Eluru District News
-
పన్ను పాటలో సాగని ఆట
నరసాపురం: నరసాపురం మున్సిపల్ మార్కెట్ డైలీ పన్ను వసూళ్ల విషయంలో జనసేన నేతకు మేలు కలిగించేలా, మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడేలా కూటమి నేతలు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. పైకి నిబంధనల ప్రకారం జరుగుతున్నట్లు చూపించి, గత ఏడాది కంటే ఏకంగా రూ.50 లక్షలకు పైగా తక్కువకు మార్కెట్ పాటను జనసేన నాయకుడికి కట్టపెట్టాలని మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. అనుకున్న వారికి పాట కట్టబెట్టాలంటే కౌన్సిల్ తీర్మానం అవసరం. ఈ విషయంలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఇబ్బందనే భయంతో అధికారులు వెనక్కి తగ్గి మళ్లీ పాట నిర్వహించాలని నిర్ణయించారు. మున్సిపాలిటీ ఫుట్పాత్లు, రోడ్డు మార్జిన్ల వద్ద వ్యాపారాలు చేసే వారి నుంచి రోజువారీ పన్నుల వసూళ్లకు హక్కులు కోసం గతేడాది జరిగిన వేలంపాట రూ.83 లక్షలకు వెళ్లింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వారం క్రితం నిర్వహించిన పాటలో ఓ జనసేన నేత తన భార్య గంటా నాగదుర్గాదేవి పేరున రూ.30,06,000కు పాట దక్కించుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే రూ.50 లక్షలకు పైగా పాట తగ్గింది. తెరవెనుక చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో జనసేన నేతకు మార్కెట్ పాట అప్పగించి, మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టేందుకు ముందు నుంచి భారీ స్కెచ్ వేశారు. వేలం పాటకు ముందు మార్కెట్ ప్రాంతంలో వ్యాపారులు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే నాయకర్ వెళ్లి మార్కెట్ పన్ను ఎక్కువ కట్టవద్దని బహిరంగంగా చెప్పారు. దీంతో వేలంపాటదారులు భయపడ్డారు. ఎమ్మెల్యే చెప్పిన మాట ప్రకారం చూసుకుంటే పన్ను వసూళ్లు కష్టమవుతుందని కాంట్రాక్టర్లు భయపడి పాటకు మొగ్గుచూపలేదు. కమిషనర్ తక్కువ మొత్తానికి జనసేన నేతకు పన్ను నిర్వహణ అప్పగించడానికి మున్సిపల్ చట్ట ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం బాధ్యత తనపై వేసుకుని కష్టపడ్డారు. మూడుపార్లు పాట వాయిదా వేసి, నాలుగో సారి జనసేన నేతకు రూ.50 లక్షలు తక్కువకు అప్పగించారు. కౌన్సిల్ తీర్మానం అవసరంతో చిక్కు పన్ను వసూళ్ల బాధ్యతలు అప్పగించాలంటే కౌన్సిల్ తీర్మానం అవసరం. మొత్తం 31 మంది కౌన్సిలర్లలో 25 మంది వైఎస్సార్సీపీ సభ్యులున్నారు. గత ఏడాది కంటే భారీ మొత్తంలో పాట తగ్గడంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మొత్తం వ్యవహారం కమిషనర్, మున్సిపల్ రెవిన్యూ అధికారుల మెడకు చుట్టుకోవచ్చని భయపడ్డారు. దీంతో పాటను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ వసూలు చేసే పన్నులు కొంతమేర తగ్గిస్తామని పైకి వ్యాపారులను మభ్యపెట్టి ఆశలు చూపించి ఏకంగా మున్సిపాలిటీకి మార్కెట్ పాట ద్వారా ఏటా వచ్చే ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేయడం, అందులో స్వయంగా ఎమ్మెల్యే పరోక్షంగా ప్రయత్నించడం.. ఈ అంశంలో మున్సిపల్ కమిషనర్ నిబంధనలు వదిలి పెట్టడం చర్చనీయాంశమైంది. కూటమి కార్యకర్తలా మున్సిపల్ కమిషనర్ వ్యవహారం! తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో చివరి నిమిషంలో వెనకడుగు జనసేన నేతకు మేలు చేసే ప్రయత్నం స్వయంగా నరసాపురం ఎమ్మెల్యే బెదిరింపుల పర్వం -
మెప్మాకు గిన్నిస్ బుక్ రికార్డ్స్
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్డీసీ ప్లాట్ఫారమ్ ద్వారా విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సాధించడం అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లా మెప్మా అధికారులు గిన్నిస్ బుక్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్లతో బుధవారం కలెక్టర్ను కలిశారు. ఓఎన్డీసీ విక్రయాల్లో జిల్లా ఎస్హెచ్జీల భాగస్వామ్యం 6,500గా ఉందని మెప్మా అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఓఎన్డీసీ విక్రయాల్లో జిల్లా భాగస్వామ్యం పెద్ద మొత్తంలో పెరగాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా లైవ్లీహుడ్స్ స్పెషలిస్ట్ సీహెచ్ నాని బాబు, జిల్లా ఐబీ గ్రంధి పార్వతి, జిల్లా ఈ మార్కెట్ స్పెషలిస్ట్ సీహెచ్ మోహన్ ఉన్నారు. చెల్లని చెక్కు కేసులో జైలు, జరిమానా నూజివీడు: చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు నూజివీడు మండలం సీతారామపురంనకు చెందిన కన్నెకంటి సాంబశివరావు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం సేరినరసన్నపాలెంకు చెందిన బల్లా సత్యన్నారాయణకు 2020 జులై 6న రూ.12,44,000 నగదును అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత సాంబశివరావు బాకీ తీర్చమని అడగగా 2021 జులై 5న రూ.10 లక్షలకు సత్యన్నారాయణ చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును సాంబశివరావు బ్యాంకులో వేయగా నగదు లేదని బ్యాంకు నుంచి చెక్కు తిరిగి వచ్చింది. దీంతో సాంబశివరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సత్యన్నారాయణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య ముదినేపల్లి రూరల్: కుమారుడు, కుమార్తె మందలించారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకీగూడెంకు చెందిన పిచ్చేటి కొండయ్య (42) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య ఏడాది క్రితం సౌదీఅరేబీయా వెళ్లడంతో వడాలి గ్రామంలోని అత్తవారింట పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. కొండయ్య కుమారుడు 9వ తరగతి, కుమార్తె 7వ తరగతి చదువుతున్నారు. కొండయ్య ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వెళుతుండడంతో కుమారుడు, కుమార్తె మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కొండయ్య మూడు రోజుల కిందట ఎలుకల మందు తిని అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీనిపై కొండయ్య సొదరుడు బాపూజీ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మెట్ట.. నీటికి కటకట!
చింతలపూడి: భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఈ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదముంది. చెరువులు ఎండిపోయే దశకు చేరుకోగా బోర్లు, బావులు ఇప్పటికే అడుగంటిపోయాయి. ఈ పరిస్థితుల్లో మెటప్రాంత ప్రజానీకం తాగు, సాగునీటికి తహతహలాడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆంధ్రా కాల్వ ఎండిపోయింది. ఎర్రకాల్వలు కూడా పూర్తిగా ఎండిపోయాయి. నియోజకవర్గంలో ఉన్న 450కి పైగా చెరువులు, కుంటలు ఏటా మేనెల వచ్చేసరికి నీరు ఇంకిపోతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ముందుగానే చెరువులు వట్టి పోయే ప్రమాదం ఏర్పడింది. చెరువుల ఆక్రమణతో ఈ దుస్థితి గత ఏడాది డిసెంబర్ నెల నుంచి వర్షాలు పడకపోవడం, చెరువులు ఎండిపోవడానికి ఒక కారణమైతే, రైతులు దాళ్వా పంటలు వేయడం కూడా మరో కారణంగా చెప్తున్నారు. చింతలపూడి సబ్డివిజన్లో ఈ ఏడాది 8,228 ఎకరాల్లో రైతులు రబీ వరి సాగు చేపట్టారు. వీటికి తోడు చెరువుల ఆక్రమణలు కారణంగా కూడా నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తుండటంతో ఆక్రమణలతో చెరువులు హరించుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడుతోంది. చెరువుల్లో నీరు ఎండిపోతుండటంతో పశువులకు తాగునీరు ఎలా అన్నదే ప్రస్తుతం రైతులను పట్టిపీడిస్తున్న సమస్య. మెట్టకు శాశ్వత సాగునీటి వసతి లేకపోవడం, కేవలం వర్షాలపైనే ఆధారపడ్డ చెరువులవల్ల ప్రతి ఏటా మనకు ఈ దుస్థితి ఏర్పడుతోందని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు. ఎండిన ఆంధ్రా, ఎర్ర కాలువలు వట్టిపోతున్న బోర్లు.. అడుగంటిన బావులు వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి చెరువుల్లో నీరు ఎండిపోవడంతో ప్రభుత్వం పశువుల తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువుల సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమణలో ఉన్న చెరువులకు విముక్తి కలిగించాలి. ఉపాధిహామీ నిధులతో చెరువుల పూడికను పూర్తిస్థాయిలో తీయిస్తే వర్షాకాలంలో చెరువుల్లో నీరు నిల్వ చేసుకోవచ్చు. – దొంతా కృష్ణ, రైతు సంఘం నాయకుడు, రేచర్ల గోదావరి జలాలను మళ్లించాలి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను మళ్లించాలి. తద్వారా రైతులకు శాశ్వత సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలి. – ఎస్కే కాలేష, రైతు సంఘం నాయకుడు, చింతలపూడి -
నెల నెలా కోత
ముమ్మరంగా మాసూళ్లు దాళ్వా మాసూళ్లలో రైతులు నిమగ్నమయ్యారు. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు. 8లో uగురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, భీమవరం: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వెతలకు చెక్ పెట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు రాజకీయాలు, కులమత వర్గాలు చూడకుండా లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. ఇంటికే వచ్చి పింఛన్ అందించే ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో చెప్పినట్టుగానే రూ. 2000 పింఛన్ను ఏటా పెంచుతూ రూ.3000 చేశారు. 2019 నాటికి జిల్లాలో సుమారు 1.45 లక్షలు ఉన్న పింఛన్లు వైఎస్సార్సీపీ హయాంలో 2.36 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ప్రతి నెలా కోతే పింఛన్ సాయాన్ని రూ.4000 చేశామంటున్న కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మాత్రం మంజూరు చేయడం లేదు. పెంచిన భారం ఖజానాపై పడకుండా ఉన్నవాటికి కోత పెడుతోంది. 2024, జూన్లో 2,32,885 మందికి రూ.99.8 కోట్ల పింఛన్ సాయం అందిస్తే, ఈ ఏడాది ఏప్రిల్లో లబ్ధిదారుల సంఖ్య 2,25,718 మందికి తగ్గిపోయారు. వారికి అందించే సాయం రూ.96.8 కోట్లకు చేరింది. పది నెలల కాలంలో 7,167 పింఛన్లకు కూటమి కోత పెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.25 కోట్లు భారాన్ని తగ్గించుకున్నట్టు అంచనా. స్పౌజ్ పింఛన్లలో వింత పోకడ పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందితే మరుసటి నెల నుంచే అతని భార్య(స్పౌజ్)కు పింఛన్ మంజూరయ్యేలా యాప్లో ఆప్షన్ ఉంటుంది. కూటమి పాలన చేపట్టిన వెంటనే పింఛన్ సైట్ను క్లోజ్ చేయడంతో స్పౌజ్ పింఛన్ల మంజూరు ఆగిపోయాయి. నవంబరులో స్పౌజ్ ఆప్షన్ ఇచ్చినా కేవలం ఆ నెల నుంచి మృతిచెందిన వారి భార్యలకు మాత్రమే సాయం అందేలా కొర్రి పెట్టింది. దీంతో అంతకుముందు చనిపోయిన వారి కుటుంబాలకు పింఛన్ సాయం అందకుండా పోయింది. అధికారుల అంచనాల మేరకు జిల్లాలో 6000 మంది వరకు పింఛన్ లబ్ధిదారులు మృతిచెందగా కేవలం 607 మందికి మాత్రమే ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ అందిస్తోంది. న్యూస్రీల్గత పది నెలల్లో జిల్లాలోని పింఛన్ల పంపిణీ వివరాలు నెల పింఛన్లు సాయం (రూ. కోట్లలో) జూన్ 2,32,885 99.80 జూలై 2,31,874 99.20 ఆగస్టు 2,31,075 99.18 సెప్టెంబరు 2,30,123 96.57 అక్టోబరు 2,29,184 96.19 నవంబరు 2,28,362 96.25 డిసెంబరు 2,27,755 96.49 జనవరి 2,27,086 96.72 ఫిబ్రవరి 2,26,044 96.61 మార్చి 2,25,718 96.87 50 ఏళ్లకే పింఛన్ హమీ గాలికి తమ ప్రభుత్వం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. పాలనలోకి వచ్చి పది నెలలు గడిచినా వాటి ఊసెత్తడం లేదు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సుమారు రెండున్నర లక్షల మంది వరకు ఉండగా వారిలో 70 శాతం మంది అర్హులు ఉంటారని అంచనా. ప్రభుత్వం 50 ఏళ్లకే పింఛన్ హామీ గురించి మాట్లాడకపోవడం ఆయా వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వేలల్లో దరఖాస్తులు చివరిగా 2024 జనవరిలో గత ప్రభుత్వం 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేసింది. జూలైలో కొత్తవి మంజూరు రావాల్సి ఉండగా జూన్లో కూటమి రాకతో వాటికి బ్రేక్ పడింది. గత ఏడాది జనవరి నుంచి జూన్ నాటికి కొత్త పింఛన్ల కోసం 6,350 దరఖాస్తులు ఆన్లైన్ అయ్యాయి. కూటమి ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పింఛన్ల కోసం అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు అంచనా. సైట్ ఓపెన్కాక దరఖాస్తులను ఆన్లైన్ చేసే వీలులేక ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పేదలు అందజేస్తున్న ఆర్జీలు ఏమవుతున్నాయో తెలీని పరిస్థితి. పది నెలల్లో 7,167 పింఛన్ల తగ్గింపు జూన్లో 2,32,885 మందికి రూ.99.7 కోట్ల పంపిణీ ఈ ఏడాది ఏప్రిల్లో 2,25,718 మందికి రూ.96.87 కోట్ల సాయం కొత్త పింఛన్ ఒక్కటీ మంజూరు చేయని వైనం పెండింగ్లో 20 వేలకు పైగా దరఖాస్తులు ‘భీమవరంలోని పేద వృద్ధ దంపతులు చిన్నారావు, సత్యవతిల ఇద్దరు కుమారులు పనుల కోసం వేరే ఊళ్లు వలస వెళ్లిపోయారు. వృద్ధాప్య పింఛనే దంపతుల జీవనాధారం. గత ఆగస్టులో చిన్నారావు మృతిచెందగా స్పౌజ్ కోటాలో తర్వాతి నెల నుంచి సత్యవతికి పింఛన్ అందాలి. కూటమి ప్రభుత్వం ఆ ఆప్షన్ క్లోజ్ చేయడంతో ఆమెకు పింఛన్ సాయం అందక తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఆమె ఒక్కరే కాదు జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన వేల మంది పింఛన్ కోసం అధికారులకు అర్జీలు అందజేసి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. -
ఉపాధి పనులు పారదర్శకంగా జరగాలి
కాళ్ల: కాళ్ల మండలం బొండాడపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కేసీహెచ్ అప్పారావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పశువుల చెరువు పూడికతీత పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడి మస్తర్ రికార్డులను పరిశీలించారు. 3,307 పనిదినాలు అంచనాతో రెండు ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో సుమారు రూ.10 లక్షలతో చేపట్టిన పనులు పారదర్శకంగా జరగాలని ఫీల్డ్ అసిస్టెంట్కి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జి.స్వాతి, ఏపీఓ కె.శ్రీనివాసరావు, సర్పంచ్ గుడ్ల మధుసూదనరావు, టెక్నికల్ అసిస్టెంట్ వీవీ మణికంఠ, ఫీల్డ్ అసిస్టెంట్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
గళమెత్తిన ఉపాధ్యాయులు
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి 21 నెలలు అయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఆందోళన నెలకొందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా దీని ఊసే లేకపోవడం శోచనీయమన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2004, సెప్టెంబరు 1 నాటికన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్తో నియామకమైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో ఇచ్చినా రాష్ట్రంలో ఇప్పటికీ అమలు చేయని పరిస్థితి కొనసాగడం బాధాకరమన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏను 90 శాతం నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండగా.. పెండింగ్ ఉందన్నారు. ఇంకా మూడు డీఏలను ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందన్నారు. సీపీఎస్, జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జి.మోహానరావు, కార్యదర్శి ఎం.ఆదినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.మనోజ్, జేఏసీ కన్వీనర్ నెరుసు రామారావు, డిప్యూటీ సెక్రటరీ ఎం.శామ్యూల్, కోశాధికారి ఎస్డి జిలానీ తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా దాళ్వా మాసూళ్లు
భీమవరం: అవరోధాలను అధిగమించి ఆరుగాలం కష్టించి దాళ్వా సాగుచేసిన రైతన్నలు పంట మాసూళ్లు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగునీటి కొరత, తెగుళ్లు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డా వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం, వీరవాసరం, పెంటపాడు, తణుకు, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైతన్నలు దాళ్వా మాసూళ్లు ప్రారంభించగా పీఆర్–126, ఎస్ఎల్–10 వంటి వరి రకాల కొట్టుపొట్టు ధాన్యం ఎకరాకు 60 నుంచి 70 బస్తాల వరకు దిగుబడి వస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వాసాగు చేయగా కొన్ని ప్రాంతాల్లో మాసూళ్లు ప్రారంభించారు. సాగునీటి కొరత, తెగుళ్ల బెడద దాళ్వా సాగు ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సమస్య ఉత్పన్నం కావడంతో వంతుల వారీ విధానంలో నీరందించడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. అయినప్పటికీ మెరక ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందకపోవడంతో రైతులు మురుగు కాలువల్లోని నీటిని ఆయిల్ ఇంజిన్ల సహాయంతో చేలకు పెట్టుకుని పంటను కాపాడుకున్నారు. అలాగే తెగుళ్లు, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం దాళ్వా పంటలో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికిగాను 348 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతుసేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు ఇప్పటికే రెవెన్యూ డివిజన్ల వారీగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ ఉన్న ధాన్యం కొనుగోలులో సాధారణ రకం క్వింటాళ్లు ధాన్యం రూ.2,300, ఏ గ్రేడ్ రకం రూ.2,320 రైతులకు చెల్లిస్తారు. పంట మాసూళ్లు ప్రారంభం కావడంతో జిల్లాలో మొట్టమొదటి ఽరైతు సేవాకేంద్రాన్ని గురువారం తాడేపల్లిగూడెంలో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వా వరిసాగు అనుకూల వాతావరణంతో దిగుబడులపై ఆశలు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రభుత్వ లక్ష్యం నేడు తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం 80 శాతం గింజలు గట్టిపడితే మాసూళ్లు చేయాలి జిల్లా వ్యాప్తంగా దాళ్వా వరి పంట ఆశాజనకంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో మాసూళ్లు ప్రారంభమయ్యాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో 80 శాతం గింజలు గట్టిపడిన తరువాతనే మాసూళ్లు చేయాలి. 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం. – జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం -
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 8లో uవిజయవంతంగా ఈఎండీపీ ఎక్స్పో ఏలూరు (ఆర్ఆర్పేట): స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, సమగ్ర శిక్షా సంయుక్త అధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం ఈఎండీపీ 2024–25 జిల్లాలోని 40 పాఠశాలల్లో అమలు చేశారు. ఇందుకు సంబంధించిన సెషన్ పూర్తయిన అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్లు ఆన్న్లైన్ ద్వారా స్వీకరించి వాటి నుంచి ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. జిల్లా స్థాయి ఎక్స్పోని స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి మునిసిపల్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసారు. రెండు ప్రాజెక్టులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందచేశారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కే.పంకజ్ కుమార్, జిల్లా విద్యా పర్యవేక్షణ అధికారి రెడ్డి రామారావు, జిల్లా సైన్స్ ఆఫీసర్ సోమయాజులు ప్రాజెక్టులను పరిశీలించారు. రాచూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు రూపొందించిన సౌర విద్యుత్ వినియోగం ప్రయోజనం, బొర్రంపాలెం విద్యార్థులు రూపొందించిన సాంకేతిక పరిష్కారాలు– రోబో పాత్ర ప్రాజెక్టులు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. తణుకులో ఐటీ దాడులు తణుకు అర్బన్: ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం తణుకులో ఇద్దరు వ్యాపారులపై దాడులు చేశారు. తణుకు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాటూరి లక్ష్మణరావుతోపాటు తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఎన్.దుర్గాప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో ఇద్దరి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. -
ఏలూరును అరగగామిగా నిలపాలి
జిల్లా ప్రత్యేక అధికారి కె.ఆమ్రపాలి ఏలూరు(మెట్రో): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కె.ఆమ్రపాలి ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో బుధవారం కలెక్టర్తో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాలయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి, జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రగతిపథంలో నిలపాలన్నారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం పెంపొందించేందుకు రైతులకు ప్రభుత్వం అందించే చేయూతపై అవగాహన కలిగించి, మరింత విస్తీర్ణంలో సాగుచేసేలా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ,పాపికొండలు, కొల్లేరు ప్రాంతాలలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించి, ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసిన ఉత్పత్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 2.50 లక్షల ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరిగి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించారని, 50 ఉత్పత్తుల అమ్మకాలతో ఏలూరు జిల్లా మూడవ స్థానం సంపాదించిందన్నారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో ప్రగతిని సాగిస్తున్నామని, ఉద్యానవన పంటలలో ఆయిల్ పాం అధిక విస్తీర్ణంలో సాగవుతుందన్నారు. గృహ నిర్మాణ లక్ష్యాలు పూర్తి చేయాలి జిల్లాలో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పేదల గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. మే 31 నాటికి 13,525 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఇంతవరకు 6,832 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యిందని, వేసవిలో అనుకూలమైన వాతావరణం ఉంటుందని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సరఫరాపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కాలువలు కట్టేలోగా మంచినీటి చెరువులన్నింటిని నింపుకోవాలన్నారు. ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో నిర్మించిన తాగునీటి సదుపాయాలు, టాయిలెట్లను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. -
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ సెషన్–2 పరీక్షలు బుధవారం నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు 167 మందికి 157 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగిన పరీక్షకు 143 మందికి 127 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో.. భీమవరం: భీమవరంలో బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని డీఎన్నార్ కళాశాలలో ఉదయం షిప్ట్లో 100 మందికి 93 మంది, మధ్యాహ్నం షిప్ట్లో 100 మందికి 95 మంది హాజరయ్యారని పరీక్షల పర్యవేక్షకుడు సూర్యనారాయణమూర్తి చెప్పారు. 9న ఉండిలో ఆక్వా రైతుల సమావేశం భీమవరం: ఆక్వా సమస్యలపై చర్చించడానికి ఈ నెల 9న అప్సడా, ఆక్వా రైతుల సమావేశం ఏర్పాటుచేసినట్లు జిల్లా ఫ్రాన్స్ఫార్మర్స్ వెల్పేర్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.గజపతిరాజు, గాదిరాజు వెంకట సుబ్బరాజు చెప్పారు. బుధవారం భీమవరంలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఆక్వా రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సివుందన్నారు. 9వ తేది ఉదయం 10 గంటలకు ఉండి గ్రామంలోని కోట్ల ఫంక్షన్హాల్లో నిర్వహించే సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నందున ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఇళ్ల స్థలాల కోసం ధర్నా భీమవరం: పేదల ఇళ్లస్థలాలకు సంబంధించి ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ తక్షణం నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, డీఆర్ఓకు ఆర్జీలు సమర్పించారు. అనంతరం భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తొమ్మిది నెలలు గడిచిపోయినా హామీలను అమలు చేయలేదన్నారు. సత్వరమే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తమరాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి భీమవరం: మున్సిపాలిటీల ద్వారా ప్రజలకు అందించే సేవల ప్రైవేటీకరణను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని, ఆశించిన కార్మికుకు చేదు అనుభవం ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేవలను ప్రైవేటుపరం చేస్తే మరింత ఇబ్బంది ఎదురవుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డికి వినతి పత్రం అందజేశారు. -
వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఏలూరు (మెట్రో): మారుతున్న కాలానికనుగుణంగా వస్తున్న శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో అమలు చేయడం ద్వారా అధిక దిగుబడులను సాధించాలని ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ అన్నారు. ఏలూరులోని ఏరువాక కేంద్రంలో మార్టేరు వ్యవసాయ పరిధిశోధనా స్థానం సహ సంచాలకులు డా. టి.శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. జి.శివనారాయణ మాట్లాడుతూ సార్వా, దాళ్వా పంటకాలానికిగాను ఏరువాక కేంద్రం, వ్యవసాయ శాఖ, రైతు సేవా కేంద్రం సిబ్బందికి మునుపు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఏరువాక కేంద్రంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం, రెండు మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ భాషా, ఏరువాక కేంద్రం, ఏలూరు సమన్వయ కర్త డా. కె.ఫణికుమార్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు ప్రధాన శాస్త్రవేత్త డా.సీహెచ్. శ్రీనివాసు, మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డా. కె.మోహనరావు, ఏరువాక కేంద్రం, ఏలూరు శాస్త్రవేత్త ఎన్.నాగేంద్ర బాబు, రైతు శిక్షణా కేంద్రం ఏడీఏ లలిత సుధ, సెరికల్చర్ అధికారి శ్రీనివాస్, మత్స్య శాఖ అధికారి రాజకుమార్, ఏలూరు ఉద్యాన అధికారి కరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెనుముప్పు తప్పింది. స్థానికుల కథనం ప్రకారం. రాళ్లకుంటలోని సెయింట్ గ్జేవీయార్ పాఠశాలకు చెందిన జామాయిల్ తోటను కొద్దిరోజుల క్రితం నరికివేశారు. కలపను తరలించగా, మిగిలిన తుక్కు మొత్తం అక్కడే ఉంది. గుర్తు తెలియని వ్యక్తుల కారణంగా ఆ తుక్కుకు నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు, చుట్టుపక్కలకు వ్యాపించాయి. దాంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక ఎస్సై జి.నాగరాజు సిబ్బందితో కలసి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తాగి పడవేసిన సిగిరెట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
కూటమి సేవలో ఖాకీలు!
సాక్షి, భీమవరం: అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ వారి విధులు విస్మరిస్తున్నారు. కూటమి మూకల దౌర్జన్యాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదుపై వారం రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిర్యాదు అందినట్టుగా ఎక్నాలెడ్జ్మెంట్తో సరిపెట్టారు. గత నెల 27న అత్తిలి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కూటమి మూకలు నిర్భంధించి ఎన్నికలో పాల్గొనకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎంపీటీసీ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వీలులేకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి మూసివేశారు. దమ్ముంటే తమను దాటి వెళ్లమంటూ అరుపులు, కేకలతో భయానక వాతావరణం సృష్టించారు. ఒకానొక దశలో కారుమూరి ఇంటి గేటును నెట్టుకుంటూ లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. గొడవలు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కూటమి మూకలు చేసిన దౌర్జన్యకాండకు సంబంధించిన వీడియోలు, సీసీ టీవీ పుటేజీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలమయ్యాయి. ఎన్నిక వాయిదా పడిన మరుసటి రోజు సైతం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే రోడ్లన్నింటిని బ్లాక్ చేసి వైఎస్సార్సీపీ సభ్యులు ఉన్నారేమోనని వాహనాలను తనిఖీలు చేయడం సంచలనమైంది. ప్రశాంతతకు నిలయమైన అత్తిలిలో ఇలాంటి ఘటనలు ముందెప్పుడూ చూడలేదంటూ స్థానికులు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లరి మూకలు పెట్రేగిపోయినా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోయారే తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ సభ్యులకు రక్షణ కల్పించాలని స్వయంగా మాజీ మంత్రి కారుమూరి తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ ప్రేమరాజు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. వారం రోజులైన కేసు లేదు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అనుచరులు సాగించిన దౌర్జన్యంపై అదే రోజున మాజీ మంత్రి కారుమూరి అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన అనుచరులు మారణాయుధాలతో తన ఇంటిపై దాడికి తెగబడ్డారని, మహిళ ఎంపీటీసీ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తమ సభ్యులు ఎన్నికలకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి సంబంధించి సీసీ పుటేజీ, మీడియా కవరేజీ వివరాలను పెన్డ్రైవ్లో పెట్టి పోలీసులకు అందజేశారు. వారం రోజులు కావస్తున్నా చర్యలు తీసుకోకుండా జిల్లా పోలీసులు కాలయాపన చేస్తుండటంపై కారుమూరి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు తమకు ఫిర్యాదు అందినట్టుగా మంగళవారం రాత్రి అత్తిలి పోలీసులు రసీదు అందజేశారు. కేసు విషయమై అత్తిలి ఎస్ఐ పి.ప్రేమరాజు వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి అనుచరుల అరాచకం మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి కారుమూరి వారం రోజులు కావస్తున్నా కేసు నమోదుకు మీనమేషాలు -
వక్ఫ్బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న వక్ఫ్బోర్డు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకుంటే ఉద్యమాలు తప్పవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే నౌషాద్ మొహిద్దీన్ హెచ్చరించారు. పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తన మిత్ర పక్షాలతో కలిసి కుట్ర చేసి లక్షలాది, కోట్ల రూపాయలు విలువైన వక్ఫ్ భూములను స్థానిక అధికారులకు కట్టబెట్టే విధంగా చూస్తూ, ఓ మతాన్ని నష్టపరిచడం చాలా అన్యాయం అన్నారు. పార్లమెంట్లో బిల్లుకు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం ముస్లింలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ముస్లిం హక్కులను కాపాడుతానని చెప్పి, ఇప్పుడు ముస్లింల విశ్వాసానికి వ్యతిరేకంగా వ్యహరించడం శోచనీయం అని అన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించడం హర్షం వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించాలని కోరారు. -
పాస్టర్ ప్రవీణ్ పగడాలపై అసత్య ప్రచారం
తణుకు అర్బన్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తణుకులో శాంతి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీ రాష్ట్రపతి రోడ్డు మీదుగా నరేంద్ర సెంటర్కు చేరుకుని ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించారు. క్రిస్టియన్ కౌన్సిల్ నాయకుడు ఒ.మనోజ్బాబ్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతికి క్రైస్తవ లోకం బాధపడుతుంటే మద్యం కొనుగోలు చేశారని, మద్యం సేవించి ప్రయాణించారని సామాజిక మాధ్యమాల్లో చూపిస్తూ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా టీవీ 5 మూర్తి క్రైస్తవ లోకాన్ని హేళన చేసేలా దశమ భాగాలు తీసుకునే పాస్టర్లు, పనిమనుషుల నుంచి డబ్బులు తీసుకునే పాస్టర్లు అని సంబోధిస్తూ వ్యంగంగా మాట్లాడడాన్ని క్రైస్తవ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైజాగ్లో డ్రగ్స్ దొరికినప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండానే నిందలు వేశారని, తిరుపతి లడ్డూలో పశువుల కొవ్వు ఉందని ఎటువంటి ఆధారాలు లేకుండానే నిందలు వేసి సున్నితమైన అంశాలను వివాదాస్పదం చేస్తుంది ఎవరని నిలదీశారు. ప్రవీణ్ మృతి ఘటనను సీఐడీతో దర్యాప్తు చేయించాలన్నారు. ర్యాలీలో పాస్టర్లు ఎం.హారత్బాబు, పీడీ ప్రసన్నకుమార్, ఎన్.ఇజ్రాయేలు, కె.దానియేలు, యు.రాజ్కుమార్, బి.జేమ్స్, కె.బ్లెస్సింగ్ రాజు, భారీ సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. తణుకులో క్రైస్తవ సంఘాల శాంతి ర్యాలీ -
మామిడి పండుగ.. ఉత్సాహంగా..
బుట్టాయగూడెం: మన్యం కొండల్లో మామిడికాయ పండుగ సందడి నెలకొంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో గత రెండు రోజులుగా కొండరెడ్లు మామిడికాయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వనదేవతలకు పూజలు చేసిన అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి లయబద్ధంగా డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న మామిడికాయ, బాట పండుగ, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించాలని కొండరెడ్డి గిరిజనులు కోరుతున్నారు. ప్రతి ఏడాది వేసవికాలంలో తాము జరుపుకునే పండుగకు సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతం గ్రామస్తులందరూ చందాలుగా వేసుకోవడంతోపాటు కొంతసొమ్ము ప్రజల నుంచి వసూలు చేసి వాటితో పండుగ జరుపుకుంటున్నామని కొండరెడ్డి గిరిజనులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ పంటలను గుర్తించి ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. గిరిజన సంప్రదాయ పండుగలను ప్రభుత్వం గుర్తించాలంటున్న కొండరెడ్లు -
పింఛన్.. ప్రతినెలా టెన్షన్
వైఎస్ జగన్ పాలనలో వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా తలుపు తట్టి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్ డబ్బులు ఇచ్చి వెళ్లేవారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము కూడా ఇంటికే పింఛన్ అందిస్తున్నామని చెబుతున్నా ఆ దిశగా సరైన చర్యలు తీసుకోకపోవడంతో పింఛన్ లబ్ధిదారులకు అగచాట్లు తప్పడం లేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు పింఛన్ సొమ్ముల కోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కొన్ని సచివాలయాలు తాళాలు వేసి ఉండడం, కొన్నిచోట్ల సచివాలయాల్లో సిబ్బంది ఉండకపోవడంతో వృద్ధులు, వికలాంగులు పింఛన్ డబ్బుల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి తలెత్తింది. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
ఈ శ్రమ్ పోర్టల్పై వర్కర్లకు అవగాహన
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫారం వర్కర్లు తప్పనిసరిగా ఈ–శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్ఆర్పేటలోని ఓ హోటల్లో గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫారం వర్కర్లు, హోటల్ యాజమాన్యానికి ఈ–శ్రమ్ పోర్టల్ గురించి మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల నందు సుమారు 800 మంది వరకు గిగ్, ఫ్లాట్ ఫారం వర్కర్లు జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, రాపిడ్ వంటి వాటిలో పనిచేసేవారు ఉన్నారన్నారు. వీరందరినీ ఈ–శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. వర్కర్లు ఆధార్ నంబర్, పాన్ నంబర్, ఆధార్కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ కలిగి ఉండాలన్నారు. కార్మికుల వయసు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఈ నమోదు ప్రక్రియ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, సీఎస్సీ సెంటర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసుకోవచ్చునని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ తెలియజేశారు. -
ఇంటర్ పుస్తకాల పంపిణీ
ఏలూరు (ఆర్ఆర్పేట): వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను జిల్లాలోని వివిధ కళాశాలలకు పంపిణీ చేశారు. మంగళవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆయా కళాశాలలకు వివిధ వాహనాల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది ప్రస్తుతం అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలలకు 67,800 నోటు పుస్తకాలు వచ్చాయని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాను తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 5751 టెక్ట్స్ పుస్తకాలు వచ్చాయని, వాటిని కూడా ఆయా కళాశాలలకు తరలించామని తెలిపారు. ముగిసిన పదో తరగతి పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు మొత్తం 22,413 మంది హాజరయ్యారు. 22,704 మంది రెగ్యులర్ విద్యార్థులకు 22,244 మంది హాజరు కాగా ఒకసారి అనుత్తీర్ణులైన వారిలో 295 మంది విద్యార్థులకు 169 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా పరిశీలకుడు 4 కేంద్రాల్లో, జిల్లా విద్యాశాఖాధికారి 4 కేంద్రాల్లో, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ 3 కేంద్రాల్లో, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 29 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. కూల్డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ డిపోలో తనిఖీలు ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ డిపోలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. గడువు దాటిన కూల్డ్రింకులు దుకాణాలకు పంపిణీ చేస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ రామరాజు స్థానిక నరసింహరావు పేటలోని జమ్ ఎంటర్ప్రైజెస్ కోకాకోలా సేల్స్ డిపోలో ఫిర్యాదుదారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. అధికారులకు గడువు తేదీ ముగిసిన డ్రింకులు ఏమీ లభ్యం కాలేదు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ కల్తీ విషయంలో ఎలాంటి ఫిర్యాదులందినా వెంటనే తనిఖీలు చేస్తామని, కల్తీ జరిగినట్టు గుర్తిస్తే సంబంధిత పదార్థాల సాంపిళ్ళు ల్యాబ్లకు పంపి పరీక్షిస్తామన్నారు. కల్తీ జరిగిటన్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో చేరికకు 25న ప్రవేశ పరీక్ష టి.నరసాపురం: జిల్లాలోని గురుకుల పాఠశాలలు అప్పలరాజుగూడెం(బాలురు), నాగిరెడ్డిగూడెం (బాలికలు), ముసునూరు (బాలికలు)లో 5, 6, 7, 8 తరగతులలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అప్పలగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డీఎస్బీ శంకరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవా కేంద్రం ద్వారా వెబ్సైట్లో ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందన్నారు. వివరాలకు 87126 25030 నెంబరులో సంప్రదించాలన్నారు. ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని దూబచర్ల డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను ఎఫ్ఎస్టీసీ విధానంలో భర్తీ చేసే నిమిత్తం అర్హత, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని యాజమాన్యాల్లోని(ప్రభుత్వ/ జిల్లా పరిషత్/ మున్సిపల్) పాఠశాలల్లో పని చేస్తున్న మండల విద్యాశాఖాధికారులు/ ప్రధానోపాధ్యాయులు/ స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలు డీఈఓ ఏలూరు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. -
లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రిమాండ్
కుక్కునూరు: లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ ఎం.రమేష్బాబు మంగళవారం తెలిపారు. కుక్కునూరు పీహెచ్సీలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్న కొమరం ముత్యాలమ్మపై గొడ్ల అజిత్కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు అజిత్కుమార్ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. కూటమి నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలి కై కలూరు: విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న భవ్య న్యూస్ ఎడిటర్ కురేళ్ళ కిషోర్పై దాడి చేసిన కూటమి నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పలు దళిత సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. ప్రముఖ దళిత నాయకుడు మత్తె సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో తాలూకా సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడ నుంచి ర్యాలీగా సీఐ కార్యాలయానికి వెళ్లారు. దాడి ఘటనపై తక్షణ కేసు నమోదు చేయాలని రూరల్ సీఐ వి.రవికుమార్ను కోరారు. అనంతరం విలేకరులతో సూర్యచంద్రరావు మాట్లాడుతూ మార్చి 26న భుజబలపట్నంలో వైస్ ఎంపీపీ ఎన్నిక విషయంలో జరిగిన ఘర్షణ ఫొటోలను తీస్తున్న పాత్రికేయుడు కురేళ్ళ కిషోర్పై కూటమి నేతలు దాడి చేయడం అమానుషమన్నారు. దాడి చేసిన వారిని ఆయా పార్టీలు సస్పెండ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత ప్రజా సమితి నియోజకవర్గ అధ్యక్షుడు మత్తె రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారత్నం, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ మద్దా ప్రేమ్కుమార్, దళిత నాయకులు పాతపాటి శాంతరాజు, గాలి ప్రసాద్, బోడిగంటి కిషోర్, బండి ప్రసాద్, సోమల శ్యామ్సుందర్, రత్నరాజు, దాసరి ప్రసాద్, రాజు, గోపవరం దళిత యువత హాజరయ్యారు. వ్యక్తిపై హత్యాయత్నం ఉంగుటూరు: వ్యక్తిపై హత్యాయత్నం జరిగిన ఘటన మంగళవారం రాత్రి ఉంగుటూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఉంగుటూరు దళిత పేటకుచెందిన యర్రారపు రాజు భార్యతో అదేపేటకు చెందిన మార్లపూడి ప్రసాదు వివాహేతర సంబంధం కలిగి ఉండటంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండుసార్లు పెద్దల సమక్షంలో పెట్టగా గొడవను సద్దుమణిగేలా చేశారు. కాగా మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో బైక్పై నారాయణపురం వైపు వెళుతున్న ప్రసాద్పై రాజు గొడ్డలితో దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయమైన ప్రసాద్ను తాడేపల్లిగూడెం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5న వీఆర్ఏల రాష్ట్ర సదస్సు భీమవరం: విజయవాడ ఎంబీ భవన్లో ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర సదస్సుకు అన్ని మండలాల నుంచి వీఆర్ఏలు హాజరై జయప్రదం చేయాలని వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వీఆర్ఏలు విడిపోయారనే పేరుతో ప్రభుత్వం దోబూచులాడుతుందని, అందరూ కలిసి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బడ్జెట్ లేదనే పేరుతో జీతాల బిల్లు పెట్టకపోవడం దారుణమన్నారు. -
● బొప్పాయి.. బడాయి
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం అలివేరులో నడపల శ్రీరాములు ఇంటి ఆవరణలో ఉన్న ఈ బొప్పాయి చెట్టు ఎన్నో విశేషాలతో ముడిపడి ఉంది. సాధారణంగా బొప్పాయి చెట్టు నిటారుగా పెరిగి ఫలాలను అందిస్తుండగా ఈ బొప్పాయి చెట్టు మాత్రం తన దిశను మార్చుకుని 14 కొమ్మలతో విభిన్నంగా ఉండటం గమనార్హం. ఈ కొమ్మలకు మొత్తం 16 కాయలు ఉన్నాయి. మరో విశేషమేమిటంటే కొన్ని కొమ్మలకు కాయలు ఉన్నా.. ఆకులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ బొప్పాయి చెట్టును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – బుట్టాయగూడెం -
నిరుద్యోగులను నిండా ముంచారు
ఏలూరు (టూటౌన్): ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంతవరకూ నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ ప్రకటన చేస్తామని చెప్పి.. 10 నెలలైనా ఉలుకూ పలుకూ లేదు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. ఇక గత ప్రభుత్వం అమలు చేసిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే యోచనపై కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మండిపడుతున్నారు. జిల్లాలో 1.50 లక్షలకు పైగా నిరుద్యోగులు నిరుద్యోగ యువతకు ప్రతీ నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. కూటమి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని డప్పాలు కొట్టిన నాయకులు ప్రస్తుతం దాని ఊసే ఎత్తక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు జిల్లాలో 16.50 లక్షల మంది వరకు జనాభా ఉన్నారు. వీరిలో 8 నుంచి 10 శాతం నిరుద్యోగ యువత ఉన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 1.50 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పిస్తుందనే ఆశలో ఉన్నారు. లేని పక్షంలో ప్రతీ నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు చొప్పున అందిస్తుందని ఓటు వేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి ప్రకనట చేయలేదు. అధికారం చేపట్టి 10 నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్లో భాగంగా హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలును కొండెక్కించడం పట్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అవకాశం వస్తే తమ సత్తా చూపేందుకు సన్నద్ధమవుతున్నారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే డీఎస్సీ అభ్యర్థుల కంటి నీరు తుడిచేలా డీఎస్సీ ప్రకటన చేశారు. 10 నెలలు కావస్తున్నా దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పాలకులు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులైన తమను మోసం చేసారని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆట లాడుకోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆగ్రహాం గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆప్కాస్ విధానం రద్దు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉండటం పట్ల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు, సంస్థలు, వ్యక్తులు లేకుండా ఆప్కాస్ ద్వారా నేరుగా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడం, పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాలలో తమ వాటాను జమ చేయడం వంటి వాటి వల్ల సుమారు 10 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. ఆప్కాస్ రద్దు చేసి మళ్లీ పాత విధానాన్ని ప్రవేశపెడితే తమకు కష్టాలు తప్పవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు మెగా డీఎస్సీ దగా డీఎస్సీనే.. ఆప్కాస్ రద్దు యోచనపై అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది ? ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇవ్వాలి. తొలగించిన వలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారికి నెలకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలి. – జి.సూర్యకిరణ్, జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్ఐ సూపర్ సిక్స్ అమలులో విఫలం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైంది. ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లవాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పేరుతో వేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదు. తక్షణం మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి. – కే.లెనిన్, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ, ఏలూరు జిల్లా -
గిరిజన పండుగలను ప్రభుత్వం గుర్తించాలి
గిరిజన సంప్రదాయ పండుగలైన బాట పండుగ, మామిడికాయ, చిక్కుడు, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించి ఐటీడీఏ ద్వారా ఘనంగా జరిపించే విధంగా ఏర్పాటు చేయాలి. మా పూర్వీకుల నుంచి వస్తున్న పండుగలను నేటికీ మేము ఆచరిస్తున్నాం. – కొక్కెర భీమరాజు, అలివేరు, బుట్టాయగూడెం మండలం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం మా పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తున్న మామిడికాయ పండుగను సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మామిడి చెట్టుకు పూజలు చేసిన తర్వాతే ఆ ఫలాలను తింటాం. అప్పటి వరకూ ఎవ్వరూ ముట్టుకోం. ఎవరు ముట్టుకున్నా వారికి జరిమానా విధించడం జరుగుతుంది. – సర్ల బుల్లెమ్మ, అలివేరు, బుట్టాయగూడెం మండలం -
పింఛన్లపై అన్నీ కోతలే
● ఎన్నికల హామీలన్నీ గాలి మాటలే.. ● 9 నెలల కాలంలో వేలల్లో తొలగింపు ● కొత్తవి ఒక్కటీ మంజూరు చేయని కూటమి సర్కారు ఏలూరు(మెట్రో): మేం అధికారంలోకి వస్తే 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్లు ఇస్తాం. బీసీల్లో 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందిస్తాం. ఒక్క పెన్షన్ కూడా తొలగించకుండా అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ చెప్పిన మాటలు. ప్రజలకు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు. గద్దెనెక్కాక పెన్షన్దారులకు చుక్కలు చూపిస్తున్న కూటమి సర్కారు అడ్డగోలుగా పెన్షన్లు తొలగిస్తూ, దివ్యాంగులు, వృద్ధులను ఇబ్బంది పెడుతోంది. మరణాల వల్ల పెన్షన్లు తగ్గుతున్నాయని చెబుతూ తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో పండుగే.. గతంలో నెలలో ఒకటో తేదీ వచ్చిందంటే వృద్ధులు, వికలాంగులు , వితంతువులకు పండుగ వాతావరణం ఉండేది. వేకువజామునే పింఛన్దారుల తలుపు తట్టి ఇంటి వద్దే పెన్షన్ అందించేందుకు గత వైఎస్సార్సీపీ సర్కారు చర్యలు తీసుకుంది. గతంలో బాధలు పునరావృతం కాకుండా కమ్యూనిటీ హాళ్ల వద్ద పండుటాకులు పడిగాపులు పడకుండా.. ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ ప్రక్రియ చేపట్టింది. గత ఎన్నికల్లో పింఛన్లు పెంచుతాం, అర్హతలు, నిబంధనల్లో వెసులుబాటు కల్పిస్తానంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఉన్న పెన్షన్లు సైతం తొలగించేందుకు చర్యలు చేపట్టారు. కూటమి సర్కారు గద్దెనెక్కిన నాటి నుంచి ప్రతీ నెలా పెన్షన్లు తొలగిస్తూ వస్తున్నారు. తొలగించిన పెన్షన్లన్నీ మరణించిన వారివే అని అధికారులతో ప్రకటనలు చేయిస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎక్కడ? వాస్తవానికి పింఛన్లు అర కొర తగ్గించినా, కొత్త పింఛన్లు వచ్చి చేరుతూనే ఉంటాయి. ప్రతీ సంవత్సరం నూతన పింఛన్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి సంవత్సరంలో రెండుసార్లు నూతన పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. అయినప్పటికీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పెన్షన్ను కొత్తగా మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలకు 45 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తానని, అదే విధంగా బీసీలకు 50 ఏళ్లు పైబడితే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. వీటిపై నేటికీ కూటమి నాయకులు నోరు మెదపలేదు. మరణాల వల్ల పింఛన్ల సంఖ్య తగ్గిందని చెబుతున్నా, మరణించిన వారి స్థానంలో కొత్త పింఛన్లు మంజూరు చేసిన పాపాన పోలేదు. -
కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమమే
ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు, ధర సమస్యలు వెంటనే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే చలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హెచ్చరించింది. ఏలూరు అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపినా కొనుగోలు, ధర సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇస్తామని కంపెనీలు అంగీకరించాయని ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పినా ఆచరణలో అమలు కావడం లేదని విమర్శించారు. రోజురోజుకీ ధర తగ్గించి వేస్తున్నాయని, కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడుకు ప్రతినిధి బృందం మార్చి 29న వినతి పత్రం అందజేయగా రెండు, మూడు రోజుల్లో కంపెనీలతో మీటింగ్ జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం కిలోకు రూ.700కు పైగా ధర ఉందని ప్రస్తుతం కంపెనీలు రూ.500 నుంచి రూ.550కు ధర ఇస్తున్నాయని, ఈ ధర మరింత తగ్గిస్తామని రైతులను బెదిరించడం దుర్మార్గమని విమర్శించారు. న్యాయం జరిగే వరకూ కోకో రైతులు ఐక్యంగా పోరాడతారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ళ సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, ఉప్పల కాశీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్, గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, రాష్ట్ర కోశాధికారి జాస్తి కాశీ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆప్కాస్ రద్దును విరమించుకోవాలి
ఏలూరు(టూటౌన్): ఆప్కాస్ను రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలను ఉపసంహరించుకోవాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు ఎంతో కొంత ఉపశమనంగా ఉన్న ఆప్కాస్ను రద్దుచేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం అంటే వెట్టిచాకిరిలోకి, బానిసత్వంలోకి నెట్టి వేయడమేనని విమర్శించారు. ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తే పిఎఫ్, ఈఎస్ఐలకు, కనీస వేతనాలకు గ్యారెంటీ ఉండదని ఆందోళన వ్యక్తి చేశారు. గత ప్రభుత్వం 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. ఎక్స్గ్రేషియా పెంచడం, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడం, ఇంజనీరింగ్ కార్మికులకు 36 నెంబర్ జీవో ప్రకారం జీతాలు, దహన సంస్కారాల ఖర్చులు రూ.20 వేలకు పెంచడం వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఆందోళన చేపట్టడానికి మున్సిపల్ కార్మికులు సన్నద్ధంగా ఉన్నరన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య, లావేటి కృష్ణారావు, అంగుళూరు జానుబాబు, బంగారు వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. -
బంధువునని నమ్మించి దోపిడీ
భీమవరం: దూరపు బంధువునని నమ్మించాడు. అదును చూసి దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఆనక పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం వన్టౌన్పోలీసు స్టేషన్లో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని గాంధీనగర్కు చెందిన 23 ఏళ్ల పి విట్టర్పాల్ తాపీ పనిచేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆశతో మార్చి 28వ తేదీన పట్టణంలోని బేతనిపేట అమ్మిరాజుతోటలోని యర్రంశెట్టి మంగతాయారు ఇంటికి వెళ్లి తాను వారికి దూరపుబంధువునని నమ్మించాడు. ఇళ్లు అద్దెకు కావాలని ఇళ్లు చూడడానికి ఇంకా తనవాళ్లు వస్తున్నారంటూ వృద్ధులతో కబుర్లుచెప్పసాగాడు. మూడు గంటల సమయం గడిచిపోవడంతో మంగతాయారు భర్త వీరాస్వామినాయుడు బయటకు వెళ్లడంతో విట్టర్పాల్ ఒక్కసారిగా మంగతాయారుపై చాకుతో దాడిచేసి ఆమె మెడలోని సుమారు రూ.5 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు గొలుసు, మంగళసూత్రాలు, నల్లపూసలతాడు అపహరించుకుపోయాడు. గాయాలైన మంగతాయారును ఆసుపత్రిలో చికిత్సకోసం చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐ ఎం.నాగరాజు, సీసీఎస్ సీఐ డి రాంబాబు, ఎస్సైలు బీవై కిరణ్కుమార్, ఎం రవివర్మ సిబ్బందితో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నిందితుడు విట్టర్పాల్ను సోమవారం పట్టణంలోని బ్రిడ్జిపేట వంతెన వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. త్వరితగతిన కేసును ఛేదించడంలో కృషిచేసిన అధికారులను అభినందించి, సిబ్బందికి రివార్డులను అందించారు. రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాల అపహరణ పోలీసులకు చిక్కిన నిందితుడు -
ప్రభువు మార్గం అనుసరణీయం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏసుక్రీస్తు మార్గంలో ప్రతి క్రైస్తవుడూ పయనించిన నాడే శాంతి, స మాధానాలు లభిస్తాయని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు అన్నారు. స్థానిక గ్జేవియర్ నగర్లో ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్, నిర్మలగిరి పుణ్యక్షేత్ర అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కళ్లే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సో మవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడు తూ పొరుగువారిని ప్రేమతో ఆదరించాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అ మలోద్భవి కథీడ్రల్ విచారణ గురువు ఫాదర్ ఇంజమాల మైఖేల్ మాట్లాడుతూ బిషప్ జయ రావు విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తొలుత కేక్ కట్ చేసి మహోత్సవాన్ని నిర్వహించారు. మేత్రాసనం ప్రొక్యూరేటర్ ఫా దర్ బి.రాజు, నిర్మలగిరి పుణ్యక్షేత్ర విచారణ గురువు జాన్ పీటర్, నాగేశ్వరరావు బిషప్ జయరావును గజమాలతో స న్మానించారు. కళ్లే లలిత ట్రస్ట్ చైర్మన్ భక్తుల సౌకర్యార్థం ఏసీ, రెండు వాటర్ రిఫ్రిజిరేటర్లను అందజేశారు. -
కల్యాణ ముహూర్తాలు ప్రారంభం
