annamayya district Latest News
-
గొంతు కోశారా.. తనే కోసుకున్నాడా ?
పెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లి పంచాయతీ సొన్నువారిపల్లికి చెందిన సోమశేఖర్ (40) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి వెళ్లిపోయారనే విషయం గురువారం సంచలనం రేకెత్తించింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమశేఖర్కు సంబంధించిన భూమిలోని ఇంటి స్థలాన్ని ఇదే గ్రామానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి వేరే వ్యక్తికి 2023లో విక్రయించాడు. కొనుగోలు చేసిన వ్యక్తి సదరు స్థలంలో పునాదులు వేస్తుండగా సోమశేఖర్ అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వివాదాస్పదంగా మారిన స్థలాన్ని సర్వేయర్ కొలతలు వేయగా విక్రయించిన స్థలం సోమశేఖర్దేనని అధికారులు ధ్రువీకరించారు. అప్పటి నుంచి తన పరువు పోయిందని భావించిన ఉద్యోగి వారిపై కక్ష పెంచుకున్నాడు. అనంతరం కొంత కాలానికి ప్రభుత్వ ఉద్యోగి కొంత మందితో సోమశేఖర్ కుటుంబ సభ్యులపై దాడి చేయించి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. ఈ తరుణంలో ఇటీవల మళ్లీ కక్ష పెంచుకున్న ఉద్యోగి వారి సమీప బంధువైన మహిళను తెరమీదకు తెచ్చి పునాదులు మళ్లీ తవ్విస్తుండటంతో సోమశేఖర్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం మద్యం మత్తులో ఉన్న సోమశేఖర్ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ కలహాల కారణంగా సోమశేఖరే మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకుని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. కాగా పోలీసుల సమగ్ర దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
ఆలయ కమిటీ సభ్యుల నుంచి ప్రాణహాని
మదనపల్లె : రామసముద్రం మండలం బల్లసముద్రం గ్రామంలోని వాలీశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆలయ అర్చకులు లోక్ నాథ్ దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మదనపల్లె ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయానికి వంశపారంపర్యంగా తమ కుటుంబ సభ్యులే ప్రధాన అర్చకులుగా ఉన్నారన్నారు. ఆలయంలో పూజా కై ంకర్యాలు నిర్వహించేందుకు 124 ఎకరాల ఇనాము భూములు ఉన్నాయన్నారు. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ఈ ఆలయానికి ఇటీవలే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు, షామియానాలు, ఇతర సౌకర్యాలను, సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ ప్రధాన అర్చకుడైన తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. దీంతో ఆలయ ఆవరణలో క్యూ లైన్లు ఏర్పాటు చేస్తుండగా, నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యులు నందకుమార్, మల్లికార్జునలు తనపై దౌర్జన్యం చేస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారన్నారు. దేవదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ కమిటీ సభ్యులుగా ఒకే కుటుంబానికి చెందిన వారిని తీసుకోవడంపై సీఎంకు ఫిర్యాదు చేశామన్నారు. నందకుమార్, శ్రీరాములు, మల్లికార్జున, గంగన్న, రామకృష్ణ, చిన్నరాయప్ప వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని, కమిటీలో సభ్యులుగా ఎలా నియమించారో అర్థం కావడం లేదన్నారు. వీరందరి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. -
మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణ పనులు పూర్తయిన వెంటనే నిర్వహించే మహా సంప్రోక్షణకు తిరుమల–తిరుపతి దేవస్థానం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రధాన గోపురాన్ని భక్తులు వీక్షించేందుకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. కొన్ని నెలల తర్వాత గర్భాలయంలోని సీతారామ లక్ష్మణ మూర్తుల దర్శన భాగ్యం కల్పించనున్నందున ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుందని టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు తెలిపారు. ఇందులోభాగంగా మార్చి 6 నుంచి 8 వతేదీ వరకు సాయంత్రం 5 గంటలకు అఖండ రామనామ భజన సంకీర్తనలు, శ్రీమద్రామాయణ సంగీత స్వరార్చన, రామాయణ ఉపన్యాసాలు జరుగుతాయన్నారు. -
రాజంపేట బైపాస్లో వృద్ధుడి దుర్మరణం
రాజంపేట : రాజంపేట బైపాస్ రహదారిలో గురువారం సుంకేసుల చౌడుసాహెబ్(68) అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. తెల్లవారుజామున ఉస్మాన్ నగర్లోని తన కుమారుడి టీ దుకాణం వద్ద నుంచి బైపాస్లోకి బయలుదేరాడు. బైపాస్ క్రాస్ సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐదు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం సిద్దవటం : మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను గురువారం స్వాధీనం చేసుకున్నామని సిద్దవటం ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. సిద్దవటం మండలం డేగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన ఒక రైతు 100 డయల్ ఫోన్ కాల్ ద్వారా ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేయడంతో ఒంటిమిట్ట సీఐ బాబు ఆదేశాల మేరకు తమ సిబ్బందితో వెళ్లి దాడులు చేశామన్నారు. డేగనవాండ్లపల్లె గ్రామ సమీపంలో ఉన్న పెన్నానదిలో 3 ఇసుక ట్రాక్టర్లను, బండికనుమ వద్ద నుంచి కడపకు వెళుతున్న 2 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను సిద్దవటం పోలీసు స్టేషన్కు తరలించి, కడప మైన్స్ అఽధికారులకు రెఫర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్రెడ్డి, పోలీసులు రామకుమార్, శివప్రసాద్ పాల్గొన్నారు. వేగంగా వెళుతున్న వాహనంలో మంటలు గుర్రంకొండ : వేగంగా రోడ్డుపై వెళుతున్న బొలేరో వాహనంలోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పి, వాహనం ముందు భాగం మొత్తం కాలిపోయిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. పెద్దమండ్యం మండలానికి చెందిన రెడ్డెయ్య అనే వ్యక్తి టమాటా లోడుతో గురువారం కలకడ టమాటా మార్కెట్కు బయలుదేరాడు. మార్గమధ్యంలో గుర్రంకొండకు సమీపంలోని శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం వద్ద బొలేరో వాహనం ముందుభాగం ఇంజిన్ వైపు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో డ్రైవర్ రెడ్డెయ్య ఉక్కిరిబిక్కిరి అయిపోయి వెంటనే వాహనం నిలిపేసి దిగిపోయాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడి వాహనం ముందుభాగం మొత్తం కాలిపోయింది. వాహనంలోని ఇంజిన్ భాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
– మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి రామాపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్డు, డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. బాల్య వివాహంపై ఏఎస్పీ విచారణ పెనగలూరు : పెనగలూరు మండలం, ఈటమాపురం గ్రామానికి చెందిన ఓ బాల్య వివాహంపై ఏఎస్పీ మనోజ్ హెగ్డే గురువారం విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్లో ఈ బాల్య వివాహంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహం 2024లో జరిగినట్లు తెలిసింది. ఈ కేసుపై పూర్తి వివరాలు సేకరించాలని ఎస్ఐను ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్లో కేసుల పురోగతిపై ఆరా తీశారు. స్టేషన్లో రికార్డులను కూడా ఏఎస్పీ పరిశీలించారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట రూరల్ సీఐ రమణ, పెనగలూరు ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాలివీడు యువకుడి మృతి గాలివీడు : తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె పంచాయతీ కస్పాకు చెందిన షేక్ ఫకీర్ బాషా(21) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షేక్ హిదాయతుల్లా, రషీదా దంపతుల ఇద్దరు సంతానంలో కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఫకీర్ బాషా తిరుపతిలోని మోహన్ బాబు కాలేజీలో బి.ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సహచర విద్యార్థినితో కలిసి ద్విచక్రవాహనంపై వివాహానికి వెళ్లి వస్తుండగా నాయుడుపేట– పూతలపట్టు ప్రధాన రహదారిలో టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. చదువు పూర్తి చేసుకుని తమకు చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చిన్నవయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయా అంటూ కుటుంబ సభ్యుల రోదనలతో బొరెడ్డిగారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె : ఒంటరి జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. పోతబోలు పంచాయతీ సిద్ధమ్మగారి పల్లెకు చెందిన కృష్ణప్ప, హసీనాబీ దంపతులకు బి.శంకర్ బాబు, బి.గిరి(45) ఇద్దరు కుమారులు ఉన్నారు. శంకర్ బాబుకు వివాహమై మదనపల్లెలో నివాసం ఉండగా, గిరికి వివాహం కాకపోవడంతో తల్లి హసీనాబీతో కలిసి ఉపాధి నిమిత్తం బెంగళూరులో ఉండేవాడు. ఏడాది క్రితం తండ్రి కృష్ణప్ప మరణించడంతో స్వగ్రామం సిద్ధమ్మగారి పల్లెకు వచ్చి అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. స్థానికంగా కూలి పనులకు వెళ్తూ జీవించేవారు. వివాహ వయసు దాటినా పెళ్లి కాకపోవడంతో, గిరి తీవ్ర మనస్తాపానికి గురై వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం మత్తులో పనులకు సైతం వెళ్లకుండా ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మనస్తాపంతో ఇంట్లోనే ఉరి వేసుకు ని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతున్నాడు. దీంతో తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. రైలు కింద పడి.. కురబలకోట : కురబలకోట–సీటీఎం రైల్వే మార్గంలో బుడ్డారెడ్డిగారిపల్లె సమీపంలో గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి (45) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మవరం నుంచి నర్సాపూర్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బుడ్డారెడ్డిగారిపల్లె వద్దకు రాగానే ఒక్క ఉదుటున రైలు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైలింజన్ డ్రైవర్ ఫిర్యాదు చేసినట్లు కదిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాషా తెలిపారు. శరీరం గుర్తు పట్టలేనంతా ముద్దగా మారింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో.. మదనపల్లె : అనారోగ్యంతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని బసినికొండకు చెందిన రామిరెడ్డి కుమారుడు పద్మనాభ రెడ్డి (57) పిండి మిషన్ నడుపుతూ జీవించేవాడు. ఇతనికి భార్య శ్రావణి, కుమార్తె భవ్య శ్రీ , కుమారుడు జస్వంత్ రెడ్డి ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. పద్మనాభ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా పేగు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వారం రోజుల క్రితం అతని చెల్లెలు అనారోగ్య కారణాలతో మృతి చెందింది. ఈ కార్యానికి హాజరయ్యేందుకు వచ్చిన బంధువులు ఇంట్లోనే ఉన్నారు. తనకు వ్యాధి నయం కాలేదన్న మనస్థాపంతో పుంగనూరు రోడ్డులోని మొలకలదిన్నె సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ చంద్రమోహన్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని వద్ద సూసైడ్ నోట్ లభించింది. అనారోగ్యంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కలా వెంకటరమణ తెలిపారు. -
రెవెన్యూ రికార్డుల్లో జాడలేని చిట్టిబోయనపల్లె
గుర్రంకొండ : మండలంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం రెవెన్యూ రికార్డుల్లో కనిపించకుండా పోయింది. ఈ గ్రామానికి చెందిన రైతులు గుర్తింపు కార్డుల కోసం రోజుల తరబడి రైతు సేవా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కనీసం ముటేషన్ చేద్దామనుకున్నా ఆన్లైన్లో చిట్టిబోయనపల్లె గ్రామానికి సంబంధించి వివరాలు కనిపించడం లేదు. ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లో చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామానికి చెందిన వందలాది ఎకరాల భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 1800 ఎకరాలు 328 మంది రైతులు మండలంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం పరిధిలో మొత్తం 1800 ఎకరాలు భూములు ఉండగా అందులో 328 మంది రైతులు వ్యవసాయం చేసుకొంటున్నారు. 2005 సంవత్సరం ముందు వరకు అవి శోత్రియం భూములుగా ఉంటూ అక్కడి రైతులకు తమ భూములపై ఎలాంటి హక్కులుగానీ, పట్టాదారుపాసుపుస్తకాలు గానీ ఉండేవి కావు. మండలంలోని అన్ని గ్రామాలకు ప్రభుత్వ పథకాలు అందినా చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఎలాంటి ప్రభుత్వ పథకాలుగానీ, పంటసాయంగానీ అందేవి కావు. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత 50 ఏళ్ల శోత్రియం భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. అప్పట్లో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎవరైతే సదరు భూముల్లో చాలా కాలం నుంచి వ్యవసాయం చేసుకొంటున్నారో ఆ రైతులందరికి ఎనిమిది విడతలుగా పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేశారు. అప్పటి నుంచి రైతులకు అన్ని ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంకుల్లో రుణాలు అందుతున్నాయి. ఆన్లైన్లో నమోదు కాని రైతు గుర్తింపు కార్డులు.. మండలంలోని అన్ని గ్రామాల్లో రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో మాత్రం ఇంతవరకు ఒక్కరైతుకు గుర్తింపు కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదు. రైతు సేవా కేంద్రంలో వ్యవసాయశాఖ సిబ్బంది. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక వెబ్సైట్లో చిట్టిబోయనపల్లెకు చెందిన రైతుల వివరాలు మొదట్లో నమోదు చేస్తున్నారు. భూమి పాసుపుస్తకం, రైతు ఆధార్ కార్డు నంబరు ఆన్లైన్లో నమోదు చేసిన తరువాత రైతు సెల్ఫోన్కు రెండు సార్లు ఓటీపీలు వస్తున్నాయి. చివరగా వెబ్సైట్లో ల్యాండ్ మార్కింగ్ దగ్గరకి వెళితే మాత్రం చిట్టిబోయన పల్లె రెవెన్యూ గ్రామానికి సంబంధించిన భూముల వివరాలు గానీ, సర్వే నంబర్లుగానీ చూపించడంలేదు. ప్రతిరోజు ఎన్ని మార్లు ప్రయత్నించినా చివరకు ఇదే ఫలితం వస్తోందని సిబ్బంది, రైతులు వాపోతున్నారు. గడువు ముగుస్తుండడంతో రైతుల ఆందోళన.. రైతుగుర్తింపు కార్డు నమోదు, జారీ ప్రక్రియ గడువు ముగుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత పది రోజులుగా మండలంలో రైతు గుర్తింపు కార్డు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మండల వ్యాప్తంగా 3548 మంది రైతు గుర్తింపు కార్డులు వెబ్సైట్లో నమోదు చేశారు. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువు విధించింది. అయితే చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఇంతవరకు ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ జరగలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రోజుల తరబడి రైతుసేవాకేంద్రాల వద్దకు వెళ్లడం అక్కడే పడిగాపులు కాయడంతోనే రోజంతా గడిచిపోతోంది. నిర్ణీత గడువులోగా గుర్తింపుకార్డులు ఇవ్వలేక పోతే తమ పరిస్థితి ఏంటని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలోనూ చిట్టిబోయనపల్లె భూములకు సంబంధించి ఎలాంటి ముటేషన్లు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ వెబ్ల్యాండ్లో చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలోని భూములకు సంబంధించి సమస్య చాలా కాలంగా ఉందనే విషయం ఇప్పుడు వెలుగుచూడడం గమనార్హం. రైతు గుర్తింపు కార్డు కోసం రైతుల పడిగాపులు రోజుల తరబడి రైతుసేవా కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు ఆన్లైన్లో కనిపించని చిట్టిబోయనపల్లె భూములు ఆందోళనలో రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో రైతులకు రైతు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ జరగడం లేదనే విషయం జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గత పది రోజులుగా సమస్య ఉంది. రైతులు రోజు రైతుసేవా కేంద్రాలకు వచ్చి వెళుతున్నారు. రైతుల వద్ద నుంచి తాము జిరాక్స్ కాపీలను తీసుకొని వెబ్సైట్లో సమస్య పరిష్కారం కాగానే సమాచారం అందిస్తామని చెప్పి పంపిస్తున్నాము. నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. – రత్నమ్మ, ఏఓ, గుర్రంకొండ. ముటేషన్లు కావడం లేదు చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో రైతుల పొలాలకు సంబంధించి ముటేషన్లు కూడా కావడం లేదు. రైతుగుర్తింపు కార్డుల జారీలో చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయాధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూములకు సంబంధించి ఆన్లైన్లోనే సమస్య ఉన్నట్లు గుర్తించాము. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. త్వరలొనే సమస్యను పరిష్కరించి రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సహకరిస్తాము. – శ్రీనివాసులు, తహసీల్దార్, గుర్రంకొండ. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
మదనపల్లె : పెట్రోల్ బంకు వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ, తారాస్థాయికి చేరి ఇరు వర్గాల మధ్య దాడికి దారితీసింది. గురువారం రాత్రి మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డు లోని పెట్రోల్ బంక్ వద్ద అరవ వాండ్ల పల్లెకు చెందిన గణేష్, కృష్ణాపురానికి చెందిన హరిల మధ్య వాహనాలకు పెట్రోల్ నింపుకునే విషయమై వివాదం తలెత్తింది. దీంతో ఇరువురు గొడవపడ్డారు. హరి, గణేష్ పై దాడి చేసి కొట్టాడు. ఈ విషయాన్ని గణేష్ తన గ్రామంలోని వారికి తెలియజేశారు. దీంతో 50 మందికి పైగా అరవవాండ్లపల్లి నుంచి కృష్ణాపురం వద్దకు చేరుకున్నారు. ఇది గమనించిన హరి తమ వర్గీయులకు సమాచారం అందించడంతో వారు సైతం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. గమనించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
పి–4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
రాయచోటి: పేదరిక నిర్మూలన – పి4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, వాట్సాప్ పరిపాలన ద్వారా ప్రజలకు అత్యంత చేరువలో సేవలు ఉండాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్–2 పరీక్ష, పేదరిక నిర్మూలన – పి4 సర్వే, ఇంటర్మీడియట్ పరీక్షలు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, వాట్సాప్ పరిపాలన, ఎమ్మెస్ఎంఈ సర్వే, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, సిపిఓ వెంకట్, డీఈఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమీషనర్ వాసు తదితర అధికారులు పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
అమ్మభాషకు అక్షర రూపమిద్దాం !
మదనపల్లె సిటీ : మనకు ఎన్ని భాషలు తెలిసినా మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగేది ఒక్క మాతృభాషలోనే. అలాంటి కమ్మనైన అమ్మభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందులో భాగంగానే వారి వారి మాతృభాషల పరిరక్షణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాషలు కనుమరుగు కాకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా యునెస్కో ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. నాటి నుంచి వారి వారి మాతృభాషలను గౌరవించుకుంటున్నారు. కనీసం 30 శాతం మంది వారి మాతృభాషలను నేర్చుకోకపోయినా.. మాట్లాడకపోయినా ఆ భాష ఉనికికే ప్రమాదమని హెచ్చరించింది. గతం.. ఎంతో ఘనం రాజులు, నవాబుల పరిపాలనలో రాజ్యమేలిన భాషలు తెలుగు, ఉర్దూ. ఈ భాషలు రానురాను ప్రాభవం కోల్పోతున్నాయి. నేడు పాలనలో, పాఠశాలల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ మాతృభాషలు అటు తెలుగు, ఇటు ఉర్దూ అమలు అరకొరగానే ఉంది. తెలుగు వెలుగు కోసం.. తెలుగు వెలుగు కోసం పాలకులు చొరవ చూపాలని తెలుగు భాషాభిమానులు సూచిస్తున్నారు. తెలుగుభాషా రక్షణ, భాషాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను నిధులు, విధులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. మాతృభాషల అభివృద్ధికి ఇలా చేయాలి.. ● రాష్ట్ర స్థాయిలో అధికార భాష, ద్వితీయ అధికార భాష అయిన తెలుగు, ఉర్దూలను నిర్బంధంగా అమలు చేయాలి. ● గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో కూడా జరగాలి. ● ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి శాశ్వత భవనం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తెలుగు, ఉర్దూభాషాభివృద్ధికి వినియోగించాలి. ● పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు మాతృభాషలను నిర్బంధంగా అమలు చేస్తూ ప్రాథమిక స్థాయి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ● తెలుగు, ఉర్దూ అకాడమీలను, అధికారభాషా సంఘాలకు అధికారులు, నిధులు, విధులు ఇచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించి భాషాభివృద్ధికి కృషి చేయాలి. ● పోటీ పరీక్షలన్నింటినీ ఆంగ్లంతో పాటు తెలుగు, ఉర్దూ మాధ్యమ అభ్యర్థులకు 5 శాతం అదనపు మార్కులు కలిపి ప్రశ్నాపత్రాలను తెలుగు, ఉర్దూలో కూడా ఇవ్వాలి. అందరి బాధ్యత అమ్మభాషలో ఉన్న కమ్మదనం ఇతర భాషల్లో ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విడవరాదు. ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా అందరూ సమిష్టిగా మాతృభాషాభివృద్ధికి చొరవ చూపాలి. – వీఎం నాగరాజు, మరసం సభ్యులు, మదనపల్లె. ద్వితీయ అధికార భాషగా ఉర్దూను అమలు చేయాలి రారష్ట్రంలోని 13 జిల్లాలలోనూ ఉర్దూను ద్వితీయ అధికార భాషగా అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా అమలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. తెలుగుతో సమానంగా ఉర్దూలో కూడా కార్యాలయాల్లో ఉత్తర, ప్రత్యుత్తర కార్యక్రమాలు అమలు చేసి ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేయాలి. ఉర్దూ పాఠశాలలు, కళాశాలలు, డైట్లలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. ఒక జాతి మనుగడ వారు మాట్లాడే మాతృభాషపైన ఆధారపడి ఉంటుంది. – మహమ్మద్ఖాన్, రూటా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మదనపల్లె. జాతి మనుగడకు భాషే ఆధారం అమ్మ ఉగ్గుపాలతో నేర్చుకు న్న భాషను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తెలుగువారైన మనందరిపైనా ఉంది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు మన తెలుగుభాష ను అందించాలి. ఒక జాతి మనుగడ, వారు మాట్లా డే మాతృభాషపైన ఆధారపడి ఉంటుంది. తెలుగుభాషాభివృద్ధిలో భాగంగా ఏర్పాటైన తెలుగు అకాడమీలను బలోపేతం చేయాలి. – టీఎస్ఏ కృష్ణమూర్తి, ప్రముఖ నవలా రచయిత, మదనపల్లె. తల్లిదండ్రుల పాత్ర కీలకం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేటి తరం పిల్లలకు అమ్మభాషపై ఆసక్తి కలిగించేందుదకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక భాష విలసిల్లాలంటే దాన్ని మాట్లాడే వ్యక్తులు అధికంగా ఉండాలి. పరభాషలు నేర్చుకునే ప్రయత్నంలో అమ్మభాషకు అన్యాయం చేయకూడదు. – అంజలి, ఉపాధ్యాయురాలు, మదనపల్లె. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం -
23 నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
రాయచోటి టౌన్: రాయచోటి భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి బ్రహ్మోత్సవాలు నెల 23వ నుంచి మార్చి 5 వరకు జరనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి గురువారం ప్రధాన అర్చకులు, ఆలయ ఈవో రమణారెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాయచోటి సబ్ జైల్ తనిఖీ రాయచోటి టౌన్: రాయచోటి సబ్ జైల్ను రాష్ట్ర సేవాధికార సంస్థ ఉమ్మడి కడప జిల్లా సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫకృద్దీన్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబర్ 15100 తదితర అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పనులపై విచారణ గుర్రంకొండ: మండలంలోని టి.పసలవాండ్లపల్లె పంచాయతీలొ జరిగిన ఉపాధిహామీ పనుల అవకతవకలపై మండల అధికారులు విచారణ జరిపారు. గ్రామంలో జరిగిన పనుల్లో ఉద్యోగుల పేర్లు, పనిచేయని వారి పేర్లతో బిల్లులు చేసుకున్నారని గ్రామస్తులు ఇటివల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలమేరకు ఎంపీడీవో వెంకటేశులు, ఎపీవో జయరామిరెడ్డిలు గరువారం విచారణ నిర్వహించారు. విచారణ శుక్రవారానికి ఫూర్తి చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించినున్నట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. మదనపల్లెలో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం? మదనపల్లె: పట్టణంలోని చంద్ర కాలనీలో పెద్ద మొత్తంలో (80 కిలోలకు) పైగా గంజాయిని గంగవరం పోలీసులు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం మధ్యాహ్నం పోలీసులు తమకు గంజాయి కేసులో దొరికిన నిందితుడిని విచారిస్తుండగా మదనపల్లె పట్టణం చంద్ర కాలనీలో పెద్ద మొత్తంలో గంజాయి నిల్వ ఉంచినట్లు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకొని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో సుమారు 80 కిలోల పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది...తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.... పట్టుబడిన గంజాయి, ముగ్గురు నిందితులను టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. తర్వాత నిందితులను, గంజాయిని డీఎస్పీ కార్యాలయానికి తరలించి, ఎక్కడ నుంచి రవాణా జరిగింది ఇందులో కీలక సూత్రధారులు ఎవరు, ఎన్నాళ్లుగా జరుగుతుంది అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే మదనపల్లె డీఎస్పి కొండయ్య నాయుడును గంజాయి స్వాధీనం చేసుకున్న విషయమై వివరణ అడిగితే... తమకు గంగవరం పోలీసుల నుంచి సమాచారం వచ్చింది వాస్తవమేనని, స్థానిక పోలీసులతో బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు సరుకు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అదుపులోకి తీసుకోవడం చేయలేదన్నారు. అయితే మదనపల్లె పట్టణంలో గంజాయి పెద్ద మొత్తంలో దొరకడం వెనక ఇంటెలిజెన్స్, ఎస్బి పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బి.కొత్తకోట ఎంపీపీపై అవిశ్వాసం బి.కొత్తకోట: బి.కొత్తకోట మండల పరిషత్ అధ్యక్షురాలు లక్ష్మీనరసమ్మపై వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఆవిశ్వాస తీర్మానం కోరుతూ ఎంపీడీఓ మంగళం శంకరయ్యకు ఈనెల 10న నోటీసు అందజేసిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. 2020 మార్చిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మండలానికి చెందిన 11 మంది ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. తర్వాత కోవిడ్ ప్రభావంతో 2021 సెప్టెంబర్ 19న ఎంపీటీసీ సభ్యులుగా మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నిక అనంతరం గుమ్మసముద్రం ఎంపీటీసీ లక్ష్మినరసమ్మను ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో 11 మంది ఎంపీటీసీల్లో తొమ్మిది మంది ఆమైపె అవిశ్వాసం ప్రకటిస్తూ ఎంపీడీఓకు నోటీసు అందించారు. ఈ నోటీసులో సంతకాలు చేసిన ఎంపీటీసీల్లో వి.ఖాదర్వలీ (తుమ్మనంగుట్ట), ఎన్.రాధ (సూరపువారిపల్లి), వి.రామసుబ్బారెడ్డి (నాయనబావి), సి.ఎల్లప్ప (బీరంగి),ఎ.సుబ్బయ్య (బడికాయలపల్లి), ఎ.గౌతమి (మొటుకుపల్లి), బి.ఈశ్వరమ్మ (కోటావూరు), సి.విమలమ్మ (గోళ్లపల్లి), ఆకుల బాలకృష్ణ (గట్టు) ఉన్నారు. మిగతా రెండు ఎంపీటీసీల్లో ఒకరు ఎంపీపీ కాగా మరొకరు బయ్యప్పగారిపల్లి ఎంపీటీసీ ఎ.రమాదేవి ఉన్నారు. ఈ అవిశ్వాస నోటీసులో..ఎంపీటీసీలైన తమ పట్ల ఎంపీపీ నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తూ అభివృద్ధి ప్రతిపాదనలను ఖాతరు చేయడం లేదని పేర్కొన్నారు. కాగా ఈ అవిశ్వాస నోటీసుపై గురువారం చిత్తూరు జెడ్పీ కార్యాలయంలో అధికారులు చర్యలు చేపట్టారు. -
అధికారులూ.. మీకిది తగునా?
టాస్క్ ఫోర్స్: ప్రజా ప్రతినిధులతో అధికారులు కలవడం పాలనలో ఒక భాగం..కానీ నేడు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అంట కాగుతూ...వారి సేవల్లో కొంతమంది అధికారులు విధులకు డుమ్మా కొట్టి తరిస్తుండటంపై సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది వారి విధులను ప్రక్కన పెట్టి రాజకీయ నాయకుల దృష్టిలో పడేందుకు అనేక రకాల పాట్లు పడుతున్నారు. ఈ కోవలోనే జిల్లాకు చెందిన మంత్రి మేనల్లుడు తిరుమలకు వెళుతుండగా ఆయన ఆశీస్సుల కోసం రాయచోటికి చెందిన కొంతమంది మున్సిపల్, పోలీస్, ఇతర శాఖలకు చెందిన అధికారులు పూల బొకేలు, భారీ దండలతో స్వాగతాలు పలకడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉన్నతాధికారుల సైతం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నట్లు తెలియవచ్చింది. అధికారులారా మీకు ఇది తగునా అంటూ అనేక మంది చర్చించుకోవడం విశేషం. -
చిగురిస్తున్న ఆశలు!
సాక్షి రాయచోటి: మామిడి రైతుల ఆశలు చిగురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో...అనుకోకుండా వచ్చిన తుఫాన్లు, మంచు ప్రభావంతో జనవరి చివరి వరకు పూత కనిపించలేదు. అయితే పరిస్థితులు మారడం, ఎండ ప్రభావానికి తోడు ఆలస్యంగా పూత వస్తుండడంతో మామిడి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం తోటల్లో ఎక్కడ చూసినా పూతతో చెట్లు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే అరకొరగా పూతతో కనిపించిన చెట్లు ప్రస్తుతం పిందెలతో దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 37 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉండగా, అందులో సుమారు 30 రకాలకు పైగా మామిడి కాయలను సాగు చేస్తున్నారు.ఆలస్యంగా కనిపిస్తున్న పూతజిల్లాలోని మామిడి తోటల్లో ప్రస్తుతం పూత కనిపిస్తోంది. మామిడి పంటకు సంబంధించి సాధారణంగా డిసెంబరు, జనవరిలోనే పూత కనిపించాల్సి ఉండగా, ఈసారి ఆలస్యంగా అగుపిస్తోంది. చాలామండలాల్లో ఇప్పుడిప్పుడు పూత వస్తుండడంతో మామిడి రైతులు పంటపై ఆశలు పెట్టుకుంటున్నారు. మరోప్రక్క పూత రాలిపోకుండా వేగవంతంగా పురుగుమందులను పిచికారి చేస్తూ కాపాడుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఏది ఏమైనా ఆలస్యంగానైనా పూత రావడంతో మామిడి రైతుల్లో ఆశల మోసులు వికసిస్తున్నాయి. యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.జిల్లాలో 37 వేల హెక్టార్లలో మామిడి సాగుజిల్లాలో సుమారు 37 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించాయి. ప్రధానంగా రైల్వేకోడూరు ప్రాంతంలో అధికంగా మామిడి సాగు ఉండగా, ఆతర్వాత రాయచోటి, రాజంపేట, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల్లోనూ మామిడి తోటలు సాగులోఉన్నాయి. ఏడాదికేడాదికి మామిడి సాగు పెరుగుతూ వస్తోంది. రానురాను మామిడికి జిల్లా ప్రసిద్ది చెందుతోంది. అన్ని రకాల కాయలను సాగు చేస్తూ ఇక్కడి రైతులు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతులు చేస్తున్నారు. ఈసారి పూత ఆలస్యంగా రావడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే పూతకు తగ్గట్టుగా కాయలు దిగుబడి రావాలని రైతాంగం ఆశిస్తోంది.● నాలుగు నెలలపాటు మార్కెట్లో కాయలుజిల్లాలో పండించిన పంటకు ఇతర రాష్ట్రాల్లో కూడా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ బేనీషా, లాల్ బహార్, బెంగుళూర, నీలం, మల్గూబ, తోతాపురి, ఇమామ్ పసంద్తోపాటు ఇతర అనేక రకాల కాయలు మార్కెట్లోఉంటాయి. ప్రధానంగా రైల్వేకోడూరు ప్రాంతంలోని మార్కెట్ మామిడితో కళకళలాడనున్నాయి. అంతేకాకుండా రైల్వేకోడూరు మార్కెట్ నుంచి ఢిల్లీ, హరియాణ, చండీఘర్, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు నిత్యం కాయలు రవాణా అవుతుంటాయి. అంతేకాకుండా జిల్లాలోని వీరబల్లి ప్రాంతంలో పండించిన బేనీషాకు అధిక డిమాండ్ఉంటుంది. కాయలు నాణ్యతతో ఉండడంతోపాటు మంచి రంగుతో రుచికరంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం ఈ ప్రాంత మామిడిని ఇష్టపడుతున్నారు. జిల్లాలో మామిడికాయలు ఏప్రిల్ నుంచి జులై వరకు నాలుగునెలలపాటు మార్కెట్లలో సిద్దంగా ఉండనున్నాయి. -
వన్యప్రాణులు విలవిల!
● ఎండ తీవ్రతతో అల్లాడుతున్న మూగ జీవాలు ● అడవిదాటుతున్న నేపథ్యంలో..ప్రాణాలకు ముప్పు ● ప్రత్యామ్నాయం చేపట్టని సర్కారు రాజంపేట: వేసవి ముంసుకోస్తోంది.. ఫిబ్రవరి మాసం నుంచే వన్యప్రాణులు దాహార్తితో అలమటిస్తున్నాయి.అడవిని దాటుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నారు. వీటి సంరక్షణకు అవసరమయ్యే నిధులను ఇప్పటి ప్రభుత్వం సరిపెట్టలేకపోతోందన్న అపవాదును మూటకట్టుకుంది. కంపానిధులు, బయోసాట్ పథఽకాల కింద నిధులు విడుదల కాలేదు. దీంతో నీటి ట్యాంకర్లతో నీటిని నింపేందుకు అటవీశాఖ ఆపసోపాలు పడుతోంది. వేసవిలో వన్యప్రాణులు సంరక్షణపై నీలినీడలు అలుముకున్నాయి. రేంజ్లిలా.. వైఎస్సార్ జిల్లా రేంజ్ పరిధిలో కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ల ,బద్వేలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పరిధిలో రాజంపేట, చిట్వేలి, సానిపాయి, బాలపల్లె, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు రేంజ్లున్నాయి. జనారణ్యంలోకి.. ఉభయ జిల్లాలో ఉన్న అభయారణ్యాల్లో వన్యప్రాణులు నీటి కోసం అలమటిస్తున్నాయి. అవి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయారణ్యాల్లో వీటి దాహార్తి తీర్చేందుకు అటవీపల్లెల వైపు చూస్తున్నాయి. మరోవైపు అడవికి నిప్పురాజుకున్న క్రమంలో వన్యప్రాణాలు గందరగోళ పరిస్ధితులో పడి ప్రాణాలు కాపాడుకునేందుకు అటవీ శివారుపల్లె వైపు పరుగులు తీస్తున్నాయి. మరికొన్ని ఆహారం, నీటి కోసం కూడా వచ్చి ప్రాణాలు పొగుట్టుకుంటున్నాయి. గురువారం సిద్ధవటం రేంజ్లో ఇలాంటి సంఘటన చోటుచేసుకున్న సంగతి విధితమే. ● వేసవి ప్రారంభానికి ముందే ఫిబ్రవరి మాసంలోనే భానుడు ప్రచండ నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక అటవీ ప్రాంతంలో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకడం గగనంగా మారడం గమనార్హం.భానుడిసెగతో వన్యప్రాణులు విలవిల లాడుతున్నాయి. పగలు కన్నా..రాత్రుల్లోనే నీటికోసం.. అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులు పగలుకన్నా..రాత్రుల్లోనే నీటికోసం అటవీ గ్రామాల శివారుల్లోకి వచ్చేస్తున్నాయి. రాత్రి వేళలో తోటల్లోకి వచ్చి నీటి కోసం పరుగులు తీస్తున్నాయని ప్రత్యక్షంగా చూసిన రైతులు అంటున్నారు. వీటి వల్ల తోటలకు ఎటువంటి హాని ఉండదని, ఏనుగులతో హాని ఉంటుందని చెబుతున్నారు. తెల్లవారుజాము వరకు మైదాన ప్రాంతంలోనే దాహార్తి తీర్చుకొని సేద తీరుతుంటాయి. గుక్కెడు నీటి కోసం పక్షులు, జంతువులు నీటి చలమలను వెతుకొంటూ వస్తున్నాయి. జిల్లా రేంజ్లు విస్తీర్ణం(హెక్టారు) అభయారణ్యాలు: శేషాచలం, లంకమల, పెనుశిల, నల్లమల వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు చర్యలు వన్యప్రాణాలు దాహార్తి తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ఫిబ్రవరి నుంచి వేసవి పరిస్ధితులు తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సాసర్పిట్, నీటి కుంటల్లో నీటిని నింపుతాము. 130 సాసర్పిట్స్లో రెండురోజులకొకసారి నీటితో నింపుతున్నాం. వన్యప్రాణులతో పాటు అడవులను కాపడుకునే బాధ్యత తీసుకున్నాం. –జగన్నాథ్సింగ్, జిల్లా అటవీ అధికారి, రాజంపేట వైఎస్సార్ 9 2లక్షల94వేలు అన్నమయ్య 8 2లక్షల74వేలు -
దళితులపై దాష్టీకం
కూల్చివేసిన దళితుల గృహాలు రాజంపేట రూరల్: కూటమి నాయకుల దాష్టీకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి.వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్గా కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో దళితుల గృహాలు కూల్చివేయడమే ఇందుకు నిదర్శనం. వివరాలు.. రాజంపేట మండల పరిధిలోని కూచివారిపల్లి పంచాయతీ కొమ్మివారిపల్లి దళితవాడలో వైఎస్సార్సీపీకి చెందిన గొంటు సుబ్బమ్మ, మద్దూరి సుబ్బలక్ష్మి, గొంటు ఈశ్వరమ్మలు ప్రభుత్వం అందజేసిన భూమిలో గృహాలను నిర్మించుకున్నారు.జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలతో సబ్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి, తహసీల్దార్ పీర్మున్నీ, మన్నూరు సీఐ మహమ్మద్ అలీ దగ్గరుండి గృహాల కూల్చి వేతకు బుధవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. పోలీసు బలగాలు, జేసీబీలతో రెవెన్యూ అధికారులు దళితవాడ వద్దకు వచ్చారు. తమ వద్ద ఉన్న పట్టాలను దళితులు చూపించినా కనికరం చూపలేదు. నోటీసులు ఇవ్వకుండా వచ్చారు కదా సమయం ఇవ్వండి అని వేడుకున్నా కరుణించలేదు. పేదలం.. గృహాలను కూల్చవద్దని ప్రాధేయ పడినా వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసుల పహారాలో బుధవారం రాత్రి 10గంటల వరకు కూల్చివేతలను కొనసాగించారు. ప్రభుత్వ భూమి అని చెబుతున్నా రెవెన్యూ అధికారులు దళితుల గృహాల పక్కనే ఉన్న కూటమి ప్రభుత్వానికి చెందిన వారి గృహాల వైపు కన్నెత్తి కూడా చూడక పోవటం గమనార్హం. ● దళితుల గృహాలను కూల్చివేయటం దుర్మార్గపు చర్య: ఆకేపాటి 2 సంవత్సరాల కిందట దళితులు నిర్మించుకున్న గృహాలను అధికార యంత్రాంగం దౌర్జన్యంగా కూల్చివేయటం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మండి పడ్డారు. కొమ్మివారిపల్లి దళితవాడలో బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేసిన దళితుల గృహాలను గురువారం ఎమ్మెల్యే ఆకేపాటి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఆకేపాటి రాగానే దళితులు పెద్ద ఎత్తున రోదిస్తూ తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. రెక్కాడితే కానీ డొక్కాడని దళితులమైన మేము అగ్రకులాల వారి మధ్య గృహాలను నిర్మించుకున్నందున కుల వివక్షతో కూల్చేశారని బోరున విలపించారు. కూల్చవద్దని ప్రాధేయ పడుతున్నా వినలేదని, మహళలు అని చూడకుండా మా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారంటూ విలపించారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు జిల్లా అభివృద్ధికి దోహదపడాలి కానీ కూల్చివేతలకు ఆదేశాలివ్వడం తగదన్నారు. అధికారులు పక్ష పాత ధోరణి విడనాడాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో గృహాలను కూల్చివేయాల్సిన అవసరం అధికారులకు ఏముందని నిలదీశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సమస్యలు సృష్టిస్తే సహించేది లేదన్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఎపుడూ లేని విష సంస్కృతికి బీజం వేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నించటం సరి కాదన్నారు. దళితులకు నష్ట పరిహారం చెల్లించి, గృహాలను నిర్మించే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. దళితులను ఆదుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నరు. ● ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఏబీ సుదర్శన్రెడ్డి, మూరి గోవర్ధన్రెడ్డి, పాటూరు భరత్కుమార్రెడ్డి, అనుదీప్, వైఎస్సార్సీపీ నాయకులు పీ.విశ్వనాథరెడ్డి, కే. గోపిరెడ్డి, జేవీ కృష్ణారావు, జీ. త్రినాథ్, డి. బాస్కర్రాజు, శంకరయ్యనాయుడు, ఏ.సౌమిత్రి, ఎస్.నవీన్కుమార్, ఏ. వరదరాజు, దండు గోపీ, దాసరి పెంచలయ్య, జీవీ సుబ్బరాజు, ఆర్.కమలాకర్, ఆర్.గురుమూర్తి, ఏ.మధుబాబు, కె.రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్గా కక్షసాధింపు ముగ్గురికి సంబంధించిన గృహాల కూల్చివేత బాధితులను పరామర్శించిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి -
కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : బాకీ చెల్లించలేదనే మనస్థాపంతో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. చంద్ర కాలనీకి చెందిన రామమూర్తి కుమారుడు రెడ్డి శేఖర్ (32) స్థానికంగా ఓ వ్యక్తికి నగదు అప్పుగా ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో బాకీ చెల్లించమని పలుమార్లు అడిగాడు. అయినా అతను బాకీ చెల్లించకపోవడంతో దానిపై ఇంట్లో సమస్యలు ఏర్పడి గొడవ జరిగింది. మనస్థాపం చెందిన రెడ్డి శేఖర్ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
విధుల నుంచి తొలగించారు... ఆత్మహత్యే శరణ్యం
ముఖ్యమంత్రికి విద్యుత్ శాఖ ఉద్యోగి బహిరంగ లేఖ ఓబులవారిపల్లె : రాజకీయ ఒత్తిడితో ఉన్న ఫలంగా ఉద్యోగం నుంచి తొలగించారని, తనకు ఆత్మహత్యే శరణ్యమని పసుపులేటి గంగాధర్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. కలత చెందిన అతడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రులు, అధికారులకు బహిరంగ లేఖ పంపారు. బాధితుడి వివరాల మేరకు.. మండలంలోని గొబ్బూరివారిపల్లి 33/11 కెవీ విద్యుత్తు సబ్ స్టేషన్లో రాజంపేట మండలం, శేషమాంభపురం గ్రామానికి చెందిన పసుపులేటి గంగాధర్ సాయి పనిచేస్తున్నాడు. 2024 మార్చి నెలలో తాను డ్యూటీలో చేరారు. ఏడాది కాలంగా జీతం ఇవ్వకపోయినా రోజూ విధులకు హాజరువుతూ లాగ్ పుస్తకంలో సంతకాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అభిషేక్ అనే వ్యక్తి సబ్ స్టేషన్లోని లాగ్ పుస్తకంలో సంతకాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ నెల 17వ తేదీన యథావిధిగా డ్యూటీకి వెళ్లగా తనను షిప్ట్ ఆపరేటర్గా తొలగించినట్లు ఏఈ తెలిపారన్నారు. ఎందుకు తొలగించారని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. తనకు 12 నెలలు జీతం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే తనకు ఆత్మహత్యే శరణమని, అధికారులు లేఖనే మరణ వాంగ్మూలంగా పరిగణించాలని రాశాడు. రైల్వేకోడూరు ఏడీ ఈ భాస్కర్ రావును వివరణ కోరగా ఆపరేటర్లు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు తీసుకోవడం, తొలగించడం జరుగుతుందని, తమకు సంబంధం లేదని వారు తెలిపారు. -
అన్నదమ్ముల మధ్య ఘర్షణ
కాశినాయన : మండలంలోని పాపిరెడ్డిపల్లె గ్రామంలో ఘర్షణ పడిన అన్నదమ్ములు బోడెపాటి శ్రీను, సుబ్బయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు. శ్రీను, సుబ్బయ్యలకు కలిపి మూడు ఎకరాలు భూమి ఉందని, భాగ పరిష్కారాలు కుదరక కోర్టుకు వెళ్లారని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా శ్రీను బుధవారం ఆ పొలంలో షెడ్డు వేసేందుకు వెళ్లాడన్నారు. కోర్టులో కేసు నడుస్తుండగా రేకుల షెడ్డు ఎలా వేస్తావని సుబ్బయ్య అనడంతో మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పది టిప్పర్లు సీజ్ దువ్వూరు : దువ్వూరు గుట్ట నుంచి అక్రమంగా సుద్దను తరలిస్తుండగా.. పది టిప్పర్లు, పొక్లెయిన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తహసీల్దారు అక్బల్బాషా తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి మైదుకూరు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి టిప్పర్లతో అక్రమంగా సుద్ద తరలిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా, మెగా ఇంజినీరింగ్ సంస్థ సుద్ద రవాణా చేస్తోందన్నారు. దీంతో పట్టుకుని పది టిప్పర్లను పోలీసుస్టేషన్కు తరలించామని, ఉన్నతాధికారులు ఆధేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో దొంగలు లింగాల : మండలంలోని వెలిదండ్ల సమీపంలోని చీని తోటలో ఆరు బస్తాల చీని కాయలు చోరీ చేస్తున్న దొంగలను పట్టుకుని రైతులు పోలీసులకు అప్పగించారు. స్థానికుల వివరాల మేరకు.. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చీనీ కాయలు చోరీ చేస్తున్న దొంగలను రైతులు గమనించారు. వారు పరారవుతుండగా వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చీనీ కాయలతోపాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్లను దొంగలించినట్లు రైతులు తెలిపారు. లింగాల, బోనాల గ్రామాలకు చెందిన నలుగురు దొంగలతోపాటు, స్కూటీ, ఆటోను పోలీసులకు అప్పగించినట్లు రైతులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. ఉరివేసుకుని బాలిక ఆత్మహత్య కడప అర్బన్ : కడప నగరంలోని రిమ్స్ పిఎస్ పరిధిలో రామకృష్ణ నగర్లో నివాసం వుంటున్న చిన్నం రమేష్ కుమార్తె జాహ్నవి (15) కుటుంబ సమస్యలతో బుధవారం ఇంటిలో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పదో తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే వుంటున్న బాలిక ఈ చర్యకు పాల్పడిందని తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవమానించిందని మహిళ హత్య వేముల : మండలంలోని కె.కె.కొట్టాల సమీపంలో ఈ నెల 2న జరిగిన సింగంశెట్టి పద్మావతి హత్య కేసును పోలీసులు చేధించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ ఉలసయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కె.కె.కొట్టాల గ్రామానికి చెందిన సింగంశెట్టి పద్మావతి గ్రామ సమీపంలో ఎనుములు మేపుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వెళ్లారన్నారు. పద్మావతిని చంపి ఆమె శరీరంపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారన్నారు. మృతురాలి కుమార్తె గోగుల దివ్య ఫిర్యాదు మేరకు విచారించామని తెలిపారు. మృతురాలు సింగంశెట్టి పద్మావతి తనను అవమానకరంగా మాట్లాడుతుండడంతో చంపాలని సింగంశెట్టి రమేష్ నిర్ణయించుకున్నాడన్నారు. ఈ నెల 2న ఎనుములు మేపుకొనేందుకు పద్మావతి వెళ్లగా.. అక్కడికి వెళ్లిన రమేష్ చేతులకు ప్లాస్టిక్ గ్లౌజులు ధరించి తలపై దాడిచేసి చంపాడన్నారు. మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించాడన్నారు. బుధవారం ముద్దాయి సింగంశెట్టి రమేష్ను అరెస్టు చేసి అతని వద్ద బంగారు గొలుసు, చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు. ధాత్రి పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం కడప కల్చరల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ గల మహిళలకు 2025 సంవత్సరానికి గానూ ధాత్రి పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు చేయనున్నామని వివేకానంద ఫౌండేషన్ అధ్యక్షులు పాపిజెన్ని రామకృష్ణ తెలిపారు. సామాజిక సేవ చేస్తున్నా, మహిళా అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ మృతి
ఓబులవారిపల్లె : గోవిందంపల్లి పంచాయతీ, చెన్నకేశవ గుడి సమీపంలోని జాతీయ రహదారి మలుపు వద్ద రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ దయ్యాల కిరణ్ కుమార్(34) మృతిచెందాడు. బుధవారం మంగళంపల్లి నుండి గాదెల గ్రామానికి రోడ్డు రోలర్ తీసుకొని డ్రైవర్ కిరణ్ కుమార్ బయలుదేరాడు. జాతీయ రహదారిపైకి వచ్చే మలుపు వద్ద రోలర్ను అదుపు చేయలేకపోవడంతో కిరణ్ కుమార్ అతను నడిపే వాహనం క్రింద పడి మృతి చెందాడు. మృతుడు కడప పట్టణానికి చెందిన వాడు. గత కొద్దిరోజులుగా రోడ్డు కాంట్రాక్టర్ వద్ద రోలర్కు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ముగుగరు పిల్లలు కలరు. మృతదేహాన్ని రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. రెండు గడ్డి వాములు దగ్ధం రామసముద్రం : మండలంలోని కేసీ.పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కేసీ పల్లె గ్రామానికి చెందిన ఆర్.చెంగారెడ్డి, పి.చంద్రప్పలకు చెందిన గడ్డివాములకు ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో పుంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో రూ.60 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. అక్రమ మద్యంపై నిఘా ఉంచాలి మదనపల్లె : నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అక్రమ మద్యం రవాణాపై ఎకై ్సజ్ సిబ్బంది నిఘా ఉంచాలని కడప ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మధుసూదన్ అన్నారు. నియోజకవర్గంలోని రామసముద్రం, చీకలబైలు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్లను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీపై ఎకై ్సజ్ సిబ్బంది పలు సూచనలు చేశారు. కర్నాటక నుంచి ఎన్డీపీఎల్ మద్యం అక్రమరవాణా జరగకుండా పటిష్టమైన నిఘా కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ భీమలింగ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ రక్షణ.. కూటమి ప్రభుత్వానికి పట్టదా? ఖాజీపేట : మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కనీస రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. దుంపలగట్టు గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు మిర్చియార్డు రైతుల సమస్య తెలుసుకునేందుకు వెళ్లిన జగన్కు కనీసం ఒక్క పోలీసును కూడా రక్షణకు నియమించక పోవడం, కనీసం ట్రాఫిక్ క్లియరెన్స్ చేయక పోవడం దురదృష్టకరం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేదని అన్నారు. అలాంటప్పుడు ఎన్నికల ఆంక్షలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కనీసం రూ.20వేలు రైతు భరోసాను అందించలేక పోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. -
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
సిద్దవటం : కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. సిద్దవటం మండలం ఉప్పరపల్లె సాయినగర్లో కె.అనిల్కుమార్రెడ్డి హ్యాపీ కిడ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నూతన భవనాలను ఆకేపాటి అమర్నాథ్రెడ్డి బుధవారం ప్రారంభించారు. చిన్నారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. మూడేళ్ల పిల్లలను అంగన్వాడీలో చేర్పించి..పౌష్టికాహారం అందజేశామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాలంలో 1, 2వ తరగతుల వరకు ప్రాథమిక విద్య, 3వ తరగతి నుంచి 10+2 వరకు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లోనూ పోటీ పరీక్షలకు విద్యార్థుల సామర్ాధ్యన్ని పెంపొందించేలా సీబీఎస్సీ సిలబస్ ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇపుడు కూటమి ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని రద్దు చేసే యోచనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సౌమిత్ర, హరిబాబు, పాఠశాల డైరెక్టర్ శివకుమారి, హెచ్ఎం శ్రీరాములు, పారిశ్రామిక వేత్త తాజుద్ధీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి -
పేకాట స్థావరంపై మెరుపుదాడి
రాయచోటి: పేకాట స్థావరంగా మారిన అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలో ఎస్పీ స్పెషల్ పార్టీ పోలీసులు నిర్వహించిన మెరుపు దాడులలో 14 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. రాయచోటి రూరల్ మండలం గుంటిమడుగు సమీపంలోని కె.నాగార్జునరెడ్డి మామిడి తోటలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ స్పెషల్ పార్టీ పోలీసులతో స్థావరంపై దాడి చేయించారు. వైఎస్సార్, అనంతపురం జిల్లాలకు చెందిన 14 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ దారుల్లో పోలీసులకు దొరకకుండా కొందరు పరుగులు తీసినట్లు సమాచారం. పట్టుబడిన వారి నుంచి రూ.2,69,360 నగదు, 15 సెల్ఫోన్లు, మూడు కార్లు, ఒక బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం జూదరులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. కాగా పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసిన సమయంలో పేకాట ఆడుతున్న మరికొందరు పరారయ్యారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. విచ్చలవిడిగా పేకాట రాయచోటి కేంద్రంగా పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. జిల్లా కేంద్రంలో గంజాయి, ఇతర మత్తు పానీయాల విక్రయాలు జోరుగా సాగుతున్నా పోలీసులు మాత్రం వారిచ్చే మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలున్నాయి. రాయచోటి పోలీసుల నిర్లక్ష్యం జిల్లా ఎస్పీ కార్యాలయానికి సవాల్గా మారింది. ఆడుతున్న సమాచారం స్టేషన్కు అందినా ఎలాంటి దాడులు చేయకపోగా, వారి పేర్లను బయటపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. బెల్ట్ షాపులు ఏర్పాటు విషయంలోనూ ఎకై ్సజ్ పోలీసుల కంటే సివిల్ పోలీసుల జోక్యం అధికంగా ఉందన్న సమాచారం దావానంలా వ్యాపిస్తుంది. రాయచోటి రూరల్ మండలం మాధవరం పంచాయతీలో రెండు బెల్ట్ షాపులు నిర్వహిస్తుండగా ఒక బెల్ట్ షాపుపై ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి వారం రోజుల కిందట దాడి చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే గ్రామంలో మరో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నా అతనిపై ఎలాంటి చర్యలు లేవని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం కూడా పేకాట స్థావరంపై దాడి విషయాన్ని స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వకుండా వెళ్లడంతోనే పేకాట ఆడుతున్న వారు పట్టు పడ్డారని కొంత మంది పోలీసుల నోటీ నుంచి వినిపిస్తున్న మాటలు పట్టణంలో హల్ చల్ చేస్తున్నాయి. 13 మంది జూదరుల అరెస్ట్ రూ.2.69 లక్షల నగదు, 3 కార్లు, 15 సెల్ఫోన్లు స్వాధీనం -
తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు
తాగునీటి కోసం నారాయణరాజుపేటకు వెళ్లాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో రోజువారీగా చేసుకునే పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దయచేసి అధికారులు, ప్రజా ప్రతినిధులు మాకు గుక్కెడు నీరు అందించి అన్ని విధాలా ఆదుకోవాలి. – చిన్నక్క, వెంకటాద్రిపురం ఎస్టీకాలనీ, పాటూరు గ్రామపంచాయతీ, నందలూరు మండలం నీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలి మా గ్రామంలోని తాగునీటి సమస్యపై ఎన్నోమార్లు నాయకులకు విన్నవించుకున్నా పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన బోరులో కూడా ఒక్కొక్కసారి నీళ్లు రావడం లేదు. మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నాం. మా సమస్యను పరిష్కరిస్తే అంతే చాలు. – యాసగిరి లక్ష్మీదేవి, వెంకటాద్రిపురం ఎస్టీ కాలనీ, పాటూరు గ్రామపంచాయతీ, నందలూరు మండలం -
●అడుగంటుతున్న భూగర్భ జలాలు
జిల్లాలో వేసవి తాపం మొదలైంది. ఇప్పుడే ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మార్చి నుంచి వేసవి తీవ్రత మరింత పెరగనుంది. 10 సీపీడబ్ల్యు, 4896 పీడబ్ల్యుఎస్ స్కీములు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 8946 బోర్లు ఉండగా, అందులో 2980 మరమ్మతులకు గురయ్యాయి. రానున్న కాలంలో ఎండ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటితే మిగిలిన బోర్లలో కూడా నీళ్లు లేక తాగునీటి కష్టాలు మరింత అధికం కానున్నాయి. ఆర్డబ్ల్యుఎస్ అధికారులు ప్రత్యేకంగా తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక బోర్లకు ప్రణాళికలు రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోయి తాగునీటికి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
అడ్మిషన్ల జోరు.. తల్లిదండ్రుల బేజారు!
●నిబంధనలకు విరుద్ధంగా.. ‘ హలో సార్... మీ పాప రమ్య పదవ తరగతి చదువుతున్నది కదా..! ఇంటర్కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలానా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఎంసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్ను విజిట్ చేసి చూడండి ’ . ‘సార్ గుడ్ ఈవినింగ్, సురేష్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కదా. బీటెక్ కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్సు, ఏఐఎంల్, డేటా సైన్సు, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే చెప్పండి... రాయితీలు ఇప్పిస్తాం’... మదనపల్లె సిటీ: టెన్త్, ఇంటర్ చదవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద పెరిగింది. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి 21,468 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ 15,356 మంది, ద్వితీయ సంవత్సరం 14,248 మంది రాస్తున్నారు. కనీసం వార్షిక పరీక్షలు కూడా పూర్తి కాకముందే కార్పొరేట్ కాలేజీలు ప్రధానంగా మదనపల్లె, రాయచోటి, రాజంపేటతో పాటు మండల కేంద్రాల్లో సైతం బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి... తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లు కాకుండా వాట్సాప్లకు అడ్మిషన్ల మెసేజ్లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజినీరింగ్ కాలేజీలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షలో ఫీజులు బాదేస్తున్నారు. మరో వైపు పీఆర్ఓలు... జిల్లాలో ప్రధానంగా తిరుపతి, విజయవాడ కేంద్రాల కార్పొరేట్ కాలేజీల తరపున వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆయా విద్యా సంస్థల పీఆర్ఓలు రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కాలేజీల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీ పడుతున్నారు. పరీక్షల కంటే ముందే అడ్మిషన్ల కోసం తంటాలు ఇంటర్, ఇంజినీరింగ్ కోర్సుల పేరిటముందస్తు దోపిడీ తల్లిదండ్రులకు పెరిగిన ఫోన్ల తాకిడి సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈ సారి గత ఏడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కాలేజీలు సిద్ధమయ్యాయి. -
‘స్టాఫ్ నర్స్’ ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల
కడప రూరల్: కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు, వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ జాబితాను సీఎఫ్డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22వ తేదీలోపు తమ అభ్యర్థనలను తెలపాలని సూచించారు. 28వ తేదీన ఫైనల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తామని వివరించారు. 2600 మెట్రిక్ టన్నుల యూరియా రాక కడప అగ్రికల్చర్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు బుధవారం 2600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు వెల్లడించారు. వైఎస్సార్జిల్లాకు 1300 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 1000 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ఫెడ్కు కేటాయించామన్నారు. అన్నమయ్య జిల్లా మార్క్ఫెడ్కు 300 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించామన్నారు. -
మార్చి నెలాఖరులోపు లక్ష్యం పూర్తి చేయాలి
రాయచోటి (జగదాంబసెంటర్): మార్చి నెలాఖరులోపు జిల్లా సూక్ష్మ నీటి సాగు పథక లక్ష్యాలను పూర్తి చేయాలని ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయి ప్రత్యేకాధికారి డి.రమేష్ పేర్కొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని జిల్లా సూక్ష్మ నీటి సాగు పథక కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీ జిల్లా సమన్వయకర్తలు, మైక్రో ఇరిగేషన్ క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యం 15 వేల హెక్టార్లకు ఇప్పటి వరకు 9339 మంది రైతులకు 9694 హెక్టార్లు అమలు చేశామన్నారు. మిగిలిన లక్ష్యాన్ని క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదు చేసుకున్న రైతులకు ప్రాథమిక సర్వేలు చేపట్టి, అంచనాలు పూర్తి చేసి రైతుల వాటా కట్టించాలన్నారు. అంతకు ముందు రామాపురం, వీరబల్లి, రాయచోటి మండలాల్లోని పలు గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన మైక్రో ఇరిగేషన్ పరికరాలను రైతుల పొలాల్లో సక్రమంగా అమర్చారా లేదా అని తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంఐఓ లక్ష్మీప్రసన్న, ఎంఐడీసీ, ఎంఐఈలు, కంపెనీ క్షేత్ర స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయిప్రత్యేకాధికారి డి.రమేష్ -
పోలీస్ శాఖపై విశ్వసనీయత పెంచాలి
రాయచోటి: పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పెంచాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరపాలని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. నేర నిరూపణలకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ నేర పరిశోధన చేయాలన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేయాలి.. అలవాటు పడిన నేరస్తులపై రౌడీషీట్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. అలాగే పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఉక్కుపాదం మోపాలి.. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించే వారిపట్ల కఠిన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేయాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, జూదం జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతను, ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలతో మంచి సంబంధాలు.. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా గ్రామాలు, పట్టణాలలోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
●కటకటకు కౌంట్డౌన్
అన్నమయ్య జిల్లాలో 500కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే వేసవి నేపథ్యంలో తాగునీటి కటకటకు కౌంట్డౌన్ మొదలవుతోంది. ప్రధానంగా నందలూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ వెంకట్రాదిపురం ఎస్టీ కాలనీలో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడున్న ప్రజలు తాగునీటి కోసం ప్రతినిత్యం యుద్ధం చేస్తున్నారు. అక్కడే కాకుండా రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో సమస్య ఉత్పన్నమవుతోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్కు వచ్చి పలు గ్రామాల ప్రజలు జిల్లాలోని ఉన్నతాధికారురులకు వినతులు సమర్పించారు. రానున్న కాలంలో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా తాగునీటి సమస్య చాలాచోట్ల ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మామిడి రైతుకు ఏదీ భరోసా..?
రాష్ట్రంలో మామిడి చెట్ల పెంపకం, మార్కెటింగ్లో అన్నమయ్య జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. చిత్తూరు జిల్లాకు సమానంగా అన్నమయ్య జిల్లా మామిడికి ప్రసిద్ది చెందింది. ఈ సారి మామిడి విక్రయాలకు భరోసా లేకుండా పోతోంది. రాయచోటి, కోడూరులలో మార్కెటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా నేటికీ అమలు కాలేదు. కొనుగోలు కోసం దళారుల వైపు చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ సారైనా ప్రభుత్వ పరంగా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాయచోటి : అన్నమయ్య జిల్లాలోనే 34వేల హెక్టార్ల లో వివిధ రకాల మామిడి తోటలు సాగులో ఉన్నాయి. రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో పోటాపోటీగా మామిడి తోటలను సాగు చేశారు. దిగుబడి కూడా జిల్లాలో అధికంగానే ఉంటుంది. తెగుళ్ల బెడదతో రెండేళ్లుగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది వాతావరణంలో మార్పులు, వెంటాడుతున్న తెగుళ్లతో పూత, పిందె దశలలో ఉంది. పూత మురిపిస్తున్నా ఆశించిన మేర ఎదుగుదల లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. తెగుళ్ల నివారణకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో లభించిన మందులన్నింటినీ చల్లుతున్నారు. కొంతమంది రైతులు మామిడి పిందెలకు కవర్లు కట్టి రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దళారుల బెడదతో ఇబ్బందులు సవాళ్ల మధ్య తోటలను కాపాడుకుంటున్నా.. సరియైన గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వ్యాపారులు, దళారులు రావడం, వారు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయడం, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించి సొమ్ముచేసుకోవడంతో తాము నష్టపోతున్నామని చెబుతున్నారు. గతంలో ఉన్న మామిడి రైతుల ఉత్పత్తి సమైక్య కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఉద్యాన, మార్కెటింగ్ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో కొనుగోలుపై స్పష్టత లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. గత వైకాపా పాలనలో రాయచోటి, కోడూరులలో మార్కెటింగ్ కేంద్రాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. అసలే తెగుళ్ల బెడదతో సక్రమంగా దిగుబడి రావడం లేదని, ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి న్యాయం చేయాలంటూ మామిడి తోట రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. దళారులతో దగా పడుతున్న మామిడి రైతులుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం మామిడి రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మామిడి మామిడి ధరల విషయంలో స్థానిక జ్యూస్ కంపెనీలతో చర్చించడం జరుగుతుంది. తెగుళ్లను నివారించుకొని అధిక దిగుబడులు వచ్చేలా సాగులో తగు మెలకువలు పాటించాలి. – రవీంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి -
వక్ఫ్బోర్డు పేరుతో భూముల కబ్జా
సాక్షి టాస్క్ఫోర్స్ : వక్ఫ్ బోర్డు పేరుతో పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో భూములు కబ్జా చేసి అనుమతి లేకుండా దుకాణాలు నిర్మించారు... వాటిని సబ్ లీజుకు ఇచ్చేసి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి వచ్చిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియాను కలిసి, ఎమ్మెల్యే అక్రమాలపై స్థానికులు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ నుంచి పట్టణానికి చెందిన వ్యక్తి 20 హవాన్సులకు కొనుగోలుచేశారన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా, ఎమ్మెల్యే షాజహాన్బాషా వక్ఫ్ బోర్డు పేరుతో భూములను కబ్జా చేశారన్నారు. దుకాణాలు నిర్మించి అద్దె వసూళ్లుకు ఆయనే కమిటీ ఏర్పాటు చేశారన్నారు. జామియా మసీదుకు చందా ఇచ్చినట్లుగా రసీదు అందజేస్తున్నారన్నారు. వక్ఫ్బోర్డు స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో రికార్డులన్నీ అధికారుల వద్ద ఉంటే, అధికారం చెలాయిస్తూ అద్దెలు వసూళ్లు చేసుకుని కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్నారు. వక్ఫ్భూముల్లో నిర్మించిన షాపు అద్దెలు అటు ప్రభుత్వానికి, ఇటు యజమానులకు వెళ్లక మధ్యలో ఉన్న వారు కాజేస్తున్నారని వాపోయారు. దాదాపు 20 కోట్ల మేర వసూళ్లకు సంబంధించి లెక్కలు తేలాల్సి ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ను ఆర్టీఐ కింద అడిగితే, అనుమతులు లేవని సమాధానమిచ్చారన్నారు. బెంగళూరు బస్టాండ్ బడేమకాన్ వద్ద 1893 నుంచి పట్టా కలిగినటువంటి సయ్యద్ బాసిద్ బాషాకు చెందిన సర్వే నెంబర్.173లోని 97 సెంట్ల భూమిని ఆక్రమించి ఆధీనంలో పెట్టుకుని, మున్సిపల్ అనుమతి లేకుండా షాపురూములు నిర్మించి అద్దెలు తీసుకుంటున్నారన్నారు. అలాగే సర్వేనెంబర్.171లోనూ స్థలాన్ని కబ్జాచేసి, అనుమతి లేకుండా భవనాన్ని నిర్మించుకున్నారన్నారు. దీనిపై సీసీఎల్ఏ, హైకోర్టు, సింగిల్బెంచ్ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, స్థలంలోకి ప్రవేశించకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని, జిల్లా అధికారులను లోబర్చుకుని, డబ్బు దోచుకుంటూ ఎమ్మెల్యే షాజహాన్బాషా స్వలాభం చూసుకుంటున్నారన్నారు. ఏడునెలలు కావస్తున్నా..తమకు న్యాయం జరగకపోవడంతో మరోసారి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ ఆవేదన తెలుపుకొన్నామన్నారు. ఫిర్యాదుచేసిన వారిలో వెంకటరమణనాయుడు, శంకర్రెడ్డి, సయ్యద్ బాసిద్బాషా, షరీఫ్, ముస్లిం మహిళలు ఉన్నారు. అన్ ఆథరైజ్డ్ కమిటీ ద్వారా అక్రమ వసూళ్లు మతం ముసుగులో కోట్ల రూపాయల స్కామ్ ఎమ్మెల్యే అక్రమాలపై ఆర్.పీ.సిసోడియాకు ఫిర్యాదు 20కోట్ల మేర లెక్కలు తేల్చాలంటున్న బాధితులు -
జిల్లా అధికారి పరిధిలోకి పది ఆలయాలు
బి.కొత్తకోట: జిల్లాలో 6–బి2 గ్రేడ్ కలిగిన పది ఆలయాలను దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పరిధి నుంచి తొలగించి జిల్లా దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయాల పాలన ఇకపై జిల్లా అధికారి పరిధిలోకి వచ్చింది. జిల్లాలోని పీలేరు మండలం దొడ్డిపల్లిలోని చెన్నకేశవస్వామి ఆలయం, నిమ్మనపల్లి మండలం తవళంకు చెందిన నేల మల్లేశ్వరస్వామి ఆలయం, కురబలకోట మండలం తెట్టులోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, మదనపల్లిలోని సోమేశ్వరస్వామి ఆలయం, బి.కొత్తకోటలోని చెన్నకేశవ, ఆంజనేయస్వామి ఆలయాలు, చిన్నమండెం మండలం మల్లూరులోని మల్లూరమ్మ దేవత ఆలయం, రాజంపేటలోని ఆంజనేయస్వామి ఆలయం, కోడూరులోని భుజంగేశ్వర స్వామి ఆలయాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా అధికారి పరిధిలోకి వచ్చాయి. ఈ ఆలయాలన్నింటిని కర్నూలు డిప్యూటీ కమిషనర్ పరిధి నుంచి తొలగించారు. మైక్రో ఇరిగేషన్ను సద్వినియోగం చేసుకోండి రాయచోటి టౌన్: మైక్రో ఇరిగేషన్ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని, ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయి ప్రత్యేక అధికారి ( ఓఎస్డీ) రమేష్ అన్నారు. బుధవారం రాయచోటి నియోజక వర్గ పరిధిలోని రాయచోటి, రామాపురం, వీరబల్లె మండలాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో మైక్రో ఇరిగేషన్ వ్యవసాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమిని సాగు చేసుకొనే విధానంలో మైక్రో ఇరిగేషన్ ఒకటన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం 15000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అయితే 9339 మంది రైతుల ద్వారా 9694 హెక్టార్లలో సాగు అవుతున్నట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని యుద్ధ ప్రాతిపదికన మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఐఓ లక్ష్మీప్రసన్న, ఎంఐడీసీలు, ఎంఐఈ క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఫర్నిచర్ సరఫరాకు కొటేషన్లు ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: కడప స్పెషల్ పోక్సో కోర్టు కోసం కొత్త ఫర్నిచర్ వస్తువుల సరఫరా కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి. శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని టాక్స్లతో కలుపుకొని 7 ఐరన్ అల్మారాలు, 1 ఐరన్ ర్యాక్, 8 ఆఫీసు టేబుల్స్, 3 కుషన్ ఛైర్స్, 30 ‘ఎస్’ౖ టెప్ మార్క్ ఛైర్స్, ఒక క్రోన్ చైర్, 5 ఐరన్ స్టూల్స్, 2 కోట్ హాంగర్స్, 3 ఉడెన్ బెంచులు, ఒక సోఫా సెట్, 5 టీపాయి, ఒక డైనింగ్ టేబుల్, ఒక ప్లాస్టిక్ చైర్ మొత్తం 13 రకాల ఫర్నిచర్ వస్తువుల కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామన్నారు. టెండరుదారు సమర్పించే కొటేషన్ కవరు పైన ‘కొటేషన్ ఫర్ సప్లయ్ అండ్ ఇన్స్టాలేషన్ ఫర్ ఫర్నీచర్ ఐటమ్స్’అని నమోదు చేసిన సంబంధిత షీల్డు కొటేషన్లను ఈనెల 21వతేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు, కడపలో సమర్పించాలన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్కు ఐఎస్ఓ గుర్తింపు మదనపల్లె: వందేళ్లకు పైబడి ఘన చరిత్ర కలిగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ను అందుకుంది. సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాద ఘటన తర్వాత ఆధునికీకరించిన భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్తో కలిసి బుధవారం ప్రారంభించారు. నూతన కార్యాలయ భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెవెన్యూ, సాధారణ పరిపాలన, విపత్తు నిర్వహణ తదితర పాలనా విషయాలకు సంబంధించి, ఐఎస్ఓ 9001:2015 ప్రమాణాలను అనుసరిస్తూ, నాణ్యతతో కూడిన సేవలు ప్రజలకు అందించడంపై హైదరాబాద్కు చెందిన గ్లోబల్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫిబ్రవరి 17న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి అందించిన ఐఎస్ఓ సర్టిఫికెట్ను, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్లను ప్రత్యేకంగా అభినందించారు. -
ఒంటిమిట్ట క్షేత్రం రెండో అయోధ్యను తలపిస్తోంది
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం రెండో అయోధ్యను తలపిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ (ఐఏఎస్) ప్రశంసించారు. బుధవారం ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఒంటిమిట్ట చెరువులో నీటి వసతి కల్పిస్తే ట్యాంక్బండ్ తరహాలో బోటింగ్ నిర్వహించవచ్చన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆలయ చరిత్ర అన్ని భాషల్లో తెలిసే విధంగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఆలయం అయోధ్య, వారణాసి తరహాలో పర్యాటకులకు ఆకర్షిస్తుందన్నారు. అలాగే ఇక్కడ ఉన్న హరిత రెస్టారెంట్ను పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళిక, మార్పులు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట రామయ్య క్షేత్ర గోపురాలు మూసిపోయి ఉండడం గమనించి పురావస్తు శాఖ అధికారులు కెమికల్తో గోపురాలను శుద్ధిచేస్తే బాగుంటుందన్నారు. ఈయన వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్ కుమార్, కడప ఆర్డీఓ జాన్ ఇరివిన్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్ ఈశ్వరయ్య, డివిజనల్ మేనేజర్ మల్లికార్జున, ఒంటిమిట్ట తహసీల్దార్ వెంకటరమణమ్మ, ఆలయ టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ అంజనా గౌరీ ఉన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ -
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
సుండుపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా, రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై నిర్లక్ష్యం వీడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సుండుపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారం ప్రగతిపై తహసీల్దార్, ఆర్ఐ, మండల సర్వేయర్, వీఆర్ఓ, వీఆర్ఏలతో సమీక్షించారు. మండలంలో మొత్తంగా భూమి సమస్యలపై 506 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తహసీల్దార్ దైవాధీనం కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా అర్జీల పరిష్కారంలో శ్రద్ధ చూపకుండా ప్రగతిలో వెనుకబడిన తిమ్మసముద్రం వీఆర్ఓ చిట్టిబాబు , గ్రామ సర్వేయర్ సుబ్బరాయుడు, జి. రెడ్డివారిపల్లి వీఆర్ఓ నరసింహులు, ముడుంపాడు వీఆర్ఓ హరీష్, బాగంపల్లి వీఆర్ఓ కొండయ్యలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా ప్రగతి చూపకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన మొత్తం అర్జీలను నాణ్యతగా పరిష్కరించడమే అధికారుల లక్ష్యం కావాలని సూచించారు. క్షేత్ర స్థాయికి వెళితే భూసేకరణ, దారి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. తర్వాత సుండుపల్లె–3 పరిధిలో కంచిపట్లవాండ్లపల్లె సమీపంలో ప్రభుత్వ భూమి ఆక్రమణను పరిశీలించారు. గ్రామస్తుల సౌకర్యం కోసం అదే ప్రాంతంలో స్మశాన వాటిక నిమిత్తం భూమి కేటాయింపునకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు -
కుంభమేళా.. రైలెక్కేదెలా!
● 26తో ముగియనున్న కుంభమేళా ● గుత్తి–రేణిగుంట మార్గంలో ఒక్క రైలు కూడా లేని వైనం ● ప్రయాగ్రాజ్ ప్రయాణానికి ఇక్కట్లు ● రహదారి మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు రాజంపేట: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా విశేషాలపై చర్చ సా గుతోంది. ఈనెల 26న మహాశివరాత్రి రోజు మహా కుంభమేళా వేడుకలు ముగియనున్నాయి. 144 ఏళ్లకొకసారి వచ్చే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించడం మంచిదని భక్తుల అచంచల విశ్వాసం. అందుకే ప్రయాగ్రాజ్కు నడిపిస్తున్న రైళ్లు భక్తులతో రద్దీగా మారుతున్నాయి. ఎంతగా అంటే తత్కాల్ టికెట్లు కూడా క్షణాల్లో రిజర్వు కావడం డిమాండ్ను తెలియజేస్తోంది. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ వల్ల ఒరిగిందేమీలేదు: భారతీయ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా కనిపించడంలేదని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. రైల్వేబోర్డుకు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా తాను సిఫార్సు చేసి ఉంటే కుంభమేళాకు రైలు నడిపేవారు. అయినా ఆయన జిల్లా మీదుగా కుంభమేళాకు రైలు వేయించుకోలేకపోయారని భక్తులు పెదవి విరుస్తున్నారు. ప్రైవేటు వాహనాలు, బస్సులను ఆశ్రయించే పరిస్ధితి.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు కుంభమేళాకు వెళ్లేందుకు రైలు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, బస్సులను ఆశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు భక్తులు గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేకంగా బస్సులు మాట్లాడుకొని వెళుతున్నారు. ఇలా వెళ్లే వారి సంఖ్య పెరిగిపోవడంతో ప్రయాగ్రాజ్ దారులు రద్దీగా మారుతున్నాయి. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. కొందరు బెంగళూరు, చైన్నె నుంచి విమానాల ద్వారా కుంభమేళాకు వెళుతున్నారు. గుత్తి–రేణిగుంట లైనులో ఒక్క రైలేదీ.. గుత్తి–రేణిగుంట లైనులో కుంభమేళాకు వెళ్లేందుకు ఒక్క రైలు కూడా నడిపించలేదు. ఫలితంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు ప్రయాగ్రాజ్కు వెళ్లే రైళ్ల గురించి తెలుసుకొని వ్యయ ప్రయాసాలతో గూడూరుకు వెళ్లి, అక్కడి నుంచి రైళ్ల ద్వారా చేరుకుంటున్నారు. తిరుపతి నుంచి కూడా ఇప్పుడు కుంభమేళాకు రైలు నడవడంలేదని రైల్వే వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్కు వెళ్లే రైళ్లు సదరన్ రైల్వే నుంచి వస్తే వాటిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇంటర్సిటీనే కుంభమేళా రైలుగా నడిపించాలి ఈ మార్గంలో నడిచే పేదోళ్ల రైలు ఇంటర్సిటీ(హుబ్లీ–తిరుపతి) రద్దు చేసి, ఆ రైలును కుంభమేళాకు వినియోగించారు. అదే రైలును ఈ మార్గంలో నడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైలును తిరుపతి నుంచి ప్రయాగ్రాజ్కు రోజూ నడిపిస్తే రాయలసీమ ప్రాంత భక్తులకు ఉపయోగపడేది. ఆ దిశగా రైల్వేశాఖ ఆలోచించకపోవడం విచారకరమని హిందూ సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు. సురక్షితం.. సౌకర్యం.. ప్రయాగ్రాజ్కు వెళ్లే వారికి రైళ్లు సురక్షితం. తక్కువ ఖర్చుతో గమ్యానికి చేరుకోవచ్చు. దీంతోపాటు రైల్వేస్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే త్రివేణి సంగమం చేరుకోవచ్చు. అక్కడే పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తక్కువ ఖర్చుతో సకాలంలో చేరుకొనే వీలుంటుంది. వాహనాలు లభ్యంకాని భక్తులు నేరుగా నడకమార్గం ద్వారా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రైల్వేశాఖకు రూ.కోట్ల ఆదాయం కూడా సమకూరుతుంది. జిల్లా వాసులు రైలులో వెళ్లలేని పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు కుంభమేళాకు వెళ్లలేని పరిస్థితి. రైలు సౌకర్యం ఉంటే వేలాదిమంది వెళ్లేవారు. రైలులో గూడూరు నుంచే వెళ్లాలి. టిక్కెట్లు దొరకవు. జనరల్ బోగీలలో వెళితే సీట్లు ఉండవు. నానా కష్టాలు పడాలి. జిల్లా రైలు మార్గంలో రైలు నడిపించకపోవడం దారుణం. మన ప్రాంతంపై రైల్వే వివక్ష చూపుతోంది. –భూమన శంకర్రెడ్డి, మాజీ సర్పంచ్, నాగిరెడ్డిపల్లెకుంభమేళాకు రైలు వేయాలని జీఎంను కోరా జిల్లా మీదుగా కుంభమేళాకు ఒక రైలు నడపాలని ఇటీవల తిరుపతిలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఏకే జైన్ను కలిసి విన్నవించాను. కుంభమేళా ముగిసే లోపు ఒక్కసారి అయినా రైలు నడిపిస్తే భక్తులు సద్వినియోగం చేసుకుంటారు. రద్దయిన ఇంటర్సిటీనే కుంభమేళాకు ఏర్పాటు చేయాలి. –తల్లెం భరత్రెడ్డి, డీఆర్యూసీసీ సభ్యుడు, గుంతకల్ -
పంచాయతీ నిధులు కాజేస్తూ.. గన్తో బెదిరింపులు
రాయచోటి: పీలేరు పంచాయతీ ఈఓ గురుమోహన్ అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా సమస్యలపై ప్రశ్నించిన వారికి తనవద్ద ఉన్న గన్ చూపించి బెదిరిస్తున్నారంటూ పీలేరు సర్పంచ్, పాలకవర్గం సభ్యులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్ను సర్పంచ్ హబీబ్ బాషా, వార్డు సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు. కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకపోగా కొన్ని నెలలుగా వారికి ఇవ్వాల్సిన ఈపీఎఫ్ డబ్బులు డిపాజిట్ చేయలేదన్నారు. అలాగే జనరల్ ఫండ్ నిధులను ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారన్న విషయాన్ని కూడా చూపించడం లేదన్నారు. పంచాయతీకి జమ అవుతున్న నిధులు వివరాల గురించి సర్పంచ్, వార్డు సభ్యులు అడిగితే తమవద్ద ఉన్న గన్ చూపించి బెదిరిస్తున్నారని, గన్ విషయంపై విచారణ చేసి పీలేరులో గొడవలకు కారణం అవుతున్న ఈఓ గురుమోహన్పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. ఈఓ గురు మోహన్, డీఎల్పీఓ నాగరాజ వారికి ఇష్టం వచ్చిన రీతిలో నిధులను డ్రా చేసి స్వాహా చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో వార్డు సభ్యులు లలితమ్మ, వెంకటరమణ, మల్లికార్జున రెడ్డి, కళావతి, పరమేష్ తదితరులు ఉన్నారు. పీలేరు పంచాయతీ ఈఓ అవినీతిపై కలెక్టర్కు ఫిర్యాదు -
ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా పరకామణి లెక్కింపు ముగిసే సమయానికి ఒంటిమిట్ట రామయ్య నెలసరి హుండీ ఆదాయం 8 లక్షల 620 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏఐటీయూసీ జిల్లా నూతన కమిటీ రైల్వేకోడూరు అర్బన్: అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ కార్యవర్గాన్ని మంగళవారం సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి ప్రకటించారు. గౌరవాధ్యక్షుడిగా తుమ్మల రాధాకృష్ణ, అధ్యక్షుడిగా మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.సాంబశివ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్రి సురేష్ కుమార్, కోశాధికారిగా సరోజమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడిగా గాలి చంద్ర, పోకూరి మురళి, నరసింహులు, ఉప ప్రధాన కార్యదర్శులుగా సలీం బాషా, సహాయ కార్యదర్శులుగా ఇ.సికిందర్, వేణుగోపాల్రెడ్డి, కృష్ణ చైతన్యలను ఎన్నుకున్నారు. తలనీలాల వేలం పాట రూ.5.51 లక్షలు సిద్దవటం: నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పి ంచుకునే తలనీలాల వేలం పాటను బాపట్ల జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వంగపాటి మహేంద్ర రూ. 5. 51లక్షలకు దక్కించుకున్నారని ఆలయ ఈఓ మోహన్రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన నిత్యపూజస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు మంగళవారం సిద్దవటంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యపూజ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వామివారికి సమర్పించుకునే తలనీలాల ప్రోగు కోసం ఈ వేలం పాటను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జనార్దన్, ఆలయ ఉద్యోగి చంద్ర , జ్యోతి వెంకటసుబ్బారెడ్డి, పాటదారులు, వంతాటిపల్లె గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేడు సబ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం మదనపల్లె: పట్టణంలో నూతనంగా ఆధునికీకరించిన సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా బుధవారం ప్రారంభించనున్నట్లు సబ్ కలెక్టరేట్ ఏఓ రాఘవేంద్ర తెలిపారు. గత ఏడాది జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, కార్యాలయ ప్రాంగణంలోని హెచ్ఎన్ఎస్ఎస్–2 భవనంలో తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం నుంచి భవనానికి మరమ్మతులు చేసేందుకు అనుమతులు రావడంతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ముస్తాబుచేసి, ఫిబ్రవరి 19న ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటలకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా ఆధునికీకరించిన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని సబ్ కలెక్టరేట్ అధికారులు తెలిపారు. -
విద్యార్థిని ఆత్మహత్య
– పాఠశాలకు వెళ్లి చదువుకోలేక...! కడప అర్బన్ : పాఠశాలకు వెళ్లడం లేదని మందలించినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడప నగర శివారులోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కడప చిన్నచౌక్ పోలీసుల ప్రాథమిక విచారణ, మృతురాలి బంధువుల వివరాలిలా వున్నాయి. దేవకుమార్, ప్రభావతిల కుమారుడు మస్తానయ్య, సన్నీ కుమార్తె సుచిత్ర ఉన్నారు. మస్తానయ్య తన తండ్రితో పాటు బేల్దారిపనికి వెళుతున్నాడు. తల్లి ప్రభావతి ఇంటింటా పనులు చేసి జీవనం సాగించేది. సుచిత్ర మున్సిపల్ మెయిన్ హైస్కూల్లో పదోతరగతి చదువుతోంది. సుచిత్ర తన అనారోగ్యం కారణాలతో నెలకు 15 రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. హాజరు సరిగా లేక ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులను ఆరా తీశారు. దీంతో మానసిక ఆవేదనకు గురైన విద్యార్థిని సుచరిత తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు వెళ్లిపోయిన తరువాత ఇంటిలోపల గడియ వేసుకుని ఫ్యాన్కు చీరతో ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుప్రక్కల వాళ్లు గమనించి తల్లిదండ్రులకు, పోసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని చిన్నచౌక్ సీఐ ఓబులేసు ఆదేశా మేరకు ఎస్ఐ పి.రవికుమార్, తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రాథమికంగావిచారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మండలం లక్ష్యం మంజూరు
50 శాతం తగ్గింపుతో లక్ష్యం (హెక్టార్లలో) మదనపల్లె 500 255 నిమ్మనపల్లె 450 213 రామసముద్రం 500 335 తంబళ్లపల్లె 525 262 ములకలచెరువు 700 422 పెద్దమండ్యం 476 134 కురబలకోట 300 171 పెద్దతిప్పసముద్రం 400 632 బి.కొత్తకోట 750 381 కలికిరి 450 199 వాయల్పాడు 450 200 పీలేరు 450 207 గుర్రంకొండ 450 126 కలకడ 450 150 కేవీపల్లి 500 406 కోడూరు 475 508 ఓబులవారిపల్లి 800 781 చిట్వేలి 425 542 పెనగలూరు 350 268 పుల్లంపేట 450 520 రాజంపేట 750 505 నందలూరు 150 61 వీరబల్లి 450 228 టి.సుండుపల్లి 350 365 రాయచోటి 300 179 సంబేపల్లి 750 190 చిన్నమండెం 450 272 గాలివీడు 750 472 లక్కిరెడ్డిపల్లి 600 274 రామాపురం 600 255 -
అభ్యసన సామర్థ్యాల పెంపునకే సాల్ట్ కార్యక్రమం
రాయచోటి అర్బన్: విద్యార్థుల్లో ప్రాథమిక దశలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ‘సాల్ట్’ పేరుతో అంగన్వాడీలకు 120 రోజుల సర్టిఫికెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రాథమిక దశలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు అంగన్వాడీ వర్కర్లు కృషి చేయాలన్నారు. ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రమాదేవి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పిల్లల అభివృద్ధికి వినియోగించాలన్నారరు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, మండల విద్యాశాఖాధికారులు బాలాజీ నాయక్, వెంకటశివారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక దశలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచడం ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో డీఆర్పీలు రాజారమేష్, వెంకటసుబ్బయ్య, సికిందర్, నాగమణి, సుగుణ, శివజ్యోతి, ఎఫ్ఎల్ఎస్ కో–ఆర్డినేటర్ రాజశేఖర్, సీఆర్పీలు అరుణ్బాబు, రవిప్రకాష్, మండల పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
కట్టుదిట్టంగా మిషన్ వాత్సల్య కార్యక్రమం
రాయచోటి: పిల్లల సంక్షేమమే ధ్యేయంగా మిషన్ వాత్సల్య కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి జిల్లాలో బాల్య వివాహాలను రూపుమాపాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మిషన్ వాత్సల్య కార్యక్రమంపై జిల్లాస్థాయి బాలల సంక్షేమం, పరిరక్షణ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిషన్ వాత్సల్యను కట్టుదిట్టంగా అమలు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమంలో అనాథ పిల్లలు, ప్రత్యేక రక్షణ కావాల్సిన పిల్లలు, నేరాల బారిన పడిన పిల్లలు తదితరులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమావేశంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి రమాదేవి, రాజంపేట అడిషనల్ ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసు, మదనపల్లి, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు, జీఎస్డబ్ల్యుఎస్, విద్య, వైద్య, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వంక స్థలం ఆక్రమణ
కడప టాస్క్ఫోర్స్ : ప్రభుత్వ స్థలాలు అప్పనంగా కాజేస్తున్నా.. ప్రజా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సిద్దవటం మండలం దిగువపేట నందు బద్వేల్ రోడ్డు ప్రక్కనే ఉన్న రూ.50 లక్షల విలువైన స్థలం ఆక్రమణకు గురైంది. దిగువపేట పెద్ద కుమ్మరి గుంతకు ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని టీడీపీ నాయకులు స్థానిక మండల నేతల అండదండలతో దౌర్జన్యంగా చదును చేసి ముళ్ల కంచె వేశారు. సుమారు 0.43 సెంట్ల స్థలాన్ని దిగువపేట గాంధీ నగర్ హరిజనవాడ ప్రజలు కర్మ కాండలకు వినియోగిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే పెద్ద కర్మ ఇక్కడే చేసుకుంటారు, భర్త చనిపోయిన మహిళలకు ఇక్కడే వితంతువుగా మారుస్తారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇది కొంత ప్రభుత్వ భూమిగా, మరి కొంత వంకపొరంబోకుగా ఉంది. ఈ వంకపై ప్రభుత్వం ఒక మోరీ గతంలో నిర్మించింది. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ఈ వంకను నామరూపాలు లేకుండా చేశారు. బద్వేల్ మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్న విలువైన స్థలాన్ని చదును చేసి ఆక్రమిస్తుంటే కూతవేటు దూరంలో ఉన్న రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం ఏమిటని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ స్థలం విషయంలో రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు వారు గుసగుసలాడుతున్నారు. కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని టీడీపీ కబ్జాదారుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఆక్రమించింది టీడీపీ నేత కావడమే కారణం -
సీఐపై ఫిర్యాదు చేసినందుకు వేధిస్తున్నాడు
రాయచోటి టౌన్ : రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు తనను కులం పేరుతో వేధిస్తున్నాడని రాయచోటి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుంటిమడుగు ఆనంద్ ఆరోపించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతులు లేకుండా చేస్తున్నారని, తన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారని విమర్శించారు. కొన్ని రోజుల క్రితం తన కులానికి చెందిన వారి సమస్యలను పరిష్కరించేందుకు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్కు వెళ్లానని, ఆయన ఎదుట కుర్చీలో కూర్చోగా.. ఆవేశంతో ఆగ్రహించి తనపై నానా దుర్బాషలాడి భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అర్బన్ సీఐ చంద్ర శేఖర్ వివరణ కోరగా.. ఆనంద్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా సమాజాన్ని పక్కదోప పట్టిస్తున్నాడని, అందుకే ఐపీసీ 350 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాను ఎప్పుడూ కులం పేరుతో ఎవరినీ దూషించలేదని, కావాలనే ఆయన ఆరోపణ చేస్తూ తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడన్నాడు. పోలీస్ శాఖలో ఉంటూ సమాజంలోని అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తామన్నారు. -
ఆటో.. కారు ఢీకొని.. పలువురికి గాయాలు
మదనపల్లె : ఆటోను కారు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. మదనపల్లె ఎస్టేట్కు చెందిన బావాజాన్ (40) ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. సీటీఎం నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తుండగా జెర్సీ పాలడెయిరీ సమీపంలో స్పీడ్బ్రేకర్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను వేగంగా ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాబ్జాన్తోపాటు రామసముద్రం మండలం చింపరపల్లెకు చెందిన చిన్న అబ్బయ్య(61), అతని భార్య అలివేలమ్మ(55), మదనపల్లె పట్టణం బాలాజీనగర్కు చెందిన కౌసర్ (46), తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన వేమారెడ్డి (64) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం వేమారెడ్డి, అలివేలమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు.తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో,.. రామాపురం : కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్ఐ వెంకట సుధాకర్రెడ్డి వివరాల మేరకు.. మండలంలోని ఓబుల్రెడ్డిగారి పల్లెకు చెందిన వెంకటసుబ్బరాయుడు, శ్రీనివాసులు, వెంకట సుబ్బరాయుడు జగనన్న కాలనీలో పనులు చేసేందుకు స్కూటర్పై వెళ్తున్నారు. రాయచోటి వైపు వెళ్తున్న కడపకు చెందిన మౌలాలి స్కూటర్పై వసుత్న్నారు. బండపల్లి పంచాయతీలోని జగనన్న కాలనీ సమీపంలో రెండు స్కూటర్లు ఢీకొన్నాయి. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండల పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనం ఢీకొని... మదనపల్లె : ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన శ్రీరాములు (48) వ్యక్తిగత పనులపై ద్విచక్రవానంలో పుంగనూరు పట్టణానికి వచ్చాడు. బిఆర్ థియేటర్ వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో శ్రీరాములు గాయపడ్డారు. స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నల్ల రిబ్బన్లతో వైద్య మిత్రల నిరసన రాయచోటి జగదాంబసెంటర్ : డా.ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. వైద్యమిత్రలు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ జరగక, పిల్లలను చదివించుకోలేక ఇబ్బందిపడుతున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని బీమా మోడ్లోకి బదలాయించినా పథకంలో పని చేస్తున్న వైద్యమిత్రలు, టీం లీడర్లు, ఆఫీసు అసోసియేట్లు, జిల్లా మేనేజర్ తదితర క్షేత్ర స్థాయి సిబ్బంది ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. -
ఉత్సవాలకు వేళాయె.. సందడి లేదాయె ?
ప్రముఖ శైవ క్షేత్రంగా కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. అంత వైభవం కలిగిన త్రేతేశ్వరుడి వేడుకల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మహాశివరాత్రి మహోత్సవాల సందడి కనపడడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దేవస్థానంలో సమస్యలు అలాగే ఉండిపోయాయి. రాజంపేట రూరల్ : ఉమ్మడి జిల్లాలలో ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పాలకులు ఎవరైనా ఈ ఆలయానికి ప్రత్యేకత చూపడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది బహుదా నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. అగస్తేశ్వర మహర్షి ప్రతిష్ఠించిన త్రేతేశ్వరస్వామి, గదాధర స్వామిని దర్శించుకోవడం వరంలా భావిస్తారు. దీంతోపాటు అత్తిరాలలోనూ ఏటా శివరాత్రి ముందు రోజు, తరువాత రోజు, శివరాత్రి పర్వదినం రోజున పలు కార్యక్రమాలు చేపడతారు. పాలక మండలి ఏర్పాటు ఎప్పుడో?. త్రేతేశ్వర దేవస్థానంలో నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు ముందే పాలక మండలి ఏర్పాటుచేయడం ఆనవాయితీ. అలా వీలుకాని పక్షంలో తాత్కాలిక చైర్మెన్ను నియమించి శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవస్థానం చైర్మన్ పదవి, పాలక మండలిపై మందరం, అత్తిరాల, అప్పయ్యరాజుపేట, పోలీ, సీతారామపురం కూటమి నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై ప్రజలలో అయోమయం నెలకొంది. 22 నుంచి ఉత్సవాలు జరిగేనా? శివరాత్రి మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభించి మార్చి 02వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. సమయం తక్కువగా ఉండడంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారా? లేక వేడుకలకు మంగళం పాడతారా? అని భక్తులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినానికి నెల రోజుల నుంచి హడావిడి ఆరంభమయ్యేది. అన్ని శాఖల అధికారులతో డివిజనల్ స్థాయి( ఆర్డీఓ లేక సబ్ కలెక్టర్) అధికారి సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేస్తారు. అత్తిరాలను ఉన్నతాధికారులు సందర్శించి దేవాదయశాఖతో సమన్వయం చేసుకని ఏర్పాట్లు ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది ఈ వాతావరణం కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. సౌకర్యాల ఊసే లేదు శివరాత్రి మహోత్సవాలకు దాదాపు 7 నుంచి 15 రోజుల ముందు వాహనాల గేటుకు ఎంపీడీఓ ఆద్వర్యంలో వేలంపాట నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకూ వేలం వేయక పోవడం వెనుక అంతర్యమేమిటో అర్థంకాక భక్తులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు రాజంపేట–నెల్లూరు ప్రధాన రహదారిలోని అత్తిరాల ముఖ ద్వారం వద్ద నుంచి త్రేతేశ్వర దేవస్థానం వరకు రోడ్డు సమస్య పీడించేది. కమ్మపల్లిలో మాత్రం కొంత దూరం సిమెంటు రహదారి ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సిమెంటు రోడ్డు ప్రారంభించాలని తలపెట్టినా అర్ధంతరంగా కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో రహదారికి ఇరువైపులా గుంతలు, మట్టి దిబ్బలు అలాగే ఉన్నాయి. అత్తిరాలకు విచ్చేసే భక్తులకు పార్కింగ్ సమస్యలు తప్పవు. రహదారి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. లబోదిబోమంటున్న వ్యాపారులు శివరాత్రి మహోత్సవాలలో చిరు అంగళ్లు ఏర్పాటు చేసుకొని జీవించాలనుకొనే వ్యాపారులు లబోదిబో మంటున్నారు. త్రేతేశ్వరుని దేవస్థానం సమీపంలో రహదారి నిర్మాణం అలాగే ఉండడంతో వ్యాపారులు అంగళ్లను ఏర్పరుచుకోనే వీలులేదు. ఇప్పటి నుంచే అంగళ్లు ఏర్పరుచుకోకుంటే అప్పటికప్పడు కష్టంగా ఉంటుంది. వాహనాలలో సమాగ్రీనీ తీసుకెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఎంతో నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రేత్రేశ్వరస్వామి ఆలయంలో కానరాని ఏర్పాట్లు శివరాత్రి మహోత్సవాలపై అయోమయం 9 రోజుల వేడుకలకు మంగళమేనా? అత్తిరాలపై కూటమి ప్రభుత్వం అలసత్వం -
ఫైనాన్స్ మోసం రూ.70 లక్షలు?
– లబోదిబోమంటున్న ఖాతాదారులు బి.కొత్తకోట : పట్టణంలోని ఓ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్లో బంగారం తాకట్టుపై రుణాల మంజూరు వ్యవహరంలో సిబ్భంది చేతివాటం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ రుణాలపై ఇటీవల ఆరోపణలు రావడంతో ఆ కంపెనీకి చెందిన ఆడిటర్లు, విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో రూ.40 లక్షల మేర తాకట్టు రుణాలపై మళ్లీ అధిక మొత్తాల్లో రుణాలు తీసుకుని కొందరు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. మరో రూ.30 లక్షల కంపెనీ ఉత్పత్తులకు సంబంధించిన సొమ్ముకు లెక్కలు తేలినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహరంలో ముగ్గురు సిబ్బంది ఉన్నటుం్ల నిర్ధారించిన బృందాలు వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై కంపెనీకి నివేదించినట్లు తెలిసింది. ఆ ముగ్గురిలో ఒకరిద్దరు అందుబాటులో లేరన్న ప్రచారం జరుగుతోంది. ఈ మోసం వెలుగులోకి రావడంతో ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. తమకు జరిగిన మోసం, అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారినుంచి స్వాహా చేసిన సొమ్మును రాబట్టాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. జేసీబీతో రహదారిని తవ్వేశారు లక్కిరెడ్డిపల్లె : ఏళ్ల తరబడి ఉన్న రహదారిని కొందరు వ్యక్తులు తవ్వేశారు. మండలంలోని కోనంపేట నుంచి యర్రప్పగారిపల్లెకు వెళ్లేందుకు రహదారి ఉంది. ఇటీవల రైతు కొనసాని వెంకట సుబ్బారెడ్డి ఆ దారి తన పట్టా భూమి అంటూ తవ్వేశారు. అదే రోడ్డు మార్గంలో ఇంకో రైతు నాగిరెడ్డి తన పొలంలోకి వస్తుందంటూ జేసీబీతో తవ్వేశారు. దీంతో ఆదారిన ఉండే గ్రామాలకు జనం, విద్యార్థులు కూడా నడచి వెళ్లాల్సి వచ్చింది. ఆటోలు, స్కూల్ బస్సులు, ట్రాక్టర్లు వెళ్లకుండా తవ్వేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని రహదారిని పురుద్ధరించాలని స్థానికులు కోరారు. ఆటోడ్రైవర్ నిజాయితీ రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటాడు. రాయచోటి అర్బన్ ఎస్ఐ అబ్దుల్ జాహీర్ కథనం మేరకు..మదనపల్లెకు చెందిన మహబూబ్బాషా, భార్యతో కలిసి రాయచోటికి వచ్చాడు. పనులు పూర్తిచేసుకొని మార్కెట్ వద్ద ఆటో ఎక్కి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చాడు. ఆటోలో తన భూమికి సంబంధించిన పత్రాలను(ల్యాండ్ డాక్మెంట్ పేపర్లు) మరచిపోయాడు. తరువాత ఆటో డ్రైవర్ అక్కడి నుంచి తిరిగి స్టాండ్లోకి వెళ్లాడు. వెళ్లిన తరువాత డ్రైవర్ హరిబాబు తన ఆటోలో ఉన్న బ్యాగ్ను పరిశీలించి వెంటనే అర్బన్ పోలీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అందులో ఆధారాల ప్రకారం మహబూబ్ బాషాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు పిలిపించి వారికి పత్రాలు ఉన్న బ్యాగ్ అందజేశారు. దీంతో ఆటో డ్రైవర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రాలీ కింద పడి మహిళ మృతి రాజుపాళెం : మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన దారాల ఆరోగ్యమ్మ (52) ట్రాక్టర్ ట్రాలీ కింద పడి మంగళవారం మృతి చెందినట్లు రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో శనగ పంట కోతకు వెళ్లిన ఆరోగ్యమ్మ పొలం వద్దనే ఉన్న ట్రాక్టర్ ట్రాలీ వద్ద సేద తీరుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ తోలడంతో ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. ట్రాలీ కింద పడిన ఆరోగ్యమ్మకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. మృతురాలి కుమారుడు దారాల చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. శవాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ట్రాన్స్ఫార్మర్ దొంగల అరెస్టు – 180 కిలోల కాపర్ తీగలు, పల్సర్ బైక్ స్వాధీనం చక్రాయపేట : ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. గాలివీడు క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి నిందితులు పారి పోయేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు పట్టుకుని విచారించినట్లు తెలిపారు. వైస్సార్ జిల్లా వ్యాప్తంగా 12 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోని 27 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు దొంగిలించినట్లు వారు అంగీకరించారని చెప్పారు. వారి అరెస్టు అనంతరం కడప విమానాశ్రయం వద్ద కంపచెట్లలో దాచిన 180 కిలోల కాపర్ వైరు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాడు. నిందితులు చెన్నూరు మండలం శాటిలైట్ సిటీ సమీపాన ఉన్న రుద్రభారత్పేటకు చెందిన ఈభూది మల్లికార్జున, శంకల శంకర్ అని చెప్పారు. దొంగలను పట్టుకున్న సీఐ ఉలసయ్య, ఎస్సై కృష్ణయ్య, సిబ్బందిని డీఎస్పీ మురళి అభినందించారు. వీధి కుక్కల దాడిలో మేకల మృతి వేంపల్లె : పట్టణంలోని కడప రోడ్డులో నివాసముంటున్న సుధాకర్కు చెందిన మేకలపై మంగళవారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడి చేశాయి. నాలుగు మేకలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. కుటుంబ పోషణకు మేక పిల్లలను పెంచుకుంటున్నానని, కుక్కల దాడితో రూ.50 వేల నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించేలా చూడాలని కోరారు. -
ఇమామ్, మౌజన్లకు అన్యాయం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలోని మౌజన్లు, ఇమామ్లకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మదీనా దస్తగిరి అన్నారు. స్థానిక మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇమామ్లు, మౌజన్లకు నెలకు రూ.15వేల చొప్పున ఇచ్చేవారని, 2024లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 11 నెలలుగా వారికి గౌరవవేతనం ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకూ వారికి రూ.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రూ.45కోట్లు ఇవ్వడానికి జీవో విడుదల చేయడం అన్యాయమన్నారు. రానున్న రంజాన్ మాసంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని, ప్రభుత్వం ఆ మిగిలిన రూ.45 కోట్లు విడుదల చేయాలన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ఎస్ఎండీ.షఫీ మాట్లాడుతూ గతంలో హజ్కు పోయే వారికి విజయవాడ నుంచి అధిక టికెట్లు ఉంటే అప్పటి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో వైఎస్సార్సీపీ మాత్రమే వ్యతిరేకించిందని గుర్తు చేశారు. హజ్ కమిటీ మాజీ ఛైర్మెన్ గౌస్లాజం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముస్లిం, మైనార్టీలకు ఒరిగిందేమీ లేదన్నారు. 3529 మందిని ఒకేసారి హజ్కు పంపిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. జగనన్న ప్రభుత్వంలో ముస్లింలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.23వేల కోట్లు జమ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్బాషా, అతావుల్లా, మియ్యా, అహమ్మద్ పాల్గొన్నారు. -
నిధుల కేటాయింపులో సీమను విస్మరిస్తే ఉద్యమం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నీటి పారుదల శాఖ రాయలసీమను విస్మరిస్తే ఉద్యమం చేపడతామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య అన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కడపలో జరిగే ప్రాజెక్టుల ప్రాంతీయ సదస్సు కార్యాచరణ వేదిక కానుందన్నారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి – భనకచర్ల ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ల కడుపు నింపి ఎన్నికల నిధి పోగు చేసుకోవడానికి ఉపయోగపడుతోందని ఆరోపించారు. కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ ద్వారా శ్రీశైలంలో క్యారీ ఓవర్ నీళ్లను రాయలసీమ ప్రాజెక్టులకు వాడుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతూ వచ్చారని, నేడు కొత్త ప్రతిపాదనల పేరుతో రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని వాపోయారు. పోలవరం పూర్తిచేస్తే పట్టిసీమకు ప్రాధాన్యం ఉండదని తెలిసినా రూ.1600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. సీమ ప్రాజెక్టులకు రూ.10వేల కోట్లు కేటాయిస్తే ప్రాధాన్యత క్రమంలో పంట కాల్వల నిర్మాణం పూర్తయి పది లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందుతుందని ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాలతో ఎగువ భద్ర ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం జాతీయ హెూదా కల్పించిందన్నారు. శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులకు రాకముందే నీటిని తోడేస్తున్నారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంటకు నిప్పు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లు సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు నరసింహులుకు రూ.4 లక్షల నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే మద్దయ్యగారిపల్లి పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ నరసింహులు పులికల్లు సమీపంలో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగుచేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పురవ్వలు పంటపై వేయడంతో మంటలు వ్యాపించాయి. ఈ తరుణంలో రెండు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతోపాటు స్టాటర్, డ్రిప్ పైపులు, పైప్లైన్, ల్యాడర్లు, బోరు కేసింగ్ పైపులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ములకలచెరువు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు. కొట్టం దగ్ధం గాలివీడు : మండలంలోని ఇడపన్చేనుపల్లెకు చెందిన కె.లోకేష్రెడ్డికి చెందిన బోద కొట్టం మంగళవారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఇందులో నిల్వ ఉంచిన రూ.50 వేల విలువ చేసే ఉలవలు కాలిపోయినట్లు తెలిపారు. అధికారులు ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా కలకడ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఐదుగురు ద్విచక్రవాహన దారులపై కేసు నమోదు చేసి వాల్మీకిపురం సివిల్ కోర్టులో హాజరుపరిచనట్లు ఎస్ఐ రామాంజ నేయులు తెలిపారు. న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.11వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాత కక్షలతో వ్యక్తిపై దాడి ఒంటిమిట్ట : మండలంలోని చిన్నకొత్తపల్లి గ్రామంలో సోమవారం బుడుసు హరి అనే వ్యక్తిపై దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై ఒంటిమిట్ట ఎస్ఐ శివ ప్రసాద్ మంగళవారం కేసు నమోదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. హరి అనే వ్యక్తిపై గత కొంతకాలంగా పాతకక్షలు పెట్టుకున్న నంద్యాల ఆకాష్, అజయ్, రమేష్, వెంకటేష్ సోమవారం చిన్న కొత్తపల్లికి వెళ్లారు. ఒంటరిగా ఆటోలో వస్తున్న హరిని కాపు గాసి రోకలి కర్రతో దాడి చేశారు. ఈ దాడిలో బుడుసు హరికి కాళ్లు, కుడిచేయి, తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కడప రిమ్స్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 22న జాతీయ సదస్సు కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఈ నెల 22న ఉర్దూ కవిత, సాహిత్యం్ఙపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉర్దూ విభాగం ఆచార్యులు రియాజున్నీసా తెలిపారు. సదస్సులో ఉర్దూ సాహిత్యం, దాని ప్రాముఖ్యత, ఉర్దూ స్థితి, కడపలో ఉర్దూ సాహిత్యంతిపై చర్చ జరుగుతుందని తెలిపారు. సాహిత్య వర్గాలు, అధ్యాపకులు, విద్యార్థులంతా సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదనపు సమాచారం కోసం 9885348482లో సంప్రదించాలన్నారు. -
రంగ రంగ.. వైభవంగా !
పులివెందుల : వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలో శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతోపాటు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణలు చేశారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డితోపాటు మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్ చిన్నప్ప, అంకాలమ్మ ఆలయ చైర్మెన్ బ్యాటరీ ప్రసాద్, కౌన్సిలర్లు కోడి రమణ, పార్నపల్లె కిశోర్, మాజీ బలిజ సంఘం అధ్యక్షుడు సోపాల వీరా, వివిధ శాఖల అధికారులతో స్వామి వారికి పూజలు జరిపించారు. ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మెన్ సుధీకర్రెడ్డి, ఈఓ వెంకటరమణలు వారిని సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. రథోత్సవం స్థానిక పూలంగళ్ల సర్కిల్ నుంచి కొనసాగి శ్రీనివాస హాలు రోడ్డు, ముత్యాల వారి వీధి, గుంత బజార్, బంగారు అంగళ్ల మీదుగా తిరిగి పూల అంగళ్ల సర్కిల్కు చేరుకుంది. కదిలింది బ్రహ్మరథం దారిపొడవునా గోవిందా నామస్మరణలు, భజనలు -
బాధ్యతగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సమస్యను ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందన్నారు. కావున అధికారులందరూ ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదనరావు, ఎస్డీసీ రమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాటమరాజు మాన్యం భూమిని ఇప్పించండి గ్రామస్తులంతా కలిసి సంక్రాంతి పండుగ రోజున ఉత్సాహంగా జరుపుకునే కాటమరాజు గుడి స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా చూడాలని గాలివీడు గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు విన్నవించారు. సోమవారం గాలివీడు మండలం నూలివీడు గ్రామానికి చెందిన వంద మంది ప్రజలు ప్రత్యేక బస్సు, ఇతర వాహనాల ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదును అందజేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 1880, 1887లలో ఉన్న భూమిలో పూర్వీకుల నుంచి కాటమరాజు గుడి కట్టుకొని, అక్కడే ఏటా సంక్రాంతి పండుగ రోజున చిట్లాకుప్ప వేసుకొని పశువులను ఊరేగింపు నిర్వహించేవారమన్నారు. అయితే స్థానికంగా ఉన్న కొందరు ఆ స్థలాన్ని డీకేటీ పట్టాగా మార్చుకుని కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఇదే విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్ ఫోన్ ద్వారా గాలివీడు తహసీల్దార్తో మాట్లాడి దేవుని మాన్యానికి సంబంధించిన భూమిలో ఉన్న పట్టాలను రద్దు చేసి ప్రజలకు అప్పగించాలని సూచించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేశారు. కలెక్టర్ ఆదేశాలను మండల తహసీల్దార్ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు అక్కడ పంటలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ స్పందించి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తానని మరోమారు హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. అంతకు ముందు గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గుడికి సంబంధించిన ఆస్తిని ఆక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
●వైఎస్సార్సీపీ ఎంపీలు గతంలోనే ప్రయత్నాలు..
చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి కువైట్ ఎంబసీ మిసాల్ ముసాపా ఆల్–షామితి..ఆయనను తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కలిశారు. కువైట్ నుంచి విమానాలు తిరుపతి రన్వేపైకి తీసుకురావాలని కోరారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో రెండు లక్షలకుపైగా కువైట్లో జీవనోపాధి కోసం వెళుతుంటారు..వస్తుంటారు..వీరిని దృష్టిలో వుంచుకొని ఎడారి విమానం తిప్పాలని విన్నవించారు. రాజంపేట : ఉభయ వైఎస్సార్ జిల్లా నుంచి ఎడారి దేశాల విమానాలకు రెక్కలొచ్చేదెప్పుడోనని గల్ఫ్వాసుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రం నుంచి కేంద్ర పౌర విమానాయనశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రామ్మోహన్నాయుడుపై తిరుపతి ఎయిర్పోర్టులో ఎడారిదేశాలకు విమానయాన సౌకర్యం కల్పించే బాధ్యత పడింది. ఇవి తిరుపతి రన్వేపై ఎగిరితే తమ పయనానికి ఇక ఇక్కట్లు ఉండవని వేయికళ్లతో వలసజీవులు ఎదురుచూస్తున్నారు.అయితే పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్రయానం నుంచి విమానాల దాకా.. గల్ఫ్దేశాలకు వెళ్లేవారు నాలుగు దశాబ్దాల కిందట సముద్రయానం ద్వారా చేరుకునేవారు. వారాల కొద్దీ పయనించి ఎడారిదేశాలకు చేరుకునేవారు. అప్పట్లో గల్ఫ్ జీవనోపాధికి డిమాండ్ లేని రోజుల్లో మాట ఇది. రానురాను అక్కడ పనిచేసే ఉన్నతంగా జీవనం సాగించవచ్చని, తమ కుటుంబాలు ఆర్ధికంగా బలోపేతం కావచ్చనే భావనతో ఎడారి పయనాలు అధికమయ్యాయి. ముఖ్యంగా రాజంపేట, రాయచోటి, కడప, బద్వేలు, రైల్వేకోడూరుతో పాటు ఉభయ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మంది ఎడారిదేశాలపై ఆధారపడి జీవిస్తున్నారు కరోనా సమయంలో గల్ఫ్లో కరోనా సోకిన వారిని విమానాల ద్వారా తిరుపతి ఎయిర్పోర్టుకు చేర్చారు. అప్పట్లో ఏపీఎన్ఆర్టీ ద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో కేంద్రప్రభుత్వం గల్ఫ్లో కరోనా బాధితులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. తిరుపతి ఎయిర్పోర్టుకు నేరుగా విమానాల్లో తీసుకొచ్చి, వారిని జిల్లాలో ఏర్పాటు చేసిన కరోనా నివారణ శిబిరాల్లో ఉంచి, తర్వాత ఇళ్లకు క్షేమంగా చేర్చిన సంగతి విధితమే. కాగా అంతర్జాతీయసర్వీసులు తీసుకొచ్చేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎడీసీఎల్) ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి అంతర్జాతీయస్ధాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్న కలలు ఇంకా కలలాగే మిగిలిపోతున్నాయి. వ్యయప్రయాసలతో . చైన్నె, కర్ణాటక, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు వ్యయప్రయాసలతో వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా అనేక మంది భాష రాక ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే మోసపోతున్నారు. దూరప్రయాణంతో అనేక అవాంతరాలు, ప్రమాదాలబారిన పడుతున్నారు.విమానటికెట్తో పాటు ఎయిర్పోర్టుకు చేరుకునే ఖర్చులు భరించలేకపోతున్నారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయహోదా కల్పించారు. కానీ ఆ స్ధాయిలో విమాన సర్వీసులను తీసుకురాలేదన్న అపవాదును కేంద్రప్రభుత్వం మూటకట్టుకుంది. ఉభయ జిల్లాల నుంచి.. రాయలసీమలో ప్రధానంగా ఉభయ వైఎస్సార్ జిల్లాల నుంచి ఎడారిదేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధికోసం కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా,బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలకు వెళతారు. ఉద్యోగరీత్యా, విద్య కోసం అమెరికా, కెనడా, సౌతాఫ్రికా,శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో స్ధిరపడిన వారు ఉన్నారు. వీరు కూడా విదేశీయానం చేయాల్సివస్తే కష్టతరంగానే ఉంది. భాష రాని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్టు నుంచి ప్రయాణించాలంటే గగనమవుతోంది. గల్ఫ్దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు. మోసాలపాలైన వారు చాలామంది ఉభయ జిల్లాలో ఉన్నారు. గల్ఫ్ విమాన సర్వీసులు తీసుకురావాలి తిరుపతి ఎయిర్పోర్టులో విదేశీ విమాన సర్వీసులను తీసుకొచ్చేందుకు వైస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రయత్నాలు జరిగాయి. ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఇప్పటి వరకు కరుణించలేదు. గల్ఫ్వాసులకు విమానయాన సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయత్నాలు చేశాయి. – పీవీ మిథున్రెడ్డి, ఎంపీ, రాజంపేట కేంద్రం తక్షణమే స్పందించాలి రాయలసీమ జిల్లా వాసులకు అందుబాటులో ఉండే తిరుపతి ఎయిర్పోర్టు నుంచి విదేశీ విమాన స ర్వీసులను ప్రవేశపెట్టాలి.దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. విదేశాలకు వెళ్లాలంటే ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. చైన్నె, బెంగళూరు తదితర రాష్ట్రాలకు చెందిన విమానశ్రయాల ద్వారా వెళ్లాలంటే కష్టతరంగా ఉంది. కువైట్ ఎంబీసీకి తిరుపతి ఎంపీతో కలిసి ఈ విషయం తెలియజేశాం. కనీసం కడపోళ్ల కోసం కువైట్ నుంచి విమానం నడిపించాలి – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు తిరుపతి రన్వేపైకి.. ఎడారి విమానాలెప్పుడో! ఎదురుచూపుల్లో ఉభయ జిల్లాల గల్ఫ్వాసులు ఇప్పటికై నా కేంద్రం కరుణించేనా ! తిరుపతి, రాజంపేట లోక్సభ సభ్యులు తమ వంతుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రన్వే మీదకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో తిరుపతి నుంచి విదేశీయానంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ విషయంలో కేంద్రప్రభుత్వం కనికరించలేదు. ఫలితంగా రాయలసీమవాసులకు విదేశీయానం గగనతరంగా మారింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తిలు కువైట్ ఎంబసీని కలిసి గల్ఫ్ విమానాలు తిరుపతి విమానశ్రయం నుంచి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
రాజంపేట మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
రాజంపేట : రాజంపేట పురపాలక సంఘం కమిషనర్ బి. నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యా రు. సోమవారం పట్ట ణ అభివృద్ధి శాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకపోవడం, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కార్యాలయానికే పరిమితి కావడం, ఇతర కారణాలతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు. భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి మూలవిర్ట్లకు స్వామివారికి అర్చకులు పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగురంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు.పల్లకీలో కొలువుదీర్చారు.ఆలయ మాఢవీధులు, ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు.భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో ఈవో డివి రమణారెడ్డి పాల్గొన్నారు. రైతులు గుర్తింపు కార్డులు తీసుకోవాలి గుర్రంకొండ : రైతులందరూ తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డులను తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ అన్నారు. సోమవారం స్థానిక రైతుసేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతు గుర్తింపు కార్డుల కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలో మొత్తం 6725 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 2513 మంది గుర్తింపు కార్డుల కోసం ఆన్లైన్లో నమోదు చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఈకార్యక్రమాన్ని ఇంకా వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుసేవాకేంద్రాల్లో రైతులు తమ భూమి రికార్డులు, వన్బీ, అధార్కార్డు జిరాక్స్కాపీలతో పాటు తమ సెల్ఫోన్ నంబర్ తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో గుర్తింపు కార్డులు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకొన్న వారికి త్వరలో గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎవో రత్నమ్మ, ఎఈవో ఆనిత, వీహెచ్ఎ నవాజ్, రైతులు పాల్గొన్నారు. టెంకాయల వేలం పాట రాజంపేట రూరల్ : ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన కామాక్షి త్రేతేశ్వరస్వామి దేవస్థానంలో సంవత్సరం పాటు టెంకాయలు విక్రయించేందుకు వేలంపాట నిర్వహించినట్లు దేవస్థాన ఈఓ గంగవరం కొండారెడ్డి తెలిపారు. సోమవారం ఆలయంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జనార్దన సమక్షంలో వేలం పాట జరిగిందన్నారు. పూల దత్తాత్రేయ రూ.7,10,000 వేలం దక్కించుకున్నట్లు ఈఓ తెలిపారు. నేడు, రేపు కడపలో అంతర్జాతీయ సదస్సు కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో మంగళ,బుధవారాల్లో ‘తెలుగులో రామాయణాలు – సామాజిక దృక్పథం’అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీ కె. కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారని తెలిపారు. సదస్సుల్లో దేశ విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు, సాహితీవేత్తలు 60 మంది పరిశోధనా పత్రాలు సమర్పణ చేస్తారన్నారని తెలిపారు. విదేశాల ప్రతినిధులు, పత్ర సమర్పకులు అంతర్జాలం ద్వారా కూడా పాల్గొంటారన్నారు. మంగళవారం సాయంత్రం 5–30 గంటలకు భారతీయ నృత్య సంస్థాన్కు చెందిన 30 మంది నృత్య కళాకారులు ‘సీతారామ కల్యాణం’నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారన్నారని ఆమె వివరించారు. -
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదులపై సత్వరం స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు. మదనపల్లెటౌన్ బసినకొండ జన్మభూమి కాలనీ కేదారేశ్వరీ దేవాలయంలో నివాసం ఉంటున్న మాండలిక వెంకటశాస్త్రి తన సమస్యను చెప్పుకోవడానికి నడవలేని స్థితిలో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ తన ఛాంబర్ నుంచి శాస్త్రి వద్దకు వెళ్లి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.చట్టపరిధిలో వారికి న్యాయం చేయాలని మదనపల్లె డీఎస్పీని ఆదేశించారు. -
లెక్కల గారడీ
బి.కొత్తకోట : జిల్లాలోని పేదలకు గూడు భరోసా కల్పిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా 78,221 మందికి పక్కా గృహాలను మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ఇంటిస్థలాలు, నిర్మాణ నిధులు ఇచ్చింది. దీంతో పాటు నిర్మాణాలకు ఇబ్బందులు కలగకుండా బోర్లు, విద్యుత్ సౌకర్యం, పుష్కలంగా నీరు లభించేలా చర్యలు తీసుకుంది. రహదారులు ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాల విషయంలో లెక్కలు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్ని ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటికి ఎంత బిల్లు చెల్లించారు ఇలా పూర్తి వివరాలను ఏ రోజుకారోజూ ిసిద్ధం చేయాలి. లేకపోతే పేదల ఇళ్లకు అన్యాయం జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్ఎస్..బీబీఎల్లోకి.. జిల్లాలో జనవరి మొదటి వారం దాకా నిర్మాణాలే చేపట్టని (నాన్ స్టార్టెడ్) గృహాలు 8,725 ఉన్నట్టు గృహనిర్మాణశాఖ లెక్క. అంటే ఈ ఇళ్ల పనులను లబ్ధిదారులు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే ఈ లెక్కను అధికారులు తారుమారు చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటివారానికి నాన్స్టార్టెడ్ ఇళ్ల సంఖ్య 1,046కు తగ్గిపోయింది. అంటే కేవలం నెలన్నరోజుల్లో 7,679 ఇళ్ల నిర్మాణాలను పునాదుల స్థాయి నుంచి మొదలు పెట్టారన్నది లెక్క. ఈ విషయంలో రాష్ట్ర అధికారిక లెక్క ప్రకారం నెలక్రితం నివేదికలు పరిశీలిస్తే..అందులోనూ నాన్ స్టార్టెడ్ ఇళ్ల సంఖ్య లేదు. ప్రారంభంకాని అన్ని ఇళ్లను బీబీఎల్ స్థాయిలో ఉన్నట్టు..ఆ ఇళ్లసంఖ్య 9,754గా పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటివారం నివేదికలో బీబీఎల్ ఇళ్లు 9,385గా ఉంది. అంటే నాన్ స్టార్టెడ్ ఇళ్లు దాదాపుగా ప్రారంభమైనట్టుగా లెక్క వేశారు. ఇది అధికారుల లెక్కకు బాగానే ఉంటుంది.. కానీ లబ్ధిదారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. గడువు దాటాక కష్టాలే ఈ మార్చిలోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుంటే కేంద్రం నుంచి నిధులు రావని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని కారణంగానే అధికారులు అన్నీ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాని నివేదిస్తున్నట్టు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మించుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం మొదలైనట్టు ఆన్లైన్లో స్థాయి నమోదు కావడంతో కొత్తగా మళ్లీ ఇంటికి అర్హత కోల్పోవాల్సిందే. ప్రారంభంకాని జాబితాలో ఉంటే ఇంకోసారైనా ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం దక్కుతుంది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నట్టు చూపితే భవిష్యత్లో ఇంటికి మంజూరు లభించదు. అలాగే కొత్తగా మంజూరు అవకాశం ఉండదు. దీంతో పేదలు రెండు విధాలా నష్టపోవాల్సి వస్తుంది.మార్చి నెలాఖరులోపు నిర్మాణం పూర్తి చేసుకుంటే నిధులు అందే అవకాశం ఉంటుంది. అలా నిర్మించుకోలేని పేదల పరిస్థితి దయనీయమే. ఇప్పటికే వివిధ కారణాలతో ఇళ్లు నిర్మించుకోలేని వారిలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పట్టణాలకే కొత్త ఇళ్లు జిల్లాలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కేవలం 1,005 పక్కా గృహాలను మాత్రమే మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక మొత్తంగా రహస్యంగానే సాగింది. దీని మంజూరు కోసం నివేదికలను పంపుతున్నారు. ఇందులో లబ్ధిదారులెవరో, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తెలియని పరిస్థితి నెలకొంది. బి.కొత్తకోట నగర పంచాయతీకి మొక్కుబడిగా 75, మదనపల్లె మున్సిపాలిటీకి 460, రాయచోటి మున్సిపాలిటీకి 310, రాజంపేట మున్సిపాలిటీకి 160 గృహాలు కలుపుకుని మొత్తం 1,005 ఇళ్లు కేటాయించారు. మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు కేటాయించాలంటే ఏమూలకు సరిపోవు. ఒక్కో మున్సిపాలిటీలో వేలసంఖ్యలో పేదలు ఉన్నారు. అందరికీ ఇళ్లు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో తమకు కావాల్సిన వారి కోసమే ఇళ్లు కేటాయించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక జిల్లాలోని 30 మండలాల పేదలకు ఇళ్ల మంజూరు ఎప్పుడు చేపడతారని ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై జిల్లా గృహనిర్మాణశాఖ అధికారి శివయ్య మాట్లాడుతూ తొలి విడతలో పట్టణాల్లోని పేదలకు మంజూరు చేశారని చెప్పారు. రెండో విడతలో ఇంకా ఇళ్ల సంఖ్య పెంచడంతోపాటు జిల్లా మొత్తానికి ఇళ్లు మంజూరు చేస్తారని చెప్పారు. ఇళ్లన్నీ ప్రారంభమయ్యాయట! నాన్స్టార్టెడ్ గృహాలు నిర్మాణాల్లో ఉన్నాయట స్థాయి లెక్క మార్చేసి లక్ష్యం కోసం తంటాలు -
హత్యాయత్నం కేసులో మూడేళ్ల జైలు శిక్ష
రాయచోటి టౌన్ : మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ రాయచోటి సీనియర్ సివిల్ జడ్జి ఈ.ప్రసూన తీర్పు వెలువరించినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. అర్బన్ ఎస్ఐ అబ్దుల్ జాహీర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె వీధిలో జబ్బార్ స్కూల్ దగ్గర నివాసం ఉండే షేక్ ఇలియాస్ అదే వీధిలో నివాసం ఉండే మహిళలతో అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో అదే వీధికి చెందిన మహబూబ్ జాన్తో గొడవ పడి అసభ్యకరంగా మాట్లాడాడు. ఇరుగుపొరుగువారు ఇచ్చి సర్దిచెప్పి పంపించారు. అయితే దీనిని అవమానంగా భావించిన షేక్ ఇలియాస్ 2022 సంవత్సరం జూన్ 1వ తేదీ రాత్రి 9–30 గంటల సమయంలో ఇంటి బయట ఒంటరిగా పడుకొని ఉన్న మహబూబ్ జాన్పై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. సమీపంలోని పఠాన్ గులాబ్జాన్, హసీనా, మజహర్, అష్రిఫూన్లు గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. దీనిపై విచారణ సాగించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. జరిమానా విధించారు. ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబుళ్లు జి. రమేష్, నాగ శంకర్లు సాక్షులను ప్రవేశపెట్టారు. -
ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడో?
రాయచోటి: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి. ఎన్నికలకు ముందు మహిళలు ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. టీడీపీ కూటమి నేతలు గద్దెనెక్కి ఎనిమిది నెలలు దాటినా హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉచిత బస్సు ప్రయాణం ఇక ఎప్పుడా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేశాయి. తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచో అమలులో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ అదే ఫార్ములాను అమలు చేసింది. ఉచిత బస్సు అంటూ జోరుగా ప్రచారం చేపట్టింది. అయితే ఈ ఉచిత బస్సు హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబునాయుడు ఉచిత బస్సు ప్రయాణమని ప్రజలను మభ్యపెట్టారని స్పష్టం కావడంతో మహిళలు ఉసూరుమంటున్నారు. ఉచిత ప్రయాణంపై కానిరాని స్పష్టత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు కనీసం స్పష్టత ఇవ్వలేదు. అయితే రోడ్డు రవాణాశాఖ మంత్రి త్వరలోనే అని చెప్పడం తప్ప ఎప్పటినుంచి ప్రారంభిస్తారో స్పష్టంగా చెప్పకపోవడం శోచనీయం. తొలుత గతేడాది ఆగస్టు 15 నుంచి అనడం, మళ్లీ మహిళలకు దీపావళి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం అని వదంతులు సోషల్ మీడి యాలో హల్చల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికితోడు ఏకంగా చంద్రబాబు సైతం సూపర్ సిక్స్ హామీలైతే ఇచ్చాంగానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందని వ్యాఖ్యానించడం మహిళల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పండుగల పేరుతో కాలయాపన హామీ అమలుకు పండుగల పేరుతో కూటమి నాయకులు కాలయాపన చేస్తున్నారని పలువురు మహిళలు విమర్శిస్తున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ కప్పదాటు ప్రయత్నాలు చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికై నా ఇచ్చిన మాట ప్రకారం హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిళలు, వివిధ పార్టీల నేతలు కోరుతున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే.. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 7,26,327 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అయితే రోజూ సగటున 50 శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇతర హామీలతోపాటు ఈ హామీని తుంగలో తొక్కారు. ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కొరవడిన స్పష్టత మాటలకే పరిమితమైన హామీ పట్టించుకోని ప్రభుత్వం మోసపోయామని మహిళల ఆవేదన -
ఉపాధి అవినీతిపై చర్యలు తీసుకోవాలి
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో ఉపాధి పనుల కేటాయింపులను, కూలీల వేతనాల పంపిణీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి జిల్లాలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్ను కలిశారు. ఉపాధిహామి పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదన్న హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని విన్నవించారు. స్థానిక టీడీపీ నాయకులు యంత్రాలతో పనులు చేయిస్తూ, ప్రైవేటు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నిబంధనలకు విరుద్ధంగా నిధులను డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామసభ ఆమోదించిన పనులను మాత్రమే చేయాలని తెలిపారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఇలా చేయడం ఉపాధిహామి చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్ట విరుద్ధమని, అలా ప్రైవేటు కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులను వెంటనే రద్దు చేయాలని తీర్పు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం నాయకులు ఎం.రామస్వామి రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.కలెక్టర్ను కోరిన ఎంపీపీలు, సర్పంచ్లు -
సైబర్ కేసులో మదనపల్లె వాసి అరెస్టు
మదనపల్లె : సైబర్ కేసులో నిందితుడైన మదనపల్లె వాసిని సోమవారం తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్కు తరలించారు. వివరాలు... మదనపల్లె పట్టణం ఆర్ఆర్ వీధిలో ఉన్న షేక్ షా నవాజ్ (32) నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రైవేట్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని 15 మంది నిరుద్యోగుల వద్ద రూ. 11 లక్షల నగదు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకపోగా, కాలయాపన చేస్తూ వచ్చాడు. తాము చెల్లించిన నగదు తిరిగి ఇచ్చేయాలంటూ బాధితులు ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో బాధితులు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వకపోవడంతో, ఉద్యోగాలు ఇప్పించకుండా తమ నగదు కాజేసి మోసం చేశాడని గ్రహించిన బాధితులు హైదరాబాద్ గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణలో భాగంగా నిందితుడి ఆచూకీ తెలుసుకొని, సోమవారం మదనపల్లెకు వచ్చి వన్ టౌన్ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో నిందితుడిని హాజరు పరిచి, విచారణ నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు తరలించిన తెలంగాణ పోలీసులు ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 11 లక్షలు వసూలు -
అక్రమ తవ్వకాలు చేస్తున్న వాహనాలు స్వాధీనం
ఒంటిమిట్ట : మండల కేంద్రంలోని ఒంటిమిట్ట చెరువులో ఆదివారం అర్థరాత్రి అక్రమ తవ్వకాలు చేస్తున్న వాహనాలను గనుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంటిమిట్ట చెరువులోని రైలుకట్ట అవతల ఉన్న చెరువు ప్రాంతంలో అక్రమంగా జేసీబీతో మట్టి గుళ్లను త్రవ్వి, ట్రాక్టర్కు పోస్తున్న సమయంలో గనులశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మట్టి తవ్వుతున్న జేసీబీని, ట్రాక్టర్ను అదుపులోని తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. ‘నా భర్త నుంచి కాపాడండి’ రాయచోటి టౌన్ : నా భర్త నుండి నన్ను కాపాడండి అంటూ మదనపల్లె పట్టణం పెంచిపాడు రోడ్డుకు చెందిన పి. పార్వతమ్మ అనే మహిళ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఆమె తన కుటుంబ సభ్యులతో కలసి జిల్లా కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్కు వచ్చి ఈ ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు మదనపల్లె రూరల్ పరిధిలోని చిన్న తిప్ప సముద్రం గ్రామానికి చెందిన ఈమెకు 23 ఏళ్ల క్రితం మదనపల్లె పట్టణంలోని పి. భాస్కర్తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె భర్త మదనపల్లె ఎస్టేట్లోని గార్మెంట్లో మేనేజర్గా పని చేస్తాడు. ఈ క్రమంలో అతను మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వెంట రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లికార్జున, శ్రీరాములు, రామప్ప, లక్ష్ముమ్మ తదితరులు పాల్గొన్నారు. -
24న ధర్నాను జయప్రదం చేయండి
రాయచోటి అర్బన్ : వ్యవసాయ కార్మికులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24వ తేదీన విజయవాడ వద్దగల తాడేపల్లె గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాల యం ఎదుట జరుప తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు క్రిష్ణప్ప కోరారు. ధర్నాకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆయన సంఘం నాయకులతో కలసి సీపీఐ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. మినిట్స్ కాపీలో ఇచ్చిన జీఓలను అమలు చేయాలిరాయచోటి అర్బన్ : సమ్మె సందర్భంగా యిచ్చిన మినిట్స్ కాపీలోని జీఓలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాయచోటి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఎస్.భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు.సోమవారం రాయచోటి ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో పలువురు వర్కర్లు, హెల్పర్లకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. దిగువరాజువారిపల్లె కేంద్రానికి 2 ఏళ్లుగా హెల్పర్ విధులకు హాజరు కాకపోయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. యూనియన్ నాయకులు బంగారుపాప, అరుణ, విజయ, షబీనా, సుమలత, సురేఖ, పద్మజ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీ కొని ఇద్దరికి తీవ్ర గాయాలు
నందలూరు : కడప–చైన్నె ప్రధాన రహదారిలోని నందలూరు బస్టాండ్ కూడలిలో సోమవారం సాయంత్రం బైకును కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. మాధవరం నుంచి తాళ్లపాకకు బైకుపై వెళ్తున్న కమ్మినేని ప్రసాద్, శ్రీకళ దంపతులను కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న కారు ఢీ కొనడంతో బైక్పై వెళ్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.హైవేపై రోడ్డు ప్రమాదంబి.కొత్తకోట : మదనపల్లె నుంచి ఖాళీ టమాట క్రేట్లతో స్వగ్రామానికి వెళ్తున్న రైతుల వాహనం బి.కొత్తకోట మండలంలోని అమరనారాయణపురంలో సోమవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో మదనపల్లెకు తరలించారు. వివరాలు.. శ్రీసత్యసాయిజిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి పంచాయతీ బాపనపల్లికి చెందిన రైతులు నరేంద్ర (56), శివశంకర్ (40)లు టమాట పంటను విక్రయించేందుకు సాయంత్రం బోలేరో పికప్ వాహనంలో మదనపల్లె మార్కెట్కు తీసుకొచ్చారు. మార్కెట్లో టమాటలను ఉంచి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో మదనపల్లె నుంచి కదిరివైపు వస్తుండగా బి.కొత్తకోట మండలం అమరనారాయణపురం జాతీయరహదారి వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. రైతులు వెళ్తున్న వాహనం ఎదురుగా కారు రావడంతో ప్రమాదం తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ–బోలేరో పికప్ వాహనం బాగా దెబ్బతిన్నాయి. బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పరీక్షల భయాన్ని పోగొట్టడం అభినందనీయంరాయచోటి అర్బన్ : విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు విద్యార్థి సంఘాల నేతలు ప్రజ్ఞా వికాస్ పరీక్షలను నిర్వహిస్తుండడం అభినందనీయమని డీఈఓ సుబ్రమణ్యం అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఈనెల 27న యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో నిర్వహింప తలపెట్టిన ప్రజ్ఞావికాస్ పరీక్ష పోస్టర్ను డిప్యూటీ డీఈఓ శివప్రకాష్రెడ్డి, ఓపెన్స్కూల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జాబీర్లతో కలసి విడుదల చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాయచోటి యూటీఎఫ్ కార్యదర్శి రాజా రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ, జిల్లా ఉపాధ్యక్షుడు గురునాథ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు -
బుద్ధునికొండ అభివృద్ధికి సహకరించాలి
మదనపల్లె : మండలంలోని అంకిశెట్టిపల్లె బుద్ధునికొండ అభివృద్ధికి సహాయం అందించాల్సిందిగా సీఎం చంద్రబాబునాయుడుని కోరుతామని ఇంటర్నేషనల్ బిక్ఖు సంఘం ప్రతినిధులు భంతే సద్దారక్కిత(తెలంగాణ), డాక్టర్ నాగభూషణం భంతే(యూపీ), భంతే నాగరత్న(కర్నాటక)లు తెలిపారు. సోమవారం బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఫౌండర్ ట్రస్టీ ఉపాసక పీటీఎం శివప్రసాద్తో కలిసి బుద్ధుని కొండను సందర్శించారు. విహారలోని బోధి వృక్షానికి, భగవాన్ బుద్ధ విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ...ప్రకృతి సిద్ధమైన సౌందర్యం, కనువిందుచేసే ఆధ్యాత్మిక శోభతో మానసిక వికాసం కలిగించి, పంచశీల పరివర్తన పీఠంగా చరిత్ర పుటల్లో నిలిచే గొప్ప పుణ్యక్షేత్రం బుద్ధునికొండ అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పురాతన బౌద్ధ విహారాలు చాలావరకు శిథిలావస్థలో ఉండగా, కొత్తగా మరికొన్ని విహారాలు నిర్మాణంలో ఉన్నాయని, వీటి అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రంలో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ధమ్మసభకు విచ్చేయండి.. బెంగళూరు సిటీ సదాశివనగర్లోని నాగసేన బుద్ధవిహారలో ఇంటర్నేషనల్ బిక్ఖుసంఘం సౌత్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈనెల 23న ధమ్మసభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధభిక్షువులు హాజరవుతున్న ఈ సభకు బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు, బౌద్ధాభిమానులు పెద్దసంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రఘునాథ్, ట్రస్ట్ సభ్యులు నీరుగట్టి రమణ, చాట్ల బయన్న, తలారి కృష్ణ, బురుజ జనార్దన్, నీరుగట్టి రాజేష్, సి.కల్యాణ్, బైనేని సురేష్, శరత్కుమార్, శంకరమ్మ, పృథ్విరాజ్ అంబేడ్కర్(అభి) తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ఆరోపణలు మంత్రి స్థాయికి తగవు
రాయచోటి అర్బన్ : మున్సిపల్ పాలకవర్గంపై రాష్ట్ర మంత్రి రాంప్రసాద్రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదని మున్సిపల్ చైర్మన్ చిల్లీస్ ఫయాజ్బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రహిమాన్, పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో ఆయనతో పాటు పాలకవర్గ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి పాలకవర్గం ఎలాంటి సహాయ, సహకారాలు అందించడం లేదని మంత్రి చెప్పడం దారుణమన్నారు. రాయచోటి అభివృద్ధికి మంత్రి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తమ వంతు పూర్తి స్థాయి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. మున్సిపల్ పరిధిలో కౌన్సిల్ అనుమతి లేకుండానే తెలుగుదేశం పార్టీ నేతలు పలు పనులను చేపడుతున్నా కౌన్సిల్ సభ్యులెవరూ ఎలాంటి అభ్యంతరం తెలుపలేదన్నారు. గత మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 15వ ఫైనాన్స్ నిధుల వినియోగానికి సంబంధించి అధికారులు ఇష్టారాజ్యంగా తయారు చేసిన ప్రతిపాదనలను కౌన్సిలర్లు వ్యతిరేకించారనన్నారు. 15వ ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు కేటాయిస్తుంటే రాష్ట ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారుల పనితీరు కారణంగానే మున్సిపల్ పాలకవర్గం, మంత్రికి మధ్య సమన్వయం లోపించిందని తెలిపారు. మంత్రి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకువచ్చినా అభివృద్ధికి తమ పాలకవర్గం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు ఈఽశ్వర్, సాదక్అలీ, కొలిమి చాన్బాషా, రౌనఖ్ హుస్సేన్, గౌస్ఖాన్, వైఎస్సార్సీపీ నాయకులు ఫయాజ్ అహమ్మద్, అన్నా సలీం, రియాజ్, ఇర్ఫాన్, శ్యామ్కుమార్, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం -
వెంటాడుతున్న చిరుత భయం
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో ఆదివారం చిరుత పిల్ల కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుతలు సంచరిస్తున్నాయని వారు భయాందోళన చెందుతున్నారు. గత 30 రోజులుగా చిరుత, వాటి పిల్లలు లింగాల, పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లోని గ్రామాల్లో సంచరిస్తున్న విషయం విదితమే. లింగాల, పులివెందుల మండలాల్లో ప్రతి రోజు ఏదో ఒక గ్రామంలో చిరుత అడుగులు, చిరుత పిల్లలు కనిపిస్తూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్పా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రాణాలు పోయే వరకు స్పందించరా.. సింహాద్రిపురం, లింగాల, పులివెందుల మండలాల్లో చిరుతలు సంచరిస్తున్నాయని ఫారెస్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం స్పందించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణాలు పోయేంత వరకు అధికారులు మీరు స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం పులివెందుల మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో నూగు పంటలో చిరుత పిల్ల కనిపించిందని గ్రామానికి చెందిన గంగిరెడ్డి తెలిపారు అలాగే లింగాల మండల కేంద్ర సమీపంలో చిరుత అడుగు జాడలు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు ఇంకా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జంతువుల ప్రాణాలకే కాదు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా అటవీ అధికారుల దాటవేత వైఖరికి కారణమేంటో అర్థం కావడం లేదు. ఇప్పటికై నా వారు స్పందిస్తారా.. ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే. లింగాలలో పులి అడుగుజాడలులింగాల : మండల కేంద్రమైన లింగాలలో చిరుత పులుల అడుగుజాడలు కనిపించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని చౌడమ్మ పొలాల్లో ఆదివారం ఒక చిరుత పులి, రెండు చిరుత పులి పిల్లల అడుగుజాడలు కనిపించాయని గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన వాసుదేవ రెడ్డి అనే రైతు పొలంలోని అరటి తోటలో కూడా అడుగుజాడలు కనిపించాయన్నారు. పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం ఫారెస్ట్ అధికారి మహబూబ్ బాషా పరిశీలించారు. రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలిపులివెందుల రూరల్ : పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ సీఐ రమణ తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాద్రిపురం మండలం రామాపురం, బలపనూరు గ్రామాల శివారు ప్రాంతాలలో 10 రోజుల కిత్రం విద్యుత్ తీగలు తగులుకుని మగ చిరుత మృతి చెందింది. దీంతో ఆడ చిరుతతో పాటు రెండు పిల్లలు సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని పలు గ్రామాలలో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తోటల వద్దకు వెళ్లే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుతలు సంచరించే గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఎక్కడైనా చిరుతలు కనిపిస్తే వెంటనే సంబంధిత ఫారెస్ట్ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తుమ్మలపల్లె సమీపంలో చిరుత పిల్ల సంచారం పట్టించుకోని అటవీ అధికారులు భయాందోళనలో గ్రామస్తులు -
మన మార్పు.. వారికి నేర్పు!
మదనపల్లె సిటీ: పబ్లిక్ పరీక్షలు సమయం దగ్గరపడుతోంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల దైనందిక జీవితంలో మార్గదర్శకులుగా మారడం అవసరం. వారి చదువుకు అనువైన వాతావరణం కల్పించాలి. జిల్లాలో మరో నెల రోజుల్లో పదోతరగతి, 15 రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల వేళ తల్లిదండ్రులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ జంక్పుడ్, నూనె పదార్థాలు, మసాలా ఆహారం తినకుండా నిలవరించాలి. ఇంట్లోనే షోషకాలు అందే ఆహారం సమకూర్చాలి. పెద్దలు వీటిని ఆహారంలో తీసుకోకుంటే పిల్లలకు అలవాటు అవుతుంది. సెల్ఫోన్కో నియమం: పిల్లలు చదువుకునే సమయంలో పెద్దలు సెల్ఫోన్ చూస్తూ లేదా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. దీంతో వారి ఏకాగ్రత సెల్ఫోన్పై మళ్లే అవకాశం ఉంటుంది. అవసరం మేరకే వారి ముందు ఫోన్ ఉపయోగించాలి. ఒత్తిడికి దూరం.. చాలా సమయం వృథా చేస్తున్నావ్ అని పిల్లలను దబాయించకూడదు. ఇది మరింత ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. ఒక్కో సారి తల్లిదండ్రులు వారి పని ఒత్తిడిని ఇంట్లో ప్రదర్శిస్తుంటారు. ఇది పిల్లల చదువుపై ప్రభావం చూపిస్తుంది. అనువైన వాతావరణం పిల్లలను చదవమని చెప్పి ఇంట్లో టీవీల్లో పెద్ద శబ్దాలు పెట్టడం, బయట వ్యక్తులతో పిచ్చాపాటి చర్చలు పెట్టడం వంటివి మానుకోవాలి. ప్రశాంత వాతావరణం కల్పిస్తే పుస్తకాలపై దృష్టి సారిస్తారు. మత్తుకు దూరం: పరీక్షల సమయంలో మత్తుకు దూరంగా ఉండటంతో పాటు పిల్లలోనూ మత్తు, సిగరెట్, గుట్కా వంటివేమైనా అలవాటుందా గుర్తించి వాటి బారి నుంచి తప్పించడానికి ప్రయత్నించాలి. పరీక్షల వేళ తల్లిదండ్రులదే కీలకపాత్ర -
సోలార్ బాధితులకు న్యాయం చేస్తాం
గాలివీడు : సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు తగిన న్యాయం చేస్తామని ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని తూముకుంట గ్రామంలో అదనంగా ఏర్పాటు చేస్తున్న 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ పనులను ఆయన తహసీల్దార్ భాగ్యలతతో కలసి పరిశీలించి, రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోలార్ విద్యుత్ అదనపు ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ భూమిలో నిర్మాణం పనులు జరుగుతుండగా కొందరు స్థానికులు పదే పదే అడ్డు తగలడం సరికాదన్నారు. ఆ భూములు వారి అనుభవంలో ఉన్నట్లు ఆధారాలు ఉంటే వారితో చర్చించి వారికి ప్రత్యామ్నాయంగా అసైన్మెంట్లో భూమిని కేటాయిస్తామన్నారు. ఇదిలా ఉండగా తూముకుంట దిగువమూల, ప్రకాశ్ నగర్ కాలనీ వాసులు తమ అనుభవంలో ఉన్న భూములను సోలార్కు కేటాయించడం ద్వారా 40 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలో ఉన్న రేకులషెడ్లపై చర్యలు తీసుకోండి గుర్రాలమిట్ట వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు తొలగింపునకు తగిన చర్యలు తీసుకో వాలని ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ బాలాజీ, ఎస్ఐ రామకృష్ణ, వీఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
ఆపద వేళ అండగా పోస్టల్ బీమా
● తపాలాశాఖ ఖాతాదారులకు ప్రత్యేకం ● రూ.10 లక్షలు, రూ. 15 లక్షలు బీమా పథకాలు ● 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్కులు మాత్రమే అర్హులుకడప వైఎస్ఆర్ సర్కిల్ : పేద, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీని ప్రవేశ పెట్టింది తపాలా శాఖ. రూ.599 ప్రీమియంతో రూ. 10 లక్షలు , రూ.799 ప్రీమియంతో రూ. 15 లక్షలు బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారుడికి ఎలాంటి ప్రమాదం సంభవించినా బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు కవరేజ్ వర్తిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల వయస్కుల వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. 2022 ఏప్రిల్లో తొలిసారిగా తపాలాశాఖ ఈ పథకాలను ప్రవేశ పెట్టింది. ఇప్పటికే కడప డివిజన్లో అధిక సంఖ్యలో పాలసీలను తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాలసీ పొందాలంటే.. ఈ పాలసీలు పొందాలంటే ముందుగా పోస్టల్ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఖాతా లేనివారు రూ. 200తో నూతనంగా తెరవాలి. బీమా పాలసీకి రూ.599 గానీ, రూ.799 గానీ చెల్లించాలి. ప్రమాదం సంభవిస్తే మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. దీర్ఘకాలిక పక్షవాతం ఉన్నవారికి వర్తించదు. పాలసీ కోసం నగదు చెల్లించిన రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి బీమా రక్షణ లభిస్తుందని అధికారులు తెలిపారు. పాలసీదారులకు ఒక బాండ్ కూడా ఇస్తామన్నారు. -
కాపర్ వైరు చోరీ చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్
ఖాజీపేట : కంచే చేను మేసిందన్న సామెత చందాన దొంగ సొత్తుకు కాపలా కాయాల్సిన రక్షక భటుడే దాన్ని చోరీ చేశాడు. చివరకు ఉన్నతాధికారులు గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఖాజీపేట పోలీస్ స్టేషన్లో కాపర్ వైర్ చోరీ చేసిన కానిస్టేబుల్ చిన్నయ్యను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖాజీపేట మండలంలో 2024లో రెండు ట్రాన్స్ ఫార్మర్లలోని కాపర్ వైర్ను దొంగలు చోరీ చేశారు. ఈ సంఘటనపై ఖాజీపేట స్టేషన్లో రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖాజీపేట సీఐ మోహన్ దొంగలను పట్టుకుని వారి నుంచి కాపర్ వైర్ రికవరీ చేశారు. 14 కేజీల కాపర్ వైర్ను పోలీస్ స్టేషన్ లాకప్లో ఉంచారు. లాకప్లోని కాపర్ వైర్ను తిరిగి కేసులో చూపించాలని ప్రయత్నించిన పోలీసులకు కాపర్ వైర్ కనిపించలేదు. ఈ విషయమై విచారణ జరిపిన సీఐ సీసీ పుటేజ్లను పరిశీలించారు. ఈ పరిశీలనలో కానిస్టేబుల్ చిన్నయ్య చోరీ చేసినట్లు గుర్తించారు. అతనిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సీఐ నివేదిక పంపారు. ఈమేరకు జిల్లా ఎస్పీ అంతర్గత విచారణ జరిపి కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. -
భారతామృతాన్ని పంచిన ప్రజ్ఞానిధి ‘భూతపురి’
కడప కల్చరల్ : మహాభారతమనే అమృతాన్ని అందరికీ పంచి పెట్టిన మహాకవి భూతపురి సుబ్రహ్మణ్యశర్మ ప్రజ్ఞానిధి అని వక్తలు కొనియాడారు. డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ స్మారక ట్రస్టు, అల్లసాని పెద్దన సాహిత్య పీఠంతో కలిసి ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంధాలయంలో భూతపురి 88వ జయంతి సందర్భంగా 23వ సాహిత్య పురస్కారాన్ని రిటైర్డ్ ఇంజనీర్ పుత్తా పుల్లారెడ్డికి ప్రదానం చేశారు. తొలుత డాక్టర్ భూతపురి చిత్రపటానికి పూలమాల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకుప్రముఖ సాహితీవేత్త ఆచార్య శలాక రఘునాధ శర్మ ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. భూతపురి సుబ్రహ్మణ్యశర్మ సాహిత్యంలో అనితర సాధ్యమైన కృషి చేసిన మహా రుషియని అభివర్ణించారు. అలాంటి మహాకవి పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని పుత్తా పుల్లారెడ్డి లాంటి సాహితీ వేత్తకు ఇవ్వడం సమంజసంగా ఉందన్నారు. సత్కార గ్రహీత పుత్తా పుల్లారెడ్డి మహాభారతాన్ని ఔపోసన పట్టిన వాంగ్మయ తపస్వి అని అభివర్ణించారు. డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కులపతి ఆచార్య విశ్వనాధ కుమార్, యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కృష్ణారెడ్డి , ఆకాశవాణి పూర్వ డైరెక్టర్ ఆకుల మల్లేశ్వరరావు, తిరుపతికి చెందిన డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ , వైవీయూ పాలకమండలి సభ్యులు ఆచార్యమూల మల్లికార్జునరెడ్డి , బ్రౌన్ కేంద్రం సంచాలకులు ఆచార్య పార్వతి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ సాహిత్య పురస్కారాన్ని పుత్తా పుల్లారెడ్డికి అతిధులతో కలిసి అందజేస్తూ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ భూతపురి కుటుంబ సభ్యులు, పుత్తా సోదరుల కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య
రాజంపేట రూరల్: రైతులకు డిజిటల్ గుర్తింపు సంఖ్య(విశిష్టగుర్తింపు సంఖ్య)ను ఇచ్చే ప్రక్రియకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్కార్డుతో గుర్తింపు ఇచ్చినట్లుగా ప్రతి రైతుకు 11 అంకెలు కలిగిన యూనిక్ ఐడీ నెంబర్తో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులను ఇవ్వనుంది. ఇందులో భాగంగా రైతులకు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సహాయకుల ద్వారా ఫార్మర్స్ రిజిస్ట్రీ(ఎఫ్ఆర్) పోర్టల్లో రైతుగా నమోదు ప్రక్రియ ప్రారంభించింది.వ్యవసాయశాఖ నోడల్ డిపార్ట్మెంట్కు ఈ నమోదు బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో మొత్తం 3,52,873 మంది రైతులు ఉండగా వీరిలో పీఎం కిసాన్కు సంబంధించి 1,83,659 మంది ఉన్నారు. వీరిలో 15వ తేదీకల్లా 30 శాతం మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రైతులకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పథకాలను పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం. నమోదుకు అవసరమైన ధ్రువ పత్రాలు: రైతు ఆధార్కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, వన్బీ, ఆధార్కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ను రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్తారు. రైతు మొబైల్ ఫోన్కు మూడు ఓటీపీలు వస్తాయి, ఆ ఓటీపీలను వ్యవసాయ సిబ్బందికి తెలియచేస్తే రైతు యూనిక్ ఐడీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. రైతుకు ఒనగూరే ప్రయోజనాలు ఆధార్ మాదిరిగా యూనిక్ కోడ్తో జారీ చేసే ఈ కార్డులతో రైతులకు ఐడీ కార్డుగా ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాలను రైతుల యూనిక్ కోడ్తో అనుసంధానం చేస్తారు. రానున్న రోజుల్లో ఈ యూనిక్ నంబర్ ఉన్న రైతులకు వ్యవసాయ పథకాలు, ఎరువులు, పంటల బీమా అందుతాయని అధికారులు అంటున్నారు. అలాగే ఈ యూనిక్ నబబర్ను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు లింక్తో కూడిన సేవలు పొందవచ్చు. దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాలు వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయి. వీటితోపాటు ఇతర సేవలైన నీటి పారుదల, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ సూచనలు వంటీ సేవలు కూడా పొందేందుకు వీలవుతుంది. ప్రత్యేక యాప్ద్వారా నమోదు పథకాలకు ఇదే ఆధారం నమోదు చేసుకోవాలి రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకో వాలి. లేకుంటే ప్రభు త్వాలు అందించే ప్రయోజనాలు కోల్పోతారు. భూమి వివరాలు ఆన్లైన్లో లేకుంటే ఫార్మర్ రిజిస్ట్రీలో రైతు పేరు నమోదు కాదు. రైతులు ఆన్లైన్ చేయించుకుని ఎఫ్ఆర్లో నమోదు కావాలి. –జీ.రమేష్బాబు, డివిజనల్ సహాయ వ్యవసాయ సంచాలకులు, రాజంపేట -
హార్సిలీ ఘాట్లో బైక్ ప్రమాదం
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పైనుంచి కిందకు వస్తున్న బైక్ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు. బైక్పై ఓ యువతి, యువకుడు హార్సిలీహిల్స్ వచ్చారు. కొండపై పర్యటన ముగించుకుని వెనుదిరిగారు. ప్రొద్దుటూరు మలుపు దాటుకున్న తర్వాత బైక్ ప్రమాదానికి గురైంది. అతివేగంతో వచ్చిన కారణంగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో యువతి, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బైరెటీస్ మిల్లులను ఆదుకోండిఓబులవారిపల్లె : మంగంపేట గనుల ఆధారంగా ఏర్పాటు చేసుకున్న బైరెటీస్ మిల్లులను ఆదుకోవాలని, అందులో పనిచేస్తున్న కార్మికులను కాపాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్, పోరాట కమిటీ కన్వీనర్ పి.జాన్ ప్రసాద్ కోరారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ మంగంపేట గనుల్లో ముగ్గురాయి ఆధారితంగా స్థానికంగా 175 పల్వరైజింగ్ మిల్లులను ఏర్పాటు చేశారన్నారు. అందులో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేకమైన రాయితీలు కల్పించకుండా సి అండ్ డి గ్రేడ్ టన్ను రూ. 1680 ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. ఎగుమతిదారులకు ధర తగ్గించి రూ. 1188 ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం స్థానిక పల్వరైజింగ్ మిల్లులకు రూ. 500 ధర పెంచి ఇస్తానని చెప్పడం, ఒకరికి ఒక ధర ఇంకొకరికి మరో ధర ఇవ్వడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మిల్లులకు 40 శాతం, ఎగుమతి దారులకు 60 శాతం ముడి ఖనిజాన్ని సరఫరా చేసే విధంగా అప్పట్లో జీఓ నంబర్. 296 ఇచ్చారని, దానిని అమలు చేయాలని కోరారు. ఆటోను ఢీ కొన్న ట్రాక్టర్ కమలాపురం : పట్టణ పరిధిలోని మార్కెట్ యార్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని జీవంపేటకు చెందిన షేక్ పీరా వలి తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీరావలి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కమలాపురం పట్టణం నుంచి క్రాస్ రోడ్డుకు పీరా వలి తన ఆటో నడుపుతూ వస్తున్న క్రమంలో హెచ్పీ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మార్కెట్ యార్డులో నుంచి వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో పీరావలి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఆటో కూడా దెబ్బతిన్నది. స్థానికులు 108కు సమాచారం అందించగా వల్లూరు 108 వాహనం ద్వారా కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం సరోజినీ నగర్కు చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రిమ్స్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు సరోజినీ నగర్లో నివాసం ఉంటున్న షేక్ షబ్బీర్(35) టైల్స్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. కూలి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా తాగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య షకీలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విష ద్రావణం తాగి వృద్ధురాలు.. కడప నగరం సరోజిని నగర్కు చెందిన ఓ వృద్ధురాలు ఆదివారం విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రిమ్స్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. -
అరుదైన ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి.. ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినుతికెక్కారు. ఆధ్యాత్మిక, దార్శనిక, తాత్విక వేత్త. ఆయన ఫిలాసఫీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ, రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించారు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టిన వాడిగా ఆయనలా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారు లేరు. మదనపల్లెలో పుట్టి మద్రాస్ అడయార్లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్గా ఎదిగారు. 60 ఏళ్లకు పైగా పలు దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించారు. ప్రధానంగా సత్యాన్ని తెలుసుకోవడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలవన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్ర ఆలోచన కలిగించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి. టీచర్ విద్యార్థిలోని సృజనాత్మకతను తట్టి మేల్కొలిపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమను నింపుకున్న వారు మంచి తప్ప చెడు చేయలేరు. మనిషి సంపూర్ణుడిగా ఎదగాలని పదేపదే చెప్పారు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. ఇప్పటి తరం వారు చిన్న పదవి లభిస్తే వదలమన్నా వదలరు. ఆపై నానా పైరవీలు చేస్తారు. అనిబిసెంట్ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్గురువును చేయాలని ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అనే అంతర్జాతీయ సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. వందల కోట్ల ఆస్తిని వదులుకున్నారు. అప్పట్లో యావత్ ప్రపంచమే విస్తుపోయింది. మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎవరికి వారు మార్పు చెందాలన్నారు. మూఢ నమ్మకాల నుంచి విముక్తి పొందాలనేవారు. 1895 మేలో జన్మించిన ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కృష్ణమూర్తి ఫౌండేషన్ (కేఎఫ్ఐ) పేరిట దేశ విదేశాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. 1925లో సోదరుడు నిత్యానంద ఆకస్మిక మరణం ఆయనలో ఎనలేని మార్పునకు దారి తీసింది. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. ప్రసంగాలు కోట్ల మందిని కదిలించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేసిన ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. ఆధునిక తత్వవేత్తలలో ఆద్యుడిగా, ప్రపంచ జ్ఞానిగా పేరు గడించారు. ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప మహోన్నతుడిగా, విశ్వ మానవుడిగా జిడ్డు కృష్ణమూర్తిని యావత్ ప్రపంచం కొనియాడుతోంది.నేడు వర్ధంతి‘‘ప్రపంచం మొత్తం నీలోనే ఉంది. ఎలా చూడాలో తెలిస్తే దాన్ని తెరిచే తలుపు ఇక్కడే ఉంది. కానీ ఆ తలుపు తెరిచే తాళం మాత్రం ఎవరూ ఇవ్వలేరు. నువ్వు తప్ప వేరెవరూ తలుపు కూడా తెరవలేరు.’’ – జిడ్డు కృష్ణమూర్తి, ప్రపంచ తత్వవేత్త -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 17వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు మదనపల్లె సిటీ: మాఘమాసం పురస్కరించుకుని తంబళ్లపల్లె వద్ద ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిఎం మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు, 6,30 గంటలకు మల్లయ్యకొండకు బస్సుల వెళతాయనన్నారు. అక్కడి నుంచి రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప నగరంలోని డీఎస్ఎ క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా హ్యాండ్ బాల్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు. అనంతరం జిల్లా జట్టుకు ఎంపికలు నిర్వహించారు. సీమ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత శ్రీకాళహస్తి రాజుపాళెం: రాయలసీమ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శ్రీకాళహస్తి టీం విజేతగా నిలిచింది. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రమైన రాజుపాళెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో రాజుపాళెం కిరణ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శని, ఆది వారాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా విజేత జట్టుకు రూ.15,016లను వీరశంకర్ అందజేశారు. అలాగే రన్నరప్గా నిలిచిన నంద్యాల జట్టుకు రూ.12,016 సుభద్రమ్మ్డ అందించగా, మూడవ బహుమతిగా పీలేరు జట్టుకు రూ.10.016 జయరామిరెడ్డి, నాల్గవ బహుమతిగా కోవెలకుంట్ల జట్టుకు 8,016 బాబుసాహెబ్, ఐదవ బహమతిగా రాజుపాళెం జట్టుకు రూ.5016లతో పాటు మెమెంటోలను లెక్షరల్ జయరాముడు అందించారు. రామయ్యకు వెండి కరకం బహూకరణ ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండరామస్వామికి ఆదివారం సికింద్రాబాద్కు చెందిన భక్తుడు వెండి కరకం(చెంబు) బహూకరించారు. సికింద్రాబాద్కు చెందిన ఉదయ భాస్కర్ రూ. 89వేలు విలువగల 700 గ్రాముల వెండి కరకాన్ని ఇచ్చారని ఆలయ అధికారులు చెప్పారు. ఆలయ అర్చకులు వీణా మనోజ్ కుమార్, పవన్ కుమార్లకు వారు కరకాన్ని అందజేశారు. ఈసందర్భంగా దాతలను ఆలయ అధికారులు సత్కరించారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కమనీయం.. రంగనాథుని కల్యాణం పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేదమంత్రాలు, మంగళ వాయి ద్యాల నడుమ కల్యాణ వైభోగం కన్నుల పండువగా సాగింది. ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సతీసమేతుడైన శ్రీరంగనాథుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భక్తులు తరించారు. శాశ్వత కల్యాణ ఉభయదారులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన చల్లా నారాయణస్వామి, ఉమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులచే కళ్యాణం జరిపించారు. సాయంత్రం స్వామివారు సతీ సమేతుడై గజ వాహనంపై పట్టణ పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయకర్పూరాలను సమర్పించారు. -
రెవెన్యూ లీలలు ఇంతింత కాదయా.!
పెద్దతిప్పసముద్రం : మండలంలోని సంపతికోట పంచాయతీలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ డీకేటీ భూములను ఇతరులకు కట్టబెట్టేశారు. పట్టాలు ఉండి సాగు చేస్తున్న హక్కుదారుల నోట్లో మట్టి కొట్టి కర్ణాటక రాష్ట్రంలో, పక్క మండలాల్లో ఉంటున్న వారి పేరిట డీకేటీ భూములు కట్టబెట్టారంటే అధికారులు ఎంతగా బరి తెగించారో ఇట్టే అర్థమౌతోంది. విషయం తెలుసుకున్న హక్కుదారులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని అధికారులు తమ భూములను ఇష్టారాజ్యంగా మార్పిడి చేశారని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా, సబ్ కలెక్టర్ ఆదేశాలను సైతం బే ఖాతర్ చేస్తూ అధికారులు మామూళ్లు తీసుకుని ఒకరి భూమిని మరొకరి పేరిట మార్చేశారని హక్కుదారులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు ఒక్క సంపతికోట పంచాయతీలోనే వందల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు సమగ్రంగా రికార్డులు తనిఖీ చేస్తే అధికారుల అవినీతి బండారం బట్టబయలు అవుతుందని పంచాయతీ ప్రజలు పేర్కొంటున్నారు. ● ఇదే పంచాయతీలోని కానగమాకులపల్లికి చెందిన చిన్న వెంకట్రాయప్పరెడ్డి పేరిట సర్వే నంబర్ 459/1లో 4.25 ఎకరాల డీకేటీ భూమి ఉండగా ఆయనకు తెలియకుండా ఆయన బతికుండగానే అతని భార్య సిద్దమ్మ పేరిట భూ మార్పిడి ఎందుకు చేశారో అధికారులకే ఎరుక. ● వడ్డి కోనప్ప అనే వ్యక్తి పేరిట ఉన్న సర్వే నంబర్ 443/2లో 3.78 ఎకరాల డీకేటీ భూమి ఉండగా సదరు భూమి తన అనంతరం మనవరాలు కవితకు చెందేలా వీలునామాలో పేర్కొన్నాడు. అయితే ఆయన మరణానంతరం సదరు భూమిని అతని వారసులు, కుటుంబ సభ్యులకు కాకుండా పక్కనే ఉన్న బి.కొత్తకోట మండలంలోని వెంకటలక్ష్మి అనే మహిళ పేరిట ఎందుకు బదలాయించారో అర్థం కావడం లేదు. ● కురాకుల లక్ష్మిదేవమ్మ పేరిట సర్వే నంబర్ 557/2లో 5 ఎకరాలు, కురాకుల గుర్రప్ప పేరిట సర్వే నంబర్ 557/3లో 3.60 ఎకరాల డీకేటీ భూమి వారి అధీనంలో ఉంది. ఇటీవల వన్బీ కోసం సచివాలయానికి వెళ్లారు. సదరు భూమి బి.కొత్తకోటలో కాపురం ఉంటున్న ఇద్దరు వ్యక్తుల పేరిట ఉండటం చూసి హక్కుదారులు నివ్వెరపోతున్నారు. సమస్యలను పరిష్కరిస్తాం ఈ మధ్య కాలంలో నా దృష్టికి కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇవి ఎప్పుడు జరిగాయో నాకు తెలియదు. బాధిత రైతులు సమగ్రమైన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే రికార్డులు పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తాం. –శ్రీరాములు నాయక్, తహసీల్దార్ హక్కుదారుల నోట్లో మట్టి కొట్టి.. ఇతరులకు కట్టబెట్టి సంపతికోటలో భూ మాయాజాలం కర్ణాటక వాసుల పేరిట కూడా డీకేటీ భూముల మార్పిడిఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహబూబ్పీర్. ఇతని అవ్వ హజీరాబీ పేరిట 278 సర్వే నంబర్లో 4.85 ఎకరాల డీకేటీ భూమి ఉండగా ఆమె అనంతరం సదరు భూమికి ఇతనే వారసుడు. అయితే సదరు భూమి శాంతమ్మ పేరిట రికార్డుల్లో నమోదైంది. ఈమె కర్ణాటక రాష్ట్రం కొత్తుడియంకు చెందిన మహిళగా బాధితుడు పేర్కొన్నాడు. -
కుటుంబ మద్దతుతోనే విజయం
విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రులదే కీలకపాత్ర. వార్షిక పరీక్షల సమయంలో ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడంతో వారిలో బాధ్యత పెరుగుతుంది. పిల్లలపై ఒత్తిడి చేసినట్లు కనిపించరాదు. అప్పుడే అనుకున్న లక్ష్యం చేరుకుంటారు. –బాలకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్, బాలికల జూనియర్ కాలేజీ, మదనపల్లె విజయానికి మెట్టులాంటిది విద్యార్థుల విజయానికి తల్లిదంద్రుల పాత్ర మెట్టులాంటిది. వారు పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. వారితో స్నేహపూర్వకంగా మెలగాలి.మంచి,చెడులను పంచుకోవాలి. వారిపై ఒత్తిడి పెంచకుండా ఉంటే అనుకున్న లక్ష్యం సాధిస్తారు. –చాముండేశ్వరి, సైకాలజిస్టు, మదనపల్లె -
బాబు, పవన్ కల్యాణ్ దోపిడీదారులకు కాపలాదారులు
రైల్వేకోడూరు అర్బన్ : ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టారని, అలాగే దోపిడీదారులకు కాపలాదారులుగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ఆదివారం రైల్వేకోడూరులో జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉంటే ప్రజల్లో ఆగ్రహం వస్తుందని గమనించి డైవర్షన్ పాలిటిక్స్ కోసం దేవుళ్లను వాడుకొన్నారని విమర్శించారు. పేద, బడుగు, బలహీన, కార్మిక, వర్గాలకు అన్యాయం చేస్తూ పెట్టుబడి, దోపిడీదారులకు కాపలాదారుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాధాక్రిష్ణ, సాంబశివ, నాయకులు గంగాధర్, రాజశేఖర్, పండుగోలు మణి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
●లైనింగ్కే రూ.684 కోట్లు
బి.కొత్తకోట: హంద్రీ–నీవా ప్రాజెక్టులోని ప్రధాన కాలువ, ఉపకాలువలు, రిజర్వాయర్లకు కృష్ణా జలాలు పారాలంటే 2025–26 బడ్జెట్లో కోరినంత నిధులు ఇవ్వాలి. కరువు రైతుల కల్పతరువైన సాగు, తాగునీటి ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయిస్తుందా లేక మొక్కుబడి నిధులతో మొండిచెయ్యి చూపుతుందా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులనే కేటాయింపులు చేసి చేతులు దులుపు కుంటుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు కృష్ణా జలాలు అందిస్తారన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ అవసరమైనంత నిధులను బడ్జెట్లో కేటాయించలేదు. దీంతో పనులు ముందుకు సాగడంలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పథకాలను కూటమి ప్రభుత్వం కక్షకట్టి రద్దు చేసేసింది. వారికి అనుకూలమైన పనులు చేపట్టి నిధులను ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటుతో చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులు ఆశించినంత ఇస్తారా లేదా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.3,500 కోట్లు ఇవ్వండి హంద్రీ–నీవా ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ ఉమ్మడిజిల్లాల్లో సాగుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న, చేపట్టబోయే పనులకు రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు పంపారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కాలువ వెడల్పు చేయడం, కొన్ని కాంక్రీటు, మట్టి పనులు రూ.1,240 కోట్లతో చేపట్టారు. ఇదికాక ప్రధాన కాలువకు సంబంధించి మరో రూ.503 కోట్లతో పనులు సిద్దం చేశారు. ఈ మొత్తం పనులకే రూ.1,700 కోట్లు కావాలని నివేదించారు. ఇవికాక కర్నూలు జిల్లాకు రూ.450 కోట్లు పోను, మిగిలిన రూ.1,350 కోట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనులను ఈ నిధులతో చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి చిత్తూరుకు రూ.2 వేల కోట్లు కావాలి విభజిత అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లో ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఇంచుమించు రూ.2 వేల కోట్లు అవసరం అవుతాయి. ఇందులో ప్రాజెక్టులో అసంపూర్తి పనులు చేపట్టి పూర్తి చేసేందుకు రూ.729 కోట్లు అవసరం ఉందని అధికారిక నివేదిక చెబుతోంది. ప్రాజెక్టులో భాగమైన ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల కాలువలు, స్ట్రక్చర్స్లో పెండింగ్లోని పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ నిధుల్లో రూ.250 కోట్లతో ప్రధానకాలువపై చిన్నమండెం మండలం పడమటికోన, కలకడ వద్ద కాలువ తవ్వకం, 12 చోట్ల కాంక్రీటు నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవి పూర్తి చేస్తే కానీ అడవిపల్లె, శ్రీనివాసపురం రిజర్వాయర్లకు కృష్ణా జలాలు వెళ్లవు. ఈ రూ.250 కోట్ల నిధులకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ●వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిధులే ఇస్తారా?బకాయిలకే గత బడ్జెట్ 2014–15 బడ్జెట్లో ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.611 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పనులు జరగడం కంటే బకాయిల చెల్లింపుకే సరిపోయింది. ఇప్పటిదాకా రూ.400 కోట్లు చెల్లించగా మిగిలిన నిధులతో మరోనెలలో జరిగే అభివృద్ధి పనులు పెద్దగా ఉండకపోవచ్చు. పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే.. మదనపల్లి సర్కిల్లోనూ ఉన్నాయి. ఇవికాక ఎత్తిపోతల పథకాల కోసం వినియోగించిన విద్యుత్కు రూ.4 వేల కోట్ల మేరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాదిలో రూ.450 కోట్ల మేర చెల్లించగా వచ్చే బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలో కోరారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు మొత్తానికి రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన ప్రాజెక్టు పెండింగ్ పనులకు రూ.729 కోట్లు అవసరం 2024–25 బడ్జెట్ బకాయిలకేసరిపెట్టిన ప్రభుత్వం కృష్ణాజలాలు పారాలంటేపుష్కలంగా నిధులు ఇవ్వాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిధులే కేటాయించే అవకాశం పుంగనూరు ఉపకాలువ వెడల్పు పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం కాలువకు లైనింగ్ పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం నుంచి చిత్తూరుజిల్లాలోని పెద్దపంజాణి మండలం వరకు పుంగనూరు ఉపకాలువకు లైనింగ్ పనులను రూ.480 కోట్లతో, పెద్దపంజాణి నుంచి కుప్పం వరకు కుప్పం ఉపకాలువకు రూ.204 కోట్లతో లైనింగ్ పనులను చేపట్టారు. ఇదికాక కుప్పం కాలువకు సంబంధించి ఇంకా రూ.59 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆరునెలల్లో ఈ లైనింగ్ పనులు పూర్తి జరగాలంటే బడ్జెట్లో పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలి. ఇప్పటికే కృష్ణా జలాల తరలింపుని నిలివేసిన ప్రభుత్వం లైనింగ్ పనులకు నిధులు ఇవ్వకుంటే రైతులు నష్టపొవాల్సి వస్తుంది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి కుప్పానికి రూ.535 కోట్లతో యామిగానిపల్లె వద్ద 0.7 టీఎంసీలు, మాదనపల్లె వద్ద 0.3 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వీటిని సద్వినియోగం చేసుకుని బడ్జెట్లో అనుమతి ఇస్తారో లేదో చూడాలి. 2015–26 బడ్జెట్ కేటాయింపు విషయంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసి, వినియోగించుకోని నిధులను మిగులుగా చూపిస్తోంది. ఇవే నిధులను కొత్త బడ్జెట్లో కేటాయించే అవకాశం లేకపోలేదు. పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) విస్తరణ పనులకు 2020లో సీఎం వైఎస్.జగన్ నిధులు మంజూరు చేయగా రూ.1,217 కోట్లతో కాంట్రాక్టర్కు పని అప్పగించి ఒప్పందం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కాలువకు రూ.480 కోట్లతో లైనింగ్ పని చేపట్టింది. దీనికి సంబంధించి జారీ చేసిన జీవోలో రూ.1,217 కోట్ల పనిలో మిగులు నిధులు ఉన్నాయని, వాటిలో రూ.480 కోట్లతో లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టంగా పేర్కొంది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో ఇంకా రూ.1,177 కోట్లు మిగులు నిధులు అందుబాటులో ఉన్నట్టు లెక్క.కుప్పం రిజర్వాయర్ల కోసం మంజూరు చేసిన మరో రూ.535 కోట్లు వినియోగించుకోలేదు కాబట్టి ఈ నిధులను మిగులుగా చూపవచ్చు. కాబట్టి ఎలా చూసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులే వచ్చే బడ్జెట్లో కేటాయింపు ఉండొచ్చన్నది స్పష్టం అవుతోంది. -
దేవదాయశాఖ అధికారులను అడ్డుకున్న పద్మశాలీలు
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో 32 సంవత్సరాల క్రితం గ్రామస్తులు భద్రావతి భావనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ ఆలయం ఇప్పుడు దేవదాయశాఖ ఆధీనంలో ఉందంటూ బోర్డు నాటే ప్రయత్నం చేసిన ఎండోమెంట్ అధికారులను ఆదివారం గ్రామంలోని పద్మశాలీలు అడ్డుకున్నారు. దీనిపై ఆలయ ధర్మకర్త కేసీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పెద్దలకుగానీ, కమిటీ సభ్యులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవదాయశాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ జనార్దన్లు ఉన్నట్లుండి ఆదివారం అనధికారికంగా వచ్చి ఆలయం దేవదాయశాఖ ఆధీనంలో ఉందంటూ బోర్డునాటే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని పద్మశాలీలు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్.వి.కృష్ణయ్య, పన్నెల చంద్రశేఖర్, బోగా శంకరయ్య, పోలిచెర్ల శ్రీనివాసులు, పద్మశాలీల ప్రెసిడెంటు బోడిగల అనంతరామయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ ఆలయం ఎప్పటి నుంచో దేవదాయ శాఖ ఆధీనంలో ఉందని దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కొండారెడ్డి తెలిపారు. బుధవారం వరకు గ్రామస్తులకు సమయం ఇచ్చామని, ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం ఆలయాన్ని దేవదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. -
బీసీల సంక్షేమానికి పెద్దపీట
రాయచోటి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖమంత్రి మండిపల్లె రాంప్రసా ద్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని అజయ్ కన్వెన్షన్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతిగా పనిచేస్తూ బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలకు పార్టీతో పాటు ప్రజాప్రాతినిధ్య పదవులలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగల్రావు, కన్వీనర్ ఆవుల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళి, జిల్లా అధ్యక్షురాలు పద్మయాదవ్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి రాంప్రసాద్రెడ్డి -
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ సిద్దవటం: మహా శివరాత్రి ఉత్సవాల్లో శ్రీ నిత్యపూజ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కడప ఆర్డీఓ జాన్ఇర్విన్ పేర్కొన్నారు.సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీంలో వెలసిన నిత్యపూజ స్వామి మహాశివరాత్రి ఉత్సవాలపై శనివారం పంచలింగాల వద్ద అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచలింగాల వద్ద, కాలినడక మార్గంలో, ఆలయం వద్ద మొత్తం మూడు వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. శానిటేషన్పై దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నలిపేలా చూడాలని తెలిపారు. భక్తులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని దేవదాయశాఖ అధికారులకు సూచించామన్నారు. 108, 104 వాహనాలను పంచలింగాల వద్ద అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఒంటిమిట్ట సీఐ బాబు మాట్లాడుతూ 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.పంచలింగాల వద్ద, ఆలయం ఆవరణలో రెండు వైర్లెస్ సెట్లను అమరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, ఆర్డీ ఏఓ శంకర్రావు, రేంజర్ కళావతి, వీఆర్వో ప్రభాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంధ్య, సర్పంచ్ ప్రతినిధి లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.