
పోలీస్ గ్రౌండ్లో ఓపెన్ ఎయిర్ జిమ్ ప్రారంభం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొల్పిన ప్రకృతి వ్యాయామశాల (ఓపెన్ ఎయిర్జిమ్)ను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సతీష్కుమార్ సతీమణి ధరణ్యసతీష్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కవాతు మైదానంలో ఏర్పాటుచేసిన ఓపెన్ ఎయిర్ జిమ్, చిన్నారుల క్రీడా పరికరాలను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ అనేక ఒత్తిళ్లు, ఉరుకులు పరుగులతో కూడిన మానవుని జీవితంలో వ్యాయామం తప్పనిసరి అని అన్నారు. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చునని చెప్పారు. చిన్నారులు ఆడుకునేందుకు ఆటస్థలం ఉందని అన్నారు. వ్యాయామశాల ఏర్పాటుకు సహకరించిన సీసీ ఉప్పాల ఆదిశేషు, జిమ్ శిక్షకుడు కానిస్టేబుల్ శ్రీనివాసరావును ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో శిక్షణా ఐపీఎస్ అధికారిణి దీక్ష, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ, పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.