చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి భర్త మృతి | - | Sakshi

చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి భర్త మృతి

Apr 4 2025 12:09 AM | Updated on Apr 4 2025 12:09 AM

చికిత

చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి భర్త మృతి

ఏలేశ్వరం: గత నెల 20న మండల పరిధిలోని తిరుమాలిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గెద్దనాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బొడ్డేటి నాగలక్ష్మి భర్త గోవిందు(39) గురువారం చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం కిర్లంపూడి మండలం గెద్దనాపల్లికి చెందిన గోవింద్‌ బెల్లం వ్యాపారం కోసం గత నెల 20న మోటారుబైక్‌పై ఏలేశ్వరం వస్తుండగా మార్గమధ్యలో తిరుమాలి వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

రాయవరం: ఇటీవల రాయవరం ఆలయంలో పట్టపగలు జరిగిన చోరీ ఘటనలో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వివరాలను రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాయవరం అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి మెడలో మంగళసూత్రాలు చోరీ చేసిన నిందితుడు తోరాటి సాయివరప్రసాద్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన సాయివరప్రసాద్‌ మహేంద్రవాడ్‌ రోడ్డులో పాత హెచ్‌పీ గొడౌన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు సాయివరప్రసాద్‌ను విచారించగా, నేరం అంగీకరించాడన్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు మంగళసూత్రంతో పాటుగా, బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ చేసిన వెండి కిరీటం, వెండి చెవులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి అనపర్తి జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారన్నారు. నేరం జరిగిన 48 గంటల్లో కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్‌ చేసిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్‌బాబు, పీసీ జీవీ కుమార్‌ను జిల్లా ఎస్పీ అభినందించారు.

చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి భర్త మృతి  1
1/1

చికిత్స పొందుతూ ఎంపీటీసీ సభ్యురాలి భర్త మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement