ప్రధాన వార్తలు

ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్ జగన్
కేవలం 500 మంది మాత్రమే రావాలట! అంటే, కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తోంది? జగన్ వస్తే తప్పేమిటి? నేను రైతులతో మాట్లాడితే, వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు.ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి, టూవీలర్స్పై ఎవరైనా వస్తే పెట్రోలు పోయొద్దంటూ బంక్ల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా?మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక, రైతులకు కనీసం రెండున్నర, మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో.. ఆ సరుకు వాహనాల్లోనే కుళ్లిపోతోంది. మామిడి రైతులు చివరకు లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి, రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైఎస్సార్సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను. -వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రాష్ట్రంలో ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్నారు. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా దారుణం. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కిలో మామిడి రూ.2కే దొరుకుతుందా? కిలో మామిడికి కనీసం రెండున్నర రూపాయలు కూడా రావడం లేదని మామిడి రైతులు చెబుతున్నారు. ఇంత దుర్భర స్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నేను మామిడి రైతుల సమస్యలను ఆరా తీసేందుకు ఇక్కడికి వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టింది. నా పర్యటనను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ రైతులను సైతం అడ్డుకుంది. రైతులకు మంచి జరగకూడదని కోరుకుంటోంది. ఎవరూ బయటకు తొంగి చూడకూడదని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపోతున్నా కూడా ఎవరూ స్పందించ కూడదని ఉద్దేశంగా పెట్టుకుంది. అసలు జగన్ రైతుల్ని కలిస్తే తప్పేమిటి? రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉండి ఉంటే, వారికి అసలు సమస్యే లేకపోతే ఇక్కడికి ఇంత మంది ఎలా వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి.. జగన్ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుందని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుంభకర్ణుడి నిద్ర నుంచి లేపడం కోసమే ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చి తమ ఆక్రందన వినిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కిలో మామిడికి కనీసం రూ.12 (టన్నుకు రూ.12 వేలు) వచ్చేలా చూడాలి. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇన్నాళ్లూ గాడిదలు కాశారా?⇒ చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా నా ప్రశ్నలు.. ఏటా మామిడి కొనుగోళ్లు మే 10 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఈ ఏడాది ఎందుకు అలా మొదలు పెట్టలేదు?⇒ జూన్ 3వ వారం వరకు కొనుగోళ్లు ఎందుకు మొదలు కాలేదు?⇒ ఎప్పటిలాగే మే రెండో వారంలో మామిడి కొనుగోళ్లు జరిగేలా ఈ ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్ల జూన్ 3వ వారం నాటికి మామిడి పంట మార్కెట్ను ముంచెత్తడం నిజం కాదా?⇒ రైతులంతా మామిడి పల్ప్ కంపెనీల వద్ద బారులు తీరడం మీకు కనిపించ లేదా? ఎవరి వల్ల ఈ దుస్థితి ఏర్పడింది?⇒ పల్ప్ ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంతో వాహనాల్లోనే మామిడి పంట కుళ్లిపోవడం మీకు కనిపించ లేదా? కేజీ మామిడి రూ. 2తో కొంటుండటం వాస్తవం కాదా? మీ పుణ్యాన ఈ పంటకు ఇక ధర రాదనే బాధతో చెట్లను కొట్టేసుకున్న రైతులను బెదిరిస్తారా?అశేష జనసందోహం నడుమ మార్కెట్ యార్డు లోపలికి వెళుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒ చిత్తూరు జిల్లాలో 52 మామిడి పల్ప్ కంపెనీలు ఉన్నాయి. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ఆ ఫ్యాక్టరీలు జూన్ 3వ వారం వరకు తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాశారు?⇒ ఎంత మంది రైతుల నుంచి ఈ ఫ్యాక్టరీలు కిలో మామిడి రూ.8 చొప్పున కొన్నాయి?⇒ మీరు గొప్పగా ప్రచారం చేస్తున్న అదనంగా రూ.4 ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఈ రోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి ఉందంటే అది మీ నిర్వాకం కాదా?⇒ పక్కన కర్ణాటకలో జనతాదళ్కు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే, కిలో మామిడి రూ.16 చొప్పున కొనేందుకు కేంద్రం ముందుకొచ్చిందట. నిజానికి అది మంచి రేటు అని కాదు.. కనీస రేటు అని చెప్పి, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోయారు? ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది?⇒ చిత్తూరు జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఆ 76 వేల రైతుల కుటుంబాల్లో ఎంత మందికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ మామిడి ధర రూ.12 చొప్పున దక్కింది? ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నిరుడు కిలో మామిడి రూ.29కి రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు కేవలం రూ.2 కే కిలో అమ్ముకుంటున్నారు. అలా ఆ రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టడం భావ్యమా? ⇒ ఇక్కడికి జగన్ వస్తున్నాడని చెప్పి, మూడు రోజుల నుంచి కిలో మామిడికి రూ.6 ఇస్తామని మెసేజ్లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రైతులకు వాస్తవంగా కనీసం కిలో మామిడికి రూ.2 కూడా రావడం లేదంటే.. మీరు నిద్రపోతున్నారా?రైతన్నలకు అండగా గత ప్రభుత్వంమా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉండేవాళ్లం. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పెట్టుబడి సహాయం అందేది. అడుగడుగునా రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. అవి వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరిగేది. ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. నాడు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ నోటిఫై చేసే వారు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ, మార్క్ఫెడ్ పాత్ర పోషించే వారు. అలా అందరూ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి.. ఆ ఆర్బీకే పరిధిలో ఈ–క్రాప్ ఆధారంగా పంటను కొనుగోలు చేసే వారు.ఇప్పుడవన్నీ కనుమరుగుఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతుల బతుకులు తలకిందులయ్యాయి. వారు తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారు. ఈ రోజు ఏం జరుగుతోంది? మొదటి ఏడాది దాటిపోయింది. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ ఏడాది జూన్ కూడా అయిపోయింది. జూలైలో ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇంకా చంద్రబాబునాయుడు గారి పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. ఆయన పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. ఆర్బీకేలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఈ – క్రాప్ లేకుండా పోయింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, యూరియా, ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని విభాగాలు ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టడి ప్రయత్నాలు అత్యంత దారుణంశశిధర్రెడ్డి అనే వ్యక్తి రైతు కుటుంబానికి చెందిన వారు కాదా? పోలీసుల దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది అని అడుగుతున్నా.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది ఆ రంగం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా? ఇక్కడికి రావొద్దని దాదాపు 1200 మంది రైతులను నిర్బంధించారు. ఇక్కడికి వచ్చిన రైతులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్ చేశారు. ఇది అత్యంత దారుణం.

ట్రంప్ తిరుగుబాట!
ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి చేజిక్కించుకోవాలన్న ఆత్రపడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించని రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఆగ్రహించి ఉక్రెయిన్కు తిరిగి ఆయుధాలు సరఫరా చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించారు. ట్రంప్ వచ్చే నాటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా దాన్ని ఆపాలంటూ పిలుపునిచ్చి పలు దఫాలు రెండు దేశాలతోనూ మాట్లాడారు. దూతల్ని పంపారు. కానీ పుతిన్ ముందు అవేమీ పనిచేయలేదు. మారణాయుధాల డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు పలు నగరాలపై దాడులు సాగిస్తూనే ఉన్నారు. అమెరికా నుంచి ఆయుధ సరఫరా నిలిచి పోవటం, దాడులకు అనువైన వేసవి కాలం కావటం రష్యాకు కలిసొచ్చింది. తూర్పు ఉక్రెయిన్లోని డొనెస్క్ ప్రాంతాన్ని కైవసం చేసుకోవటం ఆయన లక్ష్యంగా కనబడుతోంది. 2022 తర్వాత ఈ ప్రాంతంలో రష్యాది పైచేయి కావటం ఇదే తొలిసారి. ఇప్పటికే డొనెస్క్ ప్రాంతంలో మూడింట రెండొంతుల ప్రాంతం రష్యా దళాల అధీనమైంది. అక్కడి కాస్టన్టేనుకా నగరం తమ వశమైతే డొనెస్క్ ప్రాంతంలో వరసగా ఉన్న నగరాలన్నీ కుప్పకూలుతాయని ఆ దళాలు భావిస్తున్నాయి.దౌత్యం నెరపదల్చుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి. మధ్యవర్తిగా రెండు పక్షాలతో మాట్లాడి వారి డిమాండ్లేమిటో ముందు తెలుసుకోవాలి. అటు ఉభయ పక్షాలూ కొంత తగ్గటానికి సిద్ధపడాలి. తగ్గటం మాట అటుంచి రష్యా–ఉక్రెయిన్లు రెండూ యుద్ధం కొన సాగింపులోని నిరర్థకతను గుర్తించటం లేదు. ఎప్పటిలా అమెరికా ఆయుధాలు అందజేస్తే తన వంతుగా రష్యాపై దాడులు సాగిస్తాననీ, పర్యవసానంగా ఎప్పటికైనా ఆధిక్యత సాధించగలననీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నారు. ఈ మాటలు మాట్లాడేది ఆయనే అయినా, పలికి స్తున్నది పాశ్చాత్య దేశాలు. ట్రంప్ ఊగిసలాట ధోరణి, దేనికీ కట్టుబడి ఉండని ఆయన వైఖరి వగైరాలు ఏదో దశలో ఉక్రెయిన్కు అక్కరకొస్తాయని అవి భావిస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్ ఈ యుద్ధంలో ఎప్పుడో ఓటమిపాలైంది. దాన్ని కప్పిపుచ్చటానికి బైడెన్ ఏలుబడిలోని అమెరికా, పాశ్చాత్య దేశాలూ ఎప్పటికప్పుడు ఉక్రెయిన్కు అధునాతన ఆయుధాలందిస్తూ రష్యా నగరాలపై, దాని యుద్ధ నౌకలపై, ఇతరేతర కీలక ప్రాంతాలపై దాడులు కొనసాగేలా చూశాయి. కానీ ట్రంప్ వచ్చాక ఆయుధ సాయం ఆగిపోయింది. ఆర్థిక సాయమూ నిలిచిపోయింది. పాశ్చాత్య దేశాలు అతి కష్టమ్మీద తమ వంతుగా ఆ బరువును భుజాలకెత్తుకున్నా అది ఏ మూలకూ చాలటం లేదు. అందుకే గత పక్షం రోజులుగా రష్యా సాగిస్తున్న వరస దాడులతో ఉక్రెయిన్కు ఊపిరాడటం లేదు. డొనెస్క్ నగరాన్ని రక్షించటంలో నిమగ్నమైన తన దళాలకు ఆహారమూ, ఆయుధాలూ పంపటం మాట అటుంచి కనీసం గాయపడినవారిని వెనక్కి తీసుకొచ్చే వెసులుబాటు కూడా దొరకటం లేదు. ఆ నగరం చుట్టూవున్న ప్రాంతాలన్నీ రష్యా చేజిక్కించుకుంది. నిజానికి ఈ యుద్ధం ఉక్రెయిన్ స్వయంకృతం. అమెరికా, పాశ్చాత్య దేశాల మాట విని రష్యాపై గిల్లికజ్జాలకు పోయింది. పక్షంరోజుల్లో రష్యాను దారికి తీసుకురాగలమని పాశ్చాత్య దేశాలు విశ్వసించాయి. రష్యా తమపైకి దండెత్తి వస్తే ‘నాటో’ సైన్యాలతో దాన్ని సులభంగా మట్టికరిపించగలమను కున్నాయి. ఇందుకోసం ఉక్రెయిన్లో తమకు అనుకూలుడైన జెలెన్స్కీకి పట్టంగట్టాయి. రష్యాతో సమవుజ్జీ కాకపోవటంతో ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. పాశ్చాత్య దేశాల బాసటతో రష్యాకు నష్టం కలిగించిన మాట నిజమే అయినా, అదే ఇప్పుడు రష్యా పట్టుదలకు కారణమైంది. యుద్ధం ఆపాలని ట్రంప్ నేరుగా పుతిన్తో ఫోన్ సంభాషణలు సాగించినప్పుడు ఆయన ‘మూల కారణాల’ను ప్రస్తావించారని, అవి పరిష్కారం అయితే తప్ప యుద్ధం ఆపేది లేదన్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ మూల కారణాల్లో నాటో దూకుడు ఒకటైతే, ఉక్రెయిన్ను ఉసిగొల్పటం రెండోది. యూరప్ భద్రతకు సంబంధించి కొత్త అమరిక ఉండాలని, యుద్ధం ఆగాక ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వమీయరాదని పుతిన్ కోరుతున్నారు. నాటో కూటమి ఏర్పడినప్పుడు సోవియెట్ యూనియన్ నుంచి పశ్చిమ యూరప్ను పరిరక్షించటమే ధ్యేయమని అది ప్రకటించింది. అదే నిజమైతే 1989లో సోవియెట్ కుప్పకూలి అనేక దేశాలుగా విడివడినాక నాటో అవసరం ఏముంది? సోవియెట్ చివరి అధినేత గోర్బచెవ్ అప్పట్లో ఒక ప్రతిపాదన చేశారు. ‘నాటోను రద్దయినా చేయండి... లేక ఆ కూటమిలో మాకు చోటైనా ఇవ్వండి’ అన్నదే దాని సారాంశం. అందువల్ల యూరప్ బలపడుతుందనీ, సౌభాగ్యవంతమవుతుందనీ ఆయన చెప్పారు. కానీ అమెరికా ఇందులో కీడు శంకించింది. యూరప్ తనను మించి ఎదుగుతుందని భయపడింది.తూర్పు యూరప్ దేశాలను నాటోలో చేర్చుకోబోమని అప్పట్లో గోర్బచెవ్కి హామీ ఇచ్చారు. కానీ అర డజను దేశాలకు సభ్యత్వమిచ్చారు. వేరే దేశాలతో సరిహద్దు తగాదాలు లేని దేశాలను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధనకు మంగళం పాడారు. చివరకు ఉక్రెయిన్ను చేర్చుకోవటానికీ సిద్ధపడ్డారు. రష్యాపైకి ఉసిగొల్పారు. వీటిని చర్చించకుండా, ఎలాంటి పరిష్కారం అవసరమో యోచించకుండా ట్రంప్ తన ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా ‘యుద్ధం ఆపండం’టూ సందేశాలు పెడుతూ, నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురుచూస్తూ కాలం గడిపితే ఫలితం ఉండదు. ట్రంప్ నిజంగా యుద్ధం ఆపదల్చుకుంటే తటస్థ ఉక్రెయిన్కు పూచీపడాలి. నాటో విస్తరణ ఉండబోదని తెలపాలి. ట్రంప్ ఆ పని చేయగలరా?

