత చేస్తున్న వ్యాఖ్యలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ముంబై వెళ్లినఅన్నామలై ముంబై కేవలం మహారాష్ట్రకు చెందిన నగరం మాత్రమే కాదని, అది ఒక అంతర్జాతీయ నగరమని అన్నారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అభ్యర్థి మేయర్గా ఎన్నికైతేనే దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.దీంతో ఈ వ్యాఖ్యలు ముంబై అస్తిత్వాన్ని, మరాఠీ ప్రజల ప్రాముఖ్యతను తగ్గించేలా ఉన్నాయంటూ శివసేన , ఎంఎన్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం అన్నామలై చేస్తున్న ఈ ప్రయత్నం చివరకు ఇక్కడ దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంటున్న దక్షిణాది వారిని రిస్క్ లోకి నెట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాజ్ థాక్రే.. అన్నామలైను రసమలై అని ఎద్దేవా చేస్తూ.. శివసేన పాత నినాదం హటావో లుంగీ, బజావో పుంగీ ని మళ్ళీ గుర్తు చేస్తూ ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చారు.ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ముంబై గడ్డపై కాలు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. శివసేన పత్రిక సామ్నాలో అన్నామలై ముంబైలో అడుగు పెడితే కాళ్లు తీసేస్తామని హెచ్చిరంచారు. దీనికి అన్నామలై కూడా తగ్గకుండా సమాధానమిచ్చారు. తాను ముంబై వచ్చి తీరుతానని, దమ్ముంటే తన కాళ్లు నరకాలని సవాలు విసిరారు.ముంబై అభివృద్ధిలో దక్షిణాది వారి పాత్ర కూడా ఉందని ఆయనంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకు ధారవి వంటి ప్రాంతాల్లో నివసించే వేలాది మంది దక్షిణాది కూలీలు, వ్యాపారుల భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్న ఆందోళన అక్కడి దక్షిణాదివారిలో వ్యక్తమవుతోంది. -
చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్గా..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముంబైతో క్వార్టర్ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ దుమ్ములేపాడు. సెంచరీ మిస్ చేసుకున్నా సూపర్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించాడు.బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక- ముంబై (Karnataka vs Mumbai) జట్లు సోమవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.షామ్స్ ములాని అర్ధ శతకంఓపెనర్లు అంగ్క్రిష్ రఘువన్షి (27), ఇషాన్ ముల్చందాని (20) ఓ మోస్తరుగా ఆడగా.. వన్డౌన్లో వచ్చిన ముషీర్ ఖాన్ (9) ఈసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సిద్దేశ్ లాడ్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ హార్దిక్ తామోర్ (1) నిరాశపరిచాడు.ఇలాంటి దశలో ఆల్రౌండర్ షామ్స్ ములాని అద్భుత అర్ధ శతకం (86)తో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారిలో సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్) రాణించడంతో ముంబై చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ మూడు వికెట్లు తీయగా.. విధ్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి చెరో రెండు.. విజయ్కుమార్ వైశాఖ్ ఒక వికెట్ పడగొట్టారు.రాణించిన పడిక్కల్.. కరుణ్ నాయర్ఇక లక్ష్య ఛేదనలో కర్ణాటకకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12)ను మోహిత్ అవస్థి పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ 81 పరుగులతో రాణించగా.. కరుణ్ నాయర్ 74 పరుగులతో అతడితో కలిసి అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించిన కారణంగా VJD (వి.జయదేవన్) మెథడ్లో.. 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసిన కర్ణాటక.. 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో సెమీస్కు దూసుకువెళ్లింది.చరిత్ర సృష్టించిన పడిక్కల్ఈ సీజన్లో పడిక్కల్ ఇప్పటికే 721 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ దేశీ వన్డే టోర్నీలో అత్యధికసార్లు 700 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2021-22 సీజన్లో దేవదత్ పడిక్కల్ ఏడు ఇన్నింగ్స్ ఆడి 737 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో ఓవరాల్గా ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నారాయణ్ జగదీశన్ (2022-23లో 8 ఇన్నింగ్స్లో 830 పరుగులు) కొనసాగుతున్నాడు. ముంబై తరఫున 2021-22 సీజన్లో పృథ్వీ షా 827 పరుగులు చేసి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
ఠాక్రేలు తలుచుకుంటే ముంబై పరిస్థితి అదే?: సంజయ్ రౌత్
బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన (ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఠాక్రే కుటుంబానికి ఎదురులేదన్నారు. ప్రస్తుతం మరాఠీల గౌరవం కోసమే ఠాక్రే సోదరిలిద్దరూ కలిసి ప్రచారానికి వచ్చారన్నారు. మహానగరంలో శివసేన పట్టు ఇప్పటికీ సడలేదని ఠాక్రేలు తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైనగరం మూసివేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.గతేడాది మహారాష్ట్ర రాజకీయాలలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో విడిపోయిన ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలిద్దరూ 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి కలిశారు. అనంతరం ముంబై మహానగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో శివసేన (ఠాక్రే), మహారాష్ట్ర నవనిర్మాణ సేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ముంబై నగరంలో ఠాక్రేలు ఎప్పుడు ఓడిపోలేదు. వారు తలుచుకుంటే ముంబైని 10 నిమిషాల్లో స్తంబింపచేయగలరు. ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలిద్దరూ అన్నదమ్ములూ వారు మళ్లీ కలవడం అదృష్టం" అన్నారు. వారిద్దరి మధ్య విబేధాలున్నప్పటికీ దేశం కోసం ఏకమయ్యారని తెలిపారు."ఠాక్రేలు అంటే ఒక బ్రాండ్ వారు ఉంటేనే మరాఠాల గౌరవం బ్రతికుంటుంది. ఉద్దవ్, రాజే ఒకరే, మేయర్ మనవారే" అని రౌత్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. "ఒకవేళ బాల్ఠాక్రే బతికి ఉంటే ఇది సాధ్యమయ్యేది.కానీ వీరివల్ల కాదు ఏక్ నాథ్ శిండేని ముంబైలో అడుగుపెట్టనివ్వమన్నారు. కానీ 50మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు" అని ఠాక్రే సోదరులను ఫడ్నవీస్ దుయ్యబట్టారు. -
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
-
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్.. సచిన్కు కూడా సాధ్యం కాలేదు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సర్ఫరాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ముంబైకర్ తన సంచలన బ్యాటింగ్తో టీ20 మ్యాచ్ను తలపించాడు. ప్రత్యర్ది బౌలర్లను ఉతికారేశాడు.ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మకు సర్ఫరాజ్చుక్కలు చూపించాడు. అభిషేక్ వేసిన 16 ఓవర్లో సర్ఫరాజ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన భారత ప్లేయర్గా సర్ఫరాజ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబిజిత్ కాలే, అటిత్ షేత్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. తాజా మ్యాచ్లో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే ఆర్ధ శతకం బాది ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్, కోహ్లి, రోహిత్ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ .. ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ ముంబై కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 217 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో టాపర్డర్ రాణించినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.సర్ఫరాజ్ రీ ఎంట్రీ ఇస్తాడా?దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్. ఇంగ్లండ్పై తన అరంగేట్రంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. తర్వాత మ్యాచ్లలో నిలకడ లేకపోవడంతో అతడిని టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు సర్ఫరాజ్ తన అద్భుత ప్రదర్శనలతో కేవలం టెస్టులకే కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు తన సిద్దమేనని సవాల్ విసురుతున్నాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సర్ఫరాజ్ దుమ్ములేపాడు.చదవండి: ENG vs NZ: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన..! ఇంగ్లండ్ కెప్టెన్కు రూ. 33 లక్షల ఫైన్ -
అపార్టుమెంటు కొనుగోలు చేసిన రితికా.. ధర ఎన్ని కోట్లంటే?
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే ఖరీదైన అపార్టుమెంట్ కొనుగోలు చేశారు. ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో రూ. 26.30 కోట్ల విలువ గల నివాస స్థలాన్ని ఆమె కొన్నారు. దీని విస్తీర్ణం 2760.40 చదరపు అడుగులు అని తెలుస్తోంది.అదే విధంగా.. మూడు కార్లు పార్కింగ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉన్నట్లు సమాచారం. ‘స్క్వేర్ యార్డ్స్’ అందించిన వివరాల ప్రకారం.. ఈ అపార్డుమెంటు కొనుగోలు సమయంలో రితికా సజ్దే (Ritika Sajdeh).. రూ. 1.13 కోట్లు స్టాంపు డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ చార్జీలకు రూ. 30 వేలు ఖర్చు అయ్యాయి. గతేడాది డిసెంబరు 12న రిజిస్ట్రేషన్ పూర్తైంది.స్పోర్ట్స్ మేనేజర్అజింక్య డీవై పాటిల్, పూజా అజింక్య పాటిల్ నుంచి రితికా సజ్దే ఈ అపార్డుమెంటును కొనుగోలు చేశారు. కాగా భారత దిగ్గజ బ్యాటర్గా పేరొందిన రోహిత్ శర్మ.. రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తొలుత తన స్పోర్ట్స్ మేనేజర్గా పనిచేసిన రితికాను జీవిత భాగస్వామి చేసుకున్నాడు.నికర ఆస్తి విలువ ఎంతంటే?ఇక టీమిండియా సంపన్న క్రికెటర్లలో ఒకడైన రోహిత్ శర్మ (Rohit Sharma) నికర ఆస్తుల విలువ 2025 నాటికి రూ. 230 కోట్లు అని సమాచారం. వర్లీలో అతడికి దాదాపు రూ. 30 కోట్ల విలువైన అపార్టుమెంట్ ఉంది. అతడి దగ్గర లంబోర్గిని ఉరుస్, బీఎండబ్ల్యూ ఎం5 వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.ఓవైపు ఆటగాడిగా కొనసాగుతూనే క్రికెట్ అకాడమీ స్థాపించాడు రోహిత్ శర్మ. కాగా రోహిత్- రితికా దంపతులకు కుమార్తె సమైరా, కుమారుడు అహాన్ సంతానం. ఇదిలా ఉంటే.. మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ లభిస్తుందట. ఇక మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది.చదవండి: అభిషేక్ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..Rohit Sharma: కోహ్లి కంటే సన్నబడ్డాడే!.. కింగ్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్! -
నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో..
ముంబైకి ఊహించని షాకిచ్చింది పంజాబ్. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గురువారం నాటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆఖరికి అభిషేక్ శర్మ సేన పైచేయి సాధించడంతో.. శ్రేయస్ అయ్యర్ బృందానికి నిరాశ తప్పలేదు.పంజాబ్ టాపార్డర్ కుదేలుదేశీ వన్డే టోర్నీ తాజా ఎడిషన్ ఎలైట్ గ్రూపులో భాగంగా గురువారం ముంబై- పంజాబ్ జట్లు తలపడ్డాయి. జైపూర్ వేదికగా టాస్ ఓడిన పంజాబ్.. ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ముంబై బౌలర్ల దెబ్బకు పంజాబ్ టాపార్డర్ కుదేలైంది.ఆదుకున్న అన్మోల్, రమణ్దీప్టీమిండియా విధ్వంసకర ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ (8), ప్రభ్సిమ్రన్ సింగ్ (11), హర్నూర్ సింగ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట దశలో అన్మోల్ప్రీత్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ (75 బంతుల్లో 57) ఆడగా.. నమన్ ధిర్ (22) ఫర్వాలేదనిపించాడు.216 పరుగులుఆరో స్థానంలో వచ్చిన రమణ్దీప్ సింగ్ అర్ధ శతకం (74 బంతుల్లో 72) సాధించగా.. బౌలర్లు హర్ప్రీత్ బ్రార్ (15), సుఖ్దీప్ బజ్వా (17) తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా 45.1 ఓవర్లలో పంజాబ్ 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. శశాంక్ అట్రాడే, ఓంకార్ తుకారాం టర్మాలే, శివం దూబే తలా రెండు వికెట్లు తీశారు. సాయిరాజ్ పాటిల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకంనామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువన్షి (23), ముషీర్ ఖాన్ (21) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం (20 బంతుల్లో 62) సాధించాడు.శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధనాధన్ దంచికొట్టగా (34 బంతుల్లో 45).. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ (15) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్ అవుటైన తర్వాత ముంంబై వేగంగా వికెట్లు కోల్పోయింది. శివం దూబే (12), హార్దిక్ తామోర్ (15) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (2), శశాంక్ (0), ఓంకార్ (0) కనీస పోరాటపటిమ కనబరచలేకపోయారు. షామ్స్ ములానీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.ఒకే ఒక్క పరుగు తేడాతోఅయితే, పంజాబ్ బౌలర్ల దెబ్బకు 26.2 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ముంబై చాపచుట్టేసింది. దీంతో పంజాబ్ ఒకే ఒక్క పరుగు తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, పేసర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గుర్నూర్ బ్రార్ చెరో నాలుగు వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. మిగతా వారిలో హర్ప్రీత్ బ్రార్, హర్నూర్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా! -
అభిషేక్ శర్మ ఓవర్లో సర్ఫరాజ్ విశ్వరూపం.. 15 బంతుల్లోనే..
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పంజాబ్ బౌలింగ్ను చితక్కొట్టాడు. ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్, పార్ట్టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మకు చుక్కలు చూపించాడు.15 బంతుల్లోనేఅభిషేక్ శర్మ (Abhishek Sharma) వేసిన ఓవర్లో సర్ఫరాజ్ వరుసగా 6,4,6,4,6,4 బాదాడు. వన్డౌన్లో వచ్చి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒకే ఓవర్లో ఏకంగా ముప్పై పరుగులు పిండుకున్నాడు. వన్డే మ్యాచ్లో టీ20 తరహాలో విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం.. 15 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.మార్కండే బౌలింగ్లోపంజాబ్తో మ్యాచ్లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan).. 62 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే, మయాంక్ మార్కండే బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగడంతో సర్ఫరాజ్ సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది.అభిషేక్ ఫెయిల్దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూపులో భాగంగా.. జైపూర్ వేదికగా పంజాబ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ అభిషేక్ శర్మ (8) సహా మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (11).. వన్డౌన్ బ్యాటర్ హర్నూర్ సింగ్ డకౌట్ కావడంతో ఆదిలోనే పంజాబ్కు షాక్ తగిలింది.అన్మోల్, రమణ్ అర్ధ శతకాలుఈ క్రమంలో అన్మోల్ప్రీత్ సింగ్ అర్ధ శతకం (57)తో రాణించగా.. నమన్ ధిర్ (22) అతడికి సహకరించాడు. ఇక రమణ్దీప్ సింగ్ సైతం హాఫ్ సెంచరీ (72)తో ఆకట్టుకున్నాడు. అయితే, మిగతా వారంతా తేలిపోవడంతో 45.1 ఓవర్లలో కేవలం 216 పరుగులు చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.ముంబై బౌలర్లలో సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. శివం దూబే, శశాంక్ అట్రాడే, ఓంకార్ తుకారాం టర్మాలే తలా రెండు వికెట్లు కూల్చారు. సాయిరాజ్ పాటిల్కు ఒక వికెట్ దక్కింది. నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ధనాధన్ బ్యాటింగ్తో విజయం దిశగా పయనించిన ముంబై.. అనూహ్య రీతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా! -
అంటార్కిటికాలో 365 రోజులు...
అంటార్కిటికా చూసే అవకాశం భారతీయ స్త్రీలకు అతి తక్కువగా దొరుకుతుంది. ఎవరైనా వెళ్లినా కొన్ని గంటలు లేదా రోజులమజిలీ మాత్రమే చేయగలరు. కాని ముంబైకి చెందిన జనరల్ సర్జన్ వైదేహీ వెంకటేశ్వరన్ అంటార్కిటికాలో సంవత్సరం పాటు ఉండి భారతీయ పరిశోధక బృందానికి వైద్యసేవలు అందించారు. ‘44వ ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటికా’లో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చిన వైదేహీ అక్కడి అనుభవాలను పంచుకున్నారు.ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అంటార్కిటికా ఒకటి. దాని గురించి విన్న వారే తప్ప అక్కడికి వెళ్లినవారు తక్కువ. వెళ్లి నివసించినవారు అరుదు. చుట్టూ మంచుతో నిండిన ఆ ధ్రువప్రాంతంలో జీవనం దుస్సాధ్యం. అయితే భారతదేశానికి చెందిన 31 ఏళ్ల మహిళా జనరల్ సర్జన్ వైదేహీ వెంకటేశ్వరన్ అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాదు, ఏడాది పాటు అక్కడే గడిపి ఇటీవల తిరిగి వచ్చారు. అక్కడున్న ప్రతి క్షణం తన జీవితంలో మర్చిపోలేని అనుభవం అంటున్నారామె.పదేళ్ల ముందు నుంచి ఆసక్తినేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్ .సి.పీ.ఓ.ఆర్) ఆధ్వర్యంలో 44వ ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు అంటార్కిటికా (ఐఎస్ఈఏ)లో భాగంగా మన దేశం నుంచి వెళ్లిన బృందంలో ఏకైక మహిళ వైదేహీ వెంకటేశ్వరన్. ‘అంటార్కిటికా చూడాలనేది నా చిరకాల స్వప్నం. 2015లో విద్యార్థిగా ఉన్న సమయంలో అంటార్కిటికా ఎక్స్పెడిషన్ గురించి విన్నాను. ఎప్పటికైనా అందులో పాల్గొనాలని భావించాను. 2025లో ఎన్ సీపీఓఆర్కు దరఖాస్తు చేసుకున్నాను. మహిళలకు ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నాకు రాగానే చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారామె.వడపోతల ఎంపికఅంటార్కిటికా మంచు ఖండం. అక్కడికి వెళ్లి ఏడాదిపాటు సేవలందించాలంటే చాలా మనోధైర్యం, గుండె నిబ్బరం కావాలి. అందుకే అక్కడికి వెళ్లే వారిని ప్రభుత్వం అనేక వడపోతల తర్వాత ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి ఇండో–టిబెటియన్ సరిహద్దు పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. అంటార్కిటికాలో పరిస్థితులు, వాతావరణం, అందుకు తగ్గ ఏర్పాట్లు, చేయాల్సిన పనులు, అక్కడి జీవనవిధానం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు. ‘శిక్షణ తర్వాత నేను అంటార్కిటికాలో అడుగుపెట్టిన రోజు ‘పోలార్ డే’. అంటే రోజంతా సూర్యుడు ఉండే రోజది. రాత్రి ఆకాశంలో ఒకేసారి సూర్యుణ్ని, చంద్రుణ్ని చూసే ఆ వింతను జీవితంలో మర్చిపోలేను. నేను ఉన్న ప్రదేశంలో నాతో పాటు మరో వైద్యుడు, నర్స్ ఉంటారు. మొబైల్ సిగ్నల్స్ ఉండవు. ఇంటర్నెట్ తక్కువ. బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియాలంటే రేడియో ఒక్కటే ఆధారం. శీతాకాలం మొత్తం నా చుట్టూ 24 మంది ఉన్నారు. రోజంతా అత్యంత నిశ్శబ్దంగా ఉండేది’ అని ఆమె వివరించారు.ఏ క్షణంలోనైనా తప్పిపోయే అవకాశం‘శీతాకాలంలో మంచంతా గడ్డకట్టుకుపోతుంది. బయటికెళ్లిన వారు ఏ క్షణంలోనైనా తప్పిపోయే అవకాశం ఉంటుంది. చుట్టూ పేరుకు పోయిన మంచులో ఎటు వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి. దారి చూపేందుకు అక్కడ ఎటువంటి గుర్తులూ ఉండవు. అందుకే వెంట ఎప్పుడూ జీపీఎస్ ఉండేది. అంటార్కిటికా పెంగ్విన్లకు ఆవాసం. అయితే మాకున్న ఆదేశాల వల్ల వాటికి మేము దూరంగా ఉన్నాం’ అన్నారామె.ఒంటరిగా మనగలగడం కష్టం‘అంటార్కిటికా ఖండంలో ఒంటరిగా మనగలగడం కష్టం. వేలకొద్దీ కిలోమీటర్ల వరకూ మానవసంచారం ఉండదు. చుట్టూ అంతా నిశ్శబ్దంలో ఒక్కోసారి ఏమీ తోచక డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడ మన దేశంతోపాటు చైనా, రష్యా పరిశోధక స్టేషన్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు ఒకరికొకరం సాయం అందించుకునేవాళ్లం. ‘పా’ సినిమాలో అమితాబ్ ఒక తెల్లటి గ్లోబ్ తయారు చేసి ‘ఈ భూమ్మీద ఎటువంటి సరిహద్దులు లేవు’ అంటారు కదా! అంటార్క్టికాలో ఏడాదిపాటు జీవించి, తిరిగి వచ్చాక నాకు ఈ ప్రపంచం అలాగే అనిపిస్తోంది’ అంటున్నారు వైదేహి. -
ఎనిమిదో వింత: కమలంతో కాంగ్రెస్ దోస్తీ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో ఏ ఒక్కరూ నమ్మని విధంగా భారతీయ జనతా పార్టీ(జేబీజేపీ)- కాంగ్రెస్ జతకట్టాయి. అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ పీఠాన్ని దక్కించుకునేందుకు బద్దశత్రువులైన ఈ ఇరు పార్టీలు ఒక గూటికి చేరాయి. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు గట్టి షాక్ ఇస్తూ, బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు ఇలా చేతులు కలపడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అంబర్నాథ్ ప్రాంతంలో శివసేనను అధికారానికి దూరం చేసేందుకు ‘అంబర్నాథ్ వికాస్ అఘాడీ’ పేరుతో కొత్త కూటమి ఏర్పడింది. గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ (31)కు నాలుగు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రత్యర్థి పార్టీలు ఏకమై శివసేన ఆధిపత్యానికి గండికొట్టాయి. 60 స్థానాలున్న అంబర్నాథ్ కౌన్సిల్లో బీజేపీ 14, కాంగ్రెస్ 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 4 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ మూడు పార్టీలు ఒకటికావడానికి తోడు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కూటమి బలం 32కు చేరింది.మంగళవారం జరిగిన మున్సిపల్ అధ్యక్ష ఎన్నికల్లో ‘కూటమి’ సమీకరణ అద్భుతంగా పనిచేసింది. శివసేన అభ్యర్థి మనీషా వాలేకర్పై బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజులే పాటిల్ విజయం సాధించి, అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ అభిజీత్ కరంజులే పాటిల్ ఈ వికాస్ అఘాడీకి నాయకునిగా వ్యవహరించారు. కాగా ఈ విచిత్ర పొత్తుపై వస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలి భర్త, బీజేపీ నేత అభిజీత్ పాటిల్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అంబర్నాథ్లో వేళ్లూనుకున్న అవినీతి రాజకీయాల నుంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. బీజేపీ-కాంగ్రెస్ కలయికపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనిని అనైతిక, అవకాశవాద రాజకీయానికి పరాకాష్టగా అభివర్ణించింది. అంబర్నాథ్ శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని నినదించిన బీజేపీ, అధికారం కోసం ఇలాంటి పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ తానుగా కాంగ్రెస్తో చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: సత్యసాయి బాటలో వెనెజువెలా నేతలు.. కారణం ఇదే.. -
క్వార్టర్స్లో కర్ణాటక, ముంబై
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక, ఢిల్లీ, యూపీ, ముంబై, పంజాబ్ జట్లు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాయి. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో కర్ణాటక 150 పరుగుల తేడాతో రాజస్తాన్పై గెలుపొందింది. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లాడిన కర్ణాటక అన్నింట్లోనూ గెలిచి 24 పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో ఆకట్టుకోగా... దేవదత్ పడిక్కల్ (82 బంతుల్లో 91; 12 ఫోర్లు, 2 సిక్స్లు) త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్తాన్ 38 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. కరణ్ లాంబా (55)టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మానవ్ సుతార్ (4), దీపక్ హూడా (29) సహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో తమిళనాడు 54 పరుగుల తేడాతో త్రిపురపై... జార్ఖండ్ 2 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్పై... కేరళ 8 వికెట్ల తేడాతో పాండిచ్చేరిపై విజయాలు సాధించాయి. యూపీ ‘సిక్సర్’ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో వరుసగా ఆరో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 54 పరుగుల తేడాతో విదర్భపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తర ప్రదేశ్ నిరీ్ణత 50 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ గోస్వామి (109 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెపె్టన్ రింకూ సింగ్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (56; 5 ఫోర్లు, 1 సిక్స్), ప్రియమ్ గార్గ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం ఛేదనలో విదర్భ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులకు పరిమితమైంది.అమన్ మోఖడే (117 బంతుల్లో 147; 17 ఫోర్లు, 2 సిక్స్లు) ‘శత’క్కొట్టగా... అక్షయ్ వాడ్కర్ (51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ సాధించాడు. యూపీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... కార్తిక్ త్యాగీ, విప్రాజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీశారు. గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్ల్లోనూ గెలిచిన యూపీ జట్టు 24 పాయింట్లతో ‘టాప్’లో నిలిచి క్వార్టర్స్కు చేరింది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో బరోడా 76 పరుగుల తేడాతో జమ్ముకశ్మీర్పై... హైదరాబాద్ 107 పరుగుల తేడాతో జమ్మూకశ్మీర్పై... చండీగఢ్ 7 వికెట్ల తేడాతో అస్సాంపై గెలుపొందాయి. గెలిపించిన శ్రేయస్, ముషీర్ యువ ఆటగాడు ముషీర్ ఖాన్ (51 బంతుల్లో 73; 8 ఫోర్లు, 3 సిక్స్లు; 1/47) ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చడంతో ముంబై జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా... మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై 7 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై గెలుపొందింది. ఈ మ్యాచ్ను 33 ఓవర్లకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 9 ఓవర్లలో 299 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (53 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముషీర్ ఖాన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (21), సూర్యకుమార్ యాదవ్ (24), శివమ్ దూబే (20) భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోయారు. గాయం నుంచి కొలుకున్న అనంతరం ఆడిన తొలి మ్యాచ్లో శ్రేయస్ చక్కటి స్ట్రోక్ ప్లేతో అదరగొట్టాడు.హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో వైభవ్ అరోరా, అభిషేక్ కుమార్, కుషాల్ పాల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో హిమాచల్ ప్రదేశ్ 32.4 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్ మన్ (64; 7 ఫోర్లు, 3 సిక్స్లు), అంకుష్ బెయిన్స్ (53; 4 ఫోర్లు, 3 సిక్స్లు), మయాంక్ డాగర్ (64; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే 4 వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ ‘సి’లో పంజాబ్, ముంబై చెరో 5 విజయాలతో 20 పాయింట్లు సాధించి పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరాయి.. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో ఉత్తరాఖండ్ 6 వికెట్ల తేడాతో సిక్కీంపై... పంజాబ్ 6 వికెట్ల తేడాతో గోవాపై... ఛత్తీస్గఢ్ 6 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలిచాయి. ప్రియాన్‡్ష ఆర్య మెరుపులు వికెట్ కీపర్ రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు విజయ్ హజారే టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఆలూరు వేదికగా జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో రైల్వేస్పై గెలుపొందింది. మొదట రైల్వేస్ 40.4 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. కుష్ మరాథె (51; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఆయుశ్ బదోనీ, నవ్దీప్ సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 21.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియాన్‡్ష ఆర్య (41 బంతుల్లో 80; 12 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... సార్థక్ రంజన్ (33; 5 ఫోర్లు), నితీశ్ రాణా (38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), రిషబ్ పంత్ (24; 1 ఫోర్, 3 సిక్స్లు) తలో చేయి వేశారు.గ్రూప్ దశలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలిచిన ఢిల్లీ 20 పాయింట్లతో పట్టికలో ‘టాప్’లో నిలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఢిల్లీ జట్టు ఈ టోరీ్నలో నాకౌట్ దశకు చేరడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఇదే గ్రూప్లో జరిగిన ఇతర మ్యాచ్ల్లో సౌరాష్ట్ర 111 పరుగుల తేడాతో సర్వీసెస్పై... గుజరాత్ 233 పరుగుల తేడాతో ఒడిశాపై విజయాలు సాధించగా... హరియాణా, ఆంధ్ర జట్ల మధ్య మ్యాచ్ ‘టై’గా ముగిసింది. మరోవైపు ప్లేట్ గ్రూప్ ఫైనల్లో బిహార్ 6 వికెట్ల తేడాతో మణిపూర్పై విజయం సాధించింది. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి..
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పునరాగమనంలో శుభారంభం అందుకున్నాడు. గాయం నుంచి కోలుకుని ముంబై కెప్టెన్గా తిరిగి మైదానంలో అడుగుపెట్టిన అయ్యర్.. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటాడు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో 36 బంతుల్లోనే అయ్యర్ అర్ధ శతకం బాదాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొత్తంగా 53 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 82 పరుగులు చేశాడు. జైస్వాల్, సూర్య ఫెయిల్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ (15) విఫలం కాగా.. ముషీర్ ఖాన్ (73) మాత్రం అదరగొట్టాడు. వన్డౌన్లో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (21).. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24) నిరాశపరిచారు.శివం దూబే (20), హార్దిక్ తామోర్ (19 నాటౌట్), సాయిరాజ్ పాటిల్ (9 బంతుల్లో 25), షామ్స్ ములాని (5 బంతుల్లో 11) ఓ మోస్తరుగా ఆడగా.. తుషార్ దేశ్పాండే డకౌట్ కాగా.. శశాంక్ అటార్డే (1) నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా 33 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 299 పరుగులు సాధించింది.అయితే, లక్ష్య ఛేదనకు దిగిన హిమాచల్ ప్రదేశ్కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కుశాల్ పాల్, ఇన్నేశ్ మహాజన్ డకౌట్ అయ్యారు. ఇలాంటి తరుణంలో పఖ్రాజ్ మాన్ (41 బంతుల్లో 64), అంకుశ్ బ్రెయిన్స్ (39 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకాలతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ధనాధన్ దంచికొట్టినా..కెప్టెన్ మృదుల్ సరోచ్ (13) నిరాశపరిచినా.. మయాంక్ డాగర్ (47 బంతుల్లో 64), అమన్ప్రీత్ సింగ్ (21 బంతుల్లో 42) ధనాధన్ దంచికొట్టి గెలుపు ఆశలు రేపారు. ఆఖర్లో అమిత్ కుమార్ యాదవ్ (28) రాణించగా.. చివరి ఓవర్లో విజయానికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. శివం దూబే రెండు వికెట్లు తీయడంతో హిమాచల్ ప్రదేశ్ ఆలౌట్ అయింది. 32.4 ఓవర్లలో 292 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా ముంబై ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది.ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి..ముంబై బౌలర్లలో టీమిండియా స్టార్ శివం దూబే నాలుగు వికెట్లతో చెలరేగగా.. సాయిరాజ్ పాటిల్ రెండు, షామ్స్ ములాని, ముషీర్ ఖాన్, తుషార్ దేశ్పాండే తలా ఒక వికెట్ పడగొట్టారు. ముంబై గెలుపు కారణంగా.. రీఎంట్రీలో శ్రేయస్ అయ్యర్కు బ్యాటర్గా, కెప్టెన్గా అదిరిపోయే ఆరంభం లభించింది. చదవండి: ‘రీఎంట్రీ’లో శుబ్మన్ గిల్ అట్టర్ఫ్లాప్ -
మురికి వాడలో పెరిగిన ఆ అబ్బాయ్ ..ఎన్నో జీవితాలను అద్భుతంగా మార్చాడు!
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ..మంచి స్ఫూర్తిదాయకమైన కథలు షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి ఓ అద్భతమైన ప్రేరణాత్మక కథతో మన ముందుకొచ్చారు. సక్సెస్ అంటే..మనం మాత్రమే అభివృద్ధి చెందడం కాదని చెప్పే.. గొప్ప జీవిత పాఠాన్ని నేర్పే అద్భుత కథ. అదేంటంటే..20 మందితో ముంబై మురికి వాడలో ఒక పూరింట్లో పెరిగిన సిద్ధేష్ లోక్రే అనే యువకుడు మనందరికీ స్ఫూర్తి అంటూ అతడి స్టోరీని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకోవడమే గాక, అతడు తలపెట్టిన మహాత్తర కార్యానికి సైతం తన సపోర్ట్ ఫుల్ ఉంటుందని నొక్కి చెప్పారు. సిద్ధేష్ తండ్రి కూరగాయల వ్యాపారి, కాగా తల్లి క్లర్క్.20 మందితో ఒకే గది ఉన్న ఇంట్లో పెరిగిన సిద్ధేష్ తన లైఫ్ని చదువుతోనే మార్చుకోగలని నమ్మి..చాలా కష్టబడి చదువుకున్నాడు. అలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్లో ఎంబీఏ చేసి టెక్ స్టార్టప్గా ఎదిగాడు. అలా తన తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించి..మంచి కొడుకుగా హ్యాపీగా లైప్ లీడ్ చేస్తున్నాడు. అయితే సక్సెస్ అంటే ఇది కాదన్న వెళితి ఏదో వెంటాడుతూ ఉండేది. అసలు నిజమైన సక్సెస్ అంటే ఏంటీ అని ఆలోచిస్తూ..ఉండేవాడు. తనలా అందిరి జీవితాలు బాగుంటే అన్న ఆలోచనే..అతడి జీవితాన్నే మార్చేసింది. అందుకు సోషల్ మీడియా సాయం తోడు తెచ్చుకుని మరి. ఎంతోమంది పేద ప్రజల జీవితాలను తీర్చిదిద్దాడు. పైగా ఎన్నో మురికివాడలను, గ్రామాలను దత్తత తీసుకుని అందంగా మార్చి..ఎందరో పేదలకు ఆశాకిరణంగా నిలిచాడు ఆ యువకుడు. పాడైపోయిన ఎన్నో షాపులను పునర్నిర్మించాడు, ప్రజలకు ఉపయోగపడేలా సొంతంగా అంబులెన్స్ సర్వీస్ వంటి ఎన్నో సేవలతో తన ఆనందాన్ని, సక్సెస్ని వెతుకున్నాడు సిద్ధేష్. అక్కడితో ఆగలేదు ఆ యువకుడు తాజాగా మరో లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే మిషన్ 30303. దీని సాయంతో 30 రోజుల్లో 30 పాఠశాలలను అభివృద్ధి చేసేల మౌలిక సదుపాయల కోసం రూ. 3 కోట్లు సేకరించడం. అందుకోసం కాస్త ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే బెంచీలు, టాయిలెట్లు వంటి ప్రాథమిక అవసరాల నుంచి ఏఐ వంటి రోబోటిక్ ల్యాబ్స్ వరకు అన్ని ఆధునిక హంగులకు చాలా ఖర్చుతో కూడికున్న పని కావడంతో లక్ష్యం నెరవేరడం కష్టతరంగా మారింది సిద్ధుకి. అయితే అతడి నిస్వార్థ సేవ నచ్చి సిద్ధేష్ ప్రాజెక్టుకు తనవంతుగా మదతిస్తానుంటూ ముందుకొచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఆనంద్ మహీంద్రా. చాలామంది మనం సక్సెస్ అయ్యి ఓ మంచి పొజిషన్లో ఉంటే చాలు అనుకుంటారు. అలా కాకుండా అందురూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నట్లుగా సాగుతున్న సిద్ధేష్ పయనం నిజంగా స్ఫూర్తిదాయకం, ప్రశంసించదగ్గ విషయం కూడా కదూ..!.He achieved escape velocity from his modest beginnings…But never abandoned the orbit he escaped from. I will connect & support his project 30303#MondayMotivationpic.twitter.com/MA0sfxwauY— anand mahindra (@anandmahindra) January 5, 2026 (చదవండి: వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!) -
రీఎంట్రీలో రఫ్ఫాడించిన శ్రేయస్ అయ్యర్
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, ముంబై స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పోటీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్లోనే రఫ్ఫాడించాడు. తీవ్ర గాయం కారణంగా రెండు నెలలు ఆటకు పూర్తిగా దూరమైన శ్రేయస్.. ఇవాళ (జనవరి 6) హిమాచల్ ప్రదేశ్తో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మ్యాచ్లో పునరాగమనం చేశాడు. వచ్చీ రాగానే మెరుపు అర్ద శతకంతో అదరగొట్టాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.శ్రేయస్తో పాటు ముషీర్ ఖాన్ (73) కూడా రాణించడంతో హిమాచల్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై 29 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఈ మ్యాచ్ను 33 ఓవర్లకే కుదించారు. ముంబై ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 15, సర్ఫరాజ్ ఖాన్ 21, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేయగా.. శివమ్ దూబే 20, హార్దిక్ తామోర్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.కాగా, గతేడాది అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని కూడా అన్నారు. అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు.అనంరతం నెల రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వైద్యుల పర్యవేక్షణలో ఉండి, తాజాగా పోటీ క్రికెట్లో పాల్గొనేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాడు. శ్రేయస్ త్వరలో ప్రారంభం కాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్కు సన్నాహకంగా శ్రేయస్ విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడనున్నాడు.ఇవాళ హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్ తర్వాత జనవరి 8న పంజాబ్తో జరిగే మ్యాచ్లో పాల్గొంటాడు. ఈ రెండు మ్యాచ్ల్లో శ్రేయసే ముంబై జట్టును ముందుండి నడిపిస్తాడు. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)శ్రేయస్కు అప్పగించింది. -
ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అమర్ దీప్ను పట్టుకున్న పోలీసులు
-
ఫాల్కన్ స్కాం.. మాస్టర్ మైండ్ అమర్దీప్ అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్ దీప్ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశం నుండి ముంబైకి చేరుకున్న ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, సమాచారం అందించడంతో తెలంగాణ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.అమర్ దీప్పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిన తెలంగాణ పోలీసులు.. ఆయనను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ముంబైకి పంపారు. చివరికి ఆయనను అదుపులోకి తీసుకోవడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. ఫాల్కన్ కంపెనీ డిజిటల్ డిపాజిట్ల పేరుతో ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలు చేసింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, ఎంఎన్సీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అమర్ దీప్ ప్రజలను నమ్మబలికాడు. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలు కొట్టేసినట్లు విచారణలో బయటపడింది. అమర్ దీప్ ప్రజలను ఆకర్షించడానికి పలు వ్యూహాలు ఉపయోగించాడు. యాప్ ద్వారా డబ్బులు పెట్టుబడులుగా తీసుకోవడం, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికడం, పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెడతామని చెప్పి డబ్బులు వసూలు చేయడం వంటి పద్ధతులతో ఆయన ప్రజలను బురిడీ కొట్టించాడు. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్ దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్కు పారిపోయాడు. అప్పటి నుండి ఆయనపై పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. చివరికి ముంబైలో ఆయనను పట్టుకోవడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.ఈ కేసులో ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అమర్ దీప్ అరెస్టు చేశారు. అమర్దీప్ను అరెస్టు చేసిన పోలీసులు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలికితీసే అవకాశం ఉంది. -
129 ఫోర్లు, 59 సిక్సర్లు.. 1009 రన్స్ బాదిన ఆ ‘కుర్రాడు’ ఎక్కడ?
జనవరి 5, 2016... పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. ముంబైలోకి కళ్యాణ్లో గల రెండు హౌజింగ్ సొసైటీల మధ్య ఉన్న అతి సాధారణ గ్రౌండ్. అప్పటికి వరకు దానికి పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పటిలాగే ఆరోజు రెండు జట్లు పోటీపడుతున్నాయి. శ్రీమతి కేసీ గాంధీ స్కూల్ కోచ్ తమ వికెట్ కీపర్ బ్యాటర్ను ఓపెనర్గా పంపాలని నిర్ణయించుకున్నాడు.ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పదే పదే వికెట్ పారేసుకుంటున్నాడనే ఉద్దేశంతో ఈసారి కాస్త ఓపికగా ఆడతాడేమో అన్న ఆశతో టాపార్డర్కు ప్రమోట్ చేశాడు. అయితే, ఆరోజు తాను చేసిన పని సరికొత్త చరిత్రను సృష్టించబోతుందని అతడికి తెలియదు.ఆర్య గురుకుల్ స్కూల్తో మ్యాచ్లో ఆ వికెట్ కీపర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సీనియర్లంతా పదో తరగతి పరీక్షలతో బిజీగా ఉన్న సమయంలో జూనియర్లతో జరిగిన నాటి మ్యాచ్లో అతడు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలిరోజు సున్నాతో స్కోరు మొదలుపెట్టిన అతడు.. ఆనాటి ఆట ముగిసే సరికి ఏకంగా 652 పరుగులతో క్రీజులో నిలిచాడు.తన భారీ ఇన్నింగ్స్తో 117 ఏళ్లుగా టెస్టు క్రికెట్లో చెక్కు చెదరకుండా ఉన్న ఆల్టైమ్ రికార్డును ఆ పదిహేనేళ్ల క్రికెటర్ బద్దలుకొట్టాడు. అర్థుర్ కొలిన్స్ 1899లో 628 పరుగులు చేసి రికార్డు సృష్టించగా.. దానిని సదరు ప్లేయర్ బ్రేక్ చేశాడు. అయితే, రెండో రోజు ఆటలోనే ఊహకందని విధంగా అతడి విధ్వంసం కొనసాగింది.327 బంతుల్లో ఏకంగా 1009 పరుగులుఓవర్నైట్ స్కోరుకు 450కి పైగా పరుగులు చేసిన ఆ కుర్రాడు.. ఓవరాల్గా 327 బంతుల్లో ఏకంగా 1009 పరుగులు సాధించాడు. తద్వారా ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత, అతిభారీ స్కోరు సాధించిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో ఒక్కసారి అతడి పేరు మారుమ్రోగిపోయింది.టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్ నుంచి మహేంద్ర సింగ్ ధోని దాకా ప్రతి ఒక్కరు అతడి ప్రతిభను కొనియాడారు. బీబీసీ సైతం అతడి ఇంటర్వ్యూ తీసుకుంది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కుమారుడైన ఆ క్రికెటర్ పేరు ప్రణవ్ ధన్వాడే. ఏకంగా ఏడు గంటల.. ఇరవై ఏడు నిమిషాలు క్రీజులో ఉండి వెయ్యికి పైగా పరుగులు చేసి చరిత్ర పుటల్లో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.ఆనాటి మ్యాచ్లో ప్రణవ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 1465 పరుగుల అసాధారణ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ప్రత్యర్థి జట్టు రెండు ఇన్నింగ్స్లో వరుస 31, 52 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ప్రణవ్ జట్టు 1382 పరుగుల తేడాతో అతి భారీ విజయం సాధించింది.ప్రణవ్ ధన్వాడే ఇప్పుడు ఎక్కడ?అలా ఓవర్నైట్ స్టార్ అయిపోయిన ప్రణవ్ ధన్వాడే.. ఆ తర్వాత మాయమైపోయాడు. ఫామ్లేమితో సతమతమవుతూ వరుసగా విఫలమయ్యాడు. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్తో ఒత్తిడికి లోనై ఆటపై దృష్టి పెట్టలేకపోయాడు.ఈ క్రమంలో ముంబై అండర్-19 జట్టుకు ఎంపిక కావడమే గగనంగా మారింది. ఆ తర్వాత కరోనా దెబ్బకు అండర్-23 సెలక్షన్స్ ట్రయల్స్కు వెళ్లలేకపోయాడు. ప్రణవ్ సమకాలీన ఆటగాళ్లు ఐపీఎల్లో కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే.. క్రమక్రమంగా అతడి పేరు మాత్రం కనుమరుగైపోయింది. పాతికేళ్ల ప్రణవ్ ధన్వాడేకు మంచిరోజులు రావాలని ఆశిద్దాం!!చదవండి: BCCI: శుబ్మన్ గిల్ డిమాండ్ ఇదే! -
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపు మూడు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రెండు మ్యాచ్లు ఆడనున్నాడు. శ్రేయస్ తన పునరాగమనంలో ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అయ్యర్కు అప్పగించింది. ఈ విషయాన్ని ఎంసీఎ సెక్రటరీ డాక్టర్ ఉన్మేష్ ఖాన్విల్కార్ ధ్రువీకరించారు. జనవరి 6న హిమాచల్ ప్రదేశ్తో, జనవరి 8న పంజాబ్తో జరిగే కీలక మ్యాచ్ల్లో ముంబై జట్టును అయ్యర్ నడిపించనున్నాడు.కాగా ఈ టోర్నీలో ఆడి అయ్యర్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లో శ్రేయస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలిగితే అతడికి పూర్తిస్థాయి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లభిస్తుంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో అయ్యర్ కూడా భాగంగా ఉన్నాడు.కానీ ఈ సిరీస్కు ముందు శ్రేయస్ ఫిట్నెస్ టెస్టుల్లో ఉత్తర్ణీత సాధించాల్సి ఉంటుంది అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం డిసెంబర్ 25న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లో చేరిన శ్రేయస్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (CoE)లో హై-ఇంటెన్సిటీ టెస్టులను విజయవంతంగా అతడు పూర్తి చేసుకున్నాడు. అయ్యర్ దాదాపుగా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లే. చదవండి: IPL 2026: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన -
అర్షిన్, పృథ్వీ షా మెరుపులు.. ముంబై జోరుకు బ్రేక్
జైపూర్: విజయ్ హజారే వన్డే టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబైని మహారాష్ట్ర నిలువరించింది. గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన పోరులో మహారాష్ట్ర 128 పరుగుల భారీ తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. మొదట మహారాష్ట్ర 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 366 పరుగుల భారీ స్కోరు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్షిన్ కులకర్ణి (114 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ సాధించగా, పృథ్వీ షా (75 బంతుల్లో 71; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. తొలి వికెట్కు వీరిద్దరు 140 పరుగులు జోడించారు. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (52 బంతుల్లో 66; 7 ఫోర్లు)కూడా ఫిఫ్టీ బాదాడు. ఆఖర్లో రామకృష్ణ ఘోష్ (27 బంతుల్లో 64; 3 ఫోర్లు; 5 సిక్స్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. తుషార్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ముంబై 42 ఓవర్లలోనే 238 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ (88 బంతుల్లో 92; 9 ఫోర్లు, 2 సిక్స్లు), సిద్ధేశ్ లాడ్ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రమే అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ 3, సత్యజీత్ 2 వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్లాడిన ముంబైకి ఇది తొలి పరాజయం కాగా, మహారాష్ట్రకిది మూడో విజయం. -
ప్రియుడిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పిల్చి, ప్రైవేట్ పార్ట్స్పై దాడి
పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడిపై దాడిచేసి ప్రైవేట్ భాగాలను నరికివేసింది.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ వివాహితులే. ముంబైలో ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం 25 ఏళ్ల ఒక మహిళ ఇద్దరు పిల్లల తల్లి. ఈమెకు 42 ఏళ్ల వివాహితుడితో దాదాపు ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విడాకులిచ్చి తనన పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో అసలు పెళ్లి ఊసు ఎత్తగానే సరైన సమాధానం చెప్పకుండా ముఖం చాటేసేవాడు. తన మాట వినడం లేదని, భార్యను విడిచిపెట్టడానికి నిరాకరించాడన్న కోపంతో ఆ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టింది.పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబరులో బిహార్కు వెళ్లి పోయాడు. భార్యాబిడ్డలు ముంబైలోని శాంటా క్రజ్లోని ఇంట్లో ఉంటున్నారు. గత 18 ఏళ్లుగా కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. బాధితుడు. బిహార్కు వెళ్లిన తరువాత కూడా ఆమె ఫోన్ కాల్స్ ద్వారా పెళ్లి గురించి అడగడం, అతన్ని బెదిరించడం జరుగుతూనే ఉంది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్బంగా డిసెంబర్ 19న ముంబైకి తిరిగొచ్చాడు. ఇదే అదనుగా భావించిన ప్రేమికురాలు నూతన సంవత్సర వేడుకలకు ఇంటికి రావాల్సిందిగా బాధితుడిని ఆహ్వానించింది. గురువారం తెల్లవారుజామున మాటల్లో పెట్టి, సమయం చూసి పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలపై దాడిచేసిందని ముంబై పోలీసు అధికారి తెలిపారు.ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’తీవ్ర గాయాలపాలై అధిక రక్తస్రావంతో బాధితుడు మొత్తం మీద బైటపడి, సోదరుడు, ఇతర బంధువుల సాయంతో బీఎన్ దేశాయ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. గాయం చాలా లోతుగా ఉందని శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరికీ బంధుత్వం ఉన్నట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలి కోసం వెతుకుతున్నారు. ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్, రికార్డ్ -
పాత రోత కాదు బ్రో.. న్యూట్రో ట్రెండ్!
పాత రోత–కొత్త వింత’ అనే సామెత ఉంది. కొత్త వింతల సంగతి ఎలా ఉన్నా పాత రోత’ అనుకోవడం లేదు యువతరంలో కొద్దిమంది. కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది గాడ్జెట్లకు సంబంధించి ‘పాతపాఠశాల’కు తిరిగి వస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.తన వయసు పిల్లలు నెట్ఫ్లిక్స్ షోలలో మునిగితేలుతుంటే పదిహేడు సంవత్సరాల నిహాల్కు మాత్రం పాత డివీడీలు అంటేనే చాలా ఇష్టం. తాత, మామలు సేకరించిన పాత సినిమాల డీవీడీలు అతడికి నిధితో సమానం. అరుదైన డీవిడీల కోసం ముంబై వీధుల్లో తిరిగే నిహాల్ ఇప్పటి వరకు ఎన్నో డీవీడీలు కొనుగోలు చేశాడు. ‘అరుదైన డీవీడీలు కొనుగోలు చేయడం, వాటిని ఇతరులకు గర్వంగా చూపడం సంతోషంగా ఉంటుంది’ అంటున్నాడు నిహాల్.ఫాస్ట్గా పాత గ్యాడ్జెట్స్పాత డీవిడీలు మాత్రమే కాదు, పాత వినైల్ రికార్డ్లు,పాత కాలం ఫిజికల్ కెమెరాలు, పాత నాణేలు సేకరించేవారు యువతరంలో ఎందరో ఉన్నారు. ఇదొక రకమైన ట్రెండ్. ఈ ట్రెండ్లాంటిదే న్యూట్రో(నోస్టాల్జీయా ప్లస్ మోడ్రన్లైఫ్) ట్రెండ్. ఈతరం పిల్లలకు పాత గాడ్జెడ్స్పై (Old Gadgets) ఉండే పాషన్ను ‘న్యూట్రో’ ట్రెండ్ అంటున్నారు. ‘న్యూట్రో’ అనేది ఆధునిక జీవితంలో నోస్టాల్జియాను మిళితం చేసే సంస్కృతి. పాత గాడ్జెట్స్ పాస్ట్గా తిరిగిరావడానికి ఈ ట్రెండే కారణం.పాత గ్యాడ్జెట్స్.. ఫ్యాషన్ స్టేట్మెంట్ఏఐ స్మార్ట్ఫోన్ లెన్స్ ఉన్నప్పటికీ యువత ఫిల్మ్ కెమెరాలపై ఆసక్తి చూపుతున్నారు. పాత మోడల్ ఫ్లిప్ ఫోన్లు సరికొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారాయి. ఈ ట్రెండ్ 2026లో శిఖరాగ్రానికి చేరుకుంటుందని సోషల్ మీడియా ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. అత్యాధునిక వీడియో గేమ్ కన్సోల్స్ ఎన్ని వచ్చినప్పటికీ బెంగళూరుకు చెందిన విశాల్తేజాకు 2005 కాలానికి చెందిన పీఎస్పీ(ప్లేస్టేషన్ పోర్టబుల్) అంటేనే ఇష్టం. సోనీ కంపెనీ వారి ఈ హ్యాండ్హెల్డ్ గేమింగ్ కన్సోల్ లాంచ్ అయిన కొద్దికాలంలోనే సూపర్హిట్ అయింది. ‘నేను చూసిన, ఆడుకున్న మొట్ట మొదటి గేమ్ కన్సోల్ పీఎస్పీ. ఇది మా ఇంటి వస్తువులా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని కన్సోల్స్ వచ్చినా పీఎస్పీ అంటేనే ఇష్టం’ అంటున్నాడు విశాల్తేజ.ఎందుకీ వైబ్?ఎన్నో అత్యాధునిక గ్యాడ్జెట్స్ ఉన్నా, యువతరంలో కొద్దిమంది పాత గాడ్జెట్స్ను ఎందుకు అపురూపంగా చూస్తున్నారనే ప్రశ్నకు వారి మాటల్లోనే జవాబు దొరుకుతుంది. మచ్చుకు కొన్ని... పాత గాడ్జెట్లే సౌకర్యంగా ఉన్నాయి’ ‘ప్రైవసీ కోసం’‘ పరుగులు తీస్తున్నట్లుగా లేదు. ప్రశాంతంగా నడుస్తున్నట్లుగా ఉంటుంది’ ‘డిస్కనెక్ట్ థ్రిల్ ఆస్వాదించడానికి’ ‘2005 కాలానికి చెందిన ఫోన్లలో కాన్స్టంట్గా నోటిఫికేషన్లు ఉండేవి కావు. ప్రశాంతంగా ఉండేది. అందుకే వాటిని ఇష్టపడుతున్నాం’ ‘మోడ్రన్ టెక్తో పోల్చితే పాత డివైజ్లలో సింప్లిసిటీ–సెల్ప్ కంట్రోల్ ఉంటుంది’∙∙∙డిజిటల్ డిటాక్స్ కల్చర్ పెరిగిపోవడంతో దాని నుంచి బయటపడడానికి యువతలో కొద్దిమంది పాత ‘ఫ్లిప్ ఫోన్’లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ఒకసారి వెనక్కి వెళదాం. వెళితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలాంటి ఆందోళన ఉండదు. ఉరుకులు, పరుగులు ఉండవు. టైమ్ వృథా కాదు’ అంటూ ‘డంబ్ఫోన్’లపై ‘రీల్స్’ చేస్తున్నారు కొందరు. న్యూట్రోలాజిక్లో పాత సాంకేతికత కేవలం నోస్టాల్జిక్ ఫీలింగ్ మాత్రమే కాదు. సురక్షితంగా, సౌలభ్యంగా అనిపించే ఫీలింగ్. యువతరం పాత టెక్నాలజీని ఉపయోగించడమే కాదు దాన్ని రొమాంటిసైజ్ చేయడం మరో విశేషం. -
బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..!
ముంబైలో జరిగిన ఒక ఘోర బస్సు ప్రమాదం ఒక బాలనటి కుటుంబంలోనూ, ఆ చిన్నారి జీవితంలో మర్చిపోలేని విషాదాన్ని నింపింది. ఒక మూవీ ఆడిషన్కోసం వెళ్లిన 13 ఏళ్ల మరాఠీ బాలనటి చాలా ఉత్సాహంగా తిరిగి ఇంటికి బయలుదేరింది. కానీ అదే తన జీవితంలో అంతులేని శోకాన్ని మిగులుస్తుందని ఊహించలేదు. కళ్లముందే కన్న తల్లి ప్రాణాలు పోతోంటే.. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోయింది. పదే పదే ఆ దృశ్యాల్ని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.పోలీసులు అందించిన వివరాల ప్రకారం ముంబైలోని భాండుప్లో బెస్ట్ రూట్ 606లో ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అదుపు తప్పి బస్టాప్లో నిల్చున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. 35 ఏళ్ల ప్రణీత సందీప్ రసం, తన కుమార్తెను ఆడిషన్ కోసం దాదార్ వెళ్లి తిరిగి వస్తూ, భాండుప్ రైల్వే స్టేషన్ సమీపంలో దిగి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో బస్సు అదుపు తప్పిన బెస్ట్ ఎలక్ట్రిక్ బస్ తమవైపు దూసుకు రావడాన్ని గ్రహించిన తల్లి ప్రణిత, కుమార్తెను శక్తి కొలదీ పక్కకు తోసేసింది.క్షణాల్లో అంతా జరిగిపోయింది.తల్లి పక్కకు నెట్టివేయడంతో బాలనటి ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకుంది. కానీ ప్రణీత మాత్రం బస్సు చక్రాల కింద నలిగి పోయింది. తన కళ్లముందు తల్లి విగతజీవిగా మారిపోవడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఎలాగోలా తేరుకుని, వేరే వారి ఫోన్ ద్వారా తండ్రి సందీప్కు ఫోన్ చేసింది. ఆయన సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ప్రణీత గాయాలతో మరణించింది. తల్లి తనను కాపాడుతూ చనిపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాలనటిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. చికిత్స , కౌన్సెలింగ్ కోసం ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ప్రణీత కుమార్తె మరాఠీ టీవీ సీరియల్స్లో చిన్న సహాయక పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హోంవర్క్, షూటింగ్లను మేనేజ్ చేస్తూ నటించి పేరు తెచ్చుకున్న ఆమె ప్రతిభ వెనుక ప్రణిత కృషిచాలా ఉందని పొరుగు వారు గుర్తు చేసుకున్నారు. పాపను ఆడిషన్స్, సెట్స్కు తీసుకెళుతూ ఇంటిని చక్కబెట్టుకొనేదని చెప్పారు. కాగా ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రణీతతోపాటు, మాన్సి మేఘశ్యాం గురవ్, 49, వర్ష సావంత్, 25, మరియు ప్రశాంత్ దత్తు షిండే, 45. మరో పదకొండు మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్, 52 ఏళ్ల సంతోష్ రమేష్ సావంత్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.చదవండి: 2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలురూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనం విఖ్రోలి డిపోకు అనుబంధంగా ఉన్న రూట్ A-606 (సీనియర్ 34)లో నడుస్తున్న వెట్-లీజ్ ఒలెక్ట్రా బస్సు. సంఘటన జరిగిన సమయంలో డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ (52), కండక్టర్ భగవాన్ భావు ఘరే (47) విధుల్లో ఉన్నారని, ఇద్దరూ బెస్ట్ సిబ్బంది గా భావిస్తున్నారు. మరోవైపుమృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్లో మహిళపై సామూహిక అత్యాచారం -
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న జైసూ.. సొంత జట్టు ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ 2025-26లో భాగంగా గోవాతో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.జైపూర్ వేదికగా గోవాతో మ్యాచ్లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లలో అంగ్క్రిష్ రఘువన్షి (11) త్వరగానే పెవిలియన్ చేరగా.. వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్తో కలిసి యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 70 పరుగులు జోడించారు.జైసూ జస్ట్ మిస్.. అయితే, అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జైసూ దర్శన్ మిసాల్ (Darshan Misal) బౌలింగ్లో స్నేహల్ కౌతంకర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గోవాతో మ్యాచ్లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. ఆరు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ముషీర్ ఖాన్కు తోడైన.. అతడి అన్న, టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపాడు.సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకంతమ్ముడు ముషీర్ (60)తో కలిసి మూడో వికెట్కు 93 పరుగులు జోడించిన సర్ఫరాజ్ ఖాన్.. విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.మొత్తంగా 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన సర్ఫరాజ్ ఖాన్.. 157 పరుగులు చేసి దర్శన్ మిసాల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మిగిలిన వారిలో హార్దిక్ తామోర్ హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 53)తో మెరవగా.. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (8 బంతుల్లో 27) మెరుపులు మెరిపించాడు.ముంబై భారీ స్కోరుఇక సిద్దేశ్ లాడ్ 17, షామ్స్ ములాని 22 పరుగులు చేయగా.. ఆఖర్లో తనుశ్ కొటియాన్ (12 బంతుల్లో 23), తుషార్ దేశ్పాండే (3 బంతుల్లో 7) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 444 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. గోవా బౌలర్లలో దర్శన్ మిసాల్ మూడు వికెట్లు కూల్చగా.. వాసుకి కౌశిక్, లలిత్ యాదవ్ చెరో రెండు, దీప్రాజ్ గవోంకర్ ఒక వికెట్ కూల్చారు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
Mumbai: పాదచారులపైకెక్కిన బస్సు.. నలుగురు మృతి
ముంబై: ముంబై మహానగరంలోని భండూప్ ప్రాంతంలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ముంబై నగర రవాణా సంస్థ (బెస్ట్)కు చెందిన ఒక ఎలక్ట్రికల్ బస్సు అదుపు తప్పి, పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.నిత్యం రద్దీగా ఉండే భండూప్ స్టేషన్ రోడ్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విఖ్రోలి డిపోకు చెందిన ఈ బస్సు (రూట్ నంబర్ A-606) తన ప్రయాణాన్ని ముగించుకుని స్టేషన్ సమీపంలో రివర్స్ తీస్తుండగా, ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త, సాంకేతిక లోపం కారణంగా బస్సు ఒక్కసారిగా వెనుక ఉన్న పాదచారులను బలంగా ఢీకొంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న ప్రయాణికులు, పాదచారులు అప్రమత్తమయ్యేలోపే బస్సు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన తొమ్మిది మందిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వెట్ లీజు (Wet Lease) ప్రాతిపదికన నడిచే బస్సుల నిర్వహణ, డ్రైవర్ల శిక్షణ, బస్సుల కండిషన్పై కఠినమైన తనిఖీలు ఉండాలని ముంబై కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్షా గైక్వాడ్ కోరారు. రద్దీ ప్రాంతాల్లో బస్సులను వెనుకకు తీసే సమయంలో సహాయకులు (Helpers) ఉండాలని, డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యూరియాతో పాల తయారీ
-
అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
ప్రతి ఏడాది మాదిరే ఈసారీ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ మొదలైంది. అయితే, ఈసారి భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రాకతో ఈ సీజన్కు పండుగ కళ వచ్చింది. ఢిల్లీ తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ బుధవారం నాటి తొలి మ్యాచ్లలో శతక్కొట్టారు.రెండో రౌండ్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్లో కోహ్లి మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా.. రోహిత్ మాత్రం ఈసారి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా దేశీ క్రికెట్ బరిలో దిగారు. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు.రూ. వెయ్యి కోట్లకు పైగానేఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్న రోహిత్- కోహ్లి.. సంపాదన ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి నెట్వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, ఐపీఎల్లో ఆడటం ద్వారా కూడా రో-కో భారీ స్థాయిలో వేతనం పొందుతున్నారు. మరి విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజాలకు లభించే మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?!..విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్-ఎ మ్యాచ్లలో భాగమయ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి.. తదనుగుణంగా ఫీజును చెల్లిస్తారు. ఆ వివరాలు ఇవీ..సీనియర్ కేటగిరీ (40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 60 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 30 వేల చొప్పున ఫీజుమిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 50 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 25 వేల చొప్పున ఫీజుజూనియర్ కేటగిరీ (0- 20 లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 40 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 20 వేల చొప్పున ఫీజు.రోజువారీ అలవెన్సులురవాణా, భోజనం ఖర్చులు.. వసతి ఏర్పాటుప్రదర్శన ఆధారంగా బోనస్లుమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ. 10 వేల ప్రైజ్మనీప్రైజ్మనీనాకౌట్ దశకు చేరిన, ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్పూల్ ఆధారంగా నజరానా ఇస్తారు.అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ వచ్చేది ఎంత?ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లుగా రోహిత్- కోహ్లి ఒక్కో వన్డేకు రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకుంటారు. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో ఉన్నందుకు గానూ రూ. 60 వేలతో పాటు బోనస్, అలవెన్సులు కూడా దక్కుతాయి. ఫీజులో వ్యత్యాసం ఉన్నా.. ఆట ఒక్కటే.ఈ దేశీ టోర్నీ ద్వారానే తమను తాము నిరూపించుకున్న రో- కో వంటి ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నత స్థాయికి చేరారు. ఏదేమైనా బీసీసీఐ నిబంధనల పుణ్యమా అని రోహిత్- కోహ్లిలను మరోసారి తమ సొంత దేశీ జట్ల తరఫున ఆడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు దక్కింది. -
పావురాలకు ఆహారం పెట్టినందుకు.. రూ.5 వేల జరిమానా
ముంబై: బహిరంగ ప్రదేశంలో పావురాలకు ఆహారం (తిండి గింజలు) చల్లిన వ్యాపారవేత్తకు ముంబై కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారని కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పావురాలకు గింజలు చల్లడంపై నిషేధం అమలులో ఉంది.నగరంలోని మహిమ్ ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 1న దాదర్ నివాసి నితిన్ సేథ్.. పావురాలకు తిండి గింజలు వేశారు. ఆయనపై కేసు నమోదైంది. పావురానికి ఆహారం ఇచ్చే విషయం కోర్టుకు చేరుకుంది. డిసెంబర్ 22వ తేదీన ఆ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వీయూ మిసాల్ ఆ వ్యాపారవేత్తను దోషిగా తేల్చారు. అయితే క్షమాపణ కోరడంతో అతనికి కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది.బహిరంగంగా పావురాలకు ఫీడింగ్ చేయడం వల్ల ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 ఉల్లంఘించినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. ఆయనపై బీఎన్ఎస్లోని సెక్షన్ 271 కింద కూడా కేసు నమోదు చేశారు. -
మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్!
టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా మ్యాచ్లో ‘హిట్మ్యాన్’ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు టీమిండియా విధుల్లో లేని స్టార్లంతా దేశవాళీ క్రికెట్ బాట పట్టిన విషయం తెలిసిందే.దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో తమకు తిరుగులేదని నిరూపించుకున్న ఈ ఇద్దరు.. సొంత జట్ల తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగారు. ముంబై ఓపెనర్గా రోహిత్ శర్మ.. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు వన్డౌన్ బ్యాటర్గా కోహ్లి బుధవారం దర్శనమిచ్చారు.62 బంతుల్లోనే శతక్కొట్టి..ఇక తమ తొలి మ్యాచ్లో ముంబై సిక్కిం వంటి పసికూనతో తలపడగా.. రోహిత్ శర్మ కేవలం 62 బంతుల్లోనే శతక్కొట్టి.. తన లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 18 ఫోర్లు, 9 సిక్స్ల సాయంతో 155 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.ఇప్పుడు గోల్డెన్ డక్!తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఉత్తరాఖండ్తో శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్లో జగ్మోహన్ నాగర్కోటికి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో జైపూర్లో మొన్న (బుధవారం) రోహిత్ శర్మ సెంచరీ చూసిన అభిమానులు.. ఇప్పుడు అదే వేదికపై అతడు ఇలా తేలిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఆంధ్రతో మ్యాచ్లో కోహ్లి సైతం శతక్కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్#VijayHazareTrophy Golden duck for rohit sharma pic.twitter.com/mwsH4O7aRt— vaibhav dhakad (@Pkmbk123) December 26, 2025 -
బహుళ అంతస్తుల భవనంలో మంటలు
ముంబై: ముంబై మహానగరం అంధేరి వెస్ట్లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వీర దేశాయ్ రోడ్డులో ఉన్న 23 అంతస్తుల సొర్రెంటో టవర్లో ఉదయం 10 గంటల సమయంలో మంటలు మొదల య్యాయి. దీంతో, 16వ అంతస్తులో చిక్కు కున్న 30 నుంచి 40 మందిని మెట్ల మార్గం ద్వారా రక్షించినట్లు ఓ అధికారి చెప్పారు. ఒక మహిళ సహా ముగ్గురిని 15వ ఫ్లోర్లోని ఓ ఫ్లాట్ నుంచి సురక్షితంగా కిందికి దించామని చెప్పారు. మంటల కారణంగా 10, 21వ అంతస్తుల మధ్యలోని విద్యుత్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. 12, 13, 14వ అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. 14వ అంతస్తులో ఉంటున్న ప్రముఖ సినీ నిర్మాత సందీప్ సింగ్ నివాసం కూడా దెబ్బతింది. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన ఆయన ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆయన్ను రక్షించారు. అనంతరం సందీప్ సింగ్ను నటి అంకిత లొఖాండే, ఆమె భర్త వికీ జైన్ తమ ఇంటికి తీసుకెళ్లారు. -
ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ఆరంభమైన రోజే (బుధవారం) పరుగుల వరద పారింది. ఈ ఎడిషన్లోని తొలి మ్యాచ్.. దాదాపు ప్రతీ బౌలర్కూ ఓ పీడకలను మిగిల్చింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 22 శతకాలు నమోదు కావడం.. ఇందులో ఫాస్టెస్ట్ సెంచరీలు ఉండటం ఇందుకు నిదర్శనం.అయితే, ఇందులో రెండు శతకాలు మాత్రం అత్యంత ప్రత్యేకం. సుమారుగా పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ తరఫున భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఈ దేశీ టోర్నీ బరిలో దిగగా.. ముంబై రాజా, టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా సొంత జట్టు తరఫున రంగంలోకి దిగాడు.62 బంతుల్లోనే జైపూర్ వేదికగా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సిక్కింతో మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టాడు. కేవలం 62 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన లిస్-ఎ క్రికెట్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) నమోదు చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.ఇక రోహిత్ అద్భుత ప్రదర్శన కారణంగా సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను చూసేందుకు వేలాది మంది అభిమానులు జైపూర్ స్టేడియానికి వచ్చారు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న వేళ కొంతమంది.. టీమిండియా సెలక్టర్ ఆర్పీ సింగ్ స్టేడియంలో ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్య ఛేదనలో రోహిత్ మెరుపు శతకంతో చెలరేగడంతో.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!‘‘గంభీర్ నువ్వు ఎక్కడున్నావు? మాకైతే కనిపించడం లేదు.. నువ్వేతై కళ్లప్పగించి రోహిత్ ఇన్నింగ్స్ చూడు’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. కాగా వన్డే ప్రపంచకప్-2027 ఆడటంపై స్పష్టత లేదంటూ.. ఇటీవలే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సారథిపై వేటు వేసింది. మరోవైపు.. టీమిండియా యువ ఆటగాళ్లతో పాటు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కూడా దేశీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రో-కోలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ వారి అభిమానులు.. సందర్భం వచ్చినపుడల్లా గంభీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు అదరగొట్టడం.. విజయ్ హజారే ట్రోఫీలోనూ శతకాలు బాదడంతో మరోసారి గంభీర్ ట్రోల్ అవుతున్నాడు. శతక్కొట్టిన కోహ్లికాగా ఆంధ్రతో మ్యాచ్లో కోహ్లి 131 పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు ప్రియాన్ష్ ఆర్య (74), నితీశ్ రాణా (77) రాణించడంతో ఆంధ్ర విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలో ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ సీజన్ను విజయంతో ఆరంభించింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్బై చెప్పిన రో-కో కేవలం వన్డేలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు.. షమీకీ ఛాన్స్!


