Eluru District News
-
శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్య క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు వెలువడటంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. భక్తులతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద ఉచిత అన్నప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. పార్కింగ్ ప్రదేశాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
ఒలింపియాడ్లో 29 మంది విద్యార్థులకు ర్యాంకులు
తాడేపల్లిగూడెం రూరల్: ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ సంస్థ (గురుగ్రామ్) వారు నిర్వహించిన గణిత, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్ పరీక్షల్లో మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ బి.రాజారావు శనివారం తెలిపారు. మ్యాథ్స్ ఒలింపియాడ్లో 30 మందికి గాను ఐదుగురు, ఇంగ్లీష్ పరీక్షలో 20 మందికి గాను ముగ్గురు, సైన్స్ పరీక్షలో 62 మందికి గాను 12 మంది, జనరల్ నాలెడ్జ్లో ముగ్గురికి ముగ్గురు ఇంటర్నేషనల్, సోషల్ విభాగంలో 34 మందికి గాను ఆరుగురు ఇంటర్నేషనల్ ర్యాంకులతో పాటు జోనల్, క్లాస్ ర్యాంకులు, గోల్డ్ మెడల్స్ సాధించినట్లు వివరించారు. సైన్స్ ఒలింపియాడ్లో రోషన్ (ఏడవ తరగతి), పృధ్వీ (8వ తరగతి), చిగురుపల్లి వివేక్ (9వ తరగతి), పిట్టా తంబి, అరవింద్ సాగర్బాబు (10వ తరగతి) మొదటి ర్యాంకులు సాధించారన్నారు. అలాగే ఇంగ్లీష్ ఒలింపియాడ్లో కంకిపాటి శాండీ రేవంత్ (8వ తరగతి) మొదటి ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మొత్తం 149 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 29 మంది ప్రతిభ కనబర్చారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయాధికారిణి బి.ఉమాకుమారి, ప్రిన్సిపాల్ బి.రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ బి.ప్రతాప్, ఉపాధ్యాయులు అభినందించారు. -
నేడు నూజివీడులో బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
నూజివీడు: నూజివీడులోని వీటీహెచ్ గ్రౌండ్లో ఈనెల 20న ఉదయం 7 నుంచి బాస్కెట్బాల్ ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్జూనియర్, జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ సుభాష్ చంద్రబోస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని, ఆధార్ కార్డు, పాస్పోర్టు, స్టాంపు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలన్నారు. సబ్జూనియర్ విభాగంలో పాల్గొనేందుకు 2012 జనవరి ఒకటి, జూనియర్ విభాగంలో పాల్గొనేందుకు 2008 జనవరి ఒకటి తరువాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపిక చేసిన జట్లు మే 15 నుంచి 18 వరకు చిత్తూరులో నిర్వహించే 8వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ నందు, అలాగే జూన్లో నిర్వహించే 10వ ఏపీ స్టేట్ జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. -
మా రొయ్యను మేమే అమ్ముకుంటాం
పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రోడ్డెక్కినా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం శనివారం పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్ రోడ్డు నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లే మార్గ మధ్యలో ఓ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘ సెక్రటరీ బోణం చినబాబు మాట్లాడుతూ ప్రాసెసింగ్ ప్లాంట్లపై ఆధారపడి ఇప్పటివరకూ ఆక్వా రైతులు చాలా నష్టపోయారన్నారు. డొమెస్టిక్ సేల్స్ కేంద్రం ఇటు వినియోగదారుడు, అటు ఆక్వా రైతుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అలాగే కొందరు మహిళలకు ఉపాది కూడా కల్పించినట్లు అవుతుందన్నారు. ఈ నెల 30 వ తేదీన శంకుస్థాపన చేస్తామని, అనంతరం మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పక్కాగా ప్రారంభోత్సవం చేయాలనే సంకల్పంతో తమ సంఘం ఉందన్నారు. ప్రారంభం అయిన వెంటనే ఇక్కడ రూ.100కు రొయ్యలను అందజేస్తామన్నారు. అంతా రెడీ కుక్లా ప్యాకింగ్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా రైతు 100 కౌంట్కు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్న సమయంలో నేరుగా ఈ కౌంటర్ వద్దకు తీసుకువచ్చి తన రొయ్యను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. లోకల్ సేల్స్ పెరిగిందంటే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసే కౌంటర్ మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా అమలైందంటే ఈ కార్యక్రమం విజయవంతమైనట్టేనని అన్నారు. ఆక్వా సంఘ సభ్యులు మేడిది జాన్రాజు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం ఏర్పాట్లు చేస్తున్న జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం -
జేఈఈ మెయిన్స్లో శశి వేలివెన్ను విజయభేరి
ఉండ్రాజవరం: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో మరోసారి సత్తా చాటారని వేలివెన్ను శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో జి.అనూప్రాజ్ 26, డి.మణికంఠరెడ్డి 63, ఎ.శివరామ్ 142, బి.నిఖిల 159, ఏఎల్ జ్ఞాన ప్రకాష్ 168, కె.జైకిశాన్ 225, కె.ఆనంద్ 266, ఎం.సాయి కిరణ్ 292, పి.సుకుమార్ 363, పీవై సుందరరెడ్డి 436, డి.శర్వాన్ 448, ఐ.రామచరణ్ 477, కె.శివ సత్యదేవ్ 543, సీహెచ్ యశస్విని 623, షేక్ అబ్దుల్ వహబ్ 671, కె.ఆనంద్పాల్ 756, కె.ఉజ్వల్ కిరణ్ 859, కె.చరణ్దీప్ 871, బి.చైతన్య 913 ర్యాంకులు సాధించారని వివరించారు. 100 లోపు ఇద్దరు, 500 లోపు 12 మంది, 1,000 లోపు 19 మంది, 5,000 లోపు 58 మంది, 10,000 లోపు 101 మంది, 15,000 లోపు 134 మంది, 20,000 లోపు 161 మంది, 30,000 లోపు 219 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని విద్యా సంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు. శ్రీషిర్డీసాయి విద్యార్థుల ప్రతిభకంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య శనివారం విలేకరులకు తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీసాయి హిమ్నీష్ జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడన్నారు. సీహెచ్ మోక్షిత్ 35, ఎం.మధులిక రెడ్డి 169, మోహన్ శ్రీరామ్ జీ 287 ర్యాంకులు కై వసం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనపరచారన్నారు. మొత్తం 10 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించగా, 23 మంది 2,000 లోపు, 45 మంది 5,000 లోపు, 64 మంది 10,000 లోపు, 88 మంది 20,000 లోపు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. మొత్తం 245 మంది విద్యార్థులు హాజరుకాగా 186 మంది విద్యార్థులు అడ్వాన్స్కు అర్హత సాధించారన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
వాహన దొంగల అరెస్టు
కై కలూరు: వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇరువురు స్థానిక దొంగలను కలిదిండి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్లో రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్, ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. పేట కలిదిండికి చెందిన వనమాల జగదీష్(31), కలిదిండికి చెందిన చేబోయిన శ్యాంతేజా(28) ఇటీవల ఈ ప్రాంతంలో 5 వాహనాలను దొంగతనం చేశారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకుని మొత్తం వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల విలువ మార్కెట్లో రూ.3.50 లక్షలు ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ఏఎస్సై కె.వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు బి.రమేష్, డి.వడ్డీ కాసులు, హోంగార్డు కట్టా శ్రీనులను సీఐ రవికుమార్ అభినందించారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి భీమవరం: మోటారుసైకిల్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ శనివారం చెప్పారు. వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న రాజమహేంద్రవరానికి చెందిన ఎం జ్ఞానసాగర్(21) శుక్రవారం రాత్రి తన స్నేహితుడు కె సాయిభరత్తో కలసి గరగపర్రు రోడ్డులోని తన రూమ్ నుంచి మోటారు సైకిల్పై పట్టణంలోకి వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్ను తప్పించబోయి అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మోటారుసైకిల్ నడుపుతున్న జ్ఞానసాగర్ తలకు తీవ్ర గాయాలు కాగా సాయిభరత్కు స్వల్పగాయలయ్యాయి. వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా జ్ఞానసాగర్ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సాయిభరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇజ్రాయిల్ చెప్పారు. ప్రేమ పేరిట మోసం.. యువకుడి అరెస్ట్ ఉంగుటూరు: ప్రేమ పేరిట మోసం చేసిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలుకు చెందిన పొట్ల పండుబాబు అదే గ్రామానికి చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అనంతరం పండుబాబు ఆమెను మోసం చేసిన నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పండుబాబును అరెస్ట్ చేసి కోర్టుకు పంపగా రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు. -
గుడ్ఫ్రైడే వేడుకల్లో అపశ్రుతి
పేరుపాలెం బీచ్లో స్నానానికి దిగి ఒకరి మృతి నరసాపురం రూరల్ : క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి జరుపుకునే గుడ్ఫ్రైడే వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పేరుపాలెం బీచ్లో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 40 రోజుల ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విశ్వాసులు పేరుపాలెం తీరంలోని వేళాంకణ్ణి మాత ఆలయం వద్ద మాల విరమణ చేసేందుకు శుక్రవారం రాత్రినుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇందులో శనివారం వేకువ జామున సముద్రస్నానానికి దిగిన ఇద్దరు యువకులు సముద్రపు అలలకు ఉక్కిరి బిక్కిరై ఒడ్డుకు ప్రాణాలతో కొట్టుకు వచ్చారు. వీరిలో నల్లజర్ల మండలం ప్రకాశపాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్కుమార్ (19) అనే యువకుడిని స్థానికులు, పోలీస్ సిబ్బంది మొగల్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉండటంతో నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయకుమార్ తండ్రి చిన్న తనంలోనే మృతి చెందగా తల్లి విజయలక్ష్మి బిడ్డను చూసుకుంటోంది. ఈ ఘటనపై మృతుడి అక్క విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్తూరు 2వ ఎస్సై వై నాగలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే ప్రమాదంలో బయట పడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు భీమవరంలో చికిత్స చేయించి సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. -
జిల్లా అధికారుల శ్రమదానం
రొయ్యను మేమే అమ్ముకుంటాం రొయ్య రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 4లో uఏలూరు (టూటౌన్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరులో కృష్ణా కాలువ గట్లపై అధికారులు శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. చెత్తాచెదారాలు, వ్యర్థాలను తొలగించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి స్వయంగా పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపాలిటీ వారికి అప్పగించాలని కోరారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందన్నారు. జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరులోని కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఆహ్లాదకర ప్రదేశాలుగా మా ర్చడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. డీఆర్వో వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
విలీన మండలాల్లో కరెంట్ కష్టాలు
కుక్కునూరు: విలీన మండలాలను విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. వేసవి వచ్చిందంటే విద్యుత్ సమస్యతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కుక్కునూరు మధ్యలో ఎక్కడ బలంగా గాలులు వీచినా గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో సరఫరా పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి రావాల్సిందే.. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు విద్యుత్ సబ్స్టేషన్లకు జంగారెడ్డిగూడెంలోని 132 కేవీ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కుక్కునూరు మండలంలోని 33 కేవీ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా కావాలంటే జంగారెడ్డిగూడెం నుంచి మైసన్నగూడెం, ములగలంపల్లి, పి.నారాయణపురం, రాచన్నగూడెం, వేలేరుపాడు గ్రామాల్లోని సబ్స్టేషన్ల నుంచి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్యలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఏర్పడినా విలీన మండలాల ప్రజలు చీకట్లలో మగ్గాల్సిందే. అటవీ ప్రాంతం కావడంతో.. జంగారెడ్డిగూడెం నుంచి కుక్కునూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరం. ములగలంపల్లి నుంచి కుక్కునూరు మధ్య అటవీ ప్రాంతం మీదుగా విద్యుత్ లైన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతుండటంతో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రా విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య తీవ్రంగా మారింది. దీనిపై పలుమార్లు ప్రజలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. అల్లూరి జిల్లాలోని ఎటపాక 132 కేవీ సబ్స్టేషన్ నుంచి గోదావరి మీదుగా టవర్లు ఏర్పాటు చేసి విద్యుత్ను అందించాలని, లేకుంటే వేలేరుపాడు మండలంలోని మేడిపల్లి వద్ద 132 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటుచేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆ దిశగా అధికారులు కూడా సర్వే చేసినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఈదురుగాలులతో తరచూ నిలిచిపోతున్న విద్యుత్ జంగారెడ్డిగూడెం నుంచి సరఫరాలో అవాంతరాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న ప్రజలు లోఓల్టేజీ సమస్య తెలంగాణలో ఉన్నప్పుడు సమస్య వస్తే బూర్గంపాడు నుంచి లేకపోతే అశ్వారావు పేట నుంచి విద్యుత్ సరఫరా చేసేవారు. అయితే ఆంధ్రప్రదేశ్లో విలీనమైనప్పటి నుంచి లోఓల్టేజీ సమస్య వేదిస్తోంది. ఇప్పటికీ మా ఊరిలో లోఓల్టేజీతో గృహోపకరణాలు సరిగా పనిచేయడంలేదు. దీనిపై గ్రీవెన్స్లో దరఖాస్తు చేసినా ఫలితం లేదు. – నకిరికంటి వెంకటేశ్వర్లు, కొండపల్లి, కుక్కునూరు గంటల తరబడి అంతరాయం వేసవి కాలం వచ్చిందంటే విద్యుత్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. గడిచిన వారం రోజుల్లో కూడా రాత్రి మొత్తం విద్యుత్ సరఫరా లేక పిల్లాపాపలతో చాలా ఇబ్బంది పడ్డాం. పోలవరం ప్రాజెక్టు పేరుతో మా మండలాలను విలీనం చేసుకుని మా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. – పేరాల నరసింహారావు, కొండపల్లి, కుక్కునూరు -
ఆ ఊరంతా నారసింహులే..
నంబర్తో పిలిచేవారు మా గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో రాజవరంలోని పాఠశాలకు వెళ్లి చదువుకునే వాళ్లం. మా గ్రామం నుంచి వెళ్లిన వారిలో ఎక్కువ మంది నరసింహమూర్తి పేరుగల వారం ఉండేవారం. దాంతో ఉపాధ్యాయులు ఒకటి, రెండు, మూడు ఇలా పది మందికి నంబర్లు పెట్టారు. అటెండెన్స్ వేసేటప్పుడు కూడా ఒకటి గాడు వచ్చాడా.. రెండు గాడు వచ్చాడా.. అని పిలిచేవారు. నా నంబర్ ఏడు కాబట్టి నన్ను ఏడు గాడు వచ్చాడా అని పిలిచేవారు. – పసుపులేటి నరసింహమూర్తి ఆనవాయితీగా మారింది లక్ష్మీనరసింహ స్వామివారి పేరును పిల్లలకు పెట్టడం ఈ గ్రామంలో ఆనవాయితీగా మారింది. ఆ క్రమంలోనే నా తల్లిదండ్రులు నాకు నరసమ్మ అని పేరు పెట్టారు. లక్ష్మీనరసింహ స్వామివారిపై ఉన్న భక్తి, నమ్మకంతో ఆయన పేరును నామకరణం చేస్తున్నారు. ఆ స్వామి పేరులోనే ఏదో మహత్యం ఉంది. – బోయిన నరసమ్మ నా మనుమరాలికి కూడా స్వామి పేరే పెడతా.. నా తండ్రి పేరు నరసయ్య, నా భార్య పేరు లక్ష్మీ నరసమ్మ, నా కుమార్తె పేరు నాగవెంకట నరసమ్మ. నా మనుమరాలికి మరి కొద్దిరోజుల్లో పేరు పెట్టాల్సి ఉంది. ఆమె పేరు కూడా స్వామివారి పేరే పెడతాను. నా పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో గ్రామంలో నన్ను ఒకటి గాడు అని పిలుస్తారు. – ముత్తింటి నరసింహమూర్తి ద్వారకాతిరుమల: ఆ ఊరిలో వెలసిన నారసింహుడంటే వారికెంతో నమ్మకం. ఆ ఊరిలో మగబిడ్డ పుట్టినా.. ఆడ బిడ్డ పుట్టినా.. ఆ స్వామివారి పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ఊరిలో ఏ గడప తొక్కినా.. నరసింహ, నరసయ్య, నరసింహమూర్తి, నరసింహస్వామి, లక్ష్మీనరసమ్మ, నరసమ్మ వంటి పేర్లే వినిపిస్తాయి. ఇప్పటికే నరసింహమూర్తి పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో కొంత మందిని నంబర్లతో పిలుస్తున్నారు. ఇదే ఈ ఊరి ప్రత్యేకత. ఇక్కడ ఏ ఇంట శుభకార్యం జరగాలన్నా ముందు ఆ స్వామిని దర్శించి, పూజలు జరుపుకుంటారు. ఆ తరువాతే అడుగు ముందుకు వేస్తారు. ఎన్నికల సమయాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ ఊరి నుంచే ప్రచారాలను మొదలు పెడతారు. ఎందుకంటే ఈశాన్యం మూల ఉన్న ఊరు ఇది.. అందులోనూ నారసింహుని సన్నిధి నుంచి ప్రచారం మొదలు పెడితే ఇక తిరుగు ఉండదన్న నమ్మకం వారిది. అందరికీ అంత సెంటిమెంట్ ఆ స్వామివారంటే. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురం గ్రామం నారసింహుని క్షేత్రంగా విరాజిల్లుతోంది. సుమారు వెయ్యి మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో, రెండు వందల మందికి పైగా స్వామివారి పేరుగల వారు ఉన్నారంటే అతిశయోక్తికాదు. నామకరణం వెనుక చరిత్ర ఇదీ.. సుమారు వందేళ్ల క్రితం అప్పటి ఠాణేదారు అయిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చర్లకోట రామారావు, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెంది గూడూరు అయ్యన్న, బెల్లన్న అరణ్యప్రాంతమైన ఈ మార్గం గుండా వెళుతున్నారు. కొందరు పశువుల కాపర్లు కొండపైన ఏదో ఉందని, అప్పుడప్పుడు పశువుల కోసం కూత వేస్తుంటే తిరిగి కూత వినిపిస్తోందని వారికి చెప్పారు. దాంతో వారు డొంకలు నరుక్కుంటూ కొండపైకి చేరుకుని అక్కడ స్వయంభూ నరసింహ స్వామిని గుర్తించి పాల పొంగలిచేసి స్వామివారికి నివేదించారు. ఆ వెంటనే మండు వేసవి రోజున వర్షం కురిసింది. దాంతో స్వామివారు ఎంతో మహిమాన్వితుడని రామారావు నమ్మారు. తనకు సంతానం లేకపోవడంతో స్వామివారిని మొక్కుకున్నారు. దాంతో ఆయనకు కలిగిన మొదటి సంతానమైన కుమారుడికి స్వామివారి పేరు పెట్టుకుని, ఇలవేల్పుగా కొలిచారు. ఆ తర్వాత ఆయన మనుమడికి సైతం కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆయనే గురూజీగా ప్రతి ఏటా శివరాత్రి నాడు ఈ నారసింహుని క్షేత్రంలో మహా యజ్ఞాన్ని నిర్వహిస్తూ, స్వామివారి కీర్తిని చాటుతున్నారు. తికమక పడకుండా నరసింహమూర్తి పేరుగల వారు ఎక్కువ మంది ఉండటంతో పిలిచేవారు అలాగే పలికేవారు తికమక పడేవారట. దాంతో వారు చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు కొంత మంది నరసింహమూర్తులకు నంబర్లు పెట్టారు. ఒకటి గాడు, రెండు గాడు, మూడు గాడు ఇలా పది నంబర్ల వరకు పెట్టారు. క్లాస్కి వచ్చే ఉపాధ్యాయులు ఏరా.. ఒకటి గాడు వచ్చాడా.. రెండు గాడు వచ్చాడా.. అని పిలిచేవారట. ఇప్పటికీ గ్రామంలో వారిని ఆ నంబర్లతోనే పిలుస్తుండటం విశేషం. పుట్టిన ప్రతి బిడ్డకూ నరసింహ నామకరణం నరసింహమూర్తి, నరసమ్మల పేర్లే అధికం ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండటంతో నంబర్లతో పిలుపు ఐఎస్ జగన్నాధపురంలో అదే ప్రత్యేకత లక్ష్మీనరసింహ స్వామివారే ఆ గ్రామ ప్రజల ఆరాధ్య ధైవం ప్రతి ఇంట్లోనూ నారసింహుని పేరుతో.. నా పేరు పసుపులేటి నరసింహమూర్తి. నా కుమార్తెకు కూడా నరసమ్మ అని పేరుపెట్టాను. ఆ లక్ష్మీనరసింహ స్వామివారిని మదినిండా నింపుకున్నాం. అందుకే మా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ నారసింహుని పేరుగల వారు ఉంటారు. – పసుపులేటి నరసింహమూర్తిఎక్కడా ఇలా లేదు ఎన్నో గ్రామాల్లో క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఎక్కడా దేవుళ్ల పేరును ఇంతిలా పెట్టుకున్న వారు లేరు. నరసింహమూర్తి అనే పేరు ఎంత మందికి ఉన్నా.. ఇంకా పుడుతున్న బిడ్డలకు ఆ పేరునే పెట్టుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొందరు ఆడపిల్లలకు నర్సవేణి, నకవల్లి పేర్లు కూడా పెడుతున్నారు. అందుకే ఈ గ్రామ ప్రజలపై స్వామివారి కృపా కటాక్షాలు ఉంటున్నాయి. – కోడూరి ఈశ్వర శర్మ, లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు -
నూక శాతం పేరుతో రైతులకు ఇబ్బందులు
ఏలూరు (టూటౌన్): ధాన్యంలో నూక శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, కృష్ణా డెల్టా పరిధిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పెసలు అమ్మిన రైతులకు బకాయిలు చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. ఏలూరు అన్నే భవనంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం తడిచినా, అధికంగా ఆరబెట్టినా ఒక వైపు తేమ శాతం, మరో వైపు నూక శాతం వంటి నిబంధనలు రైతులకు శాపంగా మారాయన్నారు. కొనుగోలు నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు. రైతులు పెసలు అమ్మి 20 రోజులు గడించిందని, ప్రభుత్వం వెంటనే సొమ్ములు విడుదల చేయాలని కోరారు. నాయకులు చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఉపాధి రుణాలకు దరఖాస్తులు ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఎస్సీల స్వయం ఉపాధి యూనిట్లకు రాయితీతో కూడిన రుణాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,111 మంది లబ్ధిదారులకు రూ.46.44 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కింద రూ.25.77 కోట్లు మంజూరు చేసిందన్నారు. అభ్యర్థులు మే 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్థిక స్వావలంబన కోసమే పథకాలు ఏలూరు (టూటౌన్): అట్టడుగు ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయని ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. నగరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో ఉమ్మడి జిల్లాలో పథకాలు అమలుచేసే అధికారులతో సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థల సమన్వయంతో పథకాలు అమలు చేసి ప్రజల సంక్షేమం, సమాజాభివృద్ధికి కృషిచేయాలన్నారు. ప్రజలు పథకాలను పొందటంలో న్యాయ సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థలను 08812 22455 లేదా 15100 టోల్ ఫ్రీ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఏలూరు ఆర్డీఓ అంబరీష్ మాట్లాడుతూ సాంకేతిక లోపాలతో తాత్కాలికంగా కొందరికి పథకాలు అందడం లేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. భీమవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులను ఎంపిక చేసి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్తున్నామన్నారు. లీగల్ లేడి చీఫ్ రేగలే డిఫెన్స్ కౌన్సిల్ పీఎన్వీ మునీశ్వరరావు, న్యాయవాది పి.రత్నరాజు అధికారులు పాల్గొన్నారు. పథకం ప్రకారం బీజేపీ ఆరోపణలు టీడీపీ నేతల ఆగ్రహం లింగపాలెం: బీజేపీ మండల నాయకులు ఒక పథకం ప్రకారమే విలేకరుల సమావేశం పెట్టి తమపై ఆరోపణలు చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ నేతలు విలేకరుల సమావేశంలో చేసిన విమర్శలపై శనివారం వారు స్పందించారు. మండలంలోని ధర్మాజీగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమిలో భాగమైన బీజేపీకి చెందిన కొందరు నాయకులు టీడీపీ నాయకులపై నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. టీడీపీ మండలాధ్యక్షుడు గరిమళ్ల చలపతిరావు, సీనియర్ నాయకుడు గుత్తా సాయి సత్యవరప్రసాద్ (పెదబాబు)లపై రేషన్, మట్టి మాఫియా, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించడం సరికాదన్నారు. పార్టీ అధిష్టానం అంతర్గతంగా జరిగే అన్ని విషయాలను పరిశీలిస్తుందని, పార్టీ ఆదేశాలను ధిక్కరించేవారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోదని స్పష్టం చేశారు. జర్మన్ భాషపై శిక్షణ ఏలూరు (టూటౌన్): బీఎస్సీ నర్సింగ్ జీఎన్ఎం పూర్తిచేసిన యువకు 8 నెలలపాటు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ, భోజన నివాస సదుపాయాలు కల్పిస్తున్నట్టు డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు శనివారం ప్రకటనలో తెలిపారు. బి2 లెవిల్ పరీక్ష ద్వారా జర్మనీలో ఉద్యోగావకా శాలు పొందవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 21న గుంటూరులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 90307 44877, 98666 56743 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో శనివారం క్రైస్తవులు నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ వసంతమహల్ సెంటర్, జ్యూట్మిల్లు, ఓవర్బ్రిడ్జి, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ఇండోర్ స్టేడియం వద్దకు చేరింది. ముఖ్య అతిథులుగా ఐసీఎం సంఘాల అగ్రపీఠాధిపతి బిషప్ జాన్ ఎస్డీ రాజు, మన్నా చర్చ్ బిషప్ ఎలీషా రాజు హాజరయ్యారు. రన్ ఫర్ జీసస్ క్రైస్తవ సమాజంలో భాగమైపోయిందని, రాబోయే సంవత్సరాల్లోనూ కొనసాగించాలని బిషప్ జాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి అద్దం పడుతుందని బిషప్ ఎలీషా రాజు అన్నారు. ఇదే క్రమశిక్షణను క్రైస్తవులు నిరంతరం కొనసాగించాలని అమలోధ్బవి కథీడ్రల్ గురువులు ఫాదర్ మైఖేల్ ఇంజమాల అన్నారు. శ్యామ్ బాబు, రాజకుమార్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లూథరన్ సంఘ సీనియర్ గురువులు మిల్టన్, పీపీఎస్ కిరణ్, ఎంఎం కుమార్, యు.విలియమ్ కేరీ, పి.శ్యామ్ పాలీనా తదితరులు సందేశాలు అందించారు. ఫైర్స్టేషన్ సెంటర్లో మానవహారం చేపట్టి డి.యోబు, కె.కిరణ్, జెర్మియా, కె.డేవిడ్ తదితరులు ప్రార్థనలు చేశారు. వందలాది మంది క్రైస్తవులు ర్యాలీలో పాల్గొన్నారు. -
కంటి వెలుగు లేదు
గత ప్రభుత్వంలో పెద్దపీట ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కంటి పరీక్షలు కొనసాగించాలి గతంలో ఆస్పత్రిలోని ఈఐ కేంద్రంలో, పాఠశాలలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి కంటి పరీక్షలు చేసేవారు. మందులు, కళ్లజోళ్లు ఇవ్వడంతో పాటు శస్త్రచికిత్సలు చేసేవారు. ఇలానే సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి. – వర్ధనపు సుధాకర్, రుస్తుంబాద పేదలకు ఇబ్బంది ఈఐ కేంద్రాల్లో కంటి పరీక్షలు నిలిపివేయడంతో పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సేవలందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటంతో పరీక్షలకు చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. – కురెళ్ల పౌలు, దుంపగడప, ఆకివీడు మండలం సాక్షి, భీమవరం: పేదల కంటి వైద్యానికి కూటమి ఎగనామం పెట్టింది. సీహెచ్సీల్లోని ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల కాంట్రాక్టు గడువు ముగిసి ఎనిమిది నెలలుగా సేవలు నిలిచినా పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అంతంతమాత్రంగానే ఉండటంతో పేదవర్గాలు కంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో.. జిల్లాలోని భీమవరం, ఆచంట, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ల్లో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచితంగా కంటి వైద్యసేవలు అందించే వారు. ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఒక ఆఫ్త్త మాలజీ అసిస్టెంట్, ఒక ఎక్యూప్మెంట్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేవారు. ఆధునాతన ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, కంటి లోపల భాగాలను పరీక్షించే ఫండస్ కెమెరాలతో కంప్యూటర్ ద్వారా డీఆర్, గ్లకోమా, కాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్, హైపర్టెన్సీవ్ రెటీనోపతి తదితర సుమారు రూ.3 వేల విలువైన పరీక్షలు చేసేవారు. అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందించేవారు. కంటి సమస్యలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్య నిమిత్తం సమీపంలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులకు పంపేవారు. 8 నెలలుగా నిలిచిన సేవలు కాంట్రాక్టు సంస్థతో ఉన్న మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) గతేడాది సెప్టెంబరు 4తో ముగిసింది. సేవలను కొనసాగించే నిమిత్తం ఎంఓయూను రెన్యువల్ చేసేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఈఐ కేంద్రాల సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లోని ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, ఫండస్ కెమెరాలు, ఇతర సామగ్రిని అప్పట్లోనే కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది. ఈఐ కేంద్రాల గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ ఉచిత కంటి వైద్య పరీక్షల నిర్వహణపై కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. న్యూస్రీల్కూటమి చిన్నచూపు 8 నెలలుగా నిలిచిన ఈఐ కేంద్రం సేవలు కాంట్రాక్టు సంస్థతో గత సెప్టెంబరులో ముగిసిన ఎంఓయూ రెన్యువల్కు చొరవ చూపని కూటమి ప్రభుత్వం కంటి వైద్య సేవల కోసంపేదల ఇబ్బందులు గత ప్రభుత్వంలో జిల్లాలో 1,30,733 మందికి కంటి పరీక్షలు 90,059 మందికి కళ్లజోళ్ల పంపిణీ గత ప్రభుత్వంలో ఈఐ కేంద్రాల్లో అందించిన సేవలు ఈఐ కేంద్రం వైద్య పరీక్షలు రిఫ్రాక్షన్ చెక్స్ కళ్లజోళ్లు పంపిణీ ఫండస్ చెక్స్ ఆచంట 27,970 27,832 18,131 13,831 ఆకివీడు 20,576 20,407 13,688 7,246 భీమవరం 23,944 23,638 17,807 8,899 పాలకొల్లు 30,553 29,815 21,443 12,491 నరసాపురం 27,690 26,666 18,990 10,635 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2018లో ఏర్పాటైన ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల నిర్వహణతో పాటు వృద్ధులు, విద్యార్థుల కోసం గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్సార్ కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కేంద్రాల్లో సేవలకు ఆంటంకం కలగకుండా కాంట్రాక్టు సంస్థతో ఎంఓయూ గడువును ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేస్తూ వచ్చారు. ఈఐ కేంద్రాల ద్వారా మొత్తంగా 1,30,733 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 1,28,358 మందికి రిఫ్రాక్షన్ చెక్స్, 53,102 మందికి ఫండస్ చెక్స్, 90,059 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్, 626 గ్లకోమా, 140 మాక్యులర్ డిజనరేషన్, 14,080 కాటరాక్ట్, 76 హైపర్టెన్సివ్ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున వంద మందికి పైగా రోగులు వచ్చి కంటి వైద్యసేవలను ఉచితంగా పొందేవారు. -
పేదల ఇళ్ల తొలగింపు దుర్మార్గం
భీమవరం: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను తొలగించడానికి అక్కడి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక శాఖను అప్పగించినట్టుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్ దుయ్యబట్టారు. పేదల ఇళ్ల తొలగింపును నిరసిస్తూ శనివారం భీమవరం ప్రకాశంచౌక్లో నిరసన తెలిపారు. పాలకోడేరు మండలంలో ఎన్నో ఏళ్లుగా పేదలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తుంటే అధికార దురహంకారంతో ఉండి ఎమ్మెల్యే దుర్యోధన పర్వానికి తెరదీశారని మండిపడ్డారు. ఇళ్లు తొలగింపు సందర్భాల్లో భౌతిక దాడుల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో పేదలపై దాడులు, దౌర్జన్యాలు తప్ప ఒనగూరిందేమి లేదన్నారు. పాలకోడేరులో పుంత పొడవునా సుమారు 50 సెంట్ల పోరంబోకు భూమిని పెత్తందారులు ఆక్రమించుకుని పొలాల్లో కలిపేసుకున్నారని, వారి జోలికి వెళ్లే దమ్ము ఉండి ఎమ్మెల్యేకు లేదని విరుచుకుపడ్డారు. పేదలపై ప్రభుత్వ వైఖరి ఇలానే కొనసాగితే ప్రభుత్వ పతనం తప్పదని గ్రహించాలన్నారు. సీపీఎం జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం. వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డి.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. బొండాడలో నిరసన కాళ్ల: పేదల ఇళ్ల తొలగింపు దారుణమని సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ అన్నారు. శనివా రం బొండాడలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పోలీసులు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఇంత దారుణానికి ఒడిగట్టడం సరికాదన్నారు. ఇ లానే ఇళ్లు కూల్చుకుంటే పోతే రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గం శ్మశానంగా మారుతుందన్నా రు. పేదలంటే చులకనగా చూస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
పోలీసులపై మంత్రి అసహనం
చెప్పిన పనులు చేయడం లేదంటూ నిమ్మల ఆగ్రహం పాలకొల్లు సెంట్రల్: ‘పోలీసులూ.. ఎందుకయ్యా నా చుట్టూ తిరుగుతారు.. మీరు స్టేషన్లలో ఉండి ప్రజలకు సేవ చేయండి.. (చెప్పింది చేయరు గాని) నా చుట్టూ చక్కర్లు కొట్టకండి.. నాకు సెక్యూరిటీ అవసరం లేదు..’ అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. పోడూరు, యలమంచిలిలో మంత్రి అధికారిక కార్యక్రమంలో బందోబస్తులో ఉన్న ఎస్సైలు, కానిస్టేబుళ్లపై ఇలా విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల క్రితం ఇదే రీతిలో పాలకొల్లు టౌన్ సీఐపైనా అసహనం వ్యక్తం చేశారు. అంతకు ముందు రూరల్ సీఐపై, డీఎస్పీపై ఇలానే అసహనం వ్యక్తం చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తాను చెప్పిన పనులు చేయలేదంటూ.. మంత్రి నిమ్మల పోలీసుల తీరుపై తీవ్ర ఫ్రస్టేషన్లో ఉన్నారు. తాను చెప్పిన పనులు చేయడం లేదని.. ప్రజలకు సేవ చేసుకోండి అంటూ తరచూ సైటెర్లు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సీఐ, ఎస్సైల పోస్టింగ్లు నిమ్మల కనుసన్నల్లోనే జరిగాయి. ఈ క్రమంలో ఇటీవల యలమంచిలి ఎంపీపీ ఉప ఎన్నికల సమయంలో పోలీసులు తనకు సహకరించలేదని, తాను చెప్పినట్లు వైఎస్సార్సీపీ నాయకులపై అ క్రమ కేసులు పెట్టి కనీసం నలుగురిని కూడా లో పల వేయలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారుల వద్ద ఇదే అసంతృప్తిని వ్యక్తం చేయడంతో సదరు అధికారి అడ్డగోలుగా పనిచేయలేమంటూ బదులివ్వడం మంత్రి ఆగ్రహానికి కారణమనే ప్రచారం సాగుతోంది. దీనిపై పోలీస్ శాఖ తర్జనభర్జనల అనంతరం తప్పనిసరిగా మూడు కేసులు నమోదు చేశారు. అయినా మంత్రికి ఆగ్రహం తగ్గలేదని సమాచారం. ఎస్కార్ట్ వద్దంటూ.. శుక్రవారం పోడూరు, యలమంచిలిలో ఎస్సైలపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేసి, వెళ్లిపోండని హుకుం జారీ చేయగా ఏం చేయాలో తెలియక వారు మంత్రి కార్యక్రమానికి కొద్ది దూరంలో విధులు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం పట్టణంలోని ఓ రోడ్డులో ముగ్గు వేసి టెంట్ ఉండటంతో మంత్రి కాన్వాయ్ని సీఐ అటుగా తీసుకువెళ్లారు. అయితే ఆ కార్యక్రమానికి మంత్రికి ఆహ్వానం లేకపోవడంతో ‘దారీతెన్నూ లేకుండా రోడ్లన్నీ తిప్పుతున్నారు.. మీరంతా నాతో రావాల్సిన పని లేదు.. మీరు వచ్చి సంధులన్నీ తిప్పి నా టైం వెస్ట్ చేస్తున్నారు, కనీసం రూట్ మ్యాప్ కూడా తెలియకుండా ఏం పనిచేస్తారు వెళ్లిపోండి’ అంటూ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కార్యాలయం పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. మంత్రి తనకు ఎస్కార్ట్ అక్కర్లేదని చెప్పడంతో ఏం జరిగిందనే దానిపై శాఖాపరంగా పరిశీలిస్తున్నారు. -
రైతులను వంచించి.. ప్రాధాన్యం తగ్గించి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో పండించే చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. ధాన్యం రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.. రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం.. ప్రతి చోటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.. రైతు ఎంత పండిస్తే అంతా సేకరించి 24 గంటల్లోనే ఖాతాల్లోకి నగదు జమచేస్తాం.. ఇవి జిల్లా ఇన్చార్జి మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి వరకూ ప్రతి సమావేశంలో చెప్పిన మాటలు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వచ్చిన దిగుబడుల్లో 62 శాతం మాత్రమే ధాన్యం కొనుగోలును లక్ష్యంగా నిర్దేశించారు. అందులోనూ పీఆర్ 126, ఎస్–10 రకాలపై సరికొత్త ఆంక్షలు తీసుకువచ్చారు. తేమ శాతం పేరుతో యథావిధిగా దోపిడీ, చిరిగిన గోనె సంచులు అవి కూడా నామమాత్రంగా అందుబాటులో ఉన్న పరిస్థితి. ఇవేం టార్గెట్లు ఏలూరు జిల్లాలో 3.53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా ముందుగా లక్షన్నర టన్నుల సేకరణ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. స్థానికంగా వినతులు రావడంతో ఈ లక్ష్యాన్ని 2 లక్షల టన్నులకు పెంచింది. దీంతో అనివార్యంగా రైతులు మిగిలిన 1.53 లక్షల టన్నులను దళారులకు విక్రయించాల్సిందే. జిల్లాలో ఇప్పటివరకు 45,128 టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 9.25 లక్షల టన్నుల అంచనా కాగా 6 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించింది. ఇక్కడ కూడా మిగిలిన 3.25 లక్షల టన్నులను మధ్యవర్తులకు విక్రయించాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి 25 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తికాగా వచ్చే వారం నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు జోరందుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో దళారులు వచ్చి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లు మొదలు ఉమ్మడి పశ్చిమగోదావరిలో రబీ సాగు పూర్తయి ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఏలూ రు జిల్లాలో 77,466 ఎకరాల విస్తీర్ణంలో 3.53 లక్షల టన్నులు దిగుబడి అంచనా కాగా 118 రైతు సేవా కేంద్రాలు, 65 ప్రాథమిక సహకార సొసైటీల ద్వారా ఈనెల 2 నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2,19,064 ఎకరాల్లో 9.25 లక్షల టన్నులు దిగుబడి అంచనా వేసి 365 రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 206 రైస్ మిల్లులకు ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చారు. ని‘బంధనాలు’ కొనుగోళ్లల్లో సరికొత్త నిబంధనలు విధించడం, దిగుబడి కంటే తక్కువ మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో సమస్యలు మొదలయ్యాయి. గురువారం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు కొనుగోళ్లలో ఇబ్బందులున్నాయని, కొన్ని రకాలు కొనుగోలు చేయడం లేదని, ఒత్తిడితో కొనుగోలు చేసినా అతి తక్కువ మాత్రమే కొనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. తేమ శాతం సాకు రబీ సీజన్లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దిగుబడి అధికంగా వచ్చే పీఆర్–126 రకాన్ని ఎక్కువ సాగు చేశారు. ఎకరాకు సగటున 60 నుంచి 70 బస్తాల దిగుబడి వస్తుండటంతో తేమ శాతం సాకుగా చూపి ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎస్–10 రకం గింజ సరిగ్గా లేదనే కారణంతో కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతు లు పండించిన పంటలో సగానికి మించి ప్రభుత్వానికి విక్రయించలేని పరిస్థితి ఉండటంతో దళారులను తప్పనిసరిగా ఆశ్రయిస్తున్నారు. ఏలూరు జిల్లా వరి సాగు 77,466 ఎకరాలు దిగుబడి అంచనా 3.53 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం 2 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 183 పశ్చిమగోదావరి జిల్లా వరి సాగు 2,19,064 ఎకరాలు దిగుబడి అంచనా 9.25 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం 6 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 365 కొనుగోల్ మాయ రబీ ధాన్యం సేకరణలో ఆంక్షలు దిగుబడుల కంటే తక్కువగా కొనుగోలు లక్ష్యాలు ఉమ్మడి జిల్లాలో 62 శాతం మాత్రమే సేకరణ పీఆర్ 126 రకం కొనుగోలుకు షరతులు ప్రభుత్వ ఆర్భాటానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇష్టారాజ్యంగా దళారుల కొనుగోలు కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో దళారులది ఇష్టారాజ్యంగా మారింది. వైఎస్సార్సీపీ పాలనలో నూరు శాతం ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో దళారులకు అడ్డకట్ట పడింది. కూటమి పాలనలో రైతుసేవా కేంద్రాల ద్వారా నచ్చిన మిల్లులో విక్రయించుకోవచ్చని, ఎక్కడైనా అమ్మవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో దళారుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. క్వింటాల్ ఏ–గ్రేడ్ రకానికి రూ.2,320, కామన్ వైరెటీకి రూ.2,300 మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దళారులు పొలాల్లోనే 75 కేజీల బస్తాను రూ.1,300 నుంచి రూ.1,500 ధరతో కొనుగోలు చేస్తున్నారు. -
వక్ఫ్ బిల్లుపై ఎగసిన నిరసన
నూజివీడు: వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని రక్షించాలని, కేంద్ర ప్రభుత్వం మత వివక్షన వీడాలంటూ నూజివీడులో శుక్రవారం ముస్లింలు గళమెత్తారు. పట్టణంలోని హనుమాన్ జంక్షన్ రోడ్డులోని పెద్ద మసీదు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మార్గమధ్యలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్కచేయకుండా జాతీయ జెండాలు, నల్ల జెండాలు, ప్లకార్డులతో వేలాది మంది తరలివచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ, ముస్లింల మధ్య అనైక్యతను సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింల త్యాగనిరతిని ప్రశంసించారు. సీపీఎం నాయకుడు జి.రాజు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని, బిల్లుకు వ్యతిరేకంగా పలు సవరణలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తోందని, ప్రజలంతా ఐక్యం పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ పట్టణ కార్యదర్శి చాట్ల పుల్లారావు, సీపీఎం పట్టణ కార్యదర్శి ఎం.హనుమానులు, వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ యూనస్పాషా (గబ్బర్), ఫాస్టింగ్ అబ్దుల్ హక్, ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లపై ఉద్యమం
జంగారెడ్డిగూడెం: కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బోసు బొమ్మ సెంటర్, ప్రభుత్వ టింబర్ డిపోల వద్ద పట్టణ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. కార్మిక వర్గం పోరాటాల ఫలితంగా సాధించిన చట్టాలన్నింటినీ రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లు తీసుకువచ్చిందని విమర్శించారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా తయారు చేయడమే కేంద్రం ఉద్దేశమని, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. హమాలీల నాయకులు పాల్గొన్నారు. నవయుగ వైతాళికులను విస్మరించడం బాధాకరం ఏలూరు (ఆర్ఆర్పేట): 2025లో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల్ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పలువురు నవయుగ వైతాళికులను విస్మరించడం బాధాకరమని జిల్లా రచయితల సంఘ ప్రతినిధులు లంకా వెంకటేశ్వర్లు, నాగాస్త్ర, లేళ్ల వెంకటేశ్వరావు ప్రకటనలో ఖండించారు. గురజాడ వెంకట అప్పారావు, కందుకూరి వీరేశలింగం, మహాకవి శ్రీశ్రీ, గుర్రం జాషువా, అయ్యంకి వెంకటరమణయ్య, గిడుగు వెంకట రామమూర్తి పంతులు, డాక్టర్ యల్లాప్రగడ సు బ్బారావు, పింగళి వెంకయ్య, ఘంటసాల వెంకటేశ్వరావు తదితరుల పేర్లను ఈ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పాక్ జలసంధిని ఈదిన పారా స్విమ్మర్ ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్, పారా స్విమ్మర్ బలగా గణేష్ అరుదైన ఘనత సాదించారు. శుక్రవారం భారత్, శ్రీలంక మధ్య తలైమనార్ నుంచి ధనుష్కోటి వరకూ పాక్ జలసంధి ఈదిన పారా స్విమ్మర్గా చరిత్ర సృష్టించారు. నిర్వాహకుల సమక్షంలో ఉదయం 5.50 గంటలకు ఈత ప్రారంభించి సాయంత్రం 4.20 నిమిషాలకు ముగించారు. 28 కిలోమీటర్ల దూరం 10 గంటల 30 నిమిషాల్లో ఈది మన్ననలు అందుకున్నారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి పారా స్విమ్మర్గా నిలిచారు. శాప్ చైర్మన్ రవినాయుడు, డీఎస్ఏ చీఫ్ కోచ్ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. శ్రీవారి దేవస్థానంసూపరింటెండెంట్గా రామారావు ద్వారకాతిరుమల: అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ ఐవీ రామారావు ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రామారావు ఇక్కడ చార్జ్ తీసుకోనున్నారు. బంగారం షాపుల్లో సోదాలు నరసాపురం: పట్టణంలోని బంగారం షాపుల పై శుక్రవారం జీఎస్టీ, తూనికలు, కొలతలు, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ సీఐ కె.శివరామకృష్ణ వివరాలను వెల్లడించారు. జైన్ జ్యూయల్ పార్క్ షాపులో 622.37 గ్రాముల బంగారం, 4,907 గ్రాముల వెండి స్టాక్ రిజిస్టర్లో కన్నా తక్కువగా ఉన్నట్టుగా గుర్తించి జీఎస్టీ అధికారులు రూ.3,51,004 అపరాధ రుసుం విధించారన్నారు. అలాగే ఎలాంటి ధ్రువీకరణ లేని ఎలక్ట్రానిక్ కాటాను గుర్తించి తూనికలు, కొలతల అధికారులు రూ.25 వేలు అపరాధ రుసుం విధించారని చెప్పారు. అంబిక సంఘవి జ్యూయల్ షాపులో ఎలాంటి ధ్రువీకరణ లేని ఎలక్ట్రానిక్ కాటా గుర్తించి రూ.25 వేలు ఫైన్ వేసినట్టు తెలిపారు. విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము పాల్గొన్నారు. -
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
బుట్టాయగూడెం: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ప్రజలకు మంచి పాలనను చేరువ చేసే దిశగా ఇంటి వద్దకే సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డుల పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ సేవల్లో ఎలాంటి కష్టం కలగకుండా విస్తృత సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ్చ్ఛ కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల కుదింపునకు రంగం సిద్ధం చేసింది. జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఉండేలా చర్యలు చేపట్టింది. క్లస్టరైజేషన్లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,165 గ్రామ సచివాలయాలు సగానికి తగ్గించి 582కే పరిమితం చేయనున్నారు. సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని గ్రేడ్ల వారీగా సర్దుబాటు చేయనున్నారు. ప్రభుత్వ చర్యలతో ఇటు ప్రజలు, అటు సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దేశానికే ఆదర్శం సచివాలయ సేవలు వైఎస్సార్సీపీ పాలనలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1,165 సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల ద్వారా సుమారు 142 సేవలు గ్రామాల్లోని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. 938 గ్రామ సచివాలయాలు, 227 వార్డు సచివాలయాల్లో 8,468 మంది సచివాలయ సిబ్బందితో పాటుగా పంచాయతీ కార్యదర్శులను సైతం కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,165 గ్రామ సచివాలయాల్లో 9,099 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయల్లో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, సిబ్బంది, కార్యదర్శి అందుబాటులో ఉండేవారు. వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక కంప్యూటర్లను సైతం కేటాయించారు. కంప్యూటర్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేలా కృషి చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న క్లస్టర్ విధానంతో గ్రామ స్థాయిలో అందే సేవలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు సచివాలయాలు కలిపి.. గ్రామ సచివాలయాలను క్లస్టర్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. ఒక గ్రామంలో ఒకే సచివాలయం ఉంటే సమీప గ్రామంలోని సచివాలయాన్ని కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. పట్టణం, మండలం యూనిట్గా క్లస్టర్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే మండలాల వారీగా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. కష్టాలు తప్పవు గ్రామ స్థాయిలో ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న సచివాలయాల్ని క్లస్టర్లు మార్చితే ప్రజలకు ఇబ్బందులు తప్పవని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో గిరిజనుల బాధలు వర్ణణాతీతం. రెండు సచివాలయాలను ఒకటిగా చేస్తే ప్రజలకు మెరుగైన సేవల అందవని ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నాయకులు కోరుతున్నారు. జనాభా ప్రాతిపదికన రెండు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు ఉమ్మడి పశ్చిమ పరిధిలో 1,165 సచివాలయాలు 582కే పరిమితం చేసేలా పావులు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర దేశానికే ఆదర్శంగా నిలిచిన సచివాలయాలను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దీనిలో భాగంగానే క్లస్టర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. రెండు సచివాలయాలు ఒకటి చేయడం వల్ల ప్రజలకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలు అందేవి. క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే -
రైతులకు తీరని అన్యాయం
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు, వేరుశనగ, మొక్కజొన్న పంటలను మండల పార్టీ నాయకులతో కలిసి పరీశీలించారు. పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో వేరుశనగ పంటను రూ.9,200కు కొనుగోలు చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.6,500 ధరతో కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పొగాకు రైతులకు కూడా గిటుబాటు ధర లభించక కష్టాల ఊబిలో కూరుకు పోయే పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పండించిన రైతులకు ఆ పంటను విక్రయించేందుకు తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం లేదన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. రైతు భరోసా సొమ్ములు చెల్లించకపోవడం వల్ల పెట్టుబడి కోసం అప్పుల పాలయ్యారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, నాయకులు ఉప్పల రాంపండు, ములకాల బాబు, తట్టుకొల్ల అంజి తదితరులు పాల్గొన్నారు. -
చల్లచింతలపూడిలో గ్రావెల్ అక్రమ దందా
టాస్క్ఫోర్స్: దెందులూరు మండలంలోని చల్లచింతలపూడిలో అక్రమ గ్రావెల్ దందా మళ్లీ ప్రారంభమైంది. పొలం యజమాని గ్రావెల్ తవ్వకాలు అడ్డుకోవడంతో పాటు.. ఎస్ఐ, తహశీల్దార్, ఎస్పీ, కలెక్టర్, మైనింగ్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం అక్రమ తవ్వకాలు చేస్తున్నారని తెలుసుకుని పొలం యజమాని జేసీబీలకు ఎదురుగా వాహనం పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కారుకు తాడు కట్టి జేసీబీతో మూడు కిలోమీటర్ల అవతలకు తీసుకువెళ్ళి వాహనాన్ని వదిలారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. స్థల యజమాని బాబురావు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని తన సొంత భూమిలో రక్షణ లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నాడు. -
మే 10, 11 తేదీల్లో తెలుగు సాహితీ సంబరాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వచ్చే మే నెల 10, 11 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు కార్యక్రమం జయప్రదం చేయాలని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కోరారు. స్థానిక మహలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక ద్వారా ఇంతవరకూ వివిధ ప్రాంతాలలో 147 శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించి 148వ కార్యక్రమాన్ని శ్రీప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్ఙు పేరుతో మే నెల 10, 11 తేదీల్లో ప్రపంచ రికార్డు స్థాయిలో ఏలూరులో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక ప్రతినిధులు కొల్లిరమావతి, జీ.ఈశ్వరీ భూషణం, టీ.పార్థసారథి, శ్రీహరికోటి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ట్రస్ట్కు రూ.18 లక్షల విరాళం ద్వారకాతిరుమల: దీపక్ నెక్స్జెన్ ఫీడ్ కంపెనీ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, కంపెనీ ప్రతినిధులు శుక్రవారం నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ. 18 లక్షలను జమ చేశారు. ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓకు అందించారు. ఈఓ వారికి కండువాలు కప్పి ఘనంగా సత్కరించగా, ఆలయ అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనాన్ని, ప్రసాదాలను అందజేశారు. అంతక ముందు దాతలు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఇంతవ వరకు నెక్స్జెన్ నిత్యాన్నదాన ట్రస్ట్కు రూ.1,29,08,007లు అందించినట్టు ఈఓ తెలిపారు. ఏలూరు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చింది. నగరంతోపాటు, ఆయా పట్టణాలు, పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. గురువారం అర్థరాత్రి వరకూ పోలీసులు భారీ ఎత్తున మోహరించి తనిఖీ చేశారు. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా తనిఖీలు పర్యవేక్షించారు. ఆశ్రం సెంటర్, కలపర్రు టోల్ప్లాజా, తంగెళ్ళమూడి, కండ్రికగూడెం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ నేరాలు నివారించటం, నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతూ వారిని కట్టడి చేయటమే పోలీసుల లక్ష్యం అన్నారు. -
మద్యం మత్తులో ముంచుతున్న ప్రభుత్వం
తణుకు అర్బన్: రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచేస్తూ ఇది మంచి ప్రభుత్వంగా కూటమి సర్కారు పేరు సంపాదించిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ అన్నారు.. సంక్రాంతికి రోడ్లన్నీ వేసేస్తామన్నారు.. కరెంటు బిల్లులు పెంచమన్నారు.. ఇవేమీ జరగలేదు కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా నైట్ పాయింట్ల ద్వారా 24 గంటలు అమ్మిస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జగన్ పారదర్శకంగా పథకాలు అందించారని, కూటమి పాలనలో సూపర్సిక్స్ అమలు చేయకుండా, ప్రశ్నించిన వా రిపై కేసులు, దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆరిమిల్లీ నాకు సంస్కారం ఉంది తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనను ఇష్టానుసారంగా దూషించారని, చదుకున్న అజ్ఞానిగా ఉన్నారంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా దూషించగలనని, అయితే సంస్కారం ఉంది కాబట్టే సంస్కారవంతంగా సమాధానం చెబుతున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పేకాటలు, కోతాటలు ఇళ్లలోనే నిర్వహిస్తున్నారని కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, తణుకులో ఒక టీడీపీ నేత హోటల్లోనే కోతాటలో 45 మందిని జిల్లాస్థాయి పోలీసు ఉన్నతాధికారులు పట్టుకున్నారని గుర్తుచేశారు. ప్రశాంతంగా ఉండే తణుకులో గంజాయి విచ్చలవిడి అయిపోయిందని దాడులు, చోరీలకు నిలయంగా మారిందని విమర్శించారు. గత టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ టీడీఆర్ బాండ్ల జారీలో రూ.800 కోట్లు డబ్బులు తీసుకున్నారని ప్రజలే చెప్పుకుంటున్నారని ఆరోపించారు. వారానికోసారి తణుకు వచ్చి ప్రెస్మీట్ పెట్టి తనపై విమర్శలు చేస్తున్నారని కారుమూరి ధ్వజమెత్తారు. నాది రాష్ట్రస్థాయి.. నీది తణుకు నియోజకవర్గస్థాయి మాత్రమే అని ఆరిమిల్లికి చురకలు వేశారు. ఆరిమిల్లి భాష మార్చుకో వాలని లేకుంటే ప్రజలు రోడ్లపై తిరగనివ్వరని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ కారుమూరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు ఫణీంద్రకుమార్ వీరమల్లు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి ధ్వజం -
రేంజ్ పరిధిలో పటిష్ట పోలీసింగ్
జంగారెడ్డిగూడెం: జిల్లాలో పటిష్ట పోలీసింగ్కు చర్యలు తీసుకున్నట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో ట్రాఫిక్, టౌన్ పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం తెలంగాణకు సరిహద్దున ఉండటం, జాతీయరహదారి సైతం పట్టణాన్ని ఆనుకుని వెళ్లడం, వ్యాపార కేంద్రంగా ఉండటంతో నేరస్తులకు సెంటర్ పాయింట్గా మారుతోందని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణాకు ఈ మార్గం అనువుగా ఉండటంతో నేరాల అదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణంలో రూ.35 లక్షలతో 70 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. పట్టణంలో పోలీస్స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్కు, క్రైమ్కు ఎస్సైలు ఉండేలా ఆలోచన ఉందన్నారు. 22 సీసీ కెమెరాలు : రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాలో 22 వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. మహా నాయకుల విగ్రహాల సమీపంలో సీసీ కెమెరాల ఏ ర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపామన్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పో క్సో కేసులు నమోదవుతున్నాయని, మహిళా పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టామన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తం ఇటీవల డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరాలు పెరిగాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐజీ సూచించారు. ఎవరైనా డిజిటల్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడితే 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రేంజ్ పరిధిలో నక్సలైట్ల ప్రభావం లేదని, పోలవరం ప్రాజెక్టు వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతా చర్యలు చేపట్టిందని చెప్పారు. వీఐపీల పర్యటనలో భాగంగా మరింత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐలు వి.కృష్ణబాబు, రాజశేఖర్, ఎస్సైలు పాల్గొన్నారు. ఐజీ అశోక్కుమార్ -
యథేచ్ఛగా మట్టి దందా
ఆగిరిపల్లి: కూటమి నాయకుల అక్రమ మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని నరసింగపాలెంలోని బ్రహ్మ లింగయ్య చెరువు వద్ద ఉన్న బండ్లమూరు కొండపై అనుమతి లేకుండానే మట్టి తవ్వకాలు చేపట్టి లక్షలు ఆర్జిస్తున్నారు. పది రోజుల నుంచి జేసీబీ సాయంతో కొండను తవుతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నరసింగపాలెంకు చెందిన టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఈ మట్టి దందా సాగుతుంది. అధికారులు, గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం మట్టిని లారీలలో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా సాగుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రసాద్ను సంప్రదించగా అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రభుత్వాసుపత్రికి సుస్తీ
●టాయిలెట్స్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో మా పాపకు డెలివరీ అయ్యింది. ఆస్పత్రిలో వారం రోజుగా ఉంటున్నాం. బాలింతల వార్డులో ఉన్న టాయిలెట్స్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు సక్రమంగా రావడం లేదు. బాలింతలు టాయిలెట్లకు వెళితే ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు ఒకటి పనిచేస్తే మరొకటి పనిచేయడం లేదు. – కె.సుభాషణి, మొగల్తూరు పాడైన బెడ్లపై ఎలా పడుకునేది? బాలింతలు పడుకునే బెడ్లు దెబ్బతిన్నాయి. చిరిగిపోయి, గుంతలు పడ్డాయి. వాటిపై బాలింతలు పడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. బెడ్పై తల్లీ బిడ్డ పడుకోవడానికి సరిపోక ఇబ్బంది పడుతున్నారు. తల్లి బెడ్ పక్కన చంటి బిడ్డకు ఊయల సౌకర్యం కల్పించాల్సి ఉన్నా చర్యలు లేవు. – ఎ.అన్నమ్మ, మోగల్లు భీమవరం(ప్రకాశం చౌక్) : పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల జిల్లా కేంద్రమైన భీమవరం ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. సరిగా పనిచేయని ఏసీలు, పాడైన బెడ్లు, సరైన సౌకర్యాలు లేని టాయిలెట్లతో పేషెంట్లు అవస్థలు పడాల్సి వస్తోంది. 50 పడకల సదుపాయం ఉన్న ఈ ఆస్పత్రికి భీమవరం, ఉండి, నర్సాపురం నియోజకవర్గాలతో పాటు కృష్ణా జిల్లాలోని సమీప గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. రోజూ 400కు పైగా ఓపీ నమోదవుతుంటే ఆస్పత్రిలో చేరే పేషెంట్లు సంఖ్య నెలకు 200 వరకు ఉంటుంది. ఆస్పత్రిలో రెండు బాలింతల వార్డులు, ఇతర రోగులకు మూడు వార్డులు ఉన్నాయి. బాలింతల వార్డుల్లో నాలుగు ఏసీలకు గాను రెండు మొత్తానికి పనిచేయకుండా నిరుపయోగంగా మిగిలాయి. మరో రెండు తరచూ మరమ్మతులతో అక్కరకు రావడం లేదు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత వల్ల ఫ్యాన్లు ఉన్నా వేడిగాలులకు బాలింతలు, శిశువులు విలవిల్లాడాల్సి వస్తోంది. బాలింతలు, రోగుల వార్డుల్లోని మంచాలపై ఉన్న పరుపులు చిరిగిపోయాయి. ఎత్తుపల్లాలుగా ఉన్న వాటిపై పడుకోవడానికి బాలింతలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్పై చంటి బిడ్డతో పడుకోవడానికి సరిపోవడం లేదని బాలింతలు అంటున్నారు. శిశువుల కోసం బెడ్ పక్కన బాస్కెట్ బెడ్ల సౌకర్యం లేదు. వేధిస్తున్న సౌకర్యాల కొరత ఆస్పత్రిలోని వార్డుల్లో టాయిలెట్స్, ఆవరణలోని అవుట్ పేషెంట్లు కోసం ఏర్పాటుచేసిన టాయిలెట్లలో సరైన సౌకర్యాలు లేక బాలింతలు, వారి సహాయకులు, పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం వచ్చిన అవుట్ పేషెంట్లు, గర్భిణులు కూర్చునేందుకు కుర్చీలు, బెంచీలు లేవు. ఎక్స్రే విభాగం వద్ద కూర్చునేందుకు సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.. మరోపక్క ఆస్పత్రిలో మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు. బాలింతలు, పేషెంట్లు మంచినీళ్లు బయట నుంచి తెచ్చుకుని తాగుతున్నారు. జేసీ రావడంతో బెడ్ షీట్లు మార్చారు బాలింతల వార్డుల్లో బెడ్లపై కనీసం బెడ్షీట్లు వేయడం లేదు. బాలింతలు ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లు, బెడ్ షీట్లు వేసుకుంటున్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ విజిట్కు రావడంతో అప్పటికప్పుడు ఆస్పత్రి సిబ్బంది బాలింతల వార్డులో బెడ్ షీట్లు వేశారు. పట్టించుకోని అధికారులు: ప్రభుత్వ ఆస్పత్రిని సమస్యలు పీడిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించి రోగులకు అవసరమైన వసతులు కల్పించే దిశగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో ఆస్పత్రి స్థితిగతులపై అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవు. పనిచేయని ఏసీలు, పాడైన బెడ్లు టాయిలెట్లు సరిగా లేక ఇక్కట్లు అవస్థలు పడుతున్న రోగులు, బాలింతలు -
అలరిస్తున్న నాటిక పోటీలు
భీమవరం: భీమవరం కళరంజని నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. శ్రీసోమేశ్వర, జనార్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ నాటిక పోటీలో మూడో రోజు శుక్రవారం రాత్రి రెండు నాటికలు ప్రదర్శించారు. అనంతరం హైదరాబాదుకు చెందిన ప్రముఖ రంగస్థల నటీమణి ఎస్.మాధవికి మహానటి సావిత్రి స్మాకర పురస్కారం, కళారంజని యువతేజం పురస్కారాన్ని హైదరాబాద్కు చెందిన మంజునాథ్కు అందించారు. సమాజంలోని కుటుంబాలు, ప్రేమ, ఆదరణ కన్నా ఆస్తుల కోసం, హక్కుల కోసం కుటుంబాల మధ్య జరుగుతున్న సంఘర్షణలు ప్రతిరూపంగా సాగిన హక్కు నాటిక ఆకట్టుకుంది. రెండో నాటికగా సౌజన్య కళాస్రవంతి వారి దేవరాగం ప్రదర్శించారు. దాడి కేసులో ముగ్గురి అరెస్టు ముదినేపల్లి రూరల్: వ్యక్తిపై దాడి ఘటనలో స్థానిక పోలీసులు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సింగరాయపాలెంకు చెందిన చేబోయిన పోతురాజుపై అదే గ్రామానికి చెందిన బి.రాధాకృష్ణ, కుమారులు కుమారస్వామి, ఏడుకొండలు గత నెల 2 దాడి చేసి గాయపరిచినట్లు చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ నిమిత్తం తరలించినట్లు చెప్పారు. -
ఇంజినీరింగ్దే హవా
ఏలూరు (ఆర్ఆర్పేట): దాదాపు దశాబ్ద కాలానికి పైనుంచే విద్యార్థులు సాంకేతిక విద్యబాట పట్టారు. గతంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తరువాత డిగ్రీ కోర్సుల్లోకి ప్రవేశించడం సంప్రదాయంగా వచ్చింది. అనంతర కాలంలో ప్రపంచం మొత్తం మీద వచ్చిన సాంకేతిక విప్లవం ఆధారంగా కంప్యూటర్, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా జీతాలు వచ్చే అవకాశం ఈ రంగంలో ఉండడంతో విద్యార్థులు సైతం సాంకేతిక విద్యపై ఆకర్షితులయ్యారు. దీనితో ఇంజినీరింగ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల హవా నడుస్తోంది. ఇంటర్మీడియెట్ అనంతరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడం కోసం ప్రభుత్వం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను ఏపీఈఏపీ సెట్ పేరిట నిర్వహిస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడి కావడంతో విద్యార్థులంతా ఈఏపీ సెట్కు సిద్ధమౌతున్నారు. మే 19 నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశించే వారి కోసం మే 19వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. షెడ్యూల్లోని ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ వరకూ గడువు ఉంది. ఉమ్మడి పశ్చిమలో 13,330 సీట్లు ఇంజినీరింగ్ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి వివిధ కోర్సులకు సంబంధించి 13,330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200 సీట్లు, రామచంద్ర కళాశాలలో 900 సీట్లు, ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో 600 సీట్లు, హేలాపురి కళాశాలలో 360 సీట్లు, ఆగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ కళాశాలలో 1360 సీట్లు, నూజివీడులోని సారధి ఇంజనీరింగ్ కళాశాలలో 420 సీట్లు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో 1,860, శ్రీ విష్ణు మహిళా కళాశాలలో 960, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో 1,140, భీమవరం ఇంజినీరింగ్ కళాశాలలో 300, నరసాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో 1,620, తాడేపల్లిగూడెంలోని శ్రీవాసవి కళాశాలలో 1,200, శశి ఇంజినీరింగ్లో 1,140, నల్లజర్లలోని వైస్ ఇంజినీరింగ్లో 270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక మరో 10 శాతం సీట్లు అంటే 1333 సీట్లు ఈడబ్ల్యూస్ కోటాలో కేటాయిస్తారు. అంటే మొత్తం కలిపి 14,663 సీట్లు ఈ రెండు జిల్లాల్లోని కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఈ పరీక్షలకు గత సంవత్సరం మాదిరిగానే ఇంటర్మీడియెట్లో అభ్యర్థి సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. ఈఏపీ సెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి మొత్తం కలిపిన తరువాత ర్యాంకును ప్రకటిస్తారు. ప్రస్తుతం దరఖాస్తులు చేస్తున్న ఉరవడి పరిశీలిస్తే గత ఏడాది కంటే మరో 10 శాతం దరఖాస్తులు పెరగనున్నట్టు ఈ పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ కాకినాడ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈఏపీ సెట్లో ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత కోర్సులకే విద్యార్థుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గత ఏడాది వరకూ తెలంగాణ విద్యార్థులకు నాన్లోకల్ కేటగిరీ కింద 15 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున ఈ ఏడాది నుంచి వారికి రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి మొత్తం సీట్లలో స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. దీనివల్ల ఆంధ్ర విద్యార్థులకు కొద్దిగా పోటీ తగ్గనుంది. మే 19 నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు తొలి రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాలకు పరీక్షలు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 14 ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో 13,330 సీట్లుఉత్తీర్ణులైతేనే ఫీజు రీయింబర్స్మెంట్ ఈఏపీసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఫీజు రీయింర్స్మెంట్ పథకం వర్తిస్తుంది. 160 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షకు 40 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్టే. ఫీజు రీయింబర్స్మెంట్ ఆశించే విద్యార్థులు ముందుగానే ఇన్కం ట్యాక్స్ సర్టిఫికెట్, ఈ ఏడాది తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్ కోటా (ఈడబ్ల్యూఎస్)లో చేరే విద్యార్థులు ముందుగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను పొందిఉండాలి. పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో తమపేరు అక్షరం కూడా తప్పులేకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. – పీ బాలకృష్ణ ప్రసాద్, ఈఏపీసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ -
రూ.46.95 లక్షల మిగులుతో జెడ్పీ బడ్జెట్ ఆమోదం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ బడ్జెట్ను రూ.46.95 లక్షల మిగులుతో ఆమోదించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈమేరకు సభ్యులు ఏకగ్రీవంగా బడ్జెట్ను ఆమోదించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా పరిషత్ మొత్తం ఆదాయం రూ.153.16 కోట్లుగా, వ్యయం రూ.152.69 కోట్లుగా అంచనా వేశారు. దీంతో రూ.46.95 లక్షలు మిగులుతో బడ్జెట్ను ఆమోదించారు. సమన్వయంతో పనిచేద్దాం ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె మొదటగా 1వ, 7వ స్థాయి సంఘాల సమస్యలు, రెండవ విడతగా 2, 3, 4, 5, 6 స్థాయి సంఘాల సమావేశాల్లో ఆయా అంశాలపై గురువారం సమీక్షంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన కొన్ని పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వాటిని నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో కె.భీమేశ్వరరావు, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు, పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. మొగల్తూరు రోడ్డు ప్రమాద ఘటనలో మరో వ్యక్తి మృతి నరసాపురం: మొగల్తూరులో 216 జాతీయ రహదారి పక్కన పని చేసుకుంటున్న ఉపాధి హామీ కూలీలపై బుధవారం అదుపుతప్పి దూసుకొచ్చిన నూనె డబ్బాల వ్యాన్ బోల్తా ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుబ్బల మాణిక్యాలరావు (65) బుధవారం రాత్రి మృతి చెందాడు. ప్రమాదంలో మాణిక్యాలరావు భార్య గంగావతి, మరో మహిళ కడలి పావని అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మాణిక్యాలరావును మొదట నరసాపురం ఏరియా ఆసుపత్రికి, తరువాత మెరుగైన వైద్యం కోసం భీమవరం అక్కడ నుంచి గుంటూరు తరలించారు. ప్రమాదంలో లివర్ దెబ్బతినడంతో మాణిక్యాలరావు మృతి చెందాడు. కాగా నరసాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో కూలీ గుడాలి సత్యనారాయణను మెరుగైన వైద్యం నిమిత్తం గురువారం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో స్వచ్ఛఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డీపీఓలతో ఇప్పటికే చర్చించామని, ఇందుకు కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పొగాకు బ్యారన్ల దగ్ధం
జంగారెడ్డిగూడెం: మండలంలోని చిన్నవారిగూడెంలో గ్రామానికి చెందిన దాకవరపు అర్జునరావు, దాకవరపు రవికృష్ణలకు చెందిన పొగాకు బ్యారన్లు బుధవారం రాత్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.28 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు పేర్కొన్నారు. వారిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు గురువారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో రూ.20 లక్షల పొగాకు, రూ.8 లక్షలు విలువైన రెండు బ్యారన్లు నష్టపోయామని రైతులు వివరించారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ బ్యారన్లు దగ్ధంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. క్యూరింగ్ సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జెట్టి సూచించారు. రైతులను పరామర్శించిన వారిలో ఎ.పోలవరం సర్పంచ్ బుద్దాల సీతారాముడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, సత్రం లక్ష్మణరావు, తాడువాయి సొసైటీ మాజీ అధ్యక్షుడు కనికళ్ల ప్రసాద్, బుద్దాల నాగేంద్రం, బుద్దాల సత్యనారాయణ, బండారు సూరిబాబు, బండారు ప్రసాద్, దాకవరపు వెంకటేశ్వరరావు, నెల్లూరు గంగరాజు, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు ఇవ్వండి.. మహాప్రభో!
నూజివీడు: జీతాలు సకాలంలో అందక ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను వేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ అవి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న దాదాపు 1000 మంది టీచింగ్, నాన్ టీచింగ్, పర్మినెంట్ ఉద్యోగులకు ఈనెల 16వ తేదీ గడచినా ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. దీంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో పనిచేసే ఉద్యోగుల్లో పర్మినెంట్ ఉద్యోగులు 30 మంది లోపే ఉండగా మిగిలిన వారంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం యూనివర్సిటీనే నెల ప్రారంభంలోనే వేతనాలను చెల్లిస్తుంది. పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు మాత్రం ఈ నెల 17వ తేదీ వరకు కూడా వేతనాలు జమ కాలేదు. ఈ నెల మొదటి వారం నుంచి జీతాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని వారు వాపోతున్నారు. సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వైద్యం ఖర్చులు, పిల్లల ఫీజుల చెల్లింపు, నెలవారీ మందుల ఖర్చులు, పాల బిల్లులు, సరకుల బిల్లులు ఇలా అనేక వాటికి చెల్లించలేకపోతున్నామని లబోదిబోమంటున్నారు. అడ్వాన్సులతో కాలక్షేపం జీతం డబ్బులు నెలలో సగం రోజులు గడచినా రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు వర్సిటీ నిధుల్లో నుంచి ఎవరైతే అడ్వాన్సులు కావాలని అడిగారో వారికి జీతంలో సగం మొత్తం అడ్వాన్సులు ఇచ్చారు. దీంతో అధిక శాతం మంది తమ జీతంలో 50 శాతం అడ్వాన్సు తీసుకొని కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికై నా ప్రభుత్వం సకాలంలో జీతాలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 17వ తేదీ గడచినా ట్రిపుల్ ఐటీలో ఇంకా అందని జీతాలు బడ్జెట్ మంజూరైంది వేతనాలకు సంబంధించి బడ్జెట్ను ప్రభుత్వం మంజూరు చేసింది. రెండు రోజుల్లో కాంట్రాక్టు, పర్మినెంట్ ఉద్యోగులకు సంబంధించి జీతాలు వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి. ప్రతినెలా సకాలంలోనే జీతాలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. – బి.లక్ష్మణరావు, ఏఓ, నూజివీడు ట్రిపుల్ ఐటీ -
ప్రొటోకాల్ పాటించడం లేదు
ఏలూరు (టూటౌన్): అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని పలువురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు మండిపడ్డారు. తామేమీ ప్రభుత్వ పెద్దలచే నామినేట్ అయిన సభ్యులం కాదని ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులమని గుర్తు చేశారు. గురువారం జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సర్వ సభ్యసమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పి.థాత్రీ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, చిర్రి బాలరాజు,, జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్లు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్.చిన్న రాముడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గడువులోగా మంచినీటి చెరువులను నింపాలి ఉమ్మడి జిల్లాలో పంట కాలువలను ఈ నెల 22తో కట్టివేస్తున్నందున అన్ని మంచినీటి చెరువులను గడువులోగా నీటితో నింపుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా సమావేశంలో ఎకరాకి 50 బస్తాల వరకే ధాన్యం కొనుగోలు చేయడంపై పలువురు డెల్టా జెడ్పీటీసీలు వ్యవసాయాధికారులను నిలదీశారు. ఎటువంటి కోతలు లేకుండా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. అలాగే తమ మండలంలో చేపట్టే పనుల ప్రతిపాదనలు సమర్పించినా జెడ్పీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు నిలదీశారు. తాము ప్రతిపాదించిన పనులను టేక్అప్ చేయకండా ఎవరో చెప్పిన పనులను మాకు తెలియకుండా ఎలా చేపడతారు అంటూ ప్రశ్నించారు. అందరినీ సమానంగా చూడాలి ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వస్తే పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ వేదిక మీదకు ఆహ్వానించారని అదే తాను వస్తే సాధారణంగా పైకి ఆహ్వానించారని ఇదెక్కడి పక్షపాతమంటూ ప్రశ్నించారు. జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గత 18 నెలలుగా వేతనాలు రావడం లేదని, వీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పీఎంజీపీవైలో 2023–24లో 94 దరఖాస్తులు అందగా వాటిలో 34 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, 2024–25లో 84 దరఖాస్తులు అందగా 48 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయన్నారు. ఇలా అయితే ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సీడీని విడుదల చేసేలా చూడండి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులకు త్వరగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు జిల్లాలకు సంఖ్యా బలం ఆధారంగా సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయించగా తాడేపల్లిగూడెంకు మాత్రం రూ.7 కోట్లు కేటాయించారని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులు మంజూరైనా పనులు మొదలు కాక తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో చర్చించాల్సి ఉంది. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలో కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నా హాజరైంది మాత్రం ముగ్గురే. అందులో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే చిర్రిబాలరాజు వచ్చామా.. నాలుగు పలుకులు పలికామా.. అన్నట్లు పలికి వెళ్లిపోయారు. మధ్యలో వచ్చిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాథాకృష్ణ సభ పూర్తయ్యేవరకు ఉన్నారు. తామేమి నామినేట్ సభ్యులం కాదని జెడ్పీటీసీల మండిపాటు వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం సమావేశానికి ప్రజాప్రతినిధుల గైర్హాజరు -
● అలరించిన జాతీయస్థాయి నాటిక పోటీలు
పట్టణంలోని కళారంజని నాటక అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీసోమేశ్వర జనార్ధనస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. పోటీల్లో గురువారం ప్రదర్శించిన గుంటూరు వారి అభినయ ఆర్ట్స్ ‘ఇది అతని సంతకం’, హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి శ్రీసారీ రాంగ్నెంబర్శ్రీ నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ఎన్ రవీంద్రరెడ్డిని ప్రముఖ సినీనటుడు ఎస్వీ రంగారావు స్మారక పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో కళారంజని వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరఽథీశ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వై వెంకటరమణ, మెంటే పూర్ణచంద్రరావు, మల్లుల సీతారామప్రసాద్, మాదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. –భీమవరం -
రక్తదానంతో ప్రాణదానం
భీమవరం (ప్రకాశంచౌక్): రక్తదానం ప్రాణదానంతో సమానమని జిల్లా పంచాయతీ అధికారి అరుణశ్రీ అన్నారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం, భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్బ్యాంక్లలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించారు. ఆయా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పంచాయతీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా గ్రామ పంచాయతీ ఆఫీసర్ అరుణశ్రీ భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎంఎస్వీ భద్రిరాజు చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ చేసిన దాతలకు, ధ్రువీకరణ పత్రాలు అందించారు. సుమారుగా 90 మంది జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగులు, అధికారులు రక్తదానం చేశారు. రక్త దానం చేసిన దాతలకు రెడ్క్రాస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
రెండోరోజూ మట్టి నమూనాల పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో మట్టి నాణ్యత పరీక్షలను గురువారం రెండవ రోజు కూడా కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేశారు. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి.సిద్దార్ధ హెడవో, విపుల్ కుమార్ గుప్త ప్రాజెక్టు ప్రాంతంలోని దండంగి, జలవిద్యుత్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో నిల్వ చేసిన మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానిక లేబోరేటరీలో పరీక్షించడంతో పాటు మరింత సూక్ష్మంగా పరిశీలించేందుకు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో పరీక్షించేందుకు సేకరించారు. క్షేత్రస్థాయిలో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ సెంటర్లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్, డయాఫ్రమ్వాల్ ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వీరి వెంట ప్రాజెక్టు ఈఈ శ్రీనివాసులు, డీఈ వి.నిర్మల, మేఘ ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ సీహెచ్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి పాలకొల్లు సెంట్రల్: ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి 23 శాతం జీతం పెంచాలని లంకలకోడేరు పీహెచ్సీ కన్వీనర్ గౌతమి తెలిపారు. గురువారం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, సీహెచ్ఓలుగా పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాల సమస్యలు పరిష్కరించాలంటూ స్థానిక ఎన్జీఓ యూనిట్ అధ్యక్షుడు గుడాల హరిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ పని ఆదారిత ప్రోత్సాహకాలను సవరించాలని, ఈపీఎఫ్ను పునరుద్దరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సుజిత, రాజశ్రీ, యువతేజ, స్రవంతి, కృష్ణవేణి, లిఖిత, శైలజ, శిరీష, అన్నప్రైస్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలి ఏలూరు(మెట్రో): ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. -
మా పొట్ట కొట్టొద్దు
జంగారెడ్డిగూడెం: దుకాణాలు తొలగించి తమ పొట్ట కొట్టొద్దంటూ చిరు వ్యాపారులు రాస్తారోకో చేశారు. మండలంలోని వేగవరం జాతీయ రహదారిపై గురువారం పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన తెలిపారు. చిరు వ్యాపారులను ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు పొక్లెయిన్తో రాగా ఆందోళనకు దిగా రు. తాము 40 ఏళ్లుగా రోడ్డు పక్కనే చిరు వ్యా పారాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, కొంతకాలంగా కొందరు దళారులు వచ్చి దుకాణాలు తొలగించాలని బెదిరిస్తున్నారన్నారు. తమ వద్ద నుంచి రూ.10 వేల చొప్పున తీసుకున్నారని, మళ్లీ వారే వెళ్లి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాము కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్ద ని అధికారులకు సూచించారన్నారు. ఆందోళనతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. దీంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. -
శ్రీవారికి కాసుల పంట
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదును స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం లెక్కించారు. చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. 20 రోజులకు నగదు రూపంలో రూ. 1,93,36,657, 326 గ్రాముల బంగారం, 4.149 కిలోల వెండితో పాటు విదేశీ కరెన్సీ లభించినట్టు ఈఓ సత్యనారాయణమూర్తి తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.20 వేలు లభించాయన్నారు. ఆల య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 25న ఆర్డీఓ విచారణ ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గంధం శాంతకుమారి గత నెల 30న మరణించిన ఘటనపై ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ను కలెక్టర్ కె.వెట్రిసెల్వి చారణ అధికారిగా నియమించారు. ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఏలూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ విచారణ నిర్వహించనున్నారు. టీచర్లు కొత్త మెడికల్ సర్టిఫికెట్లు పొందాలి ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ చట్టం–2025 ప్రకారం మెడికల్ సర్టిఫికెట్ ద్వారా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పాయింట్లు పొందడానికి అర్హులైన ఉపాధ్యాయులు కొత్త మెడికల్ సర్టిఫికెట్లు పొందాలని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో సూచించారు. పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలో హెచ్ ఎంలు, ఉపాధ్యాయులు సర్టిఫికెట్లు పొందడానికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఏలూరు జీజీహెచ్లో ఈనెల 24 నుంచి 26 వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు. మహిళల అక్షరాస్యతకోసం ‘ఉల్లాస్’ ఏలూరు(మెట్రో): జిల్లాలో నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులను చేసేందుకు నిర్వహించే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 వరకు సర్వే చేయాలని ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరక్షరాస్యులకు వచ్చేనెల 5 నుంచి సెప్టెంబరు 18 వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబరు నెలాఖరులో వారికి తుది పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 20,199 మంది మహిళలను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. సచివాలయాల్లో నీటి తీరువా పన్నులు ఫసలీ వరకు నీటి తీరువా పన్నులను రైతులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చెల్లించవచ్చని ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. కాలువలు సుందరీకరణకు.. ‘స్వచ్ఛ ఆంధ్ర మిషన్లో భాగంగా కాలువల శుభ్రత, సుందరీకరణ’ కార్యక్రమంలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఏ లూరు ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఈఎల్యూడీఏ) వైస్ చైర్మన్, ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ఈనెల 19న ఏలూరు రైల్వేస్టేషన్ వద్ద కృష్ణా కాలువ వద్ద సుందరీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు. మానవత్వం చాటిన కారుమూరి తణుకు అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడికి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన సిబ్బందితో సపర్యలు చేయించి సురక్షితంగా ఆస్పత్రికి పంపించిన సంఘటన తణుకు మండలం వేల్పూరులో గురువారం చోటుచేసుకుంది. వేల్పూరుకు చెందిన వృద్ధుడు టీవీఎస్ మోపెడ్ పై ఓ మహిళను ఎక్కించుకుని తణుకు వైపునకు వస్తుండగా తణుకు వైపు నుంచి వస్తున్న కారు ఆయన్ను ఢీకొట్టింది. ఇదే సమయంలో అటుగా వెళుతున్న కారుమూరి స్వల్పంగా గాయపడ్డ వృద్ధుడిని సముదాయించి ప్రమాదానికి కారకులైన కారులో ఉన్న వారితో వృద్ధుడిని ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సిందిగా చెప్పి అదే కారులో ఎక్కించి పంపించారు. పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్ ఉన్నారు. -
ఇళ్ల కూల్చివేతపై భగ్గుమన్న పేదలు
బొండాడలో ఉద్రిక్తతకాళ్ల: బొండాడలోని మెయిన్రోడ్డులో పేదల ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పోలీసుల సమక్షంలో పంచాయతీ అధికారులు గ్రామంలోని 28 ఇళ్లను కూల్చేందుకు పొక్లెయిన్ను తీసుకురాగా పేద బాధితులు, సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ ప్రతిఘటించారు. ఈ సమయంలో పోలీసులు, బాధితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆకివీడు సీఐ జగదీశ్వర్రావు, ఆకివీడు, భీమవరం రూరల్, కాళ్ల ఎస్సైలు, పోలీసులు, పోలీసుల బందోబస్తుతో పేదలు, బాధితులను నిర్బంధించారు. సీపీఎం నేత రామకృష్ణను అరెస్ట్ చేసి కాళ్ల పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం పొక్లెయిన్తో ఇళ్లను కూల్చివేశారు. దీంతో మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతను అడ్డుకుంటున్న మహిళలను పోలీసులు ఓ చోట నిర్బంధించారు. మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యం చేయడం అన్యాయమని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బొండాడలో తొలగించిన ఇళ్లకు ఆనుకుని ఇరిగేషన్ పోరంబోకు భూమి 79 సెంట్లు ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
బోధనా లోపం.. విద్యార్థులకు శాపం !
చాట్రాయి: మండలంలోని చిన్నంపేట జెడ్పీ హైస్కూల్ (హైస్కూల్ ప్లస్)లో మొత్తం 28 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా ఇటీవల విడుదల ఫలితాల్లో వారంతా ఫెయిల్ అయ్యారు. ఇందుకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్ ప్లస్లో బైపీసీ, సీఈసీ గ్రూప్ల్లో 28 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ సిలబస్కు అనుగుణంగా బోధించేందుకు తగినంత మంది సిబ్బందిని నియమించకుండా.. విద్యార్థులను ఎందుకు చేర్పించుకున్నారని మండిపడ్డారు. హైస్కూల్ టీచర్లతో మొక్కుబడిగా తరగతులు నిర్వహించడం వల్లే తమ పిల్లలు ఉత్తీర్ణులు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు కట్టలేక.. తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీలో చేర్పిస్తే.. ఇవా ఫలితాలు అంటూ మండిపడ్డారు. ఓ విద్యార్థిని తల్లి సుజాత మాట్లాడుతూ.. 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైన తన కుమార్తె ఇప్పుడు ఫెయిల్ అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బోధనా సిబ్బంది లేకుండా పిల్లల్ని ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన సరిగ్గా లేకపోవడం వల్లే తాము ఫెయిల్ అయ్యామని రాజేశ్వరి అనే విద్యార్థిని వాపోయింది. చిన్నంపేట హైస్కూల్ ప్లస్లో ఇంటర్లో జీరో శాతం ఉత్తీర్ణత అధ్యాపకుల కొరత.. మొక్కుబడిగా తరగతులు -
ముస్లింలకు అండగా జగన్
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం–2025లో మార్పులు కోరుతూ ముస్లింలకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి ముస్లింలు క్షీరాభిషేకం చేశారు. గురువారం కై కలూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆధ్వర్యంలో కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం కోసం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ముస్లింలకు అండగా ఉంటారని, ధైర్యంగా ఉండాలని అన్నారు. పార్టీ ముస్లిం నాయకులు షేక్ రఫీ, మహమ్మద్ గాలిబ్బాబు మాట్లాడుతూ వక్ఫ్ బిల్లును సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అండగా నిలవడాన్ని యావత్ ముస్లిం సమాజం హర్షిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ఆర్సీపై ముస్లింలకు అండగా జగన్ నిలిచారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ముదిరాజ్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, నాయకులు సోమాల శ్యామ్సుందర్, తోట మహేష్, సమయం వీరాంజనేయులు, పంజా నాగు, ముస్లిం పెద్దలు అబ్దుల్ మాలిక్, ఫిర్దోజ్ ఖాన్, అమీర్, నయీమ్, జాకీర్, అలీమ్, ఎండీ ఆసిఫ్ పాషా, షేక్ రషీద్, గఫర్, రెహమాన్, కరీముల్లా, సజీద్, బాబా, ఇక్బాల్, సలీం, జహంగీర్, బషీర్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
ఇంజినీరింగ్దే హవా
సాంకేతిక విద్యపై విద్యార్థులు ఆకర్షితులవడంతో ఇంజినీరింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ కోర్సుల హవా నడుస్తోంది. 10లో uఆక్వా రంగం కుదేలు మేత, సీడ్, లీజు, మెడిసిన్ ధరలు 100 శాతం పెరగ్గా రొయ్య ధర మాత్రం పతనమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయడం చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితిలో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సాగు సమ్మెతోనే రైతులకు న్యా యం జరుగుతుంది. – పొత్తూరి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, కలగంపూడి ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోకపోతే ఆక్వాకు గడ్డు కాలమే. అమెరికా సుంకాల పేరు చెప్పి కౌంట్కు కిలోకు రూ.30 నుంచి రూ.70 వరకు ధరలు తగ్గించేశారు. సుంకాలు లేవని చెప్పినా ధరలు పెంచకుండా రైతులను దోచుకుంటున్నారు. మేత ధరలు తగ్గించి, రొయ్యల ధరలు పెంచేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. – కుక్కల సూరయ్య, ఆక్వా రైతు, మేడపాడు -
ఆక్వా సాగుకు సెలవు
జీతాలు ఇవ్వండి.. మహాప్రభో! జీతాలు సకాలంలో అందక ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బందికి ఇప్పటికీ జీతాలు రాలేదు. 10లో uశురకవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, భీమవరం: ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్పోర్టర్ల దోపిడీని నిరసిస్తూ ఆక్వా చరిత్రలో తొలిసారి రైతులు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గం నుంచి దీనికి నాంది పలికారు. జూలై నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించగా పట్టుబడులు పూర్తిచేసుకున్న రైతులు ఇప్పటినుంచే పంటకు విరామమిచ్చి చెరువులను ఎండగట్టేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2.63 లక్షల ఎకరాల్లో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 2.63 లక్షల ఎకరాల ఆక్వా చెరువులకు 60 శాతం విస్తీర్ణంలో రొయ్యలు సాగవుతున్నాయి. ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. స్థానికంగా 40కి పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. కిలోకు 30 నుంచి 50 లోపు కౌంట్ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుంటే, 60 నుంచి 100 కౌంట్ రొయ్యలు చైనా, యూరోపియన్ దేశాలకు వెళుతున్నాయి. టారిఫ్లు సాకుగా చూపి.. చి... నెలన్నర రోజుల క్రితం 30 కౌంట్ (కేజీకి 30 రొయ్యలు) ధర రూ.470, 40 కౌంట్ రూ.415, 100 కౌంట్ రూ.260 వరకు ధర ఉంది. సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు వనామీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. పట్టుబడులు మొదలై మార్కెట్లోకి రొయ్యలు రావడం పెరగడంతో ధరలు తగ్గిస్తూ వచ్చారు. ఈనెల 3న అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటన వెలువడే నాటికి 30 కౌంట్ ధర రూ.460, 40 కౌంట్ రూ.370, 100 కౌంట్ రూ.230కి ధరలు పడిపోయాయి. అమెరికా సుంకాలను సాగుకు చూపించి కౌంట్ను బట్టి కేజీకి రూ.30ల నుంచి రూ.70 వరకు కోత పెట్టి ఈ ధరలను మరింత తగ్గించేశారు. ఇప్పట్లో పన్నుల బాదుడు లేదని అమెరికా ప్రకటించినా తగ్గించిన ధరలను పెంచలేదు. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్పోర్టర్లు సిండికేటై తమ కష్టాన్ని దోచుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. గతంలోని 30 కౌంట్ రూ.470–490, 50 కౌంట్కు రూ.370, 60 కౌంట్కు రూ.350 కనీస మద్దతు ధర ఉండాలని, మేత ముడి సరకు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఫీడ్ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.20 వేలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇలాకాలో ఫ్లెక్సీల ఏర్పాటు మంత్రి నిమ్మల సొంత నియోజకవర్గమైన పాలకొల్లు నుంచి క్రాప్ హాలిడేని రైతులు ప్రారంభించారు. బుధవారం యలమంచిలి మండలం శిరిగాలపల్లిలో 10 ఎకరాల్లో పంట విరామం పాటిస్తున్నట్టు ఫ్లెక్సీని ఏర్పాటుచేయగా గురువారం నియోజకవర్గంలోని పూలపల్లి, చందపర్రు, నరసాపురం నియోజకవర్గంలోని తూర్పుతాళ్లు తదితర చోట్ల దాదాపు 50కి పైగా ఎకరాల్లోని రైతులు సమ్మెలోకి వెళుతున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పట్టుబడులు పూర్తిచేసుకున్న రైతులు ఒక్కొక్కరుగా పంటకు విరామమిస్తున్నారు. చెరువుల వద్ద క్రాప్ హాలిడే ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి వాటి వివరాలను అధికారులకు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు. ఊరటనివ్వని ‘ఉండి’ సమావేశం న్యూస్రీల్అయ్యో.. రొయ్య ధరల పతనంపై జిల్లా రైతుల పోరుబాట ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడే తొలుత జూలై నుంచి అమలుకు యోచన ఈనెల నుంచే పంట విరామంలోకి రైతులు మంత్రి నిమ్మల ఇలాకా నుంచే ఉద్యమం మొదలు ఇప్పటికే చెరువుల వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు జిల్లాకు చెందిన జైభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల రైతులు ఈనెల 7న పాలకొల్లులో రాస్తారోకో చేశారు. మూడు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉండగా జూన్ నెలాఖరు నాటికి ప్రస్తుత సాగును పూర్తి చేసుకుని జూలై నుంచి సెప్టెంబరు వరకు పంట విరామం పాటించాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంలో సాగు సమ్మె ప్రకంపనలు సృష్టించింది. సాగు సమ్మె విరమింపజేసే దిశగా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజుతో జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు చర్చలు జరిపారన్న ప్రచారం జరిగింది. దీంతో ఈనెల 13న ఉండిలో జరిగిన ఆక్వా సదస్సులో తమకు మేలు జరుగుతుందని రైతులు ఆశించారు. ప్రభుత్వం నుంచి ఏదో జరుగుతుందని ఆశించవద్దు.. ప్రభుత్వాన్ని ఎంతవరకు వా డాలో అంతవరకే వాడుదాం.. అన్నింటికీ ప్రభుత్వం, ప్రభుత్వం అంటే కుదరదంటూ ప్రభుత్వ పెద్దలు ఆ సమావేశంలో చెప్పిన మాటలు ఆక్వా రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేలు మాత్రమే తగ్గించడం, 15న విజయవాడలో సమావేశమైన ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ కంటితుడుపు నిర్ణయాలు రైతులను నిరాశకు గురిచేశాయి. -
సంక్షేమంపై ‘సర్వే’ కుట్ర !
ఏలూరు (మెట్రో): కూటమి ప్రభుత్వ పాలనలో చేస్తున్న వరుస సర్వేలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాలం గడుపుతున్న సర్కారు సర్వేల ఆధారంగా సంక్షేమ పథకాలకు కోత పెడుతుందేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సర్వేల పేరుతో తమపై మోయలేని భారా న్ని మోపుతున్నారంటూ సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీ4 సర్వే జిల్లావ్యాప్తంగా సచివాలయ సిబ్బంది పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపికేషన్ (పీ4) సర్వే నిర్వహిస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఆ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు, సంపాదించేది ఎవరు, ఇల్లు ఉందా? ఆ ఇల్లు ఏ రకం? ఏసీ ఉందా? టీవీ, ఫ్రిజ్, ల్యాప్టాప్, కారు, మోటార్సైకిల్ వంటి పలు వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం కుటుంబ యజమాని మొబైల్కు ఓటీపీ వస్తుంది. దానిని సచివాలయ కార్యదర్శికి చెప్పాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్ జిల్లాలో 99.90 శాతం వర్క్ ఫ్రం హోం సర్వే పూర్తిచేశారు. జిల్లాలో ఏ పనీ లేని వారి సంఖ్య 6,37,333 మందిగా తేల్చారు. ఎంఎస్ఎంఈ అంటూ.. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, ఉపాధి, రుణాలు తదితర అంశాలను ఈ సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. బిడ్డలకు ఆధార్ అంటూ.. చిల్డ్రన్ బర్త్ సర్వే ద్వారా పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు చేయించారా, చేయించకపోతే కారణమేంటి, ఎప్పుడు చేయిస్తారు వంటి వివరాలను సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా.. జిల్లా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారి వివరాలు, వారు అక్కడ ఉంటారా, ఇక్కడకు వస్తారా, వస్తే ఎక్కడ ఉంటారు వంటి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇలా ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశాలను సర్వే ద్వారా తెలుసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఓటీపీలతో ఇబ్బందులు ప్రతి ఫోన్లోనూ ‘సైబర్ నేరగాళ్ల వద్ద నుంచి ఎటువంటి ఫోన్లు వచ్చినా ఎత్తకండి, అప్రమత్తంగా ఉండండి, ఓటీపీలు వంటివి చెప్పకండి’ అని ఫోన్ల ద్వారా ప్రజలకు ఓ వైపు తెలుపుతుంటే.. మరోవైపు సర్వేలకు సంబంధించి సచివాలయ సిబ్బంది ద్వా రా ప్రజల సెల్ఫోన్లకు ఓటీపీలు పంపుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఓటీపీలు ఎందుకు చెప్పాలంటూ సచివాలయ సిబ్బందిని కొందరు నిలదీస్తున్నారు. మరికొందరు ఓటీపీ చెప్పేందుకు ఇష్టపడటం లేదు. దీంతో సర్వేలు సచివాలయ సిబ్బందికి కత్తిమీద సాములా మారాయి. 1,179 ఖాళీలు జిల్లాలో 517 సచివాలయాలు ఉండగా 5,591 ఉద్యోగాలు ఉన్నాయి. వీరిలో 4,412 మంది విధు లు నిర్వహిస్తుండగా 1,179 ఖాళీలు ఉన్నాయి. పథకాలు తగ్గించేందుకుకూటమి ప్రభుత్వం కుయుక్తులు వరుస సర్వేలపై సర్వత్రా ఆందోళన ఓటీపీలు చెప్పాలంటూ ప్రజలకు ఫోన్లు సచివాలయ సిబ్బందికి పని ఒత్తిడి -
‘ఫీజు’ కోసం పోరు
భీమవరం: నిబంధనలు మీరిన ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, జీఓ 77, 107, 108లను రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటూ గురువారం భీమవంరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జీఓ 77 రద్దు చేస్తామని, పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, అయినా వీటిని అమలు చేయలేదన్నారు. అనంత రం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లుకు అందజేశారు. -
పని లేదు.. నిరుద్యోగ భృతి రాదు
ఏలూరు (మెట్రో): ‘నిరుద్యోగులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తాం.. లేదంటే నిరుద్యోగ భృతిగా రు.3 వేలు అందించి అండగా నిలుస్తాం’ ఇవి కూటమి సర్కారు అధికారం కోసం ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు. వాస్తవానికి కూటమి సర్కారు అధికారం చేపట్టి సంవత్సర సమీపిస్తున్నా ఉద్యోగం లేని వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం సర్వే చేస్తున్నామంటూ, సచివాలయ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతూ కూటమి సర్కారు కాలయాపన చేస్తుంది. జిల్లాలో నిర్వహిస్తున్న వర్క్ఫ్రమ్ హోం సర్వేలో ఏ పనీ లేని వారి సంఖ్య 6,37,333 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గత రెండు నెలలుగా చేయిస్తున్న ఈ సర్వేలో మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి.? జనాభా ఎంత? ఏ పని చేయని వారు ఎంతమంది ఉన్నారు. ఇళ్ల వద్ద పనులు చేసేందుకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు? అనే అంశాలను క్రోడీకరిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 99.90 శాతం సర్వేను సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే పూర్తి చేశారు. సర్వే వివరాలను ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ప్రచారం చేస్తున్నప్పటికీ ఇది ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా డిగ్రీ పట్టభద్రులతోపాటు ఇంజినీరింగ్ చేసిన యువతకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు కల్పిస్తారని చెబుతున్నారు. ఉన్న ఉద్యోగాలే తీసేస్తుంటే.. సర్వేలో నివాస గృహాల్లో బ్రాడ్బాండ్, వైఫై సదుపాయం, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, లేదా అన్న వివరాలు సర్వేల్లో నమోదు చేశారు. ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రదేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఫైబర్నెట్పైనే పర్యవేక్షణ కొరవడటంతో కొత్తగా ఇంటర్నెట్ సదుపాయం ఎలా కల్పిస్తారనేది ప్రశ్నార్ధకమే. కనీసం ఫైబర్నెట్లో విధులు నిర్వహించే సుమారు 500 మంది ఉద్యోగాలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి కొత్తగా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనేది కూటమి సర్కారుకే తెలియాలి. వర్క్ఫ్రమ్ హోం సర్వే వివరాలు జిల్లా వ్యాప్తంగా ఇంతవరకూ చేసిన సర్వేలో 49,0034 గృహాల్ని సందర్శించారు. 10,83,839 మంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారిలో వివిధ పనులు చేస్తున్న వారు 1,93,819 మంది ఉన్నారు. ఏ పని చేయని వారు 6,37,333 మంది ఉన్నారు. ఇంటి వద్ద వివిధ పనులు చేస్తున్న వారు 17,341 మంది ఉన్నారు. నిరుద్యోగులను మోసగించిన కూటమి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసిన కూటమి సర్కారు కనీసం దీనిపై నోరు మెదపడం లేదు. కేవలం సర్వేల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప అధికారంలోకి వచ్చాక ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కల్పించిన పాపాన పోలేదు. – డీఎన్వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క్ఫ్రమ్ హోం సర్వేలో తేలిన లెక్కలు జిల్లాలో ఏ పని లేని వారి సంఖ్య 6,37,333 మంది జిల్లాలో 99.90 శాతం సర్వే పూర్తి -
కూలి డబ్బుల కోసం ఎదురుచూపులు
● మూడు నెలలుగా ఉపాధి కూలీలకు వేతనాలు బంద్ ● రూ.13.12 కోట్ల బకాయిలుభీమవరం(ప్రకాశం చౌక్): బతుకుదెరువు కోసం ఎండలో కష్టపడి పనిచేసే ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత మూడు నెలలగా ఉపాధి కూలీలకు వేతనాలు అందడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు బకాయి పెట్టారు. కూలీ డబ్బులు కోసం నిరు పేదలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వేతనాలు రాకపోయేసరికి అప్పులు చేసుకునే బతుకుతున్నారు. వేతనాలు ఎప్పుడు పడతాయే అధికారులకు కూడా తెలియని పరిస్థితి. ఒక్కో కూలీకి రూ.4 వేల వరకూ బకాయి జిల్లాలో 20 మండలాల్లో ఫ్రిబవరి నుంచి ఇంతవరకు ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయి రూ.13.12 కోట్లకు పైగానే ఉంది. ఒక్కో ఉపాధి కూలీకి రోజుకు రూ.300 చొప్పున రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లించాల్సి ఉంది. మూడు నెలల దాటినా వారి ఖాతాలో వేతనాలు జమకావడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో రూ.కోట్ల నిధులు ఉన్నప్పటికీ వేతనాలు ఇవ్వడం లేదు. కూలీలకు వేతనాలు చెల్లించకుండా బకాయిలు మొత్తాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది.. ఆ నిధులు దేనికి మళ్లిస్తున్నారు.. ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ నిధులు ప్రభుత్వం ఏం చేస్తుందో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలంటున్నారు. జాతీయ ఉపాధి హమీ పథకం ప్రారంభించిన నాటి నుంచి గత ప్రభుత్వ పాలన వరకూ ఎప్పుడూ కూలీలకు ఇలా బకాయిలు పెట్టింది లేదు. ముమ్మరంగా పనులు జిల్లాలోని 20 మండలాల్లో ఉపాధి పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు. పంట కాలువలు, చెరువులు పూడికతీత పనులు చేయిస్తున్నారు. రోజుకు జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. జిల్లాలో ఇలా.. ఉపాధి జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు : 1,84,459 యాక్టివ్గా ఉన్న జాబ్ కార్డులు : 1,2,806 మొత్తం కూలీలు : 3.3 లక్షలు పనికి వెళుతున్న కూలీలు : 1.48 లక్షలు రోజుకు కూలీ వేతనం రూ.300 -
ఇసుక లభ్యతపై పటిష్ట ప్రణాళిక
ఏలూరు(మెట్రో): జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఉండేలా పటిష్ట ప్రణాళిక రూపొందించాలని ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజల అవసరాలకు, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను అవసరమైన ఇసుక అందుబాటులో ఉంచేలా స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీస్లిటేషన్ పాయింట్, స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారుల వద్దకు చేర్చేందుకు రవాణా చార్జీలు ఖరారు చేయాలనీ రవాణా శాఖాధికారులను ఆదేశించారు. డీస్లిటేషన్ పాయింట్, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉందని.. ఇసుక లభ్యత ఎక్కువగా ఉంటుందని, జిల్లాలో రాబోయే వర్షాకాలం సీజన్లో ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా
సీఈసీ సూచనల అమలుపై నివేదిక కోరిన ధర్మాసనం కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు, పర్యావరణ విఘాతం అనే అంశాలపై సుప్రీంకోర్టులో ఉన్న కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా పడింది. ద్విసభ్య ధర్మాసనం ముందు కొల్లేరు అంశంపై బుధవారం వాదనలు జరిగాయి. క్షేత్రస్థాయిలో కొల్లేరు రైతుల సమస్యలపై ఏం సలహాలు ఇచ్చారని సీఈసీని సుప్రీం ప్రశ్నించింది.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సీఈసీ సూచనలు ఎంత మేర అమలు చేసింది.. అమలు తీరును కలెక్టర్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్టు, చీఫ్ సెక్రటరీ పరిశీలించి తమకు నివేదిక ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా కొల్లేరు సమస్యపై అధ్యయనం చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) కొల్లేరులో 14,000 ఎకరాలు నష్టపోయిన జీరాయితీ రైతులకు నష్టపరిహారం అందించాలని, కొల్లేరులో సంప్రదాయ వేటకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా అవేమీ జరగలేదు. మరోవైపు కూటమి నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి కొల్లేరు సమస్యను వివరించారు. రాష్ట్ర మంత్రి వై.సత్యకుమార్, కై కలూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ధర్మరాజు, కొల్లేరు నాయకులు బలే ఏసురాజు, కొల్లి బాబీ, రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు తదితరులు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిశారు. కేంద్రం నుంచి కూడా అఫిడవిట్ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే కామినేని తెలిపారు. -
ముస్లిం నేతల రిలే దీక్ష
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించాలని పలువురు ముస్లిం సోదరులు చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం – 2025ని నిరసిస్తూ కై కలూరు పెద్ద మసీదు వద్ద ముస్లిం నాయకుడు షేక్ షాబుద్దిన్ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే దీక్షను బుధవారం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు దీక్ష సాగింది. ముస్లింల మనోభావాలు దెబ్బతిసే చట్టాన్ని రద్దు చేయడానికి చేస్తున్న నిరసనలలో ప్రజాస్వామ్య, లౌకికవాదులందరూ మద్దతుగా రావాలన్నారు. ముస్లిం నాయకులు మహమ్మద్ గాలీబ్ బాబు, షేక్ ఆరిఫ్, అబ్దుల్ హమీద్, అబ్దుల్ అలీమ్, మహమ్మద్ రఫీ, అమీర్, షేక్ రఫీ, అబ్దుల్ హసీబా, ఫిర్దోస్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, ఆసిఫ్, జహంగీర్, సుల్తాన్, భాష, మున్నా తదితరులు పాల్గొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్కు బుకింగ్ ప్రారంభం ఏలూరు(మెట్రో): దీపం–2 కింద రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియలో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో సిలిండర్ను బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారన్నారు. మొదటి విడత 2024 నవంబర్లో మొదలై ఈ ఏడాది మార్చి 31తో ముగిసిందన్నారు. ప్రస్తుతం రెండో విడత ఏప్రిల్ 1 నుంచి మొదలైందని, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఉచితంగా ఇస్తారన్నారు. దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. శానిటరీ వర్కర్పై దౌర్జన్యం ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్పై ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీనిపై శానిటరీ వర్కర్లు ఆందోళనకు దిగారు. యూనియన్ నాయకుడు కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తాగునీటి సమస్యపై సమీక్ష ఏలూరు(మెట్రో): వేసవిలో తాగునీటి కొరత సమస్య ఎదుర్కొంటున్న గ్రామాల పరిస్థితి, పరిష్కారానికి చర్యలపై జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈతో బుధవారం సమీక్షించారు. జెడ్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఎస్ఈ త్రినాథ్బాబును ఆదేశించారు. చెట్టున్నపాడు, అగడాలలంక, మల్లవరం గ్రామాలకు తాగునీటి సమస్యను పరిష్కరించామని త్రినాథ్బాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పునరావాస కాలనీలు, వర్షాభావ ప్రాంతాల్లో నీటి కొరతను గుర్తించామని, అక్కడ తక్షణం కొత్త బోర్లు తవ్వించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 25 నుంచి కొంతేరులో నాటికల పోటీలు యలమంచిలి: యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు కొంతేరు పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో 43వ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ చైర్మన్ అంబటి మురళీకృష్ణ, పాలకవర్గ సభ్యులు తెలిపారు. స్థానిక కళామందిరంలో బుధవారం సమావేశమైన సభ్యులు నాటిక పోటీల బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్య దర్శి గంటా ముత్యాలరావు, బోణం రవిబాబు, అంబటి నవీన్చంద్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్కు ఉచిత శిక్షణ పెంటపాడు: ఈ నెల 30న జరగనున్న పాలిసెట్ ప్రవేశపరీక్షకు ఆయా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు గూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి. ఫణీంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 90102 22178, 94901 04336 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు. -
రియల్ ఎస్టేట్ రివర్స్ గేర్
మధ్య తరగతికి భారమే గత ఫిబ్రవరిలో ప్రభుత్వం అనా లోచితంగా భూముల మార్కెట్ విలువలు పెంచడం మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా పరిణమించింది. కరోనా సమయంలో అతలాకుతలమైన మధ్యతరగతి ప్రజల జీవితాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశగా భూములను కొనుగోలు చేయాలని చూస్తే ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. – గంటా రాజేశ్వరరావు, రియల్ ఎస్టేట్ యూనియన్ జిల్లా కార్యదర్శి మార్కెట్లో తక్కువ.. రికార్డుల్లో ఎక్కువ సాధారణంగా బహిరంగ మార్కెట్లో ధరలు అసాధారణంగా ఉండి ప్రభుత్వ రికార్డుల్లో తక్కువగా ఉంటే ప్రభుత్వం ఆయా ప్రాంతాల డిమాండ్ను బట్టి రికార్డుల్లో మార్కెట్ ధరలను పెంచడానికి నిర్ణయం తీసుకుంటుంది. గత ఫిబ్రవరిలో మార్కెట్ వాల్యూ పెంచడంతో బహిరంగ మార్కెట్లో కంటే రికార్డుల్లోనే ధర ఎక్కువగా ఉంంది. – తోటకూర కిషోర్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో రియల్ ఎస్టేట్ భూం రివర్స్ అయ్యింది. గత ఏడాది కాలంగా కొనుగోలు శక్తి తగ్గిపోవడం, మార్కెట్లో నగదు లావాదేవీలు 50 శాతం మేర తగ్గడంతో పాటు.. ఒకేసారి 25 శాతం గవర్నమెంట్ వాల్యూ పెంచడం రియల్ ఎస్టేట్ పతనానికి దారితీశాయి. వందల సంఖ్యలో వెంచర్లు, అపార్ట్మెంట్లల్లో ప్లాట్లు విక్రయాల కోసం సిద్ధంగా ఉన్నా కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రజలను ఆకర్షించడానికి లక్కీ డిప్లు, లాటరీలు, రెంటల్ భరోసా ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా రియల్ భూంలో కదలిక లేకపోగా సాధారణ స్థాయి క్రయవిక్రయాలు కూడా జరగకపోవడం గమనార్హం. 2024–25లో రూ.495.12 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా రూ.348 కోట్లతో కేవలం 70 శాతం మేర లక్ష్యాన్ని చేరుకుంది. స్ధల క్రయ విక్రయాల కంటే ఇతర రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని రియల్ ఎస్టేట్ పూర్తిగా మందగించింది. జిల్లా వ్యాప్తంగా ఏలూరు, కై కలూరు, చింతలపూడి, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలు, దెందులూరు, కామవరపుకోట మండలాల్లో సుమారు 150కు పైగా లేఅవుట్లు ఉన్నాయి. వీటి పరిధిలో వేల సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయి. ఏలూరుతో పాటు మిగిలిన మున్సిపాల్టీల్లో నిర్మాణం పూర్తి చేసుకుని, వివిధ దశల్లో ఉన్న అపార్ట్మెంట్లు సుమారు 85కు పైగా ఉన్నాయి. దాదాపు ఏడాది నుంచి క్రయవిక్రయాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రియల్ మార్కెట్ రోజురోజుకి సంక్షోభంలో చిక్కుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు పరిహారం లబ్ధిదారులకు పడటంతో గతంలో జంగారెడ్డిగూడెంలో రియల్ ఎస్టేట్ భూం విపరీతంగా కొనసాగింది. జిల్లా వ్యవసాయ అధారిత జిల్లా కావడంతో పామాయిల్, కోకో తోటల క్రయవిక్రయాలు కూడా గతంలో పెద్ద సంఖ్యలో జరిగాయి. ప్రస్తుతం ఇదంతా పూర్తిగా మందగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి అభివృద్ధి అంటూ హడావుడి చేస్తుండటం, 25 శాతం మార్కెట్ విలువ పెంచడంతో స్థానికంగా మార్కెట్ పూర్తిగా పతనమైందని రియల్ ఎస్టేట్ వర్గాల వాదన. ఈ పరిణామాల క్రమంలో ఏలూరు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2024–25 వార్షిక లక్ష్యం రూ.495.12 కోట్లకుగాను రూ.384.72 కోట్ల ఆదాయం సమకూరింది. 70 శాతం టార్గెట్ పూర్తి : 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 91,642 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో 20,383 విక్రయాల రిజిస్ట్రేషన్లు 18,698 గిఫ్ట్ రిజిస్ట్రేషన్, 25,121 తాకట్టు రిజిస్ట్రేషన్, జనరల్ పవర్, హక్కు విడుదల, పార్టనర్ షిప్ డీడ్, ట్రస్ట్ల రిజిస్ట్రేషన్లు, ధార్మిక సంస్ధల రిజిస్ట్రేషన్లు, క్యాన్సిలేషన్ డీడ్, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్లు, విడాకుల రిజిస్ట్రేషన్లు తదితరాలు అన్ని కలిపి 27,449 జరిగాయి. దీంతో వంద శాతం లక్ష్యానికి 70 శాతం మాత్రమే జరిగింది. వాస్తవానికి మార్కెట్ వాల్యూ పెరగడం, ఇతర రిజిస్ట్రేషన్లు పెరగడంతో టార్గెట్లో 20 నుంచి 25 శాతం ఆదాయం పెరిగింది. 2023–24లో జిల్లా వ్యాప్తంగా 1,02,222 రిజిస్ట్రేషన్లు జరగగా, 2024–25 సంవత్సరంలో 91,642 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మందగించిన క్రయవిక్రయాలు 5 నుంచి 25 శాతం మేర పెరిగిన మార్కెట్ విలువ మార్చి నెలలోనే 46 శాతం తగ్గిన టార్గెట్ పట్టణాలు, నగరాల్లో ధరలు పతనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కార్యాలయం రిజిస్ట్రేషన్ల నిర్దేశించిన పూర్తి చేసిన శాతం సంఖ్య లక్ష్యం లక్ష్యం (రూ. కోట్లలో) (రూ. కోట్లలో) భీమడోలు 9,474 43.94 31.32 71.21 చింతలపూడి 11,437 44.23 27.92 63.13 జంగారెడ్డిగూడెం 9,929 43.06 34.82 80.87 కామవరపుకోట 4,598 24.33 18.08 74.32 పోలవరం 3,421 6.96 6.31 90.65 ఏలూరు 18,162 168.52 110.46 65.55 గణపవరం 4,605 17.67 13.40 75.83 వట్లూరు 4,528 33.19 23.53 70.90 కై కలూరు 4,932 26.32 15.17 57.65 మండవల్లి 1,911 13.44 4.64 34.53 ముదినేపల్లి 2,469 13.37 7.57 56.61 నూజివీడు 14,181 60.03 55.45 92.37 మొత్తం 91,642 495.12 347.72 70.43 -
బాబు పాలనే.. అయ్య బాబోయ్
కొయ్యలగూడెం: బాబు పాలన అంటేనే అయ్యబాబోయ్ అనే పరిస్థితి ప్రజల నోళ్లలో పునరావృతం అవుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుధవారం కొయ్యలగూడెంలో ఆయన పలనాడు రైతు ప్రతినిధులను కలుసుకున్న సందర్భంగా మాట్లాడారు. పలనాడు జిల్లా రైతు ప్రతినిధులు, మాజీ సొసైటీ అధ్యక్షుడు నల్లపాటి రామయ్య నేతృత్వంలో బాలరాజును కలుసుకుని తమ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాధక, బాధలు గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతూ వచ్చిన వీరు మిర్చి, పత్తి, టొబాకో రైతుల సంక్షేమ పరిస్థితి గురించి చర్చించారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ఏనాడు సుభిక్షంగా లేరని ఇప్పుడు కూడా ఆయన పాలన ఎప్పుడు ముగుస్తుందా అని తమ ప్రాంత రైతులతో సహా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాయలసీమలోని రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని, సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి యూరప్ పర్యటనలతో గడుపుతున్నారని విమర్శించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే కేవలం ఇంకా సినీ ఆర్టిస్టు మాదిరిగానే నటనతో జీవిస్తున్నారని అన్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్ష సాధింపు చర్యలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు మేకల అన్నవరం, వైఎస్సార్ సీపీ నాయకులు విగ్గిన రామకృష్ణ, చింతలపూడి కిషోర్, రాఘవరాజు సాయి కృష్ణ, చవల నాగేశ్వరరావు, చవాకులు సూరిబాబు, నారా సుధీర్, తదితరులు పాల్గొన్నారు. మద్యం వ్యాన్ బోల్తా పోలవరం రూరల్: మద్యం సీసాల లోడుతో వస్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడి మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి. రాజమహేంద్రవరం జిల్లాలోని డిపో నుంచి పోలవరం మద్యం దుకాణానికి తరలిస్తున్న వ్యాన్ కొత్తపట్టిసీమ, పాత పట్టిసీమ మధ్యలో బుధవారం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో తీసుకువస్తున్న సుమారు రూ.7 లక్షల విలువైన మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం వ్యాన్ తిరగబడిన సమాచారం మద్యం షాపు యజమానికి అందడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడికి చేరుకుని నేలపై పడ్డ మద్యం సీసాలను ఒబ్బిడి చేసుకున్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన భారీ గాలులు, వర్షంతో భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని చోట్ల వృక్షాలు ఇళ్లపై పడ్డాయి. జంగారెడ్డిగూడెం కాలేజ్ రోడ్డులో భారీ వృక్షం నేలకూలింది. పట్టణం, మండలంలో భారీ వృక్షాలు విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడం, విద్యుత్వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా, విద్యుత్ ఈఈ పీర్ అహ్మద్ఖాన్, డీఈ యు.సుబ్బారావుల ఆధ్వర్యంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను అర్ధరాత్రి తరువాత నుంచి ప్రారంభించారు. చివరకు బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరించారు. పంటలు నష్టపోయిన రైతులు బుట్టాయగూడెం: గత మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, గాలి బీభత్సంతో ఏజెన్సీ ప్రాంతంలోని పలు చోట్ల అరటితోటలు నేలకొరిగాయి. మొక్కజొన్న, పొగాకు, జీడిమామిడి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించగా కొమ్ముగూడెం, బుట్టాయగూడెం, నిమ్మలగూడెం, తదితర గ్రామాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. సుమారు 18 ఎకరాల వరకూ మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు ఏఓ డి.ముత్యాలరావు ప్రాథమిక అంచనా వేశారు. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్న పంటలు -
పొట్టకూటి కోసం వెళితే..
నరసాపురం: తోటి వ్యక్తులతో కలిసి ఉదయాన్నే పనుల్లో నిమగ్నమైన ఆ ఉపాధి కూలీల బతుకులు అనుకోని ప్రమాదంతో తెల్లారిపోయాయి. టాటా ఏస్ వాహనం రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ పనిచేస్తున్న మిగిలిన ఉపాధి కూలీలంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఒకరి అతివేగం రెండు నిండు ప్రాణాలను పొట్టనబెట్టుకోగా మరో ఇద్దర్ని గాయాలపాలు చేసిన ఘటన ఉపాధి కూలీల్లో తీవ్ర విషాదం నింపింది. బుధవారం మొగల్తూరు మండలంలో 216 జాతీయ రహదారి పక్కన నల్లావారితోట వద్ద ఆయిల్ డబ్బాల లోడుతో వేగంగా దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి రోడ్డుకు ఆనుకుని ఉన్న పంట బోదెలో బోల్తా పడింది. అక్కడే ఉపాధి హామీ పథకంలో పంట బోదె బాగు చేస్తున్న కూలీలు కడలి పావని (45), గుబ్బల గంగావతి (55)పై వాహనం పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గంగావతి భర్త మాణిక్యాలరావు, మరో కూలీ గుడాలి సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. మాణిక్యాలరావును నరసాపురం, భీమవరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తీసుకెళ్లారు. మరో కూలీ సత్యనారాయణ తలకు బలమైన గాయం కాగా నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో 15 మంది కూలీలు అక్కడ పనిచేస్తున్నారు. అకస్మాత్తుగా రోడ్డుపై వెళుతున్న వాహనం తమవైపు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి తోటి వారి మీదపడటంతో వారంతా భయందోళనలో పరుగులు తీశారు. వెంటనే తేరుకుని వాహనం కింద పడ్డ తోటివారిని విగత జీవులుగా చేతుల మీదుగా తీసుకుని బోరున విలపించారు. గాయపడిన వారిని నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంతోపాటు, ప్రమాద స్థలంలో ఉన్న మలుపును గుర్తించలేకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, నరసాపురం డీఎస్పీ డాక్టర్ డి.శ్రీవేద పరిశీలించారు. ప్రభుత్వ పరంగ బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. వ్యాన్ డ్రైవర్ వై.వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఆడపిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు మహిళలది, గాయపడ్డ మరో ఇద్దరు కూలీలదీ మొగల్తూరు మండలం నక్కావారిపేట పడమటి పాలెం. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన పావనికి ఇందుశ్రీ, ప్రవల్లిక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త సత్యనారాయణ ఆటో డ్రైవర్. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. ఇంట్లో తల్లితండ్రులు ఇద్దరూ కష్టపడితేగానీ ఇద్దరు ఆడపిల్లల ఆలనాపాలనా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రమాదంలో తల్లి అకాలంగా మృత్యువాత పడింది. ఇందుశ్రీకి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దేవుడు ఇంత పనిచేశాడని బంధువులు, ఇంటిపక్కవారు బోరున విలపించడం కన్నీళ్లు తెప్పించింది. ఇక మృతురాలు గంగావతికి పెళ్లయిన ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. గంగావతి ప్రాణాలు విడువగా, ఇంటికి పెద్దదికై ్కన మాణిక్యాలరావు ప్రాణాపాయం మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఉపాధి హామీ కూలీలపైకి దూసుకొచ్చిన వాహనం ఇద్దరు మహిళా కూలీల దుర్మరణం మరో ఇద్దరికి తీవ్రగాయాలు నక్కావారిపాలెంలో తీవ్ర విషాదం -
ఏలూరు ఇందిరమ్మకాలనీ వద్ద అస్థిపంజరం
విచారణ చేస్తున్న ఏలూరు రూరల్ పోలీసులు ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని ఇందిరమ్మకాలనీ పంటకాలువ సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం అస్థిపంజరంను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు మృతుడు వేమూరి సత్యనారాయణ (65)గా గుర్తించారు. కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో సత్యనారాయణ ఒంటరిగా ఉంటున్నాడని, అతని భార్య విజయవాడలోని కుమారుడి వద్ద ఉంటుందని చెబుతున్నారు. మద్యానికి బానిసై పంటకాలువ వద్ద పడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతిచెంది సుమారు నెలరోజులు అయి ఉండవచ్చిని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్లో కీర్తనకు రజతం ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నగరంలోని ఏఆర్డీజీకే పాఠశాల విద్యార్థిని చుక్క కీర్తన రజత పతకం సాధించింది. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకూ మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కీర్తన 59 కేజీల విభాగంలో స్నాచ్లో 67 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 87 కిలోలు కలిపి మొత్తం 154 కిలోలు ఎత్తి రజత పతకం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డీ. షారోన్ తెలిపారు. అలాగే తమ పాఠశాలకు చెందిన మొయిద పావని 40 కేజీల విభాగంలో స్నాచ్లో 47 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 55 కిలోలు మొత్తం 102 కిలోల బరువు ఎత్తి 4వ స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించి పతకాలు సాధించిన విద్యార్థినిలను, ఫిజికల్ డైరెక్టర్ పీ పుల్లారావును బుధవారం పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ ఉపాధ్యాయులు వీ కాంతి జయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈడే శివశంకర రావు పాల్గొన్నారు. -
7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు మే 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 14 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి బుధవారం వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా 7న ఉదయం శ్రీవారిని పెండ్లికుమారునిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేస్తారు. 8న అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణను నిర్వహిస్తారు. అలాగే 9న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై తిరువీధి సేవలు, 10న రాత్రి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. 11న రాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. 12న రాత్రి రథోత్సవం, 13న చక్రవారి–అపభృధోత్సవము, వేద సభ, ధ్వజావరోహణ నిర్వహిస్తారు. 14న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటల నుంచి జరిగే ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగము–పవళింపుసేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను నిర్వహిస్తామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చేనెల 7 నుంచి 14 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలని ఈఓ కోరారు. 11న రాత్రి శ్రీవారి తిరుకల్యాణం 12న రాత్రి రథోత్సవం ఉత్సవ వివరాలు వెల్లడించిన ఆలయ ఈఓ మూర్తి -
కోకో ధరలపై ఒప్పంద ప్రకటనకు డిమాండ్
ఏలూరు (టూటౌన్): వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజల ధరల ఒప్పంద ప్రకటన చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని కోరుతూ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. రైతుల సంఘం ప్రతినిధి బృందంతో ఎంపీ చర్చించారు. కోకో రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధర రాకపోవడంతో కోకో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు రూ.750కు పైగా ధర ఉన్నా రూ.450 నుంచి రూ.550 మాత్రమే ఇస్తున్నారన్నారు. పాత గింజలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ నెల 3న వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో కంపెనీలు, ట్రేడర్లతో సమావేశం జరిగిందని.. ఈ నెల 7 లోపు ధరల నిర్ణయ ప్రకటన చేస్తామని చెప్పారన్నారు. ఇంతవరకు నిర్ణయం కాకపోవడంతో కంపెనీలు అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత గింజలకు కిలోకు రూ.300, కొత్త గింజలకు కిలోకు రూ.550 అంటూ ప్రచారం చేయడంతో రైతులు మరింతగా నష్టపోతున్నారన్నారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధర ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితుల ఇళ్ల గల్లంతుపై మళ్లీ విచారణ
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టులో ఇళ్లను కోల్పోతున్న అర్హులైన నిర్వాసితుల పేర్లను తొలగించిన స్పెషల్ కలెక్టర్ సరళావందనం మళ్లీ ఈ పేర్లపై విచారించాలని తాజాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏలూరు–2 కు లిఖితపూర్వకంగా ఆదేశించారు. ప్రభుత్వం నోటిఫై చేసిన అవార్డు ఉత్తర్వులో వేలేరుపాడు మండలం జగన్నాధపురంలోని 140 మంది నిర్వాసితుల పేర్లను స్పెషల్ కలెక్టర్ సరళ వందనం తొలగించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పోలవరం స్పెషల్ కలెక్టర్ సరళ వందనం గత ఏడాది అక్టోబర్ నెలలో అప్పటి ఏలూరు ఎస్డీసీ ముక్కంటితో విచారణ చేయించారు. అప్పట్లో వేలేరుపాడు తహసీల్దార్, వీఆర్వో, గ్రామ పంచాయితీ కార్యదర్శి, ఎంపీడీఓల సమక్షంలో విచారణ చేపట్టారు. 2015, 2016, 2017 ఇంటి పన్ను రశీదులు పరిశీలించి ఎస్డీసీ కార్యాలయానికి అందరి అధికారుల సంతకాలతో పంపారు. మళ్లీ తొలగించిన నిర్వాసితుల ఇండ్లను విచారించాలని, అన్ని ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిజంగా ఇండ్లు ఉన్నాయా... లేదా? అన్న అంశాలను పరిశీలించాలని పోలవరం స్పెషల్ కలెక్టర్ తాజాగా ఆదేశించారు. దీంతో మంగళవారం ఏలూరు ఎస్డీసీ వాకా శ్రీనివాసరెడ్డి విచారణ చేపట్టారు. ఇంటింటింకీ తిరిగి నోట్ కెమెరాతో ఫొటోలు తీశారు. ఇంటి యజమాని అందుబాటులో ఉంటే ఇంటి ముందు నిలబెట్టి ఫొటోలు తీశారు. వీరితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ, వీఆర్వో, ఎస్డీసీ కార్యాలయ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు. గతంలో పేర్లు తొలగించిన స్పెషల్ కలెక్టర్ సరళావందనం మళ్లీ విచారించాలని తాజాగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు ఆదేశం ఇంటింటికీ తిరిగి నోట్ కెమెరాతో ఫొటోలు తీస్తున్న అధికారులు -
యర్రంపేట వాసికి గిన్నిస్ బుక్లో చోటు
కొయ్యలగూడెం: యర్రంపేటకు చెందిన కీబోర్డ్ కళాకారుడు జీవన్ ప్రసాద్ గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాడు. మంగళవారం ఆ వివరాలకు విలేకరులకు వెల్లడించారు. హాలెల్ అంతర్జాతీయ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో పద్దెనిమిది దేశాలకు చెందిన కీబోర్డ్ కళాకారులతో ఈనెల 14వ తేదీన హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. గంటసేపు అంతరాయం లేకుండా ప్లేచేస్తూ నైపుణ్యత కనబరిచిన 1046 మందిని విజేతలుగా ప్రకటించారన్నారు. విజేతల్లో తాను ఉన్నానని, ఈ నేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేశారన్నారు. గిన్నిస్ అద్జిడికేటర్ రిచర్డ్ స్టిన్నింగ్ అవార్డులను హైదరాబాదులో ప్రదానం చేసినట్లు చెప్పారు. క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు వాయిదా ఏలూరు రూరల్ / టౌన్: ఈ నెల 17, 18 తేదీల్లో ఆశ్రం వైద్య కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్, అండర్–23, అండర్–19 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు వాయిదా వేసినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్న్ అధ్యక్షుడు జి ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్ఎం శ్రీనివాసరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఈ పోటీలు వాయిదా వేశామని, తదుపరి తేదీలను పత్రికల ద్వారా ప్రకటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్పై వచ్చిన పలు ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించిందని కమిటీ చైర్మన్ చవాకుల కాశీ విశ్వేశ్వరరావు మరో ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ను అవమానించిన కేసులో ఇద్దరికి రిమాండ్ భీమడోలు: రాష్ట్రీయ రహదారి పోలసానిపల్లి ఎస్సీ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను మంగళవారం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 12వ తేదీ రాత్రి గుర్తు తెలియని అగంతకులు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన ఉండి సాయి వీరాస్వామి, ఆతని తండ్రి ఉండి రాంబాబులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారిని భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. నలుగురికి తీవ్ర గాయాలు పెనుమంట్ర: బుల్లెట్ మోటార్ సైకిల్ బొలెరో వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన పెనుమంట్ర– బ్రాహ్మణ చెరువు గ్రామాల మధ్యలో మంగళవారం రాత్రి జరిగింది. ఇద్దరు యువకులు, ఒక యువతి బుల్లెట్ వాహనంపై ప్రయాణిస్తూ దారిలో నడిచి వెళుతున్న ఒక యువతిని ఢీకొని అదుపుతప్పి ఎదురుగా వస్తున్నా బొలెరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో బుల్లెట్పై వెళుతున్న ముగ్గురితోపాటు రోడ్డుపై నడిచి వెళ్తున్న యువతికి తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. నడిచి వెళ్తున్న యువతి స్థానిక ఆసుపత్రికి, ఆ ముగ్గిరిని 108 వాహనంలో తణుకు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. -
చిరుద్యోగులపై కూటమి పంజా
ఏలూరు(మెట్రో): నమ్మిన వారిని నిలువున ముంచేలా, చిరుద్యోగుల కడుపుకొట్టేలా కూటమి నేతల చర్యలున్నాయి. అధికారంలోకి వచ్చే వరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి.. ఆచరణలో మాత్రం మొండిచేయి చూపుతున్నారు. ఒక్కొక్క శాఖలో కూటమి తమ్ముళ్లు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా వీరి కన్ను చిరుద్యోగులైన వీవోఏలపై పడింది. ఏళ్ల తరబడి వీవోఏలుగా పనిచేస్తున్న వారిని తొలగించి వారి స్థానంలో తమ అనుయాయులను నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. వీవోఏలను ఒత్తిళ్లకు గురిచేస్తూ, వారే తప్పుకునేలా వ్యవహరిస్తున్నాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో వీవోఏలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ప్రతీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. దీంతో ప్రజలతో పాటు అధికారులు, ఆయా విభాగాల సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. తమ పార్టీలకు మద్దతుగా ఉండే వారిని నియమించాలనే లక్ష్యంతో విధుల్లో ఉన్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. చివరకు రాజీనామాలు చేసే స్థితికి తీసుకొస్తున్నారు. అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునేలా.. పొదుపు సంఘాలను సమన్వయం చేసేలా, స్థానికంగా ఉండే గ్రామాల్లో ఉన్న పొదుపు సంఘాల తీర్మానం ద్వారా ఒక వ్యక్తిని వీవోఏగా నియమించుకుంటారు. తీర్మానం కాపీని ఏపీఎంకు పంపి, సదరు వీవోఏ పేరును ఆన్లైన్ చేస్తారు. వీవోఏ ప్రభుత్వం, సంఘాల మధ్య వారధిగా ఉంటూ సంఘాల అభివృద్ధికి సాయం చేస్తుంటారు. వీరి నియామకంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు సంబంధం ఉండదు. వీవోఏలకు ప్రస్తుతం రూ.8 వేలు వేతనం రావడంతో కూటమి నాయకులు ఈ పోస్టుపై కన్నేశారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను నియమించుకునే క్రమంలో ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఇలా.. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 42,343 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గ్రామ సంఘాలు 1353 ఉండగా, మొత్తం సంఘాల్లో 4,33,290 మంది సభ్యులు ఉన్నారు. వీరందరినీ సమన్వయ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 12,062 మంది వీవోఏలు ఉన్నారు. జిల్లాలో 42 మందిని తొలగించి వీరి స్థానంలో కూటమి నేతలకు అనుకూలంగా ఉండే 42 మందిని కొత్తగా నియమించారు. ఈ ప్రక్రియను కొనసాగించి ఉన్నవారిలో సగం మందిని తొలగించి అనుకూలంగా ఉన్నవారిని నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 42 మంది వీవోఏల తొలగింపు జిల్లాలో సగం మందికి పైగా తొలగించడమే లక్ష్యం! -
మే 11న సుందరగిరిపై నృసింహ జయంతి వేడుకలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి జయంతి (ఆవిర్భావ)వేడుకలు మే 11న వైభవంగా జరుగనున్నాయి. ఆరోజు స్వాతి నక్షత్రం, చతుర్దశి తిథి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 7.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు అర్చకులు, పండితులు విశేష ద్రవ్యాలతో అష్టోత్తర శతకలశ అభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత సుదర్శన నృసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ అనంత మూలమంత్ర హోమాలు, విశేష నివేదనలు, పంచ హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వినియోగం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతాయని నృసింహ ఉపాసకులు కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మి నరసింహ గురూజీ తెలిపారు. మధ్యాహ్నం అన్నసమారాధన జరుగుతుందన్నారు. రూ.1,116 చెల్లించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే దంపతులకు స్వామివారి శేష వస్త్రంతో పాటు, ప్రసాదాలను అందిస్తారని చెప్పారు. వివరాలకు 99085 63958, 99122 81886 నంబర్లలో సంప్రదించాలన్నారు.మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో బారులు దీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంనకు చెందిన శ్రీ విజయదుర్గ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,43,328 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. 1200 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. దేవస్థాన పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఏర్పాట్లు చేశారు. -
ఉపాధి కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి
భీమడోలు: ఉపాధి కార్మికులకు రెండు నెలలుగా రావాల్సిన వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అన్నారు. భీమడోలు సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి మండల నాయకులు కె.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసిన వేలాది మంది కార్మికులకు గత మూడు నెలలుగా ఒక్క రూపాయి వేతనం ఇవ్వకపోవడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎండీఎం నిర్వాహకులకు రెండు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. చిరుద్యోగులు, కూలీల వేతన బకాయిలను నెలల తరబడి పెండింగ్ పెట్టడం దారుణమన్నారు. తక్షణమే వేతన బకాయిలను విడుదల చేయకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా భాస్కరరావు, శ్రీనివాస్, పద్మ, భారతి, బేబి, బీబీ తదితరులు పాల్గొన్నారు. -
‘సూపర్ సిక్స్’ అమలుకు ప్రభుత్వంపై ఉద్యమించాలి
బుట్టాయగూడెం: ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఉద్యమించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. జీలుగుమిల్లి మండంలో వైఎస్సార్సీపీ అనుబంధ పదవులు పొందిన నాయకులు మంగళవారం రాత్రి బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో బాలరాజు గృహంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త తెల్లం రాజ్యలక్ష్మిలకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా అవి ఆచరణకు రావడం లేదన్నారు. అదేవిధంగా మహిళల కోసం ఏర్పాటు చేస్తామన్న ఉచిత బస్సు ఊసే ఎత్తడంలేదని అన్నారు. రైతులకు రైతు భరోసా పథకం లేక ఖరీఫ్, రబీ సీజన్లో కూడా నానా కష్టాలు పడుతూ వ్యవసాయం చేశారని అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని విమర్శించారు. తల్లికి వందనం ఎప్పడిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, అలాగే వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిగేటట్లు చేశారని, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరికో బెల్టుషాపు పెట్టి మద్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, జిల్లా కార్యాచరణ కార్యదర్శి బోదా శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర సెక్రటరీ బూరుగు ఫ్రెడరిక్ ప్రేమ్కుమార్, నాయకులు సున్నం సురేష్, చిట్టిబొమ్మ శ్రీను, కొప్పుల సత్యనారాయణ, ఉప్పల రాంపండు, రంగుల రమేష్, వెంకట్, ఆకుల రవి, బొంతు వెంకట్, చిన్నరాముడు, వంకా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు -
బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పనిచేస్తుందని ఆ సంఘ నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. మంగళవారం స్థానిక అంబిక ఫ్లేవర్స్ ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ బ్రాహ్మణులు సామాజికంగా అభివృద్ధి చెందిన వారి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థికంగా అట్టడుగున ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. అలాగే బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందించాలని, వ్యాపారాలు చేసుకోవడానికి రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హెచ్కే మోహనరావు, కోశాధికారిగా పులిపాక ప్రసాద్, అడ్వైజరీ కమిటీ చైర్మన్గా సత్యవాడ దుర్గా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన బ్రాహ్మణులు గండ్లూరి దత్తాత్రేయ శర్మ, గుండు రామనాథ శాస్త్రి, బులుసు అపర్ణ, ఓరుగంటి వెంకట రమణ, శంకరమంచి సుబ్రహ్మణ్య శాస్త్రి, గోపాలుని హరిహరరావు, గామోజీ అపర్ణ ప్రసాద్, సూరంపూడి వీరభద్రరావు, విష్ణుదాస్ శ్రీకాంత్లను ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. -
వక్ఫ్ సవరణ బిల్లుపై రాజీలేని పోరు
కై కలూరు: వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర వెనక్కి తీసుకునే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ముస్లిం సోదరులు ముక్తకంఠంతో చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా కై కలూరు మాగంటి సెంటర్ నుంచి ఏలూరు రోడ్ వరకు ముస్లింలు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. తాలూకా సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి, రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తులు పరిరక్షించుకోడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునే వరకు కేంద్రంతో పోరాడతామన్నారు. లౌకిక, అభ్యుదయ వాదులందరూ మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో ఎండీ.జానీ, షేక్ రఫీ, రఫీ బాషా, షాబుద్దీన్, గఫూర్, షేక్ మూసా, ఎండీ సిరాజ్, ఎండీ ఉస్మాన్, షేక్ సుభానీ, ఖాదర్ బాషా పాల్గొన్నారు. -
పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని బౌబ్రిడ్జి మీదుగా వెళుతున్న తాగునీటి ప్రధాన పైపులైన్ లీకేజీని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బౌబ్రిడ్జి వద్ద ఎన్నో ఏళ్లుగా పైప్లైన్కు లీకేజీలు ఏర్పడుతుండడంతో నీరు వృథాగా పోతోంది. అంతేగాక పలు ప్రాంతాల్లో సైతం ఏర్పడిన లీకేజీల ద్వారా నీరు కలుషితమవుతోందని, తోక పురుగులు వస్తున్నాయని ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సాక్షి కథనాలను ప్రచురించింది. ఎప్పటికప్పుడు అధికారులు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడం.. మళ్లీ కొన్నాళ్లకు లీకేజీలు ఏర్పడడం షరామామూలే. ప్రస్తుతం దీనిపై స్పందించిన అధికారులు ప్రధాన పైపులైన్కు ఏర్పడిన లీకేజీని అరికట్టేందుకు రూ.2 లక్షల వ్యయంతో కాస్ట్ ఐరన్ పైపును లింక్ చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో అధికారులు ఎంఈ వెంకటరమణ, డీఈలు వెంకటేశ్వరరావు, పవన్ ఆధ్వర్యంలో ఈపనులు చేపట్టారు. దీంతో సమస్య పరిష్కారమైంది. -
బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి
బ్రాహ్మణుల అభివృద్ధికి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పనిచేస్తుందని కార్యవర్గ సభ్యులు తెలిపారు. మంగళవారం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. 8లో uనాటకాన్ని నిలబెడుతున్న కళాపరిషత్లు జిల్లాలోని పలు సంస్థలు పరిషత్లు నిర్వ హిస్తూ నాటక రంగాన్ని పోషిస్తున్నాయి. తోలేరుకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర నాటక కళాపరిషత్, వీరవాసరా నికి చెందిన వీరవాసం కళా పరిషత్, భీమవరానికి చెందిన చైతన్య కళాభారతి, కళారంజని కళా పరిషత్లు.. ఏలూరుకు చెందిన హేలాపురి కళాపరిషత్, గరికపాటి కళా పరిషత్, పాలకొల్లు నాటక కళా పరిషత్ సంస్థలు ఏటా నాటక పోటీలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని ప్రముఖ సంస్థలకు చెందిన కళాకారులను ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి, పోటీలతో పాటు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. 1995లో రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలు ప్రారంభించి నంది అవార్డులను ఇస్తోంది. అప్పటి నుంచి జిల్లాకు చెందిన ఎంతో మంది నాటికల పోటీల్లో పాల్గొన్నా నంది అవార్డులు మాత్రం దరిచేరలేదు. 2009లో ఖాజావలీ దర్శకత్వంలో ప్రదర్శించిన ఎవరో ఒకరు సాంఘిక నాటకం బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు గెలుచుకుంది. ఆ తరువాతి సంవత్సరం వలీ దర్శకత్వంలోనే 2010లో ౖసైసె జోడెడ్ల బండి నాటకానికి బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు వరించాయి. 2012లో మహాసాధ్వి శకుంతలకు వెండి, కాంస్య నంది, 2017లో ఇంద్రసింహాసనం పౌరాణిక నాటకానికి బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు వచ్చాయి. -
వరిసాగులో యంత్రాల జోరు
పెంటపాడు: వరి సాగులో రైతులు కొత్తవంగడాలు వినియోగించడంతో పాటు వినూత్న రీతిలో సాగు చేస్తున్నారు. దీనిలో భాగంగా యంత్రాల వినియోగం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. రైతుల ఆలోచనలకు తగ్గుట్టు యంత్రాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులు మినహా మిగిలిన రైతులు యంత్రాలు కొనుగోలు చేసి వరి సాగులో జోరుగా వాటిని వినియోగిస్తున్నారు. మరికొందరు రైతులు యంత్రాలను అద్దెకు తీసుకొంటూ సాగు చేస్తున్నారు. వరి సాగు ప్రారంభంలో ట్రాక్టర్లతో దమ్ములు చేయడంతో పాటు వరి నాట్లు వేయడంలోనూ యంత్రాలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వరి కోతలు సమయం కావడంతో యంత్రాల సాగు జోరుగా ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు అనుగుణంగా రాత్రి పగళ్లు పొలాల్లో బీజీగా గడుపుతూ యంత్రాల సాయంతో నూర్పులు చేపడుతున్నారు. కాగా ప్రస్తుతం దాళ్వా మాసూళ్ల విషయంలో రైతులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో సరిగ్గా కోతల సమయంలోనే వర్షాలు కురుస్తూ, ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో యంత్రాల వినియోగం రైతులకు మేలు చేస్తోంది. వినియోగంపై ఆసక్తి తక్కువ సమయంలో ఎక్కువ పని చేసేందుకు అలాగే పెట్టిన రాబడి రాబట్టుకొనేందుకు రైతుల యంత్రాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎకరా సాగు చేసేందుకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అదే యంత్రాలు ఉపయోగించి సాగు చేస్తే రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు అవుతోంది. అలాగే ప్రస్తుతం ఎకరం వరి కోత కూలీలకు రూ.5500 కాగా, అదే యంత్ర సాయంతో రూ.2400 ఖర్చు అవుతోంది. దీంతో సగానికి పైగా ఖర్చు తగ్గుతోంది. ఏళ్ల తరబడి వ్యవసాయ పనులను నమ్ముకున్న కూలీలకు యంత్రం వల్ల ఉపాధి లేకుండా పోయింది. దీని వల్ల వారు పనుల కోసం వలసబాట పడుతున్నారు. కొంతమంద కూలీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకొంటూ ఉపాధి పొందుతున్నారు. యంత్రాలపైనే ఆసక్తి చూపుతున్న రైతులు ప్రస్తుతం యంత్రాలతో ముమ్మరంగా వరికోతలు ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలు సమయం, ఖర్చు ఆదా ప్రస్తుతం వరికొతలను యంత్రాల ద్వారా సాగు చేస్తున్నారు. తక్కువ సమయంతో పాటు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. దీంతో మాకు కొంత పెట్టుబడి మిగులుతుంది. ప్రస్తుతం దాళ్వా కోతల సీజన్ కావడం తో యంత్రాలతో మాసూళ్లు చేపడుతున్నాం. – తోరం సుబ్బన్న రైతు, పడమరవిప్పర్రు పెట్టుబడి తగ్గుతుంది ప్రసుత్త వరి కొతలను యంత్రాల సాయంతో చేయడం వల్ల అనుకున్న సమయాని కంటే ముందే పని పూర్తవువుతోంది. ఎకరా కోత నూర్పు చేయడానికి రూ.3600 ఖర్చు అవుతోంది. అదే కూలీలను పెట్టి కోస్తే రూ.5 వేలు అవుతుంది. – పాలా గణపతి, కొండేపాడు -
ఎస్ఆర్కేఆర్ ప్రోత్సాహంతో ఉన్నత స్థానం
ఉప రాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సుమ భీమవరం: స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహమే తమ ఉన్నతికి కారణమని డీఏఎన్ ఐపీఎస్ అధికారిణి, ఢిల్లీ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్, భారత ఉపరాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ మద్ద సుమ అన్నారు. మంగళవారం తాను చదువుకున్న ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తన భర్త, కళాశాల పూర్వ విద్యార్థి, శ్యాంసంగ్ ఆర్అండ్డీ విభాగం జనరల్ మేనేజర్ బి అనిల్ కుమార్తో కలిసి వచ్చి ఈసీఈ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని సుఽమ స్పష్టం చేశారు. తన సోదరుడు ఎం నీలాజలం కూడా ఇక్కడే చదివి అనంతరం పీజీ చేసి పోటీ పరీక్షల్లో విజయం సాధించి భీమవరంలోనే ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్, ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి వారిని అభినందించారు. -
పూర్వ వైభవం దక్కేనా!
ఇళ్ల గల్లంతుపై మళ్లీ విచారణ పోలవరం ప్రాజెక్టులో ఇళ్లను కోల్పోతున్న అర్హులైన నిర్వాసితుల పేర్లను తొలగించగా.. మళ్లీ ఈ పేర్లపై విచారించాలని తాజాగా ఆదేశాలు అందాయి. 8లో uబుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఏలూరు (ఆర్ఆర్పేట): కందుకూరి వీరేశలింగం పంతులు వ్యవహార ధర్మబోధిని నాటకాన్ని రచించి, తొలిసారిగా రంగస్థలంపై ప్రదర్శించిన రోజు కావడంతో ఏటా ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అప్పట్లో టిక్కెట్లు కొని నాటకాలు చూసేవారు. ప్రముఖ కళాకారుల నాటకాలు చూసేందుకు జనం ఎగబడేవారు. అనంతరం సినిమాలు, టీవీలు, ఇటీవలి మొబైల్ ఫోన్లు రావడంతో నాటకాలకు ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక నాటక కళా పరిషత్లు పోటీలు నిర్వహిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి. నాటక రంగానికి ఊపిరులూదే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందరో మహానుభావులు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎందరో నాటక రచయితలు అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందారు. తిరుపతి వేంకట కవుల గురించి పరిచయం అవసరం లేదు. అనేక పౌరాణిక నాటకాలు రచించి నటులు, దర్శకులకు మార్గదర్శకులయ్యారు. మత్స్యపురికి చెందిన కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్నే ఉర్రూతలూగించింది. నేటికీ ఆ నాటకం పేరు చెబితే అందులోని హాస్య సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతాయి. దెందులూరుకు చెందిన ఎన్ఆర్ నంది రచించిన మరో మొహంజదారో నాటిక అప్పట్లో ఉర్రూతలూగించింది. ఏలూరుకు చెందిన కోడూరుపాటి సరస్వతి రామారావు రచించిన సాని– సంసారి నాటిక సాంఘిక నాటకాలకు దిక్సూచిగా నిలిచింది. అలాగే బందా కనకలింగేశ్వర రావు నాటకాల్లో నృత్యాలను, పాటలను ప్రవేశపెట్టి నాటకాలను ప్రజారంజకంగా మలచడంలో కీలకపాత్ర పోషించారు. జిల్లాకు చెందిన రచయితలు చేసినన్ని ప్రయోగాలు నాటకరంగంలో మరెవరూ చేయలేదు. నాటక రంగంపై చెరగని ముద్ర జిల్లాకు చెందిన అనేక మంది కళాకారులు తెలుగు నాటక రంగంపై చెరగని ముద్ర వేశారు. పౌరాణిక నాటకాల్లో షణ్ముఖి ఆంజనేయరాజు అగ్రగణ్యుడు. ఆయన పద్యాలు అందుకుంటే రసాస్వాదనలో ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యేవారు. తాడేపల్లిగూడెంకు చెందిన మద్దాల రామారావు నాటక రంగంపై తనదైన ముద్ర వేశారు. అనేక మంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కళాకారులు నాటకరంగాన్ని ఒక ఊపు ఊపారు. న్యూస్రీల్సాంఘిక నాటకంపై తాళాబత్తుల ముద్ర పాలకొల్లుకు చెందిన తాళాబత్తుల వెంకటేశ్వర రావు సాంఘిక నాటక రంగంలో గుర్తింపు పొందారు. ఉపాధ్యా యుడిగా పని చేస్తున్నప్పటికీ నాటక రంగంపై మక్కువతో అనేక నాటకాలు రచించడంతో పాటు నటుడిగా రాణిస్తున్నారు. ఆయన రచించిన సైకత శిల్పం, నాన్నా నేనొచ్చేసా, అనూహ్యం, తప్పుటడుగులు, సప్త పది, దిష్టిబొమ్మలు, నాన్నా నన్ను క్షమించండి, మనిషికీ మనిషికీ మధ్య వంటి సంచలన విజయాలు అందుకున్నాయి. తాళాబత్తుల కృషికి రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఆయనను కందుకూరి పురస్కారంతో సత్కరించింది. జిల్లాలో నాటకాలకు పెరుగుతున్న ఆదరణ నాటకాలతో ప్రజలను చైతన్యపర్చిన ఉమ్మడి పశ్చిమ గోదావరి పరిషత్ల నిర్వహణలో నాటక రంగ పోషణ నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం ప్రభుత్వం ఆదరించాలి మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నాటక రంగానికి ఆదరణ తగ్గుతోంది. కరోనా అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 కొత్త పరిషత్లు వచ్చాయి. నేటి తరంలో నాటకరంగంపై ఆసక్తి కలిగించడానికి ప్రాథమిక విద్యలో నాటకరంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో నాటకాలను ప్రదర్శించేలా ప్రోత్సహించాలి. నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. – బుద్దాల వెంకట రామారావు, బీవీఆర్ కళాక్షేత్రం అధినేత, తాడేపల్లిగూడెం -
పేదోడిపై ప్రతాపం.. బడాబాబులపై కనికరం
ఉండి: ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే ఎవరైనా ఉపేక్షించం అంటూ ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే సామాన్యులు, పేదలు ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లను కూలగొట్టి వారిని రోడ్డున పడేశారు. వారికి ప్రత్యామ్నాయాలు చూపకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. అయితే బడాబాబులు, అధికార పార్టీ నేతలు ఆక్రమించుకున్న స్థలాల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పొట్టకూటికోసం రోడ్ల పక్కన చిన్న బడ్డీ కొట్లు, రేకులతో తాత్కాలికంగా షెడ్లు నిర్మించుకున్న వారిపై, రోడ్ల పక్కన చేపలు, మాంసం దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారిపై ప్రతాపం చూపించారు. ఆకివీడు, పాలకోడేరు మండలాల్లో నిరుపేదల ఇళ్లను కూలగొట్టారు. పరీక్షల సమయం దయచేసి కరెంటు ఇవ్వండి.. తరువాత ఏదో చోటికి వెళ్ళిపోతాం అని విద్యార్థులు వేడుకున్నా కనికరించలేదు. నిరుపేదలు, చిరువ్యాపారులపై ప్రతాపం చూపించిన అధికారులు బడాబాబులు ప్రభుత్వ స్థలాలు, పంటబోదెలు ఆక్రమించుకున్నా అవి ఆక్రమణలు కావు అన్నట్లు కన్నెత్తి కూడా చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఆక్రమణలు కావా ? ఉండి గణపవరం రోడ్డులో పంటబోదెను ఆక్రమించుకుని భారీ షెడ్డు నిర్మించగా.. పక్కనే ఉన్న ఓ రొయ్యల ఫ్యాక్టరీ యజమాని పంటబోదెను ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసినా, మద్యం దుకాణం ఏర్పాటు చేసి బోదె ఆక్రమించుకున్నా గానీ అధికారులకు కనిపించడం లేదు. బడాబాబులపై ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నారని విమర్శిస్తున్నారు. భారీ ఆక్రమణలకు ఎదురుగా కాలువ పక్కగా కొంతకాలం క్రితం పూరిపాకలు నిర్మించు కుని జీవిస్తున్న కొందరి ఇళ్ళను పీకి పారేశారు. ఎదురుగా ఉన్న భారీ ఆక్రమణలు మాత్రం కనిపించలేదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత వేసవి ఎండల్లో చేసేది లేక చిరువ్యాపారులు ఎండల్లోనే పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. రోడ్ల వెంట చిరు వ్యాపారులు, పేదల షెడ్ల తొలగింపు పంట బోదెలు ఆక్రమించుకున్న పెద్దలపై మెతక వైఖరి -
సమష్టిగా కృషి చేయాలి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసే దిశగా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బీ.శ్రీలత అన్నారు. మంగళవారం ఏలూరులోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో జిల్లాలోని ఎకై ్సజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీలత మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణంగా నాటుసారాను నిరోధిస్తూ నాటుసారా రహిత జిల్లాగా మార్చివేసేలా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత పెండింగ్లోని కేసులపై విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. కేసులు పెట్టినా తీరు మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ కేవీఎం ప్రభుకుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఏ.అవులయ్య, ఏఈ ఎస్.అజయ్కుమార్ సింగ్, పాండురంగారావు, ఏలూరు జిల్లాలోని 7 ఎకై ్సజ్ సర్కిళ్ళ సీఐలు, ఎస్సైలు ఉన్నారు. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత -
భూసేకరణ వేగవంతం చేయాలి
ఇన్చార్జి కలెక్టర్ ధాత్రిరెడ్డి ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై ఇన్చార్జ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించి భూసేకరణ ద్వారా సేకరించిన భూములలో కొందరు రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే చెల్లించి భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. పామర్రు–దిగమర్రు 165 జాతీయ రహదారిలో కై కలూరు మండలం గోనేపాడు, తదితర గ్రామాలలో భూసేకరణ పనులను సంబంధిత రైతులతో మాట్లాడి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
కై కలూరు: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ 134వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. డీఎన్నార్ మాట్లాడుతూ అంబేడ్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని.. రాజకీయ అవకాశాలు అనేక మందికి దక్కుతున్నాయంటే రిజర్వేషన్ల రూపంలో అంబేడ్కర్ చూపిన కృషే కారణమన్నారు. మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి చేటు అని సత్యాన్ని ఆయన సమాజానికి సూచించారన్నారు. అణగారిన వర్గాల అభ్యన్నతి కృషి చేసిన ఆయన కృషిని చరిత్ర మరువదని చెప్పారు. వైఎస్సార్సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ కీలక భూమిక పోషించారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ గంటా సంధ్య మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అనంతరం డీఎన్నార్ కలిదిండి మండలం మూలలంకలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, బీసీ సెల్ సెక్రటరీ బలే నాగరాజు, యాక్టివిటీ సెక్రటరీ మహాదేవ విజయబాబు, కై కలూరు అసెంబ్లీ నియోజకవర్గ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు సాక్షి సాయిబాబు, కుర్మా నెహెమ్యా, మహ్మద్ గాలిబ్బాబు, పరింకాయల వెంకటేశ్వరారవు, బోయిన చంద్ర భోగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాము, బేతపూడి ఏసేబు రాజు తదితరులు పాల్గొన్నారు. -
బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి కృషి
అంబేడ్కర్ మార్గంలో నడవాలి : మండలి చైర్మన్ వీరవాసరం: బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు పిలుపునిచ్చారు. నందమూరి గరువులో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అంబేడ్కర్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, సర్పంచ్ మేకల వెంకట చలపతి, మెంటే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): అందరి సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగధనుడు బీఆర్ అంబేడ్కర్ అని ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అన్నారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్బంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఇన్చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అంబేడ్కర్ ధాత్రిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దాసరి ఆంజనేయులు, డాక్టర్ మెండెం సంతోష కుమార్, మేతర అజయ్బాబు, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జేడీ వి.జయప్రకాష్, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్.కృపావరం, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్కు నివాళి అంబేద్కర్ కాంస్య విగ్రహానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ సోమవారం నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటే దానికి కారణం అంబేడ్కర్ మార్గదర్శకాలేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పాపాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తంటాలు
● అబద్ధమంటూనే గోవుల మరణాలు అంగీకరించారు ● మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం అర్బన్: టీటీడీ గోశాలలోని గోవులు మరణిస్తే.. అబద్ధమంటూనే చివరకు మరణాలను అంగీకరించారని, తమ పాపాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ గోవుల మృతి పట్ల అవాస్తవాలు చెప్పడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బ తీశారన్నారు. దేవస్థానం ఈఓ శ్యామలరావు తన బాధ్యతలను పక్కనబెట్టి టీడీపీ సభ్యుడిగా ఆ పార్టీ అజెండా మోస్తున్నట్లు ఉందని విమర్శించారు. గోశాలలో గోవుల మృతిపై 22 గోవులు అని ఒకసారి, 40 గోవులు అని మరోసారి చెప్పారని.. చివరకు ఆలయ ఈఓ 43 గోవులు మృతిచెందాయని చెప్పారన్నారు. గోవులు మృతి చెందితే ఆందోళన ఎందుకని దేవస్థానం నిర్వాహకులు వ్యాఖ్యానించడం శ్రీవారి సేవల పట్ల వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు కలుస్తున్నాయని ఆరోపణలు చేస్తూ భక్తులను మనోవేదనకు గురి చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలు వైఎస్సార్సీపీకి ముడిపెడుతూ వైఎస్ జగన్మోహనరెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికీ తన మోసపూరిత నైజాన్ని విడవలేకపోతున్నాడని విమర్శించారు. -
వర్జీనియా రైతుకు నిరాశే !
బరువు 150 కేజీలు దాటకూడదు బేళ్ల బరువు 150 కేజీలు దాటకుండా చూసుకోవాలి. గ్రేడింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హీట్, సాఫ్ట్ లేకుండా గ్రేడ్ల ఆధారంగా పొగాకు సిద్ధం చేసుకోవాలి. అవశేషాలు లేకుండా ఎగుమతికి ఆమోదయోగ్యంగా ఉండే పొగాకును పండించుకోవాలి. – బి.శ్రీహరి, వేలం సూపరింటెండెంట్, జంగారెడ్డిగూడెం కేంద్రం–1 ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ ఏడాది పంటకు పెట్టుబడులు, ఖర్చులు, కౌలు పెరిగాయి. సరాసరి రూ.300 వస్తేనే రైతుల కష్టాలు తీరతాయి. ప్రస్తుత ధరలు చూస్తే భయమేస్తుంది. ఇలానే కొనసాగితే రైతులు నష్టాల పాలవ్వడం ఖాయం. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం అధికారులే చొరవ చూపాలి ప్రస్తుతం పొగాకు మార్కెట్ ధర చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్డు అధికారులు కలుగజేసుకుని రైతులకు మంచి ధర పలికేలా కృషి చేయాలి. లేనిపక్షంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయాల్సి ఉంటుంది. – కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఏలూరు బుట్టాయగూడెం: ఎన్నో ఆశలతో పొగాకు పంట వేసిన రైతుకు ఈ ఏడాది నిరాశ తప్పేలా లేదు. గత రెండేళ్లుగా పొగాకు పంటకు రికార్డు స్థాయిలో ధర రావడంతో ఈ ఏడాది రైతులు భూమి కౌలు, పెట్టుబడిని సైతం లెక్క చేయకుండా పంట వేశారు. గత నెల 24న ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు మొదటి రోజే ధర రైతులను నిరాశ పరిచింది. కిలో పొగాకుకు సరాసరి రూ.300 వస్తుందని రైతులు ఆశపడ్డారు. అయితే రూ.290 పలుకడంతో రైతులు ఢీలా పడిపోయారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై 20 రోజులు దాటినప్పటికీ ధరలో మార్పు లేకుండా మార్కెట్ ధర నిలకడగా ఉండడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రసుత్తం పొగాకుకు సరాసరి ధర రూ.278 రాగా కనిష్ట ధర రూ.265 పలికింది. గరిష్ట ధర రూ.290 పలుకుతోంది. ధరలు ఇలా కొనసాగితే తీవ్ర నష్టాల పాలవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా రాజమండ్రి పొగాకు బోర్డు రీజియన్ పరిధిలో ఈ ఏడాది సీజన్లో సుమారు 70 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి అవుతుందని బోర్డు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, కొనుగోలుదారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాతావరణంలో మార్పుల కారణంగా ఆకు గుల్లబారి తూకం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు బోర్డు సుమారు 56.88 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. గతేడాది మార్కెట్లో పొగాకు కిలో గరిష్టంగా రూ. 410 పలికింది. దీంతో అధిక సంఖ్యలో రైతులు పొగాకు సాగు చేశారు. బోర్డు అనుమతి లేకుండా సుమారు 8 వేల హెక్టర్లలో పంట సాగు చేస్తున్నట్లు సమాచారం. అదనపు పంటతో చిక్కులు బోర్డు అధికారులు ఇచ్చిన అనుమతి కంటే అదనంగా సాగు చేయడం వల్ల చిక్కులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల పరిధిలో 12 మిలియన్ కిలోల పొగాకు పండించినట్లు సమాచారం. గత రెండేళ్లుగా పొగాకు ధరలు అధికంగా రావడంతో ఈ ఏడాది జీడిమామిడి, మామిడి, ఇతర పంటలను తొలగించి కొత్తగా రైతులు కూడా పొగాకు సాగు చేశారు. అధికంగా రూ.లక్ష వరకూ కౌలుకు తీసుకుని సారంలేని భూముల్లో పొగాకు పండించడం వల్ల లోగ్రేడ్ పొగాకుగా పండినట్లు సమాచారం. రెండేళ్లుగా బ్రెజిల్, జింబాబ్వే వంటి దేశాల్లో పొగాకు పంట ఆశించినంతగా పండకపోవడంతో ఇక్కడ పంటకు అధిక ధరలు వచ్చాయి. ఈ ఏడాది ఆశించిన దాని కంటే 20 శాతం అదనంగా పంట వేయడంతో ధరలు కూడా ఆశించిన స్థాయిలో రాకపోవచ్చని చెబుతున్నారు. ఆశాజనకంగా లేని పంట ధరలు కిలో సరాసరి ధర రూ.278 రూ.300 వస్తే గానీ గిట్టుబాటు కాదంటున్న రైతులు అమ్మకాలకు ఆసక్తి చూపని రైతులు బోర్డు అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి 5 కంపెనీలు మాత్రమే కొనుగోలు ప్రస్తుతం పొగాకు బేళ్ల కొనుగోల్లు మందకొడిగా సాగుతున్నాయి. ప్రారంభంలో కిలో గరిష్ట ధర రూ. 290, కనిష్ట ధర రూ.265, సగటు ధర రూ. 280.31 లభించింది. బేళ్ల కొనుగోళ్లలో 9 కంపెనీలు పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం 5 కంపెనీలే పాల్గొంటున్నాయి. వీటిలో 90 శాతం ఐటీసీ మాత్రమే కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం రైతులు కూడా బేళ్లను అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు. కొనుగోళ్లు ప్రారంభానికి, చివరకు ధరల్లో వ్యత్యాసం ఉంటుందని రైతులు చెబుతున్నారు. -
తృటిలో తప్పిన ముప్పు
యలమంచిలి: మండలంలోని అడవిపాలెం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని ధ్వజ స్తంభం ఆదివారం రాత్రి భారీ ఈదురుగాలులకు నేలకొరిగింది. ధ్వజ స్తంభం అడుగు భాగంలో చెక్క పొట్టుగా రాలడం వల్లే నేలకొరిగిందని భావిస్తున్నారు. ధ్వజ స్తంభం కూలిన శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ధ్వజస్తంభం పక్కనే ఉన్న రైతు భవనంపై పడడంతో ఏ ప్రమాదమూ జరగలేదు. 42 అడుగుల ధ్వజస్తంభాన్ని గ్రామస్తుల సహకారంతో నాలుగేళ్ల క్రితం ప్రతిష్ఠించారు. నేడు ఆక్వా రైతుల సమావేశం భీమవరం: సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం పట్టణం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మంగళవారం ఆక్వా రైతులు సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ సోమవారం చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన ఆక్వా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని అన్నారు. ఆక్వా సమస్యల నుంచి ఆక్వా రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చో ఈ సదస్సులో వివరిస్తారని సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.బలరాం హాజరవుతారని గోపాలన్ చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే సదస్సులో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 21 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు భీమవరం: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి వేంకటేశ్వరస్వామి 14వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా కల్యాణం, రథోత్సవం, వైభవోత్సవం, ఊరేగింపు, ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కుక్కల బాల, జీవీఐటీ అప్పారావు, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పత్తి హరివర్థన్, యర్రంశెట్టి శివకృష్ణ, ముచ్చకర్ల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షంతో అంతటా నష్టం
కై కలూరు: అకాల వర్షాలతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షానికి పలుచోట్ల వరిచేలు, మామిడి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రధానంగా విపరీతమైన ఈదురు గాలులు.. వడగండ్ల వర్షంతో కై కలూరు నియోజకవర్గం చిగురుటాకులా వణికిపోయింది. ఆదివారం రాత్రి నుంచి వీచిన గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడడంతో పాటు దాదాపు 192 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు చిమ్మచీకట్లలో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ప్రధానంగా విద్యుత్శాఖకు భారీ నష్టం కలిగింది. ఆక్వా చెరువులపై విద్యుత్ స్తంభాలు ఎక్కువగా కూలబడ్డాయి. మండవల్లి మండలం పుట్లచెరువు వద్ద ఏపీ ట్రాన్స్కోకు చెందిన టవర్ నేలకూలింది. దీంతో మరో టవర్ నుంచి విద్యుత్ను మళ్లించారు. కై కలూరు టౌన్, రూరల్, కలిదిండి, మండవల్లి, ముదినేనపల్లి మండలాల్లో అనేక ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ తీగలపై పడ్డాయి. ఎక్కువ నష్టం కలిదిండి మండలంలో జరిగింది. కై కలూరు టౌన్లో గాలులకు వైర్లు తెగిపడ్డాయి. అనేక దుకాణా బోర్డులు ఊడి రోడ్లపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పిల్లలు ఫ్యాన్లు తిరగక దోమలతో నరకయాతన అనుభవించారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడ్డారు. చార్జింగ్లు లేక సెల్ఫోన్లు మూగబోయాయి. విద్యుత్ సరఫరా యుద్ధప్రాతిపాదికన పునరుద్ధరిస్తున్నామని విద్యుత్శాఖ డీఈ రామయ్య చెప్పారు. ఇదిలా ఉండగా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామ సమీప కొత్తమాలపల్లిలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు వీస్తున్న సమయంలో మేకా ఆదిలక్ష్మి (45) అనే మహిళ బయట వంట సామాగ్రి తీయడానికి వెళ్లగా ఆమైపె తాడిచెట్టు పడింది. కై కలూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. పూరి–తిరుపతి రైలుపై కూలిన వృక్షం కై కలూరు రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి ప్రయాణికుల కోసం నిలిచిన పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు పైన, విద్యుత్ తీగలపై స్టేషన్లో భారీ వృక్షం పడింది. ఆ సమయంలో ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయపడ్డారు. కొందరు రోడ్డు మార్గాన వెళ్లిపోయారు. రైల్వే శాఖ మూడు గంటలు శ్రమించి విద్యుత్ వైర్లను పునరుద్ధరించింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈకారణంగా గుడివాడ– భీమవరం రూటులో రైళ్లను దారి మళ్లించారు. నేలకూలిన వృక్షం కాళ్ల: కాళ్ళ మండలంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీవర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఒకపక్క కోతదశకు వచ్చిన వరిచేలు నేలకొరిగి నీటమునిగాయి. మరోపక్క ఆక్వా రైతులకు కునుకు లేకుండా పోయింది. తీవ్రంగా వీచిన గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాళ్ళ నుంచి భీమవరం వెళ్లే దారిలో జక్కరం వద్ద తెల్లవారుజామున భారీవృక్షం రాష్ట్రీయ రహదారిపై కూలడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సోమవారం వృక్షాన్ని తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. రైతన్న బెంబేలు గణపవరం: ఆదివారం రాత్రి ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రబీ రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అప్పటికే పగటి పూట ఎండబెట్టిన ధాన్యాన్ని సాయంత్రం రాశులుచేసి తడవకుండా బరకాలు, టార్ఫాలిన్లు కప్పి ఉంచడంతో వర్ష ప్రభావం పెద్దగా నష్టం చేయలేదు. కొంతమేర తడిసిన ధాన్యాన్ని రైతులు సోమవారం ఉదయం నుంచి ఎండబెట్టుకున్నారు. ఇక కోతలు కోయడానికి సిద్ధమైన రైతులు ఆఘమేఘాలపై వరికోతలు పూర్తిచేసి ధాన్యం రాశులు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. వర్షంనీరు చేలల్లో చేరడంతో రైతులు సోమవారం ఉదయం నుంచే చేలల్లో చేరిన నీటిని బయటకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దెబ్బతిన్న మామిడి తోటలు నరసాపురం రూరల్: నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని మామిడి, వరి పంటలు ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, అకాల వర్షంతో దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలోని నరసాపురం, మొగల్తూరు మండాల్లో సుమారు రెండు వేలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొగల్తూరు, ముత్యాలపల్లి, పేరుపాలెం, మోడి, రుస్తుంబాద, సీతారామపురం, తూర్పుతాళ్లు, లక్ష్మణేశ్వరం, పసలదీవి, తదితర ప్రాంతాల్లో మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఆది నుంచి మామిడి రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చెట్లు మామిడిపూత సమయంలో బాగానే ఉన్నా తేనె మంచు కురవడంతో పూచిన పూత అంతా మాడిపోయింది. దీంతో ఉన్న కొద్దిపాటి పూత, పిందెలను నిలుపుకునేందుకు ఇప్పటికే ఐదారుసార్లు వివిధ క్రిమి సంహారక మందులు పిచికారి చేయడంతో కొంతమేర కాయ నిలబడింది. అయితే ఒక్కసారిగా ఆదివారం రాత్రి కురిసిన భారీగాలులతో కూడిన వర్షానికి మామిడితో పాటు వరి చేలు కూడా నేలనంటాయి. కై కలూరులో నేలకొరిగిన 192 విద్యుత్ స్తంభాలు పూరి–తిరుపతి రైలుపై కూలిన వృక్షం పలు మండలాల్లో నేలకొరిగిన వరిచేలు -
వివాదాస్పదంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
పెనుమంట్ర: నత్తారామేశ్వరం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వివాదస్పదంగా మారింది. ఇక్కడ పాత చిన్న విగ్రహం స్ధానంలో పూర్తి విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో గందరగోళం నెలకొంది. నూతన విగ్రహ ఏర్పాటుకు దళిత సంఘాల నేతలు కొన్నిరోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అధికారులు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై దళితులు నిరసన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన ప్రదర్శన చేశారు. కొందరు నాయకులు ఒత్తిడిలకు తలొగ్గి అధికారులు ఉద్దేశపూర్వకంగానే విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై రాకపోకలు నిలుపుదల చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. దీంతో పెనుమంట్ర ఎస్సై కె స్వామి జోక్యం చేసుకుని నాయకులకు నచ్చచెప్పారు. కొద్దిసేపు తర్జనభర్జనల అనంతరం ఎస్సై సమక్షంలో తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కేవీవీ సుబ్బారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం పెనుమంట్రలోని అంబేద్కర్ సెంటర్లో దళిత సంఘాల నాయకులు మరోసారి నిరసనకు దిగారు. అక్కడ కూడా ఎస్సై జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో నిష్క్రమించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. కాగా దళితులు ఎట్టకేలకు తాము అనుకున్న విగ్రహం కాకుండా మరో విగ్రహాన్ని తీసుకువచ్చి పీఠంపై నెలకొల్పి ఆవిష్కరించారు. -
21 నుంచి దివ్యాంగులకురాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో దివ్యాంగులకు ఈనెల 21 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్ సుందర్ వెల్లడించారు. వివిధ రకాల వైకల్యం గల కలిగిన 12 నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కోసం ప్రత్యేక ఒలింపిక్ భారత్ (ఎస్ఓబీ) సహకారంతో క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని కలిగించి పోటీల్లో పాల్గొనే విధంగా దివ్యాంగుల్లో చైతన్యం కలిగించాలని భవిత సెంటర్ ప్రత్యేక ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. క్రీడా పోటీలు నడక, బ్యాడ్మింటన్, సైక్లింగ్, బాల్ త్రో తదితర పోటీలు ఉంటాయని వివరించారు. కోకో రైతుల చలో గుంటూరు వాయిదా ఏలూరు (టూటౌన్): కోకో రైతులకు న్యాయం చేస్తామని ఈనెల 12వ తేదీన ఆగిరిపల్లి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 15న (రేపటి) చేపట్టనున్న చలో గుంటూరు కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ప్రకటించింది. సోమవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు. కోకో గింజలు కొనుగోలు, ధర సమస్యలను ఈనెల 7వ తేదీ లోపు పరిష్కారం చేస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. కోకో గింజల ధరల నిర్ణయ ప్రకటన చేయకపోవడంతో కంపెనీలు అతి తక్కువ ధర కొనుగోలు చేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చామని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో కోకో రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. దీంతో ఆందోళన కార్యక్రమం వాయిదా వేశామని, హామీ అమలు చేయకపోతే మరలా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని, పాత గింజలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీల మోసాలు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, ఉప్పల కాశీ నాయకులు పి.నరసింహారావు, వి.రాంబాబు, యలమాటి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకులో మోసంపై తహసీల్దార్కు ఫిర్యాదు
కాళ్ల: కాళ్ళ హెచ్సీ పెట్రోలు బంకులో ఘరానా మోసం బయటపడింది. రూ.100 పెట్రోలు కొట్టిస్తే కేవలం అర లీటరు పెట్రోల్ రావడంపై వినియోగదారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే కాళ్ళ గ్రామానికి చెందిన ఎం.సూరిబాబు బైక్లో పెట్రోల్ అయిపోవడంతో దారిలో ఆగిపోయింది. దీంతో దగ్గరలో ఉన్న హెచ్పీ బంకుకు వెళ్లి ఖాళీ వాటర్ బాటిల్లో రూ.100 పెట్రోలు కొట్టించాడు. తీరా చూస్తే బాటిల్లో అర లీటర్ పెట్రోలు రావడంతో విస్తుబోయి మెషిన్ని చూడగా 0.91 లీ. అని వచ్చింది. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని నిలదీశాడు. అదే సమయంలో మరో వ్యక్తి వచ్చి బాటిల్లో పెట్రోల్ పట్టమనగా మళ్లీ అదేవిధంగా అర లీటరు మాత్రమే రావడంతో పెద్ద ఎత్తున వాహనదారులు బంకులో చేస్తున్న ఘరానా మోసంపై స్థానిక తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లలో మోసాలు జరగకుండా తూనికలు, కొలతల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
లిఫ్ట్ ఇచ్చి దోచేస్తారు.. జాగ్రత్త
తణుకు అర్బన్: లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతున్నారా.. ఎవరైనా లిఫ్ట్ ఇస్తానంటే ఎక్కుతున్నారా అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. గురువుగారూ ఎక్కడ దింపమంటారు అంటూ ద్విచక్ర వాహనం ఆగినా.. బాబూ కొంచెం పైసెంటర్లో దింపుతారా అని మీరే అడిగినా మీపై దాడులు చేయడం ఆపై మీ జేబులు గుల్లయ్యే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త.. లిఫ్ట్ ఇచ్చినవారు మంచి వారైతే క్షేమంగా ఇంటికి చేరే పరిస్థితి. లేదంటే వారి పని అంతేనన్నట్లుగా ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. దీంతో అపరిచిత వ్యక్తులు ఎవరైనా రోడ్డుపై ఆపి లిఫ్ట్ అడుగుతున్నా, లిఫ్ట్ ఇస్తామన్నా నమ్మలేని పరిస్థితి దాపురించింది. నడి వయస్సు, వృద్ధులే లక్ష్యంగా.. కష్టపడలేక ఈజీ మనీకి అలవాటు పడుతున్న యువత ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. వాహనంలో లిఫ్ట్ ఇచ్చి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి గాయపరుస్తూ భయబ్రాంతులకు గురిచేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును సైతం దోచుకుంటున్నారు. ముఖ్యంగా నడి వయస్సు, వృద్ధులే లక్ష్యంగా ఈ దోపిడీ జరుగుతున్నట్లుగా బాధితవర్గాలు చెబుతున్నారు. అయితే సదరు దోపిడీదారులు చాలా భయానకంగా వ్యవహరిస్తున్నారని వాహనం నుంచి దించగానే మోకాళ్లపై కుర్చోపెట్టి మారణాయుధాలతో బెదిరించి లొంగని వారిపై దాడులకు పాల్పడుతున్నట్లుగా బాధితులు వాపోతున్నారు. ఇటీవల తణుకుకు చెందిన ఒక ప్రముఖ న్యాయవాది హైదరాబాద్కు వెళ్లి రాత్రి సమయంలో తణుకులో బస్సు దిగారు. ఇరగవరం రోడ్డులోని తన ఇంటికి వెళ్లేందుకు స్థానిక వెంకటేశ్వర థియేటర్ ప్రాంతంలో ఆటో కోసం ఎదురుచూస్తుండగా మోటార్సైకిల్పై వచ్చిన ఇద్దరు యువకులు తాము దింపేస్తామంటూ ఆయన్ను ఎక్కించుకుని కంపోస్టు యార్డు దగ్గరకు తీసుకువెళ్లి ఆయన దగ్గర ఉన్న రూ.1500 నగదు, సెల్ ఫోన్ దోచేశారు. బ్యాంకులో ఉన్న రూ. 2వేలు కూడా ఫోన్పే ద్వారా వారు బదిలీ చేసుకుని ఫోన్తో ఉడాయించారు. దీంతో మరుసటి రోజున ఆ న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసును ఛేదించిన పోలీసులు పైడిపర్రు కేంద్రంగా నివాసం ఉంటూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరవాసరం మండలం నవుడూరు గ్రామానికి చెందిన యువకుడు, బుట్టాయిగూడెం మండలం రామచంద్రపురానికి చెందిన ఒక యువకుడు కలిసి పైడిపర్రులో నివాసం ఉంటూ తణుకు పరిసర ప్రాంతాల్లో ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పైడిపర్రు పరిధిలోని వైజంక్షన్లో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 2.87 లక్షలు విలువైన 41 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరు తణుకు పట్టణ పరిధిలో 3, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చోరీల్లో పాల్గొన్నట్లు రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఈ తరహా చోరీల్లో బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా మరి కొందరు చెప్పుకోలేక ఇంటి దారి పడుతున్నారు. పోలీసు స్టేషన్లకు చేరని నేరాలు పదుల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తోంది. లిఫ్ట్ ఇచ్చి దాడులకు తెగబడుతున్న దొంగలు 6 కేసులకు సంబంధించి ఇద్దరి అరెస్ట్ అపరిచిత వ్యక్తులను ఆశ్రయించవద్దు ఎవరైనా రహదారుల్లో అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామంటే వద్దని చెప్పడమే మంచిది. లిఫ్ట్ ఇస్తానని వాహనం ఎక్కించుకుని దోపిడీ చేస్తున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. అపరిచిత వ్యక్తులను లిఫ్ట్ అడగకుండా ఉండడంతోపాటు, వాహనం ఎక్కండి లిఫ్ట్ ఇస్తానన్నా ఎక్కకుండా ఉండడమే క్షేమం. ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – ఎన్.కొండయ్య, తణుకు పట్టణ సీఐ -
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
బుట్టాయగూడెం: వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటం చేయక తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో ఆ సంఘం ఆధ్వర్యంలో వర్జీనియా పొగాకు రైతుల గిట్టుబాటు ధర సమస్యలపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం వర్జీనియా పొగాకు సరాసరి కిలోకు రూ.330 వరకూ వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చులు, కౌలు రేట్లు బాగా పెరిగాయని అన్నారు. అయితే గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది మార్కెట్ ధర ఉండే పరిస్థితి కనిపించడంలేదన్నారు. ఇప్పటికే వైట్ బార్లీ పొగాకు కొనుగోలు చేయడం లేదని చెప్పారు. వర్జీనియా పొగాకు రైతులకు తగిన ధర కల్పించేలా బోర్డు అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు సిరిబత్తుల సీతారామయ్య, బొడ్డు రాంబాబు, బిక్కిన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాలకూ ఆరాధ్యుడు అంబేడ్కర్
శాసనమండలి చైర్మన్ మోషేన్రాజు పెనుగొండ : దేశంలో అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఆరాధ్యుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. ఆదివారం ఆచంటలో సర్పంచ్ కోట సరోజని ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోషేన్రాజు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ప్రతిఒక్కరూ జయంతి వేడుకలు నిర్వహించే ఏకై క మహానేత, ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు నినాదంతో అంబేడ్కర్ చూపిన మార్గంలో పయనించి భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా చరిత్రలో నిలవాలన్నారు. వైఎస్సార్ సీపీ యువనేత చెరుకువాడ నరసింహరాజు(నరేష్) మాట్లాడుతూ అంంబేడ్కర్ అందరివాడన్నారు. యువకులంతా అంబేడ్కర్ చూపిన మార్గం చదువులో ముందుండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రమాదం జరిగే వరకూ పట్టించుకోరా? నూజివీడు : నూజివీడులోని బోర్వంచ రోడ్డు మలుపు వద్ద మార్జిన్లో పెద్ద అగాధం ఏర్పడి ప్రమాదభరితంగా ఉంది. గతేడాది ఆగస్టు 31న కురిసిన భారీ వర్షానికి ఇక్కడ రోడ్డు మార్జిన్ కొట్టుకుపోగా.. ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆర్అండ్బీ అధికారులు దీనిని పూడ్చేందుకు చర్యలు తీసుకోలేదు. ప్రమాదం జరిగే వరకూ పూడ్చరా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గోతిని పూడ్పించాలని కోరుతున్నారు. ఆర్థిక సాయానికి దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): షెడ్యూల్ కులాల అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్టు ఎస్సీ కా ర్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి ప్రకటనలో తలెఇపారు. అభ్యర్థులు సోమవారం నుంచి వచ్చేనెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లాకు ఎస్సీ కా ర్యాచరణ ప్రణాళిక కింద 1,111 యూనిట్లకు రూ.4644.05 లక్షల పథక విలువతో లక్ష్యాలను కేటాయించారన్నారు. సబ్సిడీగా రూ.1,835.30 లక్షలు, బ్యాంకు రుణాలుగా రూ.2,576.55 లక్షలు, లబ్ధిదారుల వాటాగా రూ.232.20 లక్షల నిర్దేశించారని పేర్కొన్నారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో సోమ వారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కారణంగా పీజీఆర్ఎస్ను రద్దు చేశామని పేర్కొన్నారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. ఈ ఆదివారం కూడా మంగమ్మతల్లి గుడి భక్తులతో కిటకిటలాడింది. మహిళ అదృశ్యంపై కేసు నమోదు కాళ్ల: భార్య కనిపించడం లేదంటూ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కాళ్ల పోలీసులు ఆదివారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కాళ్ళకూరు గ్రామానికి చెందిన పి.దివ్య(27) తన కుమారుడు మనోహర్షిత్తో కలిసి ఈ నెల 10న ఉదయం భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాలకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి రాకపోవడంతో భర్త భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
భీమడోలు: మండలంలోని పోలసానిపల్లిలో రాష్ట్ర రహదారి పక్కన ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం వేకువజామున ఘోర అవమానం జరిగింది. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. దీంతో దళిత యువకులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అంబటి దేవి వారితో కలిసి నినాదాలు చేశారు. దీంతో వాహనాలు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో భీమడోలు, దెందులూరు ఎస్సైలు వై.సుధాకర్, సుధీర్, సిబ్బంది వచ్చి చర్చించగా ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. నిందితులు ఎంతటి వారైనా సాంకేతికత సాయంతో పట్టుకుంటామని, సంయమనం పాటించాలని సీఐ కోరడంతో ఆందోళన విరమించారు. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీములు విచారణ చేపట్టగా పోలీస్ జాగిలం విగ్రహానికి పక్క రోడ్డులోని ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. దీంతో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపుల మధ్య విభేదాల వల్లే.. గ్రామంలో దళిత సామాజికవర్గానికి చెందిన వారు కొన్నేళ్లుగా రెండు వర్గాలుగా వీడిపోయారు. ఇటీవల ఓ వర్గానికి చెందిన వారు మాజీ ఉప ప్రధాని జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహం నిర్మాణంలో ఉండగానే మరో వర్గానికి చెందిన వారు అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి నాడు ఆవిష్కరణకు సిద్ధమయ్యారు. దీని వల్ల వారి మధ్య వివాదాలు ముదిరినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు. కఠినంగా శిక్షించాలి అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్కుమార్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహాలకు అవమాన కరమైన సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, విగ్రహాలను సంరక్షించే బాధ్యత పోలీస్, రెవెన్యూ శాఖలదేనన్నారు. సర్పంచ్ షేక్ రహీమాబేగం, వైఎస్సార్సీపీ దళిత విభాగం నేతలు అంబటి నాగేంద్ర ప్రసాద్, ముళ్లగిరి జాన్సన్, పాము మాన్సింగ్, దళిత సంఘం నాయకులు పైడిమాల యుగంధర్, గోవింద్, మండల జనసేన అధ్యక్షుడు ప్రత్తి మదన్ సంఘటనను తీవ్రంగా ఖండించారు. -
జూనియర్ లెక్చరర్ల సంఘకార్యవర్గం ఎన్నిక
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఏలూరు జిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షుడిగా జి.భక్త హనుమాన్, కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు సంఘ ఉపాధ్యక్షుడిగా ఎస్కే ఖాసింపీర, సంయుక్త కార్యదర్శిగా కేకేఎన్ జనార్థన రావు, కోశాధికారిగా కే. సమత తదితరులను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జి.సందీప్, పరిశీలకునిగా అయినపర్తి మురళీకృష్ణ వ్యవహరించారు. -
శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం సైతం కొనసాగింది. శనివారం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షేత్రానికి విచ్చేశారు. వీరికి తోడు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామికి మొక్కుబడులు సమర్పించారు. దాంతో కళ్యాణ కట్ట ప్రాంతం భక్తులతో పోటెత్తింది. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసాయి. రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొల్టేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండనశాల, చిన్న, పెద్ద తీర్థాలు, లడ్డు ప్రసాదాలు, గధుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, విరాళాలు ద్వారా మొత్తం రూ.83,057 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. కృష్ణభారతి సేవలు అజరామరం తాడేపల్లిగూడెం: స్వాతంత్య్ర సమరయోధురాలు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుమార్తె పసల కృష్ణభారతి సేవలు అజరామరమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇటీవల దివంగతులైన కృష్ణభారతి సంస్మరణ సభ ఆదివారం కర్రి రామచంద్రరావు కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. కృష్ణభారతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు పసల కనకసుందరరావు తదితరులు హాజరయ్యారు. -
బీమా.. లేదిక ధీమా!
కూటమి ప్రభుత్వంలో నిలిచిన పథకం ● పది నెలలుగా బాధిత కుటుంబాల ఎదురుచూపులు ● రెట్టింపు సాయం అంటూ ఎన్నికల సమయంలో హామీలు ● గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా సాయం అందజేత ● 2023–24లో 714 మందికి రూ.9.82 కోట్ల చెల్లింపు భీమవరం(ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుటుంబ యాజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అందించింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణం పొందితే రూ.లక్ష సాయం అందించి బాధితులను ఆదుకుంది. దీంతో బాధిత కుటుంబ బతుకు దెరువు ముందుకు సాగేది. ఎవరైన వ్యక్తి చనిపోయారని తెలిసిన వెంటనే సచివాలయ సిబ్బంది బాధిత కుటుంబం ఇంటికి వెళ్ల్లి వెంటనే బీమా పథకం క్లయిమ్ కోసం ఆన్లైన్ చేసేవారు. ఆన్లైన్ చేసిన 21 రోజుల్లో నామినీకి (కుటుంబ సభ్యులు) బీమా సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. అయితే ఇంతటి ప్రాధాన్యమున్న బీమా పథకం అమలుపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఎన్నికల సమయంలో రెట్టింపు భరోసా అంటూ హామీ ఇచ్చి ఇప్పటికీ పథకం అమలుకు విధివిధానాలు ప్రకటించలేదు. బీమాకు ఎసరు కూటమి మేనిఫెస్టోలో చంద్రన్న బీమా కింద సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారం చేపట్టి 10 నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ పథకం ఊసే ఎత్తడం లేదు. కేవలం పేరు మార్పుతో సరిపెట్టిన సర్కారు అమలు దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో బీమా పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పాలనలో సహజ మరణం, ప్రమాదవశాత్తూ మరణం పొందిన కుటుంబాల్లో బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. పేదల జీవితాలకు భరోసాగా ఉండే బీమా పథకం అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 800 మంది వరకు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా పథకానికి అర్హులైన సుమారు 800 మంది వరకు జిల్లాలో మరణించారు. వీరిలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారు 200 మంది వరకు ఉండగా, సహజ మరణం పొందిన వారు 600 మంది ఉన్నారు. ప్రమాదాల్లో శాశ్వత అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యం పొందిన వారు 200 మంది వరకూ ఉన్నారు. ఆయా కుటుంబాలు బీమా సొమ్ముల కోసం ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వంలో నిబంధనల మేరకు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉండి ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు సహజ మరణం పొందితే రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం పొందితే రూ.2.50 లక్షలు బీమా సొమ్ములు అందించారు. గత ప్రభుత్వంలో (2023–24) బీమా చెల్లింపు పశ్చిమగోదావరి జిల్లా కేటగిరీ సంఖ్య సాయం (రూ.కోట్లలో) ప్రమాదవశాత్తూ మరణించిన వారు 30 1.50 సహజ మరణం పొందిన వారు 266 2.66 మొత్తం 296 4.16 ఏలూరు జిల్లా కేటగిరీ సంఖ్య సాయం (రూ.కోట్లలో) ప్రమాదవశాత్త్తూ మరణించిన వారు 37 1.85 సహజ మరణం పొందిన వారు 381 3.81 మొత్తం 418 5.66గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023–24 సంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 714 కుటుంబాలకు బీమా పరిహారం కింద రూ.9.82 కోట్లు చెల్లించారు. వీరిలో 67 మంది ప్రమాదవశాత్తూ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3.35 కోట్లు, 647 మంది సహజ మరణం పొందిన వారి కుటుంబాలకు రూ.6.47 కోట్ల సాయం అందించారు. -
దామరచర్లలో పోలీస్ పికెట్
కుక్కునూరు: మద్యం మత్తులో నలుగురి మధ్య జరిగిన గొడవ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు ఆదివారం దామరచర్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మద్యం మత్తులో దామచర్ల గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. స్థానికులు వారిని వారించి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆదివారం స్థానికంగా ఉన్న పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించి రాజీ చేయించారు. ఆదివారం మధ్యాహ్నాం మరోసారి ఇరు వర్గాల వ్యక్తులు మద్యం సేవించేందుకు ఒకే ప్రాంతానికి వెళ్లిన నేపథ్యంలో మళ్లీ ఘర్షణ పడ్డట్టు తెలుస్తుంది. ఓ వర్గానికి చెందిన వారు బీరుసీసాలతో మరోవర్గానికి చెందిన వారిపై దాడి చేయడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. ఆ వ్యక్తి తరుపు బంధువులు రోడ్డుపై ఆందోళన చేసేందుకు సిద్ధపడగా పోలీసులు వారిని చెదరగొట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సీఐ, ఎస్ఐ మరో ఇరవై మంది సిబ్బందితో కలిసి దామరచర్లలో పికెట్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరావు దామరచర్ల గ్రామాన్ని పరిశీలించారు. -
పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం
గణపవరం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకంతో కీలకమైన పీఏసీ కమి టీ సభ్యుడిగా నియమించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం క్యాంపు కార్యాలయానికి వచ్చి వాసుబాబుకు అభినందనలు తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం వాసుబాబు మాట్లాడుతూ పార్టీకి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదని, జగన్ పర్యటనలకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణే ఇందుకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో అలవికాని హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏడాది తిరక్కుండానే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. సూపర్ సిక్స్ను అటకెక్కించి, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై చంద్రబాబు దృష్టి సారించారని, పీ4 అంటూ మాయ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్లీ జగన్ పాలనే రావాలని కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా నిలవడం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్దామని వాసు బాబు అన్నారు. మండల పార్టీ కన్వీనర్లు దండు రాము, సంకుసత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్తిబాబు, ఎంపీపీలు దండు రాము, ధ నుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రా మయ్య, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, కోడే కాశి, కె.జయలక్ష్మి, తుమ్మగుంట భవానీ, పార్టీ జిల్లా నాయకులు వెజ్జు వెంకటేశ్వరరావు, పుప్పాల గోపి, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు పిలుపు -
ఊరించి.. ఉసూరుమనిపించారు
ఉండి: కోటి ఆశలతో సమావేశానికి హాజరైన ఉ మ్మడి జిల్లా ఆక్వా రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. మత్స్య శాఖ, ఆక్వా రైతుల ఆధ్వర్యంలో ఆదివారం ఉండి మండలం వాండ్రం పరిధిలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆక్వా రైతుల సదస్సులో చివరికి ఉసూరుమనిపించారు. సమావేశాన్ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రా రంభించి మాట్లాడుతూ రైతుల విన్నపాలు ప్రభు త్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొని మాట్లాడారు. ఏం మాట్లాడినా షరతులు వర్తిస్తాయి అన్నట్టే ఉండటంతో రై తులు వాటిని ఆమోదించలేకపోయారు. మా ఉ సురు పోసుకుంటారు.. అంటూ రైతులు శాపనా ర్థాలు పెట్టడం గమనార్హం. మేత ధరలు తగ్గించాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యుత్ సబ్సిడీ మాత్రం అందించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్లు జోన్ల వారీగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యూనిట్ విద్యుత్ ధర రూ.2 ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రైతులు సమావేశంలో డిమాండ్ చేశారు. నాణ్యమైన సీడ్ అందించాలని, మద్దతు ధరలు తగ్గిపోవడంతో నష్టపోతున్నామని, ధరల స్థిరీకరణను ఏర్పాటు చేయాలని కోరారు. ఆక్వా రంగంలో గందరగోళానికి ఫీడ్ కంపెనీలు ప్రధాన కారణమని, రైతులను నిండా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికీ ప్రభుత్వం అంటే కుదరదు దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తన మాటలతో రైతులను గందరగోళానికి గురిచేశారు. ఆక్వా రైతులు అడిగిన విన్నపాలకు, రఘురామ చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో రైతులు తెల్లముఖాలు వే శారు. సొంత పార్టీకి చెందిన వారు కూడా ము ఖా లు మాడ్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులకు ఏదో జరుగుతుందని ఆశించకండి.. ప్రభుత్వా న్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడదాం.. అన్నింటికీ ప్రభుత్వం.. ప్రభుత్వం అంటే కుదరదు.. ప్రభుత్వం అన్ని విషయాల్లో అయిపోయి ఉంది అంటూ రఘురామ చెప్పడం గమనార్హం. ప్రభుత్వ సహకా రం అనే సంగతి మీ బుర్రల్లో నుంచి తీసేయాలంటూ ఆయన రైతులకు తేల్చిచెప్పారు. ప్ర భుత్వాన్ని రోడ్లు వేయాలని మాత్రం అడుగుదామని అన్నారు. అడిగినవన్నీ నెరవేరిస్తే రైతులు లేజీగా తయారవుతారు రైతులు అడిగే కొన్ని విన్నపాలు చూస్తుంటే వాటిని నెరవేరిస్తే రైతులు లేజీగా తయారవుతారని డిప్యూ టీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ముందు మీకు వచ్చిన కష్టాన్ని తట్టుకుని ముందుకు వెళ్లేలా ప్రయత్నించండి అని అన్నారు. అలాగే ఆక్వా రైతులు నిబంధనలు పాటించకుండా చెరువుల తవ్వకాలు చేశారని, నిబంధనలు తప్పక పాటించాలంటూ చురకలు వేశారు. నీరుగారిన ఉమ్మడి జిల్లాస్థాయి ఆక్వా రైతుల సమావేశం ఆక్వా రైతులు నిబంధనలు పాటించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆదేశం -
అకాల వర్షంతో ఇక్కట్లు
తాడేపల్లిగూడెం: ఆదివారం సాయంత్రం గూడెం ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఒకవైపు పూర్తి స్థాయిలో పంట ఎదిగి, కోతలు జరుగుతున్న వేళ కురిసిన ఈ వాన రైతులకు ఆందోళన కలిగించింది. బోర్ల కింద వ్యవసాయం చేసే గూడెం మండలంలో చినతాడేపల్లి నుంచి బంగారు గూడెం వరకు దాదాపుగా మాసూళ్లు పూర్తయ్యి, ధాన్యం అమ్మకాలు అయ్యిపోయాయి. మాధవరం ప్రాంతంలో కూడా మాసూళ్లు పూర్తిచేసుకుని రైతులు ఒబ్బిడి అయ్యారు. ఈ మండలంలో సుమారు 25 వేల ఆయకట్టులో వరి వేశారు. కాలువ కింద గ్రామాలైన కృష్ణాయపాలెం నుంచి నవాబుపాలెం, నందమూరు వరకు ఇంకా కోతలు ప్రారంభం కాలేదు. సుమారు 18 వేల ఎకరాల్లో కోతలు పూర్తి కావాల్సి ఉంది. నిటారుగా నిలబడే 1121 రకం కావడంతో ఆదివారం కురిసిన వానతో పంటకు పెద్దగా నష్టం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పనల మీద ఉన్న ధాన్యానికి కూడా అకాల వాన వల్ల ఇబ్బంది లేదు. పెంటపాడు మండలంలో సుమారు 21 వేల ఎకరాల ఆయకట్టులో వరి వేశారు. దీనిలో రెండు వేల ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయి. 19 వేల ఎకరాల్లో ఇంకా కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఆదివారం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వాన పడటంతో రైతులు కంగారు పడ్డారు. కొద్దిసేపు వర్షం పడి ఆగడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వాన వల్ల పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని తాడేపల్లిగూడెం సహాయ వ్యవసాయ సంచాలకుడు మురళీకృష్ణ తెలిపారు. గూడెం పట్టణంలో వానతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు సేదదీరారు. ఏజెన్సీలో గాలివాన బీభత్సం బుట్టాయగూడెం: ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వర్షంతో పాటు గాలి బీభత్సం సృష్టించింది. పలు చోట్ల కొమ్మలు విరిగిపోయాయి. గాలులకు కరెంటుకు అంతరాయం కలిగింది. రాత్రి 8 గంటల వరకూ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్శాఖ అధికారులు కరెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కుక్కునూరులో ఈదురు గాలులతో వర్షం కుక్కునూరు: కుక్కునూరు మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బలంగా వీచిన గాలుల దాటికి మండలంలోని చిరవెల్లి గ్రామంలో తాటిచెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా గాలుల దాటికి మండల వ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
టోల్ప్లాజా వద్ద జనసేన నేత దౌర్జన్యం
సాక్షి టాస్క్ఫోర్సు: ఉంగుటూరు మండలం జనసేన నేత స్థానిక టోల్ప్లాజా వద్ద తన అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించిన కారేటి జ్యోతి భర్త అయ్యప్ప తనకు చెందిన లిక్కర్ మినీ లారీని టోలు లేకుండా పంపమని ప్లాజా నిర్వాహకులను కోరారు. యెల్లో బోర్డు ఉంటే కుదరదు అని చెప్పగా తన అనుచరులు సుమారు 15 మందితో వచ్చి దౌర్జన్యంగా గేటు తీసేసి వాహనాన్ని పంపించారు. టోలు సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు తిట్టి దౌర్జన్యం చేసినట్లు సమాచారం. దీంతో టోలు ప్లాజా సిబ్బంది చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం అత్తిలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అత్తిలి కాలువలో ఆదివారం కొట్టుకొచ్చింది. బల్లిపాడు శివారు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేకపోవడంతో కాలువలోకి స్నానానికి దిగి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని అత్తిలి పోలీసులు బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.ప్రేమరాజు చెప్పారు. బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ భీమవరం (ప్రకాశంచౌక్): హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీపద్మావతి వేంకటేశ్వరస్వామి మందిర 14వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు, కల్యాణం, రథోత్సవం, వైభవోత్సవం, ఊరేగింపు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మందిర అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు తెలిపారు. కార్యక్రమంలో మందిర సభ్యులు పాల్గొన్నారు. -
పెళ్లి మండపాలకు పెరిగిన డిమాండ్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కల్యాణ మండపం చూసినా రంగు రంగుల విద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 20 వరకు వివాహ ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. రాత్రి ఏడు గంటలు దాటిన ముహూర్తం దగ్గర నుంచి తెల్లవారుజాము ముహూర్తాలు ఉండడంతో ఒక్కసారిగా కల్యాణ మండపాలకు గిరాకీ పెరిగింది. గూడెం ప్రాంతంలో చిన్నా పెద్దా కలిపి 20 వరకు కల్యాణ మండపాలు ఉన్నాయి. కనీస ఽఅద్దె రూ.30 వేలు ఉంటుంది. వీటికి తోడు విద్యుత్, క్లీనింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చులు అదనంగా చెల్లించాలి. గూడెంలో చినతాడేపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపానికి ఖర్చులతో కలిపి రూ.5 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మధ్యతరహ హంగులున్న కల్యాణ మండపాలకు అద్దెలు ఇస్తున్నారు. మరో వైపు బ్యాండ్ ధరలు మోత మోగుతున్నాయి. పెళ్లి కొడుకు చేయడానికి నలుగురు వాద్యకారులు కావాలంటే రూ.6 వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. తంతు జరిపించడం కోసం పురోహితులు దక్షిణలు బాగా చెల్లిస్తేనే పెళ్లిళ్లు చేయడానికి అంగీకరిస్తున్నారు. పూల డెకరేషన్ల ధరలు మండిపోతున్నాయి. పూల మండపానికి కనీసం రూ.17 వేలు వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపానికి రూ. 60 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయాల వద్ద పెళ్ళిళ్లు చేసేవారు ఈ సీజన్లో పెరిగారు. పట్టణంలో సత్యనారాయణస్వామి ఆలయంలో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీకి కనీసం రూ.60 వేల నుంచి అడుగుతున్నారు. ఈ నెలలో ఒక వారంలోనే అధిక ముహూర్తాలుండటంతో కల్యాణమండపాలు ఖాళీగా లేవు. -
సబ్సిడీలు ఇవ్వాలి
రోజురోజుకూ నిత్యావసరాల ధరలు పెరిగిపోతు న్నాయి. గ్యాస్ ధర పెంపుతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధరలపై ప్రభుత్వాలు స్పందించి సబ్సిడీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం సామాన్యుడు జీవనం సాగించాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. – మందా జయలక్ష్మి, ఉంగుటూరు సామాన్యుడిపై మరింత భారం ఏం కొందామన్నా ధరలు మండిపోతున్నాయి. కందిపప్పు, మినపప్పు, వంట నూనె కిలో రూ.100 పైగానే ఉన్నాయి. వీటికి తోడు గ్యాస్పై రూ.50 ధర పెంచారు. ఇది సామాన్యుడిపై మరింత భారం మోపడమే. పెంచిన గ్యాస్ ధరలు తగ్గిస్తే ప్రజలకు కాస్తయినా వెసులుబాటు కలుగుతుంది. –పెనుగొండ శ్రీలక్ష్మి, శనివారపుపేట ● -
జనం నెత్తిన గుదిబండ
ఏలూరు, (మెట్రో): ‘ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు’ అన్నట్టుంది సామాన్యుడి పరిస్థితి. ఓ పక్క నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్న సమయంలో ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడంతో మరింత అదనపు భారం పడుతుంది. దీంతో జిల్లాలోని 6,45,776 మంది గ్యాస్ వినియోగదారులపై సిలెండర్కు రూ.3.22 కోట్ల భారం పడనుంది. బియ్యం, కందిపప్పు, పంచదార, కూరగాయలు ఇలా ఏది చూసినా ధరలు మండిపోతున్నాయి. డెలివరీ చార్జీలు అదనం జిల్లాలో 14.2 కేజీల సిలిండర్ రూ.844.50గా ఉంది. దీనికి అదనంగా డెలివరీ చార్జీలుగా దూరాన్ని బట్టి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సిలిండర్కు రూ.894 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రూ.900 వరకు డీలర్లు వసూలు చేస్తున్నారు. ఇక పెరిగిన ధరతో రూ.950 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వంట గ్యాస్పై కేవలం రూ.10 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ సొమ్ములు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నామని చెబుతున్నా పూర్తిస్థాయిలో జమవుతున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై పర్యవేక్షణ లేకపోవడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వంట నూనె లీటరు రూ.150, కిలో కందిపప్పు రూ.150, మినపప్పు రూ.110 ఇలా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు జిల్లాలో 6,45,776 కనెక్షన్లు ప్రజలపై రూ.3.22 కోట్ల అదనపు భారం జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు సాధారణ కనెక్షన్లు 4,06,125 దీపం కనెక్షన్లు 1,92,212 సీఎస్ఆర్ కనెక్షన్లు 18,243 ఉజ్వల (పాత) 3,320 ఉజ్వల (కొత్త) 24,319 గిరిజనుల కనెక్షన్లు (5 కిలోల సిలెండర్) 1,557 మొత్తం 6,45,776 -
చిల్లరతో పనేముంది!
కరోనా భయంతో.. కరోనా వైరస్ సమయంలో ఇతరులను తాకాలన్నా, వారి వస్తువులు ముట్టుకోవాలన్నా భయపడేవారు. ఈ క్రమంలో కరెన్సీ నోట్లు తీసుకుంటే కోవిడ్ సోకుతుందేమోనని ఆందోళన చెందేవారు. బ్యాంకులకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో, నగదు రహిత లావాదేవీలు జోరందుకున్నాయి. 2020–2021 లో మొదలైన ఈ డిజిటల్ లావాదేవీలు గత మూడేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. పేటీఎం, గూగుల్పే, ఫోన్పే వంటి యాప్ల వినియోగం పెరగడంతో ఆన్లైన్ లావాదేవీలు విస్తృతం అవుతున్నాయి. నగదు రహిత లావాదేవీల్లో 60 నుంచి 70 శాతం మైలు రాయిని అధిగమించాలని కొద్దినెలల క్రితం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆర్బీఐ ఉన్నతాధికారులు సూచించారు. దీనికి అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ, పైవేటు రంగ బ్యాంకులు నగదు రహిత లావాదేవీల్లో పోటీ పడుతున్నాయి. ద్వారకాతిరుమల: ఒకప్పుడు పెద్ద కరెన్సీ నోటు పట్టుకుని ఏ షాపుకు వెళ్లినా చిల్లర కష్టాలు తప్పేవికావు. ఏ వ్యాపారి నోట విన్నా చిల్లర పట్టుకు రండి.. మా దగ్గర చిల్లర లేదు అన్న మాటే వినిపించేది. ఆ సమయంలో వినియోగదారులు వ్యాపారులను చిల్లర కోసం బతిమిలాడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. డిజిటల్ నగదు చెల్లింపులు వచ్చిన తరువాత చిల్లరకు కష్టాలు తప్పాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇతర యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు పెరగడమే ఇందుకు కారణం. బ్యాంకుల్లో పేరుకుంటున్న చిల్లర ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల ద్వారా నెలకు రూ.10 లక్షల చిల్లర వస్తోంది. అందంతా స్థానిక యూనియన్ బ్యాంకుకు చేరుతోంది. ఇక్కడి నుంచి ఆ చిల్లర తాడేపల్లిగూడెంలోని సంబంధిత కార్యాలయానికి వెళ్తుంది. ప్రస్తుతం స్థానిక యూనియన్ బ్యాంకులో సుమారు రూ. 35 లక్షల వరకు చిల్లర ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు జిల్లాలోని వ్యాపారులు శ్రీవారి హుండీలు ఎప్పుడు తెరుస్తారో, చిల్లర ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూసేవారు. వాటి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. చిన్న దుకాణాల్లోనూ స్కానర్లు.. నోటు చిరిగిందనే బాధ లేదు. వ్యాపారి నుంచి చిల్లర వస్తుందో.. లేదో అనే బెంగ లేదు. డబ్బు లెక్కపెట్టాల్సిన పని అంతకంటే లేదు. హైపర్ మార్కెట్ అయినా, డిపార్ట్మెంటల్ స్టోర్ అయినా, హోటల్ అయినా, కూరగాయల దుకాణాలైనా, ఫ్రూట్ జ్యూస్ షాపు అయినా, రోడ్డు పక్కన ఫుట్పాత్పై అమ్మే కొబ్బరి బొండాలైనా, మొక్కజొన్న పొత్తులైనా, పెట్రోల్ బంకుల్లో అయినా, టీ కొట్టులో అయినా ఇలా ఏ దుకాణంలో అయినా అక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. వాటి ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. రూపాయి పెట్టి కొనే అగ్గిపెట్టె నుంచి రూ.లక్ష విలువ చేసే బంగారం వరకు నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. ఆర్బీఐ ప్రోత్సాహంతో.. అన్ని బ్యాంకుల్లోనూ నూరు శాతం నగదు రహిత లావాదేవీలు జరిగేలా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా దాదాపు అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులు సైతం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఆన్లైన్ లావాదేవీల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు రూ.100 కావాలంటే పనులన్నీ పక్కనబెట్టి, బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. గడప దాటకుండానే నగదు రహిత లావాదేవీలు చేసుకునే అవకాశం రావడంతో ప్రజల అవసరాలు క్షణాల్లో తీరిపోతున్నాయి. సమయం ఆదాతో పాటు, జేబులో సొమ్ము పోతుందనే భయం లేకపోవడంతో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు. విస్తృతమైన డిజిటల్ నగదు చెల్లింపులు చిన్న చిన్న దుకాణాల్లోనూ యూపీఐ లావాదేవీలు శ్రీవారి హుండీ ద్వారా నెలకు రూ.10 లక్షల చిల్లర బ్యాంకుల్లో పేరుకుంటున్న చిల్లర చిల్లర కష్టాలు తప్పాయి యుపీఐ పేమెంట్లు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తుల్లో 90 శాతం ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వినియోగిస్తున్నారు. దాంతో చిల్లర కష్టాలు తప్పాయి. గతంలో బ్యాంకు నుంచి తెచ్చి వినియోగదారులకు చిల్లర ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. – దేశెట్టి రాంబాబు, కూల్డ్రింక్ షాపు వ్యాపారి, ద్వారకాతిరుమల నగదు రహిత లావాదేవీలే బెస్ట్ కూరగాయలు కొంటున్న వారిలో ఎక్కువ మంది యూపీఐనే వాడుతున్నారు. చిల్లరతో పని లేకపోవడంతో అదే బెస్ట్ అనిపిస్తోంది. షాపునకు వచ్చే పది మందిలో, ఎనిమిది మంది నగదు రహిత లావాదేవీలనే జరుపుతున్నారు. మహిళలు సైతం యూపీఐని వినియోగిస్తున్నారు. కళ్లేపల్లి అభిరామ్, కూరగాయల వ్యాపారి, ద్వారకాతిరుమల -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
భీమవరం అర్బన్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయా లని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. మండలంలోని గొల్లవానితిప్పలో శనివారం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో, వెంపలో పి.గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్రాజు మాట్లాడుతూ అంబేద్కర్ అన్నివర్గాలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. అంబేడ్కర్ మన దేశంలో పుట్టడం దేశ ప్రజల అదృష్టమన్నారు. పీఏసీ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగే అందరికీ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, నాయకులు మెంటే పార్థసారథి, వబిలిశెట్టి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ పెనుమాల నరసింహస్వామి, మాజీ సర్పంచ్ బోకూరి విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్రాజు -
గోనె సంచులు నాణ్యంగా ఉండాలి
యువతి ఆత్మహత్య ప్రేమించి మోసం చేయడంతో ఏలూరులో నర్సుగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుందని, న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు ధర్నా చేశారు. 8లో uజాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఏలూరు(మెట్రో): ధాన్యం కొనుగోలులో భాగంగా రైతులు ఉపయోగించే గోనె సంచులు నాణ్యంగా ఉండాలని, ఇందులో ఎలాంటి రాజీ లేదని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. సుమారు 55 లక్షల గోనె సంచులు అవసరం ఉందని, నిర్దేశిత కేంద్రాల్లో సంచులను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం రవాణా వాహనాల రిజిస్ట్రేషన్ను వేగిరపర్చాలన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 118 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తామన్నారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఫిర్యాదులు చేసేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ 08812– 230448, 77020 03584, 75695 62076, 75695 97910ను ఏర్పాటుచేశామన్నారు. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, డీఎస్ఓ ప్రతాపరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బీషా, డి.శ్రీనివాస్, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు. జీఓ 35తో తీరని నష్టం ఏలూరు(మెట్రో): పంచాయతీరాజ్ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన జీఓ 35 వల్ల తీరని నష్టం జరుగుతుందని పంచాయతీరాజ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్రాజు తెలిపారు. జీఓతో ఏఓ పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఎంపీడీఓ పోస్టు నేరుగా ని యామకం రద్దు చేయడం వల్ల అదనంగా వచ్చిన 30 శాతం కోటాలో తమకు కనీసం 50 శాతం కూడా పెంచకపోవడం దారుణమన్నా రు. తక్షణమే జీఓ 35ను సవరణ చేయాలని ఆయన కోరారు. -
పోటెత్తిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులు, పెళ్లి జనాలతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ విద్యార్థులకు సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం క్షేత్రంలోను, వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరగడంతో నూతన వధువరులు, వారి బంధువులు ఆలయానికి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులు, పెళ్లి జనాలతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు రద్దీగా మారాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో ఈ రద్దీ కొనసాగింది. ఆదివారం క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
యూపీఐ సేవలు నిలిచిపోవడంతో గగ్గోలు
ఏలూరు (టూటౌన్): యూపీఐ సేవలు నిలిచిపోవడంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే డౌన్ అవడంతో సేవలు అందుబాటులో లేవు. దీంతో డిజిటల్ లావాదేవీలు నిలిచిపోవడంతో చాలాచోట్ల యూజర్లు పేమెంట్లు చేయలేకపోయారు. స్థానిక ఎన్ఆర్పేటలోని ఒక బిర్యానీ హోటల్కు వచ్చిన ఇద్దరు యువకులు బిర్యానీ తిన్నాక ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిద్దామంటే స్కానర్ పనిచేయలేదు. క్యాష్ ఇద్దామంటే జేబులో సరిపడా సొమ్ములు లేవు. దీంతో ఫోన్తో చాలా సేపు కుస్తీ పట్టిన సదరు యువకులు బిక్క మొహం వేశారు. చివరకు అందులోని ఒక యువకుడి సోదరుడికి ఫోన్ చేసి రమ్మని డబ్బులు కట్టారు. స్థానిక ఆర్ఆర్పేటలోని ఒక వస్త్ర దుకాణంలోకి వచ్చిన మహిళ తనకు నచ్చిన దుస్తులు కొనుగోలు చేసింది. క్యాష్ కౌంటర్కు వచ్చి డిజిటల్ పేమెంట్ చేసేందుకు ప్రయత్నించగా యూపీఐ సర్వర్ స్లోగా ఉండటంతో మనీ ట్రాన్స్ఫర్ అయినట్లు చూపినా అవి దుకాణదారుడి ఖాతాలోకి రాలేదు. దీంతో ఆమె ఇంటి నుంచి కుటుంబ సభ్యులను రప్పించి నేరుగా క్యాష్ చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి సన్నివేశాలు శనివారం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల దర్శనమిచ్చాయి. ఒక్కసారిగా డిజిటల్ లావాదేవీలు డౌన్ అయితే పరిస్థితి ఏంటనే దానిపై శనివారం జిల్లా వాసులకు స్పష్టత వచ్చింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. జిల్లాలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని ఫిర్యాదులు చేశారు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే డిజిటల్ పేమెంట్ యాప్లు పనిచేయడం లేదని వినియోగదారులు గగ్గోలు పెట్టడం కన్పించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో 66 శాతం యూజర్లకు పేమెంట్ చేసే సమయంలో సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. మరో 34 శాతం మంది ఫండ్ టాన్స్ఫర్ కావడం లేదని రిపోర్ట్ చేశారు. జిల్లాలో 10 లక్షలకు పైగా వినియోగదారులు ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 లక్షల వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరిలో 10 లక్షల మంది వరకు డిజిటల్ లావాదేవీలైన ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి వాటిని వినియోగిస్తున్నారు. డిజిటల్ లావేదేవీలు పెరగడంతో కనీసం రూ.10 కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. దీంతో జేబులో, పర్సులో డబ్బులు లేకుండానే యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. వరుసగా బ్యాంకులకు మూడు రోజులు సెలవులు రావడం, శనివారం మధ్యాహ్నం నుంచి డిజిటల్ సేవలు మొరాయించడంతో ప్రజలకు తమ వెంట నగదు తెచ్చుకోకపోతే పరిస్థితి ఏంటనేది అర్థమైంది. -
ప్రేమ పేరుతో మోసగించడం వల్లే ఆత్మహత్య
జీజీహెచ్ ముందు యువతి తల్లిదండ్రుల ధర్నా ఏలూరు టౌన్/ముసునూరు : ఏలూరులోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోన్న యువతిని ప్రేమించి మోసం చేయటంతో ఆత్మహత్య చేసుకుందని.. ఆమె మృతికి కారణమైన వ్యక్తిని శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ ఏలూరు సర్వజన ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు పురుగు మందు డబ్బాతో ధర్నాకు దిగారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి తమ కుమార్తె మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పంతంగి నాగరాజు, రమాదేవికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పంతంగి ఉమాశిరీష (23) బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రస్తుతం ఏలూరు నగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. నాగరాజు గ్రామంలో పంచాయతీ వాటర్వర్క్స్లో పనిచేస్తున్నారు. ఉమా శిరీష విజయవాడలోని హెల్ప్ హాస్పిటల్లో పనిచేస్తుండగా.. ముసునూరు మండలం విస్సన్నపేట ప్రాంతానికి చెందిన ప్రవీణ్కుమార్ అదే హాస్పిటల్లో పనిచేసేవాడు. వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను కుటుంబ సభ్యులు నిరాకరించారని చెబుతుండగా, యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను మోసం చేయటంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. శుక్రవారం స్వగ్రామంలో శిరీష పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక చికిత్స అనంతరం ఏలూరు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ శిరీష శనివారం మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు ఏలూరు జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగటంతో వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు బాధితుల వద్దకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. టూటౌన్ సీఐ అశోక్కుమార్ సంఘటనపై ఆరా తీశారు. స్టేట్మెంట్ తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో తమ కుమార్తెను బీఎస్సీ నర్సింగ్ చదివించామని.. ప్రేమ పేరుతో మోసం చేయటంతో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని తల్లిదండ్రులు విలపించటం అందరినీ కలిచివేసింది. -
మామిడి.. భరోసా కొరవడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మామిడి సాగుకు నూజివీడు ఖ్యాతిగాంచింది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా నూజివీడు మామిడికి మంచి పేరుతో పాటు డిమాండ్ ఉంది. అలాంటి మామిడి సాగు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులకు ఏటా కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నూజి వీడు నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో మామిడి రైతుల్లో ఆశల రేకెత్తాయి. ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశోధనా స్థానాన్ని అభివృద్ధి చేయడం వంటి హామీలతో పాటు రైతులకు నష్టపరిహారం ప్రకటిస్తారేమోనని అందరూ ఆశగా ఎదురుచూసి భంగపడ్డారు. 6 గంటల సీఎం పర్యటనలో మామిడి రైతుల గురించి కనీసం ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కనీస చర్చ కూడా లేకుండానే.. జిల్లాలోని నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల్లో మామిడి సాగు గణనీయంగా ఉంది. పదేళ్ల క్రితం వరకు సుమారు 80 నుంచి లక్ష ఎకరాల్లో విస్తరించిన మామిడి వరుస నష్టాలతో విస్తీర్ణంగా తగ్గుతూ వస్తోంది. ఆ స్థానంలో ఆయిల్పామ్, కోకో తోటలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 45 నుంచి 50 వేల ఎకరాల్లో మాత్రమే మామిడి సాగు ఉంది. గతేడాది నవంబర్, డిసెంబర్లో పూత బాగున్నా నల్లతామర తెగులుతో 70 శాతం దిగుబడి తగ్గిపోయింది. జిల్లాలో ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలతో పా టు మరికొన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. మామిడికి అనుసంధానంగా ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం, తెగుళ్ల నివారణను సమర్థంగా ఎదుర్కోవడానికి సాంకేతిక సహకారం, నిపుణుల సూచనలు లేకపోవడంతో ఏటా రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆగిరిపల్లి మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఆయనకు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం బొకేలు బదులు మామిడి పండ్లు బహూకరించారు. అయినా సీఎం పర్యటనలో మామిడికి సంబంధించి ఎలాంటి చర్చా జరగని పరిస్థితి. ఊసెత్తని పాలకులు : చంద్రబాబు మొదలు లోకేష్ వరకూ మామిడికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సభల్లో పలుమార్లు చెప్పినా ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. నూజి వీడులో వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా మామిడి పరిశోధనా కేంద్రం ఉన్నా పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. పరిశోధనా స్థానం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 70 నుంచి 100 ఎకరాలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే ముగ్గురు శాస్త్రవేత్తలు అందుబా టులో ఉన్నా సీజన్ పూర్తయిన తర్వాతే హార్టీకల్చర్, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి పార్థసారథి మామిడి పరిశ్రమను అభివృద్ధి చేస్తామని ప్రకటించినా ఆ దిశగా క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పుల పాలయ్యాం గత డిసెంబర్లో మామిడి పూతలు బాగా వచ్చాయి. జనవరి నెలాఖరుకు పూతంతా తెగుళ్లు, పురుగులతో మాడిపోయింది. కనీసం 20 శాతం కూడా పిందె కట్టలేదు. పూత నిలుపుకోవడం కోసం పది నుంచి 15 సార్లు పురుగు మందులు చల్లించి అప్పులపాలయ్యాం. ఇప్పుడు చూస్తే తోటల్లో కాయ కూడా లేదు. – డి.నాగమల్లేశ్వరరావు, సుంకొల్లు, నూజివీడు మండలం నల్ల తామర నుంచి రక్షించాలి మూడేళ్లుగా తోటలు నల్లతామర బారిన పడుతున్నాయి. దీంతో రైతులు నిండా మునిగిపోతున్నారు. నల్ల తామర వల్ల పూతంతా మాడిపోయి పిందె తయారు కావడం లేదు. దీంతో రైతులు మూడేళ్లుగా నష్టాల పాలవుతున్నారు. ఈ ఏడాది మరింతగా నష్టాల్లో మునిగిపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పల్లే రవీంద్రరెడ్డి, తూర్పు దిగవల్లి, నూజివీడు సంక్షోభంలో సాగు నూజివీడు మామిడికి సర్కారు మొండిచేయి ఆగిరిపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో రైతుల ఆశలు గత ప్రభుత్వంలో రూ.275 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్లు కూటమి రాకతో అటకెక్కిన వైనం నల్ల తామరతో ఇప్పటికే రైతులు సతమతం పరిశోధనా స్థానం ఉన్నా పట్టించుకోని సర్కారు గత ప్రభుత్వంలో రూ.275 కోట్లతో యూనిట్ మామిడి సాగు పరిరక్షణకు, రైతులకు మేలు చేసేలా నూజివీడులో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 20 ఏళ్లుగా ఉంది. జ్యూస్ పరిశ్రమ, పల్ప్ పరిశ్రమ, మామిడి తాండ్ర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికంగా ధరలు బాగుండటంతో పాటు విస్తీర్ణం కూడా పెరుగుతుందనే వాదన ఉంది. ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.275 కోట్లతో నూజివీడులో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2023 నవంబర్లో జరిగిన సభలో ప్రకటించి వెంటనే నూజివీడు మండలంలోని సిద్ధార్ధనగర్లో 25 ఎకరాల భూమిని కూడా సేకరించి డీపీఆర్ను సిద్ధం చేసి బ్యాంకర్లకు పంపారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
ఏలూరు టౌన్: ఏలూరు శాంతినగర్ ఏడో రోడ్డులోని అపార్ట్మెంట్లోని ప్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అర్థంకాక జనం కిందికి పరుగులు తీశారు. అపార్ట్మెంట్లోని ఫోర్బీ ప్లాట్లో మంటలు చెలరేగటం, మరోవైపు దట్టమైన పొగతో 5వ అంతస్తులోని వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతూ బయటకు రాలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్లాట్లోని వస్తువులు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. బాధితులను అగ్నిమాపక శాఖ సిబ్బంది సాహసోపేతంగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సీహెచ్ రత్నబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శాంతినగర్ ఏడో రోడ్డు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల పక్కన హిమనీ అపార్ట్మెంట్స్ ఉంది. శనివారం ఉదయం ఫోర్త్ బీ ప్లాట్లోని టీవీ ప్యానెల్ బోర్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బెడ్రూమ్, హాలు, కిచెన్లోకి వ్యాపించాయి. ఆ సమయంలో ప్లాట్ యజమాని శ్రీకాంత్, కుటుంబ సభ్యులు ఇంట్లో లేదు. దట్టమైన పొగతో కారిడార్, మెట్ల ప్రాంతం పొగ కమ్మేసింది. 5వ అంతస్తులోని వృద్ధులు పీ.రామకృష్ణ (74), ఎస్.విజయలక్ష్మి (82) బయటకు రాలేక చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది వారిని చేతులపై ఎత్తుకుని కిందికి తీసుకువచ్చారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది గంటకు పైగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.15 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలను అపార్ట్మెంట్ వాసులు అభినందించారు. -
‘సాక్షి’పై అరకమ కేసులు ఎత్తివేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కదం తొక్కారు. శనివారం నగరంలోని ఫైర్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం ర్యాలీగా ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్ వరకు వెళ్లి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన హక్కును కాలరాసినట్లేనన్నారు. అలాగే గత నెలలో కై కలూరుకు చెందిన న్యూస్ రైట్ దినపత్రిక ఎడిటర్ కూరెళ్ల కిషోర్పై కూటమి ప్రభుత్వానికి చెందిన కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. దీనిపై కేసు నమోదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణ మన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు కాగిత మాణిక్యరావు మాట్లాడుతూ ఇటీవల జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయన్నారు. అనంతరం టూటౌన్ సీఐ అశోక్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కిషోర్, రాష్ట్ర ఫొటోగ్రాఫర్స్ కార్యదర్శి షేక్ రియాజ్, సామ్నా జిల్లా కార్యదర్శి కూరెళ్ల కిషోర్, పోతురాజు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు సీహెచ్ రామకృష్ణరాజు, ఎం.రాజేష్కుమార్, కొల్లు శ్రీనివాస్, గంజి బెనర్జీ, కాయల మురళీమోహన్, ఉర్ల శ్రీనివాస్, రాము, కొత్తపల్లి వంశీ, రెడ్డి వెంకట నాయుడు, కొమ్మి రత్నకుమారి, సుబ్బారావు, గంజి చంటి, రవితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు వైఎన్వీ శివరావు, కట్టా ఏసుబాబు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. చింతలపూడిలో.. చింతలపూడి: స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా వైస్ ప్రెసిడెంట్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్కే ఆజాద్ మాట్లాడు తూ రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ కల్పించిందని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్స్టేషన్కు వెళ్లి రైటర్ జయరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఏపీయూడబ్ల్యూజే సభ్యులు ఎస్కే అమీర్ పాషా, ప్రసాద్ రెడ్డి, ముతేశ్వరరావు, కృపావరం, గంధం నాగేశ్వరరావు, మూర్తి, ఖలీల్, సంజయ్, సురేష్, రజినీ, కిషోర్, సుధాకర్, వెంకట్, శివ, బాలు పాషి, సునీల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కదం తొక్కిన జర్నలిస్టులు ఉంగుటూరులో నిరసన ఉంగుటూరు: ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల విలేకరులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఉంగుటూరు ప్రెస్క్లబ్ గౌరవాధ్యక్షుడు పీవీ పెద్దిరాజు, అధ్యక్షుడు ముప్పన భుజంగరావు, కార్యదర్శి పీఈ సత్యనారాయణ, కోశాధికారి గుత్తికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పీఏసీ సభ్యులుగా చెరుకువాడ, వాసుబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఇద్దరు కీలక నేతలకు చోటు దక్కింది. పీఏసీ పూర్తిస్థాయిలో పునః వ్యవస్థీకరించి నూతన నియామకాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నూతన సభ్యులను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పశ్చిమగోదా వరి జిల్లా నుంచి మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఏలూ రు జిల్లా నుంచి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాస్ను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ముఖ్య నేతలతో కమిటీని ప్రకటించారు. వైఎస్సార్సీపీ నేతలకు రాష్ట్ర పదవులు ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏలూరు జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులకు రాష్ట్ర పదవులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం నియోజకవర్గానికి చెందిన బూరుగు ఫెడ్రిక్ ప్రేమ్కుమార్, కై కలూరు నియోజకవర్గానికి చెందిన.జాన్ విక్టర్ను వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర సెక్రటరీలుగా నియమించారు. పోలవరం నియోజకవర్గానికి చెందిన తూమురి శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆక్వా ఫీడ్ ధరలు మరింత తగ్గించాలి పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు వదిలిన క్రాప్ హాలిడే బాణానికి ఫీడ్ కంపెనీలు దిగి వస్తున్నాయని, అయినా వారు ఇచ్చిన ఆఫర్ ఆమోదయోగ్యంగా లేదని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు అన్నారు. శనివారం స్థానిక ఆక్వా రైతు సంఘం భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీడ్ తయారీ ముడి సరుకుల ధరలు వందల్లో తగ్గితే ఫీడ్ ధరలను కంపెనీలు పైసల్లో తగ్గిస్తామంటూ సంకేతాలు పంపిస్తున్నాయని అన్నా రు. ఫీడ్ ధరలు రూ.4 తగ్గిస్తామని అంటున్నారని, అయితే కిలోకు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేశారు. కనీసం రూ.20 ధర తగ్గితేనే రైతులకు ఊరటగా ఉంటుందని, లేకుంటే ఊరుకోబోమన్నారు. అమెరికా సుంకాల పేరుతో 100 కౌంట్ రొయ్యల ధరలను ప్రాసెసింగ్ యూనిట్లు తగ్గించాయని, అయితే అగ్రరాజ్యం సుంకాల విధింపున కు 90 రోజులు గడువు ఇచ్చినా ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యల ధరలను పెంచడం లేదన్నారు. ఆక్వా రైతుల కష్టాలపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకి వినతిపత్రం ఇచ్చామని, తాము ముందుగా రైతులమని ఆ తర్వాతే రాజకీయాలను అన్నారు. ఆదివారం భీమవరంలో జిల్లా ఆక్వా రైతు సమావేశం ఏర్పాటుచేస్తున్నామని, ఆక్వా రైతులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఫీడ్ ధరలు తగ్గించేలా ప్రాసెసింగ్ యూనిట్లు, రొయ్య కౌంట్ ధరలు పెంచేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంఘ సెక్రటరీ బోణం చినబాబు, మేడిది జాన్రాజు తదితరులు పాల్గొన్నారు. ఏరులై పారుతున్న మద్యం పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో మద్యం సిండికేట్లకు లాభాల కోసం ఊరూవాడా బెల్టుషాపులు పెట్టుకోమని కూటమి ప్రభుత్వం అను మతి ఇచ్చినట్టుందని, దీంతో ఎకై ్సజ్ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదని కల్లు గీత కార్మి కుల సంఘం ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి విమర్శించారు. శనివారం స్థానిక ఎకై ్స జ్ కార్యాలయం వద్ద కల్లు గీత కార్మిక సంఘం నాయకులు మోకులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. నర్సింహమూర్తి మాట్లాడుతూ బెల్టు షాపులతో కల్లు గీత కార్మికులు వ్యాపారాలు లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. బెల్టు షాపులను అరికట్టాలని, గీత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 5 వేలు, రాష్ట్రంలో 70 వేల వరకు బెల్టుషాపులు ఉన్నాయన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెర వేర్చాలన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు బొక్కా చంటి, బొంతు శ్రీను, జక్కంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: ఇంటర్ ఫలితాల్లో విద్యా వికాస్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కళాశాల యాజమాన్యం పి.సతీష్చంద్, వి.శ్రీనివాస్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో పి.పూర్ణ, ఎ.శ్రావ్యసుష్మ, కె.మౌనిక 465 మార్కులు, భాస్కర్ జాన్ లెన్సన్, డి.జోత్న్సశ్రీ, సింధు ప్రసన్న, హర్షిత 464 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో షణ్ముఖ నాగ చైతన్య ఆంజనేయులు 435, ఎస్.శరణ్య, సురేష్ 434 మార్కులు సాధించారన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో పి.దేదీప్య 990, వై.అమృత 988, బైపీసీలో ఆర్.శ్రావణిలక్ష్మి 984 మార్కులు సాధించినట్లు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు.. తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని ఆ సంస్థ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ, కానూరి నాగేశ్వరరావు, గర్రే శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో పరిటాల ఉష 466, బైపీసీలో పి.లాస్య 433 మార్కులు, సీఈసీలో టి.బిందు 483 మార్కులు సాధించినట్లు చెప్పారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో ఎస్.సంజన కావ్య, ఎ.హెన్నాగ్రేస్లు 988 మార్కులు, బైసీపీలో జి.దివ్య సత్యశ్రీ 989 మార్కులు సాధించినట్లు తెలిపారు. రాణించిన శ్రీరామచంద్ర విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో శ్రీరామచంద్ర విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారని శ్రీ రామచంద్ర విద్యాసంస్థల చైర్మన్ బీవీ కృష్ణారావు తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో డి. శ్రీలక్ష్మి 984, వి.యామిని 983 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎస్డి అజిమున్సీసా 962, ఎం.నాగశ్రీ 960, సీఈసీలో ఎం.ఈశ్వరి 960, జి.సంతోషి 957 మార్కులు సాధించినట్లు చెప్పారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో పీబీఎన్వీ సంపత్ 455, జి.కార్తిక్ సాయి 447, బైపీసీలో డి.లీల వెంకట శివ సంజయ్ 411, సీఈసీలో ఎన్.సురేఖ 437 మార్కులు సాధించినట్లు తెలిపారు. మాధవ్ అరెస్టుపై కురుమల ఆగ్రహం కురుమ కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ దెందులూరు: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్టు చేసి రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైగా కురుమ కులస్తుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురైందని కురుమ కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎం.సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సోమవరప్పాడులో కురుమ సంఘ కార్యాలయంలో, మండల నాయకులు సొసైటీ మాజీ చైర్మన్ మేక సాంబశివరావుతో కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయన్నారు. బలహీన వర్గాల ప్రజలను, వారి ప్రతినిధులను టార్గెట్ చేసి అరెస్టులు చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని అభాసుపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తే ఏ వ్యక్తి అయినా యోగా చేస్తూ కూర్చోలేరన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే ఉండదన్నారు. తీవ్ర దూషణలు చేసిన టీడీనీ కార్యకర్తను నామమాత్రంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేస్తే ఈ సంఘటన ఇక్కడితో అయిపోయిందనుకుంటే కూటమి ప్రభుత్వం భ్రమేనన్నారు. గోరంట్ల మాధవ్పై పోలీస్ శాఖ తీరు కురుమ కులస్తులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. -
అంబేడ్కర్ జయంతి వేడుకలకు సుబ్బయ్యకు ఆహ్వానం
భీమవరం: భారత పార్లమెంట్లో ఈ నెల 14న నిర్వహించనున్న బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని పట్టణానికి చెందిన ఫౌండేషన్ కేంద్ర బోర్డు సభ్యుడు గరికిముక్కు సుబ్బయ్యకు ఆహ్వానం అందిందని శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, అంబేడ్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ మేరకు ఫౌండేషన్ చైర్మన్, కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నుంచి తనకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సుబ్బయ్య తెలిపారు. శ్యాంప్రసాద్కు అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు మండవల్లి: మండలంలోని కానుకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు కురేళ్ల శ్యాంప్రసాద్కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు లభించింది. విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు, విద్యార్థుల ఉన్నతికి చేస్తున్న కృషికి బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రైవేట్ లెక్చరర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య శుక్రవారం తెలిపారు. ఈ నెల 13న గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పురస్కారాన్ని అందిస్తారన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సర్పంచ్ థామస్, గ్రామ పెద్దలు శ్యాంప్రసాద్కు అభినందనలు తెలిపారు. నాటుసారా బట్టీపై మెరుపు దాడులు చాట్రాయి: మండలంలోని పోలవరంలో ముందస్తు సమాచారంతో నూజివీడు ఎకై ్సజ్ ఎస్సైలు వై.ఈశ్వరరావు, ఎం.ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రజువారం సారాబట్టీపై మెరుపు దాడి చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎ.మస్తానయ్య తెలిపారు. ఈ దాడిలో ఓ తోటలో రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్న బిలుగుది చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే సారా తయారీ కోసం ఊరబెట్టిన 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. -
రాట్నాలమ్మ తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
పెదవేగి: మండలంలోని రాట్నాలకుంట గ్రామంలో ఉన్న రాట్నాలమ్మ వారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిఏటా ఎంతో అట్టహాసంగా నిర్వహించే ఈ తిరునాళ్లకు జిల్లా నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు ఈ తిరునాళ్ల జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఈఓ ఎన్.సతీష్, చైర్మన్ మన్నే శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ సెట్టింగ్లు ఆకర్షిస్తున్నాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు రాత్రి సమయాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే 16న మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు జంగారెడ్డిగూడెంలో ఉద్యోగ మేళా జంగారెడ్డిగూడెం: స్థానిక శ్రీరామచంద్ర విద్యాసంస్థల్లో ఆదివారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బీవీ కృష్ణారావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ప్రముఖ ఫార్మా కంపెనీ మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్, హైదరాబాద్ శాఖల్లో ఉన్న 300 ఖాళీలను ఈ మేళాలో భర్తీ చేస్తుందని వివరించారు. పడోతరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 87126 35899, 87126 87497, 87126 11847 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. స్విమ్మింగ్ కోచ్ గణేష్కు అరుదైన గుర్తింపు ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ బలగా గణేష్ పాక్ జలసంధి ఈదేందుకు అనుమతులు సాధించాడు. ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీలంక, భారతదేశం సరిహద్దుల మధ్య 31 కిలోమీటర్ల మేర సముద్రంలో పాక్ జలసంధిలో ఈత కొట్టనున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఈ గుర్తింపు సాధించిన మొట్టమొదట తెలుగు పారా స్విమ్మర్గా అరుదైన ఘనత సాదించాడు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు, డీఎస్ఏ చీఫ్కోచ్ శ్రీనివాసరావుతో పాటు పలువురు శిక్షకులు పోటీ దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆయనకు అభినందనలు తెలిపారు. -
లారీని ఢీకొన్న పెళ్లి కారు
ఉంగుటూరు: జాతీయరహదారిపై శుక్రవారం సాయంత్రం నాచుగుంట క్రాసింగ్ పాయింటు వద్ద లారీ–కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పాలకొల్లుకు చెందిన ఓ కుటుంబం పెళ్లి నిమిత్తం పెళ్లికొడుకుతో సహా ఏలూరు వెళ్తున్నారు. అయితే నాచుగుంట వద్ద ఏలూరు కాలువపై వంతెన మీద నుంచి రహదారి మీదకు ఒక్కసారిగా వచ్చిన క్వారీ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొల్లంశెట్టి నాగమణి (65), కొల్లంశెట్టి నాగేశ్వరరావు(70), గంటాపద్మావతి (58), పసుమర్తి రాజేంద్వరప్రసాదు (38)కు తీవ్రగాయలు కాగా, జి.నవీన్ (34), పెళ్ళికొడుకు, ప్రవీణ్కుమార్(32) స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను హైవే అంబులెన్స్ ద్వారా ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే టోల్ ఫీజు మినహాయింపు కోసం ఉంగుటూరు బ్రిడ్జి మీదుగా నాచుగుంట వద్దకు అక్కడ నుంచి హైవేపైకి వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కార్లకే పరిమితమైన ఉల్లంఘనలు ప్రస్తుతం క్వారీ లారీలు సైతం వస్తుండడంతో రోడ్లు పాడైపోతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికై నా టోల్ అధికారులు ఈ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆరుగురికి గాయాలు -
గ్యాస్ సిలిండర్తో నిరసన
కుక్కునూరు: పెట్రో, గ్యాస్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సీపీఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో శుక్రవారం కుక్కునూరు ప్రధాన సెంటర్ లో గ్యాస్ సిలిండర్తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్లైన్ జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ నరేంద్రమేదీ ప్రభుత్వం నిత్యావసర ధరలు తగ్గిస్తామని చెప్పి వివిధ రకాల పన్నుల భారాన్ని ప్రజలపై మోపి పెట్టుబడిదారులకు వేల కోట్లు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికి అనేక మార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంగాల కల్లయ్య, షేక్ మున్ని, సొడే చిరమయ్య తదితరులు పాల్గొన్నారు. 17న ఆశ్రంలో జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక ఏలూరు రూరల్: ఆశ్రం మెడికల్ కశాశాల ఆవరణలో ఈ నెల 17న సీనియర్ మెన్ జట్టు, 18న అండర్–23 మెన్, అండర్–19 బాలుర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్ఎం శ్రీనివాసరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. 01–09–2002 తర్వాత పుట్టిన వారు అండర్–23 విభాగానికి, 01–09–2006 తర్వాత పుట్టిన వారు అండర్–19 విభాగం పోటీల్లో పాల్గొనేందుకు అర్హులను వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు పుట్టిన తేదీ, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న వారు 2025–2026 సంవత్సరానికి ఏసీఓ నిర్వహించే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. తెలంగాణలో ఉన్నా ఉపాధి సొమ్ము జమ ద్వారకాతిరుమల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవకతవకలు రాష్ట్ర సరిహద్దులు దాటాయి. మండలంలోని ఐఎస్ జగన్నాథపురానికి చెందిన దంపతులు పసుపులేటి నరసింహమూర్తి, అతని భార్య పావని ఏడాది క్రితం తెలంగాణలోని సంగారెడ్డికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే ఐఎస్ జగన్నాథపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో వారికి మస్తర్లు పడుతున్నాయి. దీంతో వారి బ్యాంకు ఖాతాకు నగదు కూడా జమ అవుతుంది. అయితే వారిద్దరూ ఐఎస్ జగన్నాఽథపురంలో ఈనెల 1 నుంచి 5 వరకు పసుపులేటి వీరాయమ్మ తోటలో రింగ్ ట్రెంచ్ పనులు చేసినట్టు ఆన్లైన్లో చూపారు. ఆ పనిదినాలకు సంబంధించిన రూ. 2,742 లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇది తెలిసిన కొందరు గ్రామస్తులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు. అలాగే పనికి వెళ్లని ఒక టీడీపీ నాయకుడికి, తాపీ మేసీ్త్రకి, ట్రాక్టర్ డ్రైవర్కు, ఇలా మరి కొంత మందికి ఉపాధి మస్తర్లు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోందని అంటున్నారు. అయితే దొంగ మస్తర్ల ద్వారా వచ్చే సొమ్ములో వాటాలు సంబంధిత అధికారులు, సిబ్బందికి అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఉపాధి సొమ్మును అక్రమంగా స్వాహా చేస్తున్న వారిపై తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కళారంగంలో హేలాపురి కళకళలు
ఏలూరు (ఆర్ఆర్పేట): కళారంగానికి సంబంధించి ఏలూరుకు ఘనమైన కీర్తి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఈ ప్రాంతానికి గొప్ప గుర్తింపు తీసుకువచ్చారు. ఏలూరు అంటేనే కళలకు కాణాచి అని జాతీయ స్థాయిలో చెప్పుకునేటంత ప్రఖ్యాతి ఈ ప్రాంతానికి ఎంతోమంది కళాకారుల ద్వారా వచ్చింది. సంగీతం, నాటకం, నృత్యం ఇలా ఆయా రంగాల్లో ఏలూరుకు చెందిన కళాకారులు విదేశాల్లో సైతం ప్రదర్శినలిచ్చి అక్కడి ప్రజలను ఉర్రూతలూగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి ఏలూరుపై 2025వ సంవత్సరంలో కళారత్న (హంస)అవార్డులు గుంపులుగా వాలాయి. హేలాపురి కీర్తి కిరీటంలో కళారత్నాలు కళా సాంస్కృతిక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో హంస అవార్డు అత్యున్నతమైనదిగా కళాకారులు భావిస్తారు. ఈ అవార్డు రావాలంటే 64 కళల్లో ఏదో ఒక కళలో విశేషమైన కృషి, సేవ చేసి ఉండాలి. అలాగని ఎవరికిపడితే వారికి ఇచ్చే అవార్డు కాదిది. 64 కళల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంతో కొంతమంది తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. అలాంటి వారి పోటీని ఎదుర్కొని ఈ అవార్డు సాధించడం గొప్ప ఘనతగానే గుర్తించాలి. అంతటి ఘనతను ఏలూరుకు చెందిన ముగ్గురు కళాకారులు ఈ ఏడాది ఉగాది నాడు అవార్డులు అందుకుని హేలాపురి కీర్తి కిరీటంలో కళారత్నాలుగా నిలిచారు. సినీ, నాటక రంగాల్లో చేసిన కృషికిగానూ ఎస్వీ రామారావు, కూచిపూడి నృత్య రంగంలో చేసిన కృషికి గానూ ఎ.పార్వతి రామచంద్రన్, హరికథాగాన రంగంలో సప్పా భారతికి అవార్డులు వచ్చాయి. ఏలూరులో ఒకే ఏడాది ముగ్గురికి కళారత్న అవార్డులు లలిత కళల్లో చేసిన సేవలకు ప్రభుత్వ గుర్తింపు -
మండల సమావేశం బహిష్కరణ
యలమంచిలి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఊహించని పరిణామానికి అటు అధికారులు, ఇటు కూటమి సర్పంచ్లు బిత్తరపోయారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత ఏర్పాటు చేశారు. సమావేశానికి వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రతిపక్ష కూటమి సభ్యులు ఎవరూ రాలేదు. ఇటీవలె వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ మాత్రం వచ్చారు. సమావేశాన్ని ఇన్చార్జి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేస్తామని చెబుతుండగా వైఎస్సార్ సీపీకి చెందిన గుంపర్రు ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తనను అన్యాయంగా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఏనుగువానిలంక ఎంపీటీసీ సభ్యులు వినుకొండ ధనలక్ష్మి మాట్లాడుతూ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 12 మంది సభ్యులు ఉన్నా నలుగురు సభ్యులు ఉన్న కూటమి నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలకు అధికారులు వత్తాసు పలికి ఎన్నికను అర్ధాంతరంగా నిలిపివేయడానికి నిరసనగా మండల సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. దీంతో మిగిలిన 11 మంది సభ్యులు ఆమె వెంట బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి మాట్లాడుతూ ఎంపీటీసీ సభ్యులకు మద్దతుగా సర్పంచ్లు కూడా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికీ మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ మాత్రమే సంతకం చేశారు. దీంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత ప్రకటించారు. యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదాపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల నిరసన -
రీ–సర్వేపై కేంద్ర బృందం పర్యటన
తాడేపల్లిగూడెం అర్బన్/తాడపల్లిగూడెం రూరల్/ పెంటపాడు : ప్రజలకు చెందిన స్థిరాస్తుల వివరాలు పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రీ–సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్ అధికారి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి, యశడా డైరెక్టర్ జనరల్ నిరంజన్ కుమార్ సుధానుసు తెలిపారు. ఈ సందర్భంగా భూముల రీ–సర్వేపై స్థానిక నిట్ కాన్ఫరెన్స్ హాలులో కేంద్రభుత్వం నుంచి వచ్చిన బృందం జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నిర్వహించిన రీ–సర్వేపై చర్చించారు. ఇప్పటి వరకు పూర్తిచేసిన రెండు విడతల రీసర్వేలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించిన వివరాలపై సమీక్షించారు. తాడేపల్లిగూడెంలోని 23వ వార్డులో రీసర్వే నిర్వహించిన ప్రాంతాల ప్రజలతో చర్చించి వారి నుంచి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలోని రెండో ప్రపంచ యుద్ధ అవసరాలకు వినియోగించిన విమానాశ్రయ భూముల్లో సుమారు 4 వేల కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయన్నారు. ఆయా భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వ బృందానికి తెలియజేశారు. అలాగే మండలంలోని చినతాడేపల్లి గ్రామానికి చెందిన అక్కిన గంగాభవాని నివాసం వద్ద కడియద్ద రెవెన్యూకు సంబంధించిన రీ–సర్వేపై రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పెంటపాడు మండలంలోని కె. పెంటపాడు బైరాగిమఠంలో నిర్వహించిన సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో సర్వే డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ డీఎల్బీఎల్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విద్యులత, ఐఏఎస్ అధికారి ఆర్ఎం గోవిందరావు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కౌసర్భానో, ఆర్డీ బాలస్వామి, మున్సిపల్ కమిషనర్ వై.ఏసు పాల్గొన్నారు. -
కంకర మాఫియాకు పోల‘వరం’
ఉంగుటూరు: మండలంలోని కంకర మట్టి మాఫియాకు పోలవరం కుడికాలువ గట్టు వరంలా మారింది. రాత్రి సమయంలో పోలవరం కుడికాలువ గట్టును తవ్వి దర్జాగా మట్టిని తరలించుకుపోతున్నారు. మండలంలోని చేబ్రోలు, నారాయణపురం, కై కరం గ్రామాల్లో ఈ కంకర మాఫియా ముఠాలు తయారయ్యాయి. అలాగే మండల సరిహద్దు ప్రాంతమైన శింగరాజుపాలెం నుంచి ఉంగుటూరు మండలం కంసాలిగుంట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేరకు ఈ కాలువ విస్తరించి ఉంది. ఆ కాలువ వెంబడి గోపాలపురం, గొల్లగూడెం, కంసాలిగుంట, నల్లమాడు, యర్రమిల్లిపాడు గ్రామాల్లో రోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లపై కంకర తరలిపోతోంది. లక్షలాదిరూపాయలు సొమ్ములు ఆర్జిస్తున్నారు. కూటమి ముఖ్య నేతల అండదండలతోనే ఈ కంకర మాఫియా చెలరేగిపోతుందని ప్రజలు చెబుతున్నారు. ఈ తవ్వకాలు గొల్లగూడెం వీఆర్ఓ నాగరాజును ప్రశ్నించగా మా దృష్టికి వచ్చిన వెంటనే వెళ్లి పట్టుకుని కేసులు పెడుతున్నట్లు వివరించారు. అలాగే ఇటీవల కంసాలిగుంట ప్రాంతం నుంచి కంకర తరలిస్తుంటే కేసులు కూడా నమోదు చేశామని వివరించారు. -
తప్పుడు కేసులకు అదరం.. బెదరం
కైకలూరు: వైఎస్సార్సీపీ జిల్లా ఆత్మీయ సభ విజయవంతం కావడంతో తట్టుకోలేక కూటమి నేతలు పసలేని విమర్శలు చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చర్యకు ప్రతిచర్య అనే కోణంలో మాట్లాడిన మాటలకు కూటమి నేతలు పెద్ద రాద్దాంతం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు ఇంతకన్నా దారుణమైన పదాలతో హింసిస్తున్న సంగతి అందరికీ తెలుసన్నారు. కారుమూరి, ఏలూరు పార్టీ ఇన్చార్జి జేపీపై కేసులు నమోదు చేయడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పో రాడతామని, తప్పుడు కేసులకు తమ నాయకులు, కార్యకర్తలు బెదరరని ఘాటుగా స్పందించారు. రౌడీయిజానికి అడ్డాగా కై కలూరు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కై కలూరులో రౌ డీరాజ్యం, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయని, ఎమ్మెల్యే కా మినేని శ్రీనివాస్ వీటిని ప్రోత్సహిస్తున్నారని డీఎన్నార్ విమర్శించారు. ఇటీవల సంత మార్కెట్ వద్ద బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి దుకాణానికి ఇద్దరు రౌడీలు ఏకంగా తాళాలు వేశారన్నారు. కార్లు అడ్డంగా పెట్టి కక్కిన కూడుకు కక్కుర్తి పడినట్టుగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీని ఓటు వేయకుండా అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే కామినేని బయట ఒక మాట, లోపల మరో మాట మాట్లాడుతున్నారన్నారు. తన కుటుంబానికి చెందిన చేపల చెరువులో చేపలను పట్టి అమ్ముకోవాలని రౌడీలకు ఆయనే చెప్పారని ఆరోపించారు. ఎమ్మెల్యే కామినేని వయసుకు గౌరవవిస్తామని, రౌడీయిజం, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. కై కలూరులో ఓ పోలీసు అధికారి కూటమి పార్టీ నాయకుల సొంత మనిషిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కూ టమి నేతల సిఫార్సులతో అక్రమ కేసులు నమోదు చేయకుండా పోలీసులు విధులు నిర్వహించాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీ సయ్యపురాజు గుర్రాజు, జిల్లా అధికార ప్రతినిథి మోట్రూ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ చర్యకు ప్రతిచర్య కోణంలోనే కారుమూరి వ్యాఖ్యలు జిల్లా ఆత్మీయ సభ సక్సెస్నుతట్టుకోలేక కూటమి నాయకుల విమర్శలు -
వక్ఫ్ బిల్లుపై నిరసన హోరు
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద కర్బలా మైదానం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. ముస్లిం యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎండీ ఇలియాజ్ మాట్లాడుతూ ముస్లిం పూర్వీకులు పుణ్యం కోసం దానం చేసిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేలా వక్ఫ్ సవరణ చట్టం రూపొందించారని విమర్శించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యవాదులంతా చట్టాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు. కేంద్రం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ర్యాలీకి వైఎస్సార్సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, నాయకులు మద్దతు తెలిపారు. అలా గే ర్యాలీకి ఎమ్మెల్యే బడేటి చంటి మద్దతు తెలపడం గమనార్హం. ర్యాలీలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రా జనాల రామ్మోహన్రావు, కమ్యూనిస్టు పార్టీ నా యకులు, ముస్లిం పురుషులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో శేషగిరికి వినతిపత్రం ఇచ్చారు. అంజుమన్ అధ్యక్షుడు ఎండీ జబివుల్లా, జమాత్ ఇస్లాం అధ్యక్షుడు ఇబ్రహీం, నయీముల్లా, రియాజ్, జావీద్, సూ రజ్, రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో భారీ ర్యాలీ -
పేరుకే స్టాక్ పాయింట్
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025అడ్డగోలుగా వసూళ్లు ఇసుక ఉచితమని, లో డింగ్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏ ర్యాంపు వద్దకు వెళ్లినా లోడింగ్ చార్జీలతో పాటు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని వినియోగదారులతో పాటు కిరాయిలు రాక లారీ యజమానులు నష్టపోతున్నాం. అధికారులు స్పందించి అదనపు వసూళ్లను ఆపాలి. – రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు సాక్షి, భీమవరం: జిల్లాలోని ఆరు ఓపెన్ రీచ్లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో వాటిని మూసివేశారు. ఇసుక కోసం తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని తీపర్రు, పెండ్యాల, పందలపర్రు, గోపాలపురం, తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. స్థానిక అవసరాల నిమిత్తం ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. తీపర్రు–2 ర్యాంపు నుంచి ఇసుకను తరలించి స్టాకు యార్డుల ద్వారా అమ్మకాలు చేసే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఆచంట స్టాక్ పాయింట్ వద్ద టన్ను రూ.295, పాలకొల్లులో రూ.320, తాడేపల్లిగూడెంలో రూ.300, తణుకులో రూ.215, నరసాపురంలో రూ.370, ఉండిలో రూ.440గా ధర నిర్ణయించారు. ఆయా స్టాకు పాయింట్ల వద్ద మొత్తం 900 టన్నుల ఇసుక అందుబాటులో ఉంచామని, అవసరమైన వారు తీసుకువెళ్లాలని ఫిబ్రవరి మొదటి వారంలో అధికారులు ప్రకటించారు. సేల్స్ మొదలు కాలేదు వినియోగదారులు తమ వివరాలను వెబ్సైట్లో నమోదుచేసుకుని రిజిస్ట్రేషన్ రశీదును స్టాక్ పాయింట్ వద్ద చూపించి ఇసుక పొందవచ్చని, లేదా నేరుగా స్టాక్ పాయింట్ వద్దకు ఆధార్ కార్డును చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. పాయింట్ వద్ద రిజిస్ట్రేషన్ చేయిస్తే అక్కడి ఇన్చార్జి డిజిటల్ పేమెంట్ చేయించుకుని ఇసుక సరఫరా చేసేలా ఏర్పాటుచేశారు. ఆయా స్టాక్ పాయింట్ల వద్ద ఉండే ఇన్చార్జిల నంబర్లను అధికారులు విడుదల చేశారు. వీటిలో కొన్ని పనిచేస్తుండగా మరికొన్ని స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం, తణుకు, ఉండి కౌంటర్ల ఇన్చార్జిలకు ఫోన్లు చేసి ఇసుక అమ్మకాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి అమ్మకాలు ఇంకా మొదలు కాలేదన్న సమాధానం వచ్చింది. అమ్మకాలు ప్రారంభించకపోవడంపై జిల్లా గనులు, భూగర్భశాఖ ఏడీని ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా కనెక్ట్ అవ్వలేదు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఉదాహరణకు ఐదు యూనిట్ల లారీని నింపేందుకు దాదాపు 20 టన్నుల ఇసుక అవసరమవుతుంది. ప్రస్తుతం ర్యాంపు వద్ద నుంచి ఉండి ప్రాంతానికి లారీకి సుమారు రూ.17 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఏర్పాటుచేసిన స్టాక్ పాయింట్ను వినియోగంలోకి తెస్తే ఇసుక లోడింగ్కు రూ.8,800, రవాణా నిమిత్తం రూ.3 వేలు వెచ్చించినా రూ.11,800లకే ఇసుక లభ్యమవుతుంది. వినియోగదారులకు రూ.5 వేల వరకు ఆదా అవుతుందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ స్టాకు పా యింట్లతో ర్యాంపు నిర్వాహకుల దోపిడీకి ఆస్కారం ఉండదు. తక్కువ ధరకే జిల్లా వాసులకు ఇసుక లభ్యమవుతుంది. జిల్లాలో ఏర్పాటుచేసిన స్టాకు పాయింట్లు తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. న్యూస్రీల్ఇసుక.. మస్కా టన్ను ఇసుక ఇచ్చింది లేదు జిల్లాలో అలంకారప్రాయంగా స్టాక్ యార్డులు ఏర్పాటుచేసి రెండు నెలలు ఇంకా మొదలుకాని ఇసుక విక్రయాలు ర్యాంపుల వద్ద లారీకి రూ.5 వేల దోపిడీ జిల్లావాసులపై రోజుకు రూ.30 లక్షల వరకు అదనపు భారం రూ. లక్షల్లో భారం పొరుగు జిల్లాల్లోని ఏ ర్యాంపు వద్దకు వెళ్లినా లోడింగ్ చార్జీలతో పాటు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనంగా చెల్లిస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నట్టు లారీ యజమానులు చెబుతున్నారు. అదనపు వసూళ్ల రూపంలో పాలకులు, నాయకుల జేబుల్లోకి వెళుతున్న వాటాల మొత్తం భారాన్ని జిల్లాలోని వినియోగదారులు భరించాల్సి వస్తోందంటున్నారు. ఆయా ర్యాంపుల నుంచి జిల్లాకు రోజుకు 500 నుంచి 600 లారీల ఇసుక రవాణా జరుగుతుండగా ఈ మేరకు స్థానిక వినియోగదారులపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు భారం పడుతోందని అంచనా. మూసి ఉన్న ఈ కౌంటర్ను గమనించారా? ఉండి నియోజకవర్గ ప్రజల ఇసుక అవసరాలు తీర్చే నిమిత్తం కొలమూరులోని ప్రైవేట్ స్థలంలో మైనింగ్ అధికారులు ఏర్పాటుచేసిన స్టాక్ యార్డ్లోని కౌంటర్ ఇది. వినియోగదారులకు ఇక్కడ ప్రభుత్వ నిర్ణీత ధరకే ఇసుకను విక్రయించనున్నట్టు ప్రకటించారు. స్టాక్ పాయింట్ నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. స్టాక్ యార్డు ఏర్పాటుచేసి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఈ కౌంటర్ను ఓపెన్ చేసి వినియోగదారులకు లారీ ఇసుక విక్రయించిన దాఖలాలు లేవు. -
పత్రికా స్వేచ్ఛకు విఘాతం
పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. ఇదేమి పాలన అని ప్రశ్నిస్తే కేసులు.. ఏమిటీ దౌర్జన్యం అని నిలదీస్తే దాడులు.. అన్యాయం అని నిరసన తెలిపితే అరెస్టులు.. ప్రజాస్వామ్యం జిందాబాద్ అంటే జైళ్లు.. ఇదీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ తీరు. రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు ‘సాక్షి’పై కక్ష గట్టిన ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు ఆరుగురు విలేకరులపై అక్రమ కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాత్రికేయులు గళమెత్తారు. తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపి వినతిపత్రాలు అందించారు. తణుకు అర్బన్: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథ నానికి ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంపై తణుకు ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు తహసీలార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని నినదించారు. ఏపీయూ డబ్ల్యూ జే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులా భాస్కర్ మా ట్లాడుతూ జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా అక్రమ కేసులు నమోదుచేయడం శోచనీయమన్నా రు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. అనంతరం తహసీల్దార్ దండు అశోక్వర్మకు తణుకు ప్రెస్క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూ జే మాజీ సెక్రటరీ కొడమంచిలి కృష్ణ, ఏపీయూడబ్ల్యూజే చిన్నపత్రికల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి ఏడుకొండలు, తణుకు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు బొండ రామ్కుమార్, పాత్రికేయులు తానేటి దొరబాబు, గజ్జరపు నారాయణమూర్తి, కొలగాని రాజా, పంజా శివ, వెలగల నారాయణరెడ్డి, చిల్లా రాజశేఖర్, గాదిరెడ్డి రామ్ప్రసాద్, రంబాల బద్రి, అమర రాజశేఖర్, సతీష్, హరీష్, పెద్దిరాజు, సత్యప్రసాద్, డేగల మణి, ఆనంద్, ముమ్మిడివరపు ప్రతాప్ తదిత రులు పాల్గొన్నారు. కేసులు సిగ్గు సిగ్గు ఉండి: మీడియాపై అక్రమ కేసులు సిగ్గు సిగ్గు అంటూ ఉండి ప్రెస్క్లబ్ ప్రతినిధులు నినదించారు. ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డి.కృష్ణమోహన్, చిట్టూరి జోషి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రత్నకుమార్కు వినతిపత్రాన్ని అందజేశా రు. మీడియాపై అక్రమ కేసులు దారుణమని, గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన నీతులు మర్చిపోయిందా అంటూ ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలిచే మీడియాను అణగదొక్కేలా అక్రమ కేసులు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సీనియర్ జర్నలిస్టులు తాళం హనుమంతరావు, బురిడి రవిబాబు, సీహెచ్ బంగార్రావు, ప్రెస్క్లబ్ కోశాధికారి సత్యనారాయణ, సభ్యులు తాళం హనుమంతరావు, బురిడి రవిబాబు, సీహెచ్ బంగార్రావు, మణికంఠ, కేశవ, బాలాజీ, వెంకటరమణ, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి పెనుగొండ: జర్నలిస్టులపై కేసు నమోదు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతమే అంటూ పెను గొండలో జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెనుగొండలో తహసీల్దార్ జి.అనితకుమారికి వినతిపత్రం సమర్పించారు. విలేకరులు గుర్రాల శ్రీనివాసరావు, తేతలి తమ్మిరెడ్డి, బి.చిట్టిబాబు, రాజశేఖర్, పి.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. కేసులు తక్షణమే ఎత్తివేయాలి జంగారెడ్డిగూడెం: ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు జంగారెడ్డిగూడెంలో శుక్రవారం స మావేశమయ్యారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ కోరారు. అక్రమ కేసులను తక్షణ మే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డీవీ భాస్కరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ రమణరావు, ఎం.గంగరాజు పాల్గొన్నారు. అక్రమ కేసులు అన్యాయం పాలకొల్లు సెంట్రల్: వృత్తి ధర్మంలో భాగంగా వార్తలు రాస్తే కేసులు కట్టే సంస్కృతి నుంచి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పాలకొల్లు ప్రెస్క్లబ్ సెక్రటరీ ఎంఎన్వీ సాంబశివరావు అన్నారు. శుక్రవారం పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్కు వినతిపత్రం అందజేశారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరా రు. ప్రెస్క్లబ్ ట్రెజరర్ తోట రాంబాబు, క్లబ్ సభ్యు లు బండి శ్రీనివాస్, పులపర్తి నాని, మండెల అప్పలరాజు, వానపల్లి భాను, కారుమంచి రాజ్గోపాల్, పప్పుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు నిరసనలు.. వినతిపత్రాలు అందజేత జిల్లావ్యాప్తంగా ఆందోళనలు -
ఆదర్శనీయులు జ్యోతిరావు పూలే
కై కలూరు: సమాజ దురాచారాలను ఎదుర్కొనే ఆయుధంగా చదువును మలిచిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శనీయులని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. శుక్రవారం పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని కో రుకొల్లు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూ పూలే ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ముదురాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోట్రూ అర్జునరావు మాట్లాడా రు. పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రా ష్ట్ర రైతు విభాగ సెక్రటరీ సయ్యపురాజు గుర్రాజు, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ జయమంగళ కాసులు, మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు కూర్మా నేహీమియా, బోయిన చంద్రభోగేశ్వరరావు, మహమ్మద్ గాలిబ్బాబు, గండికోట ఏసుబాబు, పాము రవికుమార్, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో నియామకాలు ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ సెక్రటరీగా తుమూరి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ సెక్రటరీలుగా గరికిముక్కు జాన్విక్టర్, బూరుగుపల్లి ప్రేమ్ కుమార్ను నియమించారు. సూత్రధారులను వదిలి పాత్రధారుల అరెస్టా? కొయ్యలగూడెం: సూత్రధారులను వదిలి పా త్రధారులను అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం చట్టాన్ని పక్కదోవ పట్టిస్తోందని మాజీ ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవా రం వైఎస్సార్సీపీ యూత్ నేత నూకల రాము ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పార్టీ పోలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై కిరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడు కిరణ్ వెనకున్న అసలు దోషులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. కిరణ్ని అరెస్టు చేసిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నా రు. జగన్ని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చే సుకుని అసత్యపు ఆరోపణలు చేస్తోందన్నారు. నిలకడ లేని రాజకీయాలకు పవన్ కల్యాణ్, నైతిక విలువలు లేని రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్గా నిలిచారని అన్నారు. వైఎస్సార్సీపీ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు రుచి చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, టౌన్ కన్వీనర్ సంకు కొండ, ఎంపీటీసీ ఘంటసాల సీనమ్మ, నాయకులు పాల్గొన్నారు.నేడు రిజిస్ట్రేషన్కార్యాలయాలు పనిచేస్తాయి ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలు శనివారం పనిచేస్తాయని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సా యంత్రం 5.30 గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తాయన్నారు. ఇదిలా ఉండగా రెండో శని వారం, సెలవు రోజుల్లో కార్యాలయాలు తెరవడంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్ కోర్సుల ప్రాక్టికల్ పరీ క్షలు శుక్రవారం ముగిశాయి. భౌతికశాస్త్రం, ర సాయనశాస్త్రం పరీక్షలకు 67 మంది హాజర య్యారని డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
వరి నేలవాలి.. రైతులు విలవిల్లాడి
● ఈదురుగాలులతో బెంబేలు ● వర్షంతో తడిసిన ధాన్యం గణపవరం/ఆకివీడు: వాతావరణం రైతులను కలవరపెడుతోంది. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్మి ఈదురుగాలులు వీస్తూ చిరుజల్లులు పడుతున్నాయి. అయితే గురువారం రాత్రి భారీ వర్షం కురవడంతో కోతలకు సిద్ధమైన వరి చేలు నేలనంటాయి. గణపవరం మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో రబీ పంట వేయగా ఇప్పటికే 2 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యాయి. 25 శాతం పంట కోత దశలో, మిగిలిన పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేలవాలిన పైరును శుక్రవారం రైతులు నిలబెట్టి కట్టలు కట్టారు. చేలల్లో చేరిన నీటిని బయటకు తరలిస్తున్నారు. కోతలు పూర్తయి ధాన్యాన్ని రోడ్ల మీదికి చేర్చిన రైతులు ఎండ బెట్టుకుంటున్నారు. ధాన్యం రాశులు తడవకుండా బరకాలు, టార్పాలిన్లు కప్పి కాపాడుకుంటున్నారు. నె లాఖరు వరకూ వాతావరణం అనుకూలిస్తే గ ట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఆకివీడు, భీమడోలు తదితర మండలాల్లో తడిసిన, యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. -
చెరువు గట్టుపై చెట్లు అమ్మేశారని ఫిర్యాదు
ద్వారకాతిరుమల: మండలంలోని తిరుమలంపాలెంలో నారప్ప చెరువు గట్టుపై ఉన్న ఎన్నో ఏళ్ల నాటి చెట్లను కొందరు అక్రమార్కులు నరికివేసి, అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దీనిపై భీమడోలుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త కొత్తపల్లి చంద్రమౌళి గురువారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్థానిక నారప్ప చెరువు గట్టుపై ఉన్న దశాబ్దాల కాలం నాటి 15 చెట్లను కొందరు వ్యక్తులు వారం రోజుల క్రితం అక్రమంగా నరికివేసి, పంగిడిగూడేనికి చెందిన ఒక వ్యక్తికి రూ. 2.80 లక్షలకు విక్రయించినట్టు చంద్రమౌళి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ అధికారులకు, నీటి సంఘం అద్యక్షుడికి తెలిసే జరిగిందని ఆరోపించారు. దీనిపై పంచాయితీ కార్యదర్శి నాగదేవిని వివరణ కోరగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్టు చెప్పారు. చెట్లు నరికి చాలా రోజులు అయినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని, ఆరు చెట్టు కొమ్మలు మాత్రమే అక్కడ ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై స్థానిక పోలీస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
భగవద్గీత అనువాదం గొప్ప విషయం
పాలకొల్లు సెంట్రల్: భగవద్గీతను వంద భాషల్లో అనువాదం చేయాలనే సంకల్పం చాలా గొప్ప విషయమని రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. గురువారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో గజల్ శ్రీనివాస్ సంగీతం సమకూర్చి గానం చేసిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత (తెలుగు) లోకార్పణ కార్యక్రమం సేవ్ టెంపుల్ భారత్, సూర్యనారాయణమూర్తి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ తండ్రి కేశిరాజు నరసింహరావు చేతులు మీదుగా భగవద్గీత లోకార్పణ కార్యక్రమం ఆవిష్కరించారు. ఈ సందర్భంగాగజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భగవద్గీతను దాదాపుగా వంద భాషల్లో అనువదించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే 25 భాషల్లో భగవద్గీత రికార్డింగ్ పూర్తయ్యిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి, అంగర రామ్మోహన్, యడ్ల తాతాజీ, కుమార దత్తాత్రేయ వర్మ, డీటీడీసీ బాబు, పెండ్ర వీరన్న, చినిమిల్లి సత్యనారాయణరావు పాల్గొన్నారు. -
హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
భీమవరం: పట్టణంలోని విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యు.స్వర్ణకుమారి (19) కళాశాల హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణకుమారి గురువారం తరగతులకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండి తన స్నేహితుడికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతడు కళాశాలలోని తన స్నేహితులకు చెప్పడంతో హాస్టల్ గదికి వెళ్లేసరికి స్వర్ణకుమారి చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళ్లాడుతూ కనిపించింది. హుటాహుటిన చికిత్స కోసం ప్రవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె స్నేహితులతో టూర్ వెళ్లడానికి ప్లాన్ చేసుకోగా తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై రూరల్ సీఐ బి.శ్రీనివాసరావును వివరణ కోరగా ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. నేషనల్ క్రికెట్ టీంకు క్రీడాకారుడి ఎంపిక పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణం బ్రాడీపేట ప్రాంతానికి చెందిన షేక్ సమీరుద్దీన్ నేషనల్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఇండో–నేపాల్ కప్ చాంపియన్షిప్–2025 క్రికెట్ టోర్నమెంట్కు ఇండియా తరఫున ఆడేందుకు నైన్ ఏ సైడ్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సంస్థ నుంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు వచ్చినట్లు సమీరుద్దీన్ తెలిపాడు. ఈ టోర్నమెంట్ మే 26 నుంచి 31 వరకూ నేపాల్లో ఆరురోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం చైతన్య కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాని పేర్కొన్నారు. అలాగే పీడీ రామకృష్ణ, మణికంఠల శిక్షణలో తర్ఫీదు పొందుతున్నానని వివరించాడు. త్వరలో క్రికెట్ అకాడమీకి పిలుస్తామని సిద్దంగా ఉండాలని నైన్ ఏ సైడ్ సంస్థ సభ్యులు సమాచారం ఇచ్చినట్లు సమీరుద్దీన్ తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ ఏలూరు రూరల్: ఏలూరుకు చెందిన కంఠం సాయితరుణ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ చాటుతున్నాడని శిక్షకుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు బదిరెడ్డి రామ్ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1న బైలాస్పూర్లో ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ నిర్వహించిన జూనియర్ మిస్టర్ ఇండియా చాంపియన్షిప్ పోటీల్లో 80 కేజీల విభాగంలో తృతీయస్థానం సాధించాడని వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం భీమవరంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర పోటీల్లో సైతం చాంపియన్స్ ఆఫ్ ది చాంపియన్స్గా నిలిచి ఓవరాల్ టైటిల్ కై వసం చేజిక్కించుకున్నాడని హర్షం వ్యక్తం చేశారు. -
విద్యుత్ షాక్తో బాలుడి మృతి
నూజివీడు: పట్టణంలోని సబ్కలెక్టర్ కార్యాలయం మలుపులో నిర్మాణంలో ఉన్న నూతన బిల్డింగ్లో టైల్స్ వేసే పనికి వెళ్లిన 17 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అజరయ్యపేటకు చెందిన చిట్లూరి ప్రవీణ్ (17) తొమ్మిదో తరగతి వరకు చదువుకొని ఆ తరువాత తన తండ్రికి పనుల్లో సాయంగా వంట పనికి వెళ్తుంటాడు. వంట పని లేనిప్పుడు కూలి పనులకు వెళ్తూ ఉంటాడు. దీనిలో భాగంగా నూతన బిల్డింగ్లో టైల్స్ వేసే పనికి మేసీ్త్రతో పాటు వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా ఊదయం 10 గంటల సమయంలో సున్నం బస్తాను తీసుకుని అక్కడే ఉన్న ఐరన్ గ్రిల్స్పై కాలు వేయగానే గిలాగిలా కొట్టుకొంటూ కిందపడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న మేసీ్త్ర లాగు శ్రీను బాలుడిని పట్టుకోగా అతను పెద్దగా కేకలు వేస్తూ గిలాగిలా కొట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్ అతను కేకలు విని చూసి పరిగెత్తుకొని వచ్చి కరెంటు బోర్డులో ఉన్న విద్యుత్ తీగను తప్పించాడు. ఈ తీగకు ఉన్న అతుకులు తొలగి ఐరన్ గ్రిల్స్కు ఆనడం వల్ల గ్రీల్స్కు కరెంటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం లాగు శ్రీనుని, ప్రవీణ్లను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. షాక్కు గురైన మేసీ్త్ర లాగు శ్రీను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో అజరయ్యపేటలో తీవ్ర విషాదం నెలకొంది. -
శుభలేఖలు పంచి వస్తూ.. అనంతలోకాలకు
రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృతి దెందులూరు: మండలంలోని కొమిరేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం అనంతపల్లి గ్రామానికి చెందిన గురుమిల్లి అప్పారావు, నిడమర్రు గ్రామానికి చెందిన పతివాడ బాపన్న వరుసకు బావ, బావమరిదిలు. వీరు బాపన్న కుమారుడు వివాహ శుభలేఖలు ఇవ్వడానికి బైక్పై దెందులూరు వచ్చారు. శుభలేఖలు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా కొమిరేపల్లి సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఓ కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుమిల్లి అప్పారావు(47) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ పతివాడ బాపన్న(50) ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెనుమంట్ర: మండలంలోని మార్టేరు రోడ్డులోని బ్రాహ్మణ చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సిద్ధాంతం గ్రామానికి చెందిన సతీష్ బైక్పై వెళ్తూ బ్రాహ్మణచెరువు గ్రామంలో అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించగా సతీష్కు తీవ్రగాయాలయ్యాయి. సతీష్ను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పెనుమంట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. డ్రెయిన్లో వ్యక్తి మృతదేహం లభ్యం భీమవరం: భీమవరం రెండో పట్టణ పరిధి రాయలం డ్రెయిన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేసు కూడా నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పెదవేగి : గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో విజయరాయికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదవేగి ఎస్సై కె.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం విజయరాయి గ్రామానికి చెందిన కంబంపాటి రాజేంద్రప్రసాద్ ఈ నెల 9న సాయంత్రం స్థానిక నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రోజువారీ పని ముగించుకుని ఇంటి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో స్థానికులు రాజేంద్రప్రసాద్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడి భార్య దుర్గాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
వేతన యాతన తీరేదెప్పుడు..?
తణుకు అర్బన్: ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలివ్వడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. నిత్యం ఆస్ప్రత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు చేసే వారి ఇళ్లు ఆకలికేకలతో అల్లాడుతున్నాయి. శుభ్రత, భద్రత, క్షేమంగా ఇంటికి చేర్చే రంగాల్లో వారు సేవలు అమోఘంగా చేస్తున్నా సరైన సమయానికి వేతనాలు అందించడం లేదని కార్మికులు వాపోతున్నారు.తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ విభాగం, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా గతం నుంచి రోగులకు సత్వర సేవలందుతున్నాయి. కానీ నేడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలు, సెక్యూరిటీ విభాగం 2 నెలలు, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు రెండు నెలలు జీతం పెండింగ్లో ఉండడంతో కుటుంబాలను పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కుదిరితే అప్పులు..లేకపోతే పస్తులు జీతం రాకపోయినా ఖర్చులు తప్పవు అనే ఉద్దేశంతో ఇళ్లు గడిపేందుకు అప్పులు చేస్తున్నామంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో వచ్చే వ్యర్థాలతోపాటు వివిధ వార్డుల్లో వచ్చే వ్యర్థాలను తొలగించడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలకంగా పనిచేస్తుంటారు. రక్తపు వ్యర్థాల తొలగింపులో రోగాలబారిన పడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లోనే విధుల్లో ఉండాల్సి వస్తుందని అయినప్పటికీ ఏ నెల వేతనం ఆ నెల ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు రోగుల రక్షణ, భద్రతలో కీలకంగా ఉంటారు. రోగులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లో పంపించడంతోపాటు ఎలాంటి ఘర్షణలు జరిగినా సర్దబాటు చేయడంలోను ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. లోపలకు వచ్చేవారితోపాటు బయటకు వెళ్లేవారిని గమనిస్తూ ఎటువంటి చోరీలు జరగకుండా చూస్తుంటారు. క్షేమంగా ఇంటికి చేర్చినా.. ఆస్పత్రిలో ప్రసవాల అనంతరం తల్లి, బిడ్డను క్షేమంగా వారి ఇంటికి చేర్చడంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు సత్వర సేవలు అందిస్తుంటారు. అరకొర వేతనంతోనే విధులు నిర్వర్తిస్తూ బాలింతలను సురక్షితంగా ఇంటికి చేరుస్తూ వారి ప్రశంసలు పొందుతున్నారు. గత ఐదేళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచిన ఈ సేవలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వారి జీవనోపాధి కుంటుపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి ఆయా కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అప్పులతో కాలం గడుపుతున్నారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చే స్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ వేతనానికి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ వేతనం కూడా ఏ నెల వేతనం ఆ నెలలో ఇవ్వకుండా నెలలపాటు బకాయిలు పెట్టి వారిని అప్పులపాలు చేస్తున్నారు. కార్మికుల ఆకలికేకలు పట్టించుకోని ప్రభుత్వాలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కోనాల భీమారావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు ప్రభుత్వాస్పత్రుల్లో కార్మికులకు నెలల తరబడి వేతనాల పెండింగ్ అప్పులు చేసి బతుకుతున్నామంటూ ఆవేదన జిల్లాలో ప్రభుత్వాస్పత్రిలో కార్మికులు విభాగం కార్మికుల సంఖ్య పారిశుద్ధ్యం 152 సెక్యూరిటీ 110 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లు 14 -
పీజీ సెంటర్లో కూలుతున్న అకడమిక్ బ్లాక్ భవనం
నూజివీడు: పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీకి చెందిన పీజీ కేంద్రంలోని అకడమిక్ బ్లాక్ భవనం ద్వితీయ అంతస్తు స్లాబు బుధవారం కూలిపోయింది. ఈ సమయంలో పైన పెద్ద శబ్దం రావడంతో కింది అంతస్తులో ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై భవనంపై నుంచి కిందకు పరుగులు తీశారు. ఈ అంతస్థు కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో గత ఏడాది కాలంగా ఈ భవనంలోని గదుల్లో తరగతులు నిర్వహించడం లేదు. దానంతట అదే కూలిపోక ముందే, ఎలాంటి ప్రమాదం చోటు చోసుకోకముందే ఈ భవనం పై అంతస్థును కూల్చేయాలని పీజీ సెంటర్లోని అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పలుమార్లు యూనివర్శిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు ఏమాత్రం స్పందించడం లేదు. గత నెలలో పీజీ కేంద్రాన్ని సందర్శించిన కృష్ణా యూనివర్శిటీ వీసీ ఆచార్య కూన రాంజీ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇప్పటికై నా పై అంతస్తును కూల్చివేయాలని పీజీ కేంద్రం విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. -
మామిడికి అకాల నష్టం
నూజివీడు: ప్రకృతి ప్రకోపం మామిడి రైతుల ఆశలను వమ్ము చేసింది. అసలే కాపు తక్కువ ఉండి నష్టాల్లో ఉన్న రైతులను పెనుగాలుల రూపంలో ప్రకృతి మరింత అప్పుల్లోకి నెట్టేసింది. ఈనెల 7న సాయంత్రం ఈదురు గాలులు, అకాల వర్షం మామిడికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. నూజివీడు నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పండ్ల తోటల్లో మామిడి ప్రాధాన్యమైంది. ఈ ఏడాది దాదాపు 80 శాతం దిగుబడి తగ్గి రైతులు దిగాలుగా ఉండగా.. పెనుగాలులు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి. ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి దిగుబడి కోసం ఎదురుచూస్తున్న సమయంలో పంట వర్షార్పణం అయ్యింది. 15 శాతం వరకు పంటకు దెబ్బ నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో వీచిన ఈదురుగాలులకు మా మిడి కాయలు నేలపాలయ్యాయి. తోటల్లో దాదాపు 10 నుంచి 15 శాతం మామిడి కాయలు రాలిపోయా యి. చాట్రాయి మండలంలోని కొత్తగూడెం, యర్రావారిగూడెం, సి.గుడిపాడు, నరసింహరావుపాలెం, చిన్నంపేట తదితర గ్రామాల్లో, ముసునూరు మండలంలోని రమణక్కపేట, లోపూడి, సూరేపల్లి, బా స్వరప్పాడు గ్రామాల్లో ఈదురుగాలులు వీచాయి. రాలిన కాయలను విక్రయిద్దామన్నా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో వాటిని పారబోయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైంది. చాట్రాయి మండలంలో 4,232 ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగు చే స్తుండగా సుమారు 30 టన్నుల కాయలు నేలరాలా యి. అలాగే ముసునూరు మండంలలో 3,100 ఎకరాల విస్తీర్ణంగా సాగు చేస్తుండగా సుమారు 15 టన్నుల కాయలు నేలరాలాయి. పూతను కాపాడుకుంటే... పూతను నిలుపుకునేందుకు 12 నుంచి 15 సార్లు పురుగు మందులను రైతులు పిచికారీ చేశారు. నల్లతామర పురుగు ఉధృతంగా ఉన్నప్పుడు కూడా పూతను కాపాడుకునేందుకు నానాపాట్లు పడ్డారు. పురుగు మందులు, తోట కాపలా, నీటితడులు కో సం వేలాది రూపాయలు ఖర్చు పెట్టామని, దిగుబడులు చేతికి వచ్చే సమయానికి పెనుగాలుల తాకిడికి కాయలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో నేలరాలిన కాయలు అకాల వర్షంతో అవస్థలు లబోదిబోమంటున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి నాకు రెండెకరాల్లో మామిడి తోట ఉంది. ఇప్పటివరకు రూ. లక్షకు పైగా ఖర్చుచేశా. పూత వచ్చి పిందెలు ఏర్పడ్డాయని సంతోషించే లోపు ఈదురుగాలులకు కాయలు రాలిపోయాయి. దీంతో దాదాపు రూ.40 వేల నష్టం వాటిల్లింది. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – మందపాటి రఘుపతిరెడ్డి, రైతు, సి.గుడిపాడు, చాట్రాయి మండలం తీవ్రంగా నష్టపోయాం నాకు పది ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. రూ.10 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. ఈదురుగాలులు, వర్షానికి మామిడి కాయలు రాలిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కొండా వెంకట్రావు, రైతు, రమణక్కపేట, ముసునూరు మండలం -
సంక్షోభంలో సాగు
అన్నదాతకు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి.. ఆరుగాలం శ్రమించినా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.. పంట దిగుబడులు రాక.. గిట్టుబాటు ధరలు లేక.. సిండికేట్ల మాయాజాలం.. అంతర్జాతీయ పరిణామాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మద్దతు ధరల కోసం రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా కూటమి సర్కారుకు పట్టడం లేదు. రైతులకు నామమాత్రపు సాయం కూడా అందడం లేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యలు, కోకో, మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోలుకోని కోకో జిల్లాలో కోకో సాగు 36,150 ఎకరాలు విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం ఉన్న జిల్లాగా ఖ్యాతి గాంచింది. ఏటా జిల్లాలో 12 వేల టన్నుల కోకో గింజల దిగు బడి ఉంది. గతేడా ది ఏప్రిల్, మే నెల ల్లో కిలోకు అత్యధికంగా రూ.1,050 ధర పలకగా ప్రస్తు తం రూ.500కి చేరింది. అంతర్జాతీయంగా కోకోకు మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్గా మారి నాణ్యత, ఇతర కారణాలు చూపుతూ తక్కువ ధరకు కొంటున్నారు. దీంతో రాష్ట్ర కోకో రైతుల సంఘం నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా రైతుల రా స్తారోకోలు, 15న ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాల య ముట్టడికి పిలుపునిచ్చారు. మద్దతు ధర కల్పి స్తామని గత నెలలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించినా కనీసం స్పందన లేకపోవడంతో ఆందోళనలు తీవ్రతరం చేశారు. మామిడి.. దిగుబడి తడబడి ఏలూరు జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి సాగు విస్తరించి ఉంది. నూజివీడు మామిడి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది. ఈ ఏడాది డిసెంబర్, జనవరిలో పూత సమయంలో నల్ల తామర రావడంతో 70 శాతానికిపైగా దిగుబడి తగ్గిపోయింది. గతంలో మామిడి రైతులకు నష్టం వాటిల్లిన క్రమంలో ప్రభుత్వం ఆర్థిక సాయంతో ఆదుకుంది. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవతో సహా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయారు. ఎన్నికల సమయంలో మామిడి పరిశ్రమ అభివృద్ధికి ప్రాసెసింగ్ యూనిట్లు, జ్యూస్, పల్ప్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కాక కనీసం మామిడి సాగు స్థితిగతులపై దృష్టి సారించకపోవడం గమనార్హం. అన్నదాత.. గుండెకోత ● ఆర్థిక గండాలతో సతమతం ● ట్రంప్ దెబ్బకు రొయ్యల ధరలు పతనం ● గిట్టుబాటు ధర కోసం కోకో రైతుల ఆందోళన ● మామిడి తోటల్లో తగ్గిన దిగుబడి ● ఆక్వాలో క్రాప్ హాలిడే దిశగా అడుగులు ● ఆదుకోని కూటమి సర్కారు సాక్షి ప్రతినిధి, ఏలూరు : వాణిజ్య పంటలు, ఆక్వా కు రాష్ట్రంలోనే ఖ్యాతి గాంచిన జిల్లాలో మద్దతు ధర కోసం రైతులతో పాటు ఆక్వా సాగుదారులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా జిల్లాలో 60 శాతానికిపైగా కోకో ధరలు పతనం కావడం, ఆక్వా ధరలు పూర్తిగా తగ్గిపోవడం, మామిడి దిగుబడి లేకపోవడం వంటి ప్రధాన సమస్యలతో లక్షలాది మంది రైతులు తీవ్ర అగనాట్లు పడుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మొదలు లోకేష్ వరకూ జిల్లాను ఆక్వా హబ్గా మారుస్తాం, కోకో సాగుకు మహర్దశ తీసుకువస్తాం, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లతో మామి డి హబ్గా మారుస్తామని హామీలిచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత వీటి ఊసే ఎత్తడం లేదు. శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న క్రమంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలపై అంతటా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల పెట్టుబడి సాయం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరితో పాటు వాణిజ్య పంటలు ఆక్వా, మత్స్య సాగు అధికంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆయిల్పామ్, కోకో, పొగాకు వంటి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఇక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా పథకం కింద జిల్లాలో 2,35,847 మంది రైతులకు రూ.1,830.24 కోట్ల పెట్టుబడి సాయం కింద అందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా అన్నదాత సుఖీభవ పథకం అమలు కాని పరిస్థితి. రొయ్య ‘వెల’ విల జిల్లాలోనే ఆక్వా సాగు సుమారు 2.59 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. రాష్ట్రంలో అత్యధిక సాగు జరిగే జిల్లాగా ఉమ్మడి పశ్చిమ నిలిచింది. ఏటా 3 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి ఉంది. ఆక్వా పరిశ్రమకు అనుబంధంగా 40కు పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. అమెరికా పన్నుల ఆంక్షలు సాకుగా చూపించి వ్యాపారులు రొయ్యల ధరలు తగ్గించారు. 100 కౌంట్ కిలో రూ.235 ఉండగా రూ.40 తగ్గించి కొంటున్నారు. నెల క్రితం 100 కౌంట్ రూ.260 పలకగా ప్రస్తుతం రూ.190కి చేరింది. దీంతో టన్నుకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు నష్టపోతున్నామంటూ ఆక్వా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాలకొల్లులో రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారుల సిండికేట్తో ధరలు పతనమవుతున్నాయని ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలంటూ పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో జూన్ నుంచి ఆక్వా క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చారు. ఇదే బాటలో మిగిలిన నియోజకవర్గాల్లో రైతులు సన్నద్ధమవుతున్నారు. ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అప్సడా పూర్తిగా సమస్యలను విస్మరించడంతో పాటు షెడ్యూల్ ప్రకారం జిల్లాలో జరగాల్సిన రైతుల సదస్సులను గాలికి వదిలేసింది. -
కై కలూరు ఏఎంసీలో కయ్యాలు
సాక్షి, టాస్క్ఫోర్స్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ల ఎంపిక కై కలూరు నియోజకవర్గంలో కయ్యాలకు కారణమవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి తర్వాత రెండో స్థానంగా కై కలూరు, కలిదిండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవులను భావిస్తారు. రాష్ట్రంలో కై కలూరు ఏఎంసీ ఆదాయంలో మొదటి స్థానంలో నిలవగా.. రాష్ట్ర జీడీపీలో కలిదిండి మండలం మొ దటి స్థానంలో ఉంది. దీంతో ఈ రెండు ఏఎంసీ చైర్మన్ల పదవుల కోసం కూటమి పార్టీల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో ఏఎంసీ చైర్మన్లను ప్రకటించినా కై కలూరు, కలిదిండి ప్రస్తావన లేదు. దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిజర్వేషన్ల చిచ్చు ఏఎంసీ చైర్మన్ల రిజర్వేషన్ల కేటాయింపులో మతలబు జరిగిందనే భావన కూటమి నేతల్లో నెలకొంది. మొదట్లో కై కలూరు ఏఎంసీ బీసీ కోటాలో టీడీపీ నాయకుడు పూలా రాజీ సతీమణికి, కలిదిండి ఏఎంసీ చైర్మన్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పోకల జోగిరాజుకు కేటాయించినట్టు ప్రచారం జరిగింది. అయినా ఎమ్మెల్యే కామినేని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా కై కలూరు ఏఎంసీ పదవిని పెన్మత్స త్రినాథరాజు, గంగుల శ్రీదేవి, బూరుబోయిన శ్రీనివాసరావు, తెంటు వెంకటరమణ, కలిదిండి నుంచి జనసేన నేత చలపతి, అండ్రాజు శ్రీనివాసరావు ఆశించారు. తాజాగా కై కలూరు ఏఎంసీ ఓసీ, కలిదిండి ఏఎంసీ ఎస్సీ మహిళకు కేటాయించాలని నిర్ణయించినట్టు, అధిష్టానం వద్ద ఇవే రిజర్వేషన్లు ఉంటే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేశారని ఆశావహులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలువురు బరిలో.. కై కలూరు ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్ ఓసీగా మారిస్తే టీడీపీ మండలాధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు మొ దటి వరుసలో ఉన్నారు. అలాగే కేవీఎన్ఎం నా యుడు, పుప్పాల సూర్యప్రకాశరావు పోటీపడుతున్నారు. కలిదిండి ఏఎంసీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ గా మారితే ముదినేపల్లి మండలానికి చెందిన పంత గాని సురేష్ కుటుంబం, కోరుకొల్లు పంచాయతీ స ర్పంచ్ బట్టు లీలాకనకదుర్గ (జనసేన) పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే కలిదిండిని జనసేనకు కేటాయిస్తే చలపతికి వస్తుందనే ప్రచారం కూడా ఉంది. కై కలూరు ఏఎంసీ బీసీ మహిళా కోటాలో తెంటు వెంకటరమణ బరిలో ఉన్నారు. చైర్మన్ పదవి కోసం ఆశావహుల యత్నాలు కై కలూరు ఓసీ, కలిదిండి ఎస్సీ మహిళ రిజర్వేషన్లకు పట్టు ఏఎంసీ చైర్మన్లను ప్రకటించని ప్రభుత్వం -
ఇసుక రీచ్లు ప్రారంభించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం గుర్తించిన, అనుమతించిన ఇసుక రీచ్లను తక్షణమే ప్రారంభించాలని భవన ని ర్మాణ కార్మిక సంఘ నాయకులు గళమెత్తారు. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జి ల్లాలో ఇసుక రీచ్లను ప్రారంభించాలని, భవ న నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్లను ప్రారంభించకపోవడంతో తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ఇసుక తెచ్చుకోవడంతో వినియోగదారులకు అధిక భారమవుతోందన్నారు. జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు బోడెం వెంకట్రావు, ఎం.ఇమ్మానియేల్ పాల్గొన్నారు. కనీస మద్దతు ధర అందేలా చర్యలు ఏలూరు(మెట్రో): జిల్లాలో రబీ సీజన్ పంట ఉత్పత్తులకు ప్ర భుత్వ మద్దతు ధర అందేలా చర్యలు తీసుకున్నామని, పప్పు ధా న్యాల కొనుగోలుకు ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుచేసినట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల్లోకొనుగోలు కేంద్రాల ద్వారా 1,922 టన్నుల పెసల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకూ 2,095 టన్నులు సేకరించామన్నారు. ఈ లక్ష్యాన్ని 2,745 టన్నులకు పెంచుతూ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు, అవగాహనా సదస్సులు నిర్వహించామన్నారు. జిల్లాస్థాయి కంట్రోల్రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. 24న భవన నిర్మాణ కార్మికుల ధర్నా ఏలూరు (టూటౌన్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలంటూ ఈనెల 24న ఏలూరు కార్మికశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్టు ఏపీ బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు తెలిపారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు ఓవర్ బ్రిడ్జి సెంటర్లో గురువారం భవన నిర్మాణ కార్మికులతో కలిసి నిరసన తెలి పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని, పది నెలలు గడిచినా ఈ హామీ అమలు కాలేదన్నారు. పెంచిన ఆస్తి పన్ను తగ్గించాలి ఏలూరు (టూటౌన్): పట్టణాల్లో పెంచిన ఆస్తి (ఇంటి) పన్ను తగ్గించాలని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కార్యదర్శి ఎ.రవి గురువారం ప్రకటన విడుదల చేశారు. 2025–26కి సంబంధించి పట్టణాల్లో ఆస్తిపన్ను 15 శాతం పెంచారని విమర్శించారు. ‘ఓపెన్’ ప్రాక్టికల్స్కు 75 మంది.. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ కోర్సుల ప్రాక్టికల్స్కు 75 మంది హాజరయ్యారు. భౌతికశాస్త్రం పరీక్షకు 40 మందికి 29 మంది, రసాయన శాస్త్రం పరీక్షకు 40 మందికి 29 మంది, జీవశాస్త్రం పరీక్షకు 21 మందికి గాను 17 మంది హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఇంటర్న్షిప్నకు దరఖాస్తులు ఏలూరు (ఆర్ఆర్పేట): వేసవి స్వల్పకాలిక ఇంటర్న్షిప్ ప్రోగామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన 3, 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యార్థులు (సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఐటీఐ ట్రేడ్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రైవేటుగా ఆలిండియా ఐటీఐ ట్రేడ్ పరీక్ష రాయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పి.రజిత ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులు ఈనెల 12న సాయంత్రం 5 గంటలలోపు సమీపంలోని ఐటీఐ కళాశాలల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. -
సత్తాలలో ఉపాధి సిత్రాలు
ద్వారకాతిరుమల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. పనిలోకి వెళ్లని వారి పేరున మస్తర్లు వేసి కొందరు సిబ్బంది సొమ్ములు స్వాహా చేస్తున్నారు. ద్వారకాతిరుమల మండలం సత్తాల పంచాయతీలో జరుగుతున్న పనులు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. గ్రా మంలో రెండు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 80 నుంచి 90 మంది కూలీలు పనిచేస్తున్నట్టు మస్తర్లు వేస్తున్నారు. వాస్తవానికి పనిలోకి వెళ్లని కొందరు కూలీలకు సైతం మస్తరు పడుతున్నాయి. కూటమి నేతల అండతోనే ఉపాధి హామీ సిబ్బంది ఈ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగ మస్తర్లు వేస్తోందిలా.. రోజూ పనిచేసిన కూలీలను గ్రూప్ ఫొటో తీసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న మేట్ నరెడ్ల శ్యామలాదేవి ఫొటోలో ఉన్న వారికంటే ఎక్కువ మందికి మస్తర్లు వేస్తున్నారు. ఈనెల 8న ఇందేటి నాగమణి అనే కూలి ఒక్కరే ఉన్న ఫొటోను అప్లోడ్ చేసి ఆమెతో పాటు, నరెడ్ల సుబ్బారావుకు కూడా మస్తర్ వేశారు. అలాగే 9న బాలుడు గొన్నూరి కార్తీక్ ఫొటో అప్లోడ్ చేసి వృద్ధుడు నరెడ్ల సుబ్బారావుకు మస్తర్ వేశారు. అదే రోజు ముగ్గురున్న ఒక ఫొటోను అప్లోడ్ చేసి ఆరుగురికి మస్తర్లు వేశారు. అలాగే బుధవారం ఇందేటి నాగమణి ఒక్కరే ఉన్న ఫొటోను అప్లోడ్ చేసి, ఆమెతో పాటు నరెడ్ల సుబ్బారావుకు, అలాగే ముగ్గురున్న మరో ఫొటోను అప్లోడ్ చేసి ఆరుగురికి మస్తర్లు వేశారు. పని అక్కడ.. మస్టర్లు ఇక్కడ : పేరమ్మ (మేరెమ్మ) దూబచర్లలో జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు. సుబ్బమ్మ ఇంటి వద్దే ఉంటోందని, మమత వ్యవసాయ పనులకు వెళుతోందని అయినా వారికి మస్తర్లు వేస్తున్నారని అంటున్నారు. ఇలా దొంగ మస్తర్లు వేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేస్తాం దీనిపై ఉపాధి హామీ ఏపీఓ బిరుదుగడ్డ నాగరాజును వివరణ కోరగా సత్తాల పంచాయతీలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన మస్తర్లలో అవకతవకలు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై విచారణ చేస్తామని చెప్పారు. దొంగ మస్తర్ల దందా బోగస్ హాజరుతో వేతన నిధులు స్వాహా! కూటమి నేతల అండతో అక్రమాలు ద్వారకాతిరుమల మండలం సత్తాల పంచాయతీ సండ్రకుంట గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు గొన్నూరి కార్తీక్ ఈనెల 9న ఉపాధి హామీ పనులకు వెళ్లినట్టు అతడి ఫొటోను సిబ్బంది ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అయితే పేరు మాత్రం 79 ఏళ్ల వయసున్న నరెడ్ల సుబ్బారావుగా చూపారు. బాలుడు కార్తీక్తో ఉపాధి పనులు చేయించి సుబ్బారావుకు మస్తర్ వేశారా, లేక పనిలోకి వెళ్లని సుబ్బారావుకు మస్తర్ వేసేందుకు కార్తీక్ ఫొటోను వాడుకున్నారా అన్న ప్రశ్నలకు ఉపాధి హామీ అధికారులే సమాధానం చెప్పాలి. -
వక్్ఫ సవరణ బిల్లుకు వ్యతిరేకం
ఏలూరు టౌన్: ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని, ప్రతిఒక్కరూ బి ల్లును వ్యతిరేకించాలని జిల్లా వక్ఫ్బోర్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ కామిలు జమ అన్నారు. వక్ఫ్బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ రవూఫ్తో కలిసి గురు వారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లుతో ముస్లిం, మైనార్టీలకు జరిగే నష్టాన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పటికే ముస్లిం, మైనార్టీలకు చెందిన ఆస్తులు, భూముల్లో 50 శాతం ముస్లిమేతరులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చే శారు. ఢిల్లీలోనే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ 30 శాతం వక్ఫ్ భూములను ఆక్రమించుకుందన్నారు. వక్ఫ్బోర్డు ఎవరి ఆస్తులను లాక్కోలేదని స్పష్టం చేశారు. నేడు భారీ ర్యాలీ ఏలూరు (ఆర్ఆర్పేట): వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఏలూ రు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకులు తెలిపారు. స్థానిక కర్బలా మైదానం నుంచి మధ్యా హ్నం 2.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. -
‘గోదారి గట్టుపైన’ చిత్ర షూటింగ్ సందడి
తణుకు అర్బన్: ‘గోదారి గట్టుపైన’ చిత్రం షూటింగ్ తణుకు మండలం వేల్పూరులో సందడి చేసింది. గత రెండురోజులుగా చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో బుధవారం ప్రముఖ నటుడు జగపతిబాబు వేల్పూరు రహదారులపై హల్చల్ చేశారు. ముఖ్యంగా వేల్పూరు ప్రధాన రహదారిపై జగపతిబాబు ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ప్రయాణిస్తున్నట్లుగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు. చిత్రంలో హీరో సుమంత్ ప్రభాస్తోపాటు జగపతిబాబు కలిసిన షూటింగ్ సన్నివేశాలను తణుకు చుట్టుపక్కల గ్రామాల్లో కొంతకాలంగా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వ్యాయామ కళాశాలలో ఇంట్రా మ్యూరల్ పోటీలు దెందులూరు: క్రీడా పోటీలు అంతర్గత ప్రతిభను వెలికితీస్తాయని సర్వ శిక్ష అడిషనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ అన్నారు. బుధవారం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాలలో ఇంట్రా మ్యూరల్ కబడ్డీ పోటీలు బాలురు, బాలికల విభాగాల్లో జరిగాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ నతానియేలు, గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ దిలీప్ కుమార్, సొంగ డాక్టర్ డీ.రత్నబాబు, సూపరింటెండెంట్ పతాంజలి, జై శ్రీ వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. పీజీ విద్యార్థి అనుమానాస్పద మృతి దెందులూరు: ఏలూరు రూరల్ మండలం మానూరుకు చెందిన తాడిశెట్టి వెంకటేష్ (24) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వెంకటేష్ రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) కోర్సు చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి నుంచి మానురు స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి కుటుంబ సభ్యులందరితో సరదాగా సంతోషంగా గడిపాడు. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. నోటి నుంచి పురుగు మందుల వాసన రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఏలూరు జీజీహెచ్కు తరలించగా వైద్యులు అతన్ని పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
తాడేపల్లిగూడెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అర్జున అవార్డు గ్రహీత, జాతీయ కబడ్డీ క్రీడాకారిణి రీతూ నేగి అన్నారు. ఏపీ నిట్లో బుధవారం ఆమె వార్షిక క్రీడాసంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీతూ నేగి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి క్రీడల్లో రాణించి అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను 17 సంవత్సరాల నుంచి కబడ్డీ ఆడుతున్నానని, దేశం తరుఫున ఆడటాన్ని గర్విస్తున్నానన్నారు. 2022లో ఆసియా క్రీడల్లో భారతీయ కబడ్డీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు స్వర్ణపతకం సాధించడం చాలా ఆనంందంగా ఉందన్నారు. గౌరవ అతిధి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఫోన్లకే పరిమితం కాకుండా కొంత సమయాన్ని క్రీడలకు కేటాయిస్తూ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సచిన్, ధోని స్ఫూర్తితో అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. గౌరవ అతిధి కబడ్డీ క్రీడాకారిణి పింకీ రాయ్ మాట్లాడుతూ క్రీడలపై మక్కువతో సాధనచేస్తే ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, డీన్లు రవికిరణ్శాస్త్రి, వీరేష్కుమార్, అసోసియేట్ డీన్లు శ్రీనివాసన్, రాజేశ్వరరెడ్డి, కిరణ్ తీపర్తి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల దొంగలంటూ ఆస్పత్రిలో కలకలం
తణుకు అర్బన్ : తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పిల్లలను దొంగిలించే మహిళలు దిగారన్న వార్త కలకలం రేపింది. నిమిషాల వ్యవధిలోనే పిల్లల దొంగలు ఆస్పత్రిలో ఉన్నారనే విషయం ఆనోట ఈనోట విన్న బాలింతలు, తల్లులు బెంబేలెత్తిపోయారు. కామెర్లు, ఇతర సమస్యలతో ఎన్సీయూ విభాగంలో ఉంచిన తమ బిడ్డ ఉందా అనే భయంతో బాలింతల బంధువులు వార్డు వద్దకు పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సుమారు 10 గంటల సమయంలో ఆస్పత్రి మూడో అంతస్తులోని ఏసీ వార్డులో ఉన్న బాలింతల వద్దకు వచ్చిన ఒక మహిళ తన ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటానని అడిగి చార్జింగ్ పెట్టుకుంది. పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఒక బాలింత మంచంపై ఉన్న కవల పిల్లల్లో ఒక బిడ్డను ఎత్తుకుంటానని అడగ్గా ఆ తల్లి ఒప్పుకోలేదు. అయితే సదరు మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో బాలింత వార్డులోని నర్సుకు సమాచారం ఇచ్చారు. నర్సు ఇచ్చిన సమాచారంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ సెక్యూరిటీ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది రావడం చూసిన మహిళ పరిగెత్తుతూ పారిపోతున్న పరిస్థితుల్లో ఆస్పత్రి గేటు వద్ద అదుపులోకి తీసుకుని సూపరింటెండెంట్ వద్దకు తీసుకువెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ దశలో మరోమారు పారిపోయేందుకు ప్రయత్నించినా సెక్యూరిటీ విభాగ సూపర్వైజర్ సాయి, మహిళా సెక్యూరిటీ రేణుక ఆ మహిళను పట్టుకుని తిరిగి లోపలకు తీసుకువెళ్లారు. తణుకు పట్టణ స్టేషన్ ఏఎస్సై రాజ్యలక్ష్మి, కానిస్టేబుల్ మురళి వచ్చిన తరువాత మహిళను ప్రశ్నించగా సమీపంలో ఉన్న ఆమె బంధువుకు ఫోన్చేసి రప్పించారు. అయితే ఇద్దరూ కలసి నిడదవోలు మండలం కంసాలపల్లి నుంచి వచ్చామని సామాన్లు కొనుక్కునేందుకు వచ్చి ఫోన్ చార్జింగ్ పెట్టుకోడానికి ఆస్పత్రికి వచ్చానని చెప్పడంతోపాటు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఇద్దరు మహిళలను పోలీసువర్గాలు పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే కొవ్వూరు మండలం శెట్టిపేటకు చెందిన గ్రామ పెద్దలు వచ్చి మహిళలు అటువంటి వారు కాదని ఆధార్ కార్డులు చూపించి సొంత పూచీకత్తుపై మహిళలను స్టేషన్ నుంచి తీసుకువెళ్లారని పోలీసులు తెలిపారు. ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి ఆస్పత్రికి వచ్చానన్న మహిళ పొంతన లేని సమాధానాలతో ఇద్దరు మహిళలను పోలీస్ స్టేషన్కు తరలింపు -
నాటు తుపాకులతో ముగ్గురి అరెస్ట్
బుట్టాయగూడెం: గుబ్బల మంగమ్మ గుడి సమీపంలోని అటవీప్రాంతంలో నాటు తుపాకులతో కనిపించిన ముగ్గురు గిరిజనులను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి మామిడిశెట్టి మురళి తెలిపారు. నిందితులను కావిడిగుండ్ల, కంట్లం బేస్ క్యాంప్ సిబ్బంది పట్టుకుని, వారి వద్ద ఉన్న రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్న బుట్టాయగూడెం మండలం కామవరంనకు చెందిన రవి, మంగబాబు, నవీన్గా గుర్తించినట్లు చెప్పారు. అడవి జంతువులను నాటు తుపాకులతో వేటాడేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ముగ్గురు మా సిబ్బందికి పట్టుబడ్డారని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్ తాడేపల్లిగూడెం: భీమవరం రైల్వే సర్కిల్లో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సెల్ఫోన్లు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను గూడెం రైల్వే పోలీసు స్టేషన్లో విలేకర్లకు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సింగవరం గ్రామానికి చెందిన ఉలవలపూడి దుర్గారావు అనే వ్యక్తి రైళ్లలో పలు చోరీలకు పాల్పడ్డాడు. విజయవాడ రైల్వే డీఎస్పీ జి.రతన్రాజు ఆదేశాల మేరకు భీమవరం రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.సోమరాజు, గూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు టీమ్గా ఏర్పడి నిందితుడిని నిడదవోలు కొత్త ఫ్లై ఓవర్ వంతెన వద్ద పట్టుకున్నారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తు 18 సెల్ఫోన్లు, సుమారు 30 గ్రాముల బంగారం వెరశి మొత్తం రూ.3 లక్షల 70 వేల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.ఐటీఐ ట్రేడ్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం ఉండి: రాష్ట్ర ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేటుగా ఐటీఐ ఆల్ ఇండియా ట్రేడ్ పరీక్ష రాసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్ వీ శ్రీనివాసరాజు తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో అందజేయాలన్నారు. వివరాలకు 96760 99988 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
దళితులపై దౌర్జన్యాలు అరికట్టాలి
జంగారెడ్డిగూడెం: దళితులపై కూటమి నాయకుల దౌర్జన్యాలు అరికట్టాలని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.ప్రాన్సిస్ డిమాండ్ చేశారు. వేగవరంలో సీపీఎం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాన్సిస్ మాట్లాడుతూ దళిత మహిళ గంజి మరియమ్మ 30 ఏళ్లుగా వేగవరంలో అరటిపండ్లు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవిస్తోందన్నారు. షాపు తీసివేయాలని కూటమికి చెందిన జనసేన నాయకులు అనిశెట్టి వెంకన్నబాబు, దాకవరపు భానుమూర్తి, మోటేపల్లి దదార్ల, దాకవరపు వీరనాగయ్య కొందరితో కలిసి ఆమైపె దౌర్జన్యం చేశారన్నారు. తమ జీవనోపాధిని కూలగొట్టద్దని మరియమ్మ వేడుకున్నా షాపులను తొలగించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కూటమి నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ప్రాన్సిస్ డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం మాట్లాడుతూ వేగవరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్న దళితులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్న కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో చలో వేగవరానికి పిలుపునిచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితులు కె.సుబ్బారావు, గంజి మరియమ్మ, కృష్ణ, రామారావు, బుడుపుటి నిర్మల కుమారి, నంబూరి వసంతరావు తదితరులు పాల్గొన్నారు. -
15న కోకో రైతుల చలో గుంటూరు
పెదవేగి : కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పెదవేగి మండలం విజయరాయి గాంధీ నగర్లోని సీతారామ కళ్యాణ మండపంలో ఏపీ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహించారు. కోకో గింజల కొనుగోలు కంపెనీల మోసాలు, కొనుగోలు ధరల తగ్గింపుపై ఈనెల 12న కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో రాస్తారోకో కార్యక్రమాలు, 15న కోకో రైతుల చలో గుంటూరు ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర సమావేశం తీర్మానించింది. కోకో రైతులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద మృతి కేసులో తనుశ్రీ భర్త అరెస్ట్ ముదినేపల్లి రూరల్ : వడాలికి చెందిన తనుశ్రీ అనుమానాస్పదస్థితి మృతి కేసులో ఆమె భర్త అనిల్కుమార్ను డీఎస్పీ శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లిలో బుధవారం అరెస్టు చేశారు. గుండాబత్తిన తిరుపతయ్య కుమార్తె తనుశ్రీని అదే గ్రామానికి చెందిన బెజవాడ అనిల్కుమార్ ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా ఈ నెల 7న తనుశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనిపై తనుశ్రీ బంధువులు, గ్రామస్తులు ఆగ్రహించి భర్త అనిల్కుమార్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వడాలిలో మంగళవారం మూడు గంటలపాటు ధర్నా నిర్వహించారు. స్పందించిన డీఎస్పీ సిబ్బందితో అనిల్కుమార్ను స్థానిక సహాయమాత స్కూల్ వద్ద బుధవారం అరెస్టు చేసి మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేసి కై కలూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
పోలవరంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆక్టోపస్ పోలీస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసు శిక్షణలో భాగంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని బుధవారం సందర్శించారు. ప్రాజెక్టు భద్రతా చర్యల్లో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంలోని పలుచోట్ల మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపారు. ఐజీపీ (ఆపరేషన్స్)లో భాగంగా ఆక్టోపస్ బృందం సభ్యులు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఉత్తర్వుల మేరకు వీటిని నిర్వహించారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ సీహెచ్ఎస్ఆర్సీ మూర్తి, బ్రావో టీమ్ డీఎస్పీ ఎం.చిన్నకొండయ్య ఆధ్వర్యంలో 50 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
పెదవేగి : మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పెదవేగి మండలంలోని రాయన్నపాలెం చెరువులో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి అక్రమంగా తవ్వి ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నా మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తరుఫున మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేకపోయినా అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి గ్రామంలోని ఓ టీడీపీ నాయకుడు ఈ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని రాయన్నపాలెం ప్రజలు కోరుతున్నారు. -
శ్రీహరికోట శిక్షణకు దండగర్ర విద్యార్థులు
తాడేపల్లిగూడెం రూరల్: శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మే 18 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న శిక్షణా కార్యక్రమానికి తాడేపల్లిగూడెం మండలం దండగర్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు మైనం ప్రదీప్తి, వీరమళ్ల పద్మశ్రీ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.చంద్రశేఖర్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) సంయుక్తంగా దేశ వ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రధానంగా ఉపగ్రహాలు, రాకెట్ల తయారీ, క్రయోజెనిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, మినరాలజీ మ్యాపింగ్, డీప్ స్పేస్ నెట్ వర్క్, రేడియో టెలిమెట్రి ట్రాకింగ్, లాండర్స్, రోవర్లు, స్పేస్ ప్రోబ్స్, గగన్యాన్ వంటి వాటిపై శాస్త్రవేత్తలతో ముఖాముఖీ, శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 1.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ కాగా, 350 మందిని ఇస్రో ఎంపిక చేసిందన్నారు. వీరిలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
శ్రీహరికోట శిక్షణకు ఎంపిక
శ్రీహరికోట స్పేస్ సెంటర్లో శిక్షణా కార్యక్రమానికి తాడేపల్లిగూడెం మండలం దండగర్ర జెడ్పీ పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. 8లో uపట్టించుకోవడం లేదు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్గా మారుస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఆక్వా రైతులు రోడ్డున పడ్డా పట్టించుకోవడం లేదు. ఎక్స్పోర్టర్స్ సిండికేట్ అయ్యి ధర తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా ఆక్వా రంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. – ఆకుల హరేరామ్, ఏపీ రైతు సంఘం నేత, నరసాపురం పంట విరామమే దిక్కు 50 కౌంట్ లోపు అమెరి కాకు ఎగుమతి అవుతుంటాయి. దీనికి సాకుగా చూపించి మిగిలిన వాటి ధరలను దారుణంగా తగ్గించేశారు. ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గించడం లేదు. 100 కౌంట్ రూ. 250 ఉంటేనే గాని గిట్టుబాటు కాదు. ఈ పరి స్థితుల్లో ఆక్వా రైతులకు పంట విరామమే శరణ్యం. ఆ దిశగానే ముందుకు వెళుతున్నాం. – వీరా కుమార్, ఆక్వా రైతు, పాలకొల్లు -
ఆక్వా అతలాకుతలం
శునకం.. భయానకం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులపై ఎగబడుతున్నాయి. 8లో uఉండి సమావేశం రద్దు గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: అమెరికా సుంకాల భయంతో రొయ్య రేట్లు పతనం కావడంతో రాష్ట్రంలోని ఆక్వా రంగం భవిష్యత్ అయోమయంలో పడింది. కొనుగోలుదారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ పశ్చిమ రైతులు పోరుబాట పట్టారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో జూలై నుంచి పంట విరామానికి పిలుపునిచ్చారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సొంత నియోజకర్గమైన ఉండిలో బుధవారం జరగాల్సిన ఆక్వా రైతు సదస్సు వాయిదా పడడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. స్థానికంగా 40కు పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. కిలోకు 20 నుంచి 50 లోపు కౌంట్ రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుంటే, 60 నుంచి 100 వరకు కౌంట్ రొయ్యలు చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అమెరికాకు రొయ్యల ఎగుమతుల్లో 40 శాతం జిల్లా నుంచే వెళ్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహ జ్వాలలు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఈ నెల 7న జై భారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం ఆధ్వర్యంలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు సమావేశమయ్యారు. ఆక్వా రంగం కుదేలవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పూలపల్లి వై జంక్షన్ వద్ద రోడ్డెక్కి నిరసన తెలిపారు. జూన్ నెలాఖరుకు పంట ముగించుకుని జూలై నుంచి సెప్టెంబరు వరకు పంట విరామం పాటించాలని సంఘ నాయకులు పిలుపునివ్వగా రైతులు మద్ధతు తెలిపారు. ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసే ప్రయత్నాల్లో రైతు సంఘాల నాయకులు నిమగ్నమయ్యారు. 100 కౌంట్ రొయ్య రూ.220 కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వం ఎక్స్పోర్టర్స్కు సూచించడం కంటితుడుపు చర్యగా కొట్టిపారేస్తున్నారు. 100 కౌంట్ దిగుబడికి రూ.240 వరకు ఖర్చవుతుంటే దీని వల్ల నష్టమే తప్ప రైతులకు ప్రయోజనం ఏమీ లేదని చెబుతున్నారు. కిలోకు 50 కౌంట్ లోపు రొయ్యలు మాత్రమే అమెరికాకు వెళ్తుంటే మిగిలిన వాటి ధరలు తగ్గించడాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. న్యూస్రీల్ క్రాప్ హాలిడేకు సిద్ధమవుతున్న రైతులు ధరల పతనంపై తీవ్ర ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కార్యాచరణ ఈ నేపథ్యంలో ఉండిలో ఆక్వా రైతుల సమావేశం రద్దు సుంకాల పేరిట దోపిడీ అమెరికా 26 శాతం పన్నులు విధించడాన్ని సాకుగా చూపించి ఎగుమతిదారులు రొయ్య రేట్లను అమాంతం తగ్గించేశారు. 100 కౌంట్ రూ.235 ఉండగా రూ. 30 నుంచి రూ.40 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరానికి రైతులు టన్నుకు రూ. 40 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. నెల రోజుల క్రితం వంద కౌంట్ రూ.260 ఉంటే రూ.230కు తగ్గించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ఆందోళనలు నిర్వహించిన విషయం విధితమే. తాజా పరిణామాల నేపధ్యంలో ఆక్వా రైతులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. అప్సడా ఆధ్వర్యంలో బుధవారం ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాలులో ఆక్వా రైతు సదస్సు జరగాల్సి ఉంది. అప్పడా వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణరెడ్డి, ప్రభుత్వ పెద్దలు హాజరై ఆక్వా రైతుల సమస్యలపై చర్చిస్తారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. అమెరికా సుంకాల నేపథ్యంలో రొయ్య ధరల స్థిరీకరణ, ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గకపోవడం, జోన్లకు సంబంధం లేకుండా సబ్సిడీ విద్యుత్, అధిక లోడు చార్జీల సమస్యల పరిష్కారం, క్రాప్ హాలిడే తదితర అంశాలపై చర్చిస్తారని, కీలకమైన ఈ సమావేశానికి అధిక సంఖ్యలో ఆక్వా రైతులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. అప్సడా, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ పెద్దలు హాజరయ్యే ఈ సమావేశం వేదికగా ఆక్వా రంగాన్ని ఆదుకోవడంలో కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని రైతు సంఘాల నాయకులు భావించారు. అయితే సమావేశం అర్ధాంతరంగా రద్దయ్యింది. అనివార్య కారణాలతో సదస్సు వాయిదా పడినట్లు జిల్లా మత్య్సశాఖ అధికారి ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలోని మూడు నియోజకవర్గాల రైతులు క్రాప్ హాలీడేకు పిలుపునివ్వడం, ఉండి సమావేశంతో ఆ ప్రభావం మిగిలిన ప్రాంతాలపై పడుతుందన్న ఆందోళనతో సమావేశం రద్దుచేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సొంతవారికే సోపానం!
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రన్న స్వయం ఉపాధి సోపానం పథకం ద్వారా బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్కు చెందిన నిరుద్యోగులకు ఉపాధి రుణాలు అందించే కార్యక్రమం సొంతవారికే కట్టబెట్టేలా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు వేలల్లో వచ్చినా రుణాలు ఇచ్చేది కొందరికే కావడం ఒక వంతైతే తమ పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్పిన వారికే రుణాలు ఇచ్చే కార్యక్రమానికి స్థానిక పచ్చ నేతలు శ్రీకారం చుట్టారు. అర్హత ప్రామాణికంగా ఇవ్వాల్సిన సబ్సిడీ రుణాలను తమకు నచ్చిన వారికి కట్టబెట్టే ప్రహసనంలా మార్చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరేమనుకుంటే మాకేంటి.. అధికారం మాది.. మమ్మల్ని అడిగే వారు ఎవరూ లేరనే ధీమాతో టీడీపీ నాయకులు తమకు నచ్చిన విధంగా చేసుకుపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 5,847 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 3, 4 తేదీలలో స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలోని ముస్లిం షాదీఖానాలో దరఖాస్తుల పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇదంతా తూతూ మంత్రంగా నిర్వహించారే తప్ప నిజంగా కార్పొరేషన్ అధికారులు, బ్యాంకు అధికారులకు తమకు నచ్చిన వారికి, అర్హత ఉన్నవారికి సబ్సిడీ రుణాలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. అంతా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచే చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి. తమ పార్టీకి చెందిన వారికి, తమకు నచ్చిన వారికే సోపానం పథకంలో రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. రుణాల కేటాయింపులు ఇలా.. నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచే రుణాలను కేటాయించినట్లు స్వయంగా టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 5,847 దరఖాస్తులు రాగా మొత్తం రుణాలు 407 కేటాయించారు. ఒక్కో డివిజన్కు సగటున 8 రుణాలు అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీ రుణాలు నేరుగా బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తారు. ఇక్కడే నాయకులు తమకు నచ్చిన వారి పేర్లతో కూడిన లిస్టును తయారు చేసి సంబంధిత అధికారులకు నేరుగా పంపించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది నేరుగా జోక్యం చేసుకుని రుణాలను తమదైన శైలిలో పంచారనే వాదనలు ఉన్నాయి. ఒక్కో ఇన్చార్జికి మూడు రుణాలు ఏలూరు నియోజకవర్గంలోని మొత్తం 50 డివిజన్లకు సంబంధించిన టీడీపీ ఇన్చార్జిలు ఒక్కొక్కరికి మూడు చొప్పున రుణాలు కేటాయించారు. మిగిలిన ఐదింటిలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి.. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారికి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని నాయకులకు నచ్చిన వారికి ఇచ్చేందుకు అట్టే పెట్టుకున్నారనేది సమాచారం. అర్హులకు మొండిచేయి? నిరుద్యోగ యువత తమ కాళ్ల మీద తాము నిలబడి స్వయం ఉపాధి సాధించేందుకు చంద్రన్న స్వయం ఉపాధి సోపానం పేరుతో సబ్సిడీ రుణాలును రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్లాబుల్లో అందిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా అదంతా ఉత్తుత్తిదేనని తేలిపోయింది. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉంటామని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని చెప్పి.. సొంత కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు నగరంలో ఇవ్వనున్న సబ్సిడీ రుణాలు 407 ఒక్కో డివిజన్కు అందుబాటులో 8 ‘సోపానం’ రుణాలు డివిజన్ టీడీపీ ఇన్చార్జికి 3 చొప్పున కేటాయింపు మిగతావి ఎమ్మెల్యే ఆఫీసు నుంచి టిక్ పెడితేనే అర్హత ఉన్నవారికే ఇవ్వాలి రుణాలను నిబంధనల మేరకు అర్హత ప్రామాణికంగానే ఇవ్వాలి. దానికి భిన్నంగా తమ పార్టీ కార్యకర్తలకు, తమకు నచ్చిన వారికి, టిక్ పెట్టిన వారికే ఇవ్వడం విడ్డూరంగా ఉంది. యువత స్వయం ఉపాధి రుణాల్లోనూ పచ్చ నేతల జోక్యం చేసుకోవడం దారుణం. అధికారుల నిర్ణయానికి వదిలేస్తే అర్హులకు న్యాయం జరుగుతుంది. – జి.సూర్యకిరణ్, జిల్లా కార్యదర్శి, డివైఎఫ్ఐ, ఏలూరు జిల్లా పప్పు బెల్లంలా పంచుకుంటున్నారు నిరుపేదలకు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఉద్దేశించిన స్వయం ఉపాధి సోపానం రుణాలను అధికార పార్టీ నాయకులు పప్పు బెల్లంలా పంచుకోవడం హాస్యాస్పదంగా ఉంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది. అధికారులను డమ్మీలుగా చేసి ప్రజా ప్రతినిధులు మొత్తం చక్రం తిప్పడం ఎంత వరకు కరెక్టో పాలకులకే తెలియాలి. – కాకి నాని, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్యూ -
గ్యాస్, పెట్రో ధరలు తగ్గించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్రం ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ అంబేడ్కర్ విగ్రహాం వద్ద న్యూడెమోక్రసీ, ఇఫ్టూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నాని ఉద్దేశించి సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచంలో ముడి చమురు ధరలు పెరగకపోయినా అమాంతంగా ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రజలకు సౌకర్యాలు సదుపాయాలు ఏర్పాటు చేయకుండా భారం వేస్తున్నారని ధరలను బేషరతుగా రద్దు చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు వెంకట్రావు డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్తో పాటు అనేక హామీలు అమలు చేస్తామని చెప్పారని, ఇంతవరకూ పెన్షన్ మినహా ఏదీ అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఇఫ్టూ నగర కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, పీడీఎస్యూ జిల్లా ప్రెసిడెంట్ కాకి నాని, ఇఫ్టూ ఏలూరు నగర సహాయ కార్యదర్శి గడసల రాంబాబు తదితరులు మాట్లాడారు. -
ఎట్టకేలకు మరమ్మతులు
ఆగిరిపల్లి: ఆగిరిపల్లి నుంచి తోటపల్లి రహదారికి ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు చేశారు. 9 నెలల క్రితం ఆగిరిపల్లి నుంచి తోటపల్లి వరకు పాత రోడ్డును తొలగించి కంకర పోసి వదిలేశారు. దీంతో వాహనదారులు, ప్రజలు రోడ్డుపై లేచిన కంకరరాళ్లతో, దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత నెల మార్చి 5న ‘కంకర రోడ్డుపై కష్టాలు’ పేరిట సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఆగిరిపల్లి నుండి తోటపల్లి వరకు రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయడంతో ప్రజలు ఊపిరి పిలుచుకున్నారు. దూరవిద్య ఇంటర్ ప్రాక్టికల్స్కు 89 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కోర్సు 2024–25 విద్యా సంవత్సరానికి జరుగుతున్న పబ్లిక్ పరీక్షల్లో మంగళవారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 40 మందికి 30 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. రసాయన శాస్త్రం పరీక్షకు 40 మందికి 32 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు. జీవశాస్త్రం పరీక్షకు 40 మందికి 27 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో డీఈసీ కమిటీ ప్రయోగపరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని, జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉపాధి కూలీల బకాయిలు చెల్లించాలి ఏలూరు (టూటౌన్): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు గత జనవరి 15 నుంచి వేతనాలు విడుదల చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.రవి విమర్శించారు. మంగళవారం ఏలూరు మండలం చాటపర్రులో ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం వేతన బకాయిలు నేటికీ విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇస్తామని చెప్పడం, నెలల తరబడి పెండింగ్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక పక్క ఉపాధి కూలీలకు వేతనాలు పెంచామని ప్రచారం చేయడం తప్ప పెంచింది ఏడు రూపాయలే అన్నారు. వేతనాలను విడుదల చేయకపోగా ధరలు పెంచుతుంటే పేదలు ఏ విధంగా బతకాలని ప్రశ్నించారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఏలూరు (టూటౌన్): చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారపు పేట వీవర్స్ కాలనీలో ధర్నా నిర్వహించారు. ధర్నా ఉద్దేశించి జిల్లా కార్యదర్శి పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చేనేత పరిశ్రమను రక్షిస్తామని వాగ్దానం చేసినా నేటికీ అమలు చేయలేదన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. నేతన్న నేస్తం మగ్గం నేస్తున్న ప్రతి కార్మికుడికి ఇవ్వాలని... బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేయాలని కోరారు. చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో ఆర్థిక సహకారం చేయాలని.. చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలన్నారు. చేనేత కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ బోర్డు ఏర్పాటు చేయాలని, సహకార సంఘాల అప్పులు రద్దు చేయాలని, డిమాండ్ చేసారు. ధర్నాలో గుత్తి పోతురాజు, ఎన్ విజయలక్ష్మి, యర్ర సాంబశివరావు, మువ్వల అన్నపూర్ణ, పేరిక చిన్న వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్కు 128 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్–2 పరీక్షలకు 128 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగిన పరీక్షకు 133 మందికి 128 మంది హాజరయ్యారు.