సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ మెంబర్గా మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఐదురుగు సభ్యులతో కూడిన వైఎస్సార్ సీపీ ‘రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ’ ఏర్పాటు చేశారు. అందులో వనితకు స్థానం దక్కింది.
31 లోగా ఈ–శ్రమ్
ఇన్సూరెన్సు క్లెయిమ్ చేసుకోవాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు అయ్యి, ప్రమాదానికు గురై మరణించిన, శాశ్వత అంగ వైకల్యం, పాక్షిక అంగ వైకల్యం కలిగిన అసంఘటిత కార్మికులకు యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ కోసం మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ బీఎస్ఎం వలీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించే ఉద్దేశంతో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వంవన్ టైం ఎక్స్గ్రేషియా చెల్లింపు కోసం ఆగష్టు, 2023 లో ఎక్స్ గ్రేషియా మాడ్యూల్ ను ప్రారంభించారన్నారు. మార్చి 31, 2022 న, అంతకు ముందు ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తూ మరణించిన, అంగ వైకల్యం పొందిన అసంఘటిత కార్మికులు క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు అని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 2022 సంవత్సరం మార్చి 31లోపు ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యము కల్గి ఇప్పటివరకు ఈ కై ్లములు దాఖలు చేసుకోని వారు ఉంటే అటువంటి అసంఘటిత కార్మికులు, నామినీలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బలభద్రపురంలో హెల్త్
ఎమర్జెన్సీ ప్రకటించాలి
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ఉమామహేశ్వరరావు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): బలభద్రపురంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, క్యాన్సర్ విస్తృతిపై సమగ్ర పరిశీలన చేపట్టి ప్రజారోగ్యం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలభద్రపురంలో సీపీఎం బృందం పర్యటించిందని, అక్కడి ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. గడిచిన వారం రోజులలోనే క్యాన్సర్ వ్యాధితో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. గడిచిన రెండేళ్లలో బలభద్రపురంలోనే 25 మంది మృతి చెందినట్లు బలభద్రపురం సర్పంచ్ బి.రామారావు, జాబితా సైతం ప్రకటించారని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. బలభద్రపురంలో ఏర్పాటు చేసిన గ్రాసిమ్ పరిశ్రమ వ్యర్థాలు ఎక్కడకు విడుదల చేస్తున్నారని ప్రశ్నించారు. కాలుష్య తీవ్రత గురించి స్పష్టత ఇవ్వాలని కోరారు. జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థి అంజలి ఆత్మాహత్యా యత్నంపై బొల్లినేని యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. అందుకు కారణమైన దీపక్ హాస్పిటల్లో ఏ విభాగంలో పనిచేస్తారో ఇప్పటికీ వెల్లడించకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రేపటి నుంచి జాతీయ సదస్సు
బాలాజీచెరువు: స్థానిక ఐడియల్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ,ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవిని కుమారి మంగళవారం తెలిపారు. కన్వర్జన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఇన్ అడ్వాన్స్డ్ నానో మెటీరియల్స్ అండ్ నానోటెక్నాలజీ అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు.