సామర్లకోట: స్థానిక ఏడీబీ రోడ్డులోని రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్లో బుధవారం కార్మికుడు మృతి చెందాడు. ఫాక్టరీ ప్రారంభమైన రోజునే ఈ ఘటన జరగడంతో అంతటా విషాదం నెలకొంది. ఫ్యాక్టరీలో పనులు చేస్తున్న సమయంలో పైనుంచి పడి రంగనాథం నాగబాబు (40) అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైన్లో స్నానానికి దిగి వృద్ధుడు..
మామిడికుదురు: ఆదుర్రు గ్రామంలోని డ్రైన్లో మంగళవారం స్నానానికి దిగి కొమరాడలంకకు చెందిన బిరుదుగంటి నాగేశ్వరరావు (64) మృతి చెందాడు. ఈ విషయాన్ని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. అతడి కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రితో పోస్టుమార్టం నిర్వహించారన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
తుని: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట మోటారు సైకిల్పై వెళుతున్న యువకుడిని ఎదురుగా వస్తున్న బోలోరా వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడని తుని పట్టణ సీఐ ఎం.గీతారామకృష్ణ తెలిపారు. బుధవారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన చందక శివ శంకర నారాయణ (29) ఎస్.అన్నవరం రోడ్డులో బైక్పై వెళుతున్నాడు.
అతడిని తొండంగి మండలం నుంచి వస్తున్న బోలోరా వాహనం ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాంగ్ రూట్ వచ్చి యువకుడి ప్రాణాలను తీసిన బోలోరా వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివ శంకర నారాయణ తుని పట్టణంలోని ఎకై ్సల్ బ్రాడ్ బ్యాండ్లో టెక్నిషియన్గా పని చేస్తున్నాడు. అతడిని ఇటీవలే వివాహం జరిగింది.