
ఐదు రోజుల నుంచి అస్సలు పెరగని పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ) ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57800 (22 క్యారెట్స్), రూ. 63050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు రూ.100 పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.
చెన్నైలో కూడా ఈ రోజు తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 100 పెరిగింది. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 58400 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 63710గా ఉంది.
ఇదీ చదవండి: భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఢిల్లీలో కూడా ఈ రోజు పసిడి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. నేడు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57950 (22 క్యారెట్స్), రూ. 63200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. ఈ రోజు వెండి ధరలు రూ. 500 పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు వెండి ధరలు నిన్నటి కంటే రూ. 500 ఎక్కువని స్పష్టమవుతోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై ప్రాంతాల్లో కూడా ఈ రోజు వెండి ధరలు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment