పన్ను చెల్లింపుదారులు పెరిగారు | Tax payers have increased in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లింపుదారులు పెరిగారు

Nov 6 2024 5:40 AM | Updated on Nov 6 2024 5:40 AM

Tax payers have increased in Andhra Pradesh

ఆదాయపు పన్ను ఫైల్‌ బేస్‌ వాటా పెరుగుదలలో మూడో స్థానంలో ఏపీ

ఐటీఆర్‌ ఫైల్‌ చేసే మహిళల సంఖ్యలోనూ వృద్ధి

2023–24 అసెస్‌మెంట్‌ ఏడాది ఐటీఆర్‌లపై ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పెరిగా­రని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. ఆదాయపు పన్ను ఫైల్‌ బేస్‌ వాటా పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలి­చిందని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో నిల­వగా.. బిహార్, ఏపీ, రాజస్థాన్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నా­యని పేర్కొ­ంది. 

2023–24 అసెస్‌మెంట్‌ ఏడాది ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌­(ఐటీఆర్‌)లపై ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేది­కను సోమవారం విడు­దల చేసింది. 2023–24 అసెస్‌మెంట్‌ ఏడా­దిలో వ్యక్తిగత ఐటీ­ఆర్‌ ఫైల్‌ చేసిన వారిలో మహిళలు 15 శాతం ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. మహిళలు వ్యక్తిగత ఐటీఆర్‌ ఫైల్‌ చేసిన టాప్‌ రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చి­మబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నా­యని తెలి­పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement