breaking news
annamayya district Latest News
-
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం చౌడసముద్రంకు చెందిన రమణ(60) తనకు పరిచయస్తుడైన మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన నరసింహులుతో కలిసి చౌడసముద్రం నుంచి పాపిరెడ్డిపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలోని చెట్లవారిపల్లె వద్ద ట్రాక్టర్ పక్క నుంచి ఉన్నట్లుండి రోడ్డుపైకి రావడంతో ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో రమణ తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ● నిమ్మనపల్లె మండలం ఎగువమాచిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫిరోజ్, అతడి భార్య రాజమ్మ(45) ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంలో సోమలకు వెళుతుండగా, మార్గమధ్యంలోని కందూరు సమీపంలో మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో రాజమ్మ తీవ్రంగా గాయపడింది. స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ● కడప జిల్లా ఖాజీపేటకు చెందిన శంకరనాయక్ (24), కామాక్షయ్య(35) అరటికాయలు అన్లోడ్ చేసేందుకు కూలీ పనుల్లో భాగంగా పులివెందుల నుంచి బొలేరో వాహనంలో పలమనేరుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు సమీపంలో బొలేరో ముందు చక్రం పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో పైన ఉన్న ఇద్దరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. జింక అడ్డు రావడంతో.. మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో వెటర్నరీ ఉద్యోగి తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ములకలచెరువు మండలంలో జరిగింది. కందుకూరు వెటర్నరీ కేంద్రంలో ఎల్ఎస్ఏగా పని చేస్తున్న నాగేంద్రప్రసాద్(47) సోమవారం సమావేశం నిమిత్తం కందుకూరు నుంచి బురకాయలకోటకు వెళుతుండగా, మార్గమధ్యంలోని దూలంవారిపల్లె సమీపంలో రోడ్డుకు అడ్డంగా జింక రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో కాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. డిప్యూటీ ఎండీవోకు.. పెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లి సచివాలయంలో పని చేసే డిప్యూటీ ఎండీవో క్రిష్ణప్రసాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 27న ఆయన విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంలో సత్యసాయి జిల్లా పెనుగొండకు వెళుతుండగా సోమందేపల్లి వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు మండల పరిషత్ సిబ్బంది సోమవారం తెలిపారు. విషయం తెలుసుకున్న బూర్లపల్లి సర్పంచ్ సుబ్బిరెడ్డి కర్నూల్లోని అదే ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్గా పని చేస్తున్న తన బావమరిదికి ఫోన్ చేసి అధికారి క్రిష్ణప్రసాద్ ఆరోగ్యం కుదుట పడేందుకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.గాయపడిన వెటర్నరీ ఉద్యోగి నాగేంద్రప్రసాద్ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రిష్ణప్రసాద్ -
దోపిడీ దొంగ అరెస్ట్
రాజంపేట రూరల్ : ఏరుకాల్వ రమాదేవి అనే మహిళపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన వేముల విశ్వనాథంను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మనోజ్రామ్నాథ్్హెగ్డే తెలియజేశారు. మండల పరిధిలోని ఎర్రబల్లిలో గల డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన పుల్లంపేట మండలం వత్తలూరు వడ్డిపల్లి గ్రామానికి చెందిన రమాదేవిపై పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి గ్రామం మొరవడ్డిపల్లికి చెందిన వేముల విశ్వనాథం దాడి చేసి బంగారం దోచుకెళ్లారని తెలియజేశారు. విశ్వనాథంను రూరల్ సీఐ బీవీ రమణ ఆధ్వర్యంలో పుల్లంపేట, పెనగలూరు ఎస్ఐలు బీవీ శివకుమార్, బీ రవిప్రకాశ్రెడ్డి రెడ్డిపల్లి చెరువు కట్టవద్ద తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. అతని వద్ద నుంచి 92,030 గ్రాముల బంగారం స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.9,50000లు ఉంటుందన్నారు. విశ్వనాథం నేరానికి ఉపయోగించిన రక్తపు మరకలు కలిగిన రాయిని సీజ్ చేశామన్నారు. అదే విధంగా ఒక ఫల్సర్ బైక్, ఓపీపీఓ సెల్ఫోన్ను సీజ్ చేశామని తెలియజేశారు. అయితే ఈ బంగారు ఆభరణాలు చిత్తూరు జిల్లాలోని సదుం, అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట, పెనగలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అయిన కేసులలోని బంగారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. విలేకరితోపాటు ముగ్గురిపై కేసు నమోదుప్రొద్దుటూరు క్రైం : కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఓ విలేకరితోపాటు ముగ్గురు యువకులపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్ను నలుగురు యువకులు తోశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. వారిలో ఓ విలేకరి కూడా ఉండటం గమనార్హం. ● 9 తులాల బంగారం స్వాధీనం ● ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే -
‘క్వారీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాం’
ఓబులవారిపల్లె : మంగంపేట జాతీయ రహదారి పక్కనే కంకరకు సంబంధించిన మైన్లో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కారణంగా చాల రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, పరిష్కరించాలని గోవిందంపల్లె గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ యామినిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందంపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ చాల సంవత్సరాలుగా గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా కంకర క్వారీలో పెద్ద ఎత్తున పనులు నిర్వహిస్తుండటంతో.. మైన్లో భారీ పేలుళ్ల వల్ల వెలువడుతున్న కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అనేక మంది రోగాల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలో పనులు నిర్వహిస్తున్నరని, కాలుష్య నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అంతే కాకుండా జాతీయ రహదారి పక్కనే పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని, దీంతో భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని రైతులు ఆన్లైన్కు సంబంధించి భూముల సమస్యలపై తహసీల్దార్కు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సిద్దేశ్వర్రావు, ఆర్ఐ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతిమ విజయం న్యాయానిదే
రాజకీయంగా పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని ఎదుర్కోలేక కుట్రపూరితంగా కూటమి సర్కార్ అక్రమ మద్యం కేసు పెట్టింది. మిథున్కు బె యిల్ మంజూరు కావడం మంచి పరిణామం. వైఎస్సార్సీపీ శ్రేణులపై పెడుతున్న అక్రమ కే సులు ఎన్నో రోజులు నిలవవు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుద్ధిచెబుతారు. ఎవరెన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమ విజయం న్యాయానిదే. – గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత ఎన్నికల సమయంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోలేక కూటమి సర్కార్ మద్యం అక్రమ కేసు పెట్టింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఏసీబీ కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ఇప్పటికై నా కూటమి పాలకులు బుద్ధి తెచ్చుకుని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాలి. – ఆర్ రమేష్కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
సామాన్యుడిపై టీడీపీ నాయకుల దౌర్జన్యం
సుండుపల్లె : అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు బంధువుల స్థల వివాదం.. నరసింహరాజుపై దౌర్జన్యం చేసేలా జరిగింది. ఒక పక్క అధికార బలం.. మరో పక్క పదవిలో ఉన్న టీడీపీ నేత కావడంతో.. ఆయన అనుచరులు అడ్డంగా దూసుకొచ్చారు. సామాన్యుడిగా ఉన్న నరసింహరాజు కుటుంబీకులపై వాదోపవాదాలు చేస్తూ దౌర్జన్యంగా తోసేశారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సొంత భూమిని కాపాడుకోవాలన్న తపనతో ప్రయత్నం చేసిన అతని పైకి వస్తుండటంతో.. తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వివరాలలోకి వెళ్లితే.. సుండుపల్లె మండల పరిధిలోని పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీ రాచపల్లికి చెందిన నరసింహరాజు ఒక పత్రిక పెట్టుకుని హైదరాబాదులో జీవనం సాగిస్తున్నారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నరసింహరాజు 6 నెలల క్రితం తన స్వగ్రామంలో కొండూరు విజయభాస్కర్రాజు దగ్గర ఒక ఎకరా భూమిని కొనుగోలు చేశాడు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన ఎకరా భూమిపై కన్నుపడింది. ఆ స్థలం తమకు కావాలని అడిగారని, తాను ఇవ్వనని చెప్పానని బాధితుడు మీడియాకు తెలిపారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు అత్తవారి స్థలం ఇదని, నువ్వు ఎలా కొంటావని నరసింహరాజును జగన్మోహన్రాజు అనుచరులైన మండల టీడీపీ నాయకులు శివరాంనాయుడు మరో 15 మందిని వెంటబెట్టుకొని వెళ్లి వారిపై దాడికి పాల్పడ్డాడు. నరసింహరాజు తన పొలంలో నాటుకున్న జామ చెట్లను దౌర్జన్యంగా పీకేశారు. స్వతహాగా పత్రికా వ్యక్తి అయిన నరసింహరాజు వీడియోలు, ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తే అతని ఫోన్ని లాక్కున్నారు. సర్వే నంబర్ 47 సబ్ డివిజన్ చేసి 457/1, 2,3 మూడు భాగాలుగా విభజన జరిగింది. 457/1లో ఏ, బీ, సీలుగా సబ్ డివిజన్ అయింది. అందులో పాస్బుక్లో పేర్కొన్న ప్రకారం వన్బీలో ఉన్న ఎకరా స్థలం తనదేనని నరసింహరాజు అంటున్నాడు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు టీడీపీ రాజంపేట ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు అత్తగారి భూమి భాగాలలో.. అదే గ్రామానికి చెందిన నరసింహరాజు ఒక ఎకరా భూమి తగాదా విషయమై బాధితుడు అయిన నరసింహరాజు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశారు. 6 నెలల క్రితం కొన్న భూమిలో తాను జామచెట్లను నాటుతుండగా మండల టీడీపీ నాయకుడు శివరాంనాయుడు మరికొంత మందిని వెంటబెట్టుకొని తనపై, తన కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగి తమకు తోసేశారని పేర్కొన్నాడు. వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నరసింహరాజు తన వారితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం దగ్గర పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. ‘మాకు బలం లేదు.. టీడీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నేతలు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. ఎస్పీనే మాకు న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి బంధువుల స్థల వివాదం అధికార బలంతో అడ్డంగా దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులు జిల్లా ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు -
అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లను గౌరవించాల్సిందే
మదనపల్లె : ప్రజలు గెలిపించిన కౌన్సిలర్లకు వారి వార్డుల్లో గౌరవం ఉండేలా.. ఆయా ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో కౌన్సిలర్లకు తప్పనిసరిగా గౌర్వం ఇవ్వాలని, ఆలాగే వారి అమోదంతోనే పనులను ప్రతిపాదించాలని మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ స్పష్టం చేశారు. సోమవారం ఆమె అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు, తాము ప్రతిపాదించని పనులను అజెండాలో ఉన్నట్టు ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. వార్డుల్లో ఏ పని చేయాలన్నా కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఇలా జరగని పక్షంలో కౌన్సిల్ అజెండాలో పెట్టే పనులను తిరస్కరిస్తామని హెచ్చరించారు. వైస్చైర్మన్ జింకా చలపతి మాట్లాడుతూ కౌన్సిల్ పదవీకాలం ఉన్నంత వరకై నా కౌన్సిలర్లను గౌరవించండని కోరారు. తమ వార్డులో వీధిలైట్లు వెలగడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. కౌన్సిలర్లు బీఏ.ఖాజా, శ్రీనివాసులు, ప్రసాద్, రాజేష్ మాట్లాడుతూ కౌన్సిలర్లకు విలువ లేకుండా పోతోందని, కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పితే కూటమి పాలనలో ఒక్క పని జరగలేదన్నారు. అభివృద్ధి పనుల పేరిట చెపడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా పనులు పెట్డడం ఎందుకు, వాటిని రద్దు చేయండని నిలదీశారు. ఆర్అండ్బీ రహదారిలో సిమెంటు రోడ్డును వేయిస్తున్న అధికారులు చిత్తూరుబస్టాండ్లోని గుంతలపై మానవత్వంలో స్పందించి పనులు చేయించాలని కోరారు. కౌన్సిలర్లు ఉండగా టీడీపీ వార్డు ఇన్చార్జ్లు చెప్పే పనులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. దీనితో కౌన్సిలర్లకు విలువలేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని మండిపడ్డారు. కౌన్సిలర్ కరీముల్లా మాట్లాడుతూ మున్సిపాలిటీకి పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తోందని, అన్నివార్డులకు సమంగా అభివృద్ధి పనులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలం అవుతున్నారని ఆరోపించగా.. ఆదాయం, పనులకు సంబంధించి కమిషనర్ ప్రమీల వివరణ ఇచ్చారు. కౌన్సిలర్ షబానా మాట్లాడుతూ పట్టణంలోని చిత్తూరుబస్టాండ్, ఫైర్స్టేషన్, మిషన్కాంపౌండ్ వద్ద పెట్టుకున్న దుకాణాలకు అనుమతి ఎవరు ఇచ్చారు, వారి నుంచి అద్దెలను ఎవరు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రమీల చెప్పారు. టీడీపీ కౌన్సిలర్ తులసీ మాట్లాడుతూ అభివృద్ధి పనులు అజెండా పెడుతున్నారే కానీ కౌన్సిల్ వాటి పనులు చేపట్టడం లేదని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించడంతో వైస్చైర్మన్ జింకా చలపతి, కౌన్సిలర్ రాజేష్ మాట్లాడుతూ కూటమిపాలన రాకతోనే అభివృద్ధికుంటుపడిందని, ఈ విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించాలని కోరారు. తర్వాత కరీముల్లా, తులసీలు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అజెండా వద్దంటూ కౌన్సిల్ వాకౌట్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాల్సిన అంశాలపై అధికారులు అజెండాను రూపొందించారు. 30 అంశాలపై ఆమోదం తెలపాల్సి ఉండగా దానిపై కనీస చర్చ లేకుండా కౌన్సిల్ మొత్తం నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది. దీనితో అజెండాను పట్టించుకోకుండా అర్ధాంతరంగా కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు. దీనిపై చైర్మన్ మనూజ మాట్లాడుతూ కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకోకుండా, వారిని నిర్లక్ష్యం చేసి అజెండా అంశాలను ప్రతిపాదించిన కారణంగా వాటిపై చర్చలేకుండా తిరస్కరించామని చెప్పారు. దీని కారణంగానే సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించామని చెప్పారు. ఈ సమావేశంలో మేనేజర్ పీఆర్.మనోహర్, డీఈ శ్రావణీ, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటసుబ్బయ్య, ఏఈ రవీంద్రనాయక్, ఆర్ఐలు శ్రీనివాసులు, తిరుమల, సిబ్బంది పాల్గొన్నారు. లేదంటే అజెండా అంశాలను నిక్కచ్చిగా తిరస్కరిస్తాం అధికారులను హెచ్చరించిన చైర్మన్ మనూజ సమస్యలపై కౌన్సిలర్ల ఏకరువు ఆపై అజెండాపై చర్చ, ఆమోదం తెలపకుండా కౌన్సిల్ వాకౌట్ -
భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామికి విశేష పూజలు
తంబళ్లపల్లె : మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్యకొండపై వెలసిన శ్రీభ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. దేవీశరన్నవరాత్రుల సందర్భంగా స్వామి, అమ్మవారికి పూజారులు ఈశ్వరప్ప, మల్లికార్జున ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రిని తలపించే విధంగా సుదూరప్రాంతాలు కర్ణాటక, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మల్లయ్యకొండను సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ మునిరాజ, కొండకిట్టల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. కళాకారుల బృందాలు పలు రకాల భజనలు, కోలాటలతో భక్తులను అలరింపజేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఏనుగుమల్లమ్మకు ప్రత్యేక అలంకరణ మల్లయ్యకొండకు వెళ్లే మార్గంమధ్యలో వెలసిన శ్రీ ఏనుగుమల్లమ్మ ఆలయంలో అమ్మవారికి పూజారులు విజయకుమారి, శేఖర్ ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహిళా భక్తులు అమ్మవారికి పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. -
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం
నందలూరు : ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.అశోక్బాబు అన్నారు. సోమవారం నందలూరుకు చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు దళిత నాయకులు స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో అశోక్బాబును ఘనంగా సత్కరించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. కొందరి మాయమాటల మోజులో పడి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడం అన్యాయం అన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే ఈ యాత్ర చేపట్టామన్నారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోడపోతుల రాము, ఆర్ముగం విశ్వనాథ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు పెనుబాల నాగసుబ్బయ్య, కాకి చంద్ర, నాయనపల్లి ఆదినారాయణ, తుమ్మది శివకుమార్, గుడిష సుబ్రమణ్యం, ఎముక దుర్గయ్య, శివనరసింహులు, సురేష్, నాగభూషణం, నాగరాజు, డిస్కో మని తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం గెలిచింది
● ఎంపీ మిథున్కు బెయిల్పై సంబరాలు ● కూటమి అక్రమ అరెస్ట్లకు భయపడమంటూ నినాదాలు మదనపల్లె : రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జూలై 19న కూటమి ప్రభుత్వం మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసింది. 72 రోజులపాటు నిర్బంధించింది. బెయిల్ రాకుండా కుట్రలు, కుతంత్రాలు చేసింది. బెయిల్ కోసం న్యాయస్థానం ముందు పిటిషన్ వేస్తే.. అడ్డుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్ వేసింది. అరెస్ట్ అయిన 62 రోజుల తర్వాత సిట్ కస్టడి కోరడం, దాని వెనక ఉద్దేశం ఇట్టే అర్థమవుతుంది. అక్రమ అరెస్ట్ నుంచి.. ఎన్నో వేధింపులు, ఇబ్బందులకు గురి చేసినా చివరకు న్యాయమే గెలిచింది. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ నేతను అక్రమ కేసులో నిర్బంధించి, వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు వార్త బయటకు రాగానే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు, అనుచరులు, వైఎస్సార్సీపీప నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మిథున్ రెడ్డి బ్యానర్లు చేతబట్టి.. జై జగన్, జై మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి, కక్షగట్టి వేధిస్తున్న చంద్రబాబుకు అధికార పతనం తప్పదు అంటూ హెచ్చరించారు. అక్రమ మద్యం కేసులో పసలేదు. ఎంపీగా మిథున్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రమేయం ఉండదు. మద్యం వ్యవహారంలో ఆయన పాత్ర లేదు. నిరూపించేందుకు కనీస ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ వేధించాలన్న లక్ష్యంతో అక్రమ కేసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం ద్వారా తప్పుడు కేసు అని నిరూపితమైంది. – దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే ఎంపీ మిథున్ రెడ్డి పై పెట్టిన మద్యం అక్రమ కేసు ముమ్మాటికీ తప్పుడు కేసే.సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేశారని మిథున్ రెడ్డి చెప్పడం అక్షరాలా నిజమైంది. వైఎస్సార్సీపీని బలహీనపర్చాలన్న టీడీపీ కుట్రలు సాగవు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చావుదెబ్బ తప్పదు. – నిసార్ అహ్మద్, వైఎస్సార్సీపీ, మదనపల్లె సమన్వయకర్త -
అర్జీలకు సత్వర పరిష్కారం
– జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ రాయచోటి : పీజీఆర్ఎస్ అర్జీలకు సత్వరం పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తుందని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్య లు తీసుకుని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శరాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటిలకు నియామక పత్రాలు జిల్లా వెనుక బడిన తరగగతుల సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలో శిక్షణ పొంది, డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు నియామక పత్రాలు పొందిన వారిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమ వారం అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉ పాధ్యాయులుగా నియామకం కావడం వారి కష్టానికి ఫలితమన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని వారికి కలెక్టర్ సూచించారు. స్కూల్ అసిస్టెంట్గా నియామకమైన ఎస్ మహమ్మద్, ఎస్జీటీగా నియామకమైన శివాజీలకు మెగా డీఎస్సీ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన సంక్షేమశాఖ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ఫిర్యాదులపై అలసత్వం లేకుండా బాధితులకు న్యాయం అందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ పర్యవేక్షించారు. ప్రతి ఫిర్యాదుదారుడితో ముఖాముఖి మాట్లాడి సమస్యల మూలాలను తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి రాలేని అర్జీదారులు సమీప పోలీస్స్టేషన్, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయంలో అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. పోలీసు అధికారులతో ఫోన్లో స్వయంగా మాట్లాడి, కీలక సూచనలు చేశశారు. ప్రజాసేవలో పోలీసులు నిరంతరం ముందుంటారని, ప్రజలు ధైర్యంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ పేర్కొన్నారు. హుండీ ఆదాయం లెక్కింపు సిద్దవటం : శ్రీ నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం లెక్కించగా రూ.60,785 ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖ రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్ధన్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.శ్రీధర్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను గ్రామస్తుల సమక్షంలో లెక్కించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది చంద్ర, వంతాటిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు మదనపల్లె సిటీ : ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి గడువును అక్టోబర్ 31వతేదీ వరకు పెంచినట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పఠాన్ మహమ్మద్ఖాన్ తెలిపారు. రూ.200 అపరాధ రుసుంతో అవకాశం కల్పించారన్నారు. 14 సంవత్సరాలు వయస్సు నిండిన వారు పదోతరగతిలో, అలాగే 10వ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందొచ్చన్నారు. ఓపెన్ స్కూల్ దారా ప్రవేశం పొందినవారు సెలవు దినాల్లో నిర్వహించే తరగతులకు హాజరుకావాలన్నారు.అడ్మిషన్ పొందిన వెంటనే అభ్యర్థులు పెట్టిన చిరునామాకు పాఠ్యపుస్తకాలు పంపబడుతాయన్నారు. పూర్తి వివరాలకు 8121852786 నంబర్లో సంప్రదించాలన్నారు. -
వైభవం.. బిందెసేవ గ్రామోత్సవం
రాజంపేట టౌన్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధే సత్యనారాయణగుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన బిందెసేవ గ్రామోత్సవ సంబరం అంబరమంటింది. అమ్మవారిశాల మాడవీధులతో పాటు పట్టణంలోని మెయిన్రోడ్డు, పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తి, జానపద గేయాలకు కళాకారులు ప్రదర్శించిన కోలాటం ప్రజలను అబ్బురపరిచింది. దారివెంబడి గుర్రం చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. అమ్మవారి బిందెసేవలో రాజంపేట పట్టణ వాసులే కాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
పనిగంటల పెంపు నిర్ణయం రద్దు చేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : కార్మిక శ్రమను దోచే పని గంటలను తక్షణమే రద్దుచేయాలని, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.నాగేశ్వరరావు అన్నారు. రాయచోటి ఎన్జీఓ హోంలో సీఐటీయూ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పని గంటల పెంపు నిర్ణయం మరణశాసనంగా మారుతుందని, మూడు షిప్టులు, రెండు షిప్టులుగా మారడంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉపాధి పోతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వేలో కార్మికులలో హృద్రోగ మరణాలు పెరుగుతున్నాయని, సుదీర్ఘ పనిగంటలతో మానసిక మస్యలు పెరుగు తాయన్నారు. కార్మికుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో ఛిన్నాభిన్నం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని విధానం ఉన్నప్పుడే అనేక పరిశ్రమల్లో 12 గంటలు పనిచేయించడం జరిగిందని, ఇపుడు కార్మికులతో 14, 16 గంటలు పని చేయించుకుని బానిసలుగా మారుస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయకపోతే కార్మికులు, ఉద్యోగులు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. 12వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు కొరకు దీర్ఘకాలిక ఐక్య పోరాటాలు చేయడానికి సీఐటీయూ కీలకపాత్ర పోషిస్తోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎ.రామాంజులు, హరిశర్మ, డి.భాగ్యలక్ష్మి, మెహరున్నీసా, వెంకట్రామయ్య, ఓబులమ్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.నాగేశ్వరరావు -
సంప్రదాయాలకు నెలవు
● తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ● పురాణేతిహాసాల్లో ఘట్టాలను వివరిస్తున్న వైనంబొమ్మల కొలువు కేవలం సరదా కాదు.. ఆ కొలువు మన సంప్రదాయాలకు నెలవు. వందల ఏళ్లుగా ఆ కొలువు నిర్వహిస్తున్న వారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. ముందుతరం వారు ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును జాగ్రత్తగా కాపాడుకుంటూ మన బొమ్మలను జతచేస్తూ.. తరం మారుతున్న కొద్దీ కొలువును మరింత అందంగా తయారు చేస్తారు. పాతకాలం నాటి బొమ్మలు నాటి కథాకాలక్షేపాలకు ఆచార వ్యవహారాలకు సాక్షిగా ఉంటాయి. మదనపల్లె సిటీ : దసరా అంటేనే సందడి. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇందులో బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యువతకు బొమ్మల కొలువు అంటే కొత్తమాటలా అనిపిస్తున్నా నేటికీ కొన్ని కుటుంబాలు కొలువులు ఏర్పాటు చేస్తూ తరతరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు ఇళ్లల్లో బొమ్మల కొలువులు ఏర్పాటుచేస్తారు. ఇంట్లో ప్రత్యేక గదిని కేటాయించి బొమ్మలు పేర్చడం కష్టంతో కూడుకున్న పనే అయినప్పటికీ ఇష్టంగా చేస్తుంటారు. తొమ్మిదిమెట్లు ఏర్పాటు చేసి సంప్రదాయబద్ధంగా కొలువుదీర్చుతారు. మట్టి కొయ్య, పింగాణి, ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ బొమ్మలు ఆకర్షణగా నిలుస్తాయి. భద్రపరచడం కష్టమే.. బొమ్మల కొలువు పూర్తయ్యాక వాటిని భద్రపడం కీలకమని చెబుతున్నారు నిర్వాహకులు. దీనికి ఎంతో ఓపిక, సహనం ఉండాలంటున్నారు. మళ్లీ బొమ్మల కొలువు వచ్చే వరకు వాటి రంగులు ఊడిపోకుండా వాటిని జాగ్రత్తగా పెట్టెల్లో కాపాడుకుంటామని వారు వివరించారు. దుర్గాదేవితో పాటు రాముడు, కృష్ణుడు, వినాయకుడు, లక్ష్మి, సరస్వతీ, పెళ్లితంతు, జంతువులు, పక్షులు, పండ్లు, చెట్లు, ఆకులు,పురాతన కట్టడాలు, ప్రయాణ సాధనాలు, వాహనాల.. ఇలా రకరకాల బొమ్మలు ఈ కొలువులో కనువిందు చేస్తుంటాయి. వాటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. -
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం
బ్రహ్మంగారిమఠం : విశ్వ బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఉద్యమిస్తామని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అన్నారు. బ్రహ్మంగారిమఠంలోని విరాట్ విశ్వకర్మ భవన్లో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ అడిషనల్ పోలీస్ కమిషనర్ కె.కిరణ్కుమార్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐకమత్యంతో ముందుకు సాగితే రాజ్యాధికారంలో వాటా సాధ్యమని తెలిపారు. ఏపీ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం లీగల్సెల్ చైర్మన్ పేరుసోముల గురుప్రసాద్ ఆచారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాకుగానీ, కొత్తగా బద్వేలు జిల్లా ఏర్పడితే దానికి వీరబ్రహ్మేంద్రస్వామి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు జవ్వాది కూర్మాచార్యులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ప్రతి ఎన్నికల్లో ఎంపీ, రెండు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇ.వెంకటాచారి మాట్లాడుతూ తిరుమలలో వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, వసతిగృహం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని టీటీడీ కోరింది. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి మాట్లాడుతూ మంగళ సూత్రం తయారీ హక్కుదారులుగా విశ్వబ్రాహ్మణ, స్వర్ణకారులకు వీలు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దార్ల పాపయ్య, విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు అంగలకుదిటి సుశీల, తాళభద్ర వాసవి, నాగార్జున, తుంపాల వెంకటేశ్వర్లు, లక్కోజు సుజాత, వినుకొండ సుబ్బారావు, శ్రీనివాస ఆచారి, దశరథ ఆచారి, రంగాచారి, అప్పలస్వామి, శేషగిరి రావు, శేష బ్రహ్మ ఆచారి, చిలకపాటి మధుబాబు, మోడపల్లె నాగు, రామకృష్ణ ఆచారి, పద్మావతి, సాయి, శివ, ఫణీంద్రకుమార్, వీరాచారి, పలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు -
స్థలం విషయంలో ఘర్షణ
మదనపల్లె రూరల్ : స్థల విషయంలో జరిగిన ఘర్షణలో అక్క, తమ్ముడు గాయపడిన సంఘటన పట్టణంలో ఆదివారం జరిగింది. టీచర్స్ కాలనీకి చెందిన చిన్నప్ప కుమారుడు శివశంకర్(37) స్థానికం వారపుసంతలో కూరగాయల మండీ నిర్వహిస్తున్నాడు. ఇసుకనూతిపల్లెకు చెందిన అతడి అక్క ఇ.మంజుల(40) కొత్తిమీర వ్యాపారం చేస్తోంది. కొంతకాలంగా శివశంకర్, వారపుసంతలో మండీ నిర్వహిస్తున్న సయ్యద్ షావలి మధ్య స్థలం వివాదం ఉంది. ఆదివారం సయ్యద్ షావతి తన వద్ద పనిచేస్తున్న ఈశ్వరమ్మ కాలనీకి చెందిన యువకుడిని ప్రోత్సహించి శివశంకర్పై దాడికి ఉసి గొల్పాడు. దీంతో ఆ యువకుడు కొంతమందితో కలిసి శివశంకర్పై ఇనుపరాడ్తో దాడి చేస్తుండగా, అడ్డువచ్చిన అతడి సోదరి మంజులపై సైతం దాడిచేశాడు. దాడిలో అక్క, తమ్ముడు గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేయగా, విచారణ చేస్తున్నారు. -
నీటికుంటలో పడి హిజ్రా మృతి
సంబేపల్లె : నీటికుంటలో పడి హిజ్రా శిరీష (20) ఆదివారం మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని బండకాడమాలపల్లెకు చెందిన హిజ్రా గ్రామ సమీపంలోని నీటికుంట వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి మృతిచెందారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కట్టా పుట్టాలమ్మ గుడిలో చోరీఓబులవారిపల్లె : మండలంలోని మంగంపేట కట్టాపుట్టాలమ్మ గుడిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఉదయం గుడి తెరిచి చూడగా గుడిలో బీరువా, హుండీ పగలకొట్టి చీరలు, నగదు దొంగతనానికి పాల్పడ్డారు. జాతీయ రహదారి సమీపంలో కట్టా పుట్టాలమ్మ గుడి ఉండడంతో సీసీ కెమేరాలు ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వేతనాలు విడుదల చేయాలికడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో కెజీబీవీ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి కోరారు. కడప సీపీఐ కార్యాలయంలో కేజీబీవీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 మంది మహిళా నాన్ టీచింగ్ స్టాఫ్కు 11 నెలల వేతనం ఇవ్వకపోవడంతో అర్ధకాలితో అలమటిస్తూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ దృష్టి కేంద్రీకరించి వేతనాల విడుదలకు కృషిచేయాలని కోరారు. లేని పక్షంలో విజయవాడ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వేతనాల విడుదలకు కృషిచేయాలని, లేకపోతే రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు అజిత, మౌనిక, నాగమణి, కృష్ణ, సునీత, తదితరులు పాల్గొన్నారు. -
‘హృదయాన్ని అద్దంలా..!
చూసుకో పదిలంగా..కడప రూరల్ : మానవ శరీరంలో అన్ని శరీర భాగాలు కీలకమే. ప్రధాన భాగమైన గుండె పోషించే పాత్ర ఎంతో ప్రత్యేకమెంది. ఏదైనా సంఘటనను తట్టుకొని నిలబడినప్పుడు వాడికి ‘గుండె నిబ్బరం’ ఎక్కువరా..! అంటారు. అంటే గుండె సంపూర్ణ ఆరోగ్యకంగా ఉందనడానికి నిదర్శనం. అది ఎప్పుడో 30ఏళ్ల మాట. ఇప్పుడు గుండె జబ్బులు సాధారణ వ్యాధుల్లా మారాయి. ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో తెలియని విధంగా ఆరోగ్య పరిస్థితులు మారాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. ఉచిత వైద్యసేవ ద్వారా యేటా వేలాది మంది బైపాస్సర్జరీలు చేయించుకున్నారు. స్టంట్లు వేయించుకుని, ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా గుండె జబ్బుగల వారికి వైద్య సేవలంన్నారు. ఆరోగ్యశ్రీకి రెఫర్ చేశారు. ఇలా పలు పథకాలు, నివేదికల ద్వారా గుండె వ్యాధుల తీవ్రతను తెలియపరుస్తోంది. జాగ్రత్తలతో హృదయాన్ని కాపాడుకుంటే పదికాలాలపాటు జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవనశైలి మార్పులతోనే 35 ఏళ్లకు ముందు ఏదైనా ఆహారం తినాలంటే నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు, బఠానీలు, సంప్రదాయ పదార్థాలు లభించేవి. హోటళ్లలో కల్తీలేని ఆహార పదార్థాలు లభించేవి. నేడు ఆహారం విచ్చలవిడిగా లభిస్తూ మనిషి ప్రాణాల మీదకు తెస్తోంది. నూడుల్స్, బర్గర్లు, పిజ్జాల వంటి కార్పొరేట్ ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యకరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ఊబకాయం వస్తోంది. అందులో కీలకమైనది గుండె. ఈ భాగంలో మార్పులు సంభవించడం, రక్తనాళాలు గడ్డకట్టుకుపోవడంతో గుండె వ్యాధులు, హార్ట్ స్టోక్లు వస్తున్నాయి.గుండె నొప్పి లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఛాతీలో మంట.. కొద్దిగా నడిచినా అయాసం జీర్ణాశయం పైభాగాన నొప్పి ఎడమచేయి, రెండు చేతుల్లో నొప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకోవాలి. 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మంచి పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు, నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని జయించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి.నేడు ప్రపంచ గుండె దినోత్సవంయుక్త వయసులోనే ‘గుండె’ లయ తప్పుతోంది. ‘గుండె నొప్పి’ కారణంగా ఉన్న ఫలంగా కుప్ప కూలిపోతున్నారు.. ప్రాణాలు విడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలతో గుండెను పదిలంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా.. ప్రత్యేక కథనం. -
మాదిగలను విభజించే హక్కు చంద్రబాబుకు లేదు
మదనపల్లె రూరల్ : మాల మాదిగలను విభజించే హక్కు చంద్రబాబుకు లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఆగస్టు 3వ తేదీన కుప్పం నుంచి మొదలైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చేరుకుంది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం ఆధ్వర్యంలో ఈ మహా పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. నిమ్మనపల్లె సర్కిల్ నుంచి ప్రారంభమైన యాత్ర మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి ఎస్సీలు రోడ్లపైకి రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుతో ఎస్సీ వర్గీకరణను తీసుకువచ్చి ఇపుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం అంటే 15 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి అనుభవించడం కాదని, మాదిగను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. అన్నదమ్ముల్లా ఉంటున్న దళితుల మధ్య లేనిపోని తగాదాలు పెట్టి, వారిని రోడ్లపైకి తీసుకువచ్చిన చంద్రబాబు వైఖరి తప్ప అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ కాదని, డైరెక్షన్ ఇచ్చిందని, దాని ఆధారంగా దళితులను విభజించడం దుర్మార్గపు చర్య అన్నారు. చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆఽశయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు తూట్లు పొడుస్తున్నారన్నారు. దళితులకు అన్యాయం చేసే ప్రభుత్వాలను కూల్చడంతోపాటు, వారిపై చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగంలో చట్టం తీసుకురావాలన్నారు. ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు, మాలమహానాడు రాష్ట్ర అఽధ్యక్షులు యమలాసుదర్శన్ మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 15 శాతం నుంచి 20 శాతానికి పెంచాలన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని రద్దుచేయాలన్నారు. దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప -
ఆదిపత్యం.. అభివృద్ధికి ఆటంకం
జమ్మలమడుగు: ఇద్దరు నేతల మధ్య ఆదిపత్య పోరుతో గండికోట అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఒకరేమో అనకాపల్లి ఎంపీ రమేష్నాయుడు, మరొకరు స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాస్కి నిధుల కింద వైఎస్సార్ జిల్లాలోని గండికోట అభివృద్ధికి 78 కోట్ల రూపాయలు కేటాయించారు. టెండర్ను రిత్విక్ కంపెనీ లెస్కు దక్కించుకుంది. దీంతో మొదటి విడతగా 50 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని సంప్రదించకుండా పనులు చేపట్టడంతో స్థానిక నాయకులు గుర్రుగా ఉన్నారు. సబ్కాంట్రాక్ట్ కింద ఇతర జిల్లాలకు చెందిన వారికి పనులు ఇచ్చారంటూ గండికోట వాసులు, స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అడ్డంకులే... సాస్కి పథకం కింద గండికోటలో రహదారులు, బోటు షికారు, వసతుల కల్పన తదితర పనులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి రిత్విక్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీంతో కంపెనీ యాజమాన్యం రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల పహారాలో పనులు చేపట్టారు. అయినా రెండో సారి పనులను అడ్డుకున్నారు. దీంతో ఈ పంచాయితి కలెక్టర్ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్ కూడా స్థానికులకే పనులు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని రమేష్నాయుడు, సురేష్నాయుడు వ్యతిరేకించారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నెల్లూరు ప్రాంత వాసులతో చేయించుకుంటారా అని బీజేపీ, టీడీపీ నాయకులు కంపెనీ కార్యాలయంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 22వ తేదీ జరిగిన దాడి తర్వాత గండికోటలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దీంతో గండికోటలో అభివృద్ధి జరుగుతుందా.. లేక ఆగిపోతుందా అనే సందేహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన రూ.50 కోట్ల పనులు -
పెన్షన్.. టెన్షన్!
మదనపల్లె: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యాచరణలో భాగంగా అక్టోబర్ ఒకటిన జరగాల్సిన సామాజిక పింఛన్ల పంపిణీ కోసం బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాను నిరాకరిస్తూ ఎవరూ నగదు దగ్గర పెట్టుకోకూడదని నిర్ణయించారు. వచ్చే గురువారం పింఛన్ల పంపిణి జరగాలి. తెల్లవారుజాము నుంచే పింఛన్దారుల ఇళ్లవద్దకే వెళ్లి అందజేయాలి. అయితే సచివాలయ ఉద్యోగ సంఘాల జేఏసీలు అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా వాట్సప్ గ్రూపుల నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి వచ్చారు. జిల్లాలో పింఛన్ల పంపిణీకి సోమవారం పోగా రెండురోజులు మిగిలి ఉంటాయి. ఈ రెండురోజుల్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఆయా సచివాలయాల ఉద్యోగులు సన్నద్దం కావాలి. ఒకరోజు ముందుగా బ్యాంకులనుంచి న గదును విత్డ్రా చేసుకుని తమవద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకటిన తెల్లవారుజాము నుంచే పంపిణీ మొదలవ్వాలి. అయితే ఇప్పటిదాకా దీనిపై స్పష్టత లేకుండాపోయింది. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయలేదు. జేఏసీ ప్రతినిధులతో చర్చించేందుకు నిర్ణయించగా వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టి యథావిధిగా పంపిణీ చేయిస్తుందా స్పష్టత లేదు. ఒకవేళ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తే..వీరికి ప్రత్యామ్నయంగా సంఘమిత్ర, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు అధికారులతో పింఛన్ల పంపిణీ చేయించే అవకాశం ఉందని జేఏసీ రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. అక్టోబర్ ఒకటిన జిల్లాలోని 30 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లోని 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 4,029 మంది ఉద్యోగులు..జిల్లాలోని 2,17,657 మంది పెన్షన్దారులకు రూ.93.94 కోట్లు పంపిణి చేయాల్సి ఉంది. అక్టోబర్ ఒకటిన పింఛన్లు ఇవ్వమని సచివాయల జేఏసీ అల్టిమేటం జిల్లాలో 2,17,657 మందికి రూ.93.94 కోట్ల పంపిణీ జరగాలి ప్రత్యామ్నయంపై దృష్టి పెట్టని ప్రభుత్వం -
శభాష్.. అసద్
రాయచోటి జగదాంబసెంటర్: రెడ్ టెన్నిస్ బాల్ అండర్ –19 జాతీయ క్రికెట్ జట్టుకు రాయచోటికి చెందిన అసద్ ఎంపికయ్యాడు. శనివారం ఉత్తరాఖండ్లో జాతీయ స్థాయి టోర్నీలో అసద్ తెలంగాణ జట్టు తరపున పాల్గొని, జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించినట్టు కుటుంబసభ్యులు ఇక్కడి విలేకరులకు తెలియజేశారు. దీంతో అసద్ జాతీయ జట్టుకు ఎంపికై వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే మ్యాచ్లో పాల్గొంటారన్నారు. కాగా అసద్ రాయచోటిలోని నిదా టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అసద్ జాతీయ జట్టుకు ఎంపికవ్వడం పట్ల స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
జాక్పాట్ పేరుతో మోసం
గుర్రంకొండ : జాక్పాట్ పేరుతో తమను దగా చేస్తున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులకు టమాట రైతులు శనివారం ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందట మార్కెట్ యార్డులో జరిగే అన్యాయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాయచోటి మార్కెటింగ్ శాఖ ఏడీఏ త్యాగరాజు గుర్రంకొండ యార్డులో విచారణ చేపట్టారు. పలువురు రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జాక్పాట్ పేరుతో వందకు పది నుంచి 12 క్రీట్ల టమాటాలను బలవంతంగా తీసుకొంటున్నారని పేర్కొన్నారు. దానికితోడు టమాటాలను క్రీట్లపై రాశులుగా పోస్తున్నారని, కమీషన్లు పది శాతం తీసుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. వేలం పాట పాడుకొనే ధరల కంటే క్రీట్పై రూ.50 నుంచి రూ.70 వరకు కోత విధిస్తున్నారని వాపోయారు. 25 కిలోల క్రీట్లకు బదులుగా 15 కిలోల క్రీట్లు మండీల్లో ఏర్పాటు చేస్తామని వ్యాపారులు చెబుతున్న మాటలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే వారే కరువయ్యారని రైతులు పేర్కొన్నారు. అనంతరం రైతుల వద్ద లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు ఏడీఏ స్వీకరించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిఫురం మార్కెట్ కమిటీ కార్యదర్శి కుమార్రెడ్డి, సిబ్బంది. రైతులు పాల్గొన్నారు. -
అక్రమాలకు చరమగీతం పలికే ఆయుధం డిజిటల్ బుక్
● వైఎస్.జగన్ నేతృత్వంలో న్యాయ యుద్ధానికి శ్రీకారం ● ప్రతి కార్యకర్త మొబైల్లో డిజిటల్ బుక్ యాప్ ఉండాలి ● వైఎస్సార్సీపీ నాయకుల పిలుపు రాయచోటి : అన్యాయాలు, అక్రమాలకు చరమ గీతం పలికే ఆయుధంగా డిజిటల్ బుక్ ఉంటుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్కుమార్రెడ్డి అన్నారు. రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగనమోహన్రెడ్డి ఆదేశాలకు డిజిటల్ బుక్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాజకీయ వేదింపులపై న్యాయపోరాటం సాగించేందుకు డిజిటల్ బుక్ ఆయుధంగా పనిచేస్తుందన్నారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఛీజీజజ్ట్చీఛౌౌజు. ఠ్ఛీడటటఛిఞ. ఛిౌఝ, లోగానీ లేదా ఐవీఆర్ఎస్ ఫోన్ నెంబరు 040–49171718 ద్వారా కార్యకర్తలు తమకు జరిగే అన్యాయాలు, రాజకీయ దాడుల వివరాల ఫొటోలు, ఆధారాలతో సహా అప్లోడ్ చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుట్ర చేసిన వారిని శిక్షిస్తామని పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన పూర్తిస్థాయి అక్రమాలకు, అరాచకాలకు నిలయంగా మారిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని, వ్యాపారులు కప్పం కట్టాలంటూ బెదిరించడం, వినకపోతే దాడులకు పాల్పడడం దారుణమన్నారు. సామాజిక మాధ్యమ కార్యకర్తపై నమోదైన కేసును సీబీఐ దర్యాప్తుకు చేరుకోవడం అధికారుల ఏకపక్ష వైఖరికి బలాన్నిస్తోందన్నారు. అభిమాని తన మొబైల్లో డిజిటల్ బుక్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను మానకపోతే కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, 29న మండల కేంద్రాలలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా అవహేళన చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫయాజుర్ రెహమాన్, కొలిమి హరూన్బాషా, బేపారి మహమ్మద్ఖాన్, పల్లపు రమేష్, శ్రీనివాసులురెడ్డి, రియాజుర్ రెహమాన్, సాధిక్అలీ, షబ్బీర్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, విజయభాస్కర్, అంజనప్ప, ఖలీల్, బేపారి అసద్, కొత్తపల్లి ఇంతియా, పైరోజ్, బేపారిజబీఉల్లాఖాన్, బుజ్జిబాబు, అశోక్, తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న శ్రీకాంత్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, రమేష్కుమార్రెడ్డి, తదితరులు -
తక్షణ చికిత్సతోనే ప్రాణాలకు రక్షణ
కుక్క కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకుని సరిపెట్టుకునే వాళ్లుంటారు. కానీ పెంపుడు కుక్క, వీధి కుక్క... ఏది కరిచినా రేబీస్ రాకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. కుక్క కరిచిన వెంటనే వైద్యుడిని సంప్రదించి టీకా వేయించుకుంటే రేబిస్ బారినుంచి తప్పించుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. 28న రేబిస్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. రాజంపేట టౌన్ : రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి కుక్క కాటు కేసులో ఏటా పెరుగుతున్నాయి. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు 10,104 మంది కుక్క కాటుకు గురై చికిత్స తీసుకున్నారు. ఏటా సెప్టెంబర్ 28న రేబిస్ వ్యాధి నివారణ దినం నిర్వహిస్తూ.. ప్రభుత్వం కుక్క కాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే వీధి కుక్కల బెడద ఇటీవల పెరగడంతో పలువురు కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రాథమిక ఆస్పత్రుల్లో సకాలంలో మందులు లేకపోవడంతో వేల రూపాయలు బయట ఆస్పత్రులకు ఖర్చు చేస్తున్నారు. వీధి కుక్కలను తరలించడంలో మున్సిపాల్టీ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో ఏటా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి ఎలా వస్తుంది గబ్బిలాలు, పిల్లులు, నక్కలు, కోతి లాలాజలంలో రేబిస్ ఉంటుంది. అవి కరచినా, వాటి లాలాజలం శరీరభాగాల్లోని ద్రవాల్లోనూ, గాయాల పైనా పడినా ప్రాణాంతకరమైన రేబిస్ వ్యాధికి దారి తీస్తుంది. రేబిస్ వైరస్ సోకిన కుక్క కరిస్తే తొలుత కండరాలకు, అనంతరం శ్వాసకోశ నాళాలకు వైరస్ సోకుతుంది.. చలాకీగా కదిలే కుక్క అకస్మాత్తుగా నీరసించడం, ఒంటరిగా ఉండిపోవడం, నోటి నుంచి సొంగ కారడం, నీటికి దూరంగా ఉండడం, గుండ్రంగా తిరుగుతూ ఉండడం వంటి లక్షణాలు కనిపించిన కుక్కకు దూరంగా ఉండాలి. వాటికి ఆహారం తినిపించడం, ఆడుకోవడం చేయరాదు. కుక్క కరిస్తే కనిపించే లక్షణాలు కుక్క కరచిన మనిషికి ఆకలి తగ్గడం, తల తిరగడం, జ్వరం రావడం, నీరు చూసినా భయపడడం వంటి లక్షణాలుంటాయని తెలిపారు. కుక్కలకు సోకే రేబీస్ వైరస్ శరీరంలో దీర్ఘకాలం పాటు ఉండిపోతుంది. కుక్క ప్రాణాలు కోల్పోయేలోపు ఎంతమందిని కరిస్తే అంతమందికీ రేబీస్ వైరస్ సోకుతుంది. కుక్క గోళ్లు గీసుకున్నప్పుడు వెంటనే సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొరికినప్పుడు పన్ను లోపలకు దిగి రక్తం కారితే ఆ ప్రదేశంలో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి, రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాధి బాగా ముదిరితే మనిషి కుక్కలా ప్రవర్తిస్తారు. కోమాలోకి వెళ్లి శ్వాస ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఏ కుక్క కరిచినా.. కుక్క కరిచినప్పుడు, ఎంత లోతుగా కరిచింది అనే దాని మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. కుక్క గోళ్లతో గోకడాన్ని గ్రేడ్ ఎగా, కొరికినప్పుడు పంటిగాటు ఏర్పడితే ఆ గాయాన్ని గ్రేడ్ బిగా, పంటిగాటుతోపాటు రక్తస్రావమైతే గ్రేడ్ సిగా పరిగణించాలి. ఈ గాయాలకు రేబిక్యూర్ వ్యాక్సిన్తో పాటు, రేబీస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ టీకా ఇవ్వాల్సి ఉంటుంది. కుక్కకు ఎలాంటి టీకాలు ఇప్పించకపోయినా, అది వీధికుక్క అయినా, పెంపుడు కుక్క అయినా రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సాధారణంగా చాలామంది వీధిలో రోజూ కనిపించే కుక్క, దానికేం కాలేదు కాబట్టి మాక్కూడా ఏం జరగదు అని చికిత్సను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అది ఎలాంటి కుక్క అయినా, ఎలాంటి లక్షణాలు లేకున్నా కరచిన వెంటనే తప్పనిసరిగా వైద్యులను కలిసి ఇంజెక్షన్లు తీసుకోవాలి. పెంపుడు కుక్కల నుంచి కుటుంబ సభ్యులకు వ్యాధులు సోకుతాయి కాబట్టి వాటికి తప్పనిసరిగా యాంటీ రేబీస్సతో పాటు లెప్టోస్పైరోసిస్ లాంటి ఇతరత్రా వ్యాధుల టీకాలు వేయించాలి. డోసులు ఇలా.. పెంపుడు కుక్క : యాంటీ రేబీస్ టీకాలు ఇప్పించిన పెంపుడు కుక్క కరిచినప్పుడు మూడు డోసుల యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, ఏడవ రోజు 21 రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. వీధి కుక్క : ఈ కుక్క కరిచినప్పుడు ఐదు డోసుల యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, మూడో రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 27వ రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. 90వ రోజున బూస్టర్ డోసు తీసుకోవాలి. నేడు రేబిస్ వ్యాధి నివారణ దినం కుక్క కరిచిన వెంటనే ఆ భాగంలో కుళాయి నీటితో పది నిమిషాలపాటు శుభ్రంగా కడగాలి. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించుకోవాలి. వైద్యులు లేకుంటే మెడికల్ స్టోర్స్లో లభించే అయోడిన్, సేవ్లాన్ వంటి యాంటిసెప్టిక్ లోషన్లు రాయాలి. గాయం అయితే వైద్యుడిని సంప్రదించి రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ టీకా వేయించుకోవాలి. బయట ఇంజెక్షన్ కొనాలంటే రూ.3వేలు అవుతుందని, ప్రభుత్వఆస్పత్రిలో ఉచితంగా వేస్తారు. – డాక్టర్ పాలనేని వెంకటనాగేశ్వరరాజు, సూపరింటెడెంట్, రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి -
పండగ వేళ.. ఇల్లు జాగ్రత్త
రాయచోటి : దసరా పండగ సెలవులు వచ్చాయని ఊళ్లకు వెళ్లే సందర్భంలో ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలని ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ఓ ప్రకటనలో సూచించారు. ఇంటికి తాళం కనిపించినపుడే దొంగలు గుర్తిస్తారని ఎస్పీ హెచ్చరించారు. తలుపులకు తాళం సరిగా వేయకపోవడం, బయట తాళం వేసి వెళ్లిపోవడం, విలువైన వస్తువులు ఇంట్లో వదిలేయడం చేస్తే దొంగలకు ఆహ్వానం పలికినట్లే అన్నారు. ఇంట్లో సీసీ కెమేరాలు, అలారం, సెన్సార్ లైట్లు అమర్చాలన్నారు. ఊరిలో పరిచయం లేని వ్యక్తులు తిరుగుతుంటే జాగ్రత్తగా గమనించాలని సూచించారు. మీరు ఇంట్లో లేనప్పుడు ఆ వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నమ్మకమైన వారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి -
సాఫ్ట్ట్బాల్ జిల్లా జట్టు ఎంపిక
పుల్లంపేట : స్థానిక మోడల్ స్కూల్ క్రీడా మైదానంలో కడప జిల్లా సబ్ జూనియర్ బాలబాలికలు, సీనియర్ పురుషుల సాఫ్ట్ బాల్ జట్లను శనివారం ఎంపిక చేసినట్లు రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సభ్యులు ఎస్పి.రమణ, నరసింహారెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ అక్టోబర్ 3, 4, 5వ తేదీలలో విశాఖపట్టణంలో జరిగే సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొనే ఉమ్మడి కడప జిల్లా జూనియర్ బాల, బాలికల జట్టును, నవంబర్లో జరిగే సీనియర్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు పురుషుల జట్టును ఎంపిక చేశామన్నారు. ఒక్కో జట్టులో పదహారు మంది సభ్యులు ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో ఆల్పామైరెన్ అధినేత సుధాకర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లీలాశ్రీహరి, ఫిజికల్ డైరెక్టర్ నీలకంఠరావు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో అందరికీ ప్రయోజనం రాయచోటి టౌన్ : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో సాధారణ ప్రజలందరికీ ప్రయోజనం ఉందని అన్నమయ్య జిల్లా డీఎంఅండ్హెచ్వో డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. వైద్య సిబ్బందితో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 25వతేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా శాఖల వారీగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జీఎస్టీపై అవగాహన, 30వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు వ్యవసాయం, ఉద్యానవనం, ఉపాధి హామీ కూలీలకు అవగాహన, 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మానవ వనరులు, విద్య, ఆరోగ్యం, అభివృద్ధి సాధికారితలపై అవగాహన, 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ వికాస్ విశ్వాస ర్యాలీలు, సమావేశాలు, క్విజ్ పోటీలు, సెమినార్లు, వివిధ రకాల పోటీల నిర్వహణ, 19నుంచి మండల, జిల్లా స్థాయి దీపావళి సంబరాలు ఉంటాయని తెలిపారు. టీకాతో ప్రాణాంతక వ్యాధులు నయం – జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు సిద్దవటం : ప్రాణాంతకమైన వ్యాధులను టీకాతో నయం చేయవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్యఖాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. మండలంలోని పొన్నవోలు కొత్తపల్లి పీహెచ్సీలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులకు పోషకాహారం అందించామని, చిన్నపిల్లలకు టీకాలు వేయించి, వృద్ధులకు మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సోకితే భయపడవద్దన్నారు. అనంతరం స్వచ్ఛ నారీ సశక్త్ పరివార్ గురించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ జె.ప్రవీణ్కుమార్, వైద్యాధికారిణి పి.రంగలక్ష్మి, పి.సందీప్, హర్షిత, కల్పన, మంజుల, సూర్యప్రకాష్, యూనస్, లక్ష్మీనరసమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణం.. ప్రమాదకరం
గుర్రంకొండ: మండలంలోని టి.పసలవాండ్లపల్లె గ్రామం..అదొక మారుమూల ప్రాంతం. ఇరువైపులా కొండలు.. మధ్యలో 20 గ్రామాలతో పంచాయతీ విస్తరించి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు మాండవీయ నది వంక ఉధృతంగా ప్రవహించడంతో టి.గొల్లపల్లె వద్ద ఉన్న బ్రిడ్జి కుప్పకూలిపోయింది. పిల్లవాండ్లపల్లె వద్ద ఉన్న మరో బ్రిడ్జి సగం వరకు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. అప్పటి నుంచి 20 గ్రామాలకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు టి.గొల్లపల్లె వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో తాత్కలికంగా మట్టి, సిమెంట్ పైపులు వేసి రహదారిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిపై చిన్న ఆటోలు, ద్విచక్రవాహనాలు మాత్రమే అతికష్టం మీద వెళుతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం వచ్చిందంటే తాత్కాలిక బ్రిడ్జి కుంగిపోతుంది. ఇప్పటికే బ్రిడ్జి పై రంధ్రాలు కూడా ఏర్పడటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు సగం దారి వరకు వచ్చి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. కాగా పదిహేను రోజుల నుంచి ఈ మార్గంలో బస్సు కూడా తిరగడంలేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ● రాయచోటి– అంగళ్లు జాతీయ రహదారికి పక్కనే కొండల మధ్య ఉన్న 20 గ్రామాలకు పదిహేను రోజులుగా బస్సు సర్వీసు నిలిపివేశారు. రాయచోటి నుంచి చిన్నమండ్యం, కేశాపురం, టి.పసలవాండ్లపల్లె మీదుగా కలిచెర్ల వరకు బస్సు సర్వీసు నడిపేవారు. ప్రతిరోజు 5 మార్లు బస్సు తిప్పేవారు. వివిధ పనుల మీద వందలాది మంది ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లేవారు. మాండవీయనది వంకపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో ఉన్న ఒక్క బస్సు సర్వీసు నిలిచిపోయింది. దీంతో అధిక డ బ్బులు చెల్లించి ఆటోల్లో కేశాపురానికి చేరుకుంటున్నారు.కలిచెర్ల నుంచి రాయచోటి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో అక్కడి ప్రజలు పెద్ద మండ్యం, గాలివీడుకు వెళ్లి రాయచోటికి చేరుకుంటున్నారు. పిల్లావాండ్లపల్లె హరిజనవాడ వద్ద ఉన్న సిమెంట్రోడ్డు దెబ్బతింది. దీనివల్ల కుమ్మరపల్లె, ఎగువ,దిగువ మొరంపల్లె,పిల్లావాండ్లపల్లె గ్రామాల ప్రజలు పంచాయతీకస్పా అయిన టి.పసలవాండ్లపల్లెకు చేరుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో 20 గ్రామాల ప్రజలకు ప్రమాదంపొంచి ఉంది. టి.గొల్లపల్లె వద్ద మాండవీయనదిపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి దెబ్బతిన్న బ్రిడ్జిపై వెళుతున్న వాహనాలు మాండవీయనది వంకపై కూలిపోయిన వంతెనలు 20 గ్రామాలకు రవాణా బంద్ -
ఉమ్మడి కడప జిల్లా కళలకు కాణాచి
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి కడపజిల్లా కళలకు కాణాచి అని సంస్కృతి, సంప్రదాయాలకు, ఆత్మీయతకు పెట్టింది పేరని జిల్లా విద్యాశాఖా ధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సభాభవనంలో రచయిత, ఉపాధ్యాయుడు గజ్జల వెంకటేశ్వర రెడ్డి రచించిన మన కడప–ఘన గడప పాటకు సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలోని ఆధ్యాత్మిక స్థలాలు, దర్శనీయస్థలాలు, నదులు, ఖనిజ సంపద, కవులు,ఆటలు తదితల అంశాను కూర్చి అద్భుతమైన పాటను రచించి,గానం చేసి వీడియోగా చిత్రీకరించిన వెంకటేశ్వర రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డీకే చదువులబాబు, ఏఎంఓ. వీరేంద్ర, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షు రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు బాలగంగి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఇలియాస్బాషా, ఎన్టీఏ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణంరాజు, లెక్కలవారి పల్లె ప్రధానోపాధ్యాయుడు నరసింహులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్, మహేష్ బాబు, వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు సజ్జల రమణారెడ్డి, ఆర్జేయూపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సైన్స్ ఉపాధ్యాయులు వేపరాల ఎబినేజర్, సైన్స్ మ్యూ జియం క్యూరేటర్ రెహ్మాన్ , కౌశల్ జిల్లా కో–ఆర్డినేటర్ విజయ మోహన్ రెడ్డి, సైన్స్ కో ఆర్డినేటర్ సుుబ్బానాయుడు పాల్గొన్నారు. -
వీరభద్రస్వామికి వెండి గద బహూకరణ
రాయచోటి టౌన్: రాయచోటి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి కర్నాటకలోని ధార్వాడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ చాడిచాల్ వెండి గదను బహూకరించారు. శనివారం ఆలయ ఈవో డీవీ రమణారెడ్డికి దీనిని అందజేశారు. గద విలువ రూ. 50నుంచి రూ. 55 వేలు ఉంటుందని, దీనికి సంబంధించిన రసీదును అందజేసినట్లు ఈవో తెలిపారు. దాత పేరున స్వామి, అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని మూల విరాట్కు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రాజంపేట టౌన్: ఇప్పటికే ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు, ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప యనం అవుతున్నారు. దీంతో అన్ని మార్గాల్లో తిరిగే బస్సులు కిక్కిరిస్తున్నాయి. ఇదిలావుంటే శనివారం రాజంపేట పాతబస్టాండు ప్రయా ణికులతో కిటకిటలాడింది. బస్సుల్లో సీట్లు దొ రకక ఇబ్బందులు పడ్డారు. చాలామంది బస్సుకు ఎదురెళ్లి కిటికీల నుంచి సీట్లు పెట్టుకునేందుకు పోటీపడ్డారు. దసరా ముందు రోజు వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆర్టీసీ ఉన్నతాధికారులు అదనపు సర్వీసులు నడపాలని ప్రజలు కోరుతున్నారు. -
జేఎన్టీయూలో యంత్ర 2025 జాతీయ సదస్సు
పులివెందుల టౌన్ : స్థానిక జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ విభాగంలో శుక్రవారం యంత్ర 2కె25 మూడు రోజుల విద్యార్థుల జాతీయ సదస్సును ఘనంగా ప్రారంభించారు. యూసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభాస్రంజన్, న్యూటెక్ బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ వసంత్కుమార్, విశాఖపట్టణం ఫోర్ట్ అథారిటీ గ్రేడ్–1 అసిస్టెంట్ సెక్రటరీ అజయ్తేజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి 500మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభాస్రంజన్ మాట్లాడుతూ మానవుడి జీవితంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), చాట్ జీపీటీ ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలు వివరించారు. అనంతరం విశిష్ట అతిథులు ఇంజినీరింగ్ ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి.విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపల్ ఎం.శేషమహేశ్వరమ్మ, మెకానికల్ విభాగాధిపతి ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మిథున్రెడ్డి అరెస్ట్లో వేధింపులే లక్ష్యం
మదనపల్లె: సాక్ష్యాలులేని అక్రమ కేసుల్లో తనను అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం వేధించేందుకు సిద్ధమైందని మిథున్రెడ్డి ముందే పసిగట్టారు. తానొక ఎంపీని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో తన ప్రమేయం, సంబంధం ఉండదు, అయినా తనను లక్ష్యంగా చేసుకుని వేధించేందుకు సిద్దమయ్యారని మిథున్రెడ్డి స్పష్టంగా చెప్పినా, ఆరోపణలపై సాక్ష్యాలు చూపాలని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో ఆయన చెప్పినట్టే జూలై 19న సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం ఆయన కుమారుడిపై కుట్రలు పన్నుతోంది. ● పెద్దిరెడ్డి కుమారుడు మిథున్రెడ్డి చిన్న వయసులోనే రాజంపేట పార్లమెంట్ ఓటర్ల మనసును గెలుచుకుని వారికి దగ్గరయ్యారు. 2014లో తొలిసారి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరీని ఓడించి మిథున్రెడ్డికి అధిక మెజార్టీ ఇచ్చారు.ఇదికాక పెద్దిరెడ్డి తమ్ముడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డిని ఓడించాలని గత ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా ఓటర్లు ద్వారకనాధరెడ్డిని గెలిపించారు. మానసికంగా వేధించాలనే... కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డిని మానసికంగా వేధించే మార్గం ఎంచుకుంది. ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని మద్యం అక్రమ కేసులో జూలై 19న చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఇప్పటిదాకా బెయిలు రాకుండా మానసిక వేధింపులకు గురిచేస్తోంది. ● గత తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై కక్ష కట్టారు. 2014లో తొలిసారి రాజంపేట ఎంపీగా పోటీ చేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక.. అప్పుడే వేధింపులకు శ్రీకారం చుట్టారు. రేణిగుంట విమానాశ్రయంలో ఓ ఉద్యోగిపై దాడి చేసినట్టు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలులేక న్యాయస్థానం కొట్టివేసిందని మిథున్ రెడ్డి ఓ సందర్భంలో వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే మిథున్రెడ్డి రాజకీయ ఎదుగుదల, ప్రజాబలం చూసి ఓర్వలేక పోతున్నట్టు అర్థమవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసు నిరాధారమని తేలిపోవడంతో ఇప్పుడు మద్యం అక్రమ కేసులో అరెస్టు చేసి వేధిస్తున్నారు. 62 రోజుల తర్వాత కస్టడీకి జూలై 19న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని మద్యం అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. తర్వాత విచారణ కోసం సిట్ కస్టడీని కోరవచ్చు. అయితే అరెస్ట్ చేసిన రెండునెలలకు కస్టడీ కోరిన సిట్కు రెండురోజుల విచారణకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అరెస్ట్ అయిన 62 రోజుల తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించారు. సిట్ కస్టడీ కోరినప్పటికే మిథున్రెడ్డి తరపున న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలైంది. బెయిల్ను కస్టడీ ద్వారా అడ్డుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన నెలకొంటోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డినిరాజకీయంగా ఎదుర్కోలేక కుమారుడిపై కుట్రలు, కుతంత్రాలు బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణనుఅడ్డుకునేలా కస్టడీ జూలై 19న అరెస్ట్..జైలు, కస్టడీ..రిమాండ్తో అటూఇటూ తిప్పుతున్నారు ‘నేను చెప్పేది ఒకటే..మేం ఇంట్లో పదిమంది ఉన్నాం. నన్ను అరెస్ట్ చేసినా పట్టించుకోను..దేనికై నా సిద్ధం. నన్ను చంపినా పర్వాలేదు. నా ఇంట్లో నా తమ్ముడో, మా అమ్మో వస్తుంది..కచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం. ప్రజలకు అండగా నియోజకవర్గంలో నిలబడతాం.’ –అరెస్ట్కు కొన్నాళ్ల ముందు ఎంపీ మిథున్రెడ్డి ‘గత టీడీపీ హయాంలో తప్పుడు కేసు పెట్టగా నిరూపణ కాకపోవడంతో కొట్టేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అరెస్ట్కు భయపడే ప్రసక్తేలేదు. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఓ బెటర్ పర్సన్గా బయటకొస్తాను. మీకు సహకరిస్తాను, సాక్ష్యాలు చూపండంటే చూపలేదు.నోటిమాటతో ముఖ్యనేతలను టార్గెట్ చేసి అక్రమకేసులతో వేధిస్తున్నారు.’ –జూలై 19న అరెస్ట్కు ముందు ఎంపీ మిథున్రెడ్డి -
యర్రగుంట్ల మున్సిపాల్టీలో వార్డుల పెంపు
ఎర్రగుంట్ల : యర్రగుంట్ల పురపాలక సంఘం పరిధిలో మరో ఏడు వార్డులను పెంచేందుకు డీఎంఏ(డైరెక్ట్ మున్సిపాలిటీ ఆథారిటీ) ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ శేషఫణి, మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం మున్సిపాల్టీలో 20 వార్డులు ఉండగా, 32572 మంది నివసిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండవచ్చునని భావిస్తున్నామని తెలిపారు. ఇపుడు మున్సిపాలిటీలో ఏడు వార్డులు అదనంగా పెంచుతున్నట్లు ఉత్వర్వులు వచ్చాయని ఆయన తెలిపారు. ఎవరికై నా అభ్యర్థనలుంటే అక్టోబరు ఆరో తేదీలోగా మున్సిపాలిటీలో స్వీకరిస్తామని, 8వ తేదీలోగా పూర్తి నివేదిక కలెక్టర్కు పంపిస్తామని పేర్కొన్నారు. 10న డీఎంఏ (డెరెక్ట్ మున్సిపాలీటీ ఆథారిటి)కి పంపిస్తామని, 12న ప్రభుత్వానికి పంపగా, 14న జీవో విడుదల అవుతుందని తెలిపారు. యర్రగుంట్ల పురపాలక సంఘంలో 27 వార్డులు ఏర్పాటుకానున్నాయని, ఓటరు శాతం ప్రకారం ఒక్కో వార్డుకు 850కి తక్కువ కాకుండా విభజించాల్సి ఉంటుందని తెలిపారు. వార్డుల విభజనపై టీఎంపీ విభాగం కసరత్తు ప్రారంభించారని, 1 నుంచి 20వ వార్డు వరకు అన్నింటినీ పరిశీలించి విభజిస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి 27 వార్డులు -
జయశుభకారిణి..విజయరూపిణి
మదనపల్లెసిటీ: మహాలక్ష్మి అలంకారంలో శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి రాజంపేట టౌన్ః మోహినీదేవిగా వాసవీమాత శరన్నవరత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది.విద్యుద్దీపాలంకరణలతో అమ్మవారి ఆలయాలు వెలుగులీనుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. జయములీవు జగజ్జననని అంటూ వేడుకున్నారు. –సాక్షి నెట్వర్క్ -
గుట్టల్లో పారబోసిన షూలు స్వాధీనం
పెద్దతిప్పసముద్రం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మంజూరైన షూలను మండల కేంద్రానికి సమీపంలోని బోడిగుట్ట వెనుక వైపున వ్యవసాయ పొలాల్లో గుట్టల నడుమ పారబోశారు. ఈ విషయంపై శుక్రవారం ‘సాక్షి’లొ ప్రచురితమైన ‘గుట్టల్లో గుట్టుగా విద్యార్థుల షూ’లు వార్తపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పారబోసిన షూలను స్వాధీనం చేసుకుని సమగ్రంగా విచారణ చేయాలని డీఈఓ కె.సుబ్రమణ్యంకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీఈఓ నేతృత్వంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి (సీఎంవో) కరుణాకర్, స్థానిక ఎంఈఓ గౌస్పీర్,సీఆర్పీ నాగరాజుతో కలిసి షూలను గుట్టల నడుమ పారబోసిన స్థలాన్ని పరిశీలించారు. షూలను స్వాధీనం చేసుకుని మండల కేంద్రంలోని స్టాక్ పాయింట్లో భద్రపరిచారు. వీటిని ఎవరు పారబోశారనే విషయంపై సమగ్రంగా విచారణ చేపట్టి కలెక్టర్కు నివేదిక అందజేస్తామని సీఎంవో వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా శివారెడ్డి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పోతుల శివారెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (కేంద్ర కార్యాలయం)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోతుల శివారెడ్డి చెన్నూరు మండలం ఓబులంపల్లెకు చెందిన నాయకుడు. గతంలో ఆయన ఐటీ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందించారు. రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సుదర్శన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన జల్లా సుదర్శన్రెడ్డిని రాష్ట్ర లీగల్సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాయచోటి జగదాంబసెంటర్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ పేర్కొన్నారు. రాయచోటిలోని డీపీఎం కార్యాలయంలో శుక్రవారం రైతు సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం –2005పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. సమాచార హక్కు చట్టం –2005 గురించి రైతులకు స్పష్టంగా తెలియజేశారు. డీపీఎం వెంకటమోహన్ పాల్గొన్నారు. రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రైతులు 4 వేల ఎకరాలలో పండ్ల తోటలను సాగు చేసినట్లు జిల్లా ఉపాధి హామీ పథక సంచాలకులు వెంకటరత్నం అన్నారు. శుక్రవారం రామాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ నాలుగు వారాలకు సంబంధించిన బిల్లులు పది రోజుల్లో కూలీల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. అనంతరం చిట్లూరు గ్రామంలోని సప్లై ఛానల్ను, నల్లగుట్టపల్లి గ్రామంలో రైతులు వెంకటరమణ, వెంకటస్వామిలు సాగు చేసిన నిమ్మతోటలను ఆయన పరిశీలించారు. ఏపీఓ పెంచలయ్య, ఈసీ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
అత్యుత్తమ పరిశోధకుల జాబితాలో ఎల్వీపీఈఐ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రతిష్టాత్మక 2025 స్టాన్ఫోర్డ్/ఎల్సెవియర్ టాప్–2 సైంటిస్ట్ జాబితా ప్రామాణిక సైటేషన్ మెట్రిక్స్ ఆధారంగా ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పరిశోధకుల జాబితా విడుదలైంది. ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (ఎల్వీపీఈఐ) మరోసారి ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించిందని ఆ వైద్యశాల హెడ్ డాక్టర్ కావ్యమాధురి బెజ్జంకి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఏడుగురు ఎల్వీపీఈఐ అనుబంధ క్లినిషియన్ శాస్త్రవేత్తలు జీవితకాల ర్యాంకింగ్స్లోనూ, 15 మంది 2025 వార్షిక ర్యాంకింగ్స్లోనూ చోటు దక్కించుకున్నారని చెప్పారు. ఎల్వీపీఈఐ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లిఎన్.రావు భారతదేశంలోనే నేత్ర వైద్య రంగంలో జీవితకాల ర్యాంకింగ్లో రెండవ స్థానంలో నిలిచారన్నారు. ఆయతోపాటు మరో ఆరుగురు పరిశోధకులు సావిత్రిశర్మ, ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యన్ మహ్మద్ జావిద్ అలీ, ప్రశాంత్ గర్గ్, తారాప్రసాద్దాస్, స్వాతి ఉత్తమ ర్యాంకుల జాబితాలో ఉన్నారని చెప్పారు. 2025 సంవత్సరానికిగానూ 61 మంది భారతీయ నేత్ర వైద్య శాస్త్రవేత్తలు వార్షిక ర్యాంకింగ్స్లో స్థానం సంపాదించుకోగా మహ్మద్ జావిద్ అలీ, స్వాతి కలికి, సావిత్రి శర్మ, ప్రశాంత్ గర్గ్, సయన్ బసు, రోహిత్ ఖన్నా, గుళ్ళపల్లి ఎన్.రావు, స్వాతి సింగ్, తారాప్రసాద్ దాస్, ఎలిజబెత్ కీఫ్, వివేక్ సింగ్, పవన్ కుమార్ వెర్కిచర్ల, ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్, మిలింద్ నీలకంఠ నాయక్, సుభద్ర జలాలిలు జాబితాలో చోటు సంపాదించారని తెలిపారు. -
బాలకృష్ణా.. మెంటల్కు చికిత్స చేయించుకో..
– వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి దండు గోపి రాజంపేట టౌన్ : 20 ఏళ్ల కిందట బాలకృష్ణకు మెంటల్ ఉందని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారని, ఆయన సరైన చికిత్స చేయించుకోవడం లేదని.. దీంతో ఆయన పిచ్చి పీక్స్కు చేరిందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండుగోపి ఎద్దేవా చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల కిందట అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలనుబట్టి రాష్ట్ర ప్రజలకు ఆయన వైఖరి స్పష్టంగా అర్థమైందన్నారు. బెల్లంకొండ సురేష్పై అతడు కాల్పులు జరిపినప్పుడు దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి దయచూపారని, లేకుంటే ఇప్పటికే జైల్లో చిప్పకూడు తినేవారంటూ ఆరోపించారు. ఇలాగే వదిలేస్తే అసెంబ్లీలో తోటి ఎమ్మెల్యేలు, మంత్రులపై చేయిచేసుకునే అవకాశం లేకపోలేదన్నారు. ప్రజాస్వామ్యంలో మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం చాలాముఖ్యమని టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. -
అధికారులు నిబద్ధతతో పని చేయాలి
తంబళ్లపల్లె: సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వివిధ అంశాలపై నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం సాయంత్రంలోపు అధికారులు తమ నియోజకవర్గ స్థాయి సమస్యలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేసి, స్పెషల్ ఆఫీసర్లకు తప్పనిసరిగా పంపాలన్నారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పైప్లైన్ ఎక్కడా డ్రైనేజీ లైన్తో కలిసిపోకుండా చూడాలన్నారు. అంతకుముందు మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి అమరనాథరెడ్డి, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్ పల్లవి పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల చేకూరే లబ్ధిపై అవగాహన పెంచాలి రాయచోటి: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా జీఎస్టీ తగ్గించడంవల్ల చేకూరే లబ్ధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.కలెక్టరేట్ నుంచి క లెక్టర్ నిశాంత్కుమార్, జేసీ ఆదర్శరాజేంద్రన్లు పాల్గొన్నా రు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ప్రజలకు చేకూరే లబ్ధిపై ఈ నెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు.జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
రూ.925 కోట్లతో హంద్రీ–నీవా పనులు
మదనపల్లె: జిల్లాలో హంద్రీ–నీవా ప్రధానకాలువ, నీవా ఉప కాలువల అసంపూర్తి పనులు, వాటికి కొత్త కాంక్రీట్ లైనింగ్ పనులు చేయించడం కోసం రూ.925 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మదనపల్లె సర్కిల్–3 ఎస్ఈ ఆర్.విఠల్ప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసపురం, అడివిపల్లె రిజర్వాయర్లకు కృష్ణా జలాలను తరలించడం కోసం మిగిలిపోయిన పనులను పూర్తి చేయించాల్సి ఉందని చెప్పారు. దీనికోసం ప్రధాన కాలువ ప్యాకేజీ–1కు రూ.242.95 కోట్లు, ప్యాకేజీ–2కు రూ.177.81 కోట్లు, నీవా ఉప కాలువ అసంపూర్తి పనులు, లైనింగ్ కోసం మూడు ప్యాకేజీల్లో రూ.504.55 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కోరుతూ సీఈ ప్రభుత్వానికి నివేదించారని చెప్పారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నామని అన్నారు. కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులు పైపుల ద్వారా, మోటార్లతో నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని అన్నారు. కాలువను తెగ్గొట్టడం, నీటిని మళ్లించుకోవడం లాంటి చర్యలు పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో జరుగుతోందన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారికంగా ప్రణాళిక ప్రకారం నీటిని తరలిస్తామని చెప్పారు. ఎక్కడైనా కాలువను తెగ్గొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్ఈ విఠల్ప్రసాద్ -
జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
పులివెందుల టౌన్ : విద్యార్థులు సృజనాత్మకతతో జాతీయస్థాయిలో సత్తా చాటాలని ఆర్డీఓ చిన్నయ్య అన్నారు. స్థానిక న్యాక్ బిల్డింగ్ సమీపంలో న్యూఢిల్లీ యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శుక్రవారం ప్రారంభించారు. ఆర్డీఓ చిన్నయ్య మాట్లాడుతూ యుఎస్ఓ లాంటి ఎన్జీవో సంస్థలు దేశవ్యాప్తంగా విద్యార్థి సమగ్ర సంపూర్ణ వ్యక్తిత్వానికి సహకారం అందించి సఫలీకృతం అవుతున్నారని ప్రశంసించారు. త్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార్గుప్తా మాట్లాడుతూ యుఎస్ఓ జాతీయస్థాయి పోటీలను పులివెందులలో నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. విద్యార్థులు చదువుకు మాత్రమే పరిమితం కాకుండా పోటీ ప్రపంచంలో కావాల్సిన అన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలన్నారు. సెక్రటరీ జనరల్ నీనాజైన్ మాట్లాడుతూ పది రాష్ట్రాల నుంచి దాదాపు 158 మంది చిన్నారులు పాల్గొని అన్ని రాష్ట్రాల సంస్కృతులు, అలవాట్లను తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దాసరి భానుప్రకాష్, సునీల్కుమార్, త్యాగరాజన్, విజయ్కుమార్, మిశ్రా నిఖిల్, రాజేష్, శర్మ తదితరులు పాల్గొన్నారు. -
తప్పిన పెను ప్రమాదం
డ్రైనేజీలో నుంచి ఎగిసి పడుతున్న మంటలు, ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఎర్రగుంట్ల : పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ఆపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో హెచ్పీ పెట్రోల్ బంకులోని ట్యాంక్లోకి నీరు చేరింది. దీంతో వాహన దారులకు పెట్రోల్, డిజీల్ వేయలేదు. ఆయిల్ ట్యాంక్కు లీకులు ఉండడడంతో పెట్రోల్, డీజిల్ సమీపంలోని డ్రైనేజీ నీటిలో కలిసిపోయింది. దీంతో బంకు నిర్వాహకులు ట్యాంక్ చుట్టూ ఉన్న నీటిని తోడే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఒక్కసారిగా డ్రైనేజీ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. సిమెంటు దిమ్మెలు పెద్ద శబ్ధంతో ఒకపక్క పగిలిపోతుండగా.. మరోవైపు మంటలు వ్యాపించి పొగ కమ్మేసింది. స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. సీఐ విశ్వనాథరెడ్డి చేరుకుని బంకు సిబ్బందితో మాట్లాడి మంటలు అర్పే ప్రయత్నం చేయించారు. అనంతరం ప్రొద్దుటూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి డ్రైనేజీలలో ఆయిల్ను తొలగించడానికి కెమికల్ వాడారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
రాయచోటి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, హీరో చిరంజీవిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పడంతోపాటు బాలకృష్ణతోనూ క్షమాపణ చెప్పించాలన్నారు. రాష్ట్ర ప్రజలను అవమానించేలా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల తీరు కొనసాగుతోందని, కక్షపూరిత రాజకీయాలు చేయను అని చెబుతూనే తమ పార్టీ నాయకులకు వెనుక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దాడులు, బ్రిటీష్ తుగ్లక్ పాలనను మించి జరుగుతున్నాయన్నారు. హోమంత్రి, డిప్యూటీ స్వీకర్లు హద్దుమీరి మాట్లాడుతుండటం దారుణమన్నారు. తెలుగుదేశం మంత్రులు వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్య పదజాలతో రెచ్చిపోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. చిత్ర పరిశ్రమలో చిరంజీవితో పోటీపడలేక అక్కసు వెళ్లగక్కుతూ బాలకృష్ణ శాసనసభకు మచ్చతెచ్చారన్నారు. నాలుగేళ్ల కిందట అలాగా జనం, అలగా నా కొడుకు, సంకరజాతి వాడంటూ మాట్లాడిన బాలకృష్ణ ఇంకా తన తీరు మార్చుకోలేదన్నారు. ఎన్టీరామారావు కుమారుడు అని మరచిపోయి అసెంబ్లీలో ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. తన గన్నుతో ఒక మనిషిని కాల్చి చంపడానికి ప్రయత్నించిన బాలకృష్ణ సైకో కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మెంటల్ సర్టిఫికెట్ తీసుకున్న బాలకృష్ణ స్వయం కృషితో ఎదిగిన చిరంజీవిని ఇంత ఘోరంగా అవమానిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. అనేక సందర్భాలలో మహిళలను అవహేళన చేస్తున్నా.. రామారావు కుమారుడున్న కారణంగానే బాలకృష్ణను అందరూ గౌరవిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.21 కోట్లు
మదనపల్లె : పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ.21.93 కోట్ల కేటాయించినట్లు జిల్లా ప్రజారోగ్య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.సతీష్ కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో తాగునీటి సరఫరాపై గురువారం ఆయన సమీక్షించారు. పట్టణంలో ఎక్కడెక్కడ నీటి ఇబ్బందులున్నాయి? ఎలా సరఫరా చేస్తున్నారు? తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణానికి అమృత్ పథకం కింద రూ.21.93 కోట్లతో తాగునీటి పనులకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. చిప్పిలి సమ్మర్స్టోరేజ్ ట్యాంకుకు పనులు పూర్తిచేసి అక్కడినుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలో రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నామని, రాయచోటిలో మూడురోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో డీఈ శ్రావణి, ఏఈ రవీంద్రనాయక్, ఫిట్టర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.డీపీహెచ్ఈవో సతీష్కుమార్ -
మొన్న కుమార్తెలు.. నేడు తల్లి ఆత్మహత్య
రాయచోటి : రెండు నెలల క్రిందట ఇద్దరు కుమార్తెలు, గురువారం తెల్లవారు జామున తల్లి మహబూబ్ జాన్ ఒకే ఇంటిలో శరీరంపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సంచలనం కలిగించాయి. షేక్ మహబూబ్ జాన్ (49) గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. రాయచోటి పూజారి బండ వీధిలోని సంగీత స్కూల్ సమీపంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ఏడాది జూలై 29న మహబూబ్ జాన్ కుమార్తెలు ఆప్రీన్, ఫాతిమాలు ఇదే ఇంటిలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన అన్ని వర్గాల మనస్సులను గాయపరిచింది. రెండు నెలల తరువాత అదే ఇంటిలో తల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడడం స్థానికుల హృదయాలను కలిచివేసింది. షేక్ మహబూబ్ జూన్ అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో భర్త హుస్సేన్ ప్రక్క గదిలో నిద్రపోతున్నట్లు సమాచారం. తమ పిల్లలు ఇద్దరి బాగోగులను తండ్రి హుస్సేన్ పట్టించుకోకపోవడంతోనే వారు చనిపోయారని, ఆ బాధతోనే తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు కొంతమంది స్థానికులు చెబుతున్నారు. అయితే భర్తే భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేసి ఉంటాడన్న అనుమానాలు, మహబూబ్ జాన్ బంధువులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణను చేపడితే అసలు విషయాలు బయటకు వస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
హోంగార్డు కుటుంబానికి సహచరుల ఆర్థికసాయం
రాయచోటి : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు బి.ఈశ్వర్నాయక్ కుటుంబీకులకు ఎస్పీ ధీరజ్ కనుబిల్లి గురువారం ఆర్థికసాయం ఆర్థికసాయం అందజేశారు. మృతుని కుటుంబానికి అండగా నిలిచేందుకు అన్నమయ్య జిల్లా హోంగార్డులు ముందుకు వచ్చి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఇలా వచ్చిన రూ.2,32 172ల చెక్కును ఎస్పీ కార్యాలయంలో మృతుడి కుటుంబసభ్యులకు ఎస్పీ అందజేశారు. సహచరులు కుటుంబానికి అండగా నిలవడం గొప్ప విషయమని ఎస్పీ అభినందించారు. పోలీసులు కేవలం చట్టాన్ని కాపాడేవారు మాత్రమే కారని, ఒకరికొకరు అండగా నిలిచే కుటుంబీకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం.పెద్దయ్య, ఆర్ఎస్ఐ శ్రీనివాసులు, ఏఆర్ఎస్ఐ బాలాజీ, జూనియర్ అసిస్టెంట్ జయకుమార్, బాధిత కుటుంబ సభ్యులు, హోంగార్డులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల దొంగల అరెస్టు
రాయచోటి : పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు. వారి నుంచి రూ.4.70 లక్షల విలువైన ఆస్తులు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. రాయచోటి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామానికి చెందిన రెపన బాలాజీ (19), మండెం సాయికుమార్ (28)లు బీటెక్ వరకు చదువుకున్నారని తెలిపారు. చిన్నమండెం మండల పరిధిలో జరిగిన దొంగతనాలపై ఆరాతీస్తున్న సమయంలో పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దొంగలించిన డబ్బులో కొంత ఆన్లైన్ బెట్టింగులకు ఖర్చుచేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారి నుంచి బంగారు నగలు, నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్, కడప చిన్న చౌక, కడప పాతబస్టాండ్ మరికొన్ని జిల్లాల పరిధిలో వారు దొంగతనాలకు పాల్పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్.కృష్ణమోహన్, రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ సుధాకర్, సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు.ఎస్పీ ధీరజ్ కనుబిల్లి -
పీలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలి
పీలేరు రూరల్ : పీలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మూన్లైట్ ఫంక్షన్ హాల్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత వందేళ్లుగా ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి చిత్తూరు, మదనపల్లె, రాయచోటికి పీలేరు వాసులు తిరగాల్సి వస్తోందన్నారు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరును కలుపుకొని మదనపల్లె జిల్లాగా చేస్తూ, రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం, కేవీపల్లె, పీలేరు, యర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు మండలాలలను కలిపి పీలేరు రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లె బాబురెడ్డి, ఎన్.సుధాకర్బాబు, పురం రామ్మూర్తి, సుంకర చక్రధర్, సుదర్శన్రెడ్డి, కలప రవి, అమృతతేజ, శ్రీకాంత్, టిఎల్.వెంకటేష్, రామాంజులు, ముల్లంగి చంద్రయ్య, గుర్రం నారాయణ, ధరణికుమార్, సుభాష్, రఘునాథ్, విజయ్, మల్లికార్జున, రాజేశ్వరి, శ్రీనివాసులు, విశ్వనాథ, ఓబులేషు, నాగేంద్ర, ఆంజినేయులు, కొండయ్య, రవి, గురునాథ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం మండలంలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ బాబూకాలనీకి చెందిన ఆసిఫ్ భార్య ప్రభావతి(25) భర్త ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన ప్రభావతి ఇంటి వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.వివాహిత అదృశ్యంనిమ్మనపల్లె : నెల రోజులుగా ఓ వివాహిత కనిపించడం లేదని కుటుంబసభ్యులు గురువారం స్థానిక మీడియాకు తెలిపారు. బోడిమల్లయ్యగారిపల్లెకు చెందిన హుస్సేన్ బీ, మహబూబ్ఖాన్ దంపతుల కుమార్తె నసీమా(21)ను తురకపల్లెకు చెందిన సుబహాన్ఖాన్కు ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి కుమార్తె సహారా(4), కుమారుడు సాహిల్ఖాన్(3) ఉన్నారు. ఆగస్టు 22న రాత్రి 9గంటల సమయంలో నసీమా బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. అయితే, అదృశ్యమై నెలరోజులు కావడంతో ఆమె ఆచూకీకై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు నిమ్మనపల్లె పోలీస్స్టేషన్ ఎస్ఐ ఫోన్ నెంబర్. 9440900706కు సమాచారం అందించాలన్నారు.రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణంకడప అర్బన్ : నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నబీకోటకు చెందిన చెన్నకేశవరెడ్డి కుమారుడు చంద్రశేఖర్రెడ్డి (25) దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఖాజీపేట మండలానికి చెందిన చెన్నకేశవరెడ్డి లారీడ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబ సభ్యులతో నబీకోటలో నివాసముంటున్నాడు. పెద్ద కుమారుడైన చెన్నకేశవరెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో నబీకోటకు చెందిన తన స్నేహితుడు యువకిషోర్తో కలిసి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై అలంకాన్పల్లె వైపు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. మార్గ మధ్యంలో వినాయక నగర్కు వెళ్లే దారిలో ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్రెడ్డికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే రిమ్స్ కు తరలించారు. చంద్రశేఖర్రెడ్డి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకిషోర్కు తీవ్ర గాయాలయ్యాయి. చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ జయరాములు తెలిపారు. -
నగలతో పరారీ
రాజంపేట : రాజంపేట పట్టణంలో షపీ అనే నగల తయారీ పలు బంగారు దుకాణాల నుంచి తయారీకోసం నగలు తీసుకుని వెళ్లి కనిపించడంలేదని దుకాణాల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడిగపాలెం గ్రామానికి షఫీ బండ్రాళ్ల వీధిలోని పలువురు బంగారు దుకాణాలకు నగలు తయారు చేసి ఇస్తున్నారు. దాదాపు రూ.50 లక్షలు విలువ గల నగలు తీసుకుని కనిపించడం లేదని వ్యాపారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్కు జరిమానాపెద్దతిప్పసముద్రం : మండలంలోని ఆవులరెడ్డిపల్లి సమీపంలోని ఏటీలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమంగా తోడి కర్నాటక రాష్ట్రానికి తరలిస్తున్నారని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఇటీవల రైతులు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దారు విద్యాసాగర్, భూగర్బ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేష్, ఆర్ఐ చినపరెడ్డి ఇసుక నిల్వలు ఉన్న ఏటిని సందర్శించి రైతులతో సమీక్షించారు. తనిఖీ సమయంలో ఇసుక తరలింపునకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్ పట్టుబడడంతో యజమానికి రూ.10వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. -
వరుస చోరీలతో వ ణ ుకుతున్న గుర్రంకొండ
గుర్రంకొండ పట్టణం వరుస చోరీలతో వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా పట్టణంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఓ వైపు గంజాయి ముఠా సభ్యులు మరోవైపు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తుల సంచారంతో పట్టణ ప్రజలు హడలెత్తిపోతున్నారు. గుర్రంకొండ : పట్టణంలో దుండుగులు యథేచ్చగా వరుస చోరీలకు పాల్పడుతున్నారు. పట్టణం వ్యాపా ర కేంద్రంగా ఆభివృద్ధి చెందుతోంది. దీంతో స్థానికంగా నివాసం ఏర్పాటుచేసుకొనే వారి సంఖ్య పెరిగిపోతోంది. నాలుగు మండలాల ప్రజలు ఇక్కడ ఇల్లు కట్టుకొని నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మిచుకొంటున్న ఇళ్లతోపాటు గ్రామానికి శివారు ప్రాంతాల్లో నివాసముండే ఇళ్లలో ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల నిర్మాణంలో ఉండే ఇళ్లలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నామి. పది రోజుల కిందట స్థానిక బలిజగడ్డవీధిలో ని నాలుగు ఇళ్లలో వరుసగా రెండురోజులపాటు దుండుగులు చోరీలకు పాల్పడ్డారు. స్థానిక వైన్ షాపుపై భాగాన్ని కత్తిరించి మద్యం సీసాలను చోరీ చేశారు. బస్టాండులోని పలు దుకాణాల్లో వరుస చోరీలు జరిగాయి. పలు దుకాణాల పైకప్పులను కత్తిరించి చోరీలకు పాల్పడ్డారు. పట్టణంతో పాటు ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టణ శివారు ఇళ్లే టార్గెట్ పలువురు దుండగులు పట్టణ శివారులోని ఇళ్లనే ఎక్కువగా టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటి నిర్మాణం వద్ద వస్తువులు ఉంచాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. పలువురు రాత్రిళ్లు కాపలా ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటితోపాటు శివారు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకున్న చోట ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు, ఇళ్ల పరిసరాల్లో ఉంచిన వస్తువులను రాత్రిళ్లు చోరీ చేస్తున్నారు. రాత్రిళ్లు పట్టణ శివారు ప్రాంతాల్లో సంచరించాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులతోపాటు గంజాయి మత్తుకు అలవాటు పడిన పలువురు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. గతంలో వీరు పలుమార్లు చోరీ చేసిన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. వాటికి సంబంధించి పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్స్టేషన్కు చేరని కేసులు ఎన్నో ఉన్నాయి. చోరీలు జరిగినా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు పలువురు భయపడి మిన్నుకుండిపోతున్నారు. దీంతో దుండుగులు పట్టణంలో యథేచ్చగా చోరిలకు పాల్పడుతుండడం గమనార్హం. మహిళలకు తప్పని వేధింపులు పట్టణంలోని మహిళలకు పలు రకాలుగా వేధింపులు తప్పడం లేదు, కొంతమంది సెల్ఫోన్లో మహిళల ఫొటోలు తీస్తూ వికృతానందం పొందుతున్నారు. మరో వైపు గంజాయి ముఠా సభ్యులు వీధుల్లో వేగంగా వాహనాలను నడపుతూ అడ్డు వచ్చిన మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. మహిళలు వీధుల్లో సంచరించాలంటే భయపడుతున్నారు. ఇటీవల ఓ కామాంధుడు కొత్తపేట వీధిలో సంచరిస్తూ వీధుల్లో నడిచి వెళుతున్న మహిళల ఫొటోలు రహస్యంగా తీయసాగాడు. వీధి వెంబడి వెళుతున్న ఓ మహిళ అనుమానం కలిగి సదరు వ్యక్తి సెల్ ఫోన్ను లాక్కొంది. పరిశీలించగా అందులో తన ఫొటోలు ఉండడం గమనించి గట్టిగా నిలదీసింది. సరైన సమాధానం చెప్పకపోవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని సదరు కామాంధుడికి దేహశుద్ధి చేశారు. కొంతమంది అతడి సెల్ఫోన్ను పూర్తి స్థాయిలో పరిశీలించగా పలు ప్రాంతాల మహిళల ఫోటోలు అందులో ఉండడంతో నివ్వెరపోయారు. కొందరు మహిళల ఫొటోలు వివిధ భంగిమల్లో తీసి ఉండడం గమనించారు. అతడి సెల్ ఫోన్లో సుమారు 500 మహిళల ఫోటోలు ఉండడం గమనార్హం. ఇందులో బస్టాండులో వివిధ దుకాణాల్లో పనిచేసే మహిళల ఫొటోలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వీటిని తీయ డం వెనుక మర్మమేమిటో అంతుచిక్కడం లేదు. దీనివెనుక ఎవరైనా ముఠా సభ్యులున్నారా అన్న కోణంలో పట్టణవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, మహిళలు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీస్స్టేషన్కు వెళ్లి అప్పగించారు. ధైర్యంగా ఫిర్యాదు చేయలేదనే నెపంతో సదరు కామాంధుడిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. చర్యలు తీసుకొంటాం పట్టణంలో జరుగుతున్న చోరీలపె గట్టి నిఘా చేపట్టి చర్యలు తీసుకొంటాం. చోరీలకు గురైన ఇళ్లకు సంబంధించి యజమానులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఇళ్ల పరిసరాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలి. – గజేంద్ర, స్టేషన్ ఇన్ఛార్జి, గుర్రంకొండచెలరేగిపోతూ చోరీలకు పాల్పడుతున్న దుండగులు -
కమనీయం.. లక్ష్మీనరసింహుని కల్యాణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవం గురువారం కన్నుల పండువగా జరిగింది. స్వాతి నక్షత్రం రోజు కావడంతో ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదిక అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకం, అర్చనలు, పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో స్వామిని అలంకరించి వేద మంత్రోచ్ఛారణ మధ్య శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. పాల్గొన్న దంపతులకు టీటీడీ పట్టు వస్త్రాలు, కంకణాలు, స్వామి ప్రసాదాలు అందజేశారు. ముగిసిన పవిత్ర ఉత్సవాలు : గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్ర ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా హోమాలు నిర్వహించి మహా పూర్ణాహుతి గావించారు. ఉత్సవాలు ముగిసినందున వరుణదేవుడ్ని ఆహ్వానిస్తూ పవిత్ర జలాలతో స్వామివారికి చక్ర స్నానం చేయించారు. అంనతరం వాహనంలో కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని స్వామికి పూజలు నిర్వహించారు. అర్చకులు గోపాలబట్టర్, కృష్ణ, రాజు, గోకుల్స్వాములు పాల్గొన్నారు. -
స్వచ్ఛత జీవితంలో భాగం కావాలి
రాయచోటి : ‘అందరి జీవితంలో స్వచ్ఛత ఒక భాగం కావాలి.. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ఇది నిత్య ప్రక్రియ.. నిరంతరం సాగాలి’ అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్చతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం రాయచోటిలోని వీరభద్ర స్వామి ఆలయం నుంచి మార్కెట్ యార్డు వరకు రోడ్లు, కాలువలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ఇందులో పారిశుధ్య కార్మికులతో పాటు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఏక్ దిన్ ఏక్ గంట, ఏక్ సాథ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. ఇందులో మున్సిపల్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కలిసి ఒక గంట శ్రమదానం చేసి శుభ్రత కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి, ఎల్డీఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫిరెన్స్ హాల్లో నీటిపారుదల శాఖ ఎస్ఈ, ఈఈలు, డీఈఈ, ఏఈఈ, ఏఈలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలు, శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్, అన్నమయ్య ప్రాజెక్టు, వెలిగల్లు ప్రాజెక్టు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పింఛా, జరికోన, బహుదా, పెద్దేరు ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ, భూసేకరణకు సంబంధించిన గ్రామం, మండల, విస్తరణ వివరాలను తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
గుట్టల్లో గుట్టుగా విద్యార్థుల ‘షూ’లు
పెద్దతిప్పసముద్రం : జిల్లాలోని పెద్దతిప్పసముద్రం నుంచి బి.కొత్తకోటకు వెళ్లే మెయిన్ రోడ్డు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న బోడిగుట్ట వెనుక భాగాన గుట్టల నడుమ ఉన్న బీడు పొలాల్లో విద్యార్థుల పాదరక్షలు (షూలు) దర్శనమిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధ్యార్థుల కాళ్లకు ఉండాల్సిన షూలు పొలాల్లో ఉండటం గురువారం చూసి పశువుల కాపరులు అవాక్కయ్యారు. కొత్తగా ఉండటంతో అటుగా వెళ్లిన కొందరు వాటిలో కొన్ని జతలు తీసుకెళ్లినట్లు సమాచారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 జతలకు పైగా షూలను ప్లాస్టిక్ సంచుల్లో నింపి నాలుగు చక్రాల వాహనం ద్వారా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో ఎందుకు పడేశారో అర్థం కావడం లేదు. ఈ షూలు ఏ మండలానికి సంబధించినవో తెలియాల్సి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరై మిగిలిపోయిన షూలు అని కక్షపూరితంగా పడేశారా లేక విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో పడేశారా అనేది ప్రశ్నార్థకం. ఏది ఏమైనా వీటి కోసం వెచ్చించిన రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లేనని పలువురు విమర్శిస్తున్నారు. -
పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి చింతల
సాక్షి రాయచోటి/పీలేరు : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలోపేతం చేస్తూనే మరోవైపు కార్యకర్తలు, శ్రేణులు, నేతలను మాజీ సీఎం,వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఇదే తరుణంలో వ్యవహరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూనే ప్రజా పోరాటాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీలో కీలకంగా వ్యవహారిస్తూ సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందిన వారికి వైఎస్సార్ సీపీ పదవులను కట్టబెడుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, పీలేరుమాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్గా అవకాశం కల్పించారు. అన్నమయ్య జిల్లా పీలేరుకుచెందిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చింతల రామచంద్రారెడ్డి తండ్రి చింతల సురేంద్రారెడ్డి కూడా మంత్రిగా, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. రాజకీయ ప్రాబల్యం కలిగిన చింతల కుంటుంబం ఎప్పుడూ ప్రజా సేవలోనే ఉంటోంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి గుర్తింపు పొందిన చింతల రామచంద్రారెడ్డికి పార్టీలో కీలక పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డికి కృతజ్ఞతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో కీలకమైన స్థానం రావడానికి కృషి చేసిన చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిలకు చింతల రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనపై నమ్మకముంచి అడ్వయిజరీ కమిటీలో కీలక పదవి ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చింతల తెలియజేశారు. ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా పీలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోఉంటానని, ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటాలే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి తెలియజేశారు. వైఎస్ జగన్ను కలిసిన చింతల కలికిరి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ గురువారం విజయవాడలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ కుమారుడు డాక్టర్ జుల్ఫికర్ అహ్మద్ ఖాన్(వకార్) వివాహ కార్యక్రమానికి మాజీ సీఎంను ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చింతల ఆనందరెడ్డి, డాక్టర్ మొహివుద్దీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టర్ సమీక్ష
మదనపల్లె : మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల అధికార యంత్రాంగంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో వివిధ అంశాలతోపాటు, తాగునీటి సమస్య, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షిస్తారని తెలిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి అధికారులు హజరుకానున్నారు. దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి టౌన్ : మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ స్థాయి పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి హిదాయతుల్లా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమి డైరెక్టర్, సెక్రటరీ షేక్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో నవంబర్ 11న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఉర్దూ భాషాభివృద్ధి, సాహిత్యానికి సంబంధించి విభిన్న విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేస్తారన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను విజయవాడలోని రాష్ట్ర ఉర్దూ అకాడమి డోర్ నంబర్76–1–06ఏ/1, 2 మాళవిక విల్లా, హెచ్బీ కాలనీ, భవానీపురం –520012 చిరునామాకు పంపాలని సూచించారు. 4న వాహనాల వేలం రాయచోటి టౌన్ : రవాణాశాఖ అధికారులు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలను అక్టోబర్ 4వ తేదీ వేలం వేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని రాజంపేట ఆర్టీసీ డిపోలో అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు వేలం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ధరావత్తు రూ.5 వేలు చెల్లించి (చలానా పొందాలి) వేలంలో పాల్గొనవచ్చన్నారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి టోకెన్ పొందాలని సూచించారు. వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల వివరాలు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం పీలేరు : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండగలమని డీపీవో రాధమ్మ అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏక్ దిన్ – ఏక్ గంట – ఏక్సాత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక కడప రోడ్డులో గార్బేజ్ క్లీనింగ్ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇళ్లలో సేకరించిన చెత్తను బయోడిగ్రేడబుల్ వ్యర్థాలతో ఎరువులుగా తయారు చేయాలని సూచించారు. ఇన్చార్జి ఎంపీడీవో రాజేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో సిగ్బతుల్లా, గ్రామ పంచాయతీ శానీటరీ ఇన్స్పెక్టర్ నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించాలి మదనపల్లె రూరల్ : 12వ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా కార్యదర్శి గురుప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ సాయిశంకర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగుల సమస్యలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గోపతి బాలకృష్ణమూర్తి, అధ్యాపకులు రమణ, రెడ్డెప్పరెడ్డి, శివపార్వతీదేవి, శ్రీదేవి, సతీష్రెడ్డి, నాయుడు పాల్గొన్నారు. కడప సిటీ : మహాత్మాగాందీ ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకానికి 100 శాతం సబ్సిడీతో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెలాఖరు వరకు గడువు ఉందని, ఆసక్తి, అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ బి.ఆదిశేషారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1250 మంది రైతులు 2742 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 920 మంది రైతులకుగాను 2058 ఎకరాల్లో ప్లాంటేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. 103 మంది రైతులకుగాను 134 ఎకరాలకు సంబంధించి గుంతలు తీసి మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ఈనెలాఖరు వరకు గడువు ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు ప్లాంటేషన్ మేనేజర్ ప్రతాప్ 90008 90293 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మండలా ల్లో సంబంధిత ఏపీఓలను కలవొచ్చని తెలిపారు. -
డిపోల అభివృద్ధిపై దృష్టి పెట్టాం !
● బస్టాండ్లలో మౌలిక వసతులను మెరుగుపరుస్తాం ● పీటీడీ వైస్ చైర్మన్, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మైదుకూరు : రాష్ట్రంలోని పీటీడీ( ఆర్టీసీ) డిపోలన్నింటినీ అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టామని సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మైదుకూరు డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో డిపోలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గుడివాడ డిపోలో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుత్తి డిపో అభివృద్ధిని కూడా చేపట్టామని తెలిపారు. పీటీడీ స్వయంగా చేయడం లేదా పీపీపీ ద్వారా చేసే ఆలోచనలో ఉన్నట్టు వివరించారు. ఆగస్టు 15న ప్రారంభించిన సీ్త్ర శక్తి పథకం రాష్ట్రంలో సజావుగా, విజయవంతంగా సాగుతోందని తెలిపారు. బస్సుల్లో కొన్ని స్వల్ప సంఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పీటీడీ బస్టాండ్లలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎండీ వెల్లడించారు. వర్షం వస్తే మోకాళ్ల లోతు నీటితో ఉండే బస్టాండ్లు ఉన్నాయని, అలాంటి వాటిని బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మూడు నెలల్లో పీటీడీకి 1,050 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నట్టు ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డిపో మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఇష్టంతో పనిచేయాలి ప్రతి ఒక్కరూ ఇష్టంతో పనిచేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు సూచించారు. గురువారం సాయంత్రం జిల్లా పర్యటనకు వచ్చిన ఎండీ కడప ఆర్టీసీ గ్యారేజీని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్రెడ్డి (ఇంజనీరింగ్)తో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనల చేశారు. కడప బస్టాండును ఆధునికీకరించేందుకు రూ.1.30 లక్షలు మంజూరయ్యాయని,త్వరలో పనులు ప్రారంభించి 4నెలల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం పొలిమేర గోపాల్రెడ్డి, డిప్యూటీ సీటీఎం డిల్లీశ్వరరావు, ఆర్టీసీ వీఅండ్ఎస్ఓ ధర్మతేజ, ఈఈ శ్రీనివాసులు, డీఈ పోతురాజు, యూనియన్ నాయకులు పురుషోత్తం, ఏఆర్ మూర్తి పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్లో కలపాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో 8వ వేల మంది ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని, వారిని ఆప్కాస్లో కలపాలని ఆయా ఉద్యోగులు ఎండీ ద్వారక తిరుమలరావును విన్నవించారు. -
కువైట్లో ములకలచెరువు మహిళ అవస్థలు
ములకలచెరువు : మండలంలోని నాయనచెరువుపల్లి పంచాయతీ పోకనాటువారిపల్లెకు చెందిన రమణప్ప భార్య నాగమణి మూడు నెలల క్రితం కువైట్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లింది. ఆమె భర్త రమణప్పకు అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో వెళ్లింది. అక్కడికి వెళ్లగానే అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. దీంతో అక్కడే ఆసుపత్రిలో చేరింది. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని అక్కడి కువైట్ యజమానులు పట్టించుకోవడం లేదు. ఇండియా నుంచి కువైట్కు పంపిన బ్రోకర్ను సంప్రదిస్తే రూ.2 లక్షలు ఖర్చు చేస్తే కువైట్ నుంచి ఇంటికి పిలిపిస్తామని చెబుతున్నాడంటూ రమణప్ప కంటతడి పెడుతున్నాడు. ఆరోగ్య సమస్య ఎక్కువైందని తనను ఇండియాకు పిలిపించాలని నాగవేణి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. -
అవయవదానంతో ఏడుగురి జీవితాలకు వెలుగు
రాయచోటి : ఓ ప్రైవేట్ ఉద్యోగి అవయవదానం ఏడుగురి జీవితాలలో వెలుగులు నింపింది. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీటివాండ్లపల్లికు చెందిన వంశీధర్రెడ్డి (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన రాయచోటి నుంచి గాలివీడుకు వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు తేల్చారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి వైద్య బృందం వంశీధర్రెడ్డి తల్లి కళ్యాణికి అవయవదానంపై బుధవారం అవగాహన కల్పించారు. వైద్యుల సూచనలను ఆమె అంగీకరించారు. దీంతో వంశీధర్రెడ్డి నుంచి గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. అంతేకాకుండా కంటి కార్నియాలను కూడా సేకరించినట్లు వైద్యులు అంజనారైన పవన్కుమార్రెడ్డి తెలిపారు. దీంతో ఆ యువకుడు మృతి చెందినా ఏడుగురిలో జీవం పోసుకోవడం విశేషం. అవయవదానం అనంతరం మృతదేహాన్ని గాలివీడు మండలంలోని ఆయన స్వగృహానికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
గాలివీడు : గాలివీడు మండల పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. గాలివీడు నుంచి రాయచోటికి స్కూటీలో వెళుతున్న తిమ్మమ్మ మర్రిమానుకు చెందిన రమణయ్య, నరసింహులు వడిశిలంక పల్లెకు సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇరువురు గాయపడగా, రమణయ్య తలకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నంములకలచెరువు : కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన చిన్నప్ప(32) పెద్దపాళ్యం పంచాయతీ వీరాంజనేయపురానికి చెందిన లావణ్యను వివాహం చేసుకున్నాడు. తర్వాత కొద్ది నెలలకు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీనిపై మంగళవారం రాత్రి మొదటి భార్య లావణ్య ఇంటికి వచ్చిన చిన్నప్ప ఆమెతో గొడవ పడ్డా డు. అనంతరం మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి వారు 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు ఽనమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై దాడిమదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యపై భర్త దాడి చేసిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. కురవంకకు చెందిన రామాంజులు భార్య భారతి (25) ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రోగులకు డైట్ సరఫరా చేసే విభాగంలో పనిచేస్తుంది. బుధవారం సాయంత్రం ఆమె ఆస్పత్రుల్లో విధుల్లో ఉండగా, భర్త రామాంజులు అక్కడకు వచ్చి కుటుంబ సమస్యల కారణంగా ఆమెతో గొడవపడి, అక్కడే ఉన్న సాంబార్ బకెట్ ఆమె ముఖంపై పోసి దాడి చేశాడు. దాడిలో ఆమె గాయపడగా స్థానికులు అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందించారు. -
సర్కారు భూమి.. అయితేనేం!
● ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డులు ఉన్నా లెక్కచేయని కూటమి నేతలు ● యథేచ్ఛగా ఆక్రమణలుసాక్షి టాస్క్ఫోర్స్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూచిక బోర్డులు యథేచ్ఛగా తొలగించి దర్జాగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. పుల్లంపేట మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. పేదవారికి సెంటు భూమి ఇవ్వాలంటే సవాలక్ష ఆంక్షలు. దోచుకున్నవారికి దోచుకున్నంత చందంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వానికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు అధికమవుతున్నాయి. రాత్రివేళల్లో ప్రభుత్వ భూమిని చదును చేయడం, పగటిపూట నిర్మానుష్యంగా ఉండటం పరిపాటిగా మారింది. పుల్లంపేట మండలం, వత్తలూరు పంచాయతీ సర్వే నంబరు 1, 2, 3లలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. అలాగే అనంతయ్యగారిపల్లిలో ఏపీ మోడల్ స్కూల్ వెనుకవైపున డంపింగ్ యార్డు వద్ద (చెత్తనుండి సంపద కేంద్రం) రాత్రులలో భూమిని చదును చేయడం, పగలు పనులు ఆపివేయడం జరుగుతోంది. రోజురోజుకు ఆక్రమణదారులకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అలాగే పెరియవరం రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు. 143, 144,145లలో తోపు పొరంబోకు భూమి ఉంది. ఈ భూమిని గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు చట్ట విరుద్ధంగా ఆన్లైన్లో నమోదు చేశారు. పక్కనే ఉన్న స్మశానం సైతం ఆక్రమణకు గురైంది. పలుమార్లు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా కూటమి అండతో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. గతంలో వీఆర్ఓగా పనిచేసిన మల్లికార్జున కాసులకు కక్కుర్తిపడి జిల్లా అధికారులకు తప్పుడు నివేదికలు అందించారు. అలాగే రంగంపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు. 417లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి నాయకులు ఆక్రమించుకొని చెట్లను పెంచుతున్నారు. ఇప్పటికై నా జిల్లాస్థాయి అధికారులు పుల్లంపేటలోని భూ ఆక్రమణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం
రైల్వేకోడూరు అర్బన్ : కార్యకర్తలకే పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయనున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డితో కలిసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలోని పలు అంశాలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసేలా ఇన్చార్జులు, నాయకులు బాధ్యత తీసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. అన్ని కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించినట్లు తెలిపారు. -
భర్త ఇంటి ముందు ధర్నా
నందలూరు : మండలంలోని పాటూరు గ్రామంలో భర్త ఇంటి ముందు అతని భార్య ధర్నా చేసిన సంఘటన బుధవారం జరిగింది. ఆమె కథనం మేరకు ఓబులవారిపల్లి మండలం ఎల్లాయపల్లి గ్రామానికి చెందిన జయలక్ష్మీకి మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన కుంచం సురేష్తో దాదాపు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు సంతానం. సురేష్ జీవనోపాధి నిమిత్తం గల్ఫ్లోని కతర్ దేశాలకు వెళ్లి వస్తూ ఉంటాడు. సురేష్ ఇతర దేశాల్లో ఉండటం వల్ల జయలక్ష్మీ తన పుట్టింట్లో ఉంటోంది. తన మామ ఆస్తి కావాలని సురేష్ గొడవ పెట్టుకుని సుమారు 6 నెలల నుంచి జయలక్ష్మీకి డబ్బులు పంపడం కానీ మాట్లాడటం కానీ చేయడం లేదు. నెల రోజుల క్రితం సురేష్ ఇంటికి వచ్చిన విషయం తెలిసి జయలక్ష్మీ భర్తకు ఫోన్ చేయగా ఆస్తిలో సగం భాగం తనకు ఇస్తేనే సంసారానికి తీసుకొని వస్తానని చెప్పి సురేష్ ఫోన్ పెట్టేశాడు. దీంతో జయలక్ష్మీ పాటూరు గ్రామానికి వచ్చి సురేష్ సోదరుడి ఇంటిముందు ధర్నాకు దిగింది ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరు. భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి కారణం సురేష్ అన్న కుంచం గోపాలకృష్ణయ్య అని జయలక్ష్మీ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. -
తొమ్మిది మంది తమిళ స్మగ్లర్ల్ల అరెస్టు
● రూ. 34.40 లక్షలు విలువైన 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం ● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడిరాయచోటి/సుండుపల్లె : ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసి రూ. 34.40 లక్షలు విలువైన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. బుధవారం అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేతపై ఎస్పీ వివరించారు. టి.సుండుపల్లి మండలం, మాచిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారం మేరకు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఆర్ఏస్టీఎఫ్ సీఐ మధు, కలికిరి సీఐ అనిల్ల ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలు కాపు కాచాయన్నారు. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఎర్రచందనం దుంగలను కారులో లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడానికి ముందుకు వెళ్లగా కొంతమంది కారులో ఎక్కి పోలీసులను ఢీ కొట్టే ప్రయత్నం చేసి తప్పించుకున్నారన్నారు. వారిలో తొమ్మిది మందిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే తరలించడానికి సిద్ధంగా ఉంచిన 344 కిలోల బరువుగల 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన బాకియరాజ్ అన్నామలై, రజిత్ కుమార్ గోవిందన్, జి.సామినాథన్, సురేష్ కుమార్, తిరుమలై చిన్నయాల్, వేలూరు జిల్లాకు చెందిన దురైసామి, రాజా మణి, పరశాంత్ చంద్రన్, రాజా విజయ కుమార్లు పట్టుబడిన వారిలో ఉన్నట్లు తెలిపారు. పారిపోయిన స్మగ్లర్లను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఎర్రచందనం వంటి విలువైన వనరులను అక్రమంగా రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అత్యంత విలువైన సహజ సంపదను దోపిడీ చేయడంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజల భద్రత, ప్రకృతి వనరుల రక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. తమిళ స్మగ్లర్లను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కారుతో సహా ఎర్రచందనం స్వాధీనం పీలేరు : కారుతో సహా 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన ఓ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎఫ్ఓ గురుప్రభాకర్ తెలిపారు. బుధవారం తెల్లవారుజామున యల్లమంద, పులిచెర్ల, మంగళంపేట మార్గాల్లో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వేగంగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేశారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఇళయరాజాను అదుపులోకి తీసుకున్నారు. 10 ఎర్రచందనం దుంగలు, వాహనం విలువ రూ. 24.,82 లక్షలు చేస్తుందని వివరించారు. ఈ దాడిలో ఫారెస్ట్ అధికారులు చంద్రశేఖర్, ప్రకాష్కుమార్, ప్రతాప్, రెడ్డిప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రైవేట్రంగంలో రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త ఉద్యమం
మదనపల్లె రూరల్ : ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు భారతీయ అంబేద్కర్ సేన(బాస్) నేషనల్ కోఆర్డినేటర్ దుర్గం సుబ్బారావు స్పష్టంచేశారు. సెప్టెంబర్ 24 పూనా ఒప్పంద దుర్దినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే), బాస్ ఆధ్వర్యంలో రాజ్యాంగం–రాజకీయ హక్కులు–ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గం సుబ్బారావు మాట్లాడుతూ.. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలతో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యారన్నారు. విద్య,వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడంతో 85శాతం అవకాశాలు ప్రైవేట్రంగంలోకి వెళ్లిపోయాయన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న 15శాతం ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ వర్గాలకు దక్కడం లేదన్నారు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ,ఎస్టీలకు 25శాతం నిధులు కేటాయించేందుకు చేసిన సబ్ప్లాన్ చట్టాలు అమలుకావడం లేదన్నారు. ప్రైవేట్రంగంలో రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమం నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో బాస్, వీసీకే నాయకులు కే.వి.రమణ, పల్లంతాతయ్య, ముత్యాలమోహన్, పాలకుంట శ్రీనివాసులు, కడప రమణ, నంద్యాల శ్రీపతి, నీరుగట్టిరమణ, పీర్బాషా, వి.దొరస్వామి, అనంతపురం ఓబులేషు, కర్నాటక డీఎస్ఎస్ మునెప్ప, శ్రీనివాసులు, మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.బాస్ నేషనల్ కోఆర్డినేటర్ దుర్గం సుబ్బారావు -
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పంపితే కఠిన చర్యలు
రాయచోటి : సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి హెచ్చరించారు. సోషల్ మీడియా మంచి విషయాలను పంచుకోవడానికి, దూరంగా ఉన్న మిత్రులు, బంధువులను దగ్గర చేయడానికి ఒక అద్భుత వేదిక అన్నారు. కానీ అదే వేదికను కొంతమంది అవాస్తవాలు, పుకార్లు, విద్వేషపూరిత పోస్టుల కోసం వాడుతుండటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందన్నారు. జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ లేదా పుకార్లు వస్తే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టరాదన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించారు. మహిళలు, చిన్నారులపై అసభ్యకర పోస్టులు, ఫోటో మార్ఫింగ్ చేసినా సహించమన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో సైబర్ క్రైమ్ సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ అండ్ సోషల్ మీడియా సీఐ ఎస్.మహమ్మద్ అలీ, టెక్నికల్ అనాలసిస్ వింగ్ ఆర్ఐ టి.జాన్ జోసఫ్, సోషల్ మీడియా అండ్ సైబర్ సెల్, టెక్నికల్ అనాలసిస్ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆయుధాల గది సందర్శన.. ఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని ముఖ్యమైన విభాగాలను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఆయుధాల గది, స్టోర్ రూమ్, అడిషనల్ ఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, ఆర్ఐ అడ్మిన్, ఆర్ఐ వెల్ఫేర్, ఎంటీఓ, స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ, సైబర్ సెల్, ఐటీ కోర్ టీమ్, స్పెషల్ పార్టీ, మహిళా పోలీసు స్టేషన్, త్రిబుల్ సి, కమ్యూనికేషన్, అడ్మినిస్ట్రేషన్, హోంగార్డ్స్ కార్యాలయాలను సందర్శించారు. ఆయన వెంట ఏఏఓ జె.త్రినాథ సత్యం, ఎస్బీ సీఐ పి.రాజా రమేష్, డీసీఆర్బీ సీఐ ఎం.తులసీ రామ్, క్రైమ్ సీఐ ఎం.చంద్రశేఖర్, టాస్క్ఫోర్స్ సీఐ టి.మధు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల కబ్జాను అరికట్టండి
ఓబులవారిపల్లె : బాలిరెడ్డిపల్లి, వై.కోట, పెద్దఓరంపాడు ప్రాంతాలలో నిరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ బంజరు, చెరువు ఆయకట్టు భూములను వందల ఎకరాలను కబ్జా చేస్తున్నారని, వాటిని అడ్డుకొని నిరుపేద దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ వర్గాలకు పంపిణీ చేయాలని బీకేఎంయూ నాయకులు బుధవారం డిప్యూటీ తహసీల్దార్ సిద్దేశ్వర రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిరెడ్డిపల్లి, వై.కోట సర్వే నెంబరు. 1155, 1194లలో దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిలో నిరుపేద దళిత, ముస్లిం మైనార్టీలు గతంలో చెట్లను, రాళ్లను తొలగించి లక్షల రూపాయలు అప్పు చేసి అనుభవంలో ఉంచుకున్నారన్నారు. గతంలో ఉన్నతాధికారులు ఆ భూమిని పరిశీలించి అర్హులైన పేదలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు ఇస్తామని చెప్పారన్నారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వాటిని అడ్డుకొని పేదలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దశలవారీగా సామూహిక దీక్షలు చేపడతామన్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీకేఎంయూ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మల్లిక, వెంకటరమణ, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి, రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి ఎం.జయరామయ్య, మండల నాయకులు, కటారి గోపాలు, రాఘవులు, బాలాజీ నగర్, శివాజీ నగర్ గిరిజన పేద ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
మృత్యువులా దూసుకొచ్చిన లారీ
● ఒకరి మృతి, మరొకరికి గాయాలు ● గువ్వలచెరువు ఘాట్లో దుర్ఘటనచింతకొమ్మదిన్నె /లక్కిరెడ్డిపల్లె: చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ జాతీయ రహదారిపై రాయచోటి వైపు నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవహనాన్ని ఢీకొనడంతో కొప్పల లక్షుమయ్య (60) మృతి చెందాడు. కొప్పల. ఈశ్వరయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం రాయచోటి వైపు నుంచి ఎలక్ట్రికల్ పరికరాలతో కూడిన గూడ్స్ లారీ వేగంగా రావడంతో నాలుగో మలుపు సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద లారీని డ్రైవర్ అదుపుచేయలేక లారీ డ్రైవర్ కిందికి దూకేశాడు. ఆ సమయంలో రోడ్డుకు అవతలవైపున ఎదురుగా గువ్వలచెరువు వెపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఈశ్వరయ్య గమనించి ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న కొప్పల లక్షుమయ్యను లోయవైపు ఈడ్చుకుపోగా కుడి కాలు, కుడి చేయి తెగి పడి, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ద్విచక్రవాహనంలోని మరో వ్యక్తి కొప్పల ఈశ్వరయ్యకు గాయలయ్యాయి. లారీ డ్రైవర్ లారీ లోయ వైపు దూసుకెళ్లే క్రమంలో లారీ నుండి ముందే దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో మృతిచెందిన లక్షమయ్య, గాయపడిన ఈశ్వరయ్య సమీప బంధువులే. వీరిది లక్కిరెడ్డిపల్లె మండలంలోని దప్పేపల్లె రామాపురం గ్రామం. -
‘దేశం’లో.. విద్వేష మంటలు !
సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీలో ముదిరిన వర్గ విభేదాల కారణంగా కడప గడపలో ఉద్రిక్తత పెరిగింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ప్రశాంత కడపలో ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా పచ్చ పార్టీలో వర్గ పోరు వీటికి మరింత ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి వైఖరిపై పాతకడప సింగిల్విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి నేతృత్వంలో ఓ వర్గం నిరశన చేపట్టిన విష యం తెలిసిందే. ఆపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి వద్దకు వెళ్లి కార్యకర్తలకు రక్షణగా నిలవాలంటూ అభ్యర్థించారు. ఇదంతా జరిగి మూడు రోజులైన గడవకముందే కృష్ణారెడ్డి లీజుకు తీసుకున్న ఓ గ్రావెల్ క్వారీలో ఉన్న జేసీబీని బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే మాధవి వర్గీయులు ధ్వంసం చేయడం వర్గపోరులో మరింత మంట రాజేసింది.కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విశేషంగా పనిచేసిన నేతలంతా క్రమేపీ అసంతృప్తివాదులుగా మారారు. అందులో కొందరు మౌనం దాల్చితే.. మరికొందరు బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈక్రమంలో అధిష్టానానికి ఫిర్యాదు చేశారనే నేపంతో నగర కమిటీ మాజీ అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డిపై హత్యాయత్నం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే తనపై హత్యాయత్నం చోటు చేసుకున్నట్లు ఆ తర్వాత శివకొండారెడ్డి బహిర్గతం చేశారు. తాజాగా గత సోమవారం పాతకడప కృష్ణారెడ్డి దేవునికడపలో నిరశన చేపట్టి ఆ తర్వాత మాచిరెడ్డిపల్లెలో ఉన్న పుత్తా నరసింహారెడ్డిని కలిశారు. కడపలో టీడీ పీ కార్యకర్తలకు రక్షణగా నిలవాలంటూ కోరారు. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి కృష్ణారెడ్డి లీజుకు తీసుకున్న ఓ గ్రావెల్ క్వారీలో ఉన్న జేసీబీని ధ్వంసం చేయడం గమనార్హం.కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వర్గీయులు అక్రమ క్వారీ నిర్వహిస్తూ గ్రావెల్ ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. అధికారికంగా ఐదు క్వారీలు ఉండగా వాటికీ రాయల్టీ ఇవ్వకుండా మైనింగ్ అధికారులు శల్యసారధ్యం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన నేతలు పరపతి ఆధారంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. -
లోక్కళ్యాణ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
రాజంపేట : కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకా రం రూపొందించిన లోక్కళ్యాణ్మేళాను వీధి విక్రయదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎం స్వనిధి 2.0లో భాగంగా వీధి విక్రయదారులకు రుణ సదుపాయాలు, క్రెడిట్హామీ, వడ్డీ సబ్సిడీ లభి స్తాయన్నారు. మొదటి విడతలో రూ.15,000, రెండో విడతలో 25,000 మంజూరు అవుతాయన్నారు. యుపీఐ లింక్ రుపే క్రెడిట్ కార్డులు గరిష్టంగా రూ.30వేల వరకు అందజేస్తామన్నారు. కార్య క్రమంలో కార్మికశాఖ అధికారులు, కౌన్సిలర్లు, ఐసీడీఎస్ బ్యాంక్ ప్రతినిధులు, మెప్మా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. భూమి కేటాయింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి : ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్)కు లీజు ప్రాతిపదికన భూములు కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం విజయవాడలోని సీసీఎల్ఏ జయలక్ష్మీ ఆధ్వర్యంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో భూ కేటాయింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయచోటిలోని కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గాలివీడు సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన తూము కుంట, వెలిగల్లుకు సంబంధించిన లీజ్ ప్రక్రియ పనులను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం లోగా నివేదికలను అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్స్రాజేంద్రన్, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి జిల్లా నుంచి డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమరావతికి బయలుదేరి వెళ్లారు. ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా 869 అభ్యర్థులు కాగా వారి కుటుంబ సభ్యులతో కలిసి 1666 మంది బయలు దేరి వెళ్లారు. వారి కోసం 43 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. 122 సిబ్బందితోపాటు 15 మంది పోలీసుల భద్రతతో కలెక్టరేట్ ప్రాంగణం నుంచి బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. డీఎస్సీ అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందజేయనున్నారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లా డీఈఓలు షేక్ షంషుద్దీన్, సుబ్రమణ్యం, సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజు పాల్గొన్నారు. -
యూరియా.. ఇవ్వండయ్యా !
బి.కొత్తకోట : అయ్యా.. యూరియా ఇవ్వండయ్యా అంటూ బి.కొత్తకోటలో రైతులు బుధవారం తెల్లవారుజాము నుంచే రోడ్లపై క్యూ కట్టారు. ఇచ్చేది బస్తా.. దాని కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలుచోవాలి. ఎప్పుడు స్టాక్ లేదని అంటారో అని మరోవైపు దిగులు. యూరియా కొరతలేదు అంటున్న కూటమి ప్రభుత్వానికి ఈ క్యూలైన్లు సమస్యను కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. బి.కొత్తకోట గ్రోమోర్ కేంద్రానికి యూరియా వచ్చిందన్న సమాచారంతో ఉదయం ఆరు గంటలకే రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో కేంద్రం వద్దకు చేరుకున్నారు. గుంపుగా రావడంతో పోలీసులు క్యూలైన్ పెట్టారు. ఈ కేంద్రం నుంచి కేవలం 214 బస్తాలే పంపిణి చేసి అయిపోయిందని చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. మండలంలోని గోళ్లపల్లెలో 214 బస్తాల యూరియాను అందించినట్టు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. -
ఘనంగా సంప్రోక్షణ కార్యక్రమం
ప్రత్యేక అలంకరణలో ఉత్సవ మూర్తులు బలి పీఠానికి సంప్రోక్షణ చేస్తున్న పండితులు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ పనులు చేపట్టిన అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాన్ని బుధవారం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు. వేదపండితుడు రాజేష్ బట్టార్ ధ్వజస్తంభానికి, బలి పీఠానికి సంప్రోక్షణ, నివేదన, మంత్రపుష్పము నిర్వహించారు. టీటీడీ ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమరనాథ్రెడ్డి, ఆర్చకులు శ్రావణ్ కుమార్, వీణారాఘవచార్యులు, పవన్ కుమార్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు. -
ధ్వజస్తంభం సంప్రోక్షణకు అంకురార్పణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అర్చకులు ధ్వజస్తంభం సంప్రోక్షణకు మంగళవారం అంకురార్పణ నిర్వహించారు. ఒంటిమిట్ట రామాలయంలో దెబ్బతిన్న ధ్వజ స్తంభం పీఠం, బలిపీఠాలకు రూ.15.50 లక్షలతో నూతన ఇత్తడి కవచాలను అమర్చే పనులు పూర్తయ్యాయి. దీంతో సంప్రోక్షణకు సాయంత్రం పవిత్ర పుట్టమన్ను తీసుకువచ్చి అంకురార్పణ చేశారు. ఆలయ రంగమండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి, నూతన పట్టు వస్త్రాలు తొడిగి, బంగారు ఆభరణాలతో అలంకరిచారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తు హోమం, ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించారు. నేడు ధ్వజస్తంభానికి సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు హనుమంతయ్య, నవీన్ కుమార్, అమర్నాథ్రెడ్డి, అర్చకులు శ్రావణ్ కుమార్, వీణారాఘవాచార్యులు, పవన్ కుమార్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పండితులకు శాపం
● పదోన్నతుల కోసం పదేళ్లుగా పండితుల పాట్లు ● ఏడాదికోమారు మారుమూల ప్రాంతాలకు బదిలీ ● సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయని కూటమి ప్రభుత్వం పండితుల పదోన్నతులపై ఆరేళ్లుగా ఊరించి.. ఇపుడు అట్టకెక్కించారు. భాషోపాధ్యాయులకు ఇష్టం లేకపోయినా ఏడాదికోమారు భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడిపడితే అక్కడికి బదిలీలు చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. వందల కిలోమీటర్ల దూరానికి జిల్లాలు మార్చి బదిలీలు చేస్తూ వారిని బలి పశువులు చేస్తున్నారు. తమ పిల్లల చదువులకు బ్రేకులు పడతున్నా భరిస్తూ.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. బద్వేల్ : రాష్ట్ర వ్యాప్తంగా 2019లో భాషోపాధ్యాయుల(తెలుగు,హిందీ,ఉర్దూ,సంస్కతం,కన్నడ) పదోన్నతులు జరిగాయి. 13 ఉమ్మడి జిల్లాల్లో 1134 మంది మిగిలి పోగా వైఎస్సార్ కడప జిల్లాలో 114 మంది డీఈఓ పూల్లో ఉన్నారు. వీరిలో తెలుగు పండితులు 68, హిందీలో 33, ఉర్దూలో 13 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరిది విద్యా శాఖలో ఏ విభాగమో అర్థంకాకుండా పోయింది. ఫలితంగా ఏడాదికో మారు జిల్లా నుంచి జిల్లాకు, కనీస వసతులు లేని మారుమూల గ్రామాలకు బదిలీ చేసి బలితీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలుకానివైనం ఆరేళ్లుగా ఏడాదికోమారు బదిలీలతో విసిగి వేసారిన భాషాపండితులు ఏదో చోట ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 1134 మంది బాషోపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. వారి బాధలను క్షుణంగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి మన్మధరావు వెంటనే పదోన్నతులు కల్పించాలని, సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలని 20 డిసెంబర్, 2024లో తీర్పు ఇచ్చారు. అయితే హైకోర్టు ఆదేశాలు జారీచేసి తొమ్మిది నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. పదోన్నతుల అమలులో తాత్సారం చేయడంతో భాషోపాధ్యాయులు నష్టపోతగున్నారు. తమకు పదోన్నతులు కావాలని సెకండ్గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా కోర్టు యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం భాషా పండితులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 2న స్టేటస్ కో ఎత్తివేసింది. ఉసూరుమనిపించిన ప్రభుత్వం: హైకోర్టు ధర్మాసనం స్టేటస్కో ఎత్తివేసిన వెంటనే భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించి సెప్టెంబర్ 4న (ఈ నెల) అన్ని జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించింది. ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందనే ఆశతో బాషోపాధ్యాయులంతా డీఈవో కార్యాలయాల్లో డిక్లరేషన్ రాసిచ్చారు. తమకు పదోన్నతి ఉత్తర్వులు వస్తాయని ఆశపడే సమయంలో కూటమి ప్రభుత్వం మరల మెలికపెట్టి ఆ ప్రక్రియను ఆపేసింది. ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీసు ఉన్న వారికి పదవీ విరమణ చేసేలోగా రెండు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. బాషా పండితుల విషయంలో దశాబ్ద కాలంగా ఇది అమలు చేయడంలేదు. ఇరవై ఏళ్ల కిందట చేరినవారు కూడా పదోన్నతి లేకుండానే పదవీవిరమణ పొందారు. -
తల్లి మందలించిందని కుమారుడు..
మదనపల్లె రూరల్ : పనులకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండడంతో తల్లి మందలించింది. మనస్తాపం చెందిన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మదనపల్లె మండలంలో మంగళవారం జరిగింది. వేంపల్లెకు చెందిన శంకర, హేమావతి దంపతుల కుమారుడు హిమగిరి(16) పదో తరగతి ఫెయిల్ కావడంతో పట్టణంలోని ఓ మెకానిక్ వద్ద పనిచేస్తున్నాడు. తండ్రి శంకర కొంతకాలం కిందట మృతి చెందడంతో తల్లి హేమావతి కూలి పనులకు వెళుతూ జీవిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హిమగిరి పనులకు వెళ్లకుండా తిరుగుతుండటంతో మంగళవారం తల్లి మందలించింది. మనస్తాపం చెందిన హిమగిరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కామాంధుడికి దేహశుద్ధి
– భయాందోళన చెందుతున్న మహిళలు గుర్రంకొండ : సెల్ ఫోన్లో మహిళల ఫొటోలు తీస్తూ వికృతానందం పొందుతున్న ఓ కామాంధుడికి గ్రామస్తులు, మహిళలు దేహశుద్ధి చేశారు. మండల కేంద్రం గుర్రంకొండలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చిరు వ్యాపారాలు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. గత సోమవారం కొత్తపేట వీధిలో సంచరిస్తూ వీధుల్లో నడిచి వెళ్తున్న మహిళల ఫొటోలు తీశాడు. వీధి వెంబడి వెళుతున్న ఓ మహిళ అనుమానం కలిగి సదరు వ్యక్తి సెల్ ఫోన్ను లాక్కొని పరిశీలించగా ఫోటోలు ఉండడం గమనించింది. గట్టిగా నిలదీయడంతో చుట్టుపక్కల వారు చేరుకొని సదరు కామాంధుడికి దేహశుద్ధి చేశారు. కొంతమంది అతడి ఫోన్ను పూర్తిస్థాయిలో పరిశీలించగా గ్రామం లోని పలు ప్రాంతాలకు చెందిన 500మందికి పైగా మహిళల ఫోటోలు ఉండడంతో నివ్వెరపోయారు. గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి కఠినచర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాల వ్యాన్ ఢీకొని ఒకరు మృతి సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మంగళవారం ఓ పాల వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఎన్.సుబ్రహ్మణ్యం(58) మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. మోటకట్లకు చెందిన సుబ్రహ్మణ్యం శివాలయం సమీపంలో స్కూటర్పై వస్తున్నారు. రాయచోటి వైపు నుంచి వస్తున్న పాలవ్యాన్ ఇతడి స్కూటర్ను ఢీకొంది. తీవ్రగాయాలైన సుబ్రహ్మణ్యంను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 4న వాహనాల వేలం రాజంపేట : రవాణా శాఖ సీజ్ చేసిన వాహనాలకు అక్టోబరు 4న వేలంపాట నిర్వహిస్తున్నట్లు రాజంపేట మోటారు వెహికల్ అధికారి తెలిపారు. తనిఖీలలో పట్టుబడిన వాహనాలను రాజంపేట ఆర్టీసీ డిపోలో ఉంచామన్నారు. ఆసక్తి గల వారు ఉదయం పది గంటల నుంచి 11 గంటల లోపు రూ.5 వేల ధరావతు చెల్లించాలన్నారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి టోకన్ తీసుకోవాలన్నారు. వేలం వేసే వాహనాల వివరాలు అన్నమయ్య జిల్లా కార్యాలయం నోటీసు బోర్డులో ఉన్నాయన్నారు. గంజాయి మత్తులో కూలీలపై దాడి రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలోని రెడ్డివారిపల్లి వంతెన వద్ద పనిచేస్తున్న కూలీలు దేవరాజునాయుడు, మల్లికార్జునలపై కొందరు యువకులు గంజాయి మత్తులో మంగళవారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు గుర్తించి హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. వైఎస్సార్సీపీ నాయకులు సీహెచ్.రమేష్, బుడుగుశివయ్య బాధితులను పరామర్శించారు. విషయం తెలుసుకొన్న పోలీసలు కేసు నమోదు చేసి దాడి చేసిన వారిలో మణికంఠ, కార్తీక్, మరొకరిని అరెస్ట్ చేసారు. కోడిపందెం రాయుళ్ల అరెస్టు రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ పరిధిలోని దిగువ అబ్బవరం హరిజనవాడ ప్రాంతంలో కోడి పందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ సిబి.చలపతి తెలిపారు. ఎస్సీ ధీరజ కునుబిల్లి ఆదేశాల మేరకు పట్టణం, మండలంలోని పలు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టామన్నారు. మంగళవారం దిగువ అబ్బవరం గ్రామంలోని పొలాల వద్ద కోడి పందెం ఆడుతున్నట్లు తెలియడంతో దాడులు నిర్వహించి 12 మందిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.25 వేల నగదు, 26 స్కూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వా రిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పెడుతున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ లక్కిరెడ్డిపల్లి : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వస్థ నారీ శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మధుమేహ, రక్తపోటు పరీక్షలు, టీబీ శాంపిల్ కలెక్షన్, కిశోర బాలికలకు అవగాహన తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ల్యాబ్ రికార్డులను పరిశీలించారు. డైరీ అండ్ ఎంఎఫ్–2 రిజిష్టర్ గురించి తెలుసుకొని సూచనలు చేశారు. అనంతరం వెక్టార్ కంట్రోల్, ప్రైడే డ్రైడేలను క్షుణ్ణంగా పరిశీలించారు. డాక్టర్ ఎస్ జియాఉల్లా, సిబ్బంది జయరామయ్య, దేవదానం పాల్గొన్నారు. -
తిరస్కరించిన వారినే.. తీసుకొచ్చారు
● టీడీపీ కడప నగర నూతన కమిటీ నియామకం ● పార్టీకి పనిచేసేన వారిని పక్కన పడేశారని అసంతృప్తి ● తమ్ముళ్ల తిరుగుబాటు వేళ నిర్ణయంపై ఆగ్రహం కడప రూరల్ : కడప నగరం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు గరంగరంగా మారాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిర్ణయాలపై ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పాతకడప కృష్ణారెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కమలాపురానికి వెళ్లి తమకు న్యాయం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని శరణు కోరడంతో పెద్ద దుమారమే రేగింది. అనంతరం పార్టీని ఫిరాయించిన కార్పొరేటర్లు కూడా పాత కడప కృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉన్నా.. పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కడప నగర నూతన కమిటీని నియమించారు. నగర అధ్యక్షుడిగా పఠాన్ మన్సూర్ అలీఖాన్, ఉపాధ్యక్షుడిగా పసుపులేటి గౌతమ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ముక్కా సుబ్బారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బోనం వెంకటేశ్, గండ్లూరి బాబా ఫకృద్దీన్, ఇప్పిరాల పూర్ణచంద్రరావు, కార్యదర్శులుగా కోనేటి వెంకటేశ్ ఆచారి, గోగుల శ్రీనివాసులు, జి.నరేష్, కోశాధికారిగా మలిరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలను నియమించారు. దీంతో తమ్ముళ్ల వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లైౖంది. ఇదివరకే నగర కమిటీ వ్యవహారంపై పార్టీ అఽధిష్ఠానం కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. చాలా మంది అభ్యర్ధుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ కమిటీని అధిష్టానం ‘రిజక్ట్’ చేసిందనే ప్రచారం జరిగింది. తీరా చూస్తే వారినే కొత్త కమిటీలో చేర్చడంతో తమ్ముళ్ల అసంతృప్తి సెగలు ఎగసిపడ్డాయి. పార్టీ ఫిరాయించిన వారితోపాటు టీడీపీలో గుర్తింపు లేని వారికి చోటు కల్పించడం దారుణమని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తాము తిరస్కరించినా, తమ పంతం, ఆధిపత్యం కోసం కమిటీ నియమించారని తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసిన కార్యకర్తలను పక్కన పడేశారని ఆరోపిస్తున్నారు. తప్పు చేయొద్దంటే...తిరుగుబాటు చేస్తావా – పాత కడప కృష్ణారెడ్డిపై విరుచుకుపడిన కార్పొరేటర్లు పాత కడప కృష్ణారెడ్డి చేయని అక్రమాలంటూ లేవు.. టీడీపీలో ఉంటూ ఆయన ఒక్కడే లబ్ధి పొందాడు.. ఇపుడు తప్పు చేయవద్దంటే తిరుగుబాటు చేస్తున్నాడు అని పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు సూర్యనారాయణ, సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మంగళవారం వారు మాట్లాడుతూ కృష్ణారెడ్డి సొసైటీ డైరెక్టర్గా పదవి అనుభవిస్తూ పార్టీపైనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను కాజేసిన నైజం కృష్ణారెడ్డిదని దుయ్యబట్టారు. డీలర్లను కూడా వదలిపెట్టలేదన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించి తాము టీడీపీలో చేరామని, ఇపుడు అభివృద్ధిచూసి ఓర్వలేక కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడం తగదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవీరెడ్డి వద్ద ఉంటూ పెద్ద ఎత్తున లబ్ధి పొందారని వారు ఆరోపించారు. కడపలో ఏదో జరుగుతోందని కృష్ణారెడ్డి తన అనుచరులను వెంటేసుకుని పెద్దాయన పుత్తా నరసింహారెడ్డి వద్దకు వెళ్లారన్నారు. ఆయనకు కడపలో జరుగుతున్న అంశాలపై పెద్దగా తెలియదన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యం అక్రమాలకు పాల్పడే నువ్వు మమ్మల్నే బెదిరిస్తావా....రా చూసుకుందాం అంటూ కృష్ణారెడ్డికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో జఫ్రుల్లా, చల్లా రాజశేఖర్, బాలకృష్ణారెడ్డి, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
కొండాపురం : మండలంలోని కె.సుగుమంచిపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడ్డొల్ల స్వాతి(13) మృతి చెందారు. తాళ్లప్రొద్దుటూరు ఏఎస్ఐ రాయపాటిబాసు వివరాల మేరకు.. బుక్కపట్నం గ్రామానికి చెందిన జి.అనిల్, వసంత దంపతులకు చెందిన స్వాతి దత్తాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో వతరగతి చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కె.సుగుమంచిపల్లె పునరావాస కేంద్రం సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద తన బంధువుల ఆమ్మాయిని ఆటో ఎక్కించి తిరిగి రోడ్డు నుంచి ఎడమవైపు నడచి వస్తోంది. కొండాపురం వైపు నుంచి తాడిపత్రికి వెళ్లే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలై స్వాతి అక్కడిక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ ఆయన తెలిపారు.కాలువలో పడిఉపాధ్యాయుడు మృతిజమ్మలమడుగు : మురికి కాలువలో పడి ఉపాధ్యాయుడు మరణించిన సంఘటన జమ్మలమడుగు పట్టణంలో మంగళవారం జరిగింది. పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మధుబాబు(50) మద్యం తాగి సోమవారం రాత్రి ఇంటికి బయలుదేరాడు. మద్యం ఎక్కువగా తాగడంతో నడవలేని స్థితిలో కన్నెలూరు మోటు వద్ద మురికి కాలువలో పడి పోయాడు. ఎవ్వరూ గుర్తించకపోవడంతో అక్కడే మృతిచెందాడు. ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కాలువలో నుంచి బయటికి తీసి పోర్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాంబ్ స్క్వాడ్ తనిఖీలుపీలేరురూల్ : అసాంఘిక శక్తుల నిర్మూలనే లక్ష్యంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ మంగళవారం పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించింది. పీలేరులోని ప్రముఖ కేంద్రాలు, కార్యాలయాలు, రైల్వే స్టేషన్, ప్రభుత్వాస్పత్రి, ఆర్టీసీ బస్టాండ్, వారపు సంత ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. -
నవోదయ దరఖాస్తుల గడువు పొడిగింపు
రాజంపేట: ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన రాజంపేట మండలం నారమరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువు పొడిగించామని ప్రిన్సిపాల్ గంగాధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–2027 విద్యాసంవత్సరానికి అక్టోబరు 7 వరకు గడువు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2027 ఫిబ్రవరి 7న అర్హత పరీక్ష ఉంటుందని వివరించారు. రాయచోటి టౌన్: రవాణాశాఖ అధికారులు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలను అక్టోబర్ 4న వేలం వేస్తున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజంపేట ఆర్టీసీ డిపోలో ఉద యం 10 గంటలకు వేలం ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ధరావత్తుగా రూ.5 వేలు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనే వారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి టోకెన్ పొందాలని సూచించారు. వాహనాల వివరాలు అన్నమయ్య జిల్లా రవాణాశాఖ కార్యాలయ నోటీస్ బోర్డులో ఉన్నట్లు వివరించారు. కమలాపురం: కమలాపురం పెద్దదర్గాగా వెలుగొందుతున్న దర్గా–ఏ–గఫారియాలో బుధవారం రాత్రి దస్తగిరి షా ఖాద్రి బర్సీ నిర్వహిస్తున్నట్లు దర్గా కన్వీనర్, వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారికి పూల చాదర్లు సమర్పించి, అనంతరం గంధం ఎక్కిస్తారని ఆయన అందులో పేర్కొన్నారు. రాత్రి అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులు విరివిగా హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. రాయచోటి టౌన్: 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం స్థానిక స్థాయి నుంచి అందరం కలసికట్టుగా పని చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అన్నారు. మంగళవారం రాయచోటిలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో పంచాయతీ పురోగతిపై సూచిక 2.0పై జిల్లాలోని అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ (ఎంఓపీఆర్) రూపొందించిన పంచాయతీ పురోగతిపై సూచిక 2.0(పీఏఐ–2.0) శిక్షణ బేస్లైన్ డేటాను అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రణాళికను జాతీయ స్థాయిలో ఉన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్డీజీలు) అనుసంధానం చేయడానికి వ్యూహాత్మక సాధనంగా పని చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జగజ్జనని.. లోకపావని
‘దుష్టశిక్షణ.. శిష్టరక్షణ’ కోసం అమ్మవారు అనేక అవతారాలు ధరించారు. వాటిలో కొన్నింటికి విశేష చరిత్ర ఉంది. జగన్మాత రూపాలను దేవీ శరన్నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజించడం సంప్రదాయంగా వస్తోంది. జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. రెండో రోజైన మంగళవారం లోకమాత ఒక్కో ప్రాంతంలో ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాల వెలుగుతో ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కిటకిటలాడుతున్నాయి. శక్తి స్వరూపిణిని భక్తులు కనులారా దర్శించుకుని పులకించిపోయారు. ‘జగజ్జనని.. లోకపావని’ అంటూ శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. – సాక్షి, నెట్వర్క్ గుర్రంకొండ : గాయత్రీదేవిగా రెడ్డెమ్మతల్లి రాయచోటి టౌన్ : పార్వతీదేవిగా శ్రీభద్రకాళీ ములకలచెరువు : గాయత్రీదేవిగా అమ్మవారు -
ఇంటర్ పరీక్ష ఫీజుకు వేళాయె
రాయచోటి జగదాంబసెంటర్: వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి తొలి అడుగు పడింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 10వ తేదీ తుది గడువుగా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. 2026 మార్చిలో జరగనున్న పరీక్షలకు ఈ నెల 15 నుంచి చెల్లించే విధంగా బోర్డు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు అక్టోబర్ 10 వరకు గడువు విధించారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు వెయ్యి రూపాయల అపరాధ రుసుంతో చెల్లించే అవకాశం ఉంది. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును చెల్లించేందుకు విద్యార్థులు అప్రమత్తమవ్వాలని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష ఫీజుల చెల్లింపు ఇలా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్ష నిమిత్తం రూ.600 చెల్లించాల్సి ఉంది. జనరల్ కోర్సులు చదివే సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్ (సెకండియర్ విద్యార్థులు మాత్రం) రూ.275 చెల్లించాల్సి ఉంది. ఒకేషనల్ కోర్సు చదువుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు పరీక్ష రుసుంగా రూ.165 చెల్లించాల్సి ఉంటుంది. సెకండియర్ చదువుతూ ఫస్టియర్ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం థియరీ ఫీజు కలిపి రూ.1200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు చదువుతూ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సు చదివే విద్యార్థులు రెండేళ్ల పరీక్ష ఫీజు కడితే రూ.330 చెల్లించాలి. ఫస్టియర్, సెకండియర్ పాసై ఉండి, మార్కులు ఇంప్రూవ్మెంట్కు పరీక్ష రాసే ఆర్ట్స్ విద్యార్థులు రూ.13.50 వంతున సైన్స్ విద్యార్థులు రూ.1600 వంతున చెల్లించాలి. గడువులోగా చెల్లించాలి పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. గడువు ముగిసిన తర్వాత అపరాధ రుసుంతో చెల్లించాల్సి వస్తుంది. – రవి, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి, అన్నమయ్య జిల్లా తుది గడువు అక్టోబర్ 10 ఆలస్యమయ్యే కొద్దీ పెరగనున్న అపరాధ రుసుం -
వంతెన.. ప్రమాదం అంచున
రాజంపేట: గుత్తి–రేణిగుంట డబ్లింగ్లో ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం మృకుందాశ్రమం వద్ద ఉన్న రైల్వేవంతెన ప్రమాదకరంగా మారింది. ముంబయి–చైన్నె ప్రధాన రైలుమార్గం.. ఉమ్మడి కడప జిల్లా మీదుగా వెళుతోంది. ఈ మార్గంలో ఒంటిమిట్ట–భాకరాపేట రైల్వేస్టేషన్ల మధ్య మృకుందాశ్రమానికి వెళ్లే రహదారిలో బ్రిడ్జి డేంజర్గా మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ బ్రిడ్జి కడప ఇంజినీరింగ్ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. నిత్యం రైళ్ల రద్దీ భారం ఈ బ్రిడ్జిపై నిత్యం రైళ్ల రద్దీభారం పడుతోంది. ఉమ్మడి కడప జిల్లా మీదుగా నిత్యం 30 రైళ్లకుపైగా రాకపోకలు సాగిస్తుంటాయి. గూడ్స్రైళ్లు 40కి పైగా వెళ్తుంటాయి. మృకుందాశ్రమం సమీపంలో ఉన్న బ్రిడ్జి స్థితిగతిని పరిశీలిస్తే.. రైల్వే శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలు వెలువడుతున్నాయి. వంతెన పైన, ట్రాక్ కింది భాగంలో నెర్రెలు ఏర్పడ్డాయి. వంతెన పొడవు ఇదే స్థితి కనిపిస్తోంది. అక్కడ మొక్కలు సైతం మొలవడంతో మరింత దెబ్బతింటోంది. అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదం ఈ వంతెనను పునర్నిర్మాణం చేపట్టకపోతే.. పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వర్షాల సీజన్లో నీటి ఊట ఏర్పడి బ్రిడ్జిని మరింతగా దెబ్బతీస్తోంది. ఫలితంగా బ్రిడ్జి స్లాబ్, గోడలు దెబ్బతింటున్నాయి. ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా ఉంది. ఇప్పటికై నా రైల్వే ఇంజినీరింగ్ శాఖ ఈ బ్రిడ్జిని బాగు చేయడంపై దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఒంటిమిట్ట–భాకరాపేట మధ్య బ్రిడ్జి శిథిలం ముంబయి–చైన్నె ప్రధాన రైలుమార్గం మృకుందాశ్రమం వద్దపొంచి ఉన్న ముప్పు -
రెండు నిమిషాల్లోనే చంపేశారు
● హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకుల చేతిలో హతమైన ఫైనాన్షియర్ ● బాకీ దారుల ఆస్తుల అటాచ్ కోసం కోర్టులో కేసు వేసిన వేణుగోపాల్రెడ్డి ● ఆ కోపంతోనే హత్య చేయించిన బాకీ దారులుప్రొద్దుటూరు క్రైం : వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి కిరాయి హంతకుల చేతిలో హతమయ్యాడు. వేణుగోపాల్రెడ్డి వద్ద బాకీ తీసుకున్న ఇరువురు వ్యక్తులు హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకుల ద్వారా అతన్ని చంపించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లలో నివాసం ఉంటున్న వడ్డీ వ్యాపారి కొండా వేణుగోపాల్రెడ్డి శుక్రవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం రూరల్ పోలీసులు ఆదివారం సాయంత్రం అతని మృతదేహాన్ని చాపాడు వద్దనున్న కుందు వంతెన వద్ద గుర్తించారు. అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీంతో కలిసి రూరల్ పోలీసులు అతికష్టం మీద వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని నదిలో నుంచి వెలికి తీశారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ప్రొద్దుటూరుకు చెందిన వేణుగోపాల్రెడ్డి బంధువు, మరో వ్యక్తి కలసి వేణుగోపాల్రెడ్డిని హతమార్చేందుకు కొన్ని రోజుల ముందే వ్యూహ రచన చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులను శుక్రవారం ప్రొద్దుటూరుకు పిలిపించారు. వారు తమ కారును వేణుగోపాల్రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ఆర్చి వద్ద ఆపుకున్నారు. అక్కడ వారు ఉన్న సమయంలోనే సాయంత్రం వేణుగోపాల్రెడ్డి ఇంటి నుంచి స్కూటీలో పట్టణంలోకి వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఇంటి సమీపంలో ఉన్న ఆర్చీ దాటగానే కారులో ఉన్న కిరాయి హంతకులు అతన్ని ఆపినట్లు తెలిసింది. ఎవరు మీరు అని అడిగే లోపే వారు వేణుగోపాల్రెడ్డిని కొట్టడంతో కింద పడిపోయాడని, ఈ క్రమంలోనే దుండగులు కాళ్లతో గొంతు నులిమి చంపేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను’ అని బతిమాలుకున్నా దుండగులు కనికరించలేదని తెలిసింది. వేణుగోపాల్రెడ్డి స్కూటీలో అక్కడికి రావడం, వారు హత్య చేయడం ఇదంతా రెండు, మూడు నిమిషాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ వ్యాపారి చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న దుండగులు మృతదేహాన్ని అదే కారులో వేసుకొని దువ్వూరు దారిలోని కామనూరు బ్రిడ్జి వద్ద కుందు నదిలో పడేసి అదే రాత్రికి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గాల సమాచారం. తర్వాత నిందితులు హైదరాబాద్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతోనే కుందు నదిలో ఉన్న వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెలికి తీశారు. నిందితుల్లో వేణుగోపాల్రెడ్డి భార్య తరపు బంధువు కూడా.. వేణుగోపాల్రెడ్డిని హతమార్చిన వారిలో అతని భార్య సమీప బంధువు ఒకరు ఉన్నట్లు తెలిసింది. కాగా 2016లో నిందితుల్లోని ఒక వ్యక్తితో గొడవ జరిగింది. వేణుగోపాల్రెడ్డి డబ్బు అడగటానికి వెళ్లగా అతను దాడి చేశాడు. దీంతో వేణుగోపాల్రెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో రెండేళ్ల క్రితం వీరి మధ్య రాజీ కుదిరింది. కాగా నిందితుల్లోని ఇద్దరు వ్యక్తులకు వేణుగోపాల్రెడ్డి రూ. లక్షల్లో బాకీ ఇచ్చాడు. ఈ డబ్బు గడువు ముగిసినా వారు ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ కోర్టులో కేసు వేశాడు. అంతేగాక కొంత కాలం తర్వాత వారి ఆస్తులు అటాచ్ కోరుతూ ఫైనాన్షియర్ మరో మారు కోర్టును ఆశ్రయించాడు. ఇది ఇరువురు బాకీ దారులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఈ విషయమై పలువురు వేణుగోపాల్రెడ్డికి నచ్చచెప్పినట్లు తెలిసింది. అయినా కూడా అతను ఆస్తుల అటాచ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ కారణంతోనే ఇద్దరు కలిసి హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్రెడ్డిని హతమార్చినట్లు సమాచారం. కాగా కేసులోని ప్రధాన నిందితులు, కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరికై నా ప్రమేయం ఉందా అనే కోణంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
చెట్లు నరికి అక్రమంగా తరలింపు
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె గ్రామానికి సమీపంలోని శ్రీ రెడ్డెమ్మకొండ పరిసరాల్లో ఉన్న కొండలు, గుట్టలతో పాటు పొలాల్లో పెద్ద ఎత్తున కలపచెట్లు ఉన్నాయి. వీటిపై అక్రమార్కుల కన్నుపడింది. కన్నుపడిందే తడవుగా చెట్లను అక్రమంగా నరికివేసి ట్రాక్టర్ల ద్వారా బయట మండలాలకు తరలించుకుపోతున్నారు. గత పదిహేను రోజులు ఈ తంతు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతమంది బయట మండలాలకు చెందిన వ్యాపారులు ఇక్కడే మకాం వేసి ఇష్టానుసారం కలపచెట్లను నరికి అక్కడే కుప్పలుగా వేస్తున్నారు. కట్టెలు ఎక్కువగా సేకరించి ట్రాక్టర్ల ద్వారా బయట మండలాలకు తరలిస్తున్నారు. ఎంతో విలువైన వృక్షసంపదను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నాతాఽధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఉచిత న్యాయ సేవలు పొందాలి
రాయచోటి : జైలులోని ఖైదీలు మంచి ఆరోగ్యంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత న్యాయ సలహాలను పొందాలని కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫకృద్దీన్ తెలిపారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు డాక్టర్ సి యామినీ ఆదేశాల మేరకు రాయచోటి సబ్ జైలు లీగల్ ఎయిడ్ క్లీనిక్ను సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జైలులో రిజిస్టర్లను పరిశీలించారు.. ఖైదీలకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను వివరించారు. ఖైదీలతో ఒక్కొక్కరిగా మాట్లాడి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబరు 15100పై వారికి తెలియజేశారు. సమస్యలుంటే రాయచోటి మండల న్యాయ సేవా సమితి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : అర్జీదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని, వారికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదు నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నడవలేని స్థితిలో ఉన్న బాధితుల వద్దకు ఎస్పీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు ఎలాంటి సమస్య అయినా భయపడకుండా పోలీసు వద్దకు రావాలని ఎస్పీ సూచించారు. పొలం యజమానిపై హత్యాయత్నంమైదుకూరు : గొర్రెలు మేపుకునే విషయంలో తగాదా ఏర్పడి మండలంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్య పై అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ హత్యాయత్నం చేసినట్టు అర్బన్ సీఐ కె. రమణారెడ్డి తెలిపారు. జీవి సత్రంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్యకు చెందిన బెండ తోటలో శనివారం ఆదినారాయణకు చెందిన గొర్రెలు మేస్తుండగా అడ్డుకోవడంతో వారి మధ్య గొడవ ఏర్పడినట్లు సిఐ పేర్కొన్నారు. ఆ మేరకు ఆదినారాయణ మచ్చు కత్తితో గురవయ్య పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. సంఘటనకు సంబంధించి ఆదినారాయణపై సోమవారం హత్యాయ త్నం కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి -
గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలలో జరిగే గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఏ అధ్యక్షుడు కిరణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్స్రాజేంద్రన్కు ఏఐఎస్ఏ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్న అవినీతి అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. నీతి నిజాయితీగా విద్యార్థుల సంరక్షణకు పాటుపడే అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంమలో ఏఐఎస్ఏ నాయకులు షేక్ రెడ్డిబాషా తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం
రాజంపేట/పెనగలూరు : సోమశిల జలాశయం బ్యాక్వాటర్ (వెనుక జలాల) ముంపు పరిహారం పరిహాసంలా మారింది. దశాబ్దాలుగా కొనసాగు తున్నా.. పూర్తి స్థాయిలో చెల్లించలేదు. దీంతో బాధి తులు గ్రామాలకు వదలలేక.. ఏటా ముంపునకు గురవుతున్నారు. ఇంకెన్నాళ్లు పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి వేదన అరణ్య రోదనగా మారింది. విధిలేని పరిస్థితుల్లో న్యాయస్థానంవైపు అడుగులు వేస్తున్నారు. పరిహారం విషయంలో అనేక విధాలుగా.. పలు మార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ కేసులు కొనసాగుతున్నాయి. కొందరికి కోర్టు అనుకూల తీర్పులు ఇచ్చింది. మరికొన్ని కేసులు పెండింగ్లో న్నాయి. ముంపు గ్రామాలు నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిపై సోమశిల జలాశయం నిర్మాణం 1979 నుంచి ప్రారంభమైంది. 1981లో రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చింది. 1986కి పూర్తయింది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో నందలూరు, ఒంటిమిట్ట, పెనగలూరు, గోపవరం, ఒంటిమిట్ట మండలాల్లో సోమశిల ముంపు గ్రామాలు ఉన్నాయి. 1979 నుంచి జలాశయం వెనుకజలాలతో మునకకు గురయ్యే గ్రామాలను గుర్తించి దశలవారీగా పరిహారం చెల్లిస్తూ వచ్చారు. సోమశిల వెనుకజలాల కింద 130 గ్రామాలు మునకకు గురవుతున్నాయి. రాజంపేటలో సోమశిల స్పెషల్ డిప్యూటీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని గ్రామాలకు పరిహారం పంపిణీ చేసి ఖాళీ చేయించారు. అయితే అనేక కారణాలతో పరిహారం పంపిణీ పెండింగ్లో ఉండిపోయింది. జలాశయంలో పూర్తి స్థాయిలో (77.988 టీఎంసీ)నీటి నిల్వ ఉంచలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత నీటిమట్టం 99.857 మీటర్లలో ఉంది. ఇన్ఫ్లో 12649 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రహసనంలా.. ఉమ్మడి కడప జిల్లాలోని నందలూరు, ఒంటమిట్ట, గోపవరం, అట్లూరు, పెనగలూరు మండలాల్లోని ముంపు గ్రామాలకు సకాలంలో పరిహారం పంపిణీ చేయలేకపోయారు. ప్రస్తుతం జలాశయంలో 72.25 టీఎంసీలు ఉండగా.. ముంపుగ్రామాలకు నీరు చేరింది. నందలూరు మండలం పొత్తపి, నూకినేనిపల్లె, పెనగలూరు మండలం సిరవరం, ఎస్ఆర్పురం గ్రామాల పరిధిలో 296 ఎకరాల్లో సాగుచేసిన పంటలు నీట మునిగాయి. అధికారులు కూడా గుర్తించారు. భూసేకరణ చేయాలనే ప్రతిపాదన అటకెక్కించారు. సోమశిల అధికారులు కన్సల్టెంట్ అవార్డు చేసి, ఒకేసారి పరిహారం చెల్లింపులు జరిపి ఉంటే ఇప్పుడు పరిహారం పంపిణీ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తేవి కాదని ముంపు బాధితులు చెబుతున్నారు. భూములకు పరిహారం.. గ్రామానికి ఏదీ? ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామానికి పరిహారం ఇవ్వలేదు. వారికి జీవనాధారమైన పంట పొలాల్లో వెనుకజలాలు తిష్ట వేసి ఉన్నాయి. పరిహారం ఇచ్చేస్తే ఖాళీ చేసి వెళ్లిపోతామని ముంపు బాధితులు కోరుతున్నప్పటికీ.. ప్రభుత్వం వారి మాట పెడచెవిన పెడుతోంది. ఇదే పరిస్థితి నందలూరు మండలంలోని పొత్తపి గ్రామంలో కూడా నెలకొని ఉంది. ఈ విధంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ముంపు గ్రామాల్లో రైతులు తమ భూములకు పరిహారం రాక.. మరికొందరు గ్రామాలకు అందక ఇబ్బంది పడుతున్నారు. పూర్తి సామర్థ్యంలో నీళ్లు పెడితే.. సోమశిల జలాశయంలో 77.988 టీఎంసీల నీటి నిల్వ పెడితే ఉమ్మడి కడప జిల్లాలోని ముంపుగ్రామాలతోపాటు సమీప పొలాలు మునిగిపోతాయి. గతంలో అనేక మార్లు ఇలాంటి పరిస్ధితులు ఏర్పడ్డాయి. జలాశయం పూర్తిసామర్థ్యం వరకు రాకుండా, ముంపుగ్రామాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని నీటి విడుదల విషయంలో అడుగులు వేస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా.. నాలుగున్నర దశాబ్దాలుగా ముంపుగ్రామాలకు పరిహారం పంపిణీ కొనసాగుతూనే ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ముంపు బాధితులకు న్యాయంగా పరిహారం అందజేసేందుకు కడపలో లోక్ అదాలత్ ద్వారా ఒకేసారి సెటిల్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో రూ.330 కోట్లకు పైగా పరిహారాన్ని బాధితులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సోమశిల ముంపు బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. సోమశిల బ్యాక్ వాటర్ గ్రామాలకు పూర్తి కాని పంపిణీ నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న వైనం ఏటా ముంపునకు గురవుతున్న పొలాలు అష్టకష్టాలు పడుతున్న బాధితులు -
ఆర్టీపీపీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో సోమవారం ఏపీఎస్సీ జేఏసీ, టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్ల మధ్య తోపులాట జరిగింది. కొంచెం సేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీస్, విజిలెన్స్, ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువురు వర్గాల వారితో మాట్లాడి సర్దిచెప్పారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ నిరసనలు, రిలే దీక్షలు చేసి సోమవారం ఫౌంటెయిన్ వద్ద నుంచి ర్యాలీ చేపట్టింది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగమైన టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిరసనలు చేపట్టి సోమవారం రిలే దీక్షలు ప్రారంభించి గేటు బయట ఽఆందోళన చేసింది. జేఏసీ ర్యాలీ అనంతరం ఉద్యోగ, కార్మికులు విధులకు వెళ్తుండుగా, గేటు బయట టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు విధులకు పోకుండా అడ్డుకుంది. దీంతో ఒక్కసారిగా జేఏసీ, ఆ రెండు యూనియన్ల మధ్య తొపులాట జరిగింది. ఈ తోపులాటలో జేఏసీకి చెందిన ఓ ఉద్యోగి చొక్కా చినిగింది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పారు. అనంతరం జేఏసీ నాయకులు ఆర్టీపీపీ సీఈ ని కలిసి వినతి పత్రం అందించారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలికడప కోటిరెడ్డి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలను ఇస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజంపేట రీజినల్ మేనేర్ సుశాంత్ కుమార్ స్వరూప్, కడప ఆర్ఎం శ్రీనివాస ప్రసాద్, ఎల్డీఎం జనార్ధనం తెలిపారు. సోమవారం కడపలోని జాన్డీర్లో నర్సిరెడ్డి, శివకుమార్లకు నూర్పిడి యంత్రాలను అందజేశారు. డీఆర్డీఏ డీపీఎం రఘునాథరెడ్డి, రాజంపేట ప్రాంతీయ కార్యాలయ సీపీసీ మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రాజంపేట మండలం ఊటుకూరు ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామానికి చెందిన లకిడి రామకృష్ణ (50) మృతి చెందాడు. బద్వేలులో ఉన్న బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో రామకృష్ణ బయలుదేరాడు. ఊటూరువద్ద పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మతిస్దిమితంలేని వ్యక్తి వీరంగం రాజంపేట : రాజంపేట స్టేట్బ్యాంక్ సమీపంలో మతిస్థిమితం లేని సుధాకర్ అనే వ్యక్తి సోమవారం వీరంగం సృష్టించాడు. పలువురిపై దాడి చేసిన క్రమంలో స్థానికులు పట్టుకొని కాళ్లు చేతులు కట్టేశారు. భార్యపై అనుమానంతో తన కొడుకు మతిభ్రమించిందని సుధాకర్ తల్లి ఆవేదన చెందారు. పోలీసులు రంగం ప్రవేశం చేశారు. మతిస్థిమితంలేని వ్యక్తి ఆసుపత్రిలో చేర్చిన క్రమంలో విచారణ చేశారు. పనిచేస్తుండగా విద్యుత్ సరఫరా: ఒకరికి గాయాలు బి.కొత్తకోట : విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం మండలంలోని తుమ్మనంగుట్టకు గౌస్పీర్ (19) కోటావూరు వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ స్తంభంపై జంపర్ల పనులు చేస్తున్నాడు. అంతకుముందు వరకు విద్యుత్ సరఫరా నిలిపి ఉండగా ఒక్కసారిగా సరఫరా పునరుద్ధరణ అయ్యింది. దీంతో గౌస్పీర్ షాక్కు గురయ్యాడు. బాధితున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై డిస్కం ఏడీ గోవిందరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ తన సిబ్బందితో పనులు చేయిస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిపి ఉండగా మళ్లీ ఎలా సరఫరా వచ్చింది, ప్రమాద ఘటనపై ఏఈ విచారించి నివేదిక ఇస్తారని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరికి.. మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. చింతపర్తికి చెందిన సత్యనారాయణ, మరో బాలిక పల్లవి(5)తో కలిసి ద్విచక్రవాహనంలో వ్యక్తిగత పనులపై వెళుతుండగా, బైపాస్రోడ్డులోని అరేబియన్ హోటల్ సమీపంలో మరో బైక్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలిక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
రాయచోటి జగదాంబసెంటర్ : వివిధ కారణాలతో చనిపోతున్న న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజు ఉదయం కోర్టు పనిగంటల్లో సంతాపాన్ని తెలిపే సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడాన్ని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులుఐదవ అదనపు జిల్లా జడ్జి కృష్ణన్కుట్టి, సీనియర్ సివిల్ జడ్జి ప్రసూన, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుయోధనతో కలిసి విధులు బహిష్కరించడానికి గల కారణాలను తెలియజేసిన అనంతరం కోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రెడ్డిబాషా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ కారణాలతో చనిపోయిన న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజున ఉదయం. 10.30 గంటలకు సంతాపాన్ని తెలియజేసే సంస్కృతి ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిందని అన్నారు. దీనిని తక్షణం వెనక్కి తీసుకోవాలని భారత న్యాయవాదుల సంఘం అన్నమయ్య, కడప జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, సహాయ కార్యదర్శి ఖాదర్బాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
అధికారమే అండ.. కరుగుతున్న కొండ
అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతూ కొండలను కరగదీస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే భారీ పేలుళ్లకు పాల్పడుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట ముగ్గురాయి ఖనిజం వంద మీటర్లలోపు భారీస్థాయిలో డ్రిల్లింగ్ నిర్వహించి స్థానిక టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నాడు. జాతీయ రహదారి పక్కనే భారీ పేలుళ్లకు అనుమతులు అధికారులు ఎలా ఇచ్చారని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిర్వహించిన బ్లాస్టింగ్తో పెద్ద శబ్దాలు రావడంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దుమ్ము, దూళితో దట్టమైన పొగలు అల్లుకున్నట్లు ఉండటంతోపాటు రాళ్లు తమపైన పడతాయోమేనని భయాందోళన చెందుతున్నారు. ఈ పేలుళ్లధాటికి గతంలో కొండపై నుంచి బండరాయి జాతీయ రహదారిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఏపీఎండీసీ అధికారులు బండరాయిని తొలగించారు. డేంజర్ జోన్లో ఎలా అనుమతిస్తారు? మంగంపేట ఏపీఎండీసీ గనుల నుంచి 500 మీటర్ల వరకు డేంజర్ జోన్గా ప్రకటించారు. అయితే వందమీటర్ల లోపు భారీ ఎత్తున డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ ఎలా అనుమతించారని, అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏ విధంగా చూస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీఎండీసీ అధికారులు ఐదువందల మీటర్ల డేంజర్ జోన్లో ఈ కంకర మైనింగ్కు ఏ విధంగా అధికారులు మినహాయింపు కల్పించారని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల ప్రజలు ఆందోళన జాతీయ రహదారి పక్కనే మైనింగ్లో పెద్దఎత్తున కంప్రెసర్తో ప్రస్తుతం బ్లాస్టింగ్ కోసం పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. బ్లాస్టింగ్ నిర్వహిస్తే ఏమి జరుగుతుందోనని సమీప గోవిందంపల్లి గ్రామ ప్రజలు, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీఎండీసీ నుంచి వచ్చే వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడుతుంటే.. కంకర క్వారీ కోసం అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉండటంతో కాలుష్యం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని గోవిందంపల్లి గ్రామ ప్రజలు గతేడాది నుంచి అధికారులకు మెరపెట్టుకుంటున్నారు. దీంతో అప్పటి జిల్లా ఎస్పీ బ్లాస్టింగ్కు అనుమతి ఇవ్వలేదు. ఆయన బదిలీపై వెళ్లగానే స్థానిక టీడీపీ నాయకుడు మరలా పెద్దఎత్తున బ్లాస్టింగ్ నిర్వహించేందుకు పనులు చేస్తున్నాడు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఇలాగే బ్లాస్టింగ్ కారణంగా బద్వేలు నియోజకవర్గం కలస్పాడులో అనేక మంది మృతి చెందారు. ఇటువంటి బ్లాస్టింగ్ల ద్వారా ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా అధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారని గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రస్తుతం కంకర కోసం అక్రమంగా బ్లాస్టింగ్ చేసేందుకు నిర్వహిస్తున్న పనులను అడ్డుకోవాలని గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. మంగంపేట ఏపీఎండీసీ గనుల సమీపంలో అక్రమ మైనింగ్ జాతీయ రహదారి పక్కనే పెద్ద ఎత్తున లేచిన దుమ్ము దూళీ మంగంపేట గనుల సమీపంలో అక్రమ మైనింగ్ జాతీయ రహదారి పక్కనే పేలుళ్లు ఆందోళనలో ప్రయాణికులు, సమీప గ్రామస్తులు పట్టించుకోని అధికారులు -
● జగన్మాతా.. నమోస్తుతే !
‘అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. మాయమ్మ పెద్దమ్మ’.. అంటూ జగన్మాతకు ప్రణమిల్లారు. జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో ఆలయాలు శోభిల్లాయి. తొలి రోజు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. సిరులతల్లిని దర్శించుకున్న భక్తులు పరవశించి పోయారు. ‘చల్లగా చూడమ్మా’ అంటూ వేడుకున్నారు. – సాక్షి, నెట్వర్క్ రాయచోటి : వీరభద్రస్వామి దేవస్థానంలో భద్రకాళి అమ్మవారు గుర్రంకొండ: బాలాత్రిపుర సుందరీదేవిగా రెడ్డెమ్మతల్లి రైల్వేకోడూరు : దీక్షాబంధన అలంకారంలో వాసవీకన్యకాపరమేశ్వరీదేవి తంబళ్లపల్లె : మల్లయ్యకొండపై ప్రత్యేక అలంకరణలో ఏనుగుమల్లమ్మ -
యూరియా వాడకం తగ్గించాలి
చిన్నమండెం : రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి నానో ఎరువులు, జీవన ఎరువులు వాడాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచించారు. సోమవారం చిన్నమండెంలో వ్యవసాయ శాఖ, ఇఫ్కో సహకార సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ సమావేశం, మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యూరియా వాడకం వల్ల పర్యావరణంపై కలిగే నష్టాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి గీత, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైల్వేకోడూరు అర్బన్ : గుంజనేరు రక్షణ గోడ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి రక్షణ గోడ నిర్మాణ పనులను పరిశీలించి, గుత్తేదారుతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయన్నారు. గుంజనేరు నది పరీవాహక ప్రాంతాల్లో వర్షం కురిస్తే యేరు ఉధృతంగా ప్రవాహిస్తుందని, దీంతో కోడూరు పట్టణం, సరసరాం పేట తదితర ప్రాంత ప్రజలు ముంపునకు గురి కాకూడదు అనే దృష్టితో గత ప్రభుత్వంలో రక్షణగోడను మంజూరు చేయించామన్నారు. అలానే వందల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిపామన్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయకుండా చిత్తశుద్ధితో వ్యవహరించి పనులు పూర్తి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, శివయ్య, ఎంపీటీసీ మహేష్, దుర్గయ్య, వెంకటరెడ్డి, రమణ, రాజగోపాల్, కృష్ణారెడ్డి, వినోద్, రఘు, మణి తదితర నాయకులు పాల్గొన్నారు. పెనగలూరు : మండలంలోని ఎన్ఆర్ పురం పంచాయతీ పల్లంపాడు గ్రామానికి చెయ్యేరు నదిపై రోడ్డు వేస్తామని జెడ్పీటీసీ సుబ్బరాయుడు అన్నారు. సోమవారం జెడ్పీటీసీ సుబ్బరాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కేతా చక్రపాణిలు చెయ్యేరు నదిపై తెగిపోయిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ విజయరెడ్డిల ఆదేశాల మేరకు ఈ రోడ్డును పరిశీలించడం జరిగిందన్నారు. జెడ్పీ నిధులు ద్వారా ఈ రోడ్డును వేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. చెయ్యేరు నదిపై రోడ్డు వేసేటప్పుడు సిమెంటు బొంగులు ఏర్పాటు చేసి రోడ్డు వేస్తామని చెప్పారు. రోడ్డు నిర్మాణం విషయమై అజయ్రెడ్డి, విజయ్రెడ్డిలతో చర్చించినట్లు జెడ్పీటీసీ తెలియజేశారు. -
అర్జీదారుల వేదన తీరడం లేదు. ‘దరఖాస్తులు కొండంత.. పరిష్కారం గోరంత’ అనే చందంగా పరిస్థితి తయారైంది. వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్ వరకూ వచ్చి వినతిపత్రం ఇచ్చినా మళ్లీ రావాల్సి వస్తోంది. వాస్తవానికి మండల, డివిజన్ స్థాయిలో కూడా అర్జీలు సమర్పించవచ్చు. కానీ, అష్
● సమస్యలతో సతమతమవుతున్న జనం ● పరిష్కారం కాక ఆందోళన ● కలెక్టరేట్కు పరుగులు ● కూటమిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత సాక్షి రాయచోటి : ప్రజలకు అనేక హామీలు ఇచ్చి పట్టించుకోకపోవడంతో అన్ని వర్గాలు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నాయి. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మమ అనిపిస్తుండడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. ఆక్రమణల పర్వంపై ప్రజలు, భూకబ్జాలపై బాధితులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు, సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు ఇలా అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రతి సోమవారం కూటమి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు బాధితులు బారులు తీరుతున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతుండటం... తీర్చే వారు కనిపించకపోవడంతో కలెక్టరేట్ వైపు కదులుతున్నారు. మరోపక్క ప్రభుత్వంపై పలు వర్గాలు ఆందోళనకు పిలుపునిస్తున్నాయి. వీఆర్ఏల డిమాండ్లు నెరవేర్చాలి అన్నమయ్య జిల్లాలోని వీఆర్ఏల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఏపీ వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప ఆధ్వర్యంలో సుమారు 30 మంది వీఆర్ఏలు తమ డిమాండ్ల సాధనకై ఉద్యమించారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల రాష్ట్ర పిలుపు మేరకు ఇప్పటికే తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశామని, ఇప్పుడు కలెక్టరేట్ వద్ద ఉద్యమించినట్లు వివరించారు. వీఆర్ఏలకు సంబంధించి వెంటనే పే స్కేలు అమలు చేయాలని, రాత్రిపూట నైట్ డ్యూటీలు తప్పించాలని నినందించారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, వీఆర్ఏల సర్వీసులను పర్మినెంట్ చేయాలని, రికవరీ చేసిన డీఏలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు నినాదాలు చేశాక లోనికి వెళ్లి జిల్లా జాయింట్కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్కు వినతిపత్రాన్ని సమర్పించారు. మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయండి : ఏఐటీయూసీ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన మెడికల్ కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వైద్య విద్యను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకుందని, ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన ప్రజాధనాన్ని ప్రైవేట్ వారికి అతి చౌకగా కట్టబెట్టే పీపీపీ విధానం వైద్యరంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడంలో భాగమని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు. కళాశాలల ప్రైవేటీకరణకు జారీ చేసిన పీపీపీ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కబ్జాదారుల నుంచి చెరువును రక్షించాలిమదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె గ్రామంలోని ఓటుకుంట చెరువును అక్రమార్కులు కబ్జా చేశారని, వారి బారి నుంచి చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరారు. గత ప్రభుత్వంలో రీ సర్వే చేశారని, అయితే సర్పంచులు, వీఆర్ఓలు సక్రమంగా సర్వే చేయించకుండా రైతులకు 1బి అడంగల్ రాకుండా చేశారన్నా రు. డీకేటీ భూములకు ఇప్పటికీ కూడా 1బీ రావడం లేదన్నారు. 50 ఏళ్ల కిందట ఇచ్చిన భూములను ప్రభుత్వ భూమిగా మార్చారన్నారు. ఆయా భములకు 1బీ అడంగల్ వచ్చేలా చేయాలని కోరారు. కదం తొక్కిన కరెంటు ఉద్యోగులు -
రాజంపేటలో రూ.5కే టీ షర్ట్!
రాజంపేట : రాజంపేట పట్టణంలో రూ.5 లకే టీషర్ట్ ఇస్తామని ఆర్ఎస్ రోడ్డులోని ఓ రెడిమేడ్ షాపు నిర్వహకుడు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆదివారం ఉదయం పాత బస్టాండు నుంచి ఆర్ఎస్ రోడ్డులో ఉన్న దుకాణానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకూ ఉంటుందని సోషల్మీడియా వేదికగా ప్రచారం సాగడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసుల అనుమతి కూడాలేకుండా బిజినెస్ పోస్టింగ్లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంపై పలువురు పెదవి విరిస్తున్నారు. ఆఫర్లతో ట్రాఫిక్కు అంతరాయం కలిగించేందుకు కారణమైన షాపు నిర్వహకుడిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దుకాణం ఎదుట జనం తొక్కిసలాట -
ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
రాయచోటి టౌన్ : ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ, ఎస్ఎల్ బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు దండు వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు. రాయచోటి ఎన్జీవో హోంలో శనివారం జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన ఉద్యోగుల హక్కుల రక్షణకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఎంపికై న ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి డివి.రమణ, జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి నిత్యపూజయ్యలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాధ్యక్షుడు పల్లపుమహాదేవ, బడిశెట్టి దేవేంద్ర, బి.రవిశంకర్ పాల్గొన్నారు. -
ఫైనాన్షియర్ దారుణ హత్య
● ఇంటి పక్కనే హతమార్చి కుందూ నదిలో పడేసిన దుండగులు ● రెండు రోజులు గాలించి మృత దేహాన్ని గుర్తించిన పోలీసులుప్రొద్దుటూరు క్రైం : అవసరానికి అప్పులివ్వడమే ఆయన చేసిన నేరమా. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించమని అడిగిన పాపానికి రుణదాతనే దుండగులు హతమార్చారు. ప్రొద్దుటూరుకు చెందిన ఫైనాన్షియర్ కొండా వేణుగోపాల్ రెడ్డి (54) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు దారుణంగా హతమార్చి చాపాడు సమీపంలోని కుందూ నదిలో పడేశారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు ఊహించినట్టే ప్రముఖ వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి బాకీ దారుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. పోరుమామిళ్ల మండలం రెడ్డికోట గ్రామానికి చెందిన వేణుగోపాల్రెడ్డి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చి స్ధిరపడ్డారు. కొన్నేళ్ల వరకూ వైఎంఆర్ కాలనీలో నివాసం ఉండే వారు. జమ్మలమడుగు రోడ్డులోని మున్సిపల్ ప్లాట్లలో విశాలమైన భవంతి నిర్మించుకొని నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నారు. వేణుగోపాల్రెడ్డికి భార్య ప్రమీలాదేవి, కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి, కుమార్తె స్వప్న ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. కుమార్తె బీటెక్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. వేణుగోపాల్రెడ్డి తెలిసిన వారికి వడ్డీకి డబ్బులు ఇస్తూ గడువు ముగిసిన తర్వాత తిరిగి తీసుకునేవాడు. ఇలా పట్టణంలో పెద్ద మొత్తంలో అప్పులిచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి సమీపంలోనే కాపు కాచి.. వేణుగోపాల్రెడ్డి ఇల్లు జమ్మలమడుగు రోడ్డు పక్కన బొల్లవరం ప్లాట్లో ఉంది. ప్రధాన రహదారికి అతి సమీపంలో ఆయన ఇల్లుంది. శుక్రవారం సాయంత్రం 6.30 సమయంలో ఇంటి నుంచి స్కూటీలో అతను బయటికి వెళ్లాడు. రోజూ రాత్రి 8–15, 8–30 గంటల్లోగా ఇంటికి వచ్చేవాడు. అయితే శుక్రవారం రాత్రి 8.50 దాటినా వేణుగోపాల్రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుమార్తె స్వప్న ఫోన్ చేసింది. అతని ఫోన్ నంబర్లు పని చేయలేదు. రోడ్డుపై ఉన్నాడేమో చూసి రమ్మని వాచ్మెన్ను పంపించారు. అతను బయటికి వెళ్లగానే ఇంటి సమీపంలో వేణుగోపాల్రెడ్డి స్కూటీ పడిపోయి ఉంది. పక్కనే అతని చెప్పులతోపాటు కారం పొడి ఉండడంతో ఫైనాన్షియర్ కిడ్నాప్నకు గురయ్యాడని కుటుంబ సభ్యులు భావించారు. ఇదిలా ఉండగా రాత్రి 8 గంటల తర్వాత వేణుగోపాల్రెడ్డి ఇంటికి వస్తాడని భావించిన దుండగులు ప్రధాన రహదారిలోని ఆర్చీ వద్ద కాపు కాసినట్లు తెలుస్తోంది. స్కూటీలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్చీ దాటగానే దుండగులు అడ్డగించి, కళ్లలో కారం పొడి చల్లి ఘటనా స్థలంలోనే హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నాప్ చేసి అతన్ని ఎత్తుకెళ్లాలని ముందుగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వేణుగోపాల్రెడ్డి ఘటనా స్థలంలోనే మృత్యువాతపడడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కుందూలో పడేసినట్లు సమాచారం. కుటుంబసభ్యుల అనుమానమే నిజమైంది.. బాకీ తీసుకున్న వారు గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో కొందరిపై వేణుగోపాల్రెడ్డి కోర్టులో కేసు వేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కేసు తుది విచారణకు వచ్చినట్లు వేణుగోపాల్రెడ్డి భార్య ప్రమీలాదేవి మీడియాతో వెల్లడించారు. కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన బాకీ దారులు తన భర్తను కిడ్నాప్ చేసి హాని తలపెట్టాలని చూస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు ప్రమీలాదేవి అనుమానమే నిజమైంది. బాకీ దారుల్లో కొందరు ఆమె భర్తను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో వేణుగోపాల్రెడ్డి బంధువు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుందూలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి కిడ్నాప్నకు గురయ్యాడని తెలిసిన వెంటనే ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్రెడ్డి ఆధ్వర్యంలో రాజుపాలెం ఎస్ఐ వెంకటరమణ, రూరల్ ఎస్ఐ రాజుతో కలిసి నాలుగు టీంలుగా ఏర్పడి రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కారులో ఫైనాన్షియర్ను తీసుకెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. ఇలా కారు వెళ్లిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో చాపాడు సమీపంలోని కుందు బ్రిడ్జి వద్ద నదిలో ఆదివారం వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక రెస్క్యూ టీంతో కలిసి అరుణ్రెడ్డి నదిలోని మృతదేహాన్ని వెలికి తీశారు. కుందూ నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మృతదేహాన్ని వెలికి తీయడం అతి కష్టంగా మారింది. ఎట్టకేలకు శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. అతని మృతదేహాన్ని చూపి భార్య ప్రమీలాదేవి, కుమార్తె స్వప్న బోరునా విలపించసాగారు. కేసులో అనుమానం ఉన్న కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలను తమదైన పద్దతిలో వారి నుంచి రాబట్టే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. -
అక్రమ ప్రమోషన్లపై ప్రభుత్వానికి నివేదిక
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ మదనపల్లె సర్కిల్–3 పరిధిలో జరిగిన అక్రమ పదోన్నతుల వ్యవహరం కొలిక్కి వచ్చింది. హంద్రీ–నీవాలో ‘అక్రమ ప్రమోషన్’ శీర్షికన అగస్టు 7న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక పంపాలని ఈఎన్సీ నుంచి మెమోలు జారీ అయ్యాయియి. ఈ విషయంలో ఎస్ఈ విఠల్ప్రసాద్ వివరాలతో నివేదికను పంపడం ఆలస్యంగా తెలిసింది. ఏపీఈఎస్ఎస్ నిబంధనల షెడ్యూల్ ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి అవసరమైన అర్హత కోసం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నిర్వహించే ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్స్ మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. నియామకాలు, బదిలీలు, పదోన్నతులను పరిగణలోకి తీసుకునేటప్పుడు సర్వీసు నియామకాల జీవో, సూచనలను కచ్చితంగా పాటించాలి. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగుల విషయంలో పాటించలేదని తేలింది. మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి మూడు ప్రమోషన్లను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని నిర్ధారించారు. ఎస్ఈ చిట్టిబాబు టెక్నికల్ అసిస్టెంట్గా ఉద్యోగ నియామకం చేయగా ఎస్ఈ పి.కృష్ణ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా, ఎస్ఈ బీవీ.సుబ్బారావు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా, ఎస్ఈ సీఆర్.రాజగోపాల్ టెక్నికల్ ఆఫీసర్గా ఉద్యోగోన్నతి కల్పించారని, ఆ సమయంలో పనిచేసిన డీఎస్ఈ, సూపరింటెండెంట్ వివరాలను పేర్కొన్నారు. అలాగే కుప్పం డివిజన్లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కె.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్లో పని చేస్తున్న పి.ఖాదర్బాషాలకు అర్హతలేకున్నా టెక్నికల్ అిసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులను ఎస్ఈ బీవీ.సుబ్బారావు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు వెలుగులోకి రాలేదు. నివేదికతో ఉద్యోగుల్లో కలవరం నెలకొంది. -
నాణ్యత నీళ్లకే ఎరుక
కాలువ పక్కన పడిన గండి మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)కు కాంక్రీట్ లైనింగ్ పిడకలా ఊడిపోవడం పనుల నాణ్యతను ప్రశ్నించేలా చేస్తోంది. బి.కొత్తకోటలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం నీళ్లు వాగులు, వంకలు, చెరువుల్లోకి ప్రవహించాయి. ఇదే విధంగా బి.కొత్తకోట–బడికాయలపల్లె మార్గం సమీపంలోని పీబీసీ కాలువ 102 కిలోమీటర్ వద్ద కాలువకు వేసిన కాంక్రీట్ లైనింగ్ కూలిపోయింది. లైనింగ్ ఒకరకమైన ఆకారంలో కూలగా అంచున చీలింది. దానివద్ద నీళ్లు కాలువ నుంచి గండిపడి బయటకు వెళ్లాయి. ఇలా ఎందుకు జరిగింది అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైనింగ్ పనుల్లో నాణ్యత లోపించిందా లేక మరేదైనా జరిగిందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పలుచోట్ల కాలువలో నీటి ప్రవాహం వెళ్తున్న ఎత్తులో కాంక్రీట్ పనులు దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే నీటి ప్రవాహం తగ్గాక కాని కాంక్రీట్ లైనింగ్ పనులపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కానీ 102 కిలోమీటర్ వద్ద ఊడిన కాంక్రీటు లైనింగ్ వ్యవహరంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాణ్యతలేక ఊడిందా లేకపోతే నీటి మళ్లింపు కోసం ఎవరైనా తెగ్గొట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ప్రాజెక్టు ఎస్ఈ విఠల్ ప్రసాద్ మాట్లాడుతూ కాంక్రీట్ దెబ్బతిన్న ప్రాంతానికి చెందిన రైతులు లైనింగ్ను తెగ్గొట్టడం వల్లే ఊడిపోయిందని,నాణ్యతా లోపం కాదని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈఈ, డీఈలకు ఆదేశించగా పరిశీలించినట్లు చెప్పారు. -
పూలతోట.. నష్టాలబాట
గుర్రంకొండ: పూలతోటలు సాగు చేసిన రైతులకు ప్రస్తుతం కష్టకాలం దాపురించింది. మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆరుగాలం కష్టపడి చమటోడ్చి పండించిన పూలకు గిట్టుబాటు ధరల్లేక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో కిలో పూల ధరలు రూ.10కి పడిపోయాయి. రానున్న దసరాపండుగ సమయంలోనైనా ధరలు పుంజుకొంటాయనే ఆశతో రైతులు ఉన్నారు. 1048 ఎకరాల్లో పూల సాగు... జిల్లాలో ప్రస్తుత సీజన్లో1048 ఎకరాల్లో బంతి పూలతోటల సాగు చేపట్టారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో తోటలు అదునుకొచ్చి దిగుబడి ప్రారంభమైంది. ఎకరం పూలతోట సాగు చేయాలంటే రూ.1.50లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఖర్చు వస్తుంది. పూలనారు కొనుగోలు నుంచి పొలం దుక్కులు, డ్రిప్ మెటీరియల్, మల్చింగ్ఖర్చు, కోతకొచ్చేవరకు రైతులకు ఈ పాటి ఖర్చు వస్తుంది. మార్కెట్లో కనీసం కిలో పూల ధర రూ.30 నుంచి 50లోపు ఉంటే రైతుకు పెట్టుబడి చేతికొస్తుంది. ● పది రోజులుగా మార్కెట్లో పూల ధరలు పతనమయ్యాయి. పదిహేను రోజుల కిందట మార్కెట్లో కిలో రూ. 70 నుంచి రూ.85వరకు ధరలు పలికాయి. తదనంతరం పరిణామాలతో బంతిపూల ధరలు మార్కెట్లో రోజురోజుకు తగ్గిపోయాయి. ప్రస్తుతం కిలో రూ.12 నుంచి రూ.10 వరకు ధరలు పలుకుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గతంలోఇదే సీజన్లో కిలో రూ. 60 వరకు ధరలు పలికాయి. అదే ఆశతో రెండునెలలుగా పూలతోటల పెంపకం చేపట్టిన రైతులకు నిరాశే మిగిలింది. వర్షాలకు దెబ్బతిన్నతోటలు: ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలకు బంతిపూల తోటలు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించడంలేదని రైతులు వాపోతున్నారు.35 కిలోల పూల బ స్తా బెంగళూరుకు తరలించాలంటే రూ. 250 వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.10 పలుకుతోంది. ఈలెక్కన ఒక బస్తాకు రూ.525 మా త్రమే ఒక్కోసారి గిట్టుబాటు లభిస్తోంది. అంత దూరం మార్కెట్కు తీసుకెళ్లినా బస్తాపైనా రూ.275 మాత్రమే రైతుకు గిట్టుబాటు అవుతోంది. దీంతో పూలను మార్కెట్లకు తరలించినా ప్రయోజనం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పూల సాగు, ధరల వివరాలు రానున్న దసరా పండుగ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకొన్నారు. ధరలు పతనమవడంతో వ్యాపారులు పూల కొనుగోలుపై పెద్ద ఆసక్తి చూపించడంలేదు.జిల్లాలో సాగు చేసేపూలను మదనపల్లె, కడప, తిరుపతి, బెంగళూరు, చైన్నె లాంటి పట్టణాలకు తరలిస్తుంటారు. ఇటీవల పూల బస్తాలతో బెంగళూరు మార్కెట్కు వెళ్లిన రైతులకు కనీసం వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు దసరా పండుసీజన్లో గిట్టుబాటుధరలు లభిస్తాయనే ఆశతో ఉన్నారు. పూల ధరలు భారీగా పతనం ఆందోళనలో అన్నదాతలు జిల్లాలో 1048 ఎకరాల్లో పూలసాగు ధరలు పడిపోయాయి ప్రస్తుతం మార్కెట్లో పూలధరలు పడిపోయాయి. పదిహేనురోజుల కింద కిలో రూ.65 వరకు ఉండేది. ఇప్పుడు అష్టకష్టాలు పడి మార్కెట్కు పూలను తరలించినా అంతంత మాత్రంగానే ఆదాయం వస్తోంది. – నారాయణ, పూలరైతు,మొరంపల్లె పెట్టుబడి నష్టపోయాం రెండు ఎకరాల్లో పూలతోటలు సాగు చేశాను. వర్షాలతో తోటలు దెబ్బతిన్నాయి.ఇప్పటివరకు రూ.3 లక్షలు ఖర్చు వ చ్చింది. ప్రస్తుతం ధరలు పడిపోయాయి. దీంతో పెట్టుబడి నష్టపోయాం. – సావిత్రమ్మ, పూలరైతు, కొత్తపల్లె నియోజకవర్గం పూలసాగు 3 నెలలుగా ధరలు (ఎకరాల్లో) (కిలోల్లో) పీలేరు 325 జూన్ 15 రూ. 45 మదనపల్లె 245 జులై 01 రూ.40 తంబళ్లపల్లె 295 జులై 15 రూ. 57 రాయచోటి 55 ఆగస్టు 01 రూ.75 రైల్వేకోడూరు 63 ఆగస్టు 15 రూ.85 రాజంపేట 65 సెప్టెంబర్ 17 రూ.10 -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 22వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒకక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో 24న ధ్వజస్తంభానికి సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు. ఆదివారం ఆమె ఇక్కడ మాట్లాడుతూ..ధ్వజస్తంభం పునరుద్ధరణలో భాగంగా కొన్ని రోజుల కిందట బాలాలయం ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ధ్వజస్తంభం పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో మంగళవారం సంప్రోక్షణకు అంకురార్పణ చేసి, బుధవారం బాలాలయంలో ఉంచిన కలిశంలోని ప్రాణ ప్రతిష్టను ధ్వజస్తంభంలోకి సంప్రోక్షణ ద్వారా పంపనున్నట్లు చెప్పారు. లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయంతోపాటు మద్దిరేవుల గ్రామం, వంకగడ్డ రాచపల్లి సమీపంలో వెలసిన శ్రీ మారెమ్మ ఆలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవార్లను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తల్లీ ..కాపాడమ్మా అంటూ అమ్మవార్లను వేడుకున్నారు. పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్సీసీ సి సర్టిఫికెట్ క్యాడెట్ సి. నాగేంద్ర వర్మ ఆలిండియా ధాల్ సైనిక్ క్యాంప్లో రజిత పతకం సాధించారు.ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ తరపున న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో ధాల్ సైనిక్ క్యాంపు నిర్వహించారు. ఇందులో నాగేంద్ర వర్మ ఫైరింగ్ ఈవెంట్లో ప్రతిభ కనబరిచినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. అంతేగాకుండా నాన్ మెయిన్డ్ టగ్ ఆఫ్ వార్ పోటీలో రజిత పతకం సాధించాడని, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నాడని తెలిపారు. నాగేంద్ర వర్మను చాన్స్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాథ్ అభినందించారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయం కబడ్డీ పురుషుల క్రీడా జట్టు ఎంపికలు ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్నట్లు వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ రామసుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో పాల్గొనదలచిన క్రీడాకారులు వైవీయూ అనుసంధానమైన కాలేజీల్లో అభ్యసించినవారై ఉండాలన్నారు. ఎంపికలకు వచ్చే సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ లేదా ఫిజికల్ డైరెక్టర్తో సంతకం చేసినటువంటి ఎలిజిబిలిటి ఫామ్ను, కాలేజీ స్టడీ సర్టిఫికెట్పై ప్రిన్సిపాల్తో సంతకం చేయించాలన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జులై 1వ తేదీ 2025 నాటికి 17 ఏళ్లు నిండి ఉండి 25 ఏళ్లలోపు ఉన్న క్రీడాకారులు అర్హులని తెలిపారు. పోటీలకు వచ్చిన క్రీడాకారులు ఉదయం 9 గంటలలోపు తమ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని తెలిపారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
మైదుకూరు : విజయవాడ నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వరదాయపల్లె సమీపంలో శనివారం బోల్తా పడింది. బస్సు డ్రైవర్తో సహా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. విజయవాడ నుంచి వస్తున్న బస్సులో జీవీసత్రం ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు బయలుదేరారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో నెల్లూరు–బళ్లారి జాతీయ రహదారిపై వరదాయపల్లెకు సమీపంలో ఆపాలని కండక్టర్ను విద్యార్థులు కోరారు. ఆ మేరకు డ్రైవర్ కొన్ని మీటర్ల మేరకు బైపాస్పై ఉన్న బస్సును రివర్స్ చేసేందుకు యత్నించాడు. దాంతో బస్సు అదుపుతప్పి బోలాం్త పడింది. డ్రైవర్తోపాటు బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కడప డిపో అధికారుల సమాచారంతో గ్యారేజీ కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును యథాస్థితికి తెచ్చారు. -
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
● మహిళను కాపాడిన పోలీసులు ● సిబ్బందిని అభినందించిన ఎస్పీకడప కోటిరెడ్డిర్కిల్ : కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళను బ్లూ కోల్ట్ పోలీసులు రక్షించారు. జిల్లా ఎస్పీచే అభినందనలు అందుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. కుటుంబ కలహాలతో కడప ఎర్రముక్కపల్లి సమీపంలో ఉంటున్న ఓ మహిళ, ఇద్దరు పిల్లలను తీసుకుని ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో భాకరాపేట రైల్వే గేట్ వద్ద ట్రాక్పై నడచి వెళ్తోంది. విధుల్లో ఉన్న ట్రాక్మెన్ కిశోర్ గుర్తించి 112కు సమాచారం చేరవేశారు. గస్తీలో ఉన్న బ్లూకోల్ట్ సిబ్బంది, కానిస్టేబుళ్లు రమాకాంత్రెడ్డి, శ్రీనివాసులు రంగంలోకి దిగి రైలు కింద పడి తనువు చాలించాలనుకున్న మహిళ, ఇద్దరు పిల్లలను సురక్షితంగా తీసుకువచ్చారు. కుటుంబసభ్యులకు అప్పగించి స్థానికుల మన్ననలు పొందారు. నిమిషం ఆలస్యమైనా స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు క్రిందపడి ముగ్గురు విగత జీవులుగా మిగిలేవారు. మహిళకు కౌన్సిలింగ్ నిర్వహించి బంధువులకు అప్పగించారు. సురక్షితంగా కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడడం అత్యంత భయంకరమైన నిర్ణయమని, ఉద్వేగంతో క్షణాల్లో ఇక జీవించలేనంటూ స్వస్తి పలకడం పొరపాటు నిర్ణయమని వివరించారు. సమస్యలతో సతమతమవుతున్న వారు ఎందరో కాలంతో పోరాడి ఎలా బ్రతుకుతున్నారో చూసి, ఆత్మస్థైర్యంతో జీవించాలని ఎస్పీ సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో నాయబ్ రసూల్ మృతి
పోరుమామిళ్ల : స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం రాత్రి మోటార్ బైక్ను ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో షేక్ నాయబ్రసూల్(45) గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్నగర్కుకు చెందిన రసూల్ కుమార్తె కోసం వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. రసూల్ తీవ్రంగా గాయపడి కింద పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రసూల్కు భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు. రసూల్ భార్య రెహానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చ మీడియా రాతలకు ప్రజలే బుద్ధి చెబుతారు
రైల్వేకోడూరు అర్బన్ : చంద్రబాబు డైరెక్షన్లో వక్ర భాష్యాలతో రాతలు రాస్తున్న పచ్చ పత్రికలకు ప్రజలే బుద్ధి చెబుతారని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా విలువలు కాలరాస్తూ రాసేవారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వైస్.జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజూ వైఎస్.భారతి జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. తనకు నచ్చిన సేవా కార్యక్రమాలు, పేదలకు సాయం చేయడం తప్ప.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఆర్భాటం చేయలేదన్నారు. పేదల హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల కోరు అని నిరూపించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రచురించడానికి వారికి సమయం లేదా అని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు అధికంగా పెంచడం, నిత్యావసర ధరలు అధికమవడం, పాఠశాలలు, పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రవేటుపరం చేసి దండుకో వాలని చూడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల -
పనుల్లో నాణ్యత డొల్ల
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణంలో డొల్లతనం బయటపడుతోంది. నంద్యాల–జమ్మలమడుగు 167 నెంబర్ జాతీయ రహదారి పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అప్పడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చే అధికారులు నామామాత్రంగా తనిఖీలు చేసి పోతున్నారనే విమర్శలున్నాయి. కీలకంగా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ ఇంజినీర్లు పనులు చేస్తున్నారేగానీ నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెన్నానదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడే నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. కనీసం 16 ఎంఎం కడ్డీలను ఉపయోగించితేనే పిల్లర్లు పటిష్టంగా ఉంటాయి. కానీ కంపెనీ 10 ఎంఎం, 8 ఎంఎం, 6 ఎంఎం కడ్డీలు రెండు, మూడు కడ్డీలు 16ఎంఎం ఉపయోగించడం జరుగుతోంది. దీంతో ఈ పిల్లర్లు ఎంత వరకు నిలబడుతాయోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిజైన్ ప్రకారమే పిల్లర్ల నిర్మాణం పెన్నానదిపై హై లెవల్ వంతెన నిర్మాణం జరుగుతోంది. డిజైన్ ప్రకారమే జరుగుతున్నాయి. ఒక్కొక్క పిల్లర్ ఒక్కో రకంగా ఉంటాయి. – సురేందర్రెడ్డి, ఏఈ, జమ్మలమడుగు -
ఆటో బోల్తా
కమలాపురం : కమలాపురం పట్టణం క్రాస్ రోడ్డు ఆర్చి వద్ద గుంతల్లో పడి ఆటో బోల్తా పడింది. కడప నుంచి కమలాపురం పట్టణంలోనికి ఆటో వస్తోంది. ఆర్చి వద్ద పెద్ద గుంత ఉంది. అందులో వర్షపునీరు నిలవడంతో గుర్తించలేక అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. అదే స్థలంలో ఇది వరకూ ఓ వాహనంతోపాటు, మోటార్ బైక్ బోల్తా పడ్డాయని స్థానికులు తెలిపారు. ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని ఉమ్మారెడ్డిపల్లె సమీపంలో లారీ–మినీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. పిడుగురాళ్ల నుంచి అనంతపురానికి పెయింట్స్ లోడ్తో ఓ లారీ ప్రయాణిస్తోంది. ఎదురెదురుగా ఉమ్మారెడ్డిపల్లి సమీపంలో రెండూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలోనే ఇరుక్కపోయి డ్రైవర్ రాజేష్ను స్థానికులు బయటకు తీసారు. ఆసుపత్రిలో పాము కలకలంజమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము ఆదివారం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశం ఉండడం, ఇటీవల వర్షాలు పడడంతో గర్భిణులు ఉండే వార్డులోకి పాము ప్రవేశించింది. గమనించిన రోగులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. సెక్యూరిటీ వచ్చి కర్రతో కొట్టి చంపివేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఒంటిమిట్ట రామయ్యకు పూజలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాల్లో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు రెండు చోట్ల ఆలయ మర్యాదలతో స్వాగతం లభించింది. ముందుగా రామయ్య మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సౌమ్య నాథుడి సన్నిధిలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమ, రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై కూలిన నీలగిరి చెట్టుమదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం సమీపాన కంకరమిషన్ వద్ద ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా నీలగిరి చెట్టు కూలింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భూమి బాగా తడిచి ఉండడంతో బలంగా వీస్తున్న ఈదురుగాలులకు చెట్టు నేలకొరిగింది. సమయానికి రోడ్డుపై వాహన, జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు విషయాన్ని పంచాయతీ అధికారులకు తెలుపడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు. తెలుగు తమ్ముళ్లపై కేసులు నమోదు.. రాయచోటి : ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న తెలుగు తమ్ముళ్లపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం పట్టణంలోని మదనపల్లె మార్గంలో టీడీపీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై మరో దాడులు చేసుకునే విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తెలుగు యువత అధ్యక్షుడు జాబీర్, మరో తెలుగు మైనార్టీ నాయకుడు సయ్యద్లకు రక్త గాయాలయ్యాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ సీరియస్ కావడంతో రాయచోటి అర్బన్ పోలీసులు ఇరువురిపై ఆదివారం కేసులు నమోదు చేశారు. అక్రమంగా కలప తరలింపుమదనపల్లె రూరల్ : అక్రమంగా కలప తరలిస్తున్న ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని అటవీ అధికారులు జరిమానా విధించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న చెట్లు కొందరు తొలగించి ముక్కలుగా చేసి ట్రాక్టర్లో తరలించేందుకు ప్రయత్నించారు. ఇన్చార్జ్ డీఆర్వో శివకుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, అనుమతులు లేకుండా కలప తరలిస్తున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శంకర్రెడ్డిని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అనుమతితో తరలిస్తున్నామని, కావాలంటే ఫోన్ చేయిస్తానని చెప్పాడు. దీంతో అటవీ అధికారులు ఎమ్మెల్యే షాజహాన్బాషాకు ఫోన్ చేశారు. ఆయన స్పందిస్తూ తాను ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో ట్రాక్టర్ను సీజ్ చేసి అటవీ కార్యాలయానికి తరలించారు. ఎఫ్ఆర్వో జయప్రసాదరావు విచారించి రూ.8,500 జరిమానా విధించారు. -
వీఆర్ఏల జిల్లా కమిటీ ఎన్నిక
రాజంపేట రూరల్ : ఏపీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామ సేవకుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందంగీసాహెబ్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా సీహెచ్.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడిగా మోడీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కొరముట్ల సుధాకర్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎ.తిరుపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్గా పి.నరసింహులు, ఉపాధ్యక్షుడిగా ఇ.మధుబాబు, కే.మణి, ఎం.రామచంద్రయ్య, షేక్ ఖాదరవలి, కె.రమణయ్య, బి.రత్నమ్మ, ఎన్.లావణ్య, సహాయ కార్యదర్శులుగా ఎన్.నరసింహులు, ఎం.కోటేశ్వరరావు, బి.హరీష్, ఎన్.నరసయ్య, కోశాధికారిగా లకీ్ష్ మకర్, కమిటీ సభ్యులుగా ఎం.పీరయ్య, ఎ.శ్రీను, బి.సుబ్రహ్మణ్యం, పి.కులశేఖర్, ఇ.బలరామ్, సురేంద్ర, పి.గిరిజ, తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
ఎర్రగుంట్ల : పట్టణంలోని ప్రకాశ్ నగర్లో నివాసముంటున్న నాగన్న కుమారుడు వలస గాళ్ల నాగరాజు(40) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అదివారం తెలిపారు. ప్రకాశనగర్ కాలనీకి చెందిన నాగరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు, ఇతడికి భార్య పెద్దక్క, కుమారుడు ఉన్నారు. నాగరాజుకు అప్పులు అధికంగా ఉండడంతో వాటిని తీర్చలేదని భావించి ఈ నెల 18న బయటకు పోయాడు. ఇప్పటివరకూ రాకపోవడంతో అతని భార్య పెద్దక్క పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు యర్రగుంట్ల పోలీసులు తెలిపారు. ఇంటి సామగ్రి దగ్ధంచింతకొమ్మదిన్నె : మండలంలోని టి.క్రిష్ణాపురం గ్రామంలో ఉంటున్న నాగూరు భార్గవరెడ్డి ఇంట్లో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ, బీరువాలు, అందులోని సర్టిఫికెట్లు, బట్టలు, డబ్బులు కాలిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో దాదాపు మూడు లక్షల రూపాయల విలువ మేర నష్టం జరిగినట్లు బాధితుడు భార్గవరెడ్డి తెలియజేశారు. పల్లెల్లో జోరుగా పేకాటసాక్షి టాస్క్పోర్స్ : కొండాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి నాయకుల కనుసన్నుల్లో పేకాట జోరుగా సాగుతోంది. యర్రగుడి పునరావాస కేంద్రం సమీపంలోని సపోట తోట, దొబ్బుడుపల్లె పమీపంలోని కంపచెట్ల వద్ద, కె.సుగుమంచిపల్లె పునరావాస కాలనీలోని చెట్ల వద్ద, కొండాపురం ఈసర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ చీనీ తోటలో చాలామంది పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. అసాంఘిక కార్యకలపాలపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. కేబుల్ వైర్లు చోరీపులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె గ్రామం శోచరీపురం పొలం పరిధిలో 20మంది రైతుల తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం కేబుల్ వైర్లు అపహరించారు. రైతులు మాట్లాడుతూ పంట పండక, గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తోటల వద్ద బోర్ల కేబుల్ను అపహరించడంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతికడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కృష్ణాపురం రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో దిగువ రైలు పట్టాల వద్ద మృతిచెందిన వ్యక్తి 40–45 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వైద్య కళాశాలలకు మంగళం పాడిన ప్రభుత్వం
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ వైద్య కళాశాలలకు కూటమి ష్ట్రప్రభుత్వం మంగళం పాడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పాడె కట్టి శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో వ్యాపారానికి పెట్టిందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేయడంతో పాటు వైద్యవిద్యను అభ్యసించాలనుకున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తోందన్నారు. ప్రైవేటీకరించకుంటే ఆయా కళాశాలల్లో ఓపీ, మెడికల్ టెస్టులు, మందులకు ఎలాంటి ఫీజులు వసూలుచేయమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీ–4 పేరుతో కార్పొరేటైజేషన్, కమర్షిలైజేషన్, కమ్యూనలైజేషన్, సెంట్రలైజేషన్ అమలు చేస్తోందన్నారు. బనకచర్లకు రూ.81వేల కోట్లరూపాయలు ఖర్చు చేసే రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు ఎందుకు ఖర్చుపెట్టలేకపోతోందని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలో కొనసాగించేలా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, తీర్మానం చేసి ఆమోదం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి, రెడ్డి, నరేష్, ఏఐఎస్ఎఫ్ మాధవ్, దేవా, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. -
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : ఏళ్ల తరబడి పనిచేస్తున్న విద్యుత్తు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో శనివారం రాయచోటి పట్టణంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్కం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేయాలని, థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. అనంతరం కార్మికులకు విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, డీఈ యుగంధర్ మద్దతు తెలిపారు. డిమాండ్ల సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరి, ఏవీ.రమణ, రెడ్డప్ప, కిరణ్, శ్రీనివాసనాయుడు, అమరనాథరెడ్డి, రామాంజి, శ్రీనివాసులు, స్వాతి, సుజాత, సరస్వతి, నాగేష్గౌడ్, శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణ, సురేంద్ర, నారాయణ, కార్మికులు పాల్గొన్నారు. -
‘జై భీమ్’ కొనసాగాలంటే
రాజంపేట: రాష్ట్రంలో జైభీమ్ నినాదం కొనసాగాలంటే జగనన్న పాలన రావడం తప్పనిసరి అని, ఆ దిశగా జగనన్న దళితఫోర్స్ సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజెఆర్ సుధాకర్బాబు అన్నారు. శనివారం ఆకేపాటి ఎస్టేట్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి అధ్యక్షతన జిల్లా ఎస్సీసెల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులను, సామాజిక అన్యాయాన్ని ప్రతి ఒక్క దళితుడు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గంలో దళితులను బహిష్కరణకు గురైన సంఘటనను ఆయన వివరించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మాదిగపల్లైపె దాడులు చేసిన తరుణంలో ప్రాణరక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నా ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేసే విధంగా తీసుకున్న నిర్ణయం వల్ల పరోక్షంగా సామాజిక అన్యాయం చేసినట్లే అని అన్నారు. కూటమి దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును చరిత్ర ఎన్నటికీ మరిచిపోదన్నారు. చంద్ర బాబు పాలనలో జరుగుతున్న సామాజిక అన్యాయంపై తిరుగుబాటుతప్పదన్నారు. సూపర్సిక్స్లో మూడు పథకాలతో దళితులకు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దళితుల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రాజకీయంగా, ఆర్ధికంగా దళితులను ఎదగడానికి జగనన్న పాలన దోహదపడిందని గుర్తుచేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వచ్చినా ఈ సారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యమని జోష్యం చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు ఎస్సీ కమిటీలను బలోపేతం చేస్తామన్నారు. ఆదిశగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో మండల, గ్రామ, నియోజకవర్గ స్ధాయి కమిటీల నియామకం పూర్తవుతోందన్నారు. జిల్లాలో ఎస్సీ కమిటీలు పూర్తి చేయడంలో ముందంజలో ఉందని, ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి కృషి ఉందని కొనియాడారు. ఎస్సీల సంక్షేమాన్ని చంద్రబాబు మరిచారన్నారు. ఎస్సీ,ఎస్టీలను డిప్యూటీసీఎం చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. డీబీటీ విధానంలో రాష్ట్రంలో ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికే రూ.9,154 కోట్లు ఆర్ధిక ప్రయోజనం కల్పించారన్నారు. జగన్మోహనరెడ్డి మళ్లీ సీఎం చేసుకోవాలని, లేదంటే నష్టపోతామని దళిత సామాజికవర్గాలు గుర్తుంచుకోవాలన్నారు. ● ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనను, ఇప్పటి కూటమి పాలనను దళితలు బేరీజు చేసుకుంటున్నారన్నారు. బాబు పాలన దళితవర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో పెద్దపీట వేసినట్లు చెప్పారు జగనన్నకు దళితులు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజంపేటలో మార్కెట్యార్డు చైర్మన్ ఎస్టీకి రిజ్వరుడ్ అయితే, దానిని మార్చి ఓసీ నేతకు కట్టబెట్టడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం సామాజిక అన్యాయం చేస్తోందని అవగతమవుతోందన్నారు.వైఎస్సార్సీపీ దళితనేతలు పులిసునీల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు రంగాల కమలాకర్, నందలూరు మండల ఉపాధ్యక్షుడు నాయనపల్లె అనుదీప్, రమణ, చంద్ర, జయరామచంద్ర, మోహన్, తిప్పన దుర్గయ్య, అంజనప్ప, లింగం లక్ష్మీకర్, చిన్నయల్లయ్య, ఎముక దుర్గయ్య, నాగసుబ్బయ్య, భక్తుడు, రామ్మోహన్లు ప్రసంగించారు. అంతకుముందు రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు నివాళులు అర్పించారు. సమావేశంలో డీసీఎంస్ మాజీ చైర్మన్ దండుగోపి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చుక్కా అంజనప్ప, వైస్ఎంపీపీ బాబు, జెడ్పీటీసీ దాసరి పెంచలయ్య, కాకిచంద్ర, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళ కార్యదర్శి బీరంగి రేవతి, నేతలు బీఎం కుసుమకుమారి, జీ.నాగమణి, రాజంపేట ఎంపీపీ ఆరెళ్ల రమణమ్మ యాదవ్, రైల్వేకోడూరు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు తిప్పన దుర్గయ్య, రాయచోటి నియోజకవర్గ అధ్యక్షుడు అంకె ఆంజనేయులు,బూత్కమిటి నియోజకవర్గ అధ్యక్షుడు తిప్పన నాగభూషణం, రెడ్డయ్య, నాగరాజు, సురేష్, చలపతి, నాగరాజు,ఓబులేశు, ప్రసాద్,నాగయ్య, రెడ్డప్ప, ఆంజనేయులు,సాయికుమార్,సంతోష్, రామాంజులు, శ్రీనివాసులు, పవన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఎస్సీసెల్నేతలు, ఆకేపాటి ఎస్టేట్లోని ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీసెల్రాష్ట్ర అధ్యక్షుడు టీజెఆర్ సుధాకర్బాబు దళితవర్గాలను చైతన్యవంతులు చేయాలి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై దళితవర్గాలను చైతన్యం చేయాల్సిన బాధ్య త ఎస్సీ, ఎస్టీ అనుబంధ సంఘాల నేతలపై ఉంది. కూటమి ప్రభుత్వం పాల నలో విఫలమైంది. దళితులు ఎప్పుడూ వైఎస్సార్కుటుంబానికి వెన్నుదున్నగా ఉంటారన్నారు. దివంగత వైఎస్సార్, పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే దళితులకు ఎనలేని అభిమానం. –ఆకేపాటి అమరనాఽథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట కార్యకర్తలకే పెద్దపీట వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పెద్దపీట. జగన్ 2.0 పాలన తప్పకుండా వస్తుంది. దళితుల అభ్యున్నతి జగనన్నతోనే సాధ్యం. సమష్టి కృషితో జగన్ను మరోసారి సీఎం చేసుకుందాం. అన్ని వర్గాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవడం చంద్రబాబు నైజం. దళితులకు వైఎస్సార్, జగన్ల హయంలోనే న్యాయం జరిగింది. –గడికోట శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, వైఎస్సార్సీపీ కూటమి పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయి కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయి.రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత దళితులు, మైనార్టీలు, పేదలపై ఉంది. –నిసార్ అహమ్మద్, ఇన్చార్జి, మదనపల్లె కూటమి పాలనలో సామాజిక అన్యాయం సూపర్సిక్స్ పథకాలతో దళితులకు గుండుసున్న వైఎస్సార్సీపీ ఎస్సీసెల్రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబు -
వీఆర్ఏలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం
రాజంపేట రూరల్ : రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం అడుగడుగునా విస్మరిస్తోందని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ మండిపడ్డారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఎ)ల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో బందగీ సాహెబ్ మాట్లాడుతూ వీఆర్ఎలకు 8 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదని వాపోయారు. జీతం బెత్తెడు ఇస్తూ అక్రమంగా బండ చాకిరీ చేయించుకుంటాన్నారని వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పేస్కేల్ అమలు చేయాలన్నారు. అనంతరం ఎన్జీఒ హోమ్ నుంచి సబ్ కలేక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ భావనకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సీహెచ్.చంద్రశేఖర్, రవికుమార్, మధు, మోడీప్రసాద్, లక్ష్మీకర్, మని, నరసింహులు, కోటీ, తిరుపాలు, ఖాదరవల్లి, లావణ్య, రత్నమ్మ, తదితరులు పాల్గొరు. -
