
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా తులం పసిడి ధర గరిష్టంగా రూ. 160 పెరిగింది. దీంతో నిన్న స్థిరంగా వున్న గోల్డ్ రేటు, ఈ రోజు కొంత ముందుకు కదిలింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68800 వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 75050 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్), రూ. 160 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68800 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75050గా ఉంది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలలో స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ బంగారం ధర రూ. 68950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75150 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు, ఈ రోజు వరుసగా రూ. 150, రూ. 110 పెరిగింది.
ఇదీ చదవండి: 'ఏఐకు అదో పెద్ద సవాలు'
వెండి ధరలు
దేశంలో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 98,000 వద్ద ఉంది. ఈ రోజు కేజీ వెండి ధర రూ.1000 పెరగడంతో రూ. 98వేలకు చేరింది. ఇదే ధరలు దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కొనసాగుతాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).