కొయ్యలగూడెం: పెళ్లికళ వచ్చేసిందే బాలా అంటూ వధూవరులు బంధుమిత్రులు వేడుకలు చేసుకునే సమయం వచ్చేసింది. ఏప్రిల్లో శుభలగ్నాలతో కూడిన తొమ్మిది పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. విశ్వావసు నామ సంవత్సర చైత్ర మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు మూఢం ఉందని చెబుతున్నారు. అనంతరం 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీలు ముహూర్తాలకు శుభప్రదమైనవి. ఈ నేపథ్యంలో కల్యాణ మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కొన్ని ఆలయాల వద్ద నిర్మించిన కల్యాణ మండపాలలో ఏప్రిల్ ఆరు నుంచి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, అనంతరం ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. పురోహితులు అడ్వాన్స్ బుకింగ్ అవ్వగా, ఈవెంట్ బుకింగ్ మేనేజర్లు కల్యాణ ఏర్పాట్లకు సంబంధించి తల మునకలై ఉన్నారు. టిప్ టాప్ మొదలుకుని భాజా భజంత్రీలు.. కళ్యాణానికి సంబంధించిన వారు అందరూ తమ షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు. సంవత్సరంలో ఒకే నెలలో ఇన్ని ముహూర్తాలు రావడం ఇదే మొదటిదని పండితులు అంటున్నారు. -
బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు 11వ పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్, సీపీఎస్ ఉద్యోగుల బకాయిలతో కలిపి రూ.23 వేల కోట్ల నిధులు చెల్లించాల్సి ఉందని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ గుగులోతు మోహన్రావు అన్నారు. ఈ బకాయిల చెల్లింపుకు తక్షణమే రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి ఫ్యాప్టో సమావేశంలో చైర్మన్ మోహన్రావు మాట్లాడుతూ 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు విడతల డీఏలు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. సీపీఎస్, జీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారిని పాత పింఛన్లోకి తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోని సైతం అమలు చేయని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ రెండో తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో చైర్మన్లు జీ వెంకటేశ్వరరావు, జీ ప్రకాశరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్లు ఎం.శామ్యూల్, ఈసీ సభ్యులు ముస్తఫా ఆలీ, కె.ఆర్.పవన్ కుమార్, ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ బీ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ బోర్డు రద్దు బిల్లు తగదు
కొయ్యలగూడెం: వక్ఫ్ బోర్డు రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు కన్నాపురంలో సోమ వారం రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మతపరమైన రాద్ధాంతాన్ని ఖండించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలకడం అన్యాయమని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డుతో పేద ముస్లింలకు ప్రయోజనం కలుగుతుందని, అటువంటి బిల్లు రద్దు చేయడం ముస్లింలను తీవ్రంగా అన్యాయానికి గురిచేస్తుందని అన్నారు. వక్ఫ్ బోర్డు రద్దు ప్రతిపాదనను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించి కేంద్రంలోని బీజేపీని లొంగదీయాలని కోరా రు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. మెయిన్ సెంటర్లో రాస్తారోకో చేసి కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరంలో ర్యాలీలు నిర్వహించారు.ట్రైనీ డాక్టర్ అంజలికి న్యాయం చేయాలిబుట్టాయగూడెం : రాజమండ్రి బొల్లినేని ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న ట్రైనీ డాక్టర్ అంజలికి న్యాయం చేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం జీలుగుమిల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ నా యకురాలు ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు. అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు ముత్యాలమ్మ, సుధారాణి, వెంకటలక్ష్మి, బుల్లెమ్మ, సీతారామయ్య, బి.రాంబాబు, సీహెచ్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణకు వ్యతిరేకంగా ఓటేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సోమవారం ఏలూరు తంగెళ్ళమూడి వంతెన వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి జాతీయ జెండా చేపట్టి నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం మసీదుల నుంచి ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎండీ ఇస్మాయిల్ షరీఫ్, ఎండీ ఇలియాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. ముస్లింల వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారి బోర్డుల్లో ముస్లింలకు కూడా స్థానం కల్పిస్తారా అని నిలదీశారు. ఎవరికి కేటాయించిన సంస్థల్లో వారు ఉంటే ఆ సంస్థలకు, దేశానికి కూడా మేలు జరుగుతుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపాలన్నారు. కూటమి ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూటమిలో ఉన్న పార్టీలు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని భావించి భవిష్యత్తులో తగిన బుద్ధి కలిగేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ నాయకుడు ఎండీ ముజాహిద్, అహలెసున్నత్వల్ జమాత్ నాయకుడు ఎస్కే పాషా, అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం ప్రతినిధులు, ముస్లింలు పాల్గొన్నారు. -
వర్మ మూవీస్ నూతన చిత్రం ప్రారంభం
జంగారెడ్డిగూడెం: శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 నూతన చిత్రం పూజా కార్యక్రమం సోమవారం జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై జరిగింది. ఉదయం 10.10 గంటలకు ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ అనన్య చిత్రం మాదిరిగానే నూతన సినిమా విజవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ బి.ప్రసాద్రాజు స్వాగతం పలికి కొత్త సినిమా విశేషాలు తెలిపారు. కొత్త, పాత కలయికతో హరర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. మ్యూజిక్ డైరక్టర్ సీఏ రాజ్కుమార్, ఎడిటింగ్ నందమూరి హరి అని మిగతా పేర్లు త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. డెల్టా ప్రాంతానికి చెందిన ప్రముఖులు నాగిరెడ్డి సత్యనారాయణ, నంగిన పాండు రంగారావు అతిథులుగా హాజరై సినిమా విజయవంతం కావాలని కోరారు. కొట్లాటలో యువకుడి మృతి వీరవాసరం: జాతరలో జరిగిన కొట్లాటలో యువకుడు మృతిచెందాడు. నందమూరి గరువు కోట సత్తెమ్మ జాతరలో జరిగిన కొట్లాటలో గ్రామానికి చెందిన కాసాని రాజేష్(16)కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని వీరవాసరం ఎస్సై రవికుమార్ సోమవారం తెలిపారు. జాతరలో కోబ్రా డ్యాన్స్ జరుగుతుండగా కొండచిలువపై జనాలు పడిపోవడంతో కమిటీ సభ్యులు వెనుకకు గెంటారు. ఇదే సమయంలో వెనుక ఉన్న మృతుడు కాసాని రాజేష్పై పడడంతో కమిటీ సభ్యులకు రాజేష్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో గ్రామానికి చెందిన మేకల సతీష్, మేకల రాహుల్ రాజేష్ను అడ్డగించి తీవ్రంగా గాయపరిచారు. వీరవాసరం పోలీసులకు సమాచారం అందడంతో వారు రాజేష్ను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వీరవాసరం ఎస్సై తెలిపారు. కాసాని ఈ ఘటనలో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. తన కుమారుడిని కావాలనే హత్య చేశారని తల్లి దుర్గ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 23 కేజీల పంచలోహ విగ్రహం బహూకరణ పాలకొల్లు సెంట్రల్: శ్రీ ముఖధారమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా సోమవారం దాతలు సింహాద్రి వీర బ్రహ్మం, భ్రమరాంబ దంపతులు అమ్మవారికి 23 కేజీలతో పంచలోహ ఉత్సవ విగ్రహం సమర్పించారు. ఉదయం సన్నాయి వాద్యాలతో విగ్రహాన్ని వీఽధిలో ఊరేగించిన తరువాత ఆలయానికి చేరుకుని పురోహితులు రవీంద్ర బ్రహ్మత్వంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులకు విగ్రహాన్ని అందజేశారు. ఉదయం ముఖధారమ్మకు చలివిడి, పానకం సమర్పించి పట్టణంలో ఉన్న అన్ని అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి చలివిడి పానకం సమర్పించారు. -
పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి
భీమవరం అర్బన్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేయాలని పాస్టర్లు వర్థనపు లాబాను, ప్రసన్నకుమార్, డెలిగేట్లు టి.విజయబాబు, బి.భాగ్యానందం, బి.సునీల్, పి.చిట్టిబాబు డిమాండ్ చేశారు. భీమవరం మండలంలోని వెంపలో పెదపేటలో అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ వరకు సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రజలు అనేక అనుమానాలతో ఉన్నారని ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. రాష్ట్ర వాప్తంగా దళితులు, క్రైస్తవులు, మైనారిటీలపై దాడులను అరికట్టాలన్నారు. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్ శాంతి ర్యాలీకి మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఇంజేటి జయమణి, ప్రభాకర్రావు, బల్ల సుబ్బారావు, కడిమి పౌల్ రాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో.. పెంటపాడు: పాస్టర్ పగడాల అకస్మిక మృతిపై ప్రభుత్వం తక్షణం న్యాయ విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని గూడెం క్రైస్తవ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం గూడెంలోని పలు డినామినేషన్లకు చెందిన క్రైస్తవులు, దైవసేవకులు, మ్యూజిక్ టీం సభ్యులు, క్రైస్తవ గాయకులు గూడెం క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ నిజాలు నిగ్గు తేల్చి తక్షణం దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు. క్రైస్తవులపై ఇటీవల దాడులు పెరిగిపోయాయనడానికి ఈ ఉదంతమే కారణమన్నారు. శిలువ శ్రమల 40 దినాలలో ఉన్న క్రైస్తవ బోధకులు, విశ్వాసులు అహర్నిశం దేశం కోసం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మానుకొండ డల్లా, మరనాత ఎలీషా, పాస్టర్ రవికుమార్, శామ్యూల్ మాస్టార్, బేబీ సరోజిని, లాల్ నెహ్రూ, మెండెం జేమ్సు, పాస్టర్ వినోద్, టైటస్, ప్రసాద్, పాస్టర్ ఎజ్రా శాస్త్రి, దినకరన్, కరుణమ్మ, రాజబాబు, లూక్సన్, శ్యాంబాబు పాల్గొన్నారు. -
కవిటం బాలలకు భరతనాట్యం అవార్డు
పోడూరు: ఉగాది మహోత్సవంలో భాగంగా రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో సోమవారం బాలలకు నిర్వహించిన భారతీయ నృత్యోత్సవం–2025లో కవిటం గ్రామానికి రేమెళ్ల మనోజ్ఞ, ఇళ్ల జాహ్నవి, సత్తి హరినాగశ్రీ, వీరవల్లి యశిస్విని భరతనాట్యంలో అద్భుత ప్రదర్శన చేసి ఆహుతులను మెప్పించారు. నృత్యప్రదర్శన చేసిన కవిటం బాలికలకు నిర్వాహకులు నర్తన వసంత కుసుమం అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నృత్యప్రదర్శన చేసిన మనోజ్ఞ, జాహ్నవి, హరి నాగశ్రీ, యశస్విని, పెనుగొండకు చెందిన శ్రీ వెంకటేశ్వర నృత్య నాట్య కళాశాలకు చెందిన నాట్యాచార్యులు కె.వినయ్కృష్ణను కవిటం గ్రామ ప్రముఖులు అభినందించారు. -
డాక్టర్ జగదీష్కు అవార్డు
ద్వారకాతిరుమల: స్థానిక విర్డ్, తిరుమల తిరుపతి బర్డ్ ఆస్పత్రుల మాజీ డైరెక్టర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ శ్రీవిశ్వవైద్య దివ్యాంగ బంధుశ్రీ అవార్డును అందుకున్నారు. మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో ఫీనిక్స్లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్లో ఆదివారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి నవీన్ రామ్గులామ్ డాక్టర్ జగదీష్కు అవార్డును అందజేశారు. వైద్య రంగంలో జగదీష్ చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగులకు అందిస్తున్న సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది. జగదీష్ సోమవారం ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజిక – సాంస్కృతిక సంస్థ అయిన మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం తెలుగు ప్రజల వారసత్వం, సంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి వేదికై ందన్నారు. వికలాంగుల పునరావాసం, సమాజ సేవకు అంకితమవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అనేక దేశాల్లో ఉచిత ఆర్థోపెడిక్ క్యాంపులు నిర్వహించి సేవలను విస్తరించామని చెప్పారు. ఇంతవరకు అనేక దేశాల్లో క్యాంపులు నిర్వహించి, 1.83 లక్షలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి, దివ్యాంగుల అంగవైకల్యాన్ని రూపుమాపామన్నారు. -
శ్రీనివాసుడిని తాకిన సూర్యకిరణాలు
ద్వారకాతిరుమల: సాయం సంధ్య వేళ.. సూర్య భగవానుడి కిరణాలు గర్భాలయంలో కొలువైన శ్రీనివాసుడి అపాదమస్తకం స్ప్రుశించే శుభ సమయంలో.. వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగారు. ఏటా చైత్ర మాసం ముందు, లేదా చైత్ర మాసం ప్రారంభం రోజుల్లో సాక్షాత్కరించే ఈ అరుదైన ఘట్టం శ్రీవారి క్షేత్ర ఉపాలయంగా విరాజిల్లుతోన్న లక్ష్మీపురంలోని పురాతన దేవాలయమైన, శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆవిష్కృతమైంది. ఎక్కడా ఏ ఆలయంలోను లేని విధంగా ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా స్వామి, అమ్మవార్లను తాకడం ఒక విశిష్ఠత. ఆలయంలోని గర్భాలయంలోకి నేరుగా సూర్యకిరణాలు ప్రవేశించి శ్రీవారిని అణువణువును అర్చించి వెళతాయి. ఆలయం ముందు చెట్లు, ధ్వజస్తంభం, పందిళ్లు ఇలా ఎన్ని ఉన్నా వాటిని తప్పించుకుని మరీ లోపలకు వెళ్లి స్వామిని అర్చించడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ముందు, లేద చైత్ర మాసం ప్రారంభం రోజుల్లో, వరుసగా మూడు రోజులపాటు సాయంత్రం సూర్యాస్తమయ సమయాన అద్భుత కాంతులతో సూర్యకిరణాలు నేరుగా శ్రీ వేంకటేశ్వర స్వామి ముఖం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ పాదాల వరకు అర్చిస్తాయి. ఇలా అణువణువు అర్చిస్తూ దిగిన సూర్యకిరణాలు స్వామి పాదాల వద్ద ఉన్న ఉత్సవ మూర్తులను తాకిన అనంతరం, అవి రెండుగా చీలి ఇరుపక్కలా ఉన్న పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఆలయంలోకి ప్రవేశించి అమ్మవార్లను అర్చిస్తాయి. ఈ వింత ఏడాదిలో మూడు రోజులు మాత్రమే ఇక్కడ జరగడం విశేషమని అర్చకులు చెబుతున్నారు. ఏటా 3 రోజులు ఆవిష్కృతమవుతున్న అద్భుత దృశ్యాలు -
కోడి పందేల స్థావరాలపై దాడులు
ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్.జగన్నాథపురం, మలసానికుంట గ్రామాల్లో కోడి పందేల స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడి చేసి 19 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 49,200 నగదు, 4 కోడి పుంజులు, 5 కోడి కత్తులు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో 8 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.15,800 నగదు, కోడి పుంజు, రెండు కోడి కత్తులు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. మలసానికుంటలో 11 మందిని అరెస్ట్ చేసి, రూ.33,400 నగదు, 3 కోడి పుంజులు, 3 కోడి కత్తులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ముదినేపల్లి మండలంలో.. ముదినేపల్లి రూరల్: మండలంలోని రెండు గ్రామాల్లో కోడిపందేలు ఆడుతున్న 9 మందిని ఎస్సై వీరభద్రరావు ఆదివారం అరెస్టు చేశారు. గురజ పంటకాలువ దగ్గర కోడిపందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి నలుగురిని అదుపులోనికి తీసుకుని వారి నుంచి రూ.3050 నగదు రెండు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు. కొరగుంటపాలెంలో కోడిపందేలు ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.4,200 నగదు కోడిపుంజు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంతో బంధువుల ఆందోళన కొట్టి చంపేశారు: కుటుంబ సభ్యులు తణుకు అర్బన్: మద్యం దుకాణ ఆవరణలో ఈ నెల 29న వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనలో మృతుడు శ్రీనివాసరావు మృతదేహంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆదివారం వైన్ షాపు వద్ద ఆందోళన నిర్వహించారు. శ్రీనివాసరావును కొట్టి చంపేశారని, కాళ్లు, చేతులు వెనక్కి మడిచేసి దారుణంగా హింసించినట్లుగా ఒంటిపై ఉన్న గాయాలే చెబుతున్నాయని మృతుడి భార్య లక్ష్మి, కుమార్తెలు ఆరోపించారు. గత మూడు రోజులుగా వైన్ షాపు ఆవరణలోని సీసీ కెమేరాలు పనిచేయడంలేదని షాపు యజమానులు అంటున్నారని, ఇప్పుడు ఎందుకు పనిచేస్తున్నాయని వారు నిలదీశారు. విషయం తెలుసుకున్న బహుజన సంఘ నాయకుడు చింతపల్లి గురుప్రసాద్ ఆందోళనకారులకు మద్దతు పలికారు. తక్షణమే బ్రాంది షాపు లైసెన్స్ను రద్దుచేయాలని, బాధిత కుటుంసభ్యులకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని అన్నారు. తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, జానా సతీష్లు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై చంద్రశేఖర్ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ తెలియదని, కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు. -
పాస్టర్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి
అత్తిలి: క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని క్రైస్తవ మత పెద్దలు అన్నారు. అత్తిలి మండల క్రైస్తవలు ఆదివారం అత్తిలిలో ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు. అత్తిలి బస్స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులకు వినతి పత్రం అందజేశారు. యూపీఎం ప్రెసిడెంట్ బాబూరావు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీని ఉద్దేశించి బిషప్ ప్రేమ్కుమార్, బిషప్ జగజ్జీవన్, ఎన్సీసీ స్టేట్ సెక్రటరీ మనోజ్బాబు, ఎంఆర్పీఎస్ అబ్బు దాసరి లాజరస్ మాట్లాడారు. భీమవరంలో.. భీమవరం: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేస్తూ శత వార్షిక రూపాంతర దేవాలయం సంఘ సభ్యులు ఆదివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. సత్వరం దర్యాప్తు చేసి.. ఆయన మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సభ్యులు కోరారు. పీసీసీ చైర్మన్ ఉన్నమట్ల కరుణాకరరావు, రేమల్లి కమలరాజు, సంఘస్తులు పాల్గొన్నారు. అదే విధంగా పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ స్థానిక లూథరన్ గ్రౌండ్ నుంచి ప్రకాశంచౌక్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం దర్యాప్తును వేగంవంతం చేయాలని డిమాండ్ చేశారు. గంటా సుందర్కుమార్, చిగురుపాటి సందీప్, పిల్లి రవి తదితరులు పాల్గొన్నారు. మండవల్లిలో.. మండవల్లి: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండవల్లిలో మండల క్త్రెస్తవ సంఘాలు, విశ్వాసుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ కమ్యూనిటీ హాలు నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేశారు. తొలుత ప్రవీణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాల్వేషన్ ఆర్మీ డీసీ మేజర్ మణిబాబు, సీఎస్ఐ ప్యారీస్ గురువు ఎ,సతీష్, సీయోన్ శిఖరం పాస్టర్ గుర్రం పరంజ్యోతి, సీయోను మందిరం మేజర్ పాస్టర్ తిమోతి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడులో.. ఆకివీడు: పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానస్పద మృతికి నిరసనగా ఆదివారం ఆకివీడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీబీసీఎన్సీ సెంట్రల్ బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి గూడపాటి జోసఫ్ రాజు మాట్లాడుతూ పాస్టర్లపై దౌర్జన్యాలు, హత్యల్ని ఖండించాలన్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న పాస్టర్లపై దాడులు హేయమైన చర్య అన్నారు. స్థానిక సీబీసీఎన్ చర్చి నుంచి ప్రధాన సెంటరులోని అంబేడ్కర్ సెంటర్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్ జార్జి, మండా ఏసోబు, బొండాడ వెంకటేశ్వరరావు, నాని, మద్దా నరేష్ తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో.. నరసాపురం: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రవీణ్ది ముమ్మాటికీ హత్యేనని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఆదివారం నరసాపురంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ వై.రూబెన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో జిల్లా నలుమూలలు నుంచి వేల సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రైస్తవులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు చదలవాడ జ్ఞానప్రకాష్, కాకిలేటి మధు, అడిదల శరత్, సికిలే పెర్సిపాల్, ఇంజేటి జాన్కెనడీ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక రంజాన్
నేడు పండుగ జరపుకోనున్న ముస్లింలు చింతలపూడి: నెల రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగ సోమవారం జరుపుకోనున్నారు. ఆదివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఉపవాసాలను నమాజుతో విరమించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసే ముందు పేదలకు సాయం చేస్తారు. ఈదుల్ ఫితర్ నమాజ్ను పురస్కరించుకుని పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి ఈద్గాహ్, మసీదులకు వెళ్ళి సామూహికంగా ప్రార్థనలు చేస్తారు. నమాజు అయిన తరువాత ముస్లింల స్మశాన వాటిక(ఖబరస్తాన్)కు వెళ్ళి పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. అనంతరం కుటుంబంలోని పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియచేసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. నమాజు ముగిశాక బంధుమిత్రులు, స్నేహితులను ఆహ్వానించి షీర్ ఖుర్మా తినిపిస్తారు. పసందైన వంటకాలతో స్నేహితులను, బంధు మిత్రులను పిలిచి ఆప్యాయంగా పెడతారు. దివ్య ఖురాన్ అవతరించిన నెల ఖురాన్ అవతరించింది రంజాన్ మాసంలోనే.. అల్లాహ్ నుంచి 1,24,000 మంది ప్రవక్తలు రాగా వారిలో మహమ్మద్ ప్రవక్త చివరి వారు. క్రీ.శ.624 మార్చి 27న తన సహచరులతో కలిసి మదీనాలో ఈదుల్ ఫితర్ పాటించారని ప్రతీతి. సాధారణ రోజుల్లో ఎవరికై నా దానం చేస్తే దానిని స్వీకరించిన వ్యక్తి మాత్రమే లెక్కలోకి వస్తాడని, రంజాన్ మాసంలో ఒక వ్యక్తికి దానం చేస్తే వందమందికి చేసినంత ఫలితం ఉంటుందని భావిస్తారు. ఈ నెలలో చేసే దానాలు నేరుగా దైవ సన్నిధికి చేరతాయని నమ్మకం. -
మన్యంలో ఘనంగా మామిడికాయ పండుగ
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో ఉగాది పండుగ పర్వదినంతో ప్రారంభమయ్యే మామిడికాయ పండుగను ఆదివారం పలు గిరిజన గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. వేసవిలో మామిడికాయ పండుగ అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ జరిపిన తర్వాత మాత్రమే గిరిజనులు మామిడికాయను తింటారు. ఉగాది రోజున ఇళ్లలో, గ్రామాల్లో ,తోటల్లో కాసిన మామిడి కాయలను అందరూ పండగకు కోసుకొని తీసుకొచి అక్కడ పూజల అనంతరం తింటారు. ప్రతి గ్రామంలో గంగానమ్మతో పాటు ఆయా గ్రామాల్లోని వన దేవతలను గిరిజనులు పూజిస్తారు. ఆయా దేవతలకు దూప దీప నైవేద్యాలతో ఘనంగా పూజలు చేసిన తర్వాతే మామిడి కాయలు చెట్ల నుంచి కాయలను కోస్తారు. ప్రతి ఇంటికీ కోడిని తీసుకువచ్చి గ్రామ దేవతకు మొక్కుగా ఇస్తారు. గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉంటే అన్ని కోళ్లు మొక్కుగా ఇస్తారు. ఆ కోళ్లును వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. మామిడికాయ పండుగలో దేవతలకు పూజలనంతరం గ్రామంలోని చిన్నాపెద్దా కలిసి ఒక గుజిడీ (స్థలం) ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి కోడి కూర తెచ్చుకుని లొట్లలో తాటి కల్లు ఏర్పాటు చేసుకుని జీడి, మామిడి ఆకులతో, దారకాయలతో తాటికల్లును సేవిస్తారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు మామడి కాయ పండుగను పురస్కరించుకుని గ్రామంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా గిరిజన సంప్రదాయ రేల నృత్యాలు చేస్తారు. ఈ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆదివారం కంసాలి కుంటలో ఈ ప్రారంభమైన ఈ మామిడికాయ పండుగలో సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ పాల్గొని వన దేవతలకు పూజలు చేయడంతో పాటు మహిళలతో కలిసి గిరిజన నృత్యాలు చేశారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ వెన్నవల్లి వారిపేట ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి హత్య, దోపిడీ కేసును ఏలూరు వన్టౌన్ పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు వివరాలు వెల్లడించారు. చనపతి రమణమ్మ అలియాస్ చిట్ల రమణమ్మ (65) ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తూ చీటి పాటలు వేస్తూ ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈనెల 27న వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆధారాలు లభించకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. మెడలోని బంగారు ఆభరణాలతో పరారయ్యారు. వన్టౌన్ సత్యనారాయణ పేట కమ్యూనిటీ హాలు ప్రాంతంలో ఉంటున్న చనపతి దుర్గాప్రసాద్ రమణమ్మ వద్ద చీటి పాటలు వేశాడు. చీటీ పాడుకుని సుమారు రూ.2 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. డబ్బుల కోసం రమణమ్మ అనేకసార్లు దుర్గాప్రసాద్ను మందలించింది. దుర్గాప్రసాద్ తన ఉంగరాన్ని తాకట్టుపెట్టి మరో రూ.30 వేల వరకు అప్పు తీసుకున్నాడు. ఈ నెల 27న సాయంత్రం డబ్బులు విషయం మాట్లాడేందుకు రమణమ్మ వద్దకు వెళ్ళాడు. రమణమ్మ తిట్టడంతో ఒక్కసారిగా రమణమ్మపై దాడి చేశాడు. నైలాన్ తాడు మెడకు బిగించి హత్య చేశాడు. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం కాళ్ళు, చేతులు కట్టేసి ఆధారాలు లభించకుండా పెట్రోల్ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుర్గాప్రసాద్ను ఈనెల 30 న ఏలూరు నగరంలోని పంపుల చెరువు రోడ్డులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి నుంచి సుమారు 57 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1000 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి వద్ద హాజరుపరచగా రిమాండ్ విధించారు. కేసును చేధించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అభినందించారు. -
వైభవం..ఉగాది సంబరం
●విశ్వావసు.. విజయ తేజస్సు ●ద్వారకాతిరుమలలో ఘనంగా వేడుక ద్వారకాతిరుమల: చిన వెంకన్న క్షేత్రంలో ఉగాది ఉత్సవం అంబరాన్నంటింది. ఆదివారం స్థానిక ఉగాది మండపంలో వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఉభయదేవేరులతో శేషవాహనంపై కొలువైన శ్రీవారిని అట్టహాసంగా మండపం వద్దకు తీసుకువచ్చారు. మండపంలోని రజిత సింహాసనంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పూజాదికాలు నిర్వహించారు. పండితులు పంచాంగ శ్రవణాన్ని పఠించి రాశి ఫలాలను వివరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు అర్పించారు. చివరగా పండిత సత్కారాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి దంపతులు, అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఆగమ విద్యార్థులు, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోటెత్తిన భక్తులు కొత్త సంవత్సరాది కావడంతో చిన వెంకన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయ తూర్పురాజ గోపుర ప్రాంతం, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, టికెట్, ప్రసాదాల కౌంటర్లు, కేశఖండనశాల తదితర వి భాగాలు భక్తులతో కిక్కిరిశాయి. -
సంప్రదాయానికి ప్రతీక ఉగాది
ఏలూరు (ఆర్ఆర్పేట): తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నిరంగాల్లో జిల్లా అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కమి సమ్మేళనం, పంచాంగ శ్రవణం ఆకట్టుకున్నాయి. పండితులు, రైతులు, కళాకారులకు సత్కారాలు అర్చకులు గూడూరు శ్రీనివాసరావు (మండవల్లి), కందుకూరి రామబ్రహ్మానంద శర్మ (ఏలూరు), వేదాంతం లక్ష్మీనరసింహాచార్యులు (ముసునూరు), వెంకట నాగ శ్రీధర్శాస్త్రి (కై కలూరు)ను నగదు పురస్కారాలతో కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ సత్కరించారు. ఆదర్శ రైతులు మలకపల్లి వీరరాఘవయ్య (ఆడమిల్లి), మద్దుకూరి కృష్ణ (కొయ్యలగూడెం), పర్వతనేని రామకృష్ణ (సీతంపేట), ఉప్పలపాటి చక్రపాణి (లక్ష్మీపురం), సింహా ద్రి గోపాలకృష్ణ (రాట్నాలకుంట)ను సత్కరించారు. కళాకారులు బొడ్డేపల్లి అప్పారావు, షేక్ మహబూబ్ సుభాని, వి.రామాంజనేయులు, పూనెం జయ సా యి శ్రీను, టి.రమ్యకృష్ణ, కల్యాణి, వి. కామరాజు, ఘంటసాల పెద్దిరాజు, ఎడవల్లి వెంకటరమణ, మండవ రాజగోపాలకృష్ణ, బీకే బిందు, కామ సో మరాజు, గండికోట రాజేష్ సత్కరించారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆర్టీసీ పీఆర్వో కేఎల్వీ నరసింహులు సత్కారం అందుకున్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరావు, ఆర్డీఓ ఆచ్యుత అంబరీష్ పాల్గొన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
కూటమి ప్రభుత్వంలో కార్మికులకు దగా
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని కూటమి ప్రభు త్వం భవన నిర్మాణ కార్మికులను దగా చేస్తోందని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్య దర్శి బద్దా వెంకట్రావు విమర్శించారు. హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ 15వ వార్షిక సమావేశం అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతి థిగా వెంకట్రావు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పాలకులు మళ్లించిన బోర్డు నిధులను తిరిగి జమ చేసి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కోరారు. రాష్ట్రంలో 38 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారని వీరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భవన నిర్మా ణ కార్మికుల సంక్షేమానికి రూ.కోటి నిధులు జమ చేస్తాననే హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేర్చిందీ లేనిదీ తెలియడం లేదన్నారు. ఏలూరులో తమ సంఘ భవనానికి స్థలం, నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మాచర్ల శంకర్రావు, అధ్యక్షుడిగా లింగమల్లు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఉప్పు సత్యనారాయణ, నెమలి కృష్ణ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా బత్తిన శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉమా విజయ సాయి, సహాయ కార్యదర్శిగా వస్తాది జనార్దన, కోశాధికారిగా తరుణ్ సాయికుమార్, ఏడుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
నల్ల గట్టు.. కొల్లగొట్టు !
● రాజధాని అభివృద్ధి కోసం గ్రావెల్ తవ్వకాలకు ప్రతిపాదనలు ● పర్యావరణానికి హాని కలిగించేలా ప్రభుత్వ నిర్ణయం ● ఆందోళనలో ఐదు గ్రామాల ప్రజలు నూజివీడు: నూజివీడు మండలంలోని బోర్వంచ రెవెన్యూ పరిధిలోని కొన్నంగుంట, కొత్తూరు గ్రామాల వెంబడి ఉన్న నల్ల గట్టుకు రాష్ట్ర ప్రభు త్వం ఎసరు పెట్టింది. రాజధాని అభివృద్ధికి గ్రావెల్ అవసరమంటూ నల్లగట్టు నుంచి గ్రావెల్ తవ్వి రాజధాని ప్రాంతానికి తరలించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో నల్లగట్టు రూపురేఖలు కోల్పోనుంది. నల్ల గట్టును తవ్వడం వల్ల పర్యావరణ విధ్వంసం జరిగినట్టే. కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి నూ జివీడు తహసీల్దార్ సర్వే నంబర్ 53లో దాదాపు 50 ఎకరాలు గ్రావెల్ తవ్వడానికి అనుకూలంగా ఉందని ప్రతిపాదనలు ఆగమేఘాల మీద పంపించారు. అలాగే బోర్వంచ గ్రామ సర్పంచ్పై ఒత్తిడి తీసుకువచ్చి పంచాయతీ తీర్మానాన్ని సైతం తీసుకున్నారు. రాజధాని ప్రాంతానికి గ్రావెల్ తరలింపు కోసమని.. రాష్ట్ర రాజధాని ముంపు ప్రాంతం కావడంతో అక్కడ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలను మెరక చేసేందుకు లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అవసరం. ఈ మేరకు నూజివీడు ప్రాంతంలోని కొండలను సీఆర్డీఏ అధికారులు గతంలో పరిశీలించి వెళ్లారు. అనంతరం ఏలూరు కలెక్టర్కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపేందుకు కలెక్టర్ తహసీల్దార్ నుంచి వివరాలను తీసుకున్నారు. -
రోడ్లపైకి దాళ్వా ధాన్యం
భీమడోలు : దాళ్వా ధాన్యం రోడ్లపైకి చేరుతోంది. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రైతులు జాతీయ రహదారిపై ఆరబెడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో తేమశాతం వేగంగా తగ్గుతుండటంతో బస్తాల్లో పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ తెరవకపోవడంతో బరకాలతో కప్పి బస్తాలకు రక్షణ కల్పిస్తున్నారు. భీమడోలు మండలంలోని గుండుగొలను, సీతంపేట, పోలసానిపల్లి ప్రాంతాల్లో 1153, పీఎల్ 126 రకాల పంట కోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఎకరాకు 43 నుంచి 50 బస్తాల దిగుబడులు వస్తున్నా యి. అధిక శాతం సీతంపేట ఆయకట్టు రైతులే రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చయ్యిందని, నీటిని తోడుకునేందుకు అదనపు ఖర్చు చేశామని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యాన్ని జాతీయ రహదారిపై నుంచి ఎత్తివేయాలని రైతులను పోలీసులు ఒత్తిడి చేస్తుండటంతో కొందరు అయినకాడికి దళారులకు విక్రయిస్తున్నారు. భీమడోలు మండలంలో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, దళారులకు అమ్మి నష్టపోవద్దని ఏఈఓ ఎస్పీవీ ఉషారాణి సూచించారు. -
33వ గురు పట్టాభిషేక మహోత్సవం
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక గ్జేవియర్ నగర్ లోని సెయింట్ జేవియర్ బోర్డింగ్ దేవాలయంలో ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. నగరంలోని అమలోద్భవి కథీడ్రల్ విచారణ గురువు ఫాదర్ ఐ.మైఖేల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బిషప్ జయరావు సందేశమిస్తూ ప్రతి గురువు ప్రజల కోసం జీవించాలని, క్రీస్తు ప్రభువు మా దిరి పేదలపై ప్రత్యేక ప్రేమ కలిగి ఉండాలని, భక్తులను నీతివంతమైన మార్గంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఫాదర్ మైఖేల్ మాట్లాడుతూ బిషప్ జయరావు ఆదర్శ గురువుగా ప్ర జలకు ఎనలేని సేవలను అందించారని, ప్రజ ల సమగ్ర అభ్యున్నతికి అహర్నిశలూ సేవలందించారన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్కుమార్ ఆత్మశాంతి కోసం ఆచార్య డి.అబ్రహం, టోకూరి స్వరూపరాణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫాదర్లు, గురువులు బిషప్ జయరావును ఘనంగా సన్మానించారు. ఫాదర్లు బి.రాజు, టి.ఇమ్మానియేలు, జె.బెనర్జీ, కార్పొరేటర్ ఎం. నిర్మల సిస్టర్స్, విశ్వాసులు పాల్గొన్నారు. జూమ్ మీటింగ్లో ధూమపానం శానిటరీ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసు ఏలూరు (టూటౌన్): నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రయ్య నిర్వహించిన జూమ్ మీటింగ్లో ధూమపానం చేస్తూ పాల్గొన్న శా నిటరీ ఇన్స్పెక్టర్కు అధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్లకు శనివారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ చంద్రయ్య జూమ్ మీటింగ్ నిర్వహించారు. కండ్రిగగూడెం 16వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు సిగరెట్ కాలుస్తూ జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇది చర్చనీయాంశం కావడంతో నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఇన్స్పెక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీ చంద్రయ్యను ఆదేశించారు. ఈ మేరకు ఏసీ చంద్రయ్య షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై నగర వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉన్నతాధికారి ఎదుటే కింది స్థాయి ఉద్యోగి ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులు వేలెత్తి చూపించే పనులు చేయడం సిగ్గు చేటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు పీజీఆర్ఎస్ రద్దు ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో సోమ వారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవని, దీంతో పీజీఆర్ను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఘనంగా వసంతోత్సవాలు ద్వారకాతిరుమల : చినవెంకన్న దేవస్థానానికి ఉపాలయం, క్షేత్ర దేవత కుంకుళ్లమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు వైభవంగా ప్రా రంభమయ్యాయి. 5 లక్షల గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజ లు, కుంకుమార్చనలు జరిగాయి. సంస్కృతికి చిహ్నం ఉగాది భీమవరం: తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక అని, సంస్కృతి, సంప్రదాయాలకు పండుగలు చిహ్నాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం భీమేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
శ్రీవారి క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంపై శనివారం అమావాస్య ఎఫెక్ట్ పడింది. స్వామివారిని స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శించారు. చినవెంకన్నకు ప్రీతికరమైనరోజు కావడంతో ప్రతి శనివారం వేలాదిగా భక్తులు క్షేత్రానికి విచ్చేస్తారు. ఈ వారం అమావాస్య కావడంతో నామమాత్రంగా భక్తులు శ్రీవారిని దర్శించారు. మధ్యాహ్నం నుంచి అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం విక్రయాల కౌంటర్లు ఇలా దాదాపు అన్ని విభాగాలు ఖాళీగా మారాయి. గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు గడువు పెంపు ముసునూరు: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు ముసునూరు బాలికల గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ కొండాబత్తుల ప్రవీణ తెలిపారు.శ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి నెల 31తో ముగియనుండగా, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. ముసునూరు(బాలికలు), నాగిరెడ్డిగూడెం(బాలికలు), అప్పలరాజుగూడెం (బాలురు) గురుకులాల్లో 5వ తరగతిలో 80 చొప్పున 240 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలను బట్టి ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. మట్టిని తరలిస్తున్న లారీల సీజ్ భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని బరువానిపేట నుంచి భీమవరం వైపు అక్రమంగా మట్టిని తరలిస్తున్న 3 లారీలను గొల్లవానితిప్ప వద్ద ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రవీణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తోలకాలు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉగాది ఉత్సవాలకు మన్యం సిద్ధం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది రోజున వన దేవతలు, కొండ దేవతలకు పూజలు చేస్తారు. ఇంటి పేర్లతో పూజలు చేయడమే కాకుండా జంతు బలులు ఇస్తారు. వియ్యంకుడు వరుసయ్యే వారికి బలిచ్చిన జంతువు కుడి తొడను ఇస్తారు. జంతువు తొడతో కూర వండి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని గిరిజనులు చెబుతున్నారు. ఉగాది ఉత్సవాలను దాసియ్యపాలెం, సీతప్పగూడెం, ముప్పినవారిగూడెం, మంచులవారిగూడెం గ్రామాల్లో వైభవంగా చేస్తారు. గంగానమ్మ, గుబ్బల మంగమ్మ, ముత్యాలమ్మ, నాగులమ్మ, కనకదుర్గమ్మ, పోచమ్మతల్లి, సమ్మక్క సారక్క, సూదికొండ మావుళ్ళమ్మ అమ్మవార్లకు ఘనంగా పూజలు చేసి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గిరిజన ప్రాంతంలో కొంతమంది పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్ను తెలుసుకుంటే మరికొంత మంది పూనకాల్లో వచ్చిన దేవతల ద్వారా వారి భవిష్యత్ను తెలుసుకోవడం విశేషం. గ్రామంలోని పాడిపంటలు, సుఖసంతోషాల గురించి, భవిష్యత్ గురించి పూనకాల నుంచి వచ్చిన దేవతల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. పూనకాల సమయంలో డప్పు వాయిద్యాలతో గ్రామాలు దద్దరిల్లిపోతాయి. నేడు వన, గ్రామ దేవతలకు ఘనంగా పూజలు మామిడి కాయ పండుగకు ఏర్పాట్లు పూర్తి -
కూటమి నేతల ఆగడాలు తాళలేం
ఉంగుటూరు: గ్రామాల్లో కూటమి నాయకుల జోక్యం మితిమీరి ఉండటాన్ని నిలువరింపజేయాలని మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు శని వారం ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. ఎంపీడీఓ రాజ్మనోజ్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఎ.గోకవరం కార్యదర్శి కుసుమపై ఆ గ్రామ టీడీపీ నేతలు మితిమీరి వ్యవహరించిన ఘటనతో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించలేని దుస్థితి నెలకొందని వాపోయారు. అలాగే మరో నాలుగైదు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు విజయకుమార్, ఉపాధ్యక్షుడు ధనలక్ష్మి, కార్యదర్శి దుర్గాప్రసాద్, సభ్యులు రమేష్, ట్రెజరర్ రవికుమార్ ఆధ్వర్యంలో కార్యదర్శులు వినతిపత్రాలు అందజేశారు. -
గోదావరి నదిపై అక్రమ రవాణా
కుక్కునూరు: గోదావరి నది స్మగ్లింగ్కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. మండలంలోని వింజరం రేవు నుంచి తరలించిన 120 కేజీల గంజాయి బూర్గంపాడు వద్ద పట్టుబడడం, వందకు పైగా మూగజీవాలను వింజరం రేవు నుంచి తరలిస్తుంటే స్థానికులు పట్టుకోవడం వంటివి సంచలనం రేపాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రవహిస్తున్న గోదావరి నదికి అవతల పక్కన భద్రాచలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, వాటికి సమీపంలో ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలున్నాయి. దీంతో గంజాయి, పశువులను ఒడిశా, చత్తీస్గఢ్లో కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు వాటిని గుట్టుచప్పుడు కాకుండా గోదావరి దాటించి మండలం మీదుగా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. అనుమతించిన రేవుల్లోనే ప్రయాణించాలి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రజలు పలు పనుల నిమిత్తం గోదావరి మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గోదావరి దాటాలంటే ప్రభుత్వం అనుమతించిన రేవుల గుండా వెళ్లాలి. పడవల మీదుగా గోదావరి దాటించేందుకు అధికారికంగా వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట రేవుకు మాత్రమే అధికారులు వేలంపాట నిర్వహించి అనమతులు జారీచేశారు. కొంతమంది చేపలు పట్టేవారు ఆ సాకుతో పడవలలో ప్రజలను నిబంధనలకు విరుద్ధంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అనమతులు లేకుండా ప్రజల తరలింపును అధికారులు పట్టించుకోకపోవడంతో పనిలో పనిగా కొంతమంది అక్రమ మార్గంలో ఆదాయం కోసం స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. ఇటీవల బూర్గంపాడు గంజాయి కేసులో మండలంలోని వింజరం రేవులో చేపలు పట్టే వ్యక్తిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ ముఠాతో చేతులు కలిపి గంజాయిని పడవలపై తరలించినట్టు తెలుస్తుంది. పడవలను అడ్డుకుంటాం వింజరం రేవులో అక్రమంగా ప్రజలను పడవల్లో తరలించే విషయం నా దృష్టికి వచ్చింది. అలా దాటించే పడవలను సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకుంటాం. కె తాతారావు, సెక్రటరీ, వింజరం పంచాయతీ చేపలు పట్టేందుకు అనుమతి అవసరం గోదావరి నదిలో చేపలు పట్టే వారికి మత్స్యశాఖ నుంచి అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా నదిలో చేపలు పట్టడం చట్టవిరుద్ధం. అనుమతులు ఉన్న వారు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్టు తెలిస్తే వారి లైసెన్స్లు రద్దు చేస్తాం. కె మంగారావు, ఎఫ్డీఓ, ఐటీడీఏ కేఆర్ పురం వింజరం రేవు నుంచి గంజాయి తరలింపు ఇటీవల కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు -
చెట్ల సొమ్ము స్వాహా!
ద్వారకాతిరుమల: రోడ్డు మరమ్మతుల పేరుతో కూటమి నేతలు మార్జిన్లోని చెట్లను నరికివేశారు. వచ్చిన కలపను రూ.70 వేలకు అమ్మేసి సొమ్ములు స్వాహా చేశారు. ఇది జరిగి ఆరు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకూ రోడ్డు మరమ్మతుల ఊసెత్తలేదు సరి.. చెట్ల సొమ్ములు ఒక్క రూపాయి కూడా పంచాయతీకి జమ చేయలేదు. మండలంలోని గుండుగొలనుకుంటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహా రం చర్చనీయాంసమైంది. వివరాల్లోకి వెళితే.. గుండుగొలనుకుంట నుంచి కామవరపుకోట మండలం వడ్లపల్లికి వెళ్లే గ్రావెల్ రోడ్డు ధ్వంసమైంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలతో వర్షం నీరు తడి ఆరక రోడ్డు దెబ్బతింటుందని కూటమి నేతలు కొందరు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లారు. చెట్లు నరికి, కలప విక్రయించగా వచ్చే సొమ్ముతో రోడ్డు మరమ్మతులు చేయించుకోమని ఆయన సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలో చెట్లు నరికి కలపను రూ.70 వేలకు విక్రయించారు. ఇందులో రూ.5 వేలను అటవీ శాఖ సి బ్బందికి వాటాగా ఇచ్చి మిగిలిన సొమ్మును నాయకులు స్వాహా చేశారు. ఇదిలా ఉండగా కలప సొమ్ము నగదు ఏమైందని ఎవరైనా ప్రశ్నిస్తే పంచాయతీకి జమ చేశామని ఆ నాయకులు చెబుతుండగా.. పంచాయతీ అధికారులను అడిగితే ఎలాంటి నగదు జమ చేయలేదని సమాధానమిస్తున్నారు. వారం రోజులుగా మల్లగుల్లాలు : వారం రోజులుగా కూటమి నేతలు నగదు విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో విషయం బయటపడింది. సొమ్ములు స్వాహా చేసింది ఎవరూ, ఇంత జరుగుతుంటే పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్ను వివరణ కోరగా చెట్లు నరికిన విషయం వాస్తవమని, ఆ సొమ్ములతో రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని నాయకులు తెలిపారన్నారు. అయితే సొమ్ములు ఏమయ్యాయన్న విషయంపై విచారణ చేస్తామని చెప్పారు. చెట్లను అమ్మి సొమ్ము చేసుకున్న కూటమి నేతలు రూ.70 వేలు కూటమి నేతల జేబుల్లోకి.. అటవీ శాఖ సిబ్బంది వాటా రూ.5 వేలు ! ఆరు నెలలైనా పంచాయతీకి జమ కాని నగదు -
ఖాకీల పచ్చపాతం
ఈవీఎం గోడౌన్ తనిఖీ ఏలూరు(మెట్రో): జిల్లాకు సంబంధించి ఈవీంలను భద్రపరచిన కలెక్టరేట్లోని గోడౌన్ను శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక ఎన్నికల పోరులో పోలీసులు పచ్చ పార్టీ నేతలకు పూర్తిగా దాసోహం అనే రీతిలో వ్యవహరించారు. అత్తిలిలో రెండు రోజులపాటు వందలాది మంది టీడీపీ కేడర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసాన్ని చుట్టుముట్టినా పోలీసులు స్పందించని పరిస్థితి. కై కలూరులో తీవ్ర ఘర్షణలు, ఒక రిపోర్టర్పై తీవ్రస్థాయిలో దాడి జరిగినా పట్టించుకోలేదు. యలమంచిలిలో మాత్రం మంత్రి మాటలకు తలొగ్గి ఓ మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని అరెస్ట్ చేయడానికి తీవ్ర అత్యుత్సాహం చూపించారు. డీజీపీ మొదలు రెండు జిల్లాల ఎస్పీల వరకూ ఎవరికి ఫిర్యాదు చేయడానికి ఫోన్ చేసినా స్పందించని దుస్థితి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖాకీలను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలు చేసిన అరాచకం. అత్తిలిలో చేష్టలుడిగి చూస్తూ.. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలం ఎంపీపీ ఎన్నిక షెడ్యూల్ మేరకు గురువారం జరగాల్సి ఉంది. 13 మంది ఎంపీటీసీ సభ్యులు మాజీ మంత్రి కారుమూరి నివాసానికి చేరుకుని ప్రభుత్వ కా ర్యాలయానికి వెళ్లడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో వందలాది మంది టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి ఇల్లు చుట్టుముట్టారు. దమ్ము ఉంటే మమ్మల్ని దాటి వెళ్లండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... వాహనాలను రోడ్లకు అడ్డంగా పెట్టి మో హరించారు. కొన్ని గంటల పాటు హైడ్రామా నడిపారు. తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్, అత్తిలి ఎస్సై ప్రేమ్కుమార్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ తో సహా డీజీపీ వరకూ అందరికీ మాజీ మంత్రి ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదు. వందలాది మంది చుట్టుముట్టి దాడికి సిద్ధంగా ఉండగా అత్తిలిలో ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఒక దశలో కూటమి శ్రేణులు కారు మూరి నివాసం గేట్లను నెట్టుకుని రావడానికి య త్నిస్తే కారుమూరి, వైఎస్సార్సీపీ కేడర్ అడ్డుకున్నారు. శుక్రవారం టీడీపీ మరో అడుగు ముందుకేసి ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే మహిళల ను వాహనాల్లో తరలించారు. ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడిన క్రమంలో ఆ రోజూ వందలాది మందిని టీడీపీ మోహరించి ఎంపీటీసీలను బయటకు రానివ్వకుండా చేసింది. అలాగే గ్రామంలోకి వచ్చే వాహనాలన్నింటినీ తనిఖీలు చేస్తూ పోలీసులు హడావుడి చేశారు. కనీసం దాడి జరిగే అవకాశం ఉన్న ప్రాంతంలో పరిస్థితిని చక్కదిద్దడం, ఎంపీటీసీలకు రక్షణ కల్పించి ఎన్నికకు తీసుకువెళ్లే ప్రయత్నంగాని చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి కారుమూరి విలేకరుల సమావేశం నిర్వ హించి ఎస్పీ మొదలు డీజీపీ, డీజీపీ పీఏ వరకూ అందరికీ ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదు. కై కలూరులో దాడులు జరిగినా.. కై కలూరులోనూ ఇదే తరహాలో పోలీసులు వ్యవహరించారు. కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కూటమి నేతలు సుమారు 30 మంది జర్నలిస్టులపై పోలీసుల సమక్షంలో దాడి చేసినా కనీసం స్పందించలేదు. భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు సూర్యనారాయణను గురు, శుక్రవారాలు రెండు రోజులు పాటు ఇంటి వద్దనే ఎన్నికకు రానివ్వకుండా చేసిన దానిపై మాజీ ఎమ్మెలే దూలం నాగేశ్వరరావు ఎస్సై మొదలు ఎస్పీ వరకూ ఫోన్ చేసినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. రెండు రోజులపాటు ఇదే తరహాలో అధికార పార్టీ హడావుడి చేసి బలం లేకపోయినా దొడ్డిదారిన వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకుంది. న్యూస్రీల్యలమంచిలిలో అత్యుత్సాహం యలమంచిలిలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ (గుంపర్రు)ని ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదు. దీంతో ఆమె కుమార్తె, బాలిక షర్మిలతో సత్యశ్రీ కిడ్నాప్నకు గురైందని ఫిర్యాదు తీసుకుని ఎన్నిక కోసం కార్యాలయానికి వచ్చిన ఆమెను పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లడానికి పాలకొల్లు రూరల్, టౌన్ సీఐలు గుత్తల శ్రీనివాస్, కోలా రవికుమార్, యలమంచిలి ఎస్సై బుర్రయ్యలు హడావుడి చేశారు. స్టేషన్కు రావాలని గట్టిగా పట్టుబడితే ఎన్నిక అయ్యాక వస్తానని ఆమె చెప్పినా సీఐ వినకుండా మహిళా కానిస్టేబుల్ సాయంతో జీపు ఎక్కించాలని ఆదేశించారు. చివరకు సత్యశ్రీ, ఎ మ్మెల్సీ కవురు శ్రీనివాస్ గట్టిగా పోలీసులతో వా దనలకు దిగడంతో వారు వెళ్లిపోయిన పరిస్థితి. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగడుగునా పోలీసులు కూటమి సేవలో తరలించారు. కూటమి సేవలో పోలీస్ ఉమ్మడి పశ్చిమలో టీడీపీ బరితెగింపు రాజకీయాలు అత్తిలిలో తీవ్ర ఘర్షణలు జరిగినా పట్టించుకోని పోలీసులు కై కలూరులో దాడులు జరిగినా స్పందన నిల్ రివర్స్ కేసుల పేరుతో యలమంచిలిలో హడావుడి స్థానిక పోరులో పోలీసుల అత్యుత్సాహం డీజీపీ నుంచి ఎస్పీ వరకూ స్పందించని వైనం -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేల్పూరులో మద్యం దుకాణం వెనుక మృతదేహం గుర్తింపు తణుకు అర్బన్: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మద్యం దుకాణం వద్ద శనివారం సాయంత్రం వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శ్మశాన వాటిక రోడ్డులోని సూర్య వైన్స్ వెనుక శనివారం సాయంత్రం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించారు. అతన్ని వేల్పూరు సంతమార్కెట్ ప్రాంతానికి చెందిన కుడుపూడి శ్రీనివాసరావు (55)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన మృతుడి తల్లి, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆటోలో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం తణుకు రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లి సమాచారం అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసరావు గాయాలతో పడి ఉన్న తీరు పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ముఖం, శరీరంపైనా గాయాలు ఉండడంతో ఎవరైనా కొట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు? ఏలూరు టౌన్: ఏలూరు వన్టౌన్ సత్యనారాయణ పేట ప్రాంతంలో గురువారం అర్థరాత్రి వృద్ధురాలు చానాపతి రమణమ్మ (65) హత్య ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ హత్యను సత్యనారాయణ పేటకు చెందిన ఒక యువకుడు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పర్యవేక్షణలో డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు కేవలం చిట్టీ పాటల డబ్బులే కారణమా ? ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత మృతికి కారణమైన యువకుడి అరెస్ట్ జంగారెడ్డిగూడెం: వివాహిత మృతికి కారణమైన యువకుడిని జంగారెడ్డిగూడెం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన హేమదుర్గ అనంత ప్రసన్న అనే వివాహితను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఆమె మృతికి కారణమైన కొయ్యలగూడెం మండలం గంగన్నగూడానికి చెందిన మోదుగ పెద్దసాయిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆటోడ్రైవర్పై పోక్సో కేసు నమోదు ఏలూరు టౌన్: తల్లిదండ్రులు మందలించారనే కోపంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వచ్చి ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో కూర్చున్న బాలికను ఆటోడ్రైవర్ ఇంటి వద్ద దించుతానని నమ్మించి ఆటో ఎక్కించుకున్నాడు. పోణంగి రోడ్డులోని తన ఇంటికి తీసుకువెళ్ళి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయంతో బాలిక అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేసింది. ఆ ప్రాంతంలోని హిజ్రాలు విషయాన్ని గమనించి బాలికను రక్షించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. శనివారం బాలిక తల్లిదండ్రులు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆటోడ్రైవర్ ఆర్.ప్రభాకరరాజుపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 300 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చాట్రాయి : నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అజయ్కుమార్ సింగ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని చీపురుగూడెంలో జరిపిన దాడుల్లో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన భూక్యా మహేంద్రపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
కాలువలో మునిగి ఇద్దరు మృతి
జంగారెడ్డిగూడెం: మండలంలోని కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై శశాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్.వంశీకృష్ణ (23), కె.బాలసుబ్రహ్మణ్యం(30) వరుసకు బావ బావమరిదిలు. వీరు శనివారం మధ్యాహ్నం ఎర్రకాలువ జలాశయానికి వెళ్లారు. అక్కడ కొద్ది సేపు సేదతీరిన తరువాత స్నానం చేయడానికి జలాశయం కుడి కాలువ వద్దకు వెళ్లారు. స్నానానికి దిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే మునిగిపోవడంతో మృతిచెందారు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలిసిన మృతుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. -
కొల్లేరు సమస్యలపై గళం
ఏలూరు (టూటౌన్): కొల్లేరును 5 నుంచి 3వ కాంటూరుకు కుదించాలంటూ కొల్లేరు ప్రజలు గళమెత్తారు. తమకు ఉపాధి కల్పించాలని, సొసై టీలు, జిరాయితీ భూములను పునరుద్ధరించాలని, మిగులు భూములు కొల్లేరు పేదలకు పంచాలని, కొల్లేరు గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలంటూ శనివారం ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ కొల్లేరు ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, జీఓ 120ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పర్యావరణం పేరుతో కొల్లేరు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.లింగరాజు, కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరుపై అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డీఎన్వీడీ ప్రసాద్, జిల్లా నాయకులు కె.లెనిన్, పలు కొల్లేరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
రైతులకు అందుబాటులో పీఎండీఎస్ కిట్లు
ద్వారకాతిరుమల: రైతులకు పీఎండీఎస్ కిట్లను అందుబాటులోకి తెచ్చామని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట ఎన్పీఎం షాపులో సిద్ధం చేసిన 2 వేల కిట్లను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం హబీబ్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కిట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాల్లో 16 రకాల విత్తనాలను కలిపి ఈ కిట్ను తయారు చేశామని, వీటిని రుతుపవనాలు వచ్చే ముందు వేయాలన్నారు. మెంతులు, ఆవాలు, తోటకూర తదితర విత్తనాలు కలగలిపి 12 కేజీల బరువుతో ఈ కిట్ ఉంటుందన్నారు. ఈ విత్తనాల ద్వారా సాగు చేయడం వల్ల పశువులకు మేత పుష్కలంగా లభిస్తుందన్నారు. అలాగే ఆకు కూరలు, ఆవాలు, మెంతులను రైతులు విక్రయించుకోవచ్చన్నారు. మొత్తం 10 వేల మంది రైతులకు అందించే లక్ష్యంలో భాగంగా, తొలి విడతగా 2 వేల కిట్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఏడీఏ ఉషారాజ్ కుమారి, ఏడీపీఎం బాలిన వెంకటేష్, ద్వారకాతిరుమల, భీమడోలు ఏవోలు ఎ.దుర్గారమేష్, ఉషారాణి తదితరులున్నారు. బిల్డింగ్ నుంచి పడి వ్యక్తి మృతి కై కలూరు: పడక కుర్చీపై చల్లిగాలికి డాబాపై పడుకున్న వ్యక్తి కింద పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం కై కలూరు మండలం గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన కమతం యేబేలు(58) ఈ నెల 22న డాబాపై రాత్రి పడక కుర్చీలో పడుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి కింద పడి ఉన్నాడు. వెంటనే కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి, విజయవాడ ఆస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారని పోలీసులు చెప్పారు. కుమార్తె దాసరి రాణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉపాధి కల్పన కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): ఉపాధి కల్పన పథకంలో లబ్ధి కోసం మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎన్.ఎస్.కృపావరం శుక్రవారం తెలిపారు. ఈ పథకంలో తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవ రంగానికి రూ. 20 లక్షలు సబ్సిడీ రుణం ఇస్తారన్నారు. ఈ పథకంలో నూతన ప్రొజెక్టులకు మాత్రమే రుణం ఇస్తారన్నారు. అభ్యర్థలు సంబంధిత వెబ్సైటులో సమాచారాన్ని పూరించి అవసరమైన ధ్రువపత్రాలు జతపర్చాలన్నారు. పోక్సో కేసు నమోదు భీమవరం: భీమవరం రెండో పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలిక పట్ల కె.గణేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక తల్లితో కొన్నేళ్లుగా గణేష్ సహజీవనం చేస్తున్నాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. చదువు మానేసి ఇంట్లో ఉంటున్న బాలికపై ఎవరూ లేని సమయంలో శరీరంపై చేతులు వేసేవాడు. ఎవరితోనైనా చెబితే బాగుండదని హెచ్చరించేవాడు. తన తల్లిని శుక్రవారం కొడుతుండగా ఎందుకు కొడుతున్నావని అడిగితే మీద చేతులు వేసి దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. -
శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. గత 11 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ.86,52,879 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 103 గ్రాముల బంగారం, 2.075 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకిరాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.28,500 లభించినట్టు చెప్పారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్ర దేవతగా విరాజిల్లుతోన్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 7 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. అందులో భాగంగా తొలిరోజు ఉగాది నాడు అమ్మవారు లక్ష గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. అమ్మవారికి కుంకుమ పూజలు, చంఢీ హోమం వంటి కార్యక్రమాలు జరుగుతాయని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. కొనసాగుతున్న డయాఫ్రం వాల్ పనులు : నిమ్మల పాలకొల్లు సెంట్రల్: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పనులు రూ.990 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. శుక్రవారం పాలకొల్లులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు 2014–19లో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేసినట్టు చెప్పారు. నిర్వాసితులకు రూ.829 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. వరకట్న వేధింపుల కేసు నమోదు జంగారెడ్డిగూడెం: వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. పట్టణంలోని రాజులకాలనీకి చెందిన గెడ్డం వీరేంద్రకుమార్ రాజాకు, రమ్య మధురికకు 2016లో ప్రేమ వివాహం జరిగింది. ఈ నెల 23 నుంచి వీరేంద్రకుమార్ రాజా అధిక కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడన్నారు. దీనికి అతని కుటుంబసభ్యులు సహకరిస్తున్నారని, ఈ నెల 27 రాత్రి వీరేంద్రకుమార్ రాజా కట్నం తేవాలని భార్య రమ్య మధురికను కొట్టి ఇంటి నుంచి గెంటివేశాడన్నారు. దీంతో శుక్రవారం రమ్య మధురిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కళారత్న అవార్డుకు ఎంపిక
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన ప్రఖ్యాత కూచిపూడి, భరతనాట్యం నాట్య గురువు ఏ.పార్వతీ రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం హంస అవార్డు కళా రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. గత 45 ఏళ్లుగా ఏలూరులో కళా దీపిక నృత్య అకాడమీ ద్వారా వేలాదిమంది విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దిన ఉత్తమ నాట్య గురువు. నాట్య కళాకారిణే కాకుండా మంచి సంగీత కళాకారిణి. ఎన్నో సంస్థలు ఆమెను వివిధ బిరుదులతో, సన్మానాలతో గౌరవించాయి. ఆమె కళారత్న పురస్కారానికి ఎంపికై న సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు కళారత్న కేవీ సత్యనారాయణ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీ రామచంద్రన్ నృత్య రంగానికి చేస్తున్న విశేష సేవలను గుర్తించి తమ కేవీఎస్ ట్రస్ట్ ద్వారా కేవీ సత్యనారాయణ ప్రతిభా పురస్కారంతో 2022లో పార్వతి రామచంద్రన్ను సత్కరించామన్నారు. నాట్యానికి జీవితం అంకితం చేసిన గొప్ప కళాకారిణి పార్వతి రామచంద్రన్కు రాష్ట్ర ప్రభుత్వం కళా రత్న హంస అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నందుకు కళాకారులు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. -
లేగ దూడల ప్రదర్శన
ద్వారకాతిరుమల: మండలంలోని తక్కెళ్లపాడులో పశు సంవర్ధక శాఖ, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. అందులో 25 గేదె దూడలు, 15 ఆవు దూడలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పశు పోషణ, జాతి లక్షణాల ఆధారంగా రైతులకు బహుమతులను భీమడోలు ఏడీ డాక్టర్ సాయి రమేష్ అందజేశారు. అనంతరం వైద్యులు 4–6 నెలల వయస్సున్న 30 పెయ్యి దూడలకు బ్రూసెల్ల టీకాలు వేశారు. లేగ దూడలు పశు పోషణలో తీసుకోవాల్సిన మెలకువలు, జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆ తరువాత ఈ ప్రదర్శనలో పాల్గొన్న రైతులందరికీ కాల్షియం, లివర్ టానిక్, గోమర్లు మందు, స్టీల్ క్యాన్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల, భీమడోలు మండలాల పశు వైద్యాధికారులు అంగర సురేష్, హరికృష్ణ, పాడి రైతులు బొల్లారెడ్డి సూర్యనారాయణ రెడ్డి, మానికల రామకృష్ణ, ముల్లంగి కృష్ణారెడ్డి, షేక్ మస్తాన్ సాహెబ్, పశు గణాభివృద్ధి సిబ్బంది, పశు సంవర్థక శాఖ సిబ్బంది, ఏహెచ్ఏలు, గోపాల మిత్రలు పాల్గొన్నారు. -
ఘనంగా ఉగాది ఉత్సవాలు
బుట్టాయగూడెం: మండలంలోని మంచులవారిగూడెంలో స్వయంభుగా వెలసి భక్తుల పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మతల్లి, కనకదుర్గమ్మ, నాగమ్మతల్లి, నాగేంద్రుల ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కోయ గిరిజన సంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో బోనం ఎత్తుకుని గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కోలాటాల ఊరేగింపు కూడా నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా అమ్మవారికి పుట్టింటి సారె కావిడ్లతో, నాటు కోళ్లు, మేకపోతులతో మొక్కులు చెల్లిస్తామని ఆలయ పీఠాధిపతి కేరం మధు తెలిపారు. -
ప్రమాదంలో వ్యక్తి మృతి
దెందులూరు: బైక్పై వెళ్తూ కిందపడి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని దెందులూరు ఎస్సైఆర్ శివాజీ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం దెందులూరు గ్రామానికి చెందిన కొల్లా బత్తుల యేసు, గుంపుల వంశీ ద్విచక్ర వాహనంపై శ్రీరామవరం వెళుతున్నారు. గుంపుల వంశీ ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడుపుతూ కింద పడటంతో కొంత దూరం వెళ్లి ఎదురుగా దెందులూరు వైపు వస్తున్న ఆటోను ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న యేసు మృతి చెందగా గుంపుల వంశీ గాయపడ్డాడు. అతన్ని ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెయ్యి లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం నూజివీడు: మండలంలోని ఓగిరాల తండాలో ఎకై ్సజ్ సిబ్బంది శుక్రవారం నిర్వహించిన దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడంతో పాటు 35 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఏఈఎస్ జీ.పాండురంగారావు తెలిపారు. సంఘటన ప్రాంతం నుంచి పారిపోయిన కృష్ణపై కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఈఎస్టీఎఫ్ ఎస్ఐ కేఎండీ ఆరిఫ్, సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో ఎవరైనా ఎకై ్సజ్ నేరాలకు పాల్పడుతుంటే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
జంగారెడ్డిగూడెం: మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహంతో ధర్నా కొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు. పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు -
రైతులకు అందుబాటులో పీఎండీఎస్ కిట్లు
ద్వారకాతిరుమల: రైతులకు పీఎండీఎస్ కిట్లను అందుబాటులోకి తెచ్చామని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తెలిపారు. మండలంలోని గుండుగొలనుకుంట ఎన్పీఎం షాపులో సిద్ధం చేసిన 2 వేల కిట్లను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం హబీబ్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కిట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాల్లో 16 రకాల విత్తనాలను కలిపి ఈ కిట్ను తయారు చేశామని, వీటిని రుతుపవనాలు వచ్చే ముందు వేయాలన్నారు. మెంతులు, ఆవాలు, తోటకూర తదితర విత్తనాలు కలగలిపి 12 కేజీల బరువుతో ఈ కిట్ ఉంటుందన్నారు. ఈ విత్తనాల ద్వారా సాగు చేయడం వల్ల పశువులకు మేత పుష్కలంగా లభిస్తుందన్నారు. అలాగే ఆకు కూరలు, ఆవాలు, మెంతులను రైతులు విక్రయించుకోవచ్చన్నారు. మొత్తం 10 వేల మంది రైతులకు అందించే లక్ష్యంలో భాగంగా, తొలి విడతగా 2 వేల కిట్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు ఏడీఏ ఉషారాజ్ కుమారి, ఏడీపీఎం బాలిన వెంకటేష్, ద్వారకాతిరుమల, భీమడోలు ఏవోలు ఎ.దుర్గారమేష్, ఉషారాణి తదితరులున్నారు. బిల్డింగ్ నుంచి పడి వ్యక్తి మృతి కై కలూరు: పడక కుర్చీపై చల్లిగాలికి డాబాపై పడుకున్న వ్యక్తి కింద పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం కై కలూరు మండలం గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన కమతం యేబేలు(58) ఈ నెల 22న డాబాపై రాత్రి పడక కుర్చీలో పడుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి కింద పడి ఉన్నాడు. వెంటనే కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి, విజయవాడ ఆస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారని పోలీసులు చెప్పారు. కుమార్తె దాసరి రాణి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉపాధి కల్పన కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): ఉపాధి కల్పన పథకంలో లబ్ధి కోసం మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎన్.ఎస్.కృపావరం శుక్రవారం తెలిపారు. ఈ పథకంలో తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవ రంగానికి రూ. 20 లక్షలు సబ్సిడీ రుణం ఇస్తారన్నారు. ఈ పథకంలో నూతన ప్రొజెక్టులకు మాత్రమే రుణం ఇస్తారన్నారు. అభ్యర్థలు సంబంధిత వెబ్సైటులో సమాచారాన్ని పూరించి అవసరమైన ధ్రువపత్రాలు జతపర్చాలన్నారు. పోక్సో కేసు నమోదు భీమవరం: భీమవరం రెండో పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలిక పట్ల కె.గణేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక తల్లితో కొన్నేళ్లుగా గణేష్ సహజీవనం చేస్తున్నాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. చదువు మానేసి ఇంట్లో ఉంటున్న బాలికపై ఎవరూ లేని సమయంలో శరీరంపై చేతులు వేసేవాడు. ఎవరితోనైనా చెబితే బాగుండదని హెచ్చరించేవాడు. తన తల్లిని శుక్రవారం కొడుతుండగా ఎందుకు కొడుతున్నావని అడిగితే మీద చేతులు వేసి దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. -
ఫీజులు కట్టలేదని విద్యార్థుల నిర్బంధం
నరసాపురం రూరల్: ఫీజులు కట్టలేదనే కారణంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను గదిలో నిర్బంధించిన ఘటన వెలుగుచూసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నరసాపురం–పాలకొల్లు జాతీయ రహదారిని ఆనుకుని సరిపల్లి పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లితండ్రులు ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపుతో సంసిద్ స్కూల్ నిర్వహించడం దారుణమన్నారు. ఫీజుల కోసం విద్యార్థులను గదిలో బంధించడం బాలల హక్కులను కాలరాయడమే అ న్నారు. విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో పాఠశాల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. స్కూల్కు వచ్చిన ఎంఈఓ పిల్లి పుష్పరాజ్యంకు ఫిర్యాదు చేశారు. -
సంఖ్యా బలం లేకే కూటమి కుట్రలు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీల సంఖ్యా బలం దమ్ములేక కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. కై కలూరు తాలూకా సెంటర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు రౌడీయిజం ప్రదర్శిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో కై కలూరు మండలంలో 22 మంది ఎంపీటీసీ సభ్యుల్లో కేవలం ఒక్కటి మాత్రమే టీడీపీ గెలిచిందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వైస్ ఎంపీపీ–2 మరణిస్తే ప్రస్తుత ఎన్నికలు అనివార్యమయ్యాయన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీలను ప్రలోభాలతో కూటమిలో చేర్చుకున్నారన్నారు. భుజబలపట్నం సెగ్మెంట్కు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పెన్మత్స సూర్యనారాయణరాజును ఓటు వేయడానికి రాకుండా కూటమి నేతలు ఇంటికి తాళాలు వేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించకుండా అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. భుజబలపట్నం ఎంపీటీసీని పోలీసులు నిర్బంధం నుంచి విడిపించి ఓటు హక్కును కల్పించాలని ఆయన కోరారు. -
తణుకు చరిత్రలో చీకటి రోజు
మాజీ మంత్రి కారుమూరి అత్తిలి: కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ఇది ఒక బ్లాక్ డే అని, తణుకు నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి దారుణ ఘటన ఎన్నడూ జరగలేదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీపీ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకుండా కూటమి మూకలను ఉసిగొల్పడంపై గు రువారం ఆయన అత్తిలిలో మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచి ఎస్పీ, డీఎస్పీ, సీఐ అందరికీ ఫోన్ చేసినా కానీ.. ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. తమ ఎంపీటీసీ సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, తాము ఎవరినీ తీసుకుపోలేదని, తమ మ్యాండెట్పై గెలిచినవారని తెలిపారు. తమవారినే ఇద్దరిని వారు తీసేసుకున్నారని అన్నారు. ఎన్నికలకు వెళ్లాల్సిన తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులను కూటమి నేతలు దౌర్జన్యంగా రౌడీలను పెట్టి అడ్డుకున్నారని, తన ఇంటిపైకి వచ్చి రౌడీయిజం చేశారని చెప్పారు. చివరికి మహిళలని కూడా చూడకుండా తోసేసి దుర్మార్గంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ తరఫున ఎంపీపీగా చేసిన మక్కా సూర్యారావును మభ్యపెట్టి తీసుకున్నారని, అయినా తాము మాట్లాడలేదని, నేడు దుర్మార్గంగా ఎన్నికకు వెళ్లకుండా సభ్యులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ‘మీకు 6 ఉంటే, మాకు 13 ఉన్నాయి.. అయినా సరే దా రుణాతి దారుణంగా రౌడీయిజంతో దుర్మార్గం చేశా రు.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం.. అసలు పోలీస్ వ్యవస్థ టోటల్గా విరుద్ధంగా అయిపోయింది.. టోటల్ ఫ్లాప్.. ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరించారు.. ఇంత దౌర్జన్యం చేస్తున్నా, ఆడవాళ్లను తోసేస్తున్నా ఎస్పీ, డీఎస్పీ, సీఐ ఒక్కరు కూడా ఇక్కడి రాలేదు.. నేను మాజీ మంత్రిని, నేను ఫోన్ చేసినా, చాలా మంది కౌన్సిల్ చైర్మన్లు ఫోన్లు చేసినా స్పందించలేదు, ఫోన్లు కూడా ఆపేశారు.. ఇది చాలా దుర్మార్గమైన, హేయమైన చర్య..’ అంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకష్ణ చేసే దుర్మార్గాలకు చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు వస్తాయని కారుమూరి స్పష్టం చేశారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
అత్తిలి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయని అత్తిలి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు విమర్శించారు. తమకున్న ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. గురువారం అత్తిలి ఎంపీపీ అభ్యర్థిని, అత్తిలి–1 ఎంపీటీసీ సభ్యురాలు రంభ సుజాత మాజీ మంత్రి కారుమూరి నివాసంలో తన సహచర ఎంపీటీసీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి మెజార్టీ సభ్యులు ఉన్నా కూటమి నా యకులు అక్రమంగా ఎన్నికను అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులు వచ్చి తమకు రక్షణ కల్పించకుండా ఏమీ తెలియనట్టు వ్యవహరించారని వాపోయారు. కుటిల సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరతీసిందన్నారు. మాజీ వైస్ ఎంపీపీ దారం శిరీష మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా పార్టీపై ఉన్న అభిమానంతో తమ పార్టీ అభ్యర్థికి ఓటువేయడానికి వెళుతుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. లక్ష్మీనారాయణపురం ఎంపీటీసీ సభ్యుడు ఆడారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేంచేలా కూటమి శ్రేణులు దాడులు చేయడం హేయం అన్నారు. ఎంపీటీసీ సభ్యులు అద్దంకి శ్రీను, సుంకర నాగేశ్వరరావు, కూరాకుల లక్ష్మి, దొమ్మేటి రమ్య, నల్లమిల్లి నాగమణి, శరకడం రామలింగ విష్ణుమూర్తి, గుడిమెట్ల ధనలక్ష్మి, పురుషోత్తపు నాగేంద్ర శ్రీనివాస్, ముదునూరి దుర్గా భవాని తదితరులు మాట్లాడారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా గంటా శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా నూకపెయ్యి సుధీర్బాబు (ఏలూరు), రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శిగా గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శిగా కంబాల రాంబాబు, రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా యర్రా గంగాధరరావును నియమించారు.బూత్ కమిటీల జోనల్ అధ్యక్షుడిగా బీవీఆర్జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడేనికి చెందిన బీవీఆర్ చౌదరిని వైఎస్సార్సీపీ బూత్ కమిటీల విభాగం జో నల్ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఆయన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకముంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.ట్రావెల్స్ బస్సుల తనిఖీఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని కలపర్రు టోల్ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్, కాంట్రాక్ట్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనల అతిక్రమించిన 46 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1.13 లక్షల అపరాధ రుసుం విధించినట్టు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు పేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించి, అవగాహన కల్పించారు. విరామ సమయంలో డ్రైవర్లు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని హితవు పలికారు. వాహన తనిఖీ అధికారులు బి.భీమారావు, ఎన్డీ విఠల్, ఎస్బీ శేఖర్, జి.ప్రసాదరావు పాల్గొన్నారు.పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలిఏలూరు (టూటౌన్): పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పి.జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని గెట్సేమనే సెంట్రల్ చర్చిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ప్రవీణ్ ప్రగడాల మృతి బాధాకరమని అన్నారు. నెల రోజుల క్రితం ఆయన సోషల్ మీడియా వేదికగా తనకు ప్రాణహాని ఉందని చెప్పడం, చెప్పిన నెల రోజులకే మృతి చెందడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హెల్మెట్ పెట్టుకుని ఉన్నా ఆయన మొహంపై బలమైన గాయం ఎలా తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ప్రొటెక్షన్ బిల్లును తీసుకురావాలని కోరుతున్నామన్నారు. ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిక్కాల జోసెఫ్, సభ్యులు పీటర్, పాస్టర్ కిరణ్ పాల్, ఏలూరు సిటీ పాస్టర్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.సెస్ బకాయిలు చెల్లించాలిభీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా గ్రంధాలయ సంస్థకు సెస్ బకాయిలను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో సెస్ బకాయి లపై ఆయన సమీక్షించారు. గ్రంథాలయ సంస్థకు సెస్ రూపేణా రూ.4,53,48,404 బకాయిలు ఉన్నాయని, దీనిలో పంచాయతీల బకాయిలు రూ.2,96,90768 ఉన్నాయన్నారు. -
కూటమి దౌర్జన్యకాండ
ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను అధికార టీడీపీ తుంగలోకి తొక్కింది. వైఎస్సార్సీపీకి ఏకపక్షం కావాల్సిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల్లో పాగా వేయాలని చూసింది. పచ్చమూకల్ని ఉసిగొల్పి ఎన్నికలను అడ్డుకుంది. అత్తిలిలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను నిర్బంధించగా యలమంచిలిలో కోరం సరిపోయినా పొంతన లేని కారణాలతో ఎన్నికలు వాయిదా వేశారు. కై కలూరులో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శురకవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025యలమంచిలిలో హైడ్రామా యలమంచిలి మండలంలో హైడ్రామా నడుమ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు 13 మంది వైస్సార్సీపీ, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. గురువారం నాటి ఎంపీపీ ఎన్నికకు పూర్తిస్థాయిలో సభ్యులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమేనని అంతా భావించారు. కాగా తమకు ఓటెయ్యాలని వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నట్టు కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేయడం గమనార్హం. వాస్తవానికి వైఎస్సార్సీపీ పూర్తి సంఖ్యా బలం ఉండటంతో ఎన్నిక జరిగితే తమకు పదవి రాకుండా పోతుందన్న ఉద్దేశంతో టీడీపీ అధికార బలంతో ఎన్నికను వాయిదా వేయించిందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ విమర్శించారు. కై కలూరులో అరాచకం కై కలూరులో వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. 20 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ, కూటమికి సమాన బలం ఉంది. వైఎస్సార్సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును ఎన్నికకు హాజరుకాకుండా కూటమి నేతలు అడ్డుకున్నారు. కూటమి నేతల ఆగడాలను కవరేజీ చేస్తున్న భవ్య న్యూస్ ఎడిటర్ కురేళ్ల కిషోర్ను కూటమి నేతలు చితకబాదడంతో గాయలపాలై కై కలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) మీడియా ముఖంగా నిరశన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీలు ఎవరూ హాజరుకాలేదు. కూటమి పార్టీకి చెందిన 9 మంది మాత్రమే హాజరుకావడవంతో కోరం లేక ఎన్నికను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏలూరు ఆర్డీఓ అచ్చుత అంబరీష్ వాయిదా వేశారు. సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్/ అత్తిలి/ కై కలూరు: తణుకు నియోజకవర్గ చరిత్రలో మనుపెన్నడూ లేనివిధంగా అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో కూటమి మూకలు రెచ్చిపోయారు. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో 16 చోట్ల వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన చెరో రెండు చోట్ల గెలుపొందాయి. ఇటీవల మాజీ ఎంపీపీ, మరో సభ్యుడు కూటమి పంచన చేరగా, ఒక సభ్యురాలు గల్ఫ్ వెళ్లడంతో వైఎస్సార్సీపీ సంఖ్యాబలం 13, కూటమి సభ్యులు ఆరుగురు అయ్యారు. ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను తమ వైపు లాక్కుని ఎంపీపీ పదవి కాజేయాలని ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేసినా వైఎస్సార్సీపీ సభ్యులు లొంగలేదు. చివరకు కాబోయే ఎంపీపీ రంభ సుజాతకు చెందిన పెట్రోల్ బంకులపై విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించినా ఫలితం లేకపోవడంతో ఎన్నిక జరుగకుండా అడ్డుకునే ఎత్తుగడ వేశారు. కవ్వించి.. చుట్టుముట్టి.. అత్తిలిలోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి గురువారం ఉదయం 13 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు అప్పటికే అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు కారుమూరి నివాసాన్ని చుట్టుముట్టారు. రోడ్డుపై మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి గొడవకు దిగారు. ఒక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చేందుకు ప్రయత్నించడంతో ఎంపీటీసీ సభ్యులు భయాందోళనలతో తలుపులు వేసుకుని లోపలే ఉండిపోయారు. పచ్చమూకలు కవ్వింపు చర్యలకు పాల్పడినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తూ వచ్చారు. ఉదయం 8 గంటలకు మొదలైన ముట్టడి ఎన్నిక సమయం ముగిసే వరకు కొనసాగింది. 12 గంటల తర్వాత ఎన్నిక శుక్రవారం నాటికి వాయిదా పడినట్టు సమాచారం వచ్చాక పచ్చమూకలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మండుటెండలోనే కారుమూరి ఎవరొస్తారో రండంటూ మాజీ మంత్రి కారుమూరి పచ్చమూకలకు ఎదురుతిరిగారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎక్కడికి కదలకుండా వారు ఉన్నంతసేపు దాదాపు నాలుగు గంటల పాటు ఇంటి ఎదురుగానే కూర్చుండిపోయారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ఆయన వెంట ఉన్నారు. పోలీసుల ‘పచ్చ’పాతం అత్తిలిలో దాదాపు వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసిన అధికారులు దాదాపు అందరినీ మండల పరిషత్ కార్యాలయం వద్దనే మోహరించారు. తమ ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలని పలుమార్లు వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులను కోరినా వారు స్పందించలేదు. కూట మి శ్రేణుల కారుమూరి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల సృష్టిస్తున్నా చేష్టలుడిగి చూశారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. మీడియా ప్రతినిధులు సైతం పలుమార్లు సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా వస్తున్నామంటూ ఎన్నికల సమయం ముగిసే వరకూ కాలం గడిపేశారు. మాజీ మంత్రి కారుమూరి సమస్యను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. లా అండ్ ఆర్డర్ విధులను పక్కనపెట్టి కూటమి నాయకులు చెప్పినట్టుగా పోలీసుల వ్యవహరించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుల తరఫున మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు విప్ ఎకనాల్జెడ్మెంట్ను అందజేసేందుకు వెళ్లిన పార్టీ రాష్ట్ర నేత వడ్లూరు సీతారామ్ను పోలీసులు అడ్డుకుని బయటకు నెట్టేశారు. ఎన్నికల ప్రక్రియను కవరేజీ కోసం వచ్చిన సాక్షి టీవీ చానల్ కెమెరాను కూటమి నాయకులు లాక్కుని వైర్లు తెంపివేశారు. వీడియో చిత్రీకరిస్తున్న వారిపై వాటర్ ప్యాకెట్లను విసిరారు. న్యూస్రీల్ప్రజాస్వామ్యం ఖూనీ ఎంపీపీ పదవుల కోసం టీడీపీ చిల్లర రాజకీయాలు అత్తిలిలో మాజీ మంత్రి కారుమూరి ఇంటిని చుట్టుముట్టిన పచ్చమూకలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరు కాకుండా అడ్డగింత ఫిర్యాదుచేసినా పట్టించుకోని పోలీసులు యలమంచిలిలో కోరం సరిపోయినా ఎన్నిక వాయిదా కై కలూరు వైస్ ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత -
కారు ఢీకొని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: టీ కోసం రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన కథనం ప్రకారం. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరగవాడ గ్రామానికి చెందిన బట్టు సేట్రామ్(55) లక్ష్మీనగర్లోని సింధూర పేపర్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. గురువారం రాత్రి టీ తాగేందుకు తన బంధువు బట్టు కృష్ణతో కలసి ఘటనా స్థలం వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో కొవ్వూరు నుంచి ఏలూరు వైపునకు వెళుతున్న కారు సేట్రామ్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సేట్రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై సుధీర్ పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘ఉపాధి హామీ’లో రజక వృత్తి చెరువులను బాగుచేయాలి ఏలూరు (టూటౌన్): రజక వృత్తి చెరువులను ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తి స్థాయిలో బాగుచేయించేందుకు అధికారులు చొరవ చూపాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక జనసంఘ కార్యలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో రజకులు వృత్తి చెరువులు పూడికలతో నిండి విస్తీర్ణం కోల్పోయిన పరిస్థితి నెలకొందని చెప్పారు. పలుచోట్ల పూడికల కారణంగా రజక వృత్తికి తీవ్ర అవరోధంగా మారి రజకులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రజక వృత్తి చెరువులను బాగుచేయించాలని కోరారు. ముఖ్యంగా గోపాలపురం, పోలవరం, నల్లజర్ల, చాగల్లు, ఉండి, తాడేపల్లిగూడెం, నియోజకవర్గాలు మండలాల్లోని చెరువులను బాగుచేయించాలని కట్లయ్య కోరారు. ఈ సమావేశంలో జిల్లా రజక నేతలు వట్లూరు మురళి, వి.శ్రీనివాసులు, శేషు, ఆర్.నాగేశ్వరరావు, మొలగాల దుర్గారావు, దేవరపల్లి రజక నాయకులు కదిలి సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయుడిపై దాడి ఘటనలో దోషులను శిక్షించాలి కై కలూరు: విధి నిర్వహణలో ఫొటోలు తీస్తున్న భవ్య న్యూస్ ఎడిటర్ కురేళ్ళ కిషోర్పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు అద్దంకి వెంకట శ్రీనివాస్, మణిక్యరావు గురువారం డిమాండ్ చేశారు. కై కలూరు మండలం భుజబలపట్నంలో ఫొటోలు తీస్తున్న తనపై జనసేన నాయకుడు కొల్లి బాబీ, కూటమి నేత పూలా రాజీ, మరికొందరు దాడి చేశారని యూనియన్ నాయకుల ముందు కిషోర్ గోడు వెళ్లబోసుకున్నాడు. సెల్ ఫోన్ లాక్కున్నారని చెప్పారు. కై కలూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పరామర్శించారు. స్థానిక సీఐ, ఎస్పీలకు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. -
సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలు
నరసాపురం రూరల్: అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ సురేష్కుమార్ అన్నారు. గురువారం నరసాపురం మండలం చినమైనవానిలంక గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పొదిగించబడిన ఆలివ్ రిడ్లే జాతికి చెందిన తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి పాఠశాల విద్యార్థులతో కలిసి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను సెక్షన్ ఆఫీసర్, ప్రధానోపాధ్యాయుడు ఎన్వీ సత్యనారాయణ నివృత్తి చేశారు. ఆలివ్ రిడ్లే జాతికి చెందిన ఈ తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లుపెట్టడం, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నట్లు తెలిపారు. తాబేళ్ల జాతి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిల్లలు బయటకు రావడంతో గుర్తించి అటవీశాఖ ఆధ్వర్యంలో వాటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ కె రాంప్రసాద్, ఉపాధ్యాయుడు జి రవీంద్రరాజు, గ్రామస్తులు ఎంపీ కుమారస్వామి, విద్యార్థులు, తాబేళ్ల సంరక్షణా పునరుత్పత్తి కేంద్రంలో పనిచేసే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీల్లో సమస్యలు తొలగేనా?
నూజివీడు : రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్కొక్క ట్రిపుల్ ఐటీలో 6,600 మంది చొప్పున నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 26,400 మంది విద్యార్థులున్నారు. దేశంలోని 15 ఐఐటీల్లో కలిపి కూడా ఇంత మంది విద్యార్థులు ఉండరు. అంతటి ప్రాధాన్యం కలిగిన ట్రిపుల్ ఐటీని ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోకుండా ఇన్చార్జి డైరెక్టర్లపైన, ఇన్చార్జి వైస్ చాన్సలర్లపైన పాలనను వదిలేసింది. వారంతా ఇన్చార్జిలు కావడంతో తమకెందుకొచ్చిన గొడవ అని కీలక నిర్ణయాలను తీసుకునే విషయమై మిన్నకుంటున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ల్యాప్టాప్లు లేవు, యూనిఫాం లేదు ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలాఖరుకు ముగుస్తున్నా నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంత వరకు ల్యాప్టాప్లు ఇవ్వలేదు. అలాగే యూనిఫాం ఇవ్వలేదు. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే తరగతులు ప్రారంభమయ్యే రోజునే విద్యార్థులకు ఈ రెండూ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు ఇవ్వకపోవడాన్ని బట్టే ట్రిపుల్ ఐటీలను గాలికి వదిలేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాప్టాప్లు లేకపోవడంతో విద్యార్థులు పీడీఎఫ్లు జిరాక్స్లు తీయించుకొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించే సంస్థలో ల్యాప్టాప్లు ఇవ్వడంలో ఇంత జాప్యంపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ తొమ్మిది నెలలు గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) మీటింగ్ జరగాలంటూ ట్రిపుల్ ఐటీ అధికారులు కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ల్యాబ్ అసిస్టెంట్లకు టైమ్ స్కేల్ ఇస్తారా? ఆర్జీయూకేటీలో పనిచేస్తున్న ల్యాబ్ అసిస్టెంట్లకు టైమ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇది ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో గత ఐదు నెలలుగా టైమ్ స్కేల్ ఇవ్వాలని ల్యాబ్ అసిస్టెంట్లు ఆర్జీయూకేటీ అధికారులను అడుగుతున్నారు. దీనికి వారు జీసీ అనుమతి ఉండాలంటూ టైమ్ స్కేల్ ఇవ్వకుండా కాలం గడుపుకొస్తున్నారు. ఇన్చార్జిల ఏలుబడిలో ట్రిపుల్ ఐటీలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనకడుగు సమస్యలపై దృష్టిపెట్టని కూటమి ప్రభుత్వం సదుపాయాల కొరతతో విద్యార్థుల అవస్థలు నేడు ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం పూర్తిస్థాయి అధికారులనే నియమించలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లను గాని, ఆర్జీయూకేటీకి వైస్ చాన్సలర్ను గాని, చాన్సలర్ను గాని ఇంత వరకు నియమించలేదు. డైరెక్టర్లు, వైస్చాన్సలర్, రిజిస్ట్రార్ అందరూ ఇన్చార్జిలే ట్రిపుల్ఐటీల పాలనను నెట్టుకొస్తున్నారు. ఈ ఇన్చార్జిలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో సాహసం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 28న గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఇన్ఛార్జి వైస్చాన్సలర్, ఇన్చార్జి రిజి స్ట్రార్, నలుగురు ఇన్చార్జి డైరెక్టర్లు, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్య సెక్రటరీ, ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ హైదరాబాద్కు చెందిన డైరెక్టర్లు, మరికొందరు ఈ జీసీ సమావేశంలో పాల్గొననున్నారు. కొందరు ఆన్లైన్లోను, మరికొందరు నూజివీడు ట్రిపుల్ఐటీ నుంచి ఈ మీటింగ్లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనైనా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటారో లేదోనని ట్రిపుల్ ఐటీల సిబ్బంది వేచి చూస్తున్నారు. ఆరు వేల మందికి ఒకరే మెస్ నిర్వాహకుడు నూజివీడు ట్రిపుల్ ఐటీలోని 6,600 మంది విద్యార్థులకు ఒకే మెస్ నిర్వాహకుడు రెండు పూటలా భోజనాన్ని, ఒకపూట టిఫిన్ను అందించాల్సి రావడంతో విద్యార్థులకు సకాలంలో భోజనం అందకపోవడంతో పాటు ఒకే నిర్వాహకుడికి అప్పగించడం కూడా సమంజసం కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ 20న నూజివీడు ట్రిపుల్ ఐటీని సందర్శించిన త్రిసభ్య కమిటీ అక్టోబర్ మొదటి వారానికల్లా మెస్ టెండర్లను పిలిచి మెస్ నిర్వాహకులను నియమిస్తామని చెప్పారు. ఇది చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు కనీసం టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించలేదు. ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఇంకెక్కడా ఉండదనే అభిప్రాయం ట్రిపుల్ ఐటీలో సర్వత్రా వ్యక్తమవుతోంది. -
బంగారం షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
భీమవరం (ప్రకాశంచౌక్)/పాలకొల్లు (సెంట్రల్): ఏలూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి.శ్రీరాంబాబు ఆదేశాల మేరకు భీమవరం, పాలకొల్లు పట్టణాల్లోని బంగారం షాపులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్, సేల్స్ టాక్స్ అండ్ లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భీమవరంలోని శ్రీ సునీత జ్యూయలర్స్, వీకే బులియన్ గోల్డ్ షాపుల నందు అన్ స్టాంప్డ్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా సునీత జ్యూయలర్స్ షాప్ నందు రికార్డుల్లో ఉండాల్సిన దాని కంటే వెండి నిల్వలు 5 కేజీలు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పాలకొల్లులో జరిపిన తనిఖీల్లో పట్నాల బ్రదర్స్ జ్యూయలరీ షాప్ నందు బంగారపు నిల్వల్లో 253 గ్రాములు, వెండి నిల్వల్లో 1500 గ్రాములు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాస జ్యూయలర్స్ షాప్లో బంగారం నిలువల్లో 92 గ్రాములు, వెండి నిల్వల్లో వెయ్యి గ్రాములు తక్కువ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా బంగారం షాపులపై అధికారులు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు పి శివరామకృష్ణ, డి ప్రసాద్కుమార్, విజిలెన్స్ ఎస్సైలు సీహెచ్ రంజిత్కుమార్, కె.సీతారామ, సేల్స్ టాక్స్ అధికారులు పీవీ హేమమాలిని, ఎస్కే షబ్బీర్, లీగల్ మెట్రాలజీ అధికారి రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు దోహదం
వీరవాసరం : కళలు, కళాకారులు ఎక్కడైతే గౌరవించబడతారో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటక పోటీల సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాటక ప్రదర్శనలు సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి ఎంతో దోహదపడతాయన్నారు. టీవీ రంగం మనిషిని చిన్నగా, సినిమారంగం మనిషిని పెద్దగా చూపిస్తుందని, మనిషిని మనిషిగా ఒక్క నాటక రంగమే చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో నాటక పరిషత్ అధ్యక్షుడు గుండా రామకృష్ణ, ఎంపీపీ వీరవల్లి దుర్గా భవాని, అల్లు రామకృష్ణ, గంట ముత్యాల నాయుడు, రామ్మోహన్ రావు, వెంకట రత్నం, పాలా ఆంజనేయులు, కళాపరిషత్ సభ్యులు పాల్గొన్నారు. -
సమ్మె బాటలో మీటర్ రీడర్లు!
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యుత్ మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టనున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు అమలు చేయాలని కోరుతూ విద్యుత్ మీటర్ల రీడర్లు గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంపై యూనియన్ నాయకులు పెనుమాక జాకబ్, వంశీ, శేఖర్, శ్రీనివాస్, రమణ గురువారం విశాఖపట్నంలో సీఎండీతో చర్చలు జరిపారు. అయితే అవి విఫలం కావడంతో రీడర్స్ యూనియన్ నాయకులు కార్యాచరణలో భాగంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. వినియోగదారులపై భారం ప్రతి నెలా 1 నుంచి 12వ తేదీ లోపు మీటర్ రీడర్లు ఇంటింటికి వెళ్లి విద్యుత్ మీటర్ల రీడింగ్ తీయాల్సి ఉంది. విద్యుత్ మీటర్లు సమ్మెబాట పట్టి, విద్యుత్ అధికారులు ప్రత్యామ్నాయా ఏర్పాట్లు చేయకుంటే బిల్లుల శ్లాబ్ రేట్లు మారిపోయి అదనపు భారం పడే అవకాశం ఉండడం వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 5,700 మంది మీటర్ రీడర్లు ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలో 750 మంది రీడర్లు ఉన్నారు. వీరు సమ్మె బాట పడితే 20 లక్షల సర్వీస్లకు ఇబ్బందులు కలగనున్నాయని ఆందోళన వ్యక్తం అవుతుంది. మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళితే తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ముగియనున్న కాంట్రాక్టర్ల గడువు ఇదిలా ఉంటే విద్యుత్ మీటర్లకు సంబంధించి కాంట్రాక్టర్ల గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి కాంట్రాక్టు మొదులుకాగా ఈనెలాఖరికి రెండేళ్ల గడువు తీరనున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి పొడిగింపు ఇవ్వలేదని వారు అంటున్నారు. మీటర్ రీడర్లు సమ్మె చేస్తే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. దీనిపై విద్యుత్ తాడేపల్లిగూడెం డివిజన్ ఈఈ కె.నరసింహమూర్తిను వివరణ కోరగా మీటర్ రీడర్లు సమ్మెలోకి వెళుతున్నట్లు తమకు ఇంకా తెలియదన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్టర్లు వచ్చే నెలలో కూడా మీటర్లు రీడింగ్ తీసేందుకు సమ్మతి ఇచ్చారని ఎస్ఈకు పంపామని, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు రావని వివరించారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీతో విఫలమైన చర్చలు వచ్చే నెల 1 నుంచి సమ్మె ఆలోచన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే వినియోగదారులపై భారం -
ధాన్యం కొనుగోలులో సమన్వయంతో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 2024–25 రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత శాఖలు సమన్వంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అన్నారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో రబీ ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అధ్యక్షతన జిల్లా సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ రబీ పంటకు సంబంధించి 98 శాతం ఈకేవైసీ పూర్తయిందన్నారు. జిల్లాలో 3,97,807 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామని, 2,,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా గోనె సంచులను రైస్ మిల్లర్లు ముందస్తుగానే పరిశీలించి నిర్దేశించిన గోడౌన్లలో ఉంచాలన్నారు. వాహనాల వివరాలను ఆన్లైన్లో నమోదు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్ రాజ్, ఆర్డీవోలు అచ్యుత్ అంబరీష్, ఎం.వి.రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ వి.శ్రీలక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు . జేసీ పి.ధాత్రిరెడ్డి -
పెదవాగు బాధితులకు న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్) : గత ఏడాది గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం స్పందనలో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్బగా కమిటీ కార్యదర్శి ఎస్కె గౌస్ మాట్లాడుతూ వేలేరు పాడు, కుకునూరు మండలాల్లోని 50 గ్రామాలలో పంట భూముల్లో ఇసుక మేటలు వేసి, గండ్లు పడ్డాయని అన్నారు. నష్టపోయిన ప్రజలకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అనేక సార్లు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిస్కారం కాలేదన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయి 50 గ్రామాలలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అల్లూరి నగర్ పంపుహౌస్ లో ఉన్న నీటిని మోటార్లతో మేడేపల్లి, రామవరం గ్రామ పంచాయతీ గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల నాయకులు సిరికొండ రామారావు, కట్టాం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నిరాశపర్చిన పొగాకు ధర
జంగారెడ్డిగూడెం: వర్జీనియా ప్రారంభ ధర రైతులను నిరాశ పర్చింది. ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని 5 వేలం కేంద్రాల్లో సోమవారం కొనుగోలు ప్రారంభమైంది. ప్రారంభ ధర కేజీకి రూ.290 పలికింది. సరాసరి ధర కంటే రూ.340 పలుకుతుందని ఆశించారు. గత ఏడాది ధర దృష్ట్యా కౌలు ధరలు, ఎరువులు, రైతు కూలీల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. గత ఏడాది వర్జీనియా వేలం ప్రక్రియపై నమ్మకంతో అధిక పెట్టుబడులతో ఎక్కువ పంటను పండించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే 20 మిలియన్ల కేజీల పంట అధికంగా ఉండొచ్చని అంచనా. గరిష్ట ధర 400 పైగా రావాలని, సరాసరి రూ.350కి తగ్గకుండా వస్తేనే ఈ ఏడాది రైతులు గట్టెక్కే పరిస్థితి ఉందని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ప్రారంభ ధర కేజీకి రూ.290 సరాసరి రూ.350 పైగా వస్తేనే గిట్టుబాటు సరైన ధర వచ్చేలా చూడాలి తొలి రోజు ధర ఏ విధంగాను ఆమోదయోగ్యం కాదు. గత ఏడాది వేలం ప్రక్రియ దృష్ట్యా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ధర మీద ఆశతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిర్ధేశించిన దాని కంటే ఎక్కువ పండిందని అధికారులు చెబుతున్నారు. కనీసం వారు నిర్ధేశించిన లక్ష్యానికై నా రూ.411 పైగా ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – పరిమి రాంబాబు, వర్జీనియా రైతు సంఘ నాయకుడు -
పరిశోధన ఫలితాలు లాభసాటిగా ఉండాలి
నూజివీడు: మామిడి పరిశోధన ఫలితాలు రైతులకు లాభసాటిగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు మామిడి పరిశోధ నస్థానం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో కిసాన్ మేళా, వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ముందుగా స్టాల్స్ సందర్శించారు. అనంతరం రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలనుద్ధేశించి మాట్లాడుతూ నూజివీడు మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇటీవల నాణ్యమైన మామిడి దిగుబడి రాకపోవడంతో రైతులు ఎంతగానో నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం మామిడికి నల్ల తామర పురుగులు ప్రధాన సమస్యగా తయారయ్యాయని మామిడి శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు తోటల్లో జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నివారించుకోవాలి తప్ప పురుగుమందులతో నివారించలేమన్నారు. సమావేశంలో వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే గోపాల్, అపేడా రీజనల్ హెడ్ ఆర్పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తీవ్ర నిరాశ కలిగించింది
తొలి రోజు రూ.290 రావడంతో రైతులు నిరాశ చెందారు. గత ఏడాది సరాసరి రూ.335 వచ్చింది. సరాసరి రూ.350 వస్తేనే పెట్టుబడులు తిరిగి వస్తాయి. 10 రోజులు చూస్తాం. ఇలాగే కొనసాగితే ప్రతిఘటిస్తాం. సరాసరి రూ.350 వచ్చేలా కంపెనీలు, బోర్డు, ప్రభుత్వం కృషిచేయాలి. జంగారెడ్డిగూడెం –1, –2 బోర్డులతో పోల్చితే మిగిలిన చోట్ల పంట తక్కువ. దీంతో ఆఖరిగా నిలిచిన జంగారెడ్డిగూడెం –1, –2 బోర్డులలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదు బోర్డులను సమానం చేసి వేలం నిర్వహించాలి. – వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘ నాయకుడు -
మంచి ధర వచ్చేలా కృషి చేస్తాం
పొగాకు బోర్డు రైతులకు మంచి రేటు వచ్చేలా కృషిచేస్తుంది. ఈ ఏడాది కూడా ఆశించిన మేరకు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు పంటను బయటకు అమ్ముకోవద్దు. ఈ ఏడాది బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పెద్దఎత్తున పంట పండించారు. గట్టి పోటీ ఉన్న పరిస్థితుల్లో ధర విషయంలో కొంత ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది వచ్చిన విధంగానే సరాసరి వచ్చేలా కృషిచేస్తాం. కర్నాటకలో ఆక్షన్ పూర్తి కాగానే, ఇక్కడ ధర పెరిగే అవకాశం ఉంది. – సీహెచ్ యశ్వంత్కుమార్, చైర్మన్ , వర్జీనియా పొగాకు బోర్డు -
కృత్రిమ అవయవాల పంపిణీ
ఏలూరు (టూటౌన్): ఏలూరు దొండపాడులో ఉమా ఎడ్యుకేషనల్ – టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ నిర్వహించారు. సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఫిజియోథెరపీ, ఆడియోలజీ, స్పీచ్ థెరఫీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర వివరాల కోసం 08812 –249297,7386565469లో సంప్రదించాలన్నారు. మెగా డీఎస్సీకి ఉచిత కోచింగ్ ఏలూరు (టూటౌన్): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ–2025 పరీక్షలకు బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఆర్వి.నాగరాణి ఒక ప్రకటనలో కోరారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, టీటీసీ, బీఎడ్, కుల, ఆదాయ నివాస ధ్రువ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 8686180018 నెంబరులో సంప్రదించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందాలి ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో ప్రజలు ఆయా సమస్యలపై పోలీస్స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తే వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలపై పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సుమారు 36 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పోలవరం రూరల్: ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించనున్న దృష్ట్యా ఏర్పాట్లను కలెక్టర్ కే వెట్రిసెల్వి, జేసీ పీ ధాత్రిరెడ్డి సోమవారం పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో సమావేశ హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. డయాఫ్రమ్ వాల్, ఎగువ కాపర్ డ్యామ్, గ్యాప్– 1, 2 తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ కూడా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు తదితరులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఓ సూచించారు. నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం పలు వినతులు అందాయన్నారు. -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో సంచలనం రేకెత్తించిన వైఎస్సార్సీపీ కార్యకర్త గంధం బోసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని, వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. బోసుబాబు భార్య శాంతికుమారి తనకు మేనమామ వరుసైన సొంగా గోపాలరావుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి జీలుగుమిల్లి సీఐ బి. వెంకటేశ్వరరావు, ఎస్సై నవీన్కుమార్ సోమవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. భర్త పెట్టే బాధలు భరించలేక గంధం బోసుబాబు భార్య శాంతికుమారి, తన మేనమామ వరుసైన గోపాలరావు వివాహానికి ముందే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరువురి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరిద్దరూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. వివాహమైన అనంతరం శాంతికుమారి తన భర్తకు తెలియకుండా గోపాలరావుతో వివాహేతర సంబంధం కొనసాగించింది. బోసు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసే సమయంలో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని శాంతికుమారిని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఎన్నికల సమయంలో బెట్టింగ్లు కట్టి డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అంతేకాకుండా భార్య శాంతికుమారి వద్ద ఉన్న డబ్బులు కూడా బలవంతంగా తీసుకున్నాడు. తరచూ తనను హింసించడంతో భర్త బోసుబాబు అడ్డు తొలగించాలని శాంతికుమారి, గోపాలరావు నిర్ణయించుకున్నారు. సమయం కోసం ఎదురు చూస్తుండగా జగదాంబ అమ్మవారి తిరుణాళ్లలో జరిగిన అవకతవకలపై పత్రికలో వచ్చిన కథనాలను ఆమె భర్త బోసు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన విషయమై అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు బోసును ఫోన్లో బెదిరించిన కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో తన భర్త బోసుబాబును ఏం చేసినా అది చిర్రి వెంకటేశ్వరరావు మీదకు వెళ్తుందనే ఉద్దేశంతో ఈ నెల 17వ తేదీ శాంతికుమారి గోపాలరావును రాత్రి ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టింది. తర్వాత బోసు, పిల్లలు ఇంటి పోర్షన్ బయట వరండాలో పడుకుని పూర్తిగా నిద్రలోకి వెళ్లిన తర్వాత శాంతికుమారి సాయంతో గోపాలరావు తనతోపాటు తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో బోసు తలపై కుడి వైపున ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు. తర్వాత అక్కడి నుంచి గోపాలరావు ఆ రాడ్డుతో పారిపోయాడు. ఈ ఘటనపై ఈనెల 18వ తేదీన తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేయగా భర్త బోసు పెట్టే బాధలు భరించలేకే శాంతికుమారి, గోపాలరావు వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఈ హత్య చేసినట్లు ముద్దాయిలిద్దరూ అంగీకరించారని సీఐ తెలిపారు. అలాగే హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసు దర్యాప్తుకు సహకరించిన కై కలూరు రూరల్ సీఐ, పోలవరం, గణపవరం సీఐలు, చాట్రాయి, ముదినేపల్లి, కొయ్యలగూడెం ఎస్సైలు, సర్కిల్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. బోసుబాబు హత్యకేసును ఛేదించిన పోలీసులు కేసుకు సంబంధించి ఇద్దరి అరెస్ట్ -
ఆ పార్టీలను మట్టిలో కలిపేస్తాం
యలమంచిలి: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మనుగడ లేకుండా మట్టిలో కలుపుతామని పీవీ రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాదరావు హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం యలమంచిలిలో మాల మహానాడు సమావేశం నిర్వహించారు. ముందుగా బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుమ్మాపు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగదని తెలిసి కూడా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు మద్దతు ఇవ్వడమంటే, కేవలం ఓటు బ్యాంకు రాజకీయ పరమైన కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల, మాదిగలను విడగొట్టాలని 1997–98లో నారా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అప్పుడు మాలల పంతం చంద్రబాబు అంతం అనే నినాదంతో ఆ రోజు అధికారం కోల్పోవటం జరిగిందన్నారు. ఆ సంఘటన మర్చిపోయి మళ్లీ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చి కేవలం మాలలను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తిగా అవాస్తవంతో కూడిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రద్దు చేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణను నిలిపివేసి ప్రస్తుతం పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా యలమంచిలి మండల యూత్ విభాగం అధ్యక్షుడుగా జల్లి అనిల్ను నియమించి నియామాకపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పితాని పుష్పరాజ్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కార్యదర్శి బండి సుందరరామూర్తి, నియోజకవర్గ కన్వీనర్ బుంగా జయరాజ్, ఎస్సీ ఉద్యోగుల సంఘం మండల నాయకులు ముడకల గోపాలరావు, బొంద బుజ్జిబాబు, కప్పల బన్నీ, సోడగిరి ప్రదీప్, జల్లి విజయరాజు, రాపాక సుధీర్, తోట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై పీవీ రావు మాల మహానాడు ధ్వజం -
సాహసమే ఊపిరిగా..
దెందులూరు: వారి సాహసం ఎంతో మందికి ఊపిరి పోస్తుంది. ఆపదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణం పోస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదలు, తుపానుల్లో చిక్కుకున్న వారిని కాపాడి రియల్ హిరోలుగా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రియాక్షన్ ఫోర్స్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) బృందాలు. రాష్ట్రంలో 2016 మార్చి 24న ఈ సంస్థ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. మెరికలు లాంటి శిక్షణ పొందిన పోలీసులు ఎంతోమందిని రక్షించి ప్రశంసలందుకుంటున్నారు.324 మంది ప్రాణాలు నిలిపారుజిల్లాలో 9 ఏళ్లలో సంభవించిన విపత్తుల్లో అతిపెద్ద విపత్తు బుడమేరు వరదలు. ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో బుడమేరు వరదల్లో ఇన్స్పెక్టర జనరల్ అసిస్టెంట్ కమాండెంట్ రాజకుమారి నాయకత్వంలో 37 బోట్లతో, 12 బృందాలు, 21 ప్రాంతాల్లో రెస్క్యూ చేశారు. జిల్లాలో 9 ఏళ్లలో ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాహసోపేత రెస్క్యూల ద్వారా 324 మందిని కాపాడారు. 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5 వేల మందికి ఆహారం, తాగునీరు అందించారు. వివిధ రకాల 54 జంతువులను రక్షించారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 42 మృతదేహాలను వెలికి తీశారు.యువతకు స్ఫూర్తియుద్ధభూమిలో సైనికులు, వరదలు తుపానులలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధి నిర్వహణ యువతకు స్ఫూర్తిదాయకం. చరిత్ర ఉన్నంతకాలం వారి ధైర్యం, సేవ, అంకితభావం కీర్తింపబడుతూనే ఉంటాయి.– డాక్టర్ తానేటి వనిత, రాష్ట్ర మాజీ హోం మంత్రివిపత్తుల్లో బృందాల సేవలు కీలకంవిపత్తుల సమయంలో బృందాల సేవలు స్ఫూర్తిదాయకం. సమిష్టి కృషితో విపత్తుల సమయంలో నష్ట ప్రభావాన్ని తగ్గించారు. ప్రాణాలను కాపాడటం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం అందించడం, మృతదేహాల వెలికితేత వంటి సేవలతో ఏపీఎన్డీఆర్ఎఫ్ కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేశారు.– రాజకుమారి ఇన్స్పెక్టర్ జనరల్, ఏపీ ఎన్డీఆర్ఎఫ్ఎండల నుంచి కార్మికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి ఏలూరు (టూటౌన్): అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనరు, విజయవాడ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం కార్మిక శాఖ కార్యాలయంలో హీట్ వేవ్స్పై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్మికులకు పని సమయంలో చల్లటి తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కార్మికులు/ఉద్యోగుల పని గంటలను రీ–షెడ్యూలింగ్ చేయాలన్నారు. ఓఆర్ఎస్ ఐవి ద్రవాలు వంటి అత్యవసర మందులు, ప్రథమ చికిత్స కిట్లు పని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. గది ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీరు తాగడం, విండో షేడ్స్ ఉపయోగించడం, ఫ్యానింగ్, క్రాస్ వెంటిలేషన్ వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్ డాంగే, ఆర్కే డబ్ల్యూసి రత్నబాబు, షేక్ షరీఫ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్విడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, మదర్ థెరిస్సా బిల్డింగ్ వర్కర్స్, ఐఎఫ్టీయూ, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, దుకాణాలు, సంస్థల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. -
30న శ్రీవారి క్షేత్రంలో ఉగాది వేడుకలు
ద్వారకాతిరుమల: నూతన సంవత్సరాది పర్వదినానికి శ్రీవారి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ ఏడాది ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక ఉగాది మండపానికి రంగులు వేసే పనులను ప్రారంభించారు. అలాగే మండప పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఈనెల 30న విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో శ్రీవారు ఆలయం నుంచి వెండి శేష వాహనంపై ఊరేగింపుగా మండపం వద్దకు వెళ్తారు. అక్కడ మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణము జరుపుతారు. ఆ తరువాత పండిత సత్కారం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని, భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి కోరారు. పసల కృష్ణభారతి యువతకు ఆదర్శనీయం తాడేపల్లిగూడెం అర్బన్ : గాంధేయవాది, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణ భారతి నేటి యువతరానికి ఆదర్శనీయమని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కృష్ణభారతి మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల రెండో కుమార్తె కృష్ణభారతి తల్లిదండ్రుల అడుగుజాడల్లో పయనించి స్వాతంత్య్ర సమరయోధురాలిగా నిలిచారని అన్నారు. ఆమె వృద్ధాశ్రమాలను స్థాపించి నిరాశ్రయులైన వృద్ధులకు తోడుగా నిలిచి సేవా తత్పరత కలిగిన మహిళగా ప్రసిద్ధి పొందారని మాజీ మంత్రి కొట్టు తెలిపారు. ఆమె కుటుంబం తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కృష్ణభారతి కుటుంబంతో తమకు బంధుత్వం ఉందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కృష్ణభారతి పోషించిన కీలక పాత్రను తెలుసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా ఆమె పాదాలకు నమస్కరించడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనమన్నారు. కృష్ణభారతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ఆర్టీసీకి స్పెషల్ ఆదాయం
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ గత ఐదేళ్లుగా మంచి ఆదాయంతో దూసుకుపోతోంది. పండుగలకు, తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జిల్లాలోని భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి ఏటా సంక్రాంతి, దసరా పండగలతోపాటు కార్తీక మాసంలో, అరుణాచలం తదితర తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ప్రజలకు ఆర్టీసీ బాగా చేరువైంది. రికార్డు స్థాయిలో ఆదాయం గత ఐదేళ్లుగా ఆర్టీసీ మంచి ఆదాయాన్ని సాధించింది. 2020లో ఏడాదికి రూ.48 లక్షల ఆదాయం సాధించగా.. 2024 నాటికి ఏడాదికి రూ.కోటి ఆదాయం ఆర్జించే స్థాయికి చేరింది. ఏటా సంక్రాంతికి ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి హైదరాబాద్కు పది రోజుల పాటు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రికార్డు స్థాయిలో రూ.99 లక్షల ఆదాయాన్ని సాధించింది. ఈ ఏడాది పంచారామాల ప్రత్యేక బస్సు సర్వీసులు నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.1.50 కోట్లు దాటనుంది. ప్రైవేటు బస్సుల దందాకు చెక్ పండుగ సీజన్లు తీర్థయాత్రలకు ప్రైవేటు బస్సుల యాజమాన్యం ఇష్టానుసారంగా టిక్కెట్ ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేసేవి. దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులతో టిక్కెట్ ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారు కోరుకున్న తీర్థయాత్రలకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు వల్ల ప్రైవేటు బస్సుల టిక్కెట్ దందాకు చెక్ పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల ద్వారా గత 5 ఏళ్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా విపత్తు రెండేళ్లలో కూడా సంక్రాంతి, దసరా, ఇతర తీర్థ యాత్రలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపారు. ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.5 కోట్ల రాబడి ఈ ఏడాది సంక్రాంతికి రూ.99.30 లక్షల ఆదాయం పండగలు, యాత్రలకు ప్రత్యేక సర్వీసులతో ప్రైవేటు దందాకు చెక్గత ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ఆదాయం ఏడాది సంక్రాంతికి ఇతర సర్వీసులు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) 2020 36.93 11.80 2021 36.88 28 2022 54.62 30 2023 60 35 2024 70 40 2025 99.51ప్రత్యేక బస్సులతో మంచి ఆదాయం పండగలు, తీర్థ యాత్రలకు, దైవ దర్శనాలకు జిల్లాలోని 4 డిపోల నుంచి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సర్వీసుల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసిని జిల్లా ప్రజలకు మరింత చేరువ చేసేలా టిక్కెట్ ధరలు పెంచకుండానే అన్ని పండుగలకు బస్సులు ఏర్పాటు చేసి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నాం. సంక్రాంతి, దసరా పండుగలకు హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఎన్వీఆర్ వర ప్రసాద్, జిల్లా ప్రజా రవాణాశాఖాధికారి -
హైవే మొబైల్ వెహికల్స్కు జీపీఆర్ఎస్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు పోలీసు శాఖలోని హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్ఎస్ అమర్చినట్లు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలో రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఈ నేపథ్యంలో సిబ్బంది సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏలూరు జిల్లాలోని 8 హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హైవే మొబైల్ వాహనాలను పర్యవేక్షించటంతోపాటు ఏదైనా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా అవకాశం లభిస్తుందని డీఎస్పీ చెప్పారు. సిబ్బందికి రేడియం జాకెట్లు, బేటన్స్ అందజేశామని, మరింత సౌకర్యాలు కల్పిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జాతీయ రహదారుల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం, మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపట్టేలా శ్రద్ద వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర సమయాల్లో హైవే మొబైల్, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 83329 59175 లేదా డయల్ 112కు ఫోన్ చేయాలని ఏలూరు డీఎస్పీ సూచించారు. బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్ట్ పెనుగొండ: మండలంలోని తామరాడలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, ఆరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో గుబ్బల జ్ఞానేశ్వరరావు(50)ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. దాడుల్లో ఎస్సై ఆర్ మధుబాబు, హెచ్సీ శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు. -
చోరీ కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: ఆశా వర్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. చిన్నంవారిగూడెం గ్రామానికి చెందిన ఏలేటి రాణి అదే గ్రామంలో ఆశా వర్కర్గా పనిచేస్తుంది. ఈనెల 18న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా.. తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. వెంటనే బీరువా వెతకగా, బీరువాలో ఉంచిన 4 కాసుల బంగారం కనబడలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇంటి పక్కనే ఉన్న ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదుతో పేర్కొన్నారని, ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కండక్టర్పై దాడి, కేసు నమోదు జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు కండక్టర్పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న కోనా ప్రసాద్ శనివారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెం – తాడేపల్లిగూడెం సర్వీస్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం వెళ్లేందుకు బస్సు ఎక్కిన జల్లి ప్రవీణ్కుమార్ను టిక్కెట్ అడిగారు. కండక్టర్ టిక్కెట్కు సరిపడా చిల్లర ఇమ్మని ప్రవీణ్కుమార్కు సూచించారు. దీంతో ప్రవీణ్కుమార్ కండక్టర్ను దుర్భాషలాడుతూ క్యాష్బ్యాగ్ లాక్కొని, కొట్టడంతో పాటు, బస్సులోని రాడ్డుకు కండక్టర్ను కొట్టాడు. దీంతో కండక్టర్కు గాయాలయ్యాయి. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. ఈ నెల 14 నుంచి 16 వరకూ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. క్యూలో నిలుచున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. 26న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్మేళా కై కలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో ఆటపాక వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీలత ఆదివారం చెప్పారు. జాబ్మేళాలో ఫోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కై కలూరు నేషనల్ స్కూల్, నవతా రోడ్డు ట్రాన్స్పోర్టు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సుమారు 160 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18–35 సంవత్సరాల వయస్సు కలిగిన యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 9701357315, 6281119575 నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చన్నారు. నాటు సారా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్ చింతలపూడి: నాగిరెడ్డిగూడెం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున నాటుసారా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చాట్రాయి మండలం కొత్తగూడెంకు చెందిన ముల్లంగి శ్రీనివాసరావు, ముల్లంగి రామేశ్వరం బైక్పై నాటుసారా రవాణా చేస్తుండగా 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ పి.అశోక్ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్వీఎల్ నరసింహారావు, అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకా.. పారిశుద్ధ్యం ఇలాగా..?
నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్యం అడుగడుగునా అధ్వానంగా తయారైంది. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే కాకుండా, ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్గా ఉండగా పారిశుద్ధ్యం ఇలాగేనా ఉండేదని పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 150 మంది ఉన్నా పారిశుద్ధ్యం దిగజారుతోంది. రోజుకు 30 టన్నుల చెత్త నూజివీడులో ఉత్పత్తి అవుతుండగా, ఆదివారం వస్తే కేవలం కొన్ని ప్రధాన రహదారుల్లోని చెత్తను మాత్రమే తొలగిస్తూ మిగిలిన పట్టణమంతా వదిలేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర అంటూ ప్రచారార్భాటం తప్పితే క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేది శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధను మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో చూపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. – నూజివీడు -
సంరక్షించి.. సాగరంలో విడిచి..
నరసాపురం రూరల్: సంతానోత్పత్తి కోసం నరసాపురం మండలం చినమైనవానిలంక ప్రాంతానికి వచ్చి ఆలివ్ రెడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టగా.. గుడ్లను సంరక్షించి పొదిగిన తర్వాత 34 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో కనిపించే ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయి. అలా వచ్చి తీరంలో గుడ్లు పెడుతుండగా అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షిస్తున్నారు. ఫిబ్రవరి 3న తొలిసారిగా గుర్తించిన తాబేళ్ల గుడ్ల నుంచి పిల్లలు బయటకు రాగా ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సముద్రంలోకి విడిచి పెట్టారు. సంరక్షణ కేంద్రంలో ఇప్పటివరకూ 135 తాబేళ్లు పెట్టిన 14,300 గుడ్లు సేకరించి భద్రపరిచినట్టు సిబ్బంది తెలిపారు. తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ కె.రాంప్రసాద్, తాబేళ్ల సంరక్షణా పునరుత్పత్తి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. సముద్రంలోకి వెళుతున్న తాబేలు పిల్లలు సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్లు తొలిసారిగా 34 తాబేలు పిల్లల విడుదల -
రికవరీ ఏజెన్సీల మాఫియా?
తీగలాగితే డొంక కదిలింది ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతంలోని ఒక సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసుకు ఫోన్ కాల్ వచ్చింది. తాను ఏలూరు నుంచి సీఐ నాగరాజును మాట్లాడుతున్నానని.. చింతలపూడిలోని ఒక వ్యక్తికి చెందిన ఆధార్, పాన్కార్డ్ అతని పూర్తి వివరాలు వాట్సప్లో ఇవ్వాలని చెప్పాడు. ఆమెకు అనుమానం రావడంతో ఏలూరులోని పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. తీగ లాగితే.. మొత్తం డొంక కదిలింది. ఏలూరు శాంతినగర్లో థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరుతో ఒక కార్యాలయాన్ని నడుపుతున్న ముఠా దొరికింది. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు, ఏలూరు త్రీటౌన్ పోలీసులు కార్యాలయంపై మూడు రోజుల క్రితం దాడి చేశారు. పత్తేబాద రోడ్డులోనూ ఇదే తరహా ప్రైవేటు ఏజెన్సీ కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు ఏజెన్సీ మాఫియా ఫైనాన్స్ కంపెనీలు రుణాల రికవరీకి థర్డ్పార్టీ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ నేపథ్యంలో ఏలూరు కేంద్రంగా ప్రైవేటు ఏజెన్సీ మాఫియా జనాలను పోలీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఏజెన్సీలో ఏలూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు, తిరుపతికి చెందిన ఇద్దరు, బెంగుళూరుకు చెందిన మరో ఇద్దరు కీలక పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఏలూరుకు చెందిన గడ్డం కిషోర్ అలియాస్ నాగరాజు, మధ్యాహ్నపు వంశీకృష్ణ, ప్రవీణ్కుమార్, రియాజ్, వెంకట్, ఇబ్రహీం, మరో నలుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏజెన్సీ ముఠాలో 10 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత సమాచారం? ప్రైవేటు ఏజెన్సీల పేరుతో సాగుతున్న దందాతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల పేరుతో ఏకంగా సచివాలయ ఉద్యోగులను సైతం ప్రభావితం చేస్తూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం చూస్తే .. వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నకిలీ పోలీసులే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారా ? లేక నిజంగానే ఎవరైనా పోలీస్ అధికారులు ఈ ఏజెన్సీలకు అండగా నిలుస్తున్నారా? అనేది సందేహంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో ప్రైవేటు ఏజెన్సీల ఆగడాలు సాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. దుగ్గిరాల ప్రాంతానికి చెందిన కలగంటి గోవింద్ కొంతకాలం క్రితం ప్రైవేటు ఫైనాన్స్లో రుణం తీసుకున్నాడు. ఇటీవల అతనికి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తులు అతడిని కలిసి నీకు బీమా వస్తుంది.. కొంత కడితే ఇంక లోన్ కట్టాల్సిన పనిలేదని కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం థర్డ్పార్టీ ఏజెన్సీ పేరుతో సీఐ అంటూ ఫోన్ చేసి డబ్బులు కట్టాలని, రూ.1.80 లక్షలు చెల్లించకుంటే చెక్బౌన్స్ కేసు నమోదు చేస్తామని, అల్లరి చేస్తామని, బెయిల్ కూడా రాదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏలూరు టౌన్: ఏలూరు పత్తేబాద ప్రాంతానికి చెందిన రామసీత ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పర్సనల్ లోన్ తీసుకున్నారు. నాలుగేళ్లుగా కడుతూ ఉండగా ఆరు నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో బకాయి పడింది. రామసీతకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అమరావతి నుంచి సీఐను మాట్లాడుతున్నాను. మీపై హైకోర్టులో కేసు వేస్తున్నారు. మీ ఇంటికి గంటలో పోలీసు జీపు వస్తుంది. మిమ్మల్ని చెక్బౌన్స్ కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ బెదిరించారు. కొంతసేపటి తర్వాత పత్తేబాద సచివాలయానికి చెందిన ఒక మహిళా పోలీసు (మహిళా సంరక్షణ కార్యదర్శి) రామసీత ఇంటికి వచ్చి మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారని.. మీపై చెక్బౌన్స్ కేసు పెట్టారని.. వెంటనే సంబంధిత ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుని బకాయి డబ్బులు కట్టకపోతే.. పోలీస్స్టేషన్కు తీసుకెళ్తాం.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల పేరుతో భయభ్రాంతులు సచివాలయ సిబ్బందిని వినియోగిస్త్తున్న వైనం ఏలూరులో రెండు చోట్ల తాత్కాలిక ఆఫీసులు? 9 మందిపై కేసు నమోదు -
ట్రిపుల్ఐటీతోనే ఈ స్థాయికి..
కాకినాడ రూరల్ మండ లం పోలవరం మా ఊరు. మేము నలుగురం అ న్న దమ్ములం. తల్లిదండ్రు లు కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్ ఐటీలో ఉ చితంగా చదువుకునే అవకాశం రావడం వల్ల నే నొక్కడినే చదువుకున్నాను. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2015 నుంచి కోరమాండల్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నా. కొత్త ఇల్లు కట్టుకోవడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నా. –కర్రి కోటేశ్వరరావు వైఎస్సార్కు రుణపడి ఉంటాం ప్రకాశం జిల్లా కొత్తపట్న ం మండలం బీరంగుంట మా ఊరు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి 2016 నుంచి కన్యాకుమారిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఇంజనీర్గా చేస్తున్నా. తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నా. ట్రిపుల్ఐటీ లేకపోతే ఏ డిగ్రీనో చదివి ఉండేవాడిని. వైఎస్సార్కు రుణపడి ఉంటా. –మద్దా సురేష్ -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 13తో అమ్మవారి జాతర మహోత్సవాలు ముగిసినప్పటికీ ఈ నెల చివరి వరకు భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం కావడంతో సమీప జిల్లాల నుంచి భక్తులు అమ్మను దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలు సమర్పించారు. జాతరకు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. దేవస్థానంలో శ్రీక్యూశ్రీ లైన్లు నిండాయి. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండనశాల, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, చిత్రపటాల అమ్మకం, అమ్మవారికి కానుకల ద్వారా రూ.2,92,056 ఆదాయం వచ్చిందని తెలిపారు. అంబేడ్కర్ను అవమానించిన వారిని శిక్షించాలి గణపవరం: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం గణపవరం మండలం పిప్పరలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలమహానాడు జాతీయాధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలు మేధావిగా కొనియాడిన బీఆర్ అంబేడ్కర్ను అవమానించడం భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. పేద, దళిత, నిమ్న జాతుల గుండెల్లో కొలువైఉన్న అంబేడ్కర్ను ఎవరు అవమానించినా సహించేదిలేదన్నారు. దళితుల మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టి వారి మధ్య విభేదాలు సృష్టించడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు చోడదాసి జైపాల్, సబ్బితిరాజు, నీతిపూడి వెంకటేశ్వర్లు, ప్రసన్నకుమార్, వెన్నపుచంటి, బీర త్రిమూర్తులు, సారధి, మోహనరావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
నిట్లో ఉత్సాహంగా మారథాన్
తాడేపల్లిగూడెం (టీఓసీ): పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె.హిమబిందు సూచించారు. నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఆధ్వర్యంలో సంస్థలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో ఆదివారం నిర్వహించిన మారథాన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం, పరుగు, నడక, యోగా వంటివి ఎంతగానో దోహదం చేస్తాయని వీటి సాధన కోసం విద్యార్థులు నిత్యం కొంత సమయాన్ని కేటాయించాలని వివరించారు. అనంతరం నిట్ ముఖద్వారం నుంచి బాలికల వసతి గృహాల వరకు, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నిట్ ముఖద్వారం వరకు మారథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి.జగన్మోహన్రావు, శారదా ప్రసన్న మాలిక్, సుశాంత్ కుమార్, బెహారా తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీ చదువులు.. పేద కుటుంబాల్లో వెలుగులు
పేద విద్యార్థులకు వైఎస్సార్ వరం నూజివీడు క్యాంపస్లో 2008 బ్యాచ్ విద్యార్థుల మనోగతం ముగిసిన మొదటి బ్యాచ్ ఉద్యోగుల సమ్మేళనం వారంతా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ప్రతిభ ఉన్నా ఆర్థిక సహకారం లేక అందుబాటులో ఉన్న విద్యతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తన హయాంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీలు వారి జీవితాలను పూర్తిగా మార్చేశాయి. పేద వర్గాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థులకు చేయందించి.. ఆరేళ్లపాటు రూపాయి ఖర్చు లేకుండా సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందించడంతో దానిని అందుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువులు సాధించారు. దీంతో ఒకప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న వారంతా నేడు పేదరికంలో నుంచి బయటకు వచ్చారు. ఇదంతా వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీల వల్లే సాధ్యమైందని పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన తొలి బ్యాచ్ 2008–14 విద్యార్థుల సమ్మేళనం ఆదివారం కూడా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు నాటి తమ పరిస్థితులను వివరించారు. – నూజివీడు వైఎస్సార్ని మరువలేం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మా సొంతూరు. ఇందిరమ్మ ఇంట్లో ఉండేవాళ్లం. కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. ట్రిపుల్ఐటీలో ఈసీఈ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. ఆ తర్వాత జేఎన్టీయూ హైదరాబాద్లో ఎంటెక్ పూర్తి చేశా. 2018లో ఎస్సైగా ఎంపికయ్యా. ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నా. సొంతూరిలో ఇల్లు కట్టుకున్నా. ఆనందంగా బతుకుతున్నాం. వైఎస్ రాజశేఖర్రెడ్డిని జీవితంలో మరిచిపోలేం. – చారీ రాంబాబుకొత్త ఇల్లు కట్టుకున్నాం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం భూమానపల్లి మా సొంతూరు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లేవారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. 2008లో ట్రిపుల్ఐటీలో సీటు రావడంతో అక్కడే సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2017లో మున్సిపాలిటీలో ఏఈఈ ఉద్యోగం వచ్చింది. దీంతో మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాం. ట్రిపుల్ఐటీలో చదువుకోవడం వల్లే మా పేద కుటుంబంలో మార్పు వచ్చింది. – మురికిపూడి మరియదాసు ఫీజు కట్టలేని కుటుంబం మాది.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు మా ఊరు. పూరింట్లో ఉండేవాళ్లం. అమ్మానాన్న కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్ఐటీ అనేది ఒకటి ఉందనే విషయమే తెలియదు. దరఖాస్తు చేయకుండానే సీటు వచ్చింది చేరమంటూ కాల్ లెటర్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. 2020లో ఆర్ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. మంచి ఇల్లు కట్టి అమ్మానాన్నలకు బహుమతిగా ఇచ్చా. ట్రిపుల్ఐటీ లేకపోతే మా తల్లిదండ్రులు బయటి కాలేజీల్లో చదివించేవారే కాదేమో. – తాడేపల్లి మౌనిక -
10 వేల మందికి క్యాన్సర్ టీకాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 10 వేల మంది విద్యార్థులకు టీకాలు వేయించనున్నట్టు రోటరీ (3020) జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోట రీ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పోలియో నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గత రెండేళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. క్లబ్ అధ్యక్షుడు ఎన్జీవీ స్వామి మాట్లాడుతూ రోటరీ సేవలు మరింత విస్తృతం చేయనున్నామన్నారు. అన్నార్తులకు, దివ్యాంగులకు ఆహారం అందజేస్తామన్నారు. స్థానిక సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో రోటరీ పీస్ టవర్ నిర్మాణానికి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ, జిల్లా సెక్రటరీ కల్యాణ్రాజు, రోటరీ పీడీజీ డాక్టర్ పి.దామోదర్ రెడ్డి, డాక్టర్ లలిత పాల్గొన్నారు. 26న జాబ్మేళా బుట్టాయగూడెం : ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26న జాబ్మేళా నిర్వహించనున్నారు. బుట్టాయగూడెం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో మేళా జరుగుతుందని ప్రిన్సిపాల్ జి.కుసుమ ప్రకటనలో తెలిపారు. గ్రీన్టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. 150 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. పదో తరగతి ఆపై చదివి 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. అభ్యర్థులు బ యోడేటా, సర్టిఫికెట్ల నకళ్లతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ 9492582007, 9666322032 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పీజీఆర్ఎస్ వికేంద్రీకరణ ఏలూరు(మెట్రో) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం మండల, డివిజనల్, మున్సిపల్, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించనున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పోలవరం పర్యటన ఈనెల 27న ఉన్న నేపథ్యంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సోమవారం పోలవరంలో ఏర్పాట్ల పరిశీలనలో ఉంటారన్నారు. అయినా ఏలూరు కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులు ప్రజల నుంచి పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా కార్యక్రమం నిర్వహిస్తారని డీఆర్వో పేర్కొన్నారు. గ్రంథాలయాలకు సెస్ బకాయిలు చెల్లించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏలూరు నగరపాలక సంస్థ చెల్లించాల్సిన సుమారు రూ.11 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్టీఐ కార్యకర్త కాపల్లి విజయ మారుతి హరినాథరాజు ఆదివారం ప్రకటనలో డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు ప్రజల నుంచి సెస్సులు వసూలు చేస్తున్నా వాటిలో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన వా టా చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశా రు. జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల కోసం అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై తాను లోకాయుక్తను ఆశ్రయించగా నగరపాలక సంస్థ కమిషనర్కు లోకాయుక్త నోటీసులు జారీ చేసిందన్నారు. దీనికి స్పందించిన కమిషనర్ తక్షణమే జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.20 లక్షలు చెల్లించారని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని అన్ని స్థానిక సంస్థలూ జిల్లా గ్రంథాలయ సంస్థకు బకాయి ఉన్న సెస్ వాటాను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రశాంతంగా ఉల్లాస్ పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని 27 మండలాల్లో ఆదివారం ఉల్లాస్ (ఎఫ్ఎల్ఎన్ఏటీ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 7,321 మందికి 7,261 మంది పరీక్షకు హాజరయ్యారని, 99.18 శాతం హాజరు నమోదైనట్టు వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జీసీహెచ్ ప్రభాకర్ రావు తెలిపారు. పీఎం ఇంటర్న్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానంభీమవరం (ప్రకాశంచౌక్): ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం నిరుద్యోగులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 550 పరిశ్రమల్లో శిక్షణ ఇస్తారన్నారు. -
కాపులపై కూటమివివక్ష
కాపు ఐక్యవేదికలో ధ్వజమెత్తిన నేతలు తణుకు అర్బన్: కాపుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కాపులపై కుల వివక్ష, సవతితల్లి ప్రేమను చూపిస్తోందని కాపు ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జె.నాగబాబు, ఉత్తరాంధ్ర తెలగ సంఘం చైర్మన్ పి.వెంకట రామారావు విమర్శించారు. ఆదివారం పైడిపర్రు కాపు కల్యాణమండపంలో కాపు ఐక్య వేదిక చైర్మన్ రాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2024 ఎన్నికల ముందు ఏదోరకంగా అందలమెక్కాలనే ఉద్దేశంతో పవన్కల్యాణ్ను అడ్డం పెట్టుకుని కాపుల భావోద్వేగాలను రెచ్చగొట్టి 95 శాతం కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నా రు. అయితే నేడు కాపుల ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసి కుల వివక్షను చూపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం కాపుల ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒక్క నిర్ణయం తీసుకోకుండా కుల వివక్ష చూపిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కాపు కార్పొరేషన్కు ఏడాదికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇటీవల బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమన్నారు. హై కోర్టు కాపుల విషయంలో సమర్థించిన జీఓ 30 అ మలు చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల కు కేటాయించిట్టుగా 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లను బ్రాహ్మణ, క్ష త్రి య, ఆర్యవైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి కులాల్లో పేదల కు కొనసాగిస్తే సమన్యాయం జరుగు తుందన్నా రు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాల ప్రయోజనాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పే ర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులపై అవలంబిస్తున్న వైఖరిని వీడాలని కోరారు. -
నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిషేధిత మందుల అక్రమాలపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు చేయగా.. ఊహించని స్థాయిలో అక్రమాలు వెలుగుచూశాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులు, గర్భవిచ్ఛిత్తి, మత్తు కలిగించే మందులు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. ● జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దాడులు ● లైంగిక సామర్థ్యం పెంచే మందులు భారీ ఎత్తున సీజ్ ● కాలం చెల్లిన మందులపై స్టిక్కర్లు అంటించి విక్రయాలు తణుకు అర్బన్: జిల్లాలో పలు మందుల దుకాణాల్లో నిషేధిక డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఈ నెల 21న తణుకు నియోజకవర్గంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా.. నిషేధిత మందులతో పాటు.. కాలం చెల్లిన మందులకు స్టిక్కర్లు అంటించి అమ్ముతున్న వైనం వెలుగుచూసింది. ఈ నిషేధిత మందుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులతోపాటు మత్తు కలిగించేవి, గర్భస్రావం మందులున్నాయి. తణుకు నియోజకవర్గంలోని అత్తిలిలో సత్యకృష్ణ మందుల దుకాణంలో నిషేధిత మందులతోపాటు కాలం చెల్లిన మందుల నిల్వను అధికారులు కనుగొన్నారు. ఈ దుకాణాన్ని మూసివేసి లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశారు. తణుకులోని తంగిరాల వారివీధిలో పెంజర్ల నాగేశ్వరరావు కొంతకాలంగా నిషేధిత మందుల్ని రావులపాలెం నుంచి కొని స్థానికంగా అధిక ధరలకు అమ్మడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి దాడి చేసి పట్టుకున్నారు. అధిక శాతం లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల విక్రయాలు తణుకు పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నాయని విక్రయదారుడు తెలపడం విశేషం. నాగేశ్వరరావు తణుకులోని పలు దుకాణాలకు ఈ మందులు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, ఏలూరులో పలు దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత మందుల విక్రయాలకు సంబంధించి రూ.కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నరసాపురం డివిజన్లో సుమారుగా 800, భీమవరం డివిజన్లో 600కు పైగా మందుల దుకాణాలు ఉన్నాయి., కొన్ని దుకాణాల్లో నిషేధిత మందులు విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాడుల విషయం తెలియడంతో అక్రమార్కులు జాగ్రత్త పడిపోయారు. తణుకులో ఒక ఇంట్లో నిషేధిత మందులు విక్రయాలకు సంబంధించి సుమారు రూ.6 లక్షల వరకు మందులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రావులపాలెంకు చెందిన బచ్చు సుబ్బారావు బ్యాంకు ఖాతాకు ఫోన్ పే ద్వారా పంపినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సేకరించారు. నిషేధిత మందులతో ఆరోగ్యంపై ప్రభావం లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల వల్ల గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మందు అధిక వాడకం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. గర్భస్రావం కోసం ఉపయోగించే మందులు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయని, భవిష్యత్తులో తీవ్రం ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. మత్తు మందుల వాడకంతో కొన్నాళ్లకు నరాల సమస్యలు, నిద్రలేమి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఔషధ నియంత్రణ శాఖ నిర్లక్ష్యం విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగితే తప్ప నిషేధిత మందుల వినియోగంపై ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దుకాణంలో ఏ మందులు ఉన్నాయి.. ఏ దుకాణంలో నిబంధనలు పాటిస్తున్నారనే విషయంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు స్పష్టత ఉంటుంది. కొన్ని రకాల కారణాలతో దాడులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఔషధ నియంత్రణ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించి తరచూ దుకాణాలపై దాడులు చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. -
ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా తడికలపూడి మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి గుహల పర్యాటక ప్రాంతంలో ఐదేళ్ల క్రితం బాలికపై హత్యాచారం, ప్రియుడిపై దాడి కేసులో పోలీసులు ప్రతిభ చూపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేశారని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి నలుగురు నిందితులకు జీవిత కాల ఖైదు విధించారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కేసులో ప్రతిభ చాటిన వారిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చేయటంలో అధికారులు, సిబ్బంది చూపించిన శ్రద్ధ, చిత్తశుద్ధిని ఆయన అభినందించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, భీమడోలు సీఐ యూజే విల్సన్, జంగారెడ్డిగూడెం సీఐ బీ.కృష్ణబాబు, తడికలపూడి ఎస్సై చెన్నారావు, టీ.నరసాపురం ఎస్సై కే.విజయబాబు, ఏలూరు మహిళా స్టేషన్ సీఐ, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్చార్జ్ ఎం.సుబ్బారావు, తడికలపూడి కోర్టు కానిస్టేబుల్ కేపీవీడీఎన్ కొండలరావు, కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాస్, మహిళా హెడ్ కానిస్టేబుల్ ఎం.వెంకటరమణ, కానిస్టేబుల్ టీ.రవికుమార్ను అభినందించారు. -
బెల్టు షాపులను అరికట్టలేని ప్రభుత్వం
భీమవరం: రాష్ట్రంలో బెల్టుషాపులను అరికట్ట లేని కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి దుయ్యబట్టారు. శనివారం భీమ వరం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా లో 70 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయని, గోవా, యానాం నుంచి అక్రమ మద్యం వస్తుండటంతో తాటి కల్లు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గీత కార్మికుల పరిస్థితి మ రింత అధ్వానంగా మారిందన్నారు. కల్లు గీత వృత్తిలో మార్పు తెచ్చి గీత కుటుంబాలకు ఉ పాధి కల్పించి ఆదుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతోనే బెల్ట్ షాపులు నిర్వహించ డం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ బెల్ట్ షాపులు, అక్రమ మద్యం అరికట్టలేని ఎక్సైజ్శాఖ గీత కార్మికుల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. -
ఏరులై పారుతున్న మద్యం
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎకై ్సజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. మద్యం అక్రమ విక్రయాలను నియంత్రించలేపోతున్నారు. మరో వైపు కూటమి నేతల సాయంతో బెల్టు షాపుల ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 2025 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు అక్రమ అమ్మకాలపై ఏకంగా 899 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో 144 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలపై భారీగా కేసులు నమోదయ్యాయి. 315 ఐడీ కేసుల్లో 324 మంది, 157 బెల్లపు ఊట కేసుల్లో 44 మంది, 345 బెల్టు షాపులపై కేసుల్లో 348 మంది, 50 ఎన్డీపీఎల్ కేసుల్లో 51 మంది, 28 ఇతర కేసుల్లో 28 మందిపై కేసులు నమోదు చేశారు. 42 వాహనాలను ఎకై ్సజ్ పోలీసులు సీజ్ చేశారు. ఏడు ఎకై ్సజ్ సర్కిళ్లలో ఇలా.. జిల్లాలోని ఏడు సర్కిళ్ల పరిధిలో భీమడోలు, ఏలూరు సర్కిళ్లలో తక్కువ కేసులు నమోదయ్యాయి. చింతలపూడి సర్కిల్లో 256 కేసులు నమోదు చేశారు. నూజివీడు సర్కిల్లో 203 కేసులు, జంగారెడ్డిగూడెం సర్కిల్లో 124 కేసులు, పోలవరం 121, కై కలూరు సర్కిల్లో 77 కేసులు నమోదు చేశారు. బెల్టుషాపుల విషయానికొస్తే కై కలూరులో 70, నూజివీడు 50, చింతలపూడి సర్కిల్ పరిధిలో 52 కేసులు నమోదు చేశారు. బెల్లపుఊటకు సంబంధించి చింతలపూడిలో 52 కేసుల్లో 59 వేల లీటర్లు ధ్వంసం చేయగా.. పోలవరం సర్కిల్లో 47,800 లీటర్లు, నూజివీడు సర్కిల్లో 45,310 లీటర్లు, జంగారెడ్డిగూడెం సర్కిల్లో 15,320 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం చేశారు. చింతలపూడి పరిధిలో 15 వాహనాలు, నూజివీడులో 16 వాహనాలు, పోలవరం 6, జంగారెడ్డిగూడెం 4, ఏలూరులో ఒక్క వాహనాన్ని సీజ్ చేశారు. నిబంధనలు పాటించాలి అక్రమంగా మద్యం విక్రయించినా.. నిబంధనలు పాటించకపోయినా కేసులు నమోదు చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో సారా తయారీపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నాం. మూడు నెలల్లో భారీగా కేసులు నమోదు చేశాం. – ఆవులయ్య, ఎకై ్సజ్ అధికారి, ఏలూరు 899 కేసుల్లో 799 మంది అరెస్ట్ బెల్టు షాపులపై 345 కేసులు -
బోసు కుటుంబానికి అండగా ఉంటాం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మృతికి కారకులైన వారిని పట్టుకుని పోలీసులు కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాటాకులగూడెంలో బోస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బోసు మృతి వైఎస్సార్సీపీకి తీరనిలోటన్నారు. బోసు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు బోదా శ్రీనివాసరెడ్డి, బుట్టాయగూడెం మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు తదితరులు పాల్గొన్నారు. గడ్డి ట్రాక్టర్ దగ్ధం కామవరపుకోట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గడ్డి ట్రాక్టర్ దగ్ధమైన ఘటన తడికలపూడిలో శనివారం చోటుచేసుకుంది. ఏడీఎఫ్ వి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం మందలపర్రు గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మికి చెందిన ట్రాక్టర్ ఉదయం గడ్డి లోడుతో మందలపర్రులో బయలుదేరి తడికలపూడికి వచ్చింది. మధ్యాహ్న భోజనం చేసేందుకు పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్ పెట్టి కూలీలు, డ్రైవరు వెళ్ళగా, పైనున్న విద్యుత్ తీగలు గడ్డికి తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు ఏలూరు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. డీఏ ఎరియర్లు చెల్లించాలి ఏలూరు (ఆర్ఆర్పేట) : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ ఎరియర్లు వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బకాయిలు రూ. 6200 కోట్లు చెల్లించాలని నిర్ణయించటం హర్షణీయమని.. ఉద్యోగుల నుంచి మినహాయించిన పీఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులు, సీపీఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్, సరెండర్ లీవ్ బకాయిలను మాత్రమే చెల్లించి బకాయిలు చెల్లించామంటే సరిపోదన్నారు. ఇంతవరకు నిధి పోర్టల్లో ఒక్క ఎరియర్ బిల్ ఎనేబుల్ చేయలేదని, ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
భీమడోలు : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పులదండ వేసి అవమానపర్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం రాత్రి దళిత నాయకులు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు. తొలుత భీమడోలు సంత మార్కెట్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో దళిత నాయకుల పైడిమాల యుగంధర్, తుమ్మల శాంతభూషణం, గోగులమూడి రవికుమార్, మద్దాల వెంకటరత్నం, కాలి కిరణ్, రత్తయ్య, బెంజిమన్, డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో.. ఏలూరు (టూటౌన్): అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక నరసింహారావుపేటలోని సంఘ కార్యాలయంలో శనివారం రాత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అంబేడ్కర్ను అవమానించడం విచారించదగ్గ విషయం అన్నారు. దూబచర్ల వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. నాయకులు ఎన్.కార్తీక్, బి.నాగరాజు, పాము మాన్ సింగ్, అంబటి నాగేంద్ర, కె.మురళీ తదితరులు ఈ ఘటనను ఖండించారు. దెందులూరు మండలంలో.. దెందులూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గొల్ల కిరణ్, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తనగాల శేఖర్ తీవ్రంగా ఖండించారు. 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. -
మద్యంషాపు ఏర్పాటుపై మండిపాటు
నరసాపురం: నరసాపురంలోని 26వ వార్డు వీవర్స్ కాలనీలో మద్యం షాపు ఏర్పాటును శనివారం స్థానికులు అడ్డుకున్నారు. కల్లుగీత కార్మికుల కోటాలో షాపును వీవర్స్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసే యత్నం చేశారు. షాపును ప్రారంభానికి సిద్ధం చేస్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. కాలనీలో ఇళ్ల మధ్య బ్రాందీ షాపు పెడితే ఎలాగని ప్రశ్నంచారు. కాలనీలో రోడ్డుపై మహిళలు తిరగలేరని, చిన్న పిల్లలు ఆడుకునే గ్రౌండ్ వద్ద షాపు ఎలా పెడతారని నిలదీశారు. మహిళల ఆందోళనతో నిర్వాహకులు షాపు ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. -
కోకో కొనుగోలు కోసం ధర్నాలు
ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24, 25 తేదీల్లో మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. చొదిమెళ్లలో నాయకులు శనివారం పర్యటించారు. ధర్నా, రాస్తారోకోలను జయప్రదం చేయాలని రైతులను కోరారు. కోకో గింజల కొనుగోలు, ధరల సమస్యలపై ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ సమక్షంలో చర్చలు జరిగినా కోకో రైతులకు న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. సంఘ బదిలీలు, పదోన్నతుల చట్టం ఏకపక్షం ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అవమానించడమే అని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ పాయింట్ ఏడాదికి ఒకటి కావాలని అడిగినా 0.5 మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. రిటైర్మెంట్కు మూడేళ్ల సర్వీస్ ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయించాలని కోరినా అధికారులు రెండేళ్లు ఉన్నవారికి మాత్రమే మి నహాయింపు ఇచ్చారన్నారు. జీఓ 117 రద్దుతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు 10 వేలు మిగులు చూపుతారని, అలాంటప్పుడు ఎస్జీటీలకు పదోన్న తులు ఎక్కడ కల్పిస్తారని ప్రశ్నించారు. పలు ప్రాథమిక పాఠశాలల మూతకు రంగం సిద్ధమైందని, భవిష్యత్తులో ఎస్జీటీ టీచర్ల నియామకం కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 117 రద్దుతో అపకారమే ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఏలూరు(మెట్రో): జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపి, యువతకు ఉద్యోగా వకాశాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని ఎంపీ పుట్టా మహేష్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన ల్యాండ్ బ్యాంకు వివరాలు సేకరించాలని, వచ్చేఏడాది మార్చిలోపు 7 వేల యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్ర భాకర్, సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ ఉంగుటూరు: కాగుపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రెండోసారి శనివారం విచారణ జరిగింది. నూజివీడు డీఎల్పీఓ కార్యాలయంలో డీఎల్పీఓ విచారణ చేయగా ఆరోపణలకు బాధ్యులు సర్పంచ్ కడియాల సుదీష్ణ, కార్యదర్శి, దుర్గాధర్, పూర్వ కార్యదర్శులు బాలకృష్ణ, శ్రీదేవి, ఆరోపణలు చేసిన వార్డు సభ్యులు హాజరయ్యారు. కార్యదర్శి బాలకృష్ణ రూ.1.42 లక్షలు, కార్యదర్శి శ్రీదేవి రూ.6.35 లక్షలు, సర్పంచి సుదీష్ణ రూ.7.77 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్టు నోటీసులో తెలిపారు. టెన్త్ పరీక్షలకు 4,399 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శనివారం జరిగిన పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 సంస్కృతం పరీక్షలకు 4,398 మంది రెగ్యులర్ విద్యార్థులకు 4,388 మంది హాజరయ్యారు. ఒకసారి ఫెయిలైన వారిలో 18 మందికి 11 మంది హాజరయ్యారు. జిల్లాలోని 40 కేంద్రాలను అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చే సినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. రుణాల దరఖాస్తులకు గడువు పెంపు ఏలూరు (టూటౌన్): జిల్లాలో స్వయం ఉపాధి రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్టు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్.పుష్పలత తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితిని 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారన్నారు. అధికారులు ఈ మేరకు దర ఖాస్తులు స్వీకరించాలన్నారు. -
ఆ చిన్నారుల చదువుకు వీధి లైట్లే దిక్కు
● ఇళ్ల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు ● పట్టాలిచ్చినా కట్టుకునే స్థోమత లేక అవస్థలు ● దయ చూపండని బాఽధితులు, పిల్లల మొర సాక్షి టాస్క్ఫోర్స్: ఆకివీడులోని అమృతరావు కాలనీకి చేర్చి శ్మశాన భూమికి మధ్య ఆక్రమణలను తొ లగించడంతో బాధితులు వీధిన పడ్డారు. వారి పిల్ల లు వీధి దీపాల కింద చదువుకోవాల్సిన దుస్థితి నె లకొంది. 30 ఏళ్లుగా శ్మశానానికి ఆనుకుని పూరి పా కలు, పందిళ్లు వేసుకుని సుమారు 29 కుటుంబాల వారు జీవిస్తున్నారు. ఇటీవల కోర్టు ఆదేశాలతో రెవె న్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. గత ప్రభుత్వంలోనే 22 మంది బాధితులకు పట్టాలు ఇచ్చారు. తమకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదని బా ధితులు ఆక్రమణల నుంచి వైదొలగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్రమణలను ఖాళీ చే యించారు. ఆక్రమణదారులు ఆయా పంచల్లోనే కా లం గడుపుతున్నారు. తాము ఇల్లు నిర్మించుకునే స్థితిలో లేమని చెప్పడంతో ఆయా పట్టాలను వేరొకరికి మార్పు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ప్రభుత్వమే తమకు ఇల్లు నిర్మించి ఇ వ్వాలని కోరుతున్నారు. 30 ఏళ్లుగా వర్షాలు, ముంపు నీటిలోనే జీవనం గడిపామని, పాములు, క్రిమికీటకాలతో పాటు, శవ దహనాల ఎదురుగా భోజ నాలు చేశామని, నిద్రపోయామని వాపోతున్నారు. వీధి దీపాల కింద చదువులు : 29 బాధిత కుటుంబాల్లో సుమారు వంద మందికి పైగా ఉన్నారు. వా రిలో సుమారు 25 నుంచి 30 మంది వరకు పిల్లలుండగా చాలా మంది ఆరు నుంచి పదో తరగతి చ దువుతున్నవారే. వీరంతా గూడు లేక, చదువుకునేందుకు ఆస్కారం లేక వీధి దీపాల కింద చదువుకుంటూ కాలం గడుపుతున్నారు. ఒక పక్క దోమలు, మరో పక్క ఉక్కబెట్టే వాతావరణంలో అల్లాడిపోతున్నారు. రోడ్లపై పడుకుంటూ, వీధిలైట్ల వెలుగులో చదువుకుంటు న్నా అధికారులకు, పాలకులకు కనికరం లేదని ఆవేదన చెందుతున్నారు. తమను ఆదుకునేందుకు కూ టమి ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశించామని, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా పట్టించుకోలేదని పిల్లలు, వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. రెండు మూడు తరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నామని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమకు పట్టాలిచ్చారని చెబుతున్నారు. ఇల్లు నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం రూ.4 లక్షలు ఇస్తానని ప్రకటించడంతో ఆశగా ఎదురు చూశామని, అవి కాస్తా ఆవిరయ్యాయని ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా వీధి దీపాల కింద పిల్లలు చదు వు కుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు స్థానిక పార్టీ నేతలను పంపించి విషయం బయటికి రాకుండా సద్దుమణిచే ప్రయ త్నం చేయడం గమనార్హం -
నేరాల నిరోధానికి పటిష్ట చర్యలు
ఏలూరు టౌన్: జిల్లాలో నేరాలను నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరస్తులపై నిరంత నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో కేసుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో వ్యాపార సముదాయాలు, ఆలయాలు, అపార్ట్మెంట్లు, ముఖ్య కూడళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్స్పాట్స్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలనీ, వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. కోడిపందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, డీఎస్పీలు డి.శ్రావణ్కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, యు.రవిచంద్ర, డీటీసీ డీఎస్పీ ప్రసాదరావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ -
కొల్లేరులో ఆక్రమణదారులకు నోటీసులు
ఖండ్రిక కాలువ ప్రక్షాళనకు ప్రతిపాదనలు నిడమర్రు: కొల్లేరు అభయా రణ్య పరిధిలో అక్రమ ఆక్వా సాగుపై శనివారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘కొల్లేరు అభయారణ్యం.. ఆక్రమణలే సర్వం’ శీర్షికన కథనానికి జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించా రు. జిల్లా అటవీ శాఖ అధికారి (వన్యప్రాణి యాజమాన్యం) డి.విజయ దేవరగోపవరంలో 5వ కాంటూరులోపు అక్రమ సాగు చేస్తున్న ఆక్వా చెరువులు, విద్యుత్ తీగలు, బోర్లను పరిశీలించారు. బహిరంగంగా విద్యుత్ తీగలు కనిపిస్తున్నా ఏం చేస్తున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ చేస్తామని సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు రైతులతో మాట్లాడారు. పెదనిండ్రకొలను నుంచి దేవరగోవపరం మీదుగా కొల్లేరులో కలిసేలా 2.5 కిలోమీటర్లు మేర ఖండ్రిక పంట కాలువ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పెదనిండ్రకొలను గ్రామ పరిధిలో కాలువ ఆక్రమణలు లేవని, దేవరగోపవరం 5వ కాంటూరు పరిధి నుంచి ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించారు. సుమారు కిలోమీటరు మేర ఖండ్రిక పంట కాలువ తొమ్మిది ఆక్వా చెరువుల మధ్యలో ఉన్నట్టు గుర్తించారు. ఆయా చెరువుల నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నట్టు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఆక్రమిత పంట కాలువ 5వ కాంటూరు పరిధిలో ఉండటంతో కాలువ ప్రక్షాళనకు ప్రభుత్వ అనుమతి కోరడంతోపాటు కాలువ తవ్వేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించిన రూ.11.80 లక్షల నిధులు మంజూరు చేసేలా నివేదిక పంపుతామన్నారు. ఏలూరు రేంజర్ అధికారి మోహిని విజయలక్ష్మి, అటవీ సిబ్బంది ఉన్నారు. -
మట్టి టిప్పర్ కనిపిస్తే సీజ్
కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణాపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘కూటమి మట్టి మాఫియా’ కథనానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులు, విలేకరులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో బుసక మట్టితో టిప్పర్ తిరిగితే వెంటనే కేసులు నమోదు చేసి సీజ్ చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. బోర్డర్లలో చెక్పోస్టులను ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయిస్తామన్నారు. తన కుమారుడు టిప్పర్ పంపినా చర్యలు తీసుకోవాలని అన్నారు. గృహ అవసరాలకు ట్రాక్టర్లతో మట్టి తరలించవచ్చని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్లు పాల్గొన్నారు. అలాగే కొల్లేరు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే కామినేని అన్నారు. కొల్లేరు అభయారణ్యంలో డీ ఫాం, జిరాయితీ భూములు 22 వేల ఎకరాలను మినహాయించి 55 వేల ఎకరాల్లో అభయారణ్యాన్ని నిర్ణయించాలని ప్రభు త్వాన్ని కోరుతున్నామన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: మండలంలోని పెనుమల్లి వద్ద శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామతులు ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వివరాల ప్రకారం మండలంలోని సంఖర్షణపురానికిచెందిన ముత్యాల చక్రవర్తి(32), మరో ఐదుగురు కూలీలతో మినుము నూర్పిడి చేసేందుకు ట్రాక్టర్పై కూలి పనికి వెళ్తున్నారు. పెనుమల్లి సమీపానికి వెళ్లగానే మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదం నుంచి ఐదుగురు కూలీలు తప్పించుకోగా ట్రాక్టర్పై ఉన్న మినుము నూర్పిడి యంత్రం చక్రవర్తిపై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాద సమయంలో స్థానికులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర గాయాలతో అరగంట సేపు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడాడు. సమాచారం అందుకున్న బంధువులు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చక్రవర్తి మృతదేహంతో గుడివాడ నుంచి బయల్దేరిన గ్రామస్తులు చక్రవర్తి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేయాలని నిర్ణయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది గుడివాడ నుంచి వస్తున్న చక్రవర్తి మృతదేహాన్ని జాతీయ రహదారిపై కోడూరు వద్ద అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. మృతుడి తరఫు వ్యక్తులకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తరఫు వ్యక్తులకు మధ్య రాజీ చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు. -
●ఆడుకుంటానని.. వెళ్లిపోయావా అన్నయ్యా!
ఆడుకుంటానని వెళ్లి.. అనంతలోకాలకు వెళ్లిపోయావా.. అన్నయ్యా? అంటూ చెల్లెలు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మండలంలోని చినకాపవరం గ్రామంలో ఓల్డ్ వయ్యేరు పంట కాలువలోకి శుక్రవారం స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు శరత్ కుమార్, పవన్ సాయి మృత్యువాత పడ్డారు. అయితే విగతజీవిగా పడి ఉన్న అన్న మృతదేహాన్ని చూసిన చెల్లెలు తోడు లేకుండా వెళ్లిపోయావా? అన్నయ్యా అంటూ రోదించింది. పదేళ్ల వయస్సులోనే ఇద్దరు బాలురు మృతి చెందడంతో చినకాపవరం, పెదకాపవరం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. – ఆకివీడు -
గంగానమ్మ విగ్రహ తొలగింపుతో ఉద్రిక్తత
నూజివీడు : పట్టణంలోని కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్లో రావి చె ట్టు వద్ద ఉన్న గంగానమ్మ విగ్రహాలను శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో యడవల్లి రవిచంద్ర(32) అనే అతను గునపంతో తవ్వి ధ్వంసం చేసి పక్కన పడేశాడు. అంతేకాకుండా అక్కడే ఉన్న దేవుడి ఫొటోలను సైతం పక్కన పడేశాడు. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే స్పందించి యడవల్లి రవిచంద్రను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇది తమ సొంత స్థలమని, అందులో ఎవరెవరో వచ్చి విగ్రహాలు పెట్టి తాము ఏర్పాటు చేసిన గుడి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, అసలు తమ పట్టా భూమిని తాము స్వాధీనం చేసుకోవడానికి తవ్వినట్లు రవిచంద్ర విచారణలో తెలిపాడని సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణతో పాటు పట్టణానికి చెందిన పలువురు పెద్దలు ఇప్పటివరకు ఎక్కడైతే గంగానమ్మ విగ్రహం ఉందో మళ్లీ అక్కడే విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మెడికల్ షాపులపై దాడులు
తణుకు అర్బన్ : పట్టణంలోని మెడికల్ షాపులపై శుక్రవారం విజిలెన్స్, ఈగల్, ఔషధ నియంత్రణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న మందుల వివరాలు, నిల్వలు, ఎక్స్పైరీ తేదీలు తదితర అంశాలతోపాటు నిషేధిత మందుల నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ జిల్లా ఎస్పీ శ్రీరామ్బాబు ఆదేశాల మేరకు తణుకు పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తంగిరాల వారి వీధిలోని ఇండియన్ పబ్లిక్ స్కూలు ఎదురుగా ఉన్న భవనం మూడో అంతస్తులో అనధికారికంగా నిల్వ ఉంచిన నిషేధిత మందులను గుర్తించినట్లు చెప్పారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచేవి, మత్తునిచ్చేవి, గర్భస్రావం అయ్యేటటువంటి మందులను అనధికారికంగా నిల్వ ఉంచి విక్రయాలు చేస్తున్న పెంజర్ల నాగేశ్వరరావుపై డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 అండర్ సెక్షన్ 18 సీ ప్రకారం కేసు నమోదు చేసి, అతని నుంచి మందులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ మందులు తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన బచ్చు వెంకట సుబ్బారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అలాగే తణుకు పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డులో మరొక మూడు దుకాణాల్లో తనిఖీలు చేశారు. దాడుల్లో ఈగల్ సీఐ సూర్య మోహన్రావు, సీసీఎస్ సీఐ రాంబాబు, తణుకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పి.మల్లికార్జునరావు, విజిలెన్స్ ఏఈ ఎం.అనీల్బాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం : పట్టణంలోని మెడికల్ షాపులపై శుక్రవారం విజిలెన్సు అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని పోర్టుగేట్ డ్రగ్ హౌస్లో ఈ సోదాలు జరిగాయి. దుకాణం లైసెన్సు, నిషేధిత మందులు ఏమైనా ఉన్నాయా? జీఎస్టీ ఇతర అంశాలపై డ్రగ్స్, పోలీసు అధికారుల సమక్షంలో దాడులు చేశారు. తనిఖీల నేపధ్యంలో పట్టణంలోని మెడికల్ షాపులను మూసివేశారు. విజిలెన్సు సీఐ శివరామకృష్ణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో.. అత్తిలి : స్థానిక సత్యకృష్ణ మెడికల్ షాపును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జౌషధ నియంత్రణశాఖ సంయుక్తంగా శుక్రవారం తనిఖీ చేశారు. మెడికల్షాపులో అనుమతి లేని మందులతో పాటు కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామని భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ అలీ తెలిపారు. ట్యాబ్లెట్ షీట్లపై ఎక్స్పైరీ డేట్ కట్ చేసి స్టిక్కర్లు వేసి మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి, షాపును మూయించివేశారు. మెడికల్ షాపు లైసెన్సును రద్దు చేస్తామని అలీ చెప్పారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు టౌన్ : ప్రభుత్వ ఆదేశాలతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో సంయుక్తంగా ప్రత్యేకంగా నియమితులైన విచారణ అధికారులు మెడికల్ షాపులపై దాడులు చేశారు. ఏలూరు జిల్లాలో నూజివీడు, ఏలూరు, ద్వారకాతిరుమల ప్రాంతాల్లో ఒకేసారి అధికారులు తనిఖీలు చేశారు. ఏలూరు నగరంలోని ఉదయ్ జనరిక్, సద్భావన మెడికల్స్, ద్వారకాతిరుమలలోని సంజీవిని మెడికల్స్, నూజివీడు ప్రాంతంలో సాయి బాలాజీ మెడికల్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. మందుల షాపుల్లో అనధికారికంగా మందుల విక్రయాలు, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు, గడువు ముగిసిన మందులను సైతం ఇష్టారాజ్యంగా అమ్ముతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రికార్డులు సైతం సక్రమంగా లేవని అధికారుల గుర్తించారు. కొన్ని మందుల షాపుల్లో శుక్రవారం రాత్రి వరకూ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీల్లో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ, విజిలెన్స్ విభాగం సీఐ ప్రసాద్కుమార్, ఎస్సై రంజిత్కుమార్, నాగరాజు, విజిలెన్స్ డీఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తణుకులో నిషేధిత మందులు స్వాధీనం -
●ఆడుకుంటానని.. వెళ్లిపోయావా అన్నయ్యా!
ఆడుకుంటానని వెళ్లి.. అనంతలోకాలకు వెళ్లిపోయావా.. అన్నయ్యా? అంటూ చెల్లెలు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మండలంలోని చినకాపవరం గ్రామంలో ఓల్డ్ వయ్యేరు పంట కాలువలోకి శుక్రవారం స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు శరత్ కుమార్, పవన్ సాయి మృత్యువాత పడ్డారు. అయితే విగతజీవిగా పడి ఉన్న అన్న మృతదేహాన్ని చూసిన చెల్లెలు తోడు లేకుండా వెళ్లిపోయావా? అన్నయ్యా అంటూ రోదించింది. పదేళ్ల వయస్సులోనే ఇద్దరు బాలురు మృతి చెందడంతో చినకాపవరం, పెదకాపవరం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. – ఆకివీడు -
కొల్లేరు అభయారణ్యం.. ఆరకమణలే సర్వం
నిడమర్రు: కొల్లేరు అభయారణ్య పరిధిలోని నిషేధిత భూముల్లో ఆక్వా సాగు సాగుతోంది. 5వ కాంటూరు పరిధిలోని జిరాయితీ భూముల్లో ఆక్వా సా గు నిషేధం కాగా.. దేవరగోపవరం ఖండ్రిక పరి ధిలో సుమారు 300 ఎకరాల్లో చేపలు, రొయ్యల సా గు యథేచ్ఛగా సాగుతోంది. సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ పెద్దలు, అధికారుల మద్దతు ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయా చెరువులకు బహిరంగంగానే విద్యుత్ కూడా సరఫరా అవుతోంది. కొన్నిచోట్ల అనధికార బోర్లు, మరికొన్ని చోట్ల ఇరిగేషన్ డ్రెయిన్ల నీటితో చెరువులు నింపుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు అంటున్నారు. ఖండ్రిక కోడు ఆక్రమణలు తొలగించాలి కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోకి వచ్చే దేవరగోపవరం ఖండ్రిక కోడును ఆనుకుని గతంలో జిరా యితీ పొలాలు ఉండేవి. కొల్లేరు ప్రక్షాళన అనంతరం ఆ భూములను ఆక్వా చెరువులుగా కొందరు పెద్దలు మార్చేశారు. ఈ క్రమంలో సుమారు 2.5 కిలోమీటర్ల మేర ఉన్న ఖండ్రిక కోడును ఆక్రమించుకుని చెరువుల్లో కలిపేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎగువ నుంచి వచ్చే వరద నీరు కొల్లేరులోకి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో నీరు ఎగదన్ని తమ పొలాలు ముంపు బారిన పడుతున్నాయని పెదనిండ్రకొలను, దేవరగోపవరం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖండ్రిక కోడును ప్రక్షాళన చేసి తిరిగి ఇరిగేషన్ డ్రెయిన్గా మార్చాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా అధికారుల వాదన మరోలా ఉంది. నోటిఫైడ్ డ్రెయిన్లు, నాన్ నోటిఫైడ్ డ్రెయిన్లు 67 ఉండగా వీటిలో ఖండ్రిక కోడు లేదని అంటున్నారు. సదరు డ్రెయిన్ను తవ్వాల్సి వస్తే ఇది 5వ కాంటూరు పరిధిలో ఉందని, వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం నేరమని అధికారులు చెబుతున్నారు. యంత్రాలతో తవ్వాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని డిప్యూటీసీఎం పవన్కు ఇచ్చిన ఫిర్యాదుపై వివరణలో జిల్లా అధికారులు పేర్కొన్నారు. యథేచ్ఛగా బోర్లు వినియోగం 5వ కాంటూరులో నుంచి విద్యుత్ సరఫరా నిషేధం. అయినా ఇక్కడ ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరా అవుతోంది. చెరువుల వద్దకు నేరుగా తీగల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చెరువుల వద్ద అక్రమ బోర్లు వె లుస్తున్నాయి. ఈ విషయం వన్యప్రాణి సంరక్షణ, అటవీ శాఖ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో అటువైపు చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అటవీ శాఖ సిబ్బంది చెరువుల వద్దకు వచ్చి విద్యుత్ వైర్లను కట్ చేసి చర్యలు తీసుకున్నట్టు హడావుడి చేస్తున్నారు. మరుసటి రోజే విద్యుత్ తీగలను కలిపి విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆక్రమణదారులు చూసుకుంటున్నారు. విద్యుత్ బోర్ల ద్వారా భూగర్భ జలాలను తోడుతున్నా ఏ శాఖ అధికారులూ కన్నెత్తి చూడటం లేదు. యథేచ్ఛగా ఆక్వా సాగు 5వ కాంటూరులోపు ప్రభుత్వ భూముల కబ్జా! కాలువల నీటిని చెరువుల్లో నింపుతున్నట్టు ఫిర్యాదులు అనధికార బోర్లతో