కళ్లల్లో కారం చల్లి.. ఫైనాన్షియర్ కిడ్నాప్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ప్రముఖ ఫైనాన్షియర్ వేణుగోపాల్రెడ్డిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం రాత్రి స్కూటీలో ఇంటికి వస్తుండగా దారి మధ్యలో కాపు కాచిన దుండగులు కళ్లలో కారంపొడి చల్లి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొల్లవరం ప్రాంతానికి చెందిన వేణుగోపాల్రెడ్డి కొన్నేళ్ల క్రితం జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం మున్సిపల్ ప్లాట్లలో విశాలమైన భవంతి నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. ఆయన వడ్డీకి అప్పులిస్తుంటాడు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలు కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో కుమార్తె స్వప్న వేణుగోపాల్రెడ్డికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్లో ఉంది. మరో నంబర్ అందుబాటులో లేదు. కొద్ది సేపటి తర్వాత వాచ్మెన్ బయటికి వెళ్లి చూడగా జమ్మలమడుగు రహదారిలోని ఆర్చి వద్ద వేణుగోపాల్రెడ్డి స్కూటీ కిందపడిపోయి ఉంది. వాచ్మెన్ కేకలు వేయడంతో ప్రమీలాదేవి, కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. స్కూటీ పక్కనే వేణుగోపాల్రెడ్డి చెప్పులతోపాటు కారంపొడి పడి ఉండటంతో ఎవరో ఆయనను కిడ్నాప్ చేశారని భావించిన కుటుంబ సభ్యులు బోరున విలపించసాగారు. రూరల్ ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి రాత్రంతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా కొందరు వ్యక్తులు కారులో వేణగోపాల్రెడ్డిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యే క బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పా రు. తమకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్లే తన భర్త వేణుగోపాల్రెడ్డిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి ఉంటారని ప్రమీలాదేవి తెలిపారు. తమకు బాకీ ఉన్నవాళ్లు తన భర్త కు హాని తలపెట్టేలా ఉన్నారని ఆమె రోదించింది. -
ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనియన్ల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుంది. టీఎన్టీయూసీ యూనియన్కు చెందిన మనోహర్, పులి సుధాకర్రెడ్డిలకు స్వల్పంగా గాయలయ్యాయి. యూనియన్ నాయకులు కలమల్ల పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయగా పోలీసులు సర్ది చెప్పాల్సి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం 23 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడిడి ఈ నెల 15వ తేదీ నుంచి నిరసన చేపట్టారు. ప్రభుత్వంలో భాగమైన టీఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు కాంట్రాక్టు కార్మికుల కోసం వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్షలు ప్రారంభం కాగా, అదే సమయంలో గేటు బయట టీఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు నిరసన చేపట్టాయి. విధులకు వెళ్తున్న ఉద్యోగ, కార్మికులను రెండు యూనియన్ల నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని తోపులాట జరిగింది. టీఎన్టీయూసీ యూనియన్కు చెందిన మనోహర్, పులి సుధాకర్రెడ్డిలకు గాయాలయ్యాయి. దీంతో యూనియన్ నేతలు కలమల్ల పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి చర్చించుకుని సర్దుబాటు అయ్యారు. జేఏసీ నేతలు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిమదనపల్లె రూరల్ : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం గ్రామం పడమట వీధికి చెందిన గీర్వాణి(60) మాజీ సైనికోద్యోగి అయిన తన భర్త మురళీతో కలిసి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతోంది. మదనపల్లె నుంచి పీలేరు వెళుతున్న ఆర్టీసీ అద్దె వాహనం ఓవర్టేక్ చేస్తూ పక్కకు వెళ్లే క్రమంలో వారి ద్విచక్రవాహనాన్ని తాకింది. దీంతో బైక్ అదుపుతప్పి గీర్వాణి, మురళీ కిందపడ్డారు. ప్రమాదంలో గీర్వాణి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతితో ఆవేశానికి లోనైన కుటుంబసభ్యులు బస్సు డ్రైవర్ జానకిరామ్పై దాడి చేశారు. తమకు కేసు, పోస్టుమార్టం వద్దంటూ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. తాలూకా పోలీసులు విచారణ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. నిందితుల అరెస్టుమదనపల్లె రూరల్ : తమ్ముడితో కలిసి కట్టుకున్న వాడిని అంతమొందించిన హత్య కేసులో నిందితులను అరెస్ట్చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సత్యసాయిజిల్లా తనకల్లు మండలం నందివారిపల్లెకు చెందిన జరిపిటి రామన్న(40) మద్యం మత్తులో రోజూ భార్య రమణమ్మతో గొడవపడేవారు. 2025 మార్చి, 12న యథాప్రకారం గొడవపడగా.. భార్య రమణమ్మ పప్పుగుత్తితో భర్త రామన్నపై దాడి చేసింది. అప్పటికే అక్కడే ఉన్న ఆమె తమ్ముడు ఈశ్వర్ కూడా అక్కను కాపాడే క్రమంలో రుబ్బురోలు తీసుకుని రామన్నపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హంద్రీనీవా కాల్వ వద్ద మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. మృతుడి సోదరుడు జరిపిటి లక్ష్మన్న ఫిర్యాదుతో విచారించిన పోలీసులు ఈశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిపారు. నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన పప్పుగుత్తి, రుబ్బురోలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, హెడ్ కానిస్టేబుల్ వేణు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామసముద్రం దిగువహరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు అంజప్ప(45) భార్య నాలుగేళ్ల కిందట మృతి చెందడంతో ఒంటరి జీవితాన్ని భరించలేకపోయాడు. మానసికంగా కుంగిన అతడు ఇంటివద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గుర్రంకొండ మండలం సరిమడుగు పంచాయతీ కృష్ణాపురానికి చెందిన చౌడప్ప కుమారుడు చలపతి(48) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబసభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. తమ్ముళ్లు డిష్యుం.. డిష్యుం..టాస్క్ ఫోర్స్ : ఓటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి దౌర్జన్యాలు, రౌడీయిజం, దాడులు అధిక మయ్యాయి. పార్టీలతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలే పెట్టుబడిగా తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆర్థిక, భూ పంపకాలు, మద్యం మత్తుల్లో తెలుగు తమ్ముళ్లే ఒకరికి ఒకరు దాడులు చేసుకుంటూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం రాయచోటి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు జాబీర్, మరో తెలుగు మైనార్టీ నాయకుడు సయ్యద్ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో జాబీర్, సయ్యద్ భాషాలు ఇరువురికి తీవ్రంగా రక్త గాయాలు అయ్యాయి. మదనపల్లి మార్గంలోని భూ తగదా విషయంపై ఇరువురి మధ్య ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. అయితే అధికార పార్టీకి చెందిన ఇరువురు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.ఇద్దరు మైనర్ల అరెస్టువేంపల్లె : స్థానిక పిల్లస్వామి గుట్ట సమీపంలోని జగనన్న కాలనీలో ఈ నెల 18వ తేదీన వాణి తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. అదే కాలనీకి చెందిన ఖాదర్వలి, మరో ఇద్దరు మైనర్లు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో బంగారు, వెండి చోరీ చేశారు. విచారించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.కూలీ ప్రాణాలు తీసిన టిప్పర్..!కురబలకోట : హైవే పక్కన రాంగ్ సైడ్లో నిలిపిన టిప్పర్ను మోటార్ సైకిల్పై వచ్చిన వ్యక్తి ఢీకొని మృతి చెందిన విషాదకర సంఘటన కురబలకోట మండలంలో శనివారం చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం వాల్మీకీ నగర్కు చెందిన పి.సుధాకర్ (56) కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమార్తెను శుక్రవారం రాయచోటిలోని చెల్లెలు ఇంటి వద్ద వదిలి వస్తానని సుధాకర్ మోటార్సైకిల్పై వెళ్లాడు. భార్య రాత్రి పది గంటల సమయంలో పోన్ చేయగా వర్షం ఆగగానే ఇంటికి వచ్చేస్తానని బదులిచ్చాడు. శనివారం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా ముదివేడు సమీపంలోని తానా మిట్ట వద్ద ఆగిన టిప్పర్ను ప్రమాదవశాత్తూ ఢీకొట్టాడు. టిప్పర్ను రాంగ్ సైడ్లో ఆపి సిగ్నల్స్ కూడా వేయకపోవడమే ఇందుకు కారణమైంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణాన్ని బలితీసుకుంది. శనివారం వేకువ జామున మృతి వార్త తెలుసుకుని భార్య, పిల్లలు విలపించారు. అమ్మా.. నాన్నకు ఏమైంది.. నాన్న ఎక్కడమ్మా..అని పిల్లలు రోధించడం చూపరుల కళ్లను చెమర్చాయి. మదనపల్లె ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు.సోమశిల జలాలతో మునిగిన పొలాలుపెనగలూరు : సోమశిల వెనుక జలాలు పెరగడంతో సిరివరి గ్రామానికి చెందిన వందల ఎకరాల పంట నీట మునిగింది. మామిడి తోటల్లోకి నీరు చేరడంతో చెట్లు చనిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 72 టీఎంసీలు నిల్వచేశారు. దీంతో సిరివరం, ఎన్ఆర్.పురం గ్రామంలోని చాలా పొలాలకు నీరు చేరింది. వారం పది రోజులలో కోసేందుకు వరి ప ంట సిద్ధంగా ఉండగా. నీట మునగడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోడిపందేల రాయుళ్లు అరెస్టుసిద్దవటం : మండలంలోని మిట్టపల్లి సమీపాన రైల్వే బ్రిడ్జి వద్ద కోడి పందేలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. తనకు అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం సోదాలు చేయగా రైల్వేబ్రిడ్జి వద్ద కోడి పందెం ఆడుతూ కనిపించారన్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 10500 ల నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుసిద్దవటం : మండలంలోని భాకరాపేట సమీపంలోని రాజస్థాన్ డాబా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజంపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో కడప నుంచి రాజంపేటకు బయలుదేరారు. భాకరాపేట సమీపంలోని రాజస్థాన్ డాబా వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారు వేఉగంగా ఓవర్టేక్ చేసి వెళ్లింది. ద్విచక్ర వాహనంలో వస్తున్న వీరు ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని వెనుకవైపు ఢీకొన్నారు. ప్రమాదంలో ఆకేపాడుకు చెందిన కమల్, మనక్కాయల పల్లికి చెందిన రితేష్, రాజంపేటకు చెందిన మున్నాకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వైద్యంకోసం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు మైదుకూరు : తనను బెదిరించి తన మోటార్ బైక్ను అగంతుకుడు ఎత్తుకెళ్లాడని ఓ భవన నిర్మాణ కార్మికుడు చేసిన ఫిర్యాదు ఓ అంతర్ రాష్ట్ర దొంగను పట్టించింది. బద్వేల్ ఎన్జీఓ కాలనీ వాసి బ్రహ్మాదేవి రాజశ్రీ గణేష్ను బ్రహ్మంగారిమఠం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షల విలువచేసే పది మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని వివేకానంద కాలనీకి చెందిన షేక్ హుస్సేన్షా బేల్దారిగా పనిచేస్తున్నారు. బ్రహ్మంగారిమఠం ఈశ్వరీదేవి గుహ వద్ద ఈ నెల 16న పనులకు వెళ్లి కొద్ది దూరంలో బైక్ పార్కింగ్ చేశాడు. సాయంత్రం వచ్చి చూడగా.. నిందితుడు రాజశ్రీ గణేష్ తన బైక్ను స్టార్ట్ చేస్తుండడడంతో హుస్సేన్షా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావని ప్రశ్నించాడు. పక్కకు తప్పుకోకుంటటే చంపేస్తానంటూ చాకుతో బెదిరించి బైక్లో పరారయ్యాడు. బాధితుడు బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితుడు రాజశ్రీ గణేష్ను పోలీసులు అనుమానించి విచారించారు. విచారణలో హుస్సేన్షా మోటార్ బైక్ అని తేలడంతో మరింత విచారణ చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణలోని పలు స్టేషన్ల పరిధిలో తొమ్మిది మోటార్ బైక్లు చోరీ చేసినట్లు తెలిసింది. ఓ పాడుబడిన షెడ్లో నిందితుడు దాచిన పది మోటార్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కడప, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు నిందితుడిపై కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న సీఐ జె.శివశంకర్, బ్రహ్మంగారిమఠం ఎస్ఐ శివప్రసాద్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, హుస్సేనయ్య, బ్రహ్మేంద్రలకు నగదు రివార్డులను అందజేశారు. ముగ్గురిపై చీటింగ్ కేసుకడప అర్బన్ : కడప హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయభాస్కర్రెడ్డితోపాటు కుమార్తె రూప తన్మయి, సుజిత్కుమార్రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రామకృష్ణ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. అరవింద్నగర్కు చెందిన నిత్య పద్మావతి 2019లో ఐదు ఆయిల్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత విజయభాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఆయన నిపద్మావతి దగ్గర సంతకాలు చేసిన చెక్కు ఇప్పించుకున్నాడు. కుట్రపన్ని దాదాపు రూ.90 లక్షల మేర తాను, తమ ఇద్దరు పిల్లల ద్వారా డబ్బు డ్రా చేసుకుని ఖర్చు చేసుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ల ఈఎంఐలను కట్టించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. 10 మోటార్ బైక్లు స్వాధీనంరక్త గాయాలతో ఆసుపత్రికి చేరిక -
విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : విద్యుత్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జేఏసీ చైర్మన్ జాఫర్వలి, కన్వీనర్ నరసింహులునాయక్, కో చైర్మన్ నరేంద్రనాథరెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి విద్యుత్ కార్యాలయం ఎదుట జిల్లా జేఏసీ, రాయచోటి, రాజంపేట డివిజన్ జేఏసీల ఆధ్వర్యంలో విద్యుత్తు కార్మికులు, సిబ్బంది శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ఛైర్మన్ రెడ్డప్పరెడ్డి, చంద్రశేఖర, జి.చంద్రశేఖర్, పాపయ్య, కె.వెంకటరమణ, మహేశ్వరయ్య, రియాజ్అహమ్మద్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు పట్టివేత
ఎర్రచందనం దుంగలతో అటవీ అధికారులు నిందితుడి అరెస్టు చూపుతున్న అటవీ అధికారులు రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు అటవీశాఖ పరిదిలోని కోడూరు రేంజ్ కేవీ భావి సౌత్ బీట్ వద్ద శుక్రవారం 24 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అధికారులు దాడులు చేసి పట్టుకొన్నారు. కోడూరు రేంజర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో శుక్రవారం కూంబింగ్ జరుపుతుండగా తమిళనాడు రాష్ట్రం కూనీకత్తూర్కు చెందిన వెంకటేశన్ దుంగలు తరలిస్తూ కనిపించాడు. అటవీ అధికారులు అతడిని అరెస్టు చేసి రూ.2.22 లక్షల విలువచేసే 24 దుంగలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ, మహేష్శంకర్, దామోదర్, పెంచలయ్య పాల్గొన్నారు. తమిళనాడు వాసి అరెస్టు పీలేరు : పీలేరు–యల్లమంద మార్గంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గురు ప్రభాకర్ తెలిపారు. వివరాలిలావున్నాయి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో పీలేరు – యల్లమంద మార్గంలో అటవీ అధికారులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. ఒక వాహనంలో రూ. 8.24 లక్షల విలువైన ఐదు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒకరిని అరెస్టు చేసినట్లు డీఎఫ్వో తెలిపారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వో చంద్రశేఖర్, ప్రకాష్కుమార్, ప్రతాప్, రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. -
వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదం
కడప రూరల్ : వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో ప్రభుత్వ విద్య ప్రైవేటీకరణ..లాభ–నష్టాలు అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, రోగులకు సేవలందించడం ద్వారా వైద్య రంగంలో మెలకువలు తెలుసుకునేందుకు పేద విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేసే పీపీపీ విదానాన్ని ఉత్తరాఖండ్, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వ్యతిరేకించారని తెలిపారు. రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలుండగా, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం తగదన్నారు. 66 ఏళ్లకు కోట్ల రూపాయల ఆస్తులను రూ.5వేలకు లీజుకు ఇవ్వడం శోచనీయమని తెలిపారు. డాక్టర్ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటుపరం చేయడం ద్వారా సీట్లను అమ్ముకుని వైద్య విద్యను వ్యాపారం చేయడమేనని తెలిపారు. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో వ్యతిరేకిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ సామేల్ తదితరులు పాల్గొన్నారు. పులివెందులలో అన్ని హంగులతో మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణం. ప్రైవేటీకరణతో విద్యాబోధన సక్రమంగా ఉండదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. – డాక్టర్ ఎస్.గౌస్పీర్, కడప రోగులకు సేవలందించే కీలకమైన వైద్య విధానంలో రాజకీయాలు తగవు. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటపుడు వైద్యులు, ఇతర విద్యార్థులు, తదితర సంస్థలకు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ రామచంద్రయ్య, కడప వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం ద్వారా అవినీతి ముసుగు ఉంది. వైద్యులతోపాటు కీలకమైన పారా మెడికల్ స్టాఫ్ను పెంచాలి. కడపలో కేన్సర్ ఆస్పత్రి ఉంటే ప్రభుత్వం ఇంతవరకు అక్కడ సిబ్బంది, సౌకర్యాలను కల్పించకపోవడం శోచనీయం. – డాక్టర్ రాంగోపాల్వర్మ, కడప ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి. వైద్య విద్య కాలేజీల ప్రైవేటుపరం చేయడంతో సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు ఉండవు. అలాగే అక్కడికి వచ్చే రోగుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. – డాక్టర్ బాలిరెడ్డి, కడప -
ఐదు దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక స్మగ్లరును టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్ సూచన మేరకు ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐ అల్లిబాషా, పోలీసులు రాజంపేట రోళ్లమడుగు ఫారెస్ట్ బీట్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం పుట్టంగి మడుగు ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎరచ్రందనం దుంగలు తరలిస్తూ కంటపడ్డారు. టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని చుట్టుముట్టే ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు. వెంబడించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు తమిళనాడుకు చెందిన ఒకరిని పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ అతడిని విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు
రాజంపేట : భవిష్యత్తులో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమార్పులు ఉంటాయని ఆస్ట్రేలియాలని కాలహాన్, న్యూ సౌత్వేల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.ఆసాది శ్రీనివాసులు అన్నారు. ఏయూలో సీఎస్ఈ ఆధ్వర్యంలో ఎంఎల్,డీఎల్ సాంకేతికతో జనరేటివ్ ఏఐ అనువర్తనాలు అంశంపై అంతర్జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో జనరేటివ్ ఏఐ ద్వారా కొత్త ఔషధాల రూపకల్పన, రోగ నిర్ధారణకు ఎక్స్రే, స్కాన్ ఇమేజీ ఆధారంగా ఖచ్చితమైన విశ్లేషణ చేయవచ్చునన్నారు. పరిశోధనలో భాగస్వామ్యం అవడానికి కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా మార్గదర్శనం పొందాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్డీ స్కాలర్ జి. శ్రీనివాసులు, హెచ్వోడి డా.ఎం.సుబ్బారావు, నవీన్కుమార్, బోధనాసిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. -
వేధింపులు భరించలేక భర్తను హతమార్చిన భార్య
ఆరునెలల తర్వాత విచారణలో వెలుగు చూసిన ఉదంతం మదనపల్లె రూరల్ : మద్యం తాగి గొడవపడడమేగాక, తనను కొడుతూ కూలి డబ్బులు లాక్కుని వెళ్లే భర్త వేధింపులను భరించలేని భార్య, తన తమ్ముడి సాయంతో హత్య చేసిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత పోలీసుల విచారణలో ఈ సంఘటన బయటపడింది. టూటౌన్ పోలీసుల వివరాల మేరకు.. సత్యసాయిజిల్లా తనకల్లు మండలం నందివారిపల్లెకు చెందిన జరిపిటి రెడ్డెప్ప కుమారుడు రామన్న(40), భార్య రమణమ్మతో కలిసి ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వచ్చాడు. రామారావుకాలనీలోని ఓ అద్దె ఇంటిలో నివాసముంటూ కూలి పనులుచేసి జీవనం సాగిస్తున్నారు. కొద్ది కాలం తర్వాత మద్యానికి బానిసైన రామన్న ఇంట్లో భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగేందుకు అవసరమైస డబ్బులు భార్య నుంచి లాక్కునివెళ్లేవాడు. ఈ క్రమంలో మార్చి 12ణ మధ్యాహ్నం పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన రామన్న భార్యతో గొడపవడ్డాడు. అప్పటికే అతడి వేధింపులు భరించలేని ఆమె కర్రతో దాడిచేసింది. కిందపడిన అతడిపై రమణమ్మ తమ్ముడు ఈశ్వర్ రోకలిబండతో తలపై కొట్టాడు. దీంతో రెడ్డెప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య విషయం రాత్రివరకు గుట్టుచప్పుడు కాకుండా చూసిన రమణమ్మ, ఈశ్వర్ అనంతరం సంచిలో మృతదేహాన్ని మూటగట్టి బి.కొత్తకోట కస్తూర్బా స్కూల్ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి చేరుకున్నారు. తన అన్న కనిపించకపోవడంపై వదిన రమణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్పై అనుమానం వ్యక్తం చేస్తూ టూటౌన్ పోలీస్స్టేషన్లో రెడ్డెప్ప సోదరుడు ఫిర్యాదుచేశాడు. సీఐ రాజారెడ్డి విచారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. బి.కొత్తకోటలో పాతిపెట్టిన విషయాన్ని తెలుసుకుని అక్కడకు వెళ్లి పంచనామా చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి
రాజంపేట : రాజంపేట నియోజకవర్గ సమగ్ర అబివృద్దికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతో పనిచేయాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో సమస్య గుర్తించి పరిష్కరించే విధంగా పాలన సాగాలని పేర్కొన్నారు. చెత్త సేకరణ, ప్రజారోగ్యంపై మున్సిపల్ కమిషనర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నీటి సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పంటలు, వాటి విస్తీర్ణం వివరాలు వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ హెచ్.భావన, రాజంపేట నియోజకవర్గ ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : కు క్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీకి చెందిన మహేష్, గంగోత్రిల కుమారుడు తరుణ్(4) ఇంటి వద్ద ఆడుకుంటుండగా, వీధికుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడిచేశాయి. దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆలయ స్థలాలను పరిరక్షించుకుంటాం చిట్వేలి : ఆలయ స్థలాలను పరిరక్షించుకుంటామని చిట్వేలి సోమేశ్వరాలయం కమిటీ చైర్మన్ వీరాంజ నేయులు, ఆర్గనైజర్ బొంతల నాగేశ్వరరావు, సభ్యులు మోహన్ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ధర్మనిధి అఖండ సభ్యుల ఆధ్వర్యంలో శివాలయం ఆవరణంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని శుక్రవారం ఎక్సలేటర్లతో చదును చేయించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ అక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసి పరిరక్షించుకుంటామన్నారు. ఎవరైనా స్థలాల ఆక్రమణకు పాల్పడితే సహించమన్నారు. ఈ కార్యక్రమంలో శివ, నాని, కొనిశెట్టి సుబ్బరాయుడు, కడుమూరి రమణయ్య, నవీన్, తేజ, మణి, సురేంద్ర, నరసింహ, వెంకటరత్నం, ,సాయి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 252 రేషన్ బియ్యం బస్తాల స్వాధీనం రాజంపేట రూరల్ : అక్రమంగా తరలించేందుకు మండలంలోని మిట్టమీదపల్లి గ్రామంలో ఉంచిన 252 రేషన్ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులు బుధవారం గుర్తించారు. రాత్రి వరకు గోప్యంగా ఉంచి అనంతరం అసంపూర్తిగా ఉన్న ప్రెస్నోట్ విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది. బుధవారం ఒక రోజే అటు 309 బస్తాలు లారీలో లభ్యం కావడం, ఇటు నిల్వ వుంచిన 252 బస్తాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పే కమిషన్ సభ్యుల పేర్లు ప్రకటించాలి నందలూరు : 8వ పే కమిషన్ కమిటీ సభ్యులను కేంద్రం ప్రభుత్వం ప్రకటించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యదర్శి విశ్వనాథ్ అన్నారు. రైల్వే కార్మికులతో కలిసి శుక్రవారం ఆయన నిరసన తెలిపారు. విశ్వనాథ్ మాట్లాడుతూ జనవరిలో 8వ పే కమీషన్ వేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ పేర్లను ప్రకటించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే తక్కువ జీతాలు చెల్లిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం, ఆకులనాగరాజు, సాయి సందీప్, షేక్షావలి, సయ్యద్ గయాజ్, విశ్వదీపక్, శ్రీహర్ష, పి.రాజు, భరత్, లెనిన్ బాబు, పి.వెంకటేశ్వర్లు, అరుణ్కుమార్, సుశీల్కుమార్, కార్మికులు పాల్గొన్నారు. మదనపల్లె రూరల్ : నీళ్లు అనుకుని టర్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. కర్నాటకకు చెందిన సాదియా తన కుమార్తె అలీజా(2)తో కలిసి పట్టణంలోని సైదాపేటలో నివాసముంటోంది. నీరుగట్టువారిపల్లెలోని రీలింగ్ కేంద్రంలో పనులు చేస్తూ జీవిస్తోంది. శుక్రవారం పని ప్రదేశానికి కుమార్తెను తీసుకువెళ్లింది. ఆమె రీలింగ్కేంద్రంలో పనులు చేస్తుండగా, చిన్నారి ఆడుకుంటూ దప్పిక అవడంతో టర్పెంట్ ఆయిల్ను నీరు అనుకుని తాగింది. తీవ్ర అస్వస్థతకు గురికాగా, సాదియా, చిన్నారిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చింది. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. మార్గ మధ్యంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతిచెందిన చిన్నారి అలీజా, టర్పెంట్ ఆయిల్ బాటిల్ -
ప్రజల ఆస్తి
ప్రభుత్వ ఆధ్వర్యంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన మదనపల్లె వైద్యకళాశాల జగన్ ఆస్తికాదు, ప్రజల ఆస్తి. ఇప్పటిదాకా ఎంత నిర్మాణం పూర్తయ్యిందో.. మిగిలిన పనులను ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా పూర్తి చేయాలి. దీనిని విస్మరించి చంద్రబాబు బినామీలైన కార్పొరేట్ సంస్థలకు వైద్యకళాశాలను అప్పగించి అమ్మేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గం. జగన్ చెప్పినట్టు కళాశాలను ఎవరు తీసుకున్నా తమ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రభుత్వపరం చేస్తాం. –ఆకేపాటి అమరనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు -
ముంచెత్తిన వాన
రాయచోటి: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం అర్ధరాత్రి అనంతరం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. రాయచోటిలోని ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి ఇంటిపై పిడుగు పడింది. దీంతో గోడలు దెబ్బతిన్నాయి ఇంటిలోపలకు పిడుగుచొచ్చుకొని వె ళ్లింది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. వర్షాలకు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు, పెద్దతిప్ప సముద్రం, కొత్తకోట, పెద్దమండెం మండలాల్లోని చెరువులన్నీ నిండాయి. సుండుపల్లిలోని పింఛా ప్రాజెక్టులనుండి నదుల్లోకి ప్రవాహం సాగుతోంది. తెగిన చెరువుకట్ట...దెబ్బతిన్న రహదారి..... గురువారం రాత్రి కురిసిన వర్షానికి సుండుపల్లి మండల పరిధిలోని అయ్యవారి చెరువు కట్ట తెగిపోవడంతో సమీపంలోని వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహించాయి. రాయచోటి– పింఛా మార్గంలోని బహుదా నదిపై నిర్మించిన రహదారి తెగిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు మండల కేంద్రమైన సుండుపల్లితో రవాణా ఆగిపోయింది. శుక్రవారం ఉదయానికి జిల్లాలోని ములకల చెరువులో 256 మిల్లీ మీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదైంది. పెద్ద తిప్ప సముద్రంలో 163.6, బి కొత్తకోటలో 75.4, పెద్దమండెంలో 69.6, గాలివీడు 60.8, పెనగలూరు 58.6, వీరబల్లి 55.4, తంబళ్లపల్లి 49.2, సుండుపల్లి 46.2, రాయచోటి 406., రామాపురం 40.2, వాల్మీకిపురం 32.6, రామసముద్రం 29, మదనపల్లి 28.2, కురబలకోట 28, కలికరి 25, చ్ని మండెం 20., కలకడ 18.8, నిమ్మనపల్లి 15.4, సంబేపల్లి 13.4, నందలూరు 10.4, కెవిపల్లి 12.2 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు మండలాల్లో చుక్క వర్షపాతం నమోదు కాలేదు. జి ల్లాలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పెనగలూరు: మండలంలో చెయ్యేరు నది నీరు ప్రవహించడంతో పల్లంపాడు గ్రామానికి గురువారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. సుండుపల్లె: మండలంలోని చెరుకువాండ్లపల్లి లోని అయ్యవారి చెరువు కట్ట తెగిపోవడంతో నీరు రోడ్డు మీదకు చేరింది. దీంతో రాయచోటి– పింఛా ప్ర ధాన రహదారి దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి.పెద్దమండ్యం: వర్షానికి పెద్దమండ్యంలో కుషావతీ నది ప్రవాహంతో శుక్రవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.మదనపల్లె– గాలివీడు మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఉదయం పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాల వేళలో నది ప్రవాహంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ములకలచెరువులో 256 మి.మీ వర్షం పొంగుతున్న వాగులు రాయచోటిలో ఇంటిపై పడిన పిడుగు.. తప్పిన ప్రాణ నష్టం -
నేడు జాబ్ మేళా
మదనపల్లె సిటీ: స్థానిక నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. జాబ్మేళాకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్ననట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9553202509, 6301612761 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. రాజంపేట: రాజంపేట మండలం ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్లో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశం శనివారం మధ్యాహ్నాం 3 గంటలకు జరుగనుంది. ఈ విషయాన్ని విభాగం జిల్లా అధ్యక్షుడు రంగాల కమలాకర్ శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్సీ జిల్లా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశానికి ఎస్సీసెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పీజే సుధాకర్బాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. ఎస్సీసెల్ విభాగంలో వివిధ హోదాలలో ఉన్న ఎస్సీసెల్ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాయచోటి: జిల్లా అభివృద్ధి విషయంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్, ఎస్పీలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి, చట్టవ్యవస్థ బలోపేతం, ప్రజాసేవలో పరస్పర సహకారంపై చర్చ, జిల్లా పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలన్న ఆత్మీయత, ప్రజల శ్రేయస్సుకోసం కలిసి కృషి చేయాలన్న సంకల్పం తదితర విషయాలపై చర్చించుకున్నట్లు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీతో జిల్లా పరిపాలనలో నూతనోత్సహం, సమన్వయం మరింత బలపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కడప ఎడ్యుకేషన్: న్యూఢిల్లీలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సభకు కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్కు చెందిన గణిత ఉపాధ్యాయుడు సురేష్ వెళ్లి పాల్గొన్నారు. న్యూఢిల్లీ భారత మండపంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో సుమారు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 59వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) జనరల్ మీటింగ్, ఎక్స్పోలో పాల్గొనుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అకడమిక్ డెలిగేట్గా కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు బి.సురేష్కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎ) ఏపీ విజయవాడ బ్రాంచ్ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన ఐఈసీ– 2025 జనరల్ మీటింగ్కు వెళ్లి పాల్గొన్నారు. రాయచోటి: విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే నూతన ఆవిష్కరణల పోటీలకు సంబంధించి ఇన్స్పైర్ మనాక్ నామినేషన్లను శనివారం సాయంత్రంలోపు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయలకు సూచించారు. రాయచోటిలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ హెల్ప్ డెస్కును శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. దసరా సెలవులు వస్తున్నందున జిల్లాలోని అన్ని పెండింగ్ పాఠశాలలు శనివారం సాయంత్రంలోపు విద్యార్థులతో ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించాలని డీఈఓ తెలియజేశారు. అలా చేయని వారు సెలవు రోజుల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలన్నారు. ఆరు నుంచి పన్నెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న అన్వేషణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, సైన్స్ రిసోర్స్ పర్సన్ రంజిత్ నాయక్ పాల్గొన్నారు. -
ఎకరం రూపాయికేనా
మదనపల్లె వైద్యకళాశాల 95 ఎకరాల కోట్ల విలువైన భూమిని ఎకరం ఒక రూపాయికి కట్టబెట్టి ద్రోహానికి పాలప్పడుతున్నారు. రూ.80 కోట్ల పనులు పూర్తయిన భవనాలను నిర్లక్ష్యం చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు వద్దంటున్నా టెండర్లను పిలిచి ప్రజల సొమ్మును దోచుకోంటున్నారు. వేలమందికి వైద్యం అందించే కళాశాలను ప్రైవేట్కు ఇవ్వడంపై కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలల నిర్వహణ చేపట్టాలి. – గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
అడుగుపెట్టనివ్వం
మదనపల్లె వైద్య కళాశాల టెండర్లలో ప్రైవేటు వ్యక్తులు పాల్గొని ఎవరు టెండర్ దక్కించుకున్నా కళాశాల ఆవరణలోకి అడుగుపెట్టనివ్వం. కూటమి పాలనలో జలవనరుల పరంగా ప్రాజెక్టులను కోల్పోయిన ప్రజలు ఇప్పుడు పేదలకు వరమైన వైద్య కళాశాలను పోగొట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఉద్యమాలు, ఆందోళనలు చేసైనా వైద్య కళాశాలను కాపాడుకుంటాం. వైద్య కళాశాల ఎదురుగానే ఆరోగ్యవరం ఉంది. ఇలాంటి ప్రాంతంలోని కళాశాలను ప్రైవేట్కు ఇవ్వడం దుర్మార్గం. –పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే -
ధనికులకే విద్య
మదనపల్లెకు వరమైన వైద్య కళాశాలను ప్రైవేట్కు ఇవ్వడం ద్వారా ధనికులకే వైద్య విద్యను పరిమితం చేస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం అవుతారు. చంద్రబాబు బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాలు విరమించి ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలల నిర్వహణ చేపట్టాలి. వైఎస్.జగన్మోహన్రెడ్డి పేదలకు కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కాలన్న లక్ష్యంతో కళాశాలలను ప్రారంభించారు. వీటిద్వారా కూటమి ప్రభుత్వం దోచుకునే కుట్ర చేస్తోంది. –దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
రాకపోకలకు అంతరాయం
సుండుపల్లె మండలంలో రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. ఊటచెరువు నిండి మొరవలో నీరు అధికంగా వస్తోంది. దీంతో మండల కేంద్రం నుంచి గుండ్లపల్లికు వెళ్లే రహదారి వడ్లపల్లె సమీపంలో.. ప్రధాన రహదారిపై తూముల దగ్గర మట్టి రోడ్డుపైన నీరు అధికంగా వచ్చి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ మెహబూబ్చాంద్, పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించారు. వాహనదారులు, ప్రజలను అటువైపు వెళ్లనీయకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఇలాగే ఉంటే రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. –సుండుపల్లె చిన్నమండెం మండల పరిధిలోని మాండవ్యనది జలకళ సంతరించుకుంది. నదికి భారీగా నీరు వచ్చింది. నీటి ప్రవాహం వేగంగా సాగుతోంది. – చిన్నమండెం -
డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ వాయిదా
మదనపల్లె సిటీ : మెగా డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. జిల్లా నుంచి మెగా డీఎస్సీలో ఎంపికై న వారిని గురువారం ఉదయం కడప ఆర్ట్స్ కాలేజీ చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. అక్కడి నుంచి విజయవాడలో శుక్రవారం జరిగే కార్యక్రమానికి తీసుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దీంతో నాన్ లోకల్ కింద ఎంపికై న వారు సుదూర ప్రాంతాల నుంచి కడపకు చేరుకున్నారు. ఉద్యోగం కావాలంటే నీవే కాదు తోడుగా ఒకరిని తప్పక తీసుకురావాల్సిందేనని ఆదేశించారు. దీంతో చిన్నపిల్లల తల్లులు, గర్భవతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఎంతో వ్యయపయాసాలకు ఓర్చి వెళితే వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. చేసేది లేక అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడుతున్నారు. చదవలేదని పంపేశారంటూ విద్యార్థి ఫిర్యాదు మదనపల్లె రూరల్ : చదువురాని విద్యార్థులు పాఠశాలకు అక్కర్లేదని వివేకానంద హైస్కూల్ హెచ్ఎం రాజేంద్రబాబు తనను పాఠశాల నుంచి పంపేశారని పదోతరగతి విద్యార్థి లోకేష్ తల్లిదండ్రులతో కలిసి సబ్కలెక్టర్ చల్లా కల్యాణికి ఫిర్యాదు చేశారు. స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట హెచ్ఎం రాజేంద్రబాబు తీరుపై తల్లిదండ్రులు, బీఎస్పీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. లోకేష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పది మంది విద్యార్థులను చదువులో వెనుకబడ్డారని దుర్భాషలాడి హెచ్ఎం ఇంటికి పంపేశారన్నారు. తాము వెళ్లి హెచ్ఎంను నిలదీయడంతో చదువురాని విద్యార్థులు పాఠశాలకు వద్దని అసభ్యంగా తిట్టారన్నారు. తమ బిడ్డల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు. హెచ్ఎం రాజేంద్రబాబు వివరణ ఇస్తూ... ఆగస్టు 13వ తేదీ నుంచి లోకేష్ పాఠశాలకు రాలేదని, తల్లిదండ్రులకు విషయం తెలిపినా పట్టించుకోలేదన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రాకుంటే పాస్ కాలేరని మాత్రమే చెప్పానని, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెపల్లె బాలాజీ, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల కుటుంబాలను ఆదుకోవాలి రాయచోటి టౌన్ : దివ్యాంగుల కుటుంబాలను ఆదుకోవాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గతంలో రూ.3వేలు ఉన్న పెన్షన్ను కూటమి ప్రభుత్వం రూ.6వేలకు పెంచిందన్నారు. రూ.10 వేలుగా ఉన్న పెన్షన్ రూ.15 వేలకు పెంచడంతో దివ్యాంగుల కుటుంబాలు ఎంతో సంతోషించారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏవో సాకులు చూపుతూ సర్వే పేరుతో పెన్షన్లు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం బోగస్ సర్టిఫికెట్లు తొలగించమని చెప్పితే వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా అర్హత కలిగిన వారందరినీ తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం దృష్టి పెట్టి దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. మట్టిని తవ్వి.. అక్రమంగా తరలిస్తూ పకృతి సిద్ధంగా లభించిన మట్టిని కూటమి నేతల అండతో జేసీబీలు, ఇటాచీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. లక్షల రూపా యల మట్టి దోపిడీ చేస్తున్న వారిని అధికారులు నిలువరించలేకపోతున్నారు. సంబేపల్లి మండలం గుట్టపల్లె వద్ద పట్ట పగలే ఇలా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గురువారం మట్టి రవాణాను అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. అక్రమంగా మట్టి తరలించేవారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. – సంబేపల్లె -
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి
పీలేరు: జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పీలేరు నియోజకవర్గంలోని అన్ని శాఖల నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని సర్పంచ్ హబీబ్బాషా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 12 నెలలుగా ఆర్వో ప్లాంట్ల వాటర్మెన్లకు జీతాలు ఇవ్వలేదని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, డీపీవో రాధమ్మ, జీఎస్డబ్ల్యూ ఎస్.లక్ష్మీపతి, నియోజకవర్గంలోని మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. రాయచోటి నియోజకవర్గ ప్రగతికి చర్యలు రాయచోటి: రాయచోటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకునేలా శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో రాయచోటి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీరు, తాగునీటిపై సమీక్ష చేసి, నియోజకవర్గంలోని చిన్న మధ్య తరహా ప్రాజెక్టులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పొంగుతున్న ప్రాజెక్టులు
తంబళ్లపల్లె మండలంలో బుధవారం రాత్రి కురిసిన 86.2 మి.మీ భారీ వర్షానికి ప్రాజెక్టులు నిండి మొరవ పారుతున్నాయి. 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, అప్పటి ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డి కృషి ఫలితంగా చిన్నేరు, దబ్బలగుట్ట ప్రాజెక్టులు నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది మళ్లీ మొరవ పోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వైపు ఇరిగేషన్ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదని, అభివృద్ధి చర్యలు చేపట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా కాలువల నిర్మాణాలు చేయలేదు. కాలువలకు తీసుకున్న భూములకు సైతం నష్టపరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పూర్తయివుంటే సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందేది. ఈ ప్రాజెక్టులలో పలు రకాల చేపలు అభివృద్ధి చెందాయి. రెండు ప్రాజెక్టుల కట్టలపై కంపచెట్లు కమ్ముకుపోయి కట్టలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. –తంబళ్లపల్లె -
వాన.. వెల్లువాయె!
మండలం వర్షం (మిమీ) రాయచోటి: అల్పపీడన ప్రభావంతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తారుకు పైగా వర్షం కురిసింది. రెండు రోజులుగా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటం వర్షాధార పంటలకు ఊతమైంది. జిల్లాలోని 23 మండలాల్లో మోస్తరు వర్షం కురవగా మిగిలిన ఏడు మండలాల్లో చిరుజల్లులతో సరిపెట్టుకుంది. మామిడి, బొప్పాయి, కర్బూజా, వరి, వేరుశనగ, టమాటా, ఇతర కూరగాయలు, పూల తోటలకు ఈ వర్షం రాక ఎంతో ఊరటనిచ్చింది. చీడపీడలతో ఉన్న వరిపంటకు కలిసి వస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని తంబళ్లపల్లెలో 86.2 మిమీ వర్షపాతం, సంబేపల్లిలో 83.6 మిమీ వంతున అధికంగా వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయానికి పెనగలూరు, చిట్వేలి, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కురబలకోట, పీలేరు, కలకడ మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదైంది. పెద్దమండెం 50.6 చిన్నమండెం 46.6 గుర్రంకొండ 45.8 బి.కొత్తకోట 32.2 పెద్దతిప్పసముద్రం 31.6 ములకలచెరువు 26 రామాపురం 25.6 వీరబల్లి 25.4 రాయచోటి 24.8 లక్కిరెడ్డిపల్లి 23 పుల్లంపేట 20.6 నిమ్మనపల్లి 19.2 టి.సుండుపల్లి 15.4 రామసముద్రం 13.2 గాలివీడు 12.8 మదనపల్లి 9.2 నందలూరు 7.4 వాల్మీకిపురం 7.2 కేవీ పల్లి 6.4 కలికిరి 3.2 ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రెండు రోజులుగా.. మోస్తరుగా.. వర్షాధార పంటలకు ఊతం -
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
మదనపల్లె రూరల్ : డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి నిమ్మనపల్లె మండలం బోయకొండ సమీపంలోని మామిడి తోటలో పేకాడుతున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఆరుగురు జూదరులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 వేల నగదు 16 ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కే.మహేంద్ర తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిమ్మనపల్లె మండల సరిహద్దులో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో డ్రోన్ సాయంతో జూద స్థావరాన్ని గుర్తించామన్నారు. ఎస్ఐలు రహీముల్లా, అన్సర్ బాషాల బృందం దాడులు నిర్వహించి మదనపల్లెకు చెందిన ఈ.శ్రీనివాసులు, వి.శ్రీరాములు, కలికిరికి చెందిన వెంకటరమణ, పుంగనూరుకు చెందిన అక్కులప్ప, రెడ్డెప్పనాయక్, హరిలను అరెస్ట్ చేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించామన్నారు. ఎవరైనా పేకాట ఆడినా, నిర్వహించినా సాంకేతికత సాయంతో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ములకలచెరువు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు అన్సర్బాషా, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. డ్రోన్లతో జూదగాళ్లపై పోలీసుల నిఘా రాయచోటి : జిల్లాలో ఆసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేలా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నిర్ణయం పేకాట రాయుళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే కార్యక్రమానికి ఎస్పీ పూనుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విచ్చలవిడిగా పేకాట, ఇతర జూదాలు, అసాంఘిక కార్యక్రమాలు జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సమయంలో ఎస్పీ నిర్ణయం జిల్లా ప్రజలకు కొంత ఊరటనిస్తోంది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. పేకాట స్థావరాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో పారిపోతున్న వారిని పట్టుకోవడం సులభతరంగా మారింది. డ్రోన్ కెమెరాల సహాయంతో జూదం, బహిరంగ మద్యపానం లాంటి చట్ట వ్యతిరేక పనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిమ్మనపల్లి అటవీప్రాంతంలో చేపట్టిన డ్రోన్ల ద్వారా చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైనట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టరాదని ఎస్పీ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎక్కడైనా అసాంఘిక సంఘటనలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నిర్వహకులపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్పీ జిల్లా ప్రజలకు సందేశం ఇచ్చారు. 16 బైక్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనంపేకాట స్థావరంపై దాడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మహేంద్ర మామిడితోటలోని పేకాటస్థావరం -
మద్యం మత్తులో బిడ్డలపై తల్లి దాడి
మదనపల్లె రూరల్ : మద్యం మత్తులో కన్నబిడ్డలపై తాగుబోతు తల్లి దాడిచేసి, భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బుధవారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన లక్ష్మన్న, వాణి దంపతులు. వీరికి కిరణ్కుమార్(13), రుషి(12) ఇద్దరు సంతానం. కొంతకాలం క్రితం లక్ష్మన్న యాక్సిడెంట్ కేసులో జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో వాణి మద్యానికి బానిసైంది. మద్యం తాగిన ప్రతిసారీ ఇంట్లో గొడవచేస్తూ కన్నబిడ్డలను విచక్షణారహితంగా కొట్టేది. బుధవారం రాత్రి ప్లూటుగా మద్యం తాగిన వాణి మరోసారి బిడ్డలు కిరణ్కుమార్, రుషిపై దాడిచేసి కొట్టింది. అడ్డుకోబోయిన తల్లి అనసూయపై దాడికి పాల్పడింది. దీంతో భయపడిన పిల్లలు ఇంటి నుంచి కేకలు వేసుకుంటూ బయటకు పరిగెత్తుకు వెళ్లి ఇద్దరు యువకులను కాపాడాల్సిందిగా అభ్యర్థించారు. ఇంతలో వాణి అక్కడకు చేరుకుని పిల్లలపై మరోసారి దాడిచేయబోగా యువకులు అడ్డుకున్నారు. వారిపై కూడా కొడవలితో దాడికి పాల్పడింది. యువకులు గాయపడిన పిల్లలు, అనసూయమ్మను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెదురు మొక్కల పెంపకం రాయచోటి : అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో డీఆర్వో మధుసూదనరావు గురువారం వెదురు మొక్కలు నాటారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జరగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఏటా సెప్టెంబరు 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు తెలిపారు. అంతకు ముందుగా మేదరి వెదురు వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ది సంస్థ నాయకులు రాయితీపై వెదురు ఇవ్వాలని, రాయచోటిలో వెదురు క్లస్టర్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం రాయచోటి మున్సిపాల్టీ, తహసీల్దార్, రహదారులు, భవనాల శాఖ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద వెదురు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గజపనేని రెడ్డయ్య, గజపనేని వెంకటసుబ్బయ్య, ఆర్ల నాగరాజు, టంగుటూరి నాగార్జున, గజపనేని వెంకట జయప్రసాద్, నరసింహులు, ఎల్లయ్య, వెంకటా చలపతి, కోలే గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
రాయచోటి : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి సామాన్యులకు సైతం మెడికల్ కోర్సులు అందుబాటులోకి తెచ్చే విధంగా 17 కాలేజీలను మంజూరు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి ప్రైవేటీకరణకు పూనుకోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత వైద్యం అందకుండాపోతుందన్నారు. వెంటనే 107, 108 జీఓలను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి మెడికల్ కాలేజీకి స్థలం కేటాయించి గత ప్రభుత్వం రూ.390 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో రూ.20 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మెడికల్ కళాశాలను నేడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడమంటే వైద్య రంగం కేవలం కార్పోరేటర్ల కోసమేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పి మణి, రామాంజులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి
కలకడ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. కలకడ పోలీసుల వివరాల మేరుక. వాల్మీకిపురం మండలం దయ్యాలబండ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వెంకటరమణ భార్య శోభారాణి(34) తన వ్యక్తిగత పనులపై ఈ నెల 14న కలకడకు వచ్చింది. తిరుగుప్రయాణంలో ఇతరుల ద్విచక్ర వాహనంలో(లిప్ట్) వెళ్తుండగా.. కదిరాయచెర్వు వద్ద రోడ్డుపై వేగ నిరోధకం వద్ద వాహనం అదుపు తప్పి తలకు తీవ్రగాయమైంది. ప్రమాదంలో గాయపడ్డ శోభారాణిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు హెడ్కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. మృతురాలి తమ్ముడు శబరీష్ ఫిర్యాదుమేరకు హెడ్ కానిస్టేబుల్ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం విక్రయించడం నేరం పుల్లంపేట : రేషన్ బియ్యంను ప్రజలు విక్రయించటం చట్టరీత్యా నేరమని తహసీల్దార్ పుల్లారెడ్డి అన్నారు. మండలంలోని జాగువారిపల్లి పొలిమేరలో గురువారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బురదలో ఇరుక్కుపోయింది. ప్రజలు గుర్తించి పుల్లంపేట తహసీల్దారు పుల్లారెడ్డికి సమాచారం అందించారు. రైల్వే కోడూరు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ డి.శ్రీనివాసులు తనిఖీచేశారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఈ లారీని బీదర్ జిల్లా వంగూరు గ్రామానికి చెందిన క్రాంతికుమార్ డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. అందులో 50 కిలోల బియ్యం బస్తాలు 309 ఉన్నట్లు శ్రీనివాసులు తెలియజేశారు. బియ్యాన్ని రాజంపేట స్టాక్ పాయింట్కు తరలించి లారీని సీజ్ చేశారు. కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. -
సాల్ట్ పథకంతో విద్యా రంగం నిర్వీర్యం
రాజంపేట టౌన్ : సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్(సాల్ట్) పథకంతో విద్యా రంగం నిర్వీర్యం అవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్జీఓ హోంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వతేదీ నుంచి 19వతేదీ వరకు నిర్వహిస్తున్న యూటీఎఫ్ రణభేరి కార్యక్రమంలో భాగంగా రాజంపేటలో పాల్గొన్నట్లు తెలిపారు. సాల్ట్ పథకంతో పాఠశాల పనిదినాల్లో శిక్షణ ఇస్తున్నారని, అనేక రకాల బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులపై రుద్దుతున్నారన్నారు. ఈ పథకానికి గణాంకాలను ఇవ్వడం కోసం, గిన్నీస్ రికార్డుల కోసం ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురిచేయడం తగదన్నారు. బోధనేతర కార్యక్రమాల బాధ్యతలను ఉపాధ్యాయులు చేస్తుండడంతో విద్యార్థులకు మెరుగైన బోధన చేయలేకపోతున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు స్వేచ్చాయుత వాతావరణం కల్పించాలని కోరారు. 2023 జూలైలో నియమించాల్సిన 12వ పీఆర్సీ ఛైర్మన్ను ఇప్పటికీ నియమించలేదని, నాలుగు డీఏలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం ఒక్కరోజు చర్చించలేదని తెలిపారు. అంతకు ముందు బోయినపల్లె నుంచి ఎన్జీఓ హోం వరకూ యూటీఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.లక్ష్మీరాజ, ఎస్.జయచంద్రారెడ్డి, బిళ్లా హరిప్రసాద్, జాబీర్, చెంగల్రాజు, వెంకటసుబ్బయ్య, రమణమూర్తి, నాగేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు -
ఆన్లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య
పీలేరు రూరల్ : ఆన్లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పీలేరు పట్టణం కట్టుకాలువ వీధికి చెందిన షేక్ ముబారక్ (25) పట్టణంలోని కడప రోడ్డు మార్గంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపారనిమిత్తం ఆన్లైన్ యాప్లో అప్పు తీసుకుని వ్యాపారం నిర్వహించాడు. వ్యాపారం సరిగ్గా జరగక అప్పు చెల్లించలేక ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో ఆన్లైన్ యాప్ నిర్వాహకులు వేధింపులు తాళలేక మంగళవారం తన ఇంటిలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. కూలిన పాఠశాల గోడ చిట్వేలి : చిట్వేలి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీకి సంబంధించిన గోడ బుధవారం కురిసిన వర్షానికి ఒకచోట కూలిపోయింది. పాఠశాల ప్రారంభంగాక మునుపే ఉదయం ఏడు గంటల సమయంలో గోడ కూలింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సంఘటనా స్థలాన్ని ప్రధానోపాధాయులు దుర్గరాజు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాయచోటి: పక్షవాతాన్ని జయించలేక ఇంటిలోని ఫ్యాన్కు ఉరి వేసుకొని ఓ యువతి తనువు చాలించింది. పట్టణంలోని పాత రాయచోటిలో నివాసముంటున్న గౌస్ మొహిద్దీన్ భార్య షేక్ మునీరా(39) గత ఆరు నెలలుగా పక్షవాతంతో బాధపడుతోంది. ఆసుపత్రులలో చికిత్స పొందినా.. ఆరోగ్యం మెరుగు పడక పోవడంతో మానసికంగా కుంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది. సాయంత్రం 5.30గంటలకు భర్త వచ్చి చూడగా అప్పటికే ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఉపాధ్యాయుడి హఠాన్మరణం
చిన్నమండెం : మండలంలోని టి.చాకిబండ జడ్పీ హైస్కూల్(తెలుగు)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీధర్రెడ్డి(55)కి పాఠశాలలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. రోజు మాదిరిగా ఉదయం పాఠశాలకు వచ్చిన ఆయన హఠాత్తుగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా తూర్పుపల్లి వద్దకు రాగానే మృతి చెందారు. శ్రీధర్రెడ్డి సొంత ఊరు సంబేపల్లె మండలం మొటుకువాండ్లపల్లె. ప్రస్తుతం చిన్నమండెం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు కలరు. మండలంలోని తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వైన్ షాపులో చోరీగుర్రంకొండ : మండలంలోని గుర్రంకొండలోని ఆర్కే బ్రాందీషాపులో చోరీ జరిగింది. స్థానిక తూముకుంట రోడ్లో ఆర్కే బ్రాందీషాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం వేకువ జామునే గుర్తుతెలియని దుండగులు బ్రాందీషాపు పైభాగంలో రేకు కత్తిరించి దుకాణంలో ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోని ఓ ల్యాప్టాప్, రూ.50 వేల విలువ చేసే మద్యం సీసాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ రఘరామ్ సిబ్బందితో కలసి వచ్చి వైన్ షాపు, చోరి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షాపు నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఎరచ్రందనం దుంగలు స్వాధీనంతిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా కేవీ.బావి అటవీ ప్రాంతంలో తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్, సిబ్బంది కోడూరు పరిధిలోని కెవీ.బావి ఆటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున నొక్కోడి గుండం వద్ద కొందరు వ్యక్తులు ఎరచ్రందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. టాస్క్ఫోర్స్ పోలీసులను చూసి వారు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. దుంగలతో పాటు వారిద్దరినీ తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి హత్యకేసులో సంచలన తీర్పు
రాజంపేట : ఎర్రబల్లికి చెందిన నర్రెడ్డి సమిత్రమ్మ(60) హత్య కేసులో రాజంపేట మూడో అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితురాలు వెలమచల ఇందిరమ్మకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. పట్టణ సీఐ నాగార్జున, ఎస్ఐ వెంకటేశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 2019 మే, 2న తన తల్లి నరెడ్డి సుమిత్రమ్మను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఇంట్లో బంగారు వస్తువులను దోచుకెళ్లారని మృతురాలి కుమారుడు నర్రెడి్డ్ మహీధర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అప్పటి సీఐ నిరంజన్కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సీఐ దర్యాప్తు చేసి 2020 మార్చి, 9న వెలచలమల ఇందిరమ్మ(దేవరపల్లె, వెలిచలమల్ల పంచాయితీ,నంబూలపూలకుంట మండలం,అనంతపురం జిల్లా), నర్రెడ్డి శ్వేత(ఎర్రబల్లి,రాజంపేటటౌన్), ఓర్సు నాగరాజు (డ్రైవర్, కొండ్లవాండ్లపల్లె,నంబూపూలకుంట మండలం, అనంతపురం), మల్లెల రమేష్ (కూలి, కొండ్లవాల్లపల్లె, నంబూలపూలకుంట మండలం, అనంతపురం), ఒర్సు మల్లికార్జున (డ్రైవర్, కొండ్లవాల్లపల్లె, నంబూలపూలకుంట మండలం అనంతపురం)లను అరెస్టు చేశారు. వారి వద్ద మృతురాలికి చెందిన సరుడు, రెండు గాజులు, డైమండ్ నెక్లస్, జత కమ్మలు, రెండు వెండి దీపాలు, హత్యకు ఉపయోగించిన దిండు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. తదుపరి సీఐ చంద్రశేఖర్ వారిపై చార్జ్షీట్ దాఖలు చేయగా మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ సాగింది. సాక్ష్యాలు నిజమని తేలడంతో వెలిచెలమల ఇందిరమ్మ(47)కు జీవిత ఖైదు విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి తీర్పు వెలువరించారన్నారు. ఈ కేసులో నేరారోపణ రుజువు కానందున నర్రెడ్డి శ్వేత, ఒర్సు నాగరాజు, మల్లెల రమేష్, ఒర్సు మల్లికార్జున (విచారణలో మరణం)లకు విముక్తి కలిగించారన్నారు. సీఐ నిరంజన్కుమార్, హనుమంత్నాయక్, ఎం.చంద్ర శేఖర్, పీపీ షేక్జానీ, ప్రస్తుత పీపీ కొమ్మినేని వేణుగోపాల్, జీ.సుబ్బరాయుడు, ఏఎస్ఐ శంకరయ్యలను రాజంపేట ఎఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే అభినందించారని వెల్లడించారు. కేసులో ఇందిరమ్మకు జీవిత ఖైదు -
పింఛా ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్
వివరాలు తెలుసుకుంటున్న సబ్ కలెక్టర్ భావన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు సుండుపల్లె : మండలంలోని పింఛా ప్రాజెక్టును రాజంపేట సబ్ కలెక్టర్ భావన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి, ఇప్పటివరకు జరిగిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు వచ్చే జల వనరులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి పంపిణీ తీరుపై ఆరా తీశారు. ప్రాజెక్టు వద్ద వాతావరణం ఆహ్లాద కరంగా ఉందని, పర్యటకులకు మరిన్ని వసతులు కల్పించి పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టిరోడ్డు సుండుపల్లె : పింఛా ప్రాజెక్టు పైభాగంలో మోస్తరు వర్షాలు పడడంతో ప్రాజెక్టులోకి వరదనీరు చేరింది. దీంతో నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ ప్రవాహానికి రాయవరం బహుదా నదిపై ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. -
రూ.20వేల చెక్కును రూ.2.20 లక్షలుగా మార్చి
● పెద్దినేనికాలువ సర్పంచ్ బంధువు ఫోర్జరీ ● చెక్కు మార్చారని ప్రశ్నిస్తే అధికారులపై దూషణపర్వం ● గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శికి గుండెపోటు సుండుపల్లె : గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు ఇచ్చిన రూ.20 వేల చెక్కును రూ.2.20 లక్షలకు మార్చిన సంఘటన సుండుపల్లె మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. పెద్దినేనికాలువ పంచాయతీలో పనులు చేసినందుకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి సర్పంచ్ సంతకంతో కూడిన రూ.20 వేల చెక్కును ఆ సచివాలయ పంచాయతీ కార్యదర్శి శ్రీనాథ్రెడ్డి సర్పంచ్ బంధువైన పసుపులేటి నాగేంద్రకు రాసి ఇచ్చారు. అయితే ఆ సర్పంచ్ బంధువైన పసుపులేటి నాగేంద్ర రూ.20 వేల చెక్కులో అంకెలు మార్చి రూ.2.20 లక్షలుగా రాసి ఆ నగదును తన సొంత అకౌంట్లోకి జమచేసుకున్నాడు. పంచాయతీ నిధుల నుంచి రూ.2.20 లక్షల నగదు డ్రా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి చరవాణికి సమాచారం రావడంతో చూసి ఆశ్చర్యపోయిన ఆయన వెంటనే తమపై అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. డిప్యూటీ ఎంపీడీఓ సురేష్బాబుతో కలిసి బ్యాంకుకు నిధులు ఆపాలని బ్యాంకు మేనేజర్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు నిధులు డ్రా చేసిన వ్యక్తి అకౌంట్ను బ్లాక్ చేశారు. అప్పటికే ఆ అకౌంట్ నుంచి రూ.20 వేల నగదు డ్రా చేసినట్లు వారు తెలిపారు. రూ.20 వేల చెక్కును రూ.2.20 లక్షలుగా ఎందుకు మార్చావని డ్రా చేసిన వ్యక్తిని పంచాయతీ కార్యదర్శి ప్రశ్నించగా తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికి గుండెనొప్పి వస్తుండటంతో సిబ్బంది గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వాహనం ఢీకొని మహిళ మృతి
కలకడ : గుర్తుతెలియని వాహనం ఢీకొని జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన పెద్దరెడ్డెప్ప భార్య శెట్టిపల్లె జయమ్మ(54) మంగళవారం పొలం వద్దకు నడచి వెళ్తోంది. మార్గమధ్యంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయమ్మ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ.. కలికిరి : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం కలికిరిలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కలికిరి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన పాలగిరి నూరుల్లా తన భార్య షరీఫా(46)తో కలిసి ద్విచక్ర వాహనంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి క్రాస్ రోడ్డుకు బయలుదేరారు. వెనుకవైపు నుంచి వచ్చిన మదనపల్లె డిపో బస్సు వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షరీఫాను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. కారు ఢీకొని ఒకరు దుర్మరణం సంబేపల్లె : మండలంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఓ కారు స్కూటర్ను డీ కొన్న ప్రమాదంలో భాస్కర్రెడ్డి(77) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కలకడ మండలం బాలయ్యగారిపల్లెకు చెందిన నగిరిమడుగు భాస్కర్రెడ్డి స్కూటర్లో సొంత పనుల నిమిత్తం కలకడకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బాలయ్యగారిపల్లె క్రాస్ సమీపంలో రాయచోటి నుంచి చైన్నెకి వెళ్తున్న కారు స్కూటర్ను ఢీకొనడంతో భాస్కర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటితాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యం ఎర్రగుంట్ల : మండలంలోని హనుమనుగుత్తి గ్రామానికి చెందిన దుద్దేల శ్యామల(42) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. శ్యామలకు మతిస్థిమితం సరిగా లేదు. ఈ నెల 9న మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి బయటకు వచ్చి కనిపించలేదు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్ : పేద విద్యార్థులకు వైద్యరంగంలో మరింత అవకాశాలు కల్పించాలనే దూరదృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడకల్ కాలేజీల స్థాపనకు శ్రీకారం చుట్టిందని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడాన్ని అందరూ వ్యతిరేకించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగం రెడ్డకిశోర్దాస్ అన్నారు. రాయచోటిలో బుధవారం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో రూ.8,500 కోట్ల వ్యయంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోపిడీ చేయగా ప్రభుత్వాసుపత్రులు మాత్రం పేదలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.2.15 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడం ఆపేయాలన్నారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం నిజాయితీగా పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 19న ఉదయం 9.30 గంటలకు మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటోరియం వద్ద చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నామని రెడ్డికిశోర్దాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ అద్దెబస్సు బోల్తా
సిద్దవటం : సిద్దవటం నుంచి కడపకు వెళ్తున్న ఏపీ39యుజీ4591 నెంబర్ అల్ట్రా పల్లె వెలుగు ఆర్టీసీ అద్దె బస్సు బుధవారం భాకరాపేట సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తా పడింది. ఈ బస్సులో బస్సు డ్రైవర్ వెంకటనారాయణ, కండెక్టర్ శివయ్యతోపాటు భారతీ, వెంకటేష్, సుబ్బనరసమ్మ, లక్ష్మమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. అద్దె బస్సు డ్రైవర్ వెంకటనారాయణ కథనం మేరకు..భాకరాపేట సమీపంలోని పెద్దవంక కల్వర్టు వద్ద కడప నుండి బద్వేల్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు అతి వేగంగా వస్తుండగా కల్వర్టు రహదారిపై బస్సు నిలిపివేయడం జరిగిందన్నారు. బస్సులో అరవై మందికిపైగా ప్రయాణీకులు ఉన్నారని, బస్సు అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. కండక్టర్ శివయ్యపై ప్రయాణికులు పడటంతో చేతికి గాయాలయ్యాయన్నారు. మరో నలుగురు ప్రయాణీకులకు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. విషయాన్ని తెలుసుకున్న 11వ బెటాలియన్ పోలీసులు బస్సు అద్దాలను పగులుగొట్టి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, బద్వేల్, కడప ఆర్డీఓలు జాన్ఇర్విన్, చంద్రమోహన్, 11వ ఏపీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, కమాండెంట్ ఆనంద్రెడ్డి, ఒంటిమిట్ట సీఐ బాబు, ఎస్ఐ మహమ్మద్ రఫీ, ఆర్అండ్బీ ఏఈ రామాంజనేయులు, డిప్యూటీ తహసీల్దారు మాధవీలత సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనకు దారి తీసిన కారణాలను తెలుసుకున్నారు. ఎస్ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకొని బోల్తాపడిన ఆర్టీసీ బస్సును రెండు క్రేన్ల సహాయంతో తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. కల్వర్టు వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశామని తెలిపారు. ఆర్టీసీ కండక్టర్ శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. డ్రైవర్, కండక్టర్తో సహా, నలుగురికి స్వల్ప గాయాలు -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ఒంటిమిట్ట: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ పి మనోరమ తెలిపారు. శుభ్రతతో వ్యాధులు దరిచేరవని తెలిపారు.బుధవారం మండలంలోని చింతరాజుపల్లి పంచాయతీలోగల చింతరాజుపల్లి హరిజనవాడ, గాండ్లపల్లి గ్రామాలలో విష జ్వరాలు, కీటక వ్యాధులపై మలేరియా సబ్ యూనిట్ అధికారి డాక్టర్ ఐ సుబ్బరాయుడు, మండల వైద్యాధికారి డాక్టర్ భావనతో కలిసి ఆమె విస్తృత పర్యటన చేశారు. ఇంటింటికి తిరిగి లార్వా, వైరల్ జ్వరాల సర్వే నిర్వహించారు. అక్కడ అనారోగ్యంతో బాధఫడుతున్న కొంతమందికి విష జ్వరాలకు సంబంధించి రక్త పరీక్షలు చేయగా అందరికీ నెగిటీవ్ వచ్చినట్లు నిర్ధారించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లవద్ద మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మలేరియా అధికారు పేర్కొన్నారు.కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ జి భాస్కర్ రెడ్డి, ఏ లక్ష్మీనరసమ్మ, ఆరోగ్య కార్యకర్తలు ఎస్ కరిమున్నీషా, ఎ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.