
పాటెమ్మ తల్లి జాతరలో అగ్నిగుండ ప్రవేశం
దెందులూరు: చల్లచింతలపూడిలో నాలుగు రోజులుగా జరుగుతున్న శ్రీ పాటెమ్మ పేరంటాలు తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. మండుటెండలో కనకనలాడే నిప్పులపై అమ్మవారు ఆవహించిన కమ్మ సత్యవతి అనే భక్తురాలు పాటెమ్మ తల్లి విగ్రహాన్ని చేతపట్టుకుని అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆమెతోపాటు ఆలయ కమిటీ చైర్మన్ యలమర్తి శ్రీనివాసరావు యలమర్తి సత్తిబాబు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ముమ్మడి మోహన్రావు, మాజీ వైస్ ఎంపీపీ నాగనబోయిన సత్యనారాయణ, కమిటీ సభ్యులు యలమర్తి రామ్మోహన్రావు, రాముడు, మోహన్, మురళి, పర్వతనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సిక్స్ వీక్స్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కోర్సు
ఏలూరు రూరల్: ఆటలపై ఆసక్తి గల వారి కోసం స్పోర్ట్స్ ఆఽథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు పాటియాలాలోని ఎన్ఎస్ఎన్ఐఎస్ సిక్స్ వీక్స్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహించనుందని ఏలూరు జిల్లా డీఎస్డీఓ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. మాస్ స్పోర్ట్స్ పార్టిషిపేషన్ ప్రోగ్రామ్ ద్వారా 6 నెలల పాటు శిక్షణ జరుగుతందని వెల్లడించారు. ఈ శిక్షణపై ఆసక్తి గలవారు మే 6వ తేదీ నుంచి జూలై 2వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.