
బస్సు ఢీకొని యువకుడికి గాయాలు
సిద్దవటం: బస్సు ఢీకొని యువకుడు గాయపడ్డారు. మండలంలోని సంటిగారిపల్లె గ్రామానికి చెందిన ప్రదీప్కుమార్రెడ్డి సేల్స్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా సిద్దవటం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. కడప నుంచి బద్వేల్ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. ప్రదీప్కు తీవ్ర గాయాలవడంతో కడప రిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. ప్రదీప్కుమార్రెడ్డి తండ్రి రామక్రిష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మదనపల్లె : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ సీఐ ఎరిషావలి తెలిపారు. గత మార్చి 22న గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలోని బెంగళూరు బస్టాండులో మద్యం తాగి అపస్మారస్థితిలో పడిపోయారు. స్థానికులు 108 అంబులన్స్ వాహనంలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం స్వల్పంగా కోలుకున్న అతడు తన పేరు జయరాం(55)గా పేర్కొన్నారు. ఇతర వివరాలు ఏమీ తెలపలేని స్థితిలో ఉండగా, పరిస్థితి విషమించి 31న తిరుపతి రూయా ఆస్పత్రిలో మృతిచెందాడు. అతని సంబంధీకులు వన్టౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సీఐ కోరారు.

బస్సు ఢీకొని యువకుడికి గాయాలు