heavy rain
-
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025 -
ఢిల్లీలో కొత్త రికార్డు..వందేళ్ల తర్వాత అంతటి వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లో వర్షం(Rain) సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం నమోదై రికార్డు సృష్టించింది. శనివారం(డిసెంబర్ 28) ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 41.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.సరిగ్గా 101 ఏళ్ల క్రితం 1923 డిసెంబర్ 3వ తేదీన 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షం తర్వాత మళ్లీ డిసెంబర్(December)లో శనివారమే అత్యధిక వర్షం పడింది.వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 13డిగ్రీలకు పడిపోయాయి. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.భారీ వర్షం కారణంగా రాజధాని నగరంలో క్షీణించిన వాయునాణ్యత ఒక్కసారిగా మెరుగుపడింది.ఇదీ చదవండి: అమ్మో ఇవేం ఎండలు -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
-
హైదరాబాద్లో మోస్తరు వర్షం.. పెరిగిన చలి తీవ్రత (ఫొటోలు)
-
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని.. ఏపీలో అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది.ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు Heavy Rain Forecast to Tirupati, Nellore Districts -
తెలంగాణపై అల్పపీడన ప్రభావం
-
రెండు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన
-
తెలంగాణకు వానగండం
-
నైరుతి దిశగా అల్పపీడనం.. రెండు రోజులు పాటు వర్షాలు
-
ఏపీకి భారీ వర్ష సూచన
-
అల్పపీడనం ఎఫెక్ట్.. విశాఖ సంద్రం అల్లకల్లోలం (ఫొటోలు)
-
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
-
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
-
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి.. అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు.దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకూ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 19న ఉత్తరాంద్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 గరిష్టంగా 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులెవరూ ఈ నెల 22 వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.తీరంలో అలజడిఅల్పపీడనం కారణంగా మంగళవారం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా సముద్ర తీరంలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో సముద్రంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసిపడుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తలెత్తి మధ్యాహ్నం నుంచే చీకట్లు కమ్ముకుని తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటలకే రాత్రిని తలపిస్తూ బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేటలో కొనసాగుతున్న మత్స్యకారులు తీవ్రమైన అలలు, చలి గాలులకి తట్టుకుని వేట చేయలేకున్నామని, తాము వేట ముగించుకుని, త్వరితగతిన ఒడ్డుకు వచ్చేస్తున్నామంటూ తోటి మత్స్యకారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. -
జడివానతో జల దిగ్బంధంలో తిరుపతి నగరం.. ఇళ్లలోకి వరద నీరు (ఫొటోలు)
-
తిరుమలలో అర్ధరాత్రి నుంచి ఎడతెగని వర్షం
-
తిరుమలలో కుండపోత.. స్వామి వారిని దర్శించుకున్న స్నేహారెడ్డి, రాధిక (ఫొటోలు)
-
రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన
-
ఏపీలో భారీ వర్షాలు
-
తమిళనాడులో భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు (ఫొటోలు)
-
‘ఫెంగల్’ తడాఖా.. వరదల్లో కొట్టుకుపోతున్న బస్సులు, కార్లు..
చెన్నై: ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరుకుంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, కృష్ణగిరి జిల్లాలో వరద ధాటికి బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో ఇళ్లు సైతం నీటి మునిగాయి. వరద నీటిలో పాములు కనిపించడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. Scary visuals coming from Uthangarai, Krishnagiri district. Once in a lifetime historic rains of 500mm recorded. Super rare to see such numbers in interiors. Why slow moving cyclones are always dangerous. #CycloneFengal #Tamilnadu #Floods #Krishnagiri pic.twitter.com/K8Jla22VUc— Chennai Weatherman (@chennaisweather) December 2, 2024ఇదిలా ఉండగా.. తుపాన్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.Cyclone Fengal Wreaks Havoc Along India’s Coast, Three DeadThe storm made landfall near Puducherry & unleashed torrential rains and winds, sparking severe flooding across Tamil Nadu, & submerging streets, homes, and businesses as well as leaving thousands displaced. pic.twitter.com/dyAOtrQQd4— COMMUNITY EARTH RADIO🌎 (@COMM_EARTH) December 2, 2024మరోవైపు.. తుపాన్ ప్రభావం తాజాగా కర్ణాటక మీద కూడా చూపిస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు, హసన్, మాండ్యా, రామనగర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ విధించింది. అలాగే, ఉడిపి, చిక్మంగ్లూర్, చిక్బల్లాపూర్ జిల్లాలకు ఆరెంట్ అలర్ట్ విధించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Remnant of Cyclone Fengal - WML has moved on from Bengaluru to further West #BengaluruRains #KarnatakaRainsParts of South Interior Karnataka districts of Tumakuru, Ramanagara & Mandya have got heavy rains from this & the action will now shift to Malenadu & Coastal Karnataka… https://t.co/oKb0uzIyqW pic.twitter.com/bdCYdYA8dC— Karnataka Weather (@Bnglrweatherman) December 2, 2024 -
ఢిల్లీలో తగ్గని కాలుష్యం, కేరళలో భారీ వర్షాలు, కశ్మీర్లో కురుస్తున్న మంచు
న్యూఢిల్లీ: దేశంలో చలి వాతావరణం కొనసాగుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో విషపూరితమైన గాలి అక్కడి జనాలను పీడిస్తోంది. ఆదివారం కూడా గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి అతలాకుతలమయ్యింది. దీంతో సైన్యం వరద సహాయక చర్యలను చేపడుతోంది.పుదుచ్చేరిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు సంభవించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. డిసెంబర్ 2న పుదుచ్చేరిలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.ఫెంగల్ తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటింది. ఈ నేపధ్యంలో చెన్నై బీచ్లలో అధిక అలలు ఏర్పడ్డాయి. ఫెంగల్ తుఫాను పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర తీర ప్రాంతాలపై క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఐఎండీ కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్లలో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువకు పడిపోయాయి. డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎత్తయిన ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్లో ఉష్ణోగ్రత మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. గుల్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉష్ణోగ్రత మైనస్ 0.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
బలహీనపడిన ఫెంగల్ తుపాను
-
ఫెంగల్ బీభత్సం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
-
AP: ఫెంగల్ టెన్షన్.. మరో 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో మరో 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ఫెంగల్ తుపాన్ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు, నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పంట పొలాలు నీటి మునిగి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జనాలు బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. ఇక, కృష్ణపట్నంలో సముద్రం పది మీటర్లు ముందుకు వచ్చింది.ఇదిలా ఉండగా.. ఫెంగల్ తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించింది వాతావరణ శాఖ. ఇక, పుదుచ్చేరిలో పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
వణికించే చలిలో వరదలు..చెన్నైని చెల్లాచెదురు చేసిన ‘ఫెంగల్’(ఫొటోలు)
-
ఫెంగల్ టెన్షన్.. చెన్నై ఎయిర్పోర్టులోకి వరద నీరు
Cyclone Fengal Updates..👉 తీరం దాటుతున్న ‘ఫెంగల్’ తుపానుపుదుచ్చేరి సమీపంలో ‘ఫెంగల్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపిన ఐఎండీఈ ప్రక్రియకు దాదాపు నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలుదక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం👉మహాబలిపురం వద్ద ఫెంగల్ తుపాన్ తీరాన్ని తాకింది. 👉తుపాను ఎఫెక్ట్.. విమానాలు రద్దు..వాతావరణం సరిగా లేని కారణంగా విశాఖ నుంచి వెళ్లే పలు విమానాలు రద్దు చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన మూడు విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దువిమానాల రద్దుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు ఉదయం 4 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత. 👉ఫెంగల్ తుపాను ప్రభావం తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి, ఏపీపై చూపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. #ChennaiAirport During #FengalCyclone#CycloneAlert#Chennaipic.twitter.com/EPLZlM5CYt— Musharraf Mughal. (@marcanthony99) November 30, 2024 👉మరోవైపు.. లోతట్టు పప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చి చేరుకుంది. 📍 சென்ட்ரல் ரயில் நிலையம் எதிரில். ✍️ ஆபத்தான முறையில் கீழே விழ இருந்த அறிவிப்புப் பலகை உடனடியாக அகற்றப்பட்டது. #ChennaiRains #chennaipolice #cyclone #Fengal pic.twitter.com/b3et05ClSi— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) November 30, 2024 👉రన్వే పైకి వరద నీరు చేరుకోవడంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే, కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. 👉నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుపాను భయపెడుతోంది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.👉తుపాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 70-80 కి.మీ వేగంలో గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. పలు రైలు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉంది. Cyclone Fengal 🌀 effect on CHENNAI cityParts of the city have reported inundations due to spells of intense rainfall activityStay safe & indoors for the next crucial 36 hours#ChennaiRains #ChennaiRains2024 #ChennaiRain https://t.co/voiAq7RIiP pic.twitter.com/2GX6SbHD4K— Karnataka Weather (@Bnglrweatherman) November 30, 2024👉తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విలుపురం, కల్లకురుచ్చి, కుద్దలూరు, పుద్చుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అల్టర్ విధించింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.சிக்கி தவிக்கும் தலைநகரம். #Fengal #FengalCyclone #Chennai #ChennaRains #DMKFails pic.twitter.com/OHBlmMmy8D— D.Jackson Jayaraj (@VirugaiJackson) November 30, 2024👉ఫెంగల్ ప్రభావం ఏపీపై కూడా కొనసాగనుంది. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు , కడప జిల్లాల్లో ఫ్లాష్ఫ్లడ్కు అకాశముందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయ్యింది. పెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ஆட்டோ உள்ளே தண்ணீர்போகும் அளவுக்கு சூளைமேடு பகுதி #ChennaiRains @thatsTamil #Chennaiflood pic.twitter.com/6AohpLlbhb— Veerakumar (@Veeru_Journo) November 30, 2024 -
అల్లకల్లోలంగా సముద్రం.. ఏపీలో భారీ వర్షాలు
-
మళ్లీ తుఫానుగా బలపడిన వాయుగుండం
-
తుపాను ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు..
విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఫెంగల్ తుపానుగా బలపడి తీవ్ర వాయుగుండం వెంటనే బలహీనపడింది. ఈ క్రమంలో మరింత బలహీనపడి రేపు మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.ఇక, తుపాను కారణంగా నేటి నుంచి ఏపీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాగా, ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
Cyclone Fengal: ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు
-
దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాన్..
-
వాయు'గండం'.. ఆరు రోజులపాటు వానలే వానలు
-
ముంచుకొస్తున్న ‘ఫెంగల్’ తుఫాన్ ...సముద్రం అల్లకల్లోలం (ఫొటోలు)
-
ఏపీకి హై అలర్ట్..
-
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం కారణంగా ఏపీలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు సహా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీవైపు పయనిస్తోంది. అల్పపీడనం ప్రభావం తమిళనాడులోని 12 జిల్లాలతో సహా ఏపీలోకి దక్షిణ కోస్తా, రాయలసీమపై పడనుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ప్రభుత్వం అప్రమత్తమైంది. Villupuram, Pondy, Cuddalore, Mayiladuthurai stretch getting very good rains. Rains will continue for next few hours.Our chennai radar is clear, no heavy rains expected for next 1/2 hours. Get ready for Schools and Colleges :(#ChennaiRains | #ChennaiRainsUpdate | #RainAlert pic.twitter.com/lvTvFtog2Y— TamilNadu Weather (@TamilNaduWeath2) November 13, 2024 -
తిరుమల తిరుపతిలో భారీ వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి, హైదరాబాద్: నగరంలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా జోరుగా వాన పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్పేట, కొండాపూర్, కొత్తగూడ, మియాపూర్, బోరబండ, శేరిలింల్లి, పటాన్చెరు, ఎర్రగడ్డ తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. మరోవైపు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలోనూ వాన దంచికొట్టింది. వాన, నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో.. నవంబర్ 1వ తేదీ దాకా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. -
210కి పెరిగిన స్పెయిన్ వరద మృతులు
మాడ్రిడ్: స్పెయిన్లో ఆకస్మిక భారీ వరదలకు బలైన వారి సంఖ్య 210 దాటింది. చాలామంది గల్లంతయ్యారు. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీస్తున్నాయి. శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు, నేలకూలిన చెట్లు, కూలిన విద్యుత్ లైన్లు, గల్లంతైనవారి గురించి ఆత్మీయుల ఆందోళనలు... ఇలా ఎక్కడ చూసినా ఈ విషాద దృశ్యాలే కనబడుతున్నాయి. ఆకస్మిక తుఫాను కలిగించిన భారీ నష్టం సునామీ అనంతర పరిణామాలను తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.Rescuer rescuing a women and her pet dog from flooded area in Spain.There is severe flash floor occurred serval region in Spain. The worst affected area is Valencia which records highest rainfall in 28 years. The death toll from the flood in Valencia alone has risen to 92.… pic.twitter.com/nUOcwBM4nW— Eagle EyE (@mkh_nyn) October 31, 2024 🤯The worst flood in the last 37 years: at least 72 people died in Spain, dozens went missing, RTVE.Three days of mourning have been declared in the country. There is still no normal access to some areas. pic.twitter.com/KLQQSuniCa— Nurlan Mededov (@mededov_nurlan) October 30, 2024Catastrophic flooding in Spain.#Flood#Spain pic.twitter.com/32Vwotrv4F— Jennifer Coffindaffer (@CoffindafferFBI) October 30, 2024⚠️Devastating images aftermath flood in the Alfafar in the province of Valencia, Spain63 reported deaths so far in Spain due to catastrophic floods…#Valencia #Spain pic.twitter.com/rnsexKKI3P— Culture War (@CultureWar2020) October 30, 2024 -
ఒడిశా-బెంగాల్లో 'దానా' విధ్వంసం (ఫొటోలు)
-
జలదిగ్బంధంలో బెంగళూరు..
-
‘ఉమ్మడి అనంత’లో కుంభవృష్టి
అనంతపురం అగ్రికల్చర్/పుట్టపర్తి అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వాన జోరు మంగళవారం వేకువజాము వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో పలు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. ఏకధాటిగా నాలుగైదు గంటలపాటు భారీ వర్షం కురవడంతో చాలా మండలాల్లో వాగులు, వంకలు, చెక్డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు కట్ట తెగిపోయి దిగువ ప్రాంతానికి వరద పోటెత్తడంతో దాదాపు 70 గొర్రెలు కొట్టుకుపోయాయి. రామగిరి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, పెనుకొండ, కొత్తచెరువు, పుట్టపర్తి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో చిత్రావతి, వంగపేరు, కుషావతి, జయమంగళి నదులతోపాటు పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్లో సాగు చేసిన వరి, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు వందలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన ద్రాక్ష తోట మొత్తం నేలమట్టమయ్యింది. రూ.20 లక్షలకు పైగా నష్టపోయినట్లు రైతు వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో రికార్డు స్థాయిలో 198.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో 89.4 మి.మీ., కంబదూరులో 65.4 మి.మీ., ఆత్మకూరులో 60 మి.మీ. చొప్పున భారీ వర్షం కురిసింది. కాగా.. రానున్న రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పండమేరు ఉగ్రరూపం... నీట మునిగిన పలు కాలనీలు ఎగువన భారీ వర్షాలు కురవడంతోపాటు కనగానపల్లి చెరువుకట్ట తెగిపోవడంతో పండమేరు ఉధృతంగా ప్రవహించింది. పండమేరు వెంబడి ఉన్న అనంతపురం నగర శివారులోని గురుదాస్ కాలనీ, ఆటో కాలనీ, వనమిత్ర పార్క్ వెనుక కాలనీలు, రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, బృందావన కాలనీ, పరిటాల సునీతమ్మ కాలనీ, దండోరా కాలనీ, రాజరాజేశ్వరి కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదపై అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఫలితంగా కట్టుబట్టలతో మిగిలామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. -
భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం..
బనశంకరి: కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని బాబుసాబ్ పాళ్యలో నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల కట్టడం మంగళవారం సాయంత్రం కుప్ప కూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు పది మందిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. శిథిలాల కింద మరో ఏడుగురి వరకు చిక్కుకుని ఉన్నట్లు చెబుతున్నారు. ఘటన సమయంలో భవనంలో 18 మంది వరకు కూలీలున్నట్లు తెలిసింది.జల దిగ్బంధంలో అపార్ట్మెంట్లు బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం యలహంకలోని కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి చెరువు నీరు పోటెత్తింది. దీంతో అపార్ట్మెంట్లోని 2 వేల మంది చిక్కుబడి పోయారు. 650 కుటుంబాలకు గాను 250 కుటుంబాలను బయటకు తరలించారు. -
ఆరబోసిన ధాన్యం నీటిపాలు
చౌటుప్పల్: సకాలంలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటిపాలు చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మంగళవారం సాయంత్రం కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకుని తిరిగి కుప్పలు పోసుకునే సమయంలో వర్షం రావడంతో రైతులు ఏమి చేయాలో తెలియక పరుగులుపెట్టారు. అప్పటికప్పుడు ధాన్యాన్ని కుప్పలుగా పోసుకున్నారు. పట్టాలు కప్పుకున్నారు. పెద్ద ధాన్యం కుప్పలను ట్రాక్టర్లతో దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా వర్షం భారీగా కురవడంతో వరద నీటి ప్రవాహంలో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు బోరున విలపించారు. -
అనంత అతలాకుతలం.. ముంచేసిన పండమేరు (ఫొటోలు)
-
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం..
-
తీరం దాటిన వాయుగుండం..
-
దూసుకొస్తున్న వాయుగుండం..
-
తీరం దాటిన వాయుగుండం.. సముద్రం అల్లకల్లోలం
AP Rains Updates..👉బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. నెల్లూరు జిల్లాలోని తడా వద్ద వాయుగుండం తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడనుంది. కోనసీమ: ఓడలరేవు వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.సముద్రపు అలలు ఓఎన్జీసీ టెర్మినల్ గేటును తాకాయి.ఓఎన్జీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.విశాఖ:విశాఖలో ముందుకొచ్చిన సముద్రంసముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.విశాఖ, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక 👉తిరుపతిలో భారీ వర్షాలు..వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవుభారీ వర్షాలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ వేంకటేశ్వ ర్భారీ వర్షాలు కారణంగా ఈరోజు శ్రీవారి మెట్టు మార్గం మూసివేసిన టీటీడీ 👉గడిచిన ఆరు గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాయుగుండం కారణంగా తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
హైదరాబాద్లో కుండపోత వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, ఫిల్మ్నగర్, శేరిలింగంపల్లి, నిజాంపేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, కోఠి, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, సికింద్రాబాద్, ప్యారడైస్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్, వర్షం దంచికొట్టింది.వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. -
తమిళనాడు, కర్ణాటకలో జడివానకు ప్రజలు అతలాకుతలం (ఫొటోలు)
-
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
-
వేగంగా కదులుతున్న వాయుగుండం ఏపీలో ఆ మూడు జిల్లాలకు ఎఫెక్ట్
-
సహారాకు కొత్త అందం!
ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారిలో వర్షం కురిసింది. అదీ భారీగా. రెండు రోజులపాటు కురిసిన వానకు అక్కడి ఇసుక తిన్నెల స్వరూపమే మారిపోయింది. హఠాత్తుగా ఆ ప్రాంతంలో పెద్దపెద్ద సరస్సులు వెలిశాయి. ఒయాసిస్ల వద్ద ఉండే చెట్ల ప్రతిబింబాలు వాన నీటిలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కురిసిన అతి భారీ వర్షం ఇదేనని అక్కడి వారు సంబరపడుతున్నారు. సాధారణంగా సహారాలో ఏడాదిలో అదీ వేసవిలో కొద్దిపాటి వాన కురుస్తుంది. కానీ, మొరాకో ఆగ్నేయాన ఉన్న సహారాలో అల్ప పీడనం కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అతిభారీగా కూడా వానలు కురిశాయని నాసా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొరాకాలో వాయవ్య నగరం ఇర్రాచిడియాలో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సెపె్టంబర్లో సాధారణంగా కురిసే వర్షపాతానికి ఇది ఏకంగా నాలుగు రెట్లు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఆరు నెలల్లో కురిసే వర్షపాతానికి ఇది సమానం. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వర్షాలు కురియడం 30–50 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని మొరాకో వాతావరణ అధికారి హొస్సేన్ చెప్పారు. దీంతో, ఎడారి ఇసుక తిన్నెలు, అక్కడక్కడ పెరిగే మొక్కలు, ఖర్జూర చెట్లు కొత్త ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. మెర్జౌగా ఎడారి పట్టణంలో అరుదైన ఇసుక తిన్నెల్లోకి భారీగా చేరిన వరద కొత్త సరస్సులను సృష్టించింది. మొరాకోలోని అతిపెద్ద నేషనల్ పార్క్గా ఉన్న ఇరిఖి నేషనల్ పార్క్లో ఇంకిపోయిన చెరవులు మళ్లీ నిండాయి. కొన్ని చోట్ల పచి్చక బయళ్లు అవతరించాయి. అంతగా జనం ఉండని ప్రాంతాల్లోనే ఎక్కువగా వానలు కురిశాయి. ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ విపరీత మార్పులే ఈ పర్యవసానాలకు కారణమని నిపుణులు అంటున్నారు. వాతావరణం మరింతగా వేడెక్కితే మున్ముందు ఇక్కడ మరింతగా వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దాదాపు 36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న సహారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
నెల్లూరు జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు
-
4 రోజులపాటు ఏపీలో అత్యంత భారీ వర్షాలు
-
ఏపీకి వాన గండం
-
హైదరాబాద్: పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, ఖైరతాబాద్లో భారీ వాన పడుతోంది. ఇక.. ఇప్పటికే కాప్రా, నాగారం, దమ్మాయిగూడ, యాప్రాల్, నేరేడ్మెట్, మల్కాజిగిరి, తిరుమలగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బోవెన్పల్లి, కొంపల్లి, అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.HyderabadRains ⚠️10-15min HEAVY DOWNPOUR reduced across Kapra, Nagaram, Dammaiguda, Yapral, Neredmet, Malkajgiri, Tirumalgiri further heading to Qutbullapur, Kukatpally, Bowenpally, Kompally, Ameerpet, Khairtabad, Madhapur, Jubilee Hills side. All will reduce in 10-15min ⚡🌧️⚠️— Telangana Weatherman (@balaji25_t) October 11, 2024 -
నవరాత్రి ఉత్సవాలు : అమృతవర్షంలో మధుర మీనాక్షి ఆలయ కోనేరు (ఫొటోలు)
-
రాయలసీమలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో నేడు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు పడేందుకు ఆస్కారముందని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.ఇదీ చదవండి: 9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకొని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.Heavy Rain Started In Hyderabad, Oldcity , ChandrayanGutta Surrounding Areas.. @Hyderabadrains pic.twitter.com/OFx6NoTpP0— RSB NEWS 9 (@ShabazBaba) October 4, 2024క్రెడిట్స్: RSB NEWS 9వర్షం కారణగా రోడ్లపై నీరు నిలిచి.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. వర్షంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
విశాఖలో భారీ వర్షం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. అల్ప పీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదే సమయంలో నేడు, రేపు ఉత్తరాంధ్రలో విసార్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లవద్దనే హెచ్చరికలు కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ దేవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ -
నీట మునిగిన మహారాష్ట్ర..
-
వీడియో: జడివాన ఎఫెక్ట్.. ముంబై అతలాకుతలం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నేడు ముంబై, పూణేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.బుధవారం రాత్రి నుంచి ముంబై, పూణేలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లకు మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే.. ఇండిగో, విస్తారా, స్పైస్జెట్ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్టు ఓ ప్రకటనలో తెలిపాయి. పలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. దీంతో, పలు రద్దు రైళ్లను కూడా రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.#Ghatkopar Metro station right now on your left and LBS marg near #Vikhroli on your right !! non stop rains since past 3 hours #MumabiRains next #FlightsMumbai pic.twitter.com/J5iOqmU86R— sudhakar (@naidusudhakar) September 25, 2024The Kurla-Harbour line in Mumbai was heavily waterlogged last night due to heavy rain in the city. #MumbaiRain #MumbaiWeather pic.twitter.com/xLMF2kMn7w— Vani Mehrotra (@vani_mehrotra) September 26, 2024Heavy rainfall in mumbai It looks like Tsunami🥺ईश्वर सबकी रक्षा करें। सभी मुंबई वासी घरों में सुरक्षित रहे।#MumbaiRain #Mumbai #MumbaiWeather #MumbaiNews #Courreges #FreeCitizens pic.twitter.com/ziM0LeqTKA— Akshay jangid (@jangirakashay67) September 26, 2024ఇక, వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై పరిధిలో ఈదురుగాలు, పిడుగుపాటుల కలయికగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బుధవారం రాత్రి వర్షాల కారణంగా మ్యాన్హోల్లో పడిపోయి ఓ మహిళ మృతిచెందింది. మరోవైపు.. ఈనెల 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ల పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. #WATCH | Mumbai, Maharashtra | Water recedes at the Andheri Railway Station after the city witnessed severe waterlogging and traffic followed by heavy rainfall yesterday. pic.twitter.com/8LtU2pgw0Z— ANI (@ANI) September 26, 2024 #WATCH | Thane, Maharashtra | Torrential rains in Mumbai lead to landslide at the Mumbra by-pass road. pic.twitter.com/SZ1kVUHmz7— ANI (@ANI) September 25, 2024#WATCH | Mumbai, Maharashtra | Railway commuters walked on tracks at the Chunabhatti Railway station as Mumbai faced severe waterlogging followed by torrential rains. (25.09) pic.twitter.com/ewA8caiAIO— ANI (@ANI) September 25, 2024 -
తెలంగాణ: 14 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: కోస్తాకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. కోసాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో నేడు, రేపు(బుధ,గురు) భారీ వర్షాలు కురిసే అవకాముందని ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.నేడు(బుధవారం) నిజామాబాద్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.రేపు(గురువారం) నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.ఇదీ చదవండి: మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. బాధితుల కోసం ప్రభుత్వం స్పెషల్ ప్లాన్! -
మూడు రోజులు భారీ వర్షాలు..
-
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్కు మరోసారి భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో వరుసగా మూడోరోజు ఆదివారం(సెప్టెంబర్22) భారీ వర్షం పడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది.నాగోల్, బండ్లగూడ, ఉప్పల్, బోడుప్పల్, మీర్పేట్, ఎల్బీనగర్,దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా, శుక్ర,శనివారాలు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలో రోడ్లపై వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ట్రాఫిక్జామ్ అయింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. పలు చోట్ల విద్యుత్తీగలపై చెట్లు,ఫ్లెక్సీలు పడి విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇదీ చదవండి: హైదరాబాద్లో కుండపోత వర్షం -
హైదరాబాద్లో కుండపోత వర్షం
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం(సెప్టెంబర్21)సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట సికింద్రాబాద్, ఉప్పల్,బోడుప్పల్,నాగోల్,దిల్సుఖ్నగర్, చైతన్యపురి,కోఠి,అబిడ్స్,నాంపల్లి ప్రాంతాల్లో ఏకధాటిగా రెండుగంటల పాటు అతి భారీ వర్షం పడింది. #HYDTPinfoIt's #Raining heavily.Commuters are requested to drive carefully.#HyderabadRains pic.twitter.com/2tKy5y1vg9— Hyderabad Traffic Police (@HYDTP) September 21, 2024 భారీ వర్షంతో రోడ్లపై నీరు వరదలై పారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రోడ్లపై ట్రాఫిక్జామ్ అయింది. కాగా, శుక్రవారం రాత్రి నగరమంతా రెండు గంటలపాటు భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా నిలిచిన నీళ్లు పూర్తిగా తొలగక ముందే మళ్లీ వర్షం పడడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే -
#HyderabadRains : హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం (ఫొటోలు)
-
విశాఖపట్నం లో మారిన వాతావరణం...భారీ వర్షం (ఫొటోలు)
-
ఢిల్లీలో ఎడతెగని వానలు.. దేశంలో వాతావరణం ఉందిలా..
న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాలు పర్వత ప్రాంతాలు మొదలుకొని నుండి మైదాన ప్రాంతాల్లో ఉండేవారి వరకూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో చాలా రహదారులు మూసుకుపోయాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఎడతెగని వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ఈ రోజు కూడా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా 10 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్లో సగటున 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ అధ్వాన్నంగా మారడంతో ఎక్కడైనా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.వర్షం కారణంగా ఘజియాబాద్లోనిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న ఇంటి పైకప్పు కూలిపోయింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు అందులోనే సమాధి అయ్యారు. రాజస్థాన్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సాధారణంగా పగటిపూట మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం కురియనుంది. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం 117 రహదారులపై ట్రాఫిక్ను నిలిపివేశారు. శనివారం సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఓ మోస్తరు వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇది కూడా చదవండి: చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు ! -
‘దేవుడా.. ఇంకెన్ని రోజులు’!.. విజయవాడ వరద బాధితుల ఆవేదన (చిత్రాలు)
-
AP Rains: ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
-
రెండు రోజులపాటు కోస్తాంధ్రకు వర్ష సూచన
-
ఉత్తరాంధ్రకు డేంజర్ బెల్స్.. రెడ్ అలర్ట్ జారీ