
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, తెలంగాణ నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న కేరళ తీరం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో రాయలసీమలో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment