Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Crowd of Devotees Increased in Tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Wed, Feb 12 2025 8:51 AM | Last Updated on Wed, Feb 12 2025 8:51 AM

Crowd of Devotees Increased in Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,192 మంది స్వామిని దర్శించుకున్నారు. 20,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.15  కోట్లు సమర్పించారు. 

టైంస్లాట్‌ టికెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లా లని టీటీడీ విజ్ఞప్తి చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement