
రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు
రాయచోటి టౌన్ : రాయచోటి ఏరియా ఆస్పత్రిలో రూ.23 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి ఏరియా ఆస్పత్రిలో నూతన ఆస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తమ తండ్రి మండిపల్లి నాగిరెడ్డి కూడా మృతి చెందారన్నారు. అలాంటి ప్రమాదాల్లో మరణాలు తగ్గించేందుకు ఈ క్రిటికల్ కేర్సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్, ఆస్పత్రి కమిటి చైర్మన్ ఖాదర్ బాషా, సభ్యులు లయన్ మహమ్మద్ పాల్గొన్నారు.