తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన ముప్పు | Tungabhadra Express missed threat | Sakshi

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన ముప్పు

Nov 18 2022 4:48 AM | Updated on Nov 18 2022 4:48 AM

Tungabhadra Express missed threat - Sakshi

గద్వాల స్టేషన్‌లో నిలిచిపోయిన రైలు

కర్నూలు (రాజ్‌విహార్‌): కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ (17024)కు ముప్పు తప్పింది. గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు రైలు కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. గద్వాల స్టేషన్‌ వద్ద రైలు ఇంజన్‌కు ఉన్న లింక్‌ హుక్‌ తెగిపోవడంతో బోగీలు విడిపోయాయి.

అప్రమత్తమైన లోకో పైలెట్‌ రైలును నెమ్మదించి ఆపై నిలిపివేశారు. దీంతో ఇంజన్‌ సుమారు 10 మీటర్ల దూరం వెళ్లి నిలిచిపోయింది. రైల్వే అధికారులు మరో ఇంజన్‌కు బోగీలను అమర్చి పంపించారు. దీంతో రైళ్ల రాకపోకలకు గంటకు పైగా అంతరాయం ఏర్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement