
ఆషాడంలో కూడా బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండు రోజులు స్వల్పంగా తగ్గితే.. అంతకు మించి ఒకేరోజులో ధరలు పెరిగిపోతున్నాయి. ఈ రోజు (జులై 16) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 490 వరకు పెరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67850 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.74020 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 350, రూ. 380 పెరిగింది.
ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 పెరిగింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68000 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74170 వద్ద ఉంది.
చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68300 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74510 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 450, రూ. 490 పెరిగినట్లు స్పష్టమవుతోంది.
వెండి ధరలు
బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర మునుపటికంటే రూ. 200 తగ్గింది. దీంతో కేజీ వెండి కొనుగోలు చేయాలంటే రూ. 95000 వెచ్చించాల్సి ఉంటుంది. వెండి ధరలు తగ్గడం వరుసగా ఇది రెండో రోజు కావడం గమనార్హం.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).