
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,183 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 64,818 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,91,93,085 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 5,95,565 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,01,83,143 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం 31.5 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి: పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ప్రెస్
Comments
Please login to add a commentAdd a comment