కలిసి సాగుదాం..ప్రగతి సాధిద్దాం.. నమీబియాకు ప్రధాని మోదీ పిలుపు
విండోహెక్: అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రను భారత్ గుర్తిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అధికారం, ఆధిపత్యం ద్వారా కాకుండా, భాగస్వామ్యం, దౌత్యంతో భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్, నమీబియా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రిపబ్లిక్ ఆఫ్ నమీబియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా ఖండం కేవలం ముడి సరుకులకు వనరుగా మిగిలిపోవద్దని.. విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో నాయకత్వ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.రక్షణ రంగంలో ఆఫ్రికాతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇండియా అభివృద్ధి అనుభవాలను నమీబియాతో, ఆఫ్రికాతో పంచుకోవడం గర్వకారణమని చెప్పారు. ‘‘ఆఫ్రికాతో బంధానికి 2018లో 10 సూత్రాలు ప్రతిపాదించా. వాటికి కట్టుబడి ఉన్నాం. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఆ సూత్రాలు రూపొందాయి. మనం ఒకరితో ఒకరు పోటీ పడడం కాదు.. ఒకరికొకరం సహకరించుకోవాలి. కలసికట్టుగా ఎదగడం మన లక్ష్యం కావాలి’’ అని స్పష్టంచేశారు. ఇది క్రికెట్ గ్రౌండ్లో వార్మప్ భారత్, నమీబియా మధ్య బలమైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. నమీబియాతో స్నేహ సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఇండియాలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు నమీబియా ఎంతగానో సహకరించిందని అన్నారు. నమీబియాలో తదుపరి తరం శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నాయకులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. రేడియో థెరఫీ మిషన్లు సరఫరా చేయబోతున్నామని వివరించారు. ఇండియా–నమీబియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 800 మిలియన్ డాలర్లకు చేరిందని, ఇది క్రికెట్ గ్రౌండ్లో వార్మప్ మాత్రమేనని, ఇకపై మరింత వేగంగా పరుగులు చేయాలని పిలుపునిచ్చారు. నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు నెటుంబో నంది–ఎన్డైత్వాను ప్రధాని మోదీ అభినందించారు. భిన్న నేపథ్యం కలిగిన పౌరుల ఎదుగుదలకు నమీబియా రాజ్యాంగం చక్కటి తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని బోధిస్తోందన్నారు. ఒక నిరుపేద గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమేనని వ్యాఖ్యానించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన తాను ప్రధానమంత్రి అయ్యానంటే అందుకు తమ రాజ్యాంగమే కారణమన్నారు. సంబంధాలు బలోపేతం చేసుకుందాం ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కీలక రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని భారత్, నమీబియా నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నమీబియా చేరుకున్నారు. అధికార లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తొలుత స్టేట్హౌస్లో నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది–ఎన్డైత్వాతో మోదీ సమావేశమయ్యారు. డిజిటల్ సాంకేతికత, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, అరుదైన ఖనిజాలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించారు.నాలుగు ఒప్పందాలపై సంతకాలు నాలుగు ముఖ్యమైన ఒప్పందాలపై భా రత్, నమీబియా సంతకాలు చేశాయి. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో సహకారంతోపాటు నమీబియాలో ఆంట్రప్రెన్యూ ర్షిప్ డెవలప్మెంట్ సెంటర్, సీడీఆర్ఐ ఫ్రేమ్వర్క్, గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు కోసం రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీని నమీబియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియెంట్ వెలి్వవిషియా మిరాబిలిస్’తో సత్కరించింది. నమీబియా అధ్యక్షురాలు నెటుంబో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. భారత్, నమీబియా మధ్య చెదిరిపోని స్నేహానికి ఈ అవార్డు ఒక ప్రతీకగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజలకు దీన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించిన తొలి భారతీయ నాయకుడిగా మోదీ రికార్డుకెక్కారు.

ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: పౌర్ణమి రా.1.56 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: పూర్వాషాఢ పూర్తి (24 గంటలు), వర్జ్యం ప.3.26 నుండి 5.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృతఘడియలు: రా.1.30 నుండి 3.11 వరకు, గురుపూర్ణిమ; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. మేషం.... వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృషభం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.మిథునం.... బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కర్కాటకం... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.సింహం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.కన్య... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.తుల... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.వృశ్చికం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.ధనుస్సు... ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.మకరం.... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.కుంభం...... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మీనం... దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

గుజరాత్లో ఘోరం
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితంనాటి పాత వంతెన కుప్పకూలిన ఘటనలో 13 మంది వాహనదారులు జలసమాధి అయ్యారు. నదీప్రవాహంలో పడి ప్రయాణికులతోసహా ట్రక్కులు, వ్యాన్లు, ఆటో, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు వడోదర జిల్లాలోని మహీసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో ఈ ఘోరం జరిగింది. పద్రా పట్టణ సమీపంలో నిర్మించి ఈ వంతెన కూలడంతో వడోదర, ఆనంద్ నగరాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపో యాయి. నదీ ప్రవాహంలో నిర్మించిన రెండు పిల్లర్ల మధ్యలోని శ్లాబులు పూర్తిగా కుప్పకూలడంతో ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉందని వడోదర రూరల్ ఎస్పీ రోహన్ ఆనంద్ చెప్పారు. నదిలో పడగా నే కొందరిని స్థానికులు కాపాడారు. రక్షించిన వారిలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్రిడ్జ్ కూలడంతో ఒక ట్యాంకర్ కొనకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. దీంతో 4 గంటలపాటు శ్రమించి వెనక్కిలాగారు. కానీ అందులోని డ్రైవర్ ఆచూకీ గల్లంతైంది.బిడ్డను కాపాడాలంటూ తల్లి రోదనబ్రిడ్జి కూలినప్పుడు కొన్ని వాహనాలు నది ప్రవాహం మధ్యలో పడి కొట్టుకుపోతే మరికొన్ని ఒడ్డు వైపున పడిపోయాయి. అప్పుడు ఒక ప్రయాణికుడు కారుతోసహా నదినీటిలో చిక్కుకు పోయాడు. అతని తల్లి మాత్రం క్షేమంగా బయటపడింది. నడుం లోతు ఉన్న నీటిలో నిలబడి ఒడ్డు వైపున్న స్థానికులను తల్లి ఏడుస్తూ వేడుకుంటున్న వీడియో చూపరులను కంటతడి పెట్టించింది. ‘‘నా బిడ్డ ఇందులో ఇరుక్కుపోయాడు. నది నీటిలో మునిగిపోయి విలవిల్లాడిపోతున్నాడు. కాపాడండయ్యా’’ అంటూ ఆమె దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్త, కుమారుడు, కుమార్తె, అల్లుడితో కలిసి కారులో బాగ్దానాకు వెళ్తోంది. కారు నీటిలో పడినప్పుడు వెనకవైపు అద్దం పగలగొట్టి బయ టపడింది. కుమారుడు మాత్రం నదిలో మునిగిన వాహనంలో ఇరుక్కుపోయాడు.దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీదుర్ఘటన వార్త తెల్సి మోదీ, రాష్ట్ర సీఎంభూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగా త్రులకు తలో రూ.50వేల సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.4 లక్షలు ఇస్తామని సీఎం చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వంతెన కూలడంతో ఇలాంటి పాత వంతెన పటిష్టతపై సమీక్ష జరపాలని రాష్ట్ర అధికారులకు ప్రధాని సూచించారు. 1981లో వంతెన నిర్మాణాన్ని మొదలెట్టి 1985లో వాహన రాకపో కలకు అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 23 పిల్లర్లతో నదిపై 900 మీటర్ల పొడవునా బ్రిడ్జిని నిర్మించారు. అయితే వడోదర, ఆనంద్ నగరాలను కలిపే ఏకైక వంతెన కావడంతో దీనిపై వాహన రద్దీ ఎక్కువై పాడైందని స్థానికులు చెబుతున్నారు. కొత్త వంతెన కోసం మూడు నెలల క్రితమే రూ.212 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని తెలు స్తోంది. వంతెన పరిస్థితి దారుణంగా ఉందని, రాకపోకలను నిలిపివేయాలని 2017లోనే కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

మీరు ఎప్పుడంటే అప్పుడే.. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన ఏ తారీఖు ఇచ్చినా శాసనసభ, మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ‘కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో మీరు, ఏడాదిన్నరలో మేము తీసుకున్న నిర్ణయాలపై చర్చిద్దాం..’ అని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. న్యాయ, సాగునీటి రంగ నిపుణులను పిలిపించి వారి అభిప్రాయాన్ని కూడా ప్రజలకు వినిపిద్దామని అన్నారు. ‘ఏ చిన్న గందరగోళం ఏర్పడకుండా, ఎవరి గౌరవానికి భంగం కలిగించకుండా చట్ట పరిధిలో సభ నిర్వహించే బాధ్యత నాది. ఆరోగ్యం సహకరించక కేసీఆర్ రాకపోతే ఎర్రవల్లి ఫామ్హౌస్కు మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. తారీఖు చెప్తే మా వాళ్లు మొత్తం సెటప్ తీసుకుని వస్తారు. అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహించి చర్చ పెడదాం. కోదండరాం అందులో కూర్చోవాలి. కేసీఆర్ పిలిస్తే నేనూ వస్తా..’ అని సీఎం సవాల్ విసిరారు. మేడిగడ్డ బరాజ్కు సంబంధించి తప్పుడు నిర్ణయాలు, ఏపీ కృష్ణా జలాల అక్రమ తరలింపు అంశాలపై బుధవారం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట సభల్లో చర్చిద్దాం..లేదంటే ఫామ్హౌస్కు వస్తా ‘చట్టసభల్లో కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏ తారీఖున వస్తారో చెబుతూ స్పీకర్కు లేఖ రాయమన్నాం. అంతేకానీ సవాలు విసరలేదు. ఆయన (కేటీఆర్) సడన్గా బయలుదేరిండు. పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది. పొద్దటి పూట క్లబ్బుల్లో, రాత్రిపూట పబ్బుల్లో చర్చజేద్దామని ఉబలాటపడుతున్నడు. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా మనం చట్టసభల్లో చర్చిద్దాం. క్లబ్బులు, పబ్బులకు, ఆ కల్చర్కు నేను చదువుకునే రోజుల నుంచే దూరం. నన్ను వాటికి పిలవద్దు. అయితే అసెంబ్లీకి, లేకుంటే మండలికి, లేకపోతే ఎర్రవల్లి ఫార్మ్హౌస్కి వస్తా..’ అని రేవంత్ అన్నారు. వీధి భాగోతాలు మంచివి కావు.. ‘ప్రదాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి. ప్రజలకు ఉపయోగపడాలని అని నేను అంటుంటే ఆయన ఎందుకూ పనికి రాడు..ఆయనతో ఏం పని అని ఆయన కొడుకు (కేటీఆర్) అంటాడు. నేపాల్లో రాజ్యం రాలేదని డిన్నర్కి పిలిపించి (యువరాజు)16 మందిని ఏకే 47తో పటపటా కాల్చిండు. అందరూ పోయాక వాడొకడే మిగిలి నేపాల్కు రాజైండు. కుటుంబంలో సమస్యలుంటే కుటుంబ పెద్దలు, కుల పెద్దలతో కూర్చొని పంచాయతీ తేల్చుకోవాలి. తమ్ముడు చెల్లెలకు, బావబామ్మర్దికి పంచాయతీలు ఉంటాయి. కానీ ఈ వీధి భాగోతాలు మంచివి కావు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీకి అన్ని రకాలుగా సహకరించారు ‘కృష్ణా జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను 2015, 2020లో కేసీఆర్ మంజూరు చేసి వచ్చిండు. సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీలను కృష్ణా బేసిన్కు అక్కడి నుంచి పెన్నా బేసిన్కు తీసుకెళ్లండని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి సలహాలిచ్చిండు. ఏపీకి అన్ని రకాలుగా సహకరించిండు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని ప్రకటించిండు. కృష్ణా బేసిన్లోని రైతులకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్కు ఎవరూ ఇవ్వలేదు. హైదరాబాద్లో ఏపీ, ఇతర రాష్ట్రాల ప్రజలు 20 శాతం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర కోటా నుంచి నగర అవసరాలను వేరు చేసి మిగిలిన జలాలను పంపకాలు చేద్దాం అని ఆనాడు కేసీఆర్ అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది..’ అని రేవంత్రెడ్డి అన్నారు. కృష్ణా జలాల దోపిడీకి అవకాశం కల్పించారు ‘జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల తరలింపు కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి సర్వేలు జరపాలని 2011లో కిరణ్కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో ఇచ్చారు. అయితే కేసీఆర్ సోర్సు(నీటిని తీసుకునే ప్రదేశం)ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. తుంగభద్ర, కృష్ణా, భీమా నదుల నుంచి తెలంగాణలోని గద్వాల, ఆలంపూర్లో ముందుగా కృష్ణా జలాలు ప్రవేశిస్తాయి. ఆ నీళ్లను అక్కడే ఒడిసి పట్టుకుని తెచ్చుకుని ఉంటే.. ఈ రోజు శ్రీశైలం బ్యాక్వాటర్ వద్ద ఏపీకి మనం పైనుంచి వదిలితేనే నీళ్లు దొరుకుతుండే. పోతిరెడ్డిపాడు, రాయలసీమ, మల్యాల, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా నీళ్లు తరలించుకుపోవడానికి ఏపీకి అవకాశం ఉండేది కాదు. కిందికి పోయాక పట్టుకోవాలనే నిర్ణయంతో పూర్తిగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలిపోతున్నాయి. అక్కడి నుంచి అక్కడే దారిదోపిడీ చేసే అవకాశాన్ని ఏపీకి కేసీఆర్ కల్పించాడు..’ అని ముఖ్యమంత్రి ఆరోపించారు. సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం ‘శ్రీశైలం నుంచి ఏపీ పెద్ద మొత్తంలో నీళ్లు తీసుకుంటుండడంతో శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి అవకాశాన్ని తెలంగాణ కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ‘పాలమూరు’ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి టీఎంసీకి తగ్గించి కేసీఆర్ మరో అన్యాయం చేశారు. శ్రీశైలం నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని ఏపీ రోజుకు 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుకోగా, కేసీఆర్ మాత్రం తెలంగాణ సామర్థ్యాన్ని తగ్గించారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన ద్రోహం ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ. కేసీఆర్ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి సీమాంధ్ర పాలకులను ఒక కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కేసీఆర్ను వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిందే. బేసిన్లు లేవు..భేషజాలు లేవని చెప్పే అధికారం కేసీఆర్కు ఎవరు ఇచ్చారు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టును పూర్తిగా, నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఆయకట్టును కేసీఆర్ తొలగించిండు. కృష్ణా బేసిన్లోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తే కృష్ణా ట్రిబ్యునల్లో నీటి కేటాయింపుల సమస్య వస్తది అని సమర్థించుకుండు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఉమ్మడి రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఎకరాకు రూ.93 వేలు ఖర్చు కాగా, కేసీఆర్ ధనదాహంతో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఎకరాకు రూ.11 లక్షలు ఖర్చు పెట్టిండు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు. ఏపీ సీఎంకు అభ్యంతరం ఎందుకు? ‘బనకచర్లతో వరద జలాలే తీసుకెళ్తామంటున్న ఏపీ సీఎంకు, మా నల్లగొండకు వరద, నికర జలాలు తీసుకెళ్తే అభ్యంతరం ఏమిటి? మా ప్రాజెక్టులన్నీ కట్టుకుంటే వరద ఉందా? లేదా? అనేది తేలుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కాబట్టి కింద మీకు వరద కనిపించవచ్చు..’ అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. కాగా మంత్రి శ్రీధర్బాబుకు మాజీమంత్రి హరీశ్రావు ఫోన్ చేసి ప్రజాభవన్లో సమావేశాల నిర్వహణపై అభ్యంతరం తెలపడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గడీ కాదని అన్నారు.

ఎందుకీ నిర్బంధం.. ఆంక్షలు?
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో బుధవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు వెళ్తున్న క్రమంలో వైఎస్ జగన్ను కలిసేందుకు వచ్చిన రైతులు, మహిళలు, వృద్ధులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొన్నిచోట్ల లాఠీచార్జ్ చేశారు.పోలీసుల దాడిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం అయింది. దీన్ని గమనించిన జగన్మోహన్రెడ్డి స్థానిక పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. శశిధర్ రెడ్డికి వెంటనే మంచి వైద్యం అందించాలని వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు. బాధితుడిని పరామర్శించడాన్ని కూడా ఎస్పీ అడ్డుకున్నారు. రూట్మ్యాప్ మార్చే యత్నంవైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కి ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నా.. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు మణికంఠ, విద్యాసాగర్ నాయుడు కాన్వాయ్ ముందుకు వచ్చి రూట్ మ్యాప్ మార్చే ప్రయత్నం చేశారు. సబ్వేలో వెళ్లాల్సిన కాన్వాయ్ని నేషనల్ హైవేపైకి మళ్లించమన్నారు. ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్లోనే కాన్వాయ్ వెళ్తుంటే ఎందుకు అడ్డు పడుతున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నేషనల్ హైవేపై కాన్వాయ్ వెళితే అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారని, అందుకే సబ్వేలో ముందుకు వెళతామన్నారు. అనంతరం సబ్ వే ద్వారానే బంగారుపాళ్యం చేరుకున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల చిత్తూరు, బెంగళూరు హైవే మీద చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీనియర్ నేతలను సైతం అడ్డుకున్న వైనంమాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు లెక్క చేయలేదు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బంగారుపాళ్యం చేరుకునేందుకు వాహనాల్లో వస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్కుమార్, వెంకటేగౌడ్, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి వాహనాలను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అని పోలీసులు చులకనగా వ్యవహరించారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, ఆయన అనుచరులను అడ్డుకుని వారిపై లాఠీచార్జ్ చేశారు. విజయానందరెడ్డి పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో పోలీసులు తోసెయ్యడంతో విజయానందరెడ్డి కింద పడిపోయారు. ‘సాక్షి’ విలేకరులపైనా ఎస్ఐ సుబ్బరాజు దురుసుగా వ్యవహరించారు. సాక్షి వారిని కొట్టుకుంటూ పోతే మరోసారి రారంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. మార్కెట్ యార్డు వద్ద కొందరు జర్నలిస్టులు తెల్ల చొక్కాలు ధరించడాన్ని కూడా పోలీసులు తప్పుపట్టారు. అక్రిడిటేషన్ కార్డు చూపించినా వారి వ్యవహార శైలి మారలేదు. ‘మామిడి’ వేదన.. రైతు రోదన!చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన నలుగురు రైతులు మామిడి కొనుగోలు చేసే వారు లేక విసిగిపోయారు. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో ఆవేదన గురయ్యారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకోవాలని వచ్చారు. అదే సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో మామిడి పంటను తిమ్మోజీపల్లి వద్ద రోడ్డుపై పారబోసి ఆవేదన వ్యక్తం చేశారు. కంట తడి పెడుతూ జగనన్నా.. నీవే దిక్కు అంటూ వెళ్లిపోయారు. రైతులను అడ్డుకోడానికి ఇంత మంది పోలీసులా?జగన్ రాకకు ముందు ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులుసాక్షి టాస్క్ఫోర్స్ : వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయోగించిన పోలీస్ బలగాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాయలసీమ డీఐజీ, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్లు సహా 2,000 మంది పోలీసులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు. వీళ్లంతా జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కేవలం జగన్ అనే నాయకుడిని బంగారుపాళ్యం వెళ్లకుండా, మరీ ముఖ్యంగా ఆయన కోసం జనం ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకుండాం ఉండటం కోసమే పని చేశారు. ఎక్కడ చూసినా ఖాకీ యూనిఫాంలో గుంపులు గుంపులుగా కనిపించారు. యథేచ్ఛగా లాఠీలు సైతం ఝుళిపించారు. జగన్కు భద్రత కల్పించడంలో మాత్రం పోలీసుశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. వారంతా చిత్తూరు నుంచి పలమనేరు వరకు మోహరించి.. బస్సులు, స్కూటర్లు, బైక్లు, కార్లలో వచ్చే వాళ్లను నిలువరించడంపైనే దృష్టి సారించారు. తీరా వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు లోపలకు అడుగు పెట్టగానే ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. కేవలం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప.. కానిస్టేబుల్ కూడా సమీపంలో లేరు. దీంతో వేలాది సంఖ్యలో తరలి వచి్చన జనం.. వైఎస్ జగన్ను చుట్టేశారు. జగన్ను వెనుక వైపు నుంచి లాగుతూ, ఆయన చేతులు లాగేస్తూ మీద మీదకు వెళ్లిపోయారు. ఓ దశలో వైఎస్ జగన్ కిందకు తూలి పోతుండగా వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఇంత మంది జనం మధ్య ఆయన మార్కెట్ లోపల రైతుల వద్దకు వెళ్లడానికి అరగంట పైనే సమయం పట్టింది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఓ వీఐపీని ఇలా జన సమూహంలో వదిలేసి, పోలీసులు చోద్యం చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జెడ్ ప్లస్ భద్రత అంటే ఇదేనా అని వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టాయి.

ఆధిక్యమే లక్ష్యంగా...
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ గ్రౌండ్లోనే మూడు టెస్టులు గెలిచింది. ఇతర ఏ మైదానంలోనూ రెండుకు మించి విజయాలు సాధించలేదు. మనకు కలిసొచ్చిన వేదికపై ఇప్పుడు మరో సమరం. మ్యాచ్లో బుమ్రా పునరాగమనంతో పెరిగిన పేస్ బలం. గత టెస్టులో సాధించిన ఘన విజయం ఇచి్చన అంతులేని ఆత్మవిశ్వాసం. వెరసి కొత్త ఉత్సాహంతో భారత జట్టు మూడో టెస్టుకు సిద్ధమైంది. మరోవైపు బలహీనమైన ఆటతో రెండో టెస్టును కోల్పోయిన ఆతిథ్య ఇంగ్లండ్ కోలుకోవాలని ఆశిస్తోంది. ఇక్కడా ఆ జట్టు ఓడిందంటే సిరీస్ చేజారినట్లే! లండన్: భారత్, ఇంగ్లండ్ సుదీర్ఘ టెస్టు సమరంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. 1–1తో సిరీస్ సమంగా ఉన్న స్థితిలో నేడు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మొదలవుతుంది. భారత జట్టు బర్మింగ్హామ్ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని అస్త్రశ్రస్తాలతో ఎలాంటి లోపాలు లేకుండా జట్టు సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇక్కడా విజయం సాధిస్తే 2–1తో దూసుకుపోయి ఆపై సిరీస్ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గిల్ బృందం మరింత పట్టు బిగించాలని భావిస్తోంది. జట్టులో అక్కడక్కడా పూరించలేని లోపాలు కనిపిస్తున్న ఇంగ్లండ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. ప్రసిధ్ స్థానంలో బుమ్రా... సిరీస్లో రెండు టెస్టుల్లో భారత జట్టు బలమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చించింది. టాప్–6లో కరుణ్ నాయర్ మినహా మిగతా వారంతా సెంచరీ లేదా కనీసం అర్ధసెంచరీలు నమోదు చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్, రిషభ్ పంత్ శతకాలు బాదగా... రవీంద్ర జడేజా ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీలు చేసి తన బ్యాటింగ్ పదును చూపించాడు. ముఖ్యంగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న గిల్ను ఇంగ్లండ్ బౌలర్లు నిలువరించలేకపోతున్నారు. వైఫల్యాలు ఉన్నా సరే, నాయర్కు సిరీస్లో మరో అవకాశం దక్కవచ్చు. కాబట్టి బ్యాటింగ్ బృందంలో ఎలాంటి మార్పూ ఉండదు. బౌలింగ్లో బుమ్రా ఆడటం ఖాయం కావడంతో ప్రసిధ్ కృష్ణ స్థానంలో అతను నేరుగా జట్టులోకి వస్తాడు. ఎడ్జ్బాస్టన్లో చెలరేగిన ఆకాశ్దీప్, సిరాజ్లకు ఇప్పుడు బుమ్రా జత కలిస్తే బౌలింగ్కు తిరుగుండదు. అదనపు స్పిన్నర్ కావాలని భావిస్తే నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ వస్తాడు. స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ మరోసారి కీలకం కానున్నారు. నాలుగేళ్ల తర్వాత... ఎప్పటిలాగే ఇంగ్లండ్ మ్యాచ్కు ముందు రోజే తమ తుది జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు చోటు కల్పించింది. అతని వేగం తమకు అదనపు బలంగా మారుతుందని జట్టు నమ్ముతోంది. అయితే ఆర్చర్ ఏకంగా నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడు. అతను ఏమాత్రం ప్రభావం చూపుతాడనే చెప్పలేం. మరో ఇద్దరు పేసర్లు వోక్స్, కార్స్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. వీరిద్దరు సిరీస్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా... ఈ టెస్టు కోసం ఎంపిక చేసిన అట్కిన్సన్ గాయంతో తప్పుకోవడంతో మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 71 ఓవర్లలో 286 పరుగులు ఇచ్చినా స్పిన్నర్గా షోయబ్ బషీర్పైనే ఇంగ్లండ్ నమ్మకం ఉంచింది. అయితే ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇంగ్లండ్ బ్యాటింగ్ పదునెక్కాల్సి ఉంది. బ్యాటింగ్కు మరీ అనుకూలం కాని లార్డ్స్ పిచ్పై ఆతిథ్య బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్ భారత పేసర్లను ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఒలీ పోప్తో పాటు జో రూట్ కూడా అంచనాలను అందుకోవాల్సి ఉంది. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ ఫామ్ సానుకూలాంశం కాగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఆందోళన రేకెత్తిస్తోంది. అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. ఇప్పుడైనా స్టోక్స్ తన బ్యాటింగ్ బలాన్ని చూపించడం జట్టుకు ఎంతో అవసరం. తుది జట్ల వివరాలు భారత్ (అంచనా): గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, నాయర్, పంత్, జడేజా, సుందర్, ఆకాశ్దీప్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.పిచ్, వాతావరణంఅటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమాన అనుకూలతగా జీవం ఉన్న పిచ్ ఇది. ఆరంభంలోనే కాస్త పేస్కు అనుకూలిస్తుంది. ఆపై మంచి బ్యాటింగ్కు అవకాశం ఉంది. ఈసారి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ను ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజుల్లో వర్ష సూచన లేదు.19 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులు. 3 టెస్టుల్లో భారత్, 12 టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచాయి. 4 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.148 లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టులు. 97 టెస్టుల్లో ఫలితాలు రాగా, 51 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికపై ఇంగ్లండ్ 145 టెస్టులు ఆడింది. 59 టెస్టుల్లో నెగ్గి, 35 టెస్టుల్లో ఓడింది. 51 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది.

వేదాంత గ్రూప్ ఓ పేకమేడ..!
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ను హిండెన్బర్గ్ రీసెర్చ్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా తాజాగా మరో దిగ్గజం వేదాంత గ్రూప్ను ఇంకో అమెరికన్ షార్ట్సెల్లింగ్ సంస్థ వైస్రాయ్ రీసెర్చ్ టార్గెట్ చేసింది. వేదాంత గ్రూప్ అనేది భారీ అప్పులు, కొల్లగొట్టిన ఆస్తులు, కల్పిత అకౌంటింగ్ గాధలతో కట్టిన ఓ పేకమేడలాంటిది అని ఓ సంచలన నివేదికలో ఆరోపించింది. హోల్డింగ్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ (వీఆర్ఎల్), భారత అనుబంధ సంస్థను పారసైట్లాగా భ్రష్టు పట్టిస్తోందని 85 పేజీల రిపోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘వేదాంత రిసోర్సెస్ ఓ పారసైట్లాంటి హోల్డింగ్ కంపెనీ. అదొక పోంజీ స్కీము నడిపిస్తోంది. దానికంటూ చెప్పుకోతగ్గ కార్యకలాపాలేమీ లేవు. భారతీయ విభాగం వేదాంత లిమిటెడ్ను (వీఈడీఎల్) కొల్లగొడుతూ బతికేస్తోంది‘ అని వీఆర్ఎల్ బాండ్లలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న వైస్రాయ్ రీసెర్చ్ పేర్కొంది. మాతృ సంస్థకు డివిడెండ్ల రూపంలో వేల కోట్లు సమర్పించుకున్నాక వీఈడీఎల్ దగ్గర నగదు నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయని, ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపింది. ఇంతగా నిధులు వస్తున్నప్పటికీ, వీఆర్ఎల్ వడ్డీ వ్యయాలు వార్షికంగా 200 మిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు వివరించింది. కంపెనీ 9–11 శాతం వడ్డీ రేటుతో బాండ్లను ఇష్యూ చేయగా, వడ్డీ భారాన్ని చూస్తుంటే ఏకంగా 15.8 శాతం స్థాయిలో కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఓ స్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఉందని వివరించింది. వేరే ఖర్చులను వడ్డీల రూపంలో మోసపూరితంగా చూపిస్తుండటం, సిసలైన రుణభారం తెలియకుండా అధిక వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాలను తీర్చేస్తుండటం, లేదా రుణ రేట్లు .. షరతులను సరిగ్గా వెల్లడించకపోవడంలాంటివి కారణాలుగా ఉండొచ్చని పేర్కొంది. నిరాధార ఆరోపణలు: వేదాంత గ్రూప్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వేదాంత లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పాల్గొనడానికి ఒక రోజు ముందు ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రిపోర్టును బైటపెట్టిన సమయం చూస్తే, వైస్రాయ్ రీసెర్చ్ తీరు సందేహాలకు తావిచ్చేదిగా ఉందని వేదాంత గ్రూప్ పేర్కొంది. ఇదంతా నిరాధార ఆరోపణలు, వారికి అనువైన సమాచారాన్ని ఉపయోగించుకుని చేస్తున్న విషపూరిత ప్రచారమని తెలిపింది. వివరణ కోసం వైస్రాయ్ రీసెర్చ్ తమను కనీసం సంప్రదించకుండానే రిపోర్ట్ తయారైందని పేర్కొంది. అయితే, దీనికి వైస్రాయ్ రీసెర్చ్ కౌంటర్ ఇచ్చింది. తమ రిపోర్టును వేదాంత గ్రూప్ తోసిపుచ్చలేదని, ప్రశ్నలేవైనా ఉంటే సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. వైస్రాయ్ రీసెర్చ్ రిపోర్ట్ దెబ్బతో వేదాంత షేర్లు బుధవారం బీఎస్ఈలో 6 శాతం పడిపోయింది. తర్వాత కొంత కోలుకుని 3.4 శాతం నష్టంతో రూ. 440.80 వద్ద క్లోజయ్యింది.

వివేచన అవసరమైన కాలమిది!
రాష్ట్ర విభజన జరిగిన గత పదేళ్ళలో రెండు ప్రధాన పార్టీల చెరొక ఐదేళ్ల పాలన తర్వాత, మళ్ళీ బాబు పాలన అంటే, జగన్ సెట్ చేసి వెళ్ళిన వృత్తం పైన బాబు తన చతు రస్రం అయినా ఉంచాలి, లేదు జగన్ చతురస్రం మీద బాబు తన వృత్తం అయినా ఉంచాలి. కానీ ఇద్దరివీ కలవని మార్గాలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అందుకే ఈ సారూప్యతను ఎన్నిసార్లు ఎటు తిప్పి చూసినా వాటి అంచులు బయటకు ఉంటున్నాయి. నిజానికి ఈ ఇద్దరివీ రెండు వేర్వేరు ‘పబ్లిక్ పాలసీలు’. పదేళ్లనాడు బాబు తనకు తాను పనిమాలా తెచ్చిపెట్టుకున్న సంకటం – ‘అమరావతి’ వీటికి అదనం. వైఎస్సార్సీపీ అనే ఒక యువ రాజకీయ పార్టీ వచ్చి, అది తన తొలి ఐదేళ్ల పాలనలో వేసిన ‘రన్ వే’ మీద టీడీపీ విమానం ‘టేకాఫ్’ అంటే, అందుకు బాబు నలభై ఏళ్ల అను భవం చాలడం లేదు. జగన్ ఇంజినీరింగ్ మారడంతో భవన నిర్మాణం కూడా మారింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు 1991లో మొదలైతే, ఆ తర్వాత మూడేళ్లకే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. తిరిగి 2004లో వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి ‘సంస్కరణల కాలం’ సాగుబడి సమస్యల పరిశీలన బాధ్యతలను తాను మీద వేసుకోకుండా దాన్ని జేఎన్యూ ఎకనా మిక్స్ ప్రొఫెసర్ డా‘‘ జయతీ ఘోష్కు అప్పగించారు. ఆమె ఇచ్చిన ‘రిపోర్ట్’ను ప్రభుత్వ వ్యవసాయ విధా నంగా అమలు చేశారు. దాపరికం లేదు. నిపుణుల నైపుణ్యం వాడుకోవలసిన విధానమది. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక మేధోమథనం ఇంకా చాలా పెద్ద స్థాయిలో జరగాల్సింది. ఖైరతాబాద్ గవర్నర్ బంగళా పక్కనున్న ప్రతిష్టాత్మక పరిశోధన శిక్షణా సంస్థ ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ’ (ఆస్కీ) వంటి సంస్థను ఏపీ ప్రభుత్వానికి ఒక ‘రోడ్ మ్యాప్’ ఇవ్వ మని అడిగి ఉండాల్సింది. అది 46 దేశాలకు చెందిన వందకు పైగా సంస్థలకు సేవలు అందిస్తున్న సంగతి గమనార్హం. దాని సహాయం తీసుకోలేదు. మొదటి ఐదేళ్లు అలా గడిస్తే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘నీతి ఆయోగ్ ‘ పర్యవేక్షణలో 2030 లక్ష్యంగా ‘యూఎన్డీపీ’ జారీ చేసిన– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ ప్రాతిపదికన తన ‘పబ్లిక్ పాలసీ’ని రూపొందించుకుని; ‘కోవిడ్’ కాలంలో కూడా దాన్ని అమలు చేసింది. వివరం తెలియనివారు దాన్ని ‘సంక్షేమం’ అన్నారు. కొత్త రాష్ట్రంలో పరిపాలన ‘చివరి మైలు’కు చేరడానికి అవసరమైన గ్రామ సచివాలయ వ్యవస్థ ఆ కాలంలో ఏర్పాటు అయింది. ఇలా జరిగిన ప్రతిదీ ఒక ప్రభుత్వ చట్రం పరిధిలో జరగడం వల్ల, ప్రభుత్వం మారి ఏడాది గడిచినా గత ప్రభుత్వాన్ని ఇప్పటికీ ‘ఫైల్స్’లో తప్పు పట్టలేదు. పార్టీలు వేరైనా రాజ్యాంగం ఒక్కటే అయినప్పుడు, స్థూలంగా దాని పరిధిలో పనిచేయడం అనేది మౌలిక సూత్రం.ఈ ఇరువురి భిన్న వైఖరులు నేర్పుతున్న పాఠాలు ఏమిటో ఇప్పుడు గ్రహించవలసి ఉంది. టీడీపీ 2024 ఎన్నికల వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో – ‘విధ్వంసం’ జరిగిందని అనేది. కానీ అది ఎక్కడ జరిగిందో తెలియదు. విధ్వంసాన్ని ఈ ఏడాది కాలంలో ఇది అని విడమర్చి ప్రజలకు చెప్పాలి కదా? వారంటున్న ‘విధ్వంసం’ వికేంద్రీకరణ అయ్యుండాలి. ఎందుకంటే బాబు అమరావతి కేంద్రంగా నేల తవ్వి పునాదులు వేస్తే, జగన్ గ్రామపాలనకు రాష్ట్ర మంతా పటిష్ఠమైన పునాదులు వేశారు. అందువల్ల అధికారిక అంచెలు (హైరార్కీ) తగ్గాయి. ‘ఆన్ లైన్’ సౌలభ్యంతో కొన్ని ప్రజా సమస్యలు గ్రామ సచివా లయాల్లోనే పరిష్కారం అయ్యాయి. ప్రజాప్రతినిధుల వరకు అవి రాలేదు. అన్ని పార్టీల నాయకులు ఈ కొత్త నొప్పిని మౌనంగా భరించారు. కానీ, ప్రభుత్వం మారాక జరిగింది ఏమిటి? బాబు తన ప్రభుత్వంలో దీన్ని మార్చలేదు సరికదా విస్తరించారు. అందుకు ఈ ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన ‘జీవో’ 57ని చూడాల్సి ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వంలో వెలువడిన జీవో 08. తేదీ: 1.11.’23కి కొనసాగింపు. అందులో అప్పట్లో గత ప్రభుత్వం 77 ‘డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్’ పోస్టులు కొత్తగా మంజూరు చేసింది. అయితే గత నెలలో ఆ 77 మంది అధికారుల పరిధిలోకి గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చి, వీరు డివిజన్ స్థాయిలో జరిగే పంచాతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి పనులు పర్యవేక్షించేలా విస్తృతమైన ‘జాబ్ చార్ట్’తో ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రంగా ఆ యా కార్యాలయాల పోస్టల్ అడ్రెస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రమంతా గ్రామ, వార్డు సచివాలయాలతో నిర్మించిన పరిపాలనా పరమైన పునాదులకు ఉన్న విశ్వసనీయత వల్ల, ఇప్పుడు వాటి పైన కొత్తగా కట్టే అదనపు భవంతులకు భద్రత హామీ దొరికింది. పాత జిల్లాలు చిన్నవై పర్యవేక్షణ పెరిగింది. పంచాయతీరాజ్ స్థానిక పరిపాలనా వ్యవస్థలతో వైసీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ‘ఇంటిగ్రేట్’ అయ్యి రెండింటి మధ్య ఒక ‘ఆర్గానిక్ లింకు’ ఏర్పడింది. పార్టీలు ఏవైనా ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ తీసుకునే విధానపర నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలన చట్టపరిధిలో ఉన్నప్పుడు, అది ఎవరి ప్రభుత్వం అనే దానితో పని లేకుండా మొక్కకు అంటు కట్టినట్టుగా రెండూ ఒక్కటిగా ఎదుగుతూ విస్తరిస్తుంది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత
ఇక చాలు!
ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్ జగన్
ఆధిక్యమే లక్ష్యంగా...
జ్యోతి సురేఖరిషభ్ జోడీ ప్రపంచ రికార్డు
తొలిసారి సెమీస్లోకి...
ఐటీ అంతంత మాత్రమే!
కల్తీ కల్లుకు మరో నలుగురు బలి
మీరు ఎప్పుడంటే అప్పుడే.. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
పెట్రోబాదుడులో ఇండియా టాప్
వ్యాసాయ విష్ణు రూపాయ...
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
టెక్సాస్లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
వావివరుసలు మరిచి మామతో వివాహేతర సంబంధం
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసి!
Guru Purnima 2025 ఉపాసన తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం
'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవికి గోల్డెన్ ఛాన్స్ (ఫొటోలు)
వరుసగా మూడో మ్యాచ్లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలన
‘రఫ్ఫాడించేద్దాం’ అంటున్న చిరంజీవి.. ఆగస్ట్ 22 నుంచే బీ రెడీ..
ఆ ట్యాగ్ వల్ల ఎవరికీ తగలనన్ని ఎదురుదెబ్బలు తగలాయి: విజయ్
నీట్ యూజీ అర్హుల జాబితా విడుదల
ఎక్కడున్నా మరీ వెతికి పట్టుకొని అరెస్టు చేస్తాం!
850 కిలోల గంజాయి స్వాధీనం
ఆంక్షల గట్టు దాటి.. తండోపతండాలు
ఎందుకీ నిర్బంధం.. ఆంక్షలు?
గుజరాత్లో ఘోరం
ఎఫ్–1 వీసాలు తగ్గాయ్!
కలిసి సాగుదాం..ప్రగతి సాధిద్దాం.. నమీబియాకు ప్రధాని మోదీ పిలుపు
నమ్మించి మోసం..!
‘ఈగల్’ దూకుడు
కమిషనర్ రాకపోతే.. డీజీపీని రప్పిస్తాం
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
టెక్సాస్లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
వావివరుసలు మరిచి మామతో వివాహేతర సంబంధం
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసి!
Guru Purnima 2025 ఉపాసన తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం
వరుసగా మూడో మ్యాచ్లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలన
‘రఫ్ఫాడించేద్దాం’ అంటున్న చిరంజీవి.. ఆగస్ట్ 22 నుంచే బీ రెడీ..
ఆ ట్యాగ్ వల్ల ఎవరికీ తగలనన్ని ఎదురుదెబ్బలు తగలాయి: విజయ్
నీట్ యూజీ అర్హుల జాబితా విడుదల
ఎక్కడున్నా మరీ వెతికి పట్టుకొని అరెస్టు చేస్తాం!
కొత్త మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్
సినిమా

గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టారా?
పైన కనిపిస్తున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా? ఆయన వెండితెరపై కాసేపు కనిపించినా సరే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అందుకు జైలర్ సినిమానే నిదర్శనం. ప్రస్తుతం జైలర్ మూవీ సీక్వెల్లో యాక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో రామ్చరణ్ పెద్ది సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈపాటికే ఆయనెవరో అర్థమైపోయుంటుంది. తనే కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ (Shiva Rajkumar). ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్.సప్త సాగరాలు దాటి ఫేమ్ హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శివన్న ధనంజయగా కనిపించనున్నారు. పోస్టర్లో ఆయన లుక్ గుర్తుపట్టలేకుండా ఉంది. సూటూబూటూ వేసుకుని, టై కట్టుకుని ఓ చేతిలో రివాల్వర్ పట్టుకుని సీరియస్గా కనిపిస్తున్నారు శివన్న. పుష్ప విలన్ డాలి ధనంజయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైశాక్ జె ఫిలింస్ బ్యానర్పై డాక్టర్ వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. Presenting My Look from #666OperationDreamTheatre @Dhananjayaka @hemanthrao11 @Vaishak_J_Films @charanrajmr2701 @AdvaithaAmbara #VishwasKashyap @The_BigLittle @PROharisarasu#666ODT pic.twitter.com/noeA0cwrFh— DrShivaRajkumar (@NimmaShivanna) July 9, 2025 చదవండి: 2025లో టాప్ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ

దీపిక, ప్రియాంక కాదు.. దీవిని కొన్న అందాల నటి తెలుసా.. అక్కడ ఏం చేస్తోందో..!
ఇంపోర్టెడ్ కార్లు, ఇంద్ర భవనాలు,నుంచి కళాఖండాలను దాటి క్రికెట్ టీమ్స్ దాకా కాదేదీ అనర్హం. తారల దర్పానికి, స్టార్ డమ్ ప్రదర్శనకి అన్నట్టుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే కార్ల ట్రెండ్ పాతబడుతూ వాటి స్థానంలో ప్రైవేట్ జెట్స్ సైతం సూపర్ స్టార్లకు అలంకారంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్కి చెందిన ఓ అందాల నటి ఏకంగా ఐలాండ్నే కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ వార్త వినగానే మన కళ్ల ముందు మెదిలే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, అలియా భట్, ఐశ్వర్యా రాయ్ వంటివారు ముందుండడం సహజమే.అయితే వీరందరూ కాకుండా.. నిజం చెప్పాలంటే విజయాల్లో వీరి సరసన నిలబడే స్థాయి లేని నటి ఐలండ్ క్వీన్గా మారిందనేది తెలుసుకోదగ్గ విశేషమే. ఆమె పేరు గ్లామర్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండెజ్. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి సక్సెస్ అయిన తారల్లో ఒకరు శ్రీలంకకు చెందిన జాక్వలిన్. దాదాపు పాతికేళ్ల క్రితం 2006లో మిస్ యూనివర్స్ పోటీల్లో శ్రీలంకకు సారధ్యం వహించిన ఈ బ్యూటీకి కిరీటం దక్కకపోయినా బాలీవుడ్ ఛాన్సులు దండిగానే దక్కాయి. అలా 2009 నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ అదే పనితో ఆగిపోకుండా రకరకాల వ్యాపారాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. ఇప్పటికే ముంబైలో, శ్రీలంకలో విలాసవంతమైన అపార్ట్మెంట్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు సైతం ఆమె స్వంతం. స్టార్ డమ్లో దిగువన ఉన్నా ఇన్ కమ్లో ముందున్న ఈ భామ ఆస్తులు దాదాపుగా రూ.100కోట్ల పైమాటే అని సమాచారం.ఈ నేపధ్యంలోనే ఆమె స్వదేశంలో, అంటే శ్రీలంక తీర ప్రాంతంలో ఒక ప్రైవేట్ దీవిని కూడా ఆమె కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇది బహిరంగంగా ఆమె ప్రకటించని విషయమే అయినా, తాజాగా వెలుగులోకి వచ్చింది. జాక్వలిన్ ఈ ప్రైవేట్ దీవిని కుటుంబం కోసం కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగాయో కానీ, అది పూర్తి స్థాయిలో పర్యాటకుల నుంచి దూరంగా, నిశ్శబ్దత నడుమ ఆమె తన కోసం విశ్రాంతి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమని అంటున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడం వల్ల బాలీవుడ్లో జాక్వలిన్ స్థానం, ఆమె సంపద, జీవనశైలి పై కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్లో ఇది అరుదైన విషయమే మరి. నటుల్లో స్వంత దీవిని కలిగిన నటి అనే ఘనతను జాక్వలిన్ ఒక్కరే దక్కించుకుంది.ఎక్కడ? ఎప్పుడు?శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంగా 2012లో సుమారు 4 ఎకరాల ప్రైవేట్ దీవిని సుమారుగా రూ.3కోట్లకు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ దీవి ఖరీదు చేసినప్పుడు, ‘విలాసవంతమైన విల్లా నిర్మాణం‘ ఉండొచ్చని అంచనా వేశారట, అయితే అక్కడ అలాంటి నిర్మాణం జరిగిందా లేదా అనేది స్పష్టంగా వెలుగు చూడలేదు. ఈ దీవి, మాజీ శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కరా కి చెందిన సొంత దీవి దగ్గరనే ఉందని కూడా తెలుస్తోంది.కొసమెరుపు ఏమిటంటే... ఓ నాలుగేళ్ల క్రితం ఈ జాక్వెలిన్ పై మనీ లాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా విచారణకు హాజరైంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఘోస్ట్ సినిమాలో మన కింగ్ అక్కినేని నాగార్జున సరసన తెలుగులో నటించడానికి వచ్చిన ఛాన్స్ చేజారినట్టు సమాచారం.

కుబేర క్రేజీ సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న కుబేర కలెక్షన్ల పరంగా వందకోట్లకు పైగానే రాబట్టింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్ర పోషించారు.తాజాగా ఈ చిత్రంలో క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. అనఅనగా కథ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను కరీముల్లా, హైడ్ కార్తి ఆలపించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.కుబేర కథేంటంటే..'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.

హోంబలే ఫిల్మ్స్ యానిమేషన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ Hombale Films భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థగా అవతరించింది. తాజాగా ఈ సంస్థ సమర్పణలో యానిమేషన్ మూవీని తెరకెక్కించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha) చిత్రం జూలై 25 థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సినిమాను 3డీలో ప్రేక్షకులను అలరించనుంది. ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ట్రైలర్ చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించగా.. హోంబాలే ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు.ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతూ నిర్మాతలు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ను ప్రకటించారు. వారు విడుదల చేసిన క్యాలెండర్లో 2025లో 'మహావతార్ నరసింహ', ఆ తర్వాత 'మహావతార్ పరశురామ్' (2027), 'మహావతార్ రఘునందన్' (2029), 'మహావతార్ ధావకధేష్' (2031), 'మహావతార్ గోకులానంద' (2033), 'మహావతార్ కల్కి పార్ట్ 1' (2035), 'మహావతార్ కల్కి పార్ట్ 2' (2037) ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

తొలిసారి సెమీస్లోకి...
లండన్: ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీ టైటిల్స్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఆరో ప్రయత్నంలో... ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) తొమ్మిదో ప్రయత్నంలో... తొలిసారి వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 7–5తో 19వ ర్యాంకర్ సమ్సోనోవా (రష్యా)పై... 35వ ర్యాంకర్ బెన్చిచ్ 7–6 (7/3), 7–6 (7/2)తో 7వ ర్యాంకర్ మిరా ఆంద్రీవా (రష్యా)పై గెలుపొందారు. సెమీస్లో సినెర్తో జొకోవిచ్ ‘ఢీ’ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ సినెర్ 2 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–4తో పదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించగా... జొకోవిచ్ 3 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 6–2, 7–5, 6–4తో 22వ సీడ్ ఫ్లావియా కొ»ొల్లి (ఇటలీ)పై విజయం సాధించారు. రేపు జరిగే సెమీఫైనల్స్లో అల్కరాజ్ (స్పెయిన్)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా); సినెర్తో జొకోవిచ్ తలపడతారు.

క్రికెట్ టీమ్ను కొన్న చాహల్ గర్ల్ ఫ్రెండ్..?
సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్, భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ క్రీడా రంగంలోకి అడుగుపెట్టింది. ఓ క్రికెట్ జట్టుకు ఆమె ఇప్పుడు యజమాని అయ్యారు. ఛాంపియన్స్ లీగ్ టీ10 టోర్నీలో ఒక జట్టు సహ-యజమానిగా ఆమె వాటా కొనుగోలు చేసింది.ఈ విషయాన్ని మహ్వాష్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. అయితే జట్టు పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తొట్టతొలి ఛాంపియన్స్ లీగ్ టీ10 ఎడిషన్ ఆగస్టు 22 నుండి 24 వరకు ఢిల్లీ వేదికగా జరుగుతుంది. ఈ లీగ్ కమిషనర్ భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వ్యవహరించనున్నాడు. ఇందులో ఎలైట్ ఈగల్స్, మైటీ మావెరిక్స్, సూపర్ సోనిక్, డైనమిక్ డైనమోస్, బ్రేవ్ బ్లేజర్స్, విక్టరీ వాన్గార్డ్, స్టెల్లార్ స్ట్రైకర్స్ , సుప్రీం స్టాలియన్స్ మొత్తం ఎనిమిది జట్లు పాల్గోనున్నాయి.ఈ టోర్నీలో భారత మాజీ క్రికెటర్లతో పాటు వివిధ వృత్తులకు చెందిన ప్రముఖులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లోకల్ యంగ్ టాలెంట్కు దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఈ లీగ్కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇక ఇది ఇలా ఉండగా.. చాహల్, ఆర్జే మహ్వాష్ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఏదో ఒక విషయంతో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి

ఇంగ్లండ్తో మూడో టెస్టు.. 95 ఏళ్ల వరల్డ్ రికార్డుపై గిల్ గురి
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా శబ్మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో విధ్వంసకర ద్విశతకం(269 పరుగులు), సెకెండ్ ఇన్నింగ్స్లో కూడా శతక్కొట్టాడు.తద్వారా ఓ టెస్టు మ్యాచ్లోఅత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్(430) నిలిచాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో గిల్ తన ఆసాధరణ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు గురువారం నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో కూడా సత్తాచాటాలని గిల్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో గిల్ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.95 ఏళ్ల రికార్డుపై కన్ను..ఈ మ్యాచ్లో గిల్ 225 పరుగులు చేయగలిగితే.. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా వరల్డ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మాన్ పేరిట ఉంది. బ్రాడ్మాన్ 1930లో ఇంగ్లండ్పై 810 పరుగులు చేశాడు. గిల్ ఈ సిరీస్లో ఇప్పటికే కేవలం రెండు మ్యాచ్లలోనే 585 పరుగులు సాధించాడు. లార్డ్స్లో బ్రాడ్మాన్ రికార్డు బ్రేక్ అవ్వకపోయినా మిగిలిన మ్యాచ్లోనైనా కచ్చితంగా గిల్ అధిగమిస్తాడు.గవాస్కర్ రికార్డుపై గురి..అదేవిధంగా ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచే ఛాన్స్ గిల్ ముంగిట ఉంది. వెస్టిండీస్ దిగ్గజం క్లైడ్ వాల్కాట్ 1955లో ఆస్ట్రేలియాపై ఒకే సిరీస్లో ఐదు సెంచరీలు చేశాడు. గిల్ ఇప్పటికే ఈ సిరీస్లో మూడు సెంచరీలు చేయగా.. మరో రెండు చేస్తే వాల్కాట్ సరసన నిలుస్తాడు. అంతేకాకుండా టెస్టు సిరీస్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్గానూ శుబ్మన్ నిలుస్తాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ 4 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs ENG: రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్గా భారత జట్టుతో ప్రాక్టీస్

రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్గా భారత జట్టుతో ప్రాక్టీస్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో ఆధిక్యం పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అందుకు తగ్గట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. అయితే బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టుతో పాటు ఓ ప్రత్యేక ఆతిథి కసరత్తలు చేస్తూ కన్పించాడు. ఇంగ్లండ్ టూర్కు ఎంపిక కానప్పటికి నెట్స్లో జట్టుకు తన సేవలను అందించాడు. అతడే టీమిండియా, ముంబై ఇడియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్. ప్రస్తుతం జరుగుతున్న వింబుల్డన్ టోర్నమెంట్ను వీక్షించేందుకు చాహర్ తన భార్యతో కలిసి లండన్కు వెళ్లాడు.ఈ క్రమంలో లండన్లో ఉన్న భారత జట్టుతో చాహర్ కలిశాడు. ఈ రాజస్తాన్ పేసర్ జట్టుతో కలవడమే కాకుండా నెట్స్లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. సాధరణంగా దీపక్ చాహర్ కొత్త బంతిని అద్బుతంగా స్వింగ్ చేయగలడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యే అవకాశమున్నందన.. చాహర్ బౌలింగ్లో భారత బ్యాటర్లు ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకుముందు బర్మింగ్హామ్ టెస్టు సందర్భంగా పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ భారత నెట్ ప్రాక్టీస్ సెషన్లో కన్పించి ఆశ్చర్చపరిచాడు. ఇప్పుడు చాహర్ నెట్బౌలర్గా మరి అందరికి షాకిచ్చాడు. దీపక్ చాహర్ చివరగా 2023 డిసెంబర్లో భారత తరపున ఆడాడు. వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహర్.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్Deepak Chahar trains with Team India at Lord’s ahead of the third Test match.[ Rahul Rawat ] pic.twitter.com/bqnASrkAJU— Jay Cricket. (@Jay_Cricket12) July 9, 2025
బిజినెస్

ఈపీఎఫ్వో ఈఎల్ఐ స్కీమ్కు పటిష్ట వ్యవస్థ
ఉపాధి కల్పన లక్ష్యాల్లో భాగంగా ప్రకటించిన రూ.1.07 లక్షల కోట్ల ఉద్యోగాల ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) స్కీమ్ అమలు కోసం డిజిటల్ సాధనాలతో పటిష్టమైన వ్యవస్థను కార్మిక శాఖ రూపొందించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్వో నిర్వహించే సామాజిక భద్రత స్కీముల ద్వారా దీన్ని అమలు చేయనుంది. ఇటు ఉద్యోగులు, అటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈఎల్ఐ స్కీమును తీర్చిదిద్దినట్లు కార్మిక శాఖ మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ప్రయోజనాలను నేరుగా ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఇది ఉంటుందని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ఏబీఆర్వై) అమల్లో అవినీతి, ఫేక్ క్లెయిమ్ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మళ్లీ అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా ఈ స్కీమును పటిష్టంగా తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో, వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగయోగ్యత, సామాజిక భద్రతను పెంపొందించడం ఈఎల్ఐ స్కీము ప్రధాన ఉద్దేశం. దీనితో వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం (రూ.15,000 వరకు) ఈ స్కీము కింద లభిస్తుంది. అదనంగా ఉద్యోగాలను కల్పించనందుకు అటు వ్యాపార సంస్థలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. తయారీ రంగానికి మరో రెండేళ్లు అదనంగా ప్రయోజనాలు అందుతాయి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది.

ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం
పేరున్న కాలేజీలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్న భావనకు కాలం చెల్లిపోతోంది. ఏఐ టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో కాలేజీలు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాలిస్తామంటూ ముందుకొస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ ఫౌండర్ సోషల్ మీడియాలో అసాధారణమైన జాబ్ లిస్టింగ్ను పోస్ట్ చేసి ఆన్లైన్లో విస్తృత చర్చను రేకెత్తించారు.‘స్మాల్ ఏఐ’ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ తన కంపెనీకి ఫుల్ స్టాక్ టెక్ లీడ్ కావాలంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ జాబ్కి ఆయన రూ .1 కోటి వార్షిక వేతన పరిహారాన్నిఆఫర్ చేశారు. ఈ ప్యాకేజీలో రూ.60 లక్షల ఫిక్స్డ్ వార్షిక వేతనం కాగా రూ.40 లక్షలు కంపెనీ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అభ్యర్థి కాలేజీ డిగ్రీలతో నిమిత్తం లేదని, రెజ్యూమ్ కూడా అక్కర్లేదని ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.ఇంకా ఈ ఉద్యోగానికి ఏమేం కావాలన్నది కామత్ వివరించారు. ఆదర్శ అభ్యర్థికి "4-5 సంవత్సరాల అనుభవం" ఉండాలని, "నెక్ట్స్ జెఎస్, పైథాన్, రియాక్ట్ జెఎస్" గురించి బాగా తెలిసి ఉండాలని కామత్ పేర్కొన్నారు. అలాగే ఈ ఉద్యోగం బెంగళూరు కేంద్రంగా ఉంటుందని, ఎంపికైనవారు తక్షణమే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా జాబ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో ఉంటుందని, వారానికి 5 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని కూడా వివరించారు.ఈ జాబ్కు అప్లయి చేయడానికి రెజ్యూమె అవసరం లేదని, కేవలం 100 పదాలతో తమ గురించి తెలియజేస్తే చాలంటూ కంపెనీ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. కామత్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందిస్తున్నారు.Hiring a cracked full-stack lead at Smallest AISalary CTC - 1 CrSalary Base - 60 LPASalary ESOPs - 40 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 4-5 years minimumLanguages - Next JS, Python, React JSWork from Office - 5 days a week (slightly…— Sudarshan Kamath (@kamath_sutra) July 7, 2025

ఐఫోన్ 17: చైనా టెకీలు వెళ్లిపోయినా పర్లేదు..
యాపిల్ వెండార్ల ప్లాంట్లలో పని చేసే చైనా టెకీలు స్వదేశాలకు వెళ్లిపోయినా భారత్లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రణాళికలు యథాతథంగానే కొనసాగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి, ఐఫోన్ల తయారీలో కీలకమైన యంత్రపరికరాల దిగుమతులు ఇటీవలి కాలంలో మెరుగుపడ్డట్లు వివరించాయి.భారత్లో ఫాక్స్కాన్, టాటా ఎల్రక్టానిక్స్ సంస్థలు యాపిల్ ఫోన్లను తయారు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఫాక్స్కాన్ ఇండియా యూనిట్లలో పని చేస్తున్న వందలకొద్దీ చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీ లైన్స్, ఫ్యాక్టరీ డిజైన్, ఇతరత్రా సిబ్బందికి శిక్షణనిచ్చే విధులు నిర్వర్తించేవారు.దీనితో ఐఫోన్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ, భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని 3.5–4 కోట్ల స్థాయి నుంచి ఈ ఏడాది 6 కోట్లకు పెంచుకోవాలన్న యాపిల్ టార్గెట్లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు వివరించాయి.

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.రేంజిబౌండ్ సెషన్ తర్వాత దిశా సంకేతాలు లేకపోవడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు నష్టాల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 176.43 పాయింట్లు (0.21 శాతం) క్షీణించి 83,536.08 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.4 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 25,476.10 వద్ద ముగిశాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 1.49 శాతం, 1.4 శాతం, 1.25 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, ఐటీ, మీడియా, పీఎస్యూ బ్యాంక్, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాకు చెందిన వైస్రాయ్ రీసెర్చ్ తన మాతృసంస్థ రుణభారం తగ్గించుకోవడంతో మైనింగ్ దిగ్గజం వేదాంత షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. అదేసమయంలో హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.09 శాతం క్షీణించి 11.9 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఫ్యామిలీ

నిజమందిరానికి చేరిన జగన్నాథుడు : అద్వితీయంగా అంతిమ ఘట్టం
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి తిథి పురస్కరించుకుని శ్రీ జగన్నాథుని రథ యాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మంగళవారం జరిగింది. దీంతో శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర ముగిసింది. సంధ్యా ధూపం తర్వాత రథంపై ఉన్న మూల విరాటులతో ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో గొట్టి పొహండి నిర్వహించి సురక్షితంగా శ్రీ మందిరం రత్న వేదికకు చేర్చడంతో నీలాద్రి విజే విజయవంతమై రథ యాత్రకు తెర పడింది. రథ యాత్ర క్రమంలో ఉత్సవ సేవాదులు నిర్వహించారు. రథాలపై మూల విరాటుల పూజలు ముగియడంతో రథాల పైనుంచి విగ్రహాల్ని దించేందుకు చారుమళ్లు ఏర్పాటు చేశారు. వీటి గుండా వరుస క్రమంలో మూల విరాటులతో ఉత్సవ మూర్తుల్ని శ్రీ మందిరం రత్న వేదిక పైకి తరలించారు. బుధ వారం నుంచి శ్రీ మందిరం రత్న వేదికపై భక్తులకు యథాతథంగా ఏడాది పొడవునా చతుర్థా మూర్తుల దర్శనం ప్రాప్తిస్తుంది. మహాలక్ష్మికి స్వామి బుజ్జగింపురథయాత్ర అంతిమ ఘట్టం నీలాద్రి విజే మహోత్సవంలో శ్రీ మహాలక్ష్మి దేవిని జగన్నాథ స్వామి బుజ్జగించే వైనం భక్త జనాన్ని ముచ్చట గొలిపించే అపురూప ఘట్టం. నీలాద్రి విజే సమయంలో సుదర్శనుడు, దేవీ సుభద్ర, బలభద్ర స్వామిని శ్రీ మందిరంలోనికి ఆహ్వానించిన శ్రీ మహా లక్ష్మి ప్రియ నాథుడు శ్రీ జగన్నాథుని ప్రవేశం అడ్డుకుని శ్రీ మందిరం సింహ ద్వారం తలుపులు మూసి వేస్తుంది. తనను విస్మరించి తోబుట్టువులతో యాత్రకు ఏగి విరహ వేదన తాళలేక స్వయంగా దర్శనం కోసం వెళ్లిన నిరుత్సాహ పరచడంతో శ్రీ మహా లక్ష్మి అలక ప్రదర్శించడం ఈ ముచ్చట గొలిపే ఘట్టం జానపద ఇతివృత్తం. దేవేరి అలక తీర్చేందుకు యాత్ర కానుకగా శ్రీ జగన్నాథుడు రసగుల్లాను దేవేరికి సమరి్పంచడంతో మురిసిపోయి సాదరంగా శ్రీ మందిరం లోనికి ఆహ్వానిస్తుంది. ఇది రథ యాత్రలో చిట్ట చివరి ముచ్చట గొలిపే ఘట్టం.అద్వితీయంగా అంతిమ ఘట్టంపర్లాకిమిడి: పదిరోజులపాటు గుండిచా రథయాత్రకు బయలుదేరిన జగన్నాథ, సుభద్ర, బలభద్రులు మంగళవారం ఉదయం మూడు రథాలతో నిజ మందిరానికి క్షేమంగా విచ్చేశారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్రపండా, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దారు, ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర భక్తుల సహాయంతో రాజవీధి నుంచి శ్రీమందిరం వరకూ రథాన్ని లాగారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీదేవితో కలిసి శ్రీలక్ష్మీనారాయణ అవతారంతో రథాయాత్ర ముగుస్తుంది. ఆఖరిరోజున పెద్ద యాత్ర జరుగనున్నది.

'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!
ఒకప్పుడు సినిమాల్లో చాలా బాగా, బలంగా కనిపించిన డిటెక్టివ్ పాత్రలు.. ప్రస్తుతం తెరపై పెద్దగా కనిపించకపోవచ్చు.. కానీ ఆధునికుల నిజ జీవితంలో మాత్రం కీలకంగా మారాయి. వివాహ పూర్వపు దర్యాప్తుల నుంచి కార్పొరేట్ ఫ్రాడ్స్ వరకూ.. ఎన్నో రంగాల్లో వీరి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, లివిన్ మొదలు ప్రతిదానికీ వీరిపై ఆధారపడుతున్నారు కొందరు.. అయితే అలాంటి ఏజెన్సీలను ఎన్నుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆర్థిక సంస్కరణల ఫలితంగా పలు ప్రైవేటు రంగాలు పుంజుకున్నాయి. దీంతోపాటు వ్యక్తిగత గోప్యత, భద్రత, సత్వర న్యాయం కోసం స్వతంత్ర విచారణలు అవసరమయ్యాయి. అయితే అప్పటికే ముంబయి వంటి నగరాల్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక్కసారిగా డిటెక్టివ్ ఏజెన్సీలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మన నగరంలోనే దాదాపు 30కి పైగా ప్రైవేటు విచారణ సంస్థలు సేవలందిస్తున్నాయి. పెళ్లికి ముందు.. పరిశోధన.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో మోసాలు పెరిగిపోయాయి. దీంతో పాత సంబంధాల సమాచారం దాచిపెట్టడం వంటివి తెచ్చిపెట్టే సమస్యల పరిష్కారంగా డిటెక్టివ్ సేవలు బాగా అవసరం అవుతున్నాయి. కొన్ని మ్యాట్రిమోని సంస్థలు సైతం దీని కోసం డిటెక్టివ్స్ను ఆశ్రయిస్తున్నాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు పరస్పరం అనుమానాలతో ఈ సంస్థల సేవల్ని కోరుకుంటున్నారు. నగరంలో ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ఇలాంటి స్వతంత్ర విచారణలు కూడా ఓ కారణమేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సదరు సంస్థలు చేసిన విచారణలో లోపం కారణంగా అందిన నివేదికలతో అనేకమంది విడిపోతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. ప్రేమలు, లివిన్లలోనూ.. ఇక ప్రేమికులు కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. ‘పారీ్టలు, పిక్నిక్లు, కొలీగ్స్తో చనువుగా ఉండడం వంటి వన్నీ ప్రస్తుతం తప్పని అవసరం. అయితే ఇవే అనుమానాలకూ దోహదం చేస్తున్నాయి. తమ లవర్స్ మీద అనుమానాలతో మమ్మల్ని నెలకు కనీసం 25 మందైనా సంప్రదిస్తుంటారు’ అంటూ నగరంలో పేరున్న ఓ డిటెక్టివ్ సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రేమికులు కేవలం కబుర్లు, షికార్లతో కాలక్షేపం చేసే కాలం పోయి ఏకంగా లివిన్ రిలేషన్ షిప్స్లో ఉండడం సర్వసాధారణం అయ్యింది. ఇలాంటి ట్రెండ్ ఈ పరిస్థితికి దారి తీస్తోందని ఫ్యామిలీ కౌన్సిలర్ సుజాత అంటున్నారు.డివోర్స్కు ఫోర్స్.. ‘వివాహేతర సంబంధం కారణంగా విడాకులు ఇవ్వాలంటే మమ్మల్ని కలవాలి. ఆ తర్వాత విడాకులు ఇచి్చన మహిళకు ఆదాయం ఉందని భరణం ఇవ్వనక్కర్లేదని నిరూపించాల్సినప్పుడు కూడా మమ్మల్నే కలవాలి’ అంటూ చెప్పారు నగరంలోని లక్డీకాపూల్లో డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న ఓ మహిళ. గతంలో ఈ తరహాలో తమ భార్య/భర్తల నేరాన్వేషణ సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ ఉండేదని, అయితే ప్రస్తుతం దాదాపుగా అన్ని రకాల ఆదాయవర్గాల్లోనూ కనిపిస్తోందని అన్నారామె. కార్పొరేట్ వెరిఫికేషన్ కోసం.. కార్పొరేట్ రంగంలో అవినీతి కార్యకలాపాలను గుర్తించేందుకు కూడా డిటెక్టివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగుల నియామకాల కోసం చేసే బ్యాక్గ్రౌండ్ చెకింగ్ నుంచి ఉద్యోగుల వర్గీకరణ, ఇంటర్నల్ లీకులు, మేనేజ్మెంట్ లెవెల్ మోసాల నిర్ధారణకు సంస్థలు ఈ సేవలను వినియోగిస్తున్నాయి. ఎస్సెట్ ట్రేసింగ్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వంటివి వీరు చేస్తున్నారు. అంతే కాకుండా లోన్ రికవరీ/విత్హోల్డింగ్ కేసుల్లో ఆస్తుల వివరాల కోసం పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా జై డిటెక్టివ్ అంటున్నారు. ఈజీ..టెక్నాలజీ.. ప్రస్తుతం డిటెక్టివ్ సేవల్లో టెక్నాలజీ కీలక భూమిక పోషిస్తోంది. వాహనాల పర్యవేక్షణ, వ్యక్తుల స్థల నిర్ధారణకు ఆధునిక పరికరాల సహాయంతో ట్రాకింగ్ సులభంగా మారింది. అలాగే సర్వైలెన్స్, డేటా అనాలసిస్ మరింత ప్రభావవంతంగా మారాయి. సోషల్ మీడియా మానిటరింగ్, డిజిటల్ ట్రెయిల్స్ ఆధారంగా వివరాల సేకరణ, ప్రత్యక్ష సాక్ష్యాల కోసం సీక్రెట్ కెమెరాలు, ఆడియో రికార్డర్లు ఉపకరిస్తున్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్లు, బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించేందుకు డేటా అనలిటిక్స్, అనుమతి మేరకు హ్యాకింగ్, బగ్ డిటెక్షన్, మొబైల్ ట్రాకింగ్ వంటివీ చేస్తున్నారు. వ్యవస్థాపకులు వీరే.. చాలా వరకూ ఈ తరహా ఏజెన్సీల స్థాపకులు మాజీ భద్రతా విభాగాలకు చెందినవారే కావడం గమనార్హం. రిటైర్డ్ పోలీస్ అధికారులు, సైనిక లేదా నిఘా విభాగాల మాజీ ఉద్యోగులు, లాయర్లు, క్రిమినాలాజీ విద్యార్థులు ఈ సంస్థల స్థాపన, నిర్వహణల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరికి న్యాయపరమైన అవగాహన, విచారణ పద్ధతులపై ట్రైనింగ్ ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం నగరంలో షార్ప్ డిటెక్టివ్, హైదరాబాద్ డిటెక్టివ్ ప్రై లిమిటెడ్, డీడీఎస్ డిటెక్టివ్, థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్స్, పారామౌంట్, లింక్స్, యారో, రియల్ ఐ, తదితర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త..ఇలాంటి డిటెక్టివ్ ఏజెన్సీల సంస్థల్ని సేవల కోసం ఆశ్రయించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కార్పొరేట్ సంస్థలు, న్యాయవాదులు, బ్యాంకులు వంటి ఆర్గనైజ్డ్ వ్యవస్థలకు ఫర్వాలేదు కానీ.. వ్యక్తిగత అవసరాలకు సంప్రదించేటప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత రహస్యాలను సేకరించిన అనంతరం బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలూ నగరంలో లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

సీత్లా భవాని పండుగ : కాపాడే దేవత
లంబాడీ గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే పండుగే... ‘సీత్లా భవాని’ వేడుక. గిరి జన సంప్రదా యంలో లంబాడీలు చేసుకునే తొలి పండుగ కూడా ఇదే. ప్రకృతిని ఆరాధిస్తూ... పంటలను, పశు సంపదను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడు కుంటారు. ఈ పండుగ, బోనాల వేడుకలు ఒకేకాలంలో రావడం గమనార్హం. వర్షాకాలంలో రక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అటు హిందువులూ, ఇటు లంబాడీ గిరిజ నులూ తమ తమ గ్రామదేవతలకు బోనాలు ఎత్తి పూజించి మొక్కులు చెల్లించుకుంటూ ఆ వ్యాధుల బారిన పడకుండా కాపాడమని వేడుకుంటారు. సీత్లా భవాని కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలనీ; దూడలకు పాలు సరిపోనుఉండాలనీ, తమ పశువులకు గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా వాటిని కాపాడా లనీ, అటవీ సంపద తరగకూడదనీ సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ పండుగను వివిధతండాల్లో ఆ తండా ప్రజలు, పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢ మాసంలో ఏదో ఒక మంగళవారంఎంచుకొని జరుపుతారు. ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం మాత్రమే జరపడం ఆనవాయితీ.ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవాని సాధారణంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. దేవతను పూజించే ప్రక్రియలో తండా పెద్ద మనిషి పూజారిగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.– నరేష్ జాటోత్, నల్గొండ

వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె..!
అనూజ వైద్య మరో రికార్డు సాధించింది. పర్వతారోహకురాలైన అనూజ వైద్య ఇప్పుడు కొత్త రికార్డుల కోసం నీటి మీద దృష్టి పెట్టారు. ఇంటర్నేషనల్ వాటర్ స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె. గుజరాత్ రాష్ట్రం, సూరత్కు చెందిన అనూజవైద్య గత నెల (జూన్) 24 నుంచి 29 వరకు థాయ్లాండ్లో జరిగిన ఏషియన్ వాటర్ స్కీయింగ్ అండ్ వేక్ బోర్డింగ్ చాంపియన్షిప్లో పాల్గొన్నారు. బాల్యం నుంచి అనూజ స్పోర్ట్స్లో చురుగ్గా ఉండేవారు. ట్రెకింగ్, స్విమ్మింగ్తోపాటు తండ్రి ప్రోత్సాహంతో తాపి నదిలో వాటర్ స్పోర్ట్స్లో శిక్షణ పొందారు. ఆమె తల్లి సొంతరాష్ట్రం ఉత్తరాఖండ్. తల్లి ప్రోత్సాహంతో అనూజ ఆమె చెల్లి అదితి ఇద్దరూ పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ పర్వతాన్ని 2019లో తొలి ప్రయత్నంలోనే అధిరోహించి ’ఎవరెస్ట్ సిస్టర్స్’ గా గుజరాత్ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. ఈ సిస్టర్స్ ఉత్తరాఖండ్లో ‘గెట్ సెట్ అడ్వెంచర్స్’ పేరుతో అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ స్థాపించారు. ఇదిలా ఉండగా 27 ఏళ్ల అనూజ వైద్య తాజాగా వాటర్ స్కీయింగ్ స్పోర్ట్స్లో భారత్ తరఫున పాల్గొన్నారు. రికార్డుల్లో శిఖరాగ్రాన్ని చేరిన అనూజ ప్రస్తుతం నీటి/మీద రికార్డుల బాట పట్టారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ క్రీడ మనదేశ మహిళల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. వీరికంటే ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని హరియాణకు చెందిన తాషి, నున్గ్షి మాలిక్లు ఎవరెస్ట్ను (2023)అధిరోహించారు. సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేసిన తొలి సిస్టర్స్గా రికార్డు సొంతం చేసుకున్నారు. అనూజ వేసిన తొలి అడుగుతో కొత్తతరం క్రీడాకారిణులు ఆ దారిలో నడుస్తారని ఆశిద్దాం. (చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..)
ఫొటోలు
అంతర్జాతీయం

భారత్తో వాణిజ్య ఒప్పందానికి మరింత చేరువయ్యాం: ట్రంప్
భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందానికి మరింత చేరువయ్యామని వ్యాఖ్యానించారాయన. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన తదనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా ట్రంప్ భారత వాణిజ్య ఒప్పందంపై వ్యాఖ్యానించారు. ‘‘భారత్తో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుంది’’ అని అన్నారు. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయన్న ఆయన.. ఇతర దేశాలు అమెరికా షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. వారు(ఒప్పందాలకు దిగిరాని వారు) ఎంత టారిఫ్ చెల్లించాలో లేఖలో చెబుతున్నాం అని ట్రంప్ చెప్పారు. భారత్కు కలిగే లాభాలు:మార్కెట్ ప్రాప్యత: అమెరికా మార్కెట్కు భారత ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాలు పెరగొచ్చు.తక్కువ దిగుమతి సుంకాలు: భారత్కు వస్తువులు దిగుమతి చేసుకునే ఖర్చు తగ్గవచ్చు.టెక్నాలజీ ట్రాన్స్ఫర్: మౌలిక సదుపాయాలు, హైటెక్ రంగాల్లో భాగస్వామ్యం మెరుగుకావొచ్చు.భద్రతా సహకారం: వ్యూహాత్మక మైత్రి బలపడే అవకాశం ఉంటుంది.మరోవైపు.. భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్లో చర్చలు జరుపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు, డిజిటల్ గోప్యత, పౌర హక్కులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదరకపోతే, తాత్కాలికంగా నిలిపిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ఒప్పందం కుదిరితే మాత్రం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు. ఏ దేశాలపై.. ట్రంప్ ఎంతెంత టారిఫ్ (ఆగస్టు 1 నుంచి అమలు):దేశంటారిఫ్ శాతంజపాన్, దక్షిణ కొరియా, కజకస్తాన్, మలేషియా, ట్యునీషియా25%మయన్మార్, లావోస్40%దక్షిణాఫ్రికా, బోస్నియా30%ఇండోనేషియా32%బంగ్లాదేశ్, సెర్బియా35%కంబోడియా, థాయిలాండ్36%

మమ్దానీని వెంటాడుతున్న పాత పోస్టులు.. ఏం జరగనుంది?
న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న జొహ్రాన్ మమ్దానీ చిక్కుల్లో పడ్డారు. 2015లో మమ్దానీ ‘ఎక్స్’లో అల్ ఖైదా ఉగ్రవాదికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అతడిని వెంటాడుతున్నాయి. అమెరికాలో జన్మించిన అన్వర్ అల్–ఔలాకీ అనే మత బోధకుడు తీవ్రవాదం బాట పట్టడానికి ఎఫ్బీఐ నిఘా కారణం కావచ్చు అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన అప్పటి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి.అయితే, వందశాతం కమ్యూనిస్ట్ పిచ్చోడంటూ మమ్దానీని ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాతర ఆయన పాత పోస్టులు తాజాగా వెలుగు చూశాయి. న్యూమెక్సికోలో యెమెన్ దేశస్తుల కుటుంబంలో జన్మించిన ఔలాకీ అమెరికాలోని మసీదుల్లో బోధనలు చేసేవాడు. అటు తర్వాత అల్ఖైదాలో అగ్ర నాయకుల్లో ఒకడయ్యాడు.అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ తదితరాలపై 2001 సెప్టెంబర్ 11న దాడులకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఇతడికి సన్నిహితులని తేలడంతో ఎఫ్బీఐ నిఘా పెంచింది. అటు తర్వాత అతడు 2004లో యెమెన్కు వెళ్లిపోయాడు. అమెరికా ఆస్తులపై దాడులు ఇతడు ఉగ్రవాదులకు పిలుపు ఇచ్చాడనే ఆరోపణలపై 2011లో అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు యెమెన్పై జరిపిన డ్రోన్ దాడుల్లో హతమయ్యాడు. ఎలాంటి నేరారోపణలు లేని అమెరికా పౌరుడిని ప్రభుత్వమే చంపడం అసాధారణ విషయమని న్యూయార్క్ పోస్ట్ అప్పట్లో వ్యాఖ్యానించింది.

రష్యా మంత్రి ఆత్మహత్య
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా గత వారం రాజధాని మాస్కోతోపాటు, సెయింట్ పీట ర్స్బర్గ్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. వేలాదిగా ప్రయాణికులు గంటలపాటు విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ సోమవారం రవాణా శాఖ మంత్రి రొమాన్ స్టరొవోయ్(53)ను సస్పెండ్ చేశారు. డిప్యూటీ మంత్రి ఆండ్రీ నికిటిన్కు రవాణా శాఖ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే స్టరొవోయ్ తన నివాసంలో తుపాకీ గాయాలతో విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 2024 మేలో రవాణా శాఖ మంత్రిగా స్టరొవోయ్ బాధ్యతలు చేపట్టారు.

జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్కు ఈ మేరకు స్వయంగా లేఖలు కూడా రాశారు. ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్లు ఆ మేరకు పెరుగుతాయని అందులో ట్రంప్ హెచ్చరించారు! ఆ లేఖల స్క్రీన్షాట్లను ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ వాపోయారు. ‘‘ఇవి తుది టారిఫ్లు కావు. మీ దేశంతో మా సంబంధాలను బట్టి అంతిమంగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చు’’ అన్నారు. టారిఫ్ పెంపుపై భారత్తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నట్టు సమాచారం. మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఎద్దేవా న్యూయార్క్: ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడతానన్న ఎలాన్ మస్క్ ప్రకటనను హాస్యాస్పదంగా ట్రంప్ సోమవారం అభివర్ణించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రెండు పారీ్టలతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు మూడో పార్టీని తీసుకురావడమంటే గందరగోళాన్ని సృష్టించడమే’’ అని అన్నారు. తర్వాత తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లోనూ మస్్కను విమర్శిస్తూ ట్రంప్ పోస్ట్లు పెట్టారు. ‘‘కొన్ని వారాల క్రితం మా స్నేహ రైలుబండ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు మస్క్ పూర్తిగా పట్టాలు తప్పారు. అమెరికాలో మూడో పార్టీ ఏదీ అద్భుతాలు చేయలేదన్న చేదు నిజం తెల్సికూడా మస్క్ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. సక్రమంగా ఉన్న రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి తప్ప మూడోపార్టీ ఎందుకూ పనికిరాదు’’ అని వ్యాఖ్యానించారు.
జాతీయం

దెయ్యం విడిపిస్తానని.. ప్రాణం తీసింది
కర్ణాటక: దెయ్యం పట్టిందని తీవ్రంగా హింసించడంతో ఓ మహిళ మరణించిన ఘటన జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని జంబరగట్టె గ్రామంలో జరిగింది. మృతురాలు గీతమ్మ (55). వివరాలు.. ఆదివారం సాయంత్రం మృతురాలు గీతమ్మ అసహజంగా ప్రవర్తించింది. ఆమె కుమారుడు సంజయ్ అదే గ్రామానికి చెందిన నిందితురాలు ఆశ (45)ను ఇంటికి పిలిపించాడు. గీతమ్మకు దెయ్యం పట్టిందని, విడిపిస్తానని ఆశా చెప్పింది. ఆశా తనకు చౌడమ్మ దేవి పూనిందంటూ గీతమ్మకు పట్టిన దెయ్యం వదిలిపో అంటూ చర్నాకోలు తీసుకుని కొట్టడం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేజంబర ఘట్టె చౌడమ్మ గుడి వరకు ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లింది. అయినా దెయ్యం వదిలిపోలేదంటూ తెల్లవారుజామున 2.30 గంటల వరకు చితకబాదుతూనే ఉంది. దాడితో తీవ్రంగా అస్వస్థురాలైన గీతమ్మ కుప్పకూలింది. దయ్యం వదలడం ఏమో గానీ ఆమె ప్రాణం వదిలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయిందనుకున్న ఆశ.. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది. కళ్లు తెరవకపోవడంతో కొడుకు గీతమ్మను హొళెహొన్నూరులోని సముదాయ ఆస్పత్రికి తరలించగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. గీతమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా గీతమ్మపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆశను అరెస్టు చేశారు.

‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’.. ‘మహా’లో కొత్త వివాదం
ముంబై: మహారాష్ట్రలో బాషా వివాదాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెరపైకి మరో వివాదం వచ్చింది. అదే ‘హోమియో వైద్యులు.. అల్లోపతి మందులు’. రాష్ట్రంలోని హోమియోపతి వైద్యులు ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన అనంతరం వారు అల్లోపతి మందులను సూచించేందుకు అనుమతినిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసింది.ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)తోపాటు పలువురు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రోగుల భద్రత, వైద్య ప్రమాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2014లో హోమియోపతి ప్రాక్టీషనర్లు కొన్ని షరతులతో ఆధునిక మందులను సూచించడానికి అనుమతించేలా చట్టంలో పలు సవరణలు చేసింది.దీని ప్రకారం, ఫార్మకాలజీలో ఆరు నెలల కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులు, అల్లోపతి మందులను సూచించడానికి అర్హులు అవుతారు. మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (ఎంఎంసీ)ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఐఎంఏ ఈ నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాలు చేసింది. హోమియోపతి వైద్యులకు అల్లోపతి మందులను సూచించే అధికారం ఇవ్వడం రోగుల భద్రతకు ముప్పుగా మారుతుందని ఐఎంఏ పేర్కొంది.ఆరు నెలల కోర్సుతో హోమియో వైద్యులు ఆధునిక వైద్యం నేర్చుకోవడం సాధ్యం కాదని, వైద్య ప్రమాణాలు దిగజారే అవకాశం ఉందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక రకమైన క్రాస్ ప్రాక్టీస్ అని, ఫలితంగా వైద్య రంగంలో గందరగోళం ఏర్పడవచ్చని వారు అంటున్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఆధునిక ఫార్మకాలజీలో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన హోమియోపతి వైద్యులకు మాత్రమే అల్లోపతి మందులను సూచించే అధికారం ఉంటుందని ఎఫ్డీఏ పేర్కొంది. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది.

ప్రకాశ్రాజ్.. ఆంధ్ర రైతుల సంగతి చూడు
కర్ణాటక: ప్రముఖ నటుడు, సామాజిక అంశాలపై గళమెత్తే ప్రకాశ్రాజ్, కాంగ్రెస్ సర్కారు మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. దేవనహళ్లిలో పరిశ్రమలకు భూములు సేకరించడాన్ని ఖండిస్తూ రైతుల ధర్నాలో ఆయన పాల్గొనడాన్ని ఓ మంత్రి తప్పుబట్టారు. పక్క రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు ఇస్తున్నారని, భూ స్వాదీనం తప్పనిసరి అని పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన దేవనహళ్లి రైతులకు మద్దతుగా పోరాడుతున్న ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్.. ఆంధ్రప్రదేశ్లో భారీ మొత్తంలో భూముల స్వాధీనం జరుగుతోందని, అక్కడ రైతులకు మద్దతుగా పోరాడితే మంచిదని సలహా ఇచ్చారు.ప్రకాశ్రాజ్ కర్ణాటకలో కంటే ఆంధ్ర, తమిళనాడులో బాగా ఫేమస్ అన్నారు. రాష్ట్రంలో హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ కోసం 1200 ఎకరాల భూమి మాత్రమే స్వాదీనం చేసుకుంటుంటే, ఇదే అవసరానికి ఆంధ్రప్రదేశ్లో మడకశిర నుంచి పెనుకొండ వరకూ 10 వేల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ అవసరాల పేరుతో అన్నదాతల నుంచి 45 వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని, విశాఖ పట్నంలో 95 పైసలకు ఒక ఎకరాను కట్టబెడుతున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రకాశ్ రాజ్ కళ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి సవాల్కు ప్రకాశ్రాజ్ ఏమని స్పందిస్తారన్నది తేలాల్సి ఉంది.

పప్పు బాగోలేదని.. శివసేన ఎమ్మెల్యే వీరంగం
ముంబై: శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ నిర్వాహకునిపై తన ప్రతాపం చూపారు. ఈ ఘటన ముంబైలోని ఆకాశవాణి గెస్ట్ హౌస్లో చోటుచేసుకుంది. క్యాంటీన్లో తనకు వడ్డించిన ఆహారంలో పప్పు బాగోలేదని, అది తిన్న కొద్దిసేపటికే తనకు అనారోగ్యంగా అనిపించిందని సంజయ్ గైక్వాడ్ చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశంలో సమస్యను లేవనెత్తుతానని ఆయన అన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుల్దానా నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గైక్వాడ్, శాసనసభ్యుల కోసం ప్రభుత్వం కేటాయించిన వసతి గృహం అయిన ఆకాశవాణి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటున్నారు. శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు సమాచారం. వైరల్ అయిన వీడియోలో గైక్వాడ్ షర్టు, టవల్ ధరించి క్యాంటీన్ నిర్వాహకునితో గొడవపడుతున్న దృశ్యం కనిపిస్తుంది. Meet Shah Sena’s MLA Sanjay Gaikwad. Last year he had threatened&announced 11 lakh rupees to anyone who cuts off Sh. Rahul Gandhi’s tongue. Now the man is seen beating up a poor helpless canteen worker. But wait no news TV outrage here since its a BJP ally pic.twitter.com/XVwnEzJFSU— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 9, 2025కొన్ని సెకన్ల తర్వాత ఆ ఎమ్మెల్యే క్యాంటీన్ నిర్వహకునికి ముఖంపై ఒక పిడిగుద్దు కొడతారు. దీంతో అతను కింద పడిపోతాడు. తరువాత అతను లేవగానే మళ్లీ అతని చెంపమీద ఎమ్మెల్యే కొడుతూ నా స్టైల్ ఇదే అంటూ వ్యాఖ్యానించడం వినిపిస్తుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనడం వినిపిస్తుంది. క్యాంటీన్లో ఆహార నాణ్యతపై తాను రెండుసార్లు ఫిర్యాదు చేశానని గైక్వాడ్ పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక తెగ్గోసేవారికి రూ. 11 లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్పై కూడా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ఎన్ఆర్ఐ

మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి
పధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. అందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం అర్జెంటినాకు చేరుకున్నారు. ఆయనకు బ్యూనస్ ఎయర్లోని భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో విజయగుప్తా అనే భారత సంతతి వ్యక్తి మోదీని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. తాను ప్రధాని మోదీకి హలో చెప్పేందుకే 400 కి.మీ ప్రయాణించి మరి వచ్చానని అన్నారు. ఆయనకు జస్ట్ హలో చెప్పాలనుకున్నా..కానీ నాకు మోదీకే కరచలనం(షేక్హ్యాండ్) ఇచ్చే అవకాశం లభించిందంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఇదిలా ఉండగా మోదీ ఒక ట్వీట్లో అర్జెంటీనా పర్యటన గురించి పంచుకున్నారు. "నేను ఈరోజు అర్జెంటీనాతో సంబంధాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించే ద్వైపాక్షిక పర్యటన కోసం బ్యూనస్ ఎయిర్స్లో అడుగుపెట్టాను. ప్రస్తుతం అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలీని కలిసి చర్చలు జరిపేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను" అని ట్వీట్ చేశారు.అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఈ 57 ఏళ్లలో భారత ప్రధాని అర్జెంటీనాలో చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని ట్వీట్ చేశారు. కాగా, మోదీ బ్యూనస్ ఎయిర్స్లోని హోటల్కు చేరుకోగానే 'భారత్ మాతా కీ జై', 'జై శ్రీ రామ్' అనే నినాదాలతో ఘన స్వాగతం పలికారు ప్రవాస భారతీయులు. ఆయన ఇప్పటికే ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలను సందర్శించారు. ఇక ఈ అర్జెంటీనా పర్యటన తదనంతరం బ్రెజిల్, నమీబియాలను సందర్శించనున్నారు.#WATCH | Buenos Aires, Argentina: Vijay Kumar Gupta, a member of the Indian diaspora, says, "I have come here from Rosario, which is 400 kilometres from here, just to say hello to Prime Minister Narendra Modi. I got the opportunity to shake hands with him..." https://t.co/7yZBOqwXFT pic.twitter.com/jS0uoHPGUn— ANI (@ANI) July 5, 2025 (చదవండి: ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం)

ట్రంప్ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్ అలర్ట్
ట్రంప్ కలల బిల్లు.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్కు వచ్చే రెమిటెన్స్లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్ బ్యూటీఫుల్ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్టైమ్పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.

ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్లోని బక్సర్కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.ఎవరీ కమలా పెర్సాద్..కమలా పెర్సాద్ బిస్సేసర్ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..)

గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్కు చేరుకుంది.ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. No more vacation…🫣| #ONLYinDADE * Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025
క్రైమ్

శ్మశానంలో చంపి.. నదిలో శవాన్ని పారేసి..
రాయచూరు రూరల్(కర్ణాటక): నటుడు దర్శన్ గ్యాంగ్ చేతిలో రేణుక స్వామి హత్య కేసు మాదిరిగా రాష్ట్రంలో అలాంటిదే మరో హత్య కలబుర్గిలో జరిగింది. రేణుక స్వామి హత్య షెడ్డులో జరగగా, ఈ కేసులో రాఘవేంద్ర నాయక్ను గురురాజ్, అశ్విని, లక్ష్మీకాంత రావులు కలిసి శ్మశానంలో చంపి రాయచూరు సమీపంలోని కృష్ణా నదిలో మృతదేహాన్ని పడేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కలబుర్గిలో మంగళవారం విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు. అశ్విని, రాఘవేంద్ర నాయక్ మొదటి నుంచి స్నేహితులు. అశ్విని మరొకరితో స్నేహం చేయడంతో రాఘవేంద్ర నాయక్ కస్సుబుస్సుమనేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవ పడ్డారు. ఆమెను వదిలి పెట్టని రాఘవేంద్ర నాయక్ మొబైల్లో అశ్వినికి అశ్లీల సందేశాలు పంపడం, చిత్రహింసలు పెట్టడం చేశాడు. దీనిని సహించలేక గురురాజ్ అనే మిత్రుడికి ఆమె విషయం తెలిపింది. రాఘవేంద్ర నాయక్ను తుదముట్టడించడానికి ప్రణాళిక రచించారు. అతనిని కారులో కిడ్నాప్ చేసి కలబుర్గి కృష్ణానగర్ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లారు. మర్మాంగాన్ని కోసి హత్య అతడిపై మారణాయుధాలతో దాడి చేసి మర్మాంగాన్ని కోసి హత్య చేశారు. సాక్ష్యం లభించరాదని భావించి రాయచూరు తాలూకా శక్తినగర సమీపంలో కృష్ణా నది వంతెన పైనుంచి నదిలోకి పారేసి చేతులు దులుపుకున్నారు. రాఘవేంద్ర నాయక్ కారవార నుంచి వచ్చి కలబుర్గిలో సురేఖను పెళ్లి చేసుకొని అక్కడే గణేష్ నగర్లో నివాసం ఉన్నారు. సూపర్ మార్కెట్ వద్ద హోటల్లో పని చేస్తున్న రాఘవేంద్ర నాయక్ను మార్చి 12న కిడ్నాప్ చేసి హత్య చేశారు. 14వ తేదీన మృతదేహం లభించింది. ఈ విషయంలో భర్త రెండు నెలలు గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆమె మే 25న స్టేషన్ బజార్ పోలీçస్ స్టేషన్లో తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో రాఘవేంద్ర నాయక్ తనకు భార్య ఉన్నా మరొకరితో అనైతిక సంబంధం పెట్టుకోవడంతో అది వికటించగా, అశి్వనికి అశ్లీల సందేశాలు పంపడం, చిత్రహింసలు పెట్టడంతో తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు.

దెయ్యం విడిపిస్తానని.. ప్రాణం తీసింది
కర్ణాటక: దెయ్యం పట్టిందని తీవ్రంగా హింసించడంతో ఓ మహిళ మరణించిన ఘటన జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని జంబరగట్టె గ్రామంలో జరిగింది. మృతురాలు గీతమ్మ (55). వివరాలు.. ఆదివారం సాయంత్రం మృతురాలు గీతమ్మ అసహజంగా ప్రవర్తించింది. ఆమె కుమారుడు సంజయ్ అదే గ్రామానికి చెందిన నిందితురాలు ఆశ (45)ను ఇంటికి పిలిపించాడు. గీతమ్మకు దెయ్యం పట్టిందని, విడిపిస్తానని ఆశా చెప్పింది. ఆశా తనకు చౌడమ్మ దేవి పూనిందంటూ గీతమ్మకు పట్టిన దెయ్యం వదిలిపో అంటూ చర్నాకోలు తీసుకుని కొట్టడం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేజంబర ఘట్టె చౌడమ్మ గుడి వరకు ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లింది. అయినా దెయ్యం వదిలిపోలేదంటూ తెల్లవారుజామున 2.30 గంటల వరకు చితకబాదుతూనే ఉంది. దాడితో తీవ్రంగా అస్వస్థురాలైన గీతమ్మ కుప్పకూలింది. దయ్యం వదలడం ఏమో గానీ ఆమె ప్రాణం వదిలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయిందనుకున్న ఆశ.. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది. కళ్లు తెరవకపోవడంతో కొడుకు గీతమ్మను హొళెహొన్నూరులోని సముదాయ ఆస్పత్రికి తరలించగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. గీతమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా గీతమ్మపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆశను అరెస్టు చేశారు.

ఆరుగురిపై న్యూసెన్స్ కేసు నమోదు
కుత్బుల్లాపూర్: ప్రధాన చౌరస్తాల వద్ద భిక్షాటన చేసే వారితో పాటు హిజ్రాల ఆగడాలపై వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. పేట్షిరాబాద్ సీఐ విజయవర్ధన్ సుచిత్ర చౌరస్తాలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు భిక్షాటన చేస్తూ వాహనదారులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని గుర్తించి సుమారు ఆరుగురిని అదుపులో తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూసెన్స్ కేసు కింద ఫైన్ వేశారు. ఇక మీదట రోడ్లపై అడుక్కోరాదని తేల్చి చెప్పారు.

జీవితంపై విరక్తితో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు..!
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడిగినేని చైతన్య (35) సాఫ్ట్వేర్ ఉద్యోగి. గత ఏప్రిల్ 23న నాగ మౌనికతో వివాహమైంది. ఈ దంపతులు కేపీహెచ్బీ, 7వ ఫేజ్లోని ఎల్ఐజీ–43లో నివాసం ఉంటున్నారు. ఆషాఢ మాసం నేపథ్యంలో జూన్ 21న నాగ మౌనిక పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ప్రతిరోజూ ఆమె ఫోన్లో భర్తతో మాట్లాడుతూ ఉండేది. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్లో అతనితో మాట్లాడింది. అప్పటికే తన భర్త దిగులుగా మాట్లాడటంతో కొద్ది సేపటి తర్వాత ఫోన్ కట్ అయింది. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో చైతన్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు. పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవంతో వెంటనే తన మామకి సమాచారం అందించింది. వెంటనే కింది అంతస్తులోకి వెళ్లి చైతన్యను పిలవగా ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చైతన్య సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే విషయాన్ని మౌనికకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన భర్త జీవితం పట్ల విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్బీ పోలీసులు చెప్పారు.