![Redseer says Smartphone bonanza drives e commerce usd 3.5 bn in 4 days - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/28/smartphone.jpg.webp?itok=tasPR6Xd)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిముషానికి 1,100 మొబైల్ ఫోన్లు.. పండగల సీజన్ విక్రయాల్లో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల వేదికలపై నాలుగు రోజుల్లో అమ్ముడైన సంఖ్య ఇది. వీటి విలువ రూ.11,000 కోట్లు అని కన్సల్టెన్సీ కంపెనీ రెడ్సీర్ వెల్లడించింది.
‘సెప్టెంబర్ 22-25 మధ్య ఈ–కామర్స్ సంస్థలు రూ.24,500 కోట్ల వ్యాపారం నమోదు చేశాయి. సేల్-1 అంచనా విక్రయాల్లో ఇది 60 శాతం. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, మీషో మెగా బ్లాక్బస్టర్ సేల్తోపాటు మింత్రా, అజియో, నైకా తదితర వేదికలు సేల్-1లో ఉన్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఫ్యాషన్ విభాగం నాలుగున్నర రెట్లు అధికంగా అమ్మకాలు జరిగి రూ.5,500 కోట్లకు చేరుకున్నాయి’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment