ముంచుకొస్తున్న వాయు‘గండం’ | Heavy rain likely in coastal Andhra Pradesh in next two days | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న వాయు‘గండం’

Published Tue, Aug 27 2024 4:31 AM | Last Updated on Tue, Aug 27 2024 4:31 AM

Heavy rain likely in coastal Andhra Pradesh in next two days

 ఏపీలో తీరం దాటే అవకాశం

సాక్షి, విశాఖ­పట్నం­: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పెరిగే సూచనలు కని­పి­స్తున్నాయి. మేఘావృత వాతావరణం ఏర్ప­డుతుండటంతో రోజూ అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడనున్నాయి. దీంతో పాటు ఈ నెల 29న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీ­డనం ఏర్పడే అవ­కా­శం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచన­లు­న్నట్లు తుఫాన్‌ హెచ్చ­రికల కేంద్రం అధికా­రులు చెబుతు­న్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటే అవకాశాలు పు­ష్కలంగా ఉన్నాయని, అది కూ­డా ఉత్తరాంధ్రలోనే దాటే సూచనలున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రోజు­ల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందన్నారు. సెప్టెంబర్‌ 5 వరకు వాయుగుండం ప్రభావం ఉంటుందని భావి­స్తున్నారు. రాబోయే 2 రో­జుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయల­సీమ­ల్లో వానలకు ఆస్కా­రం ఉందని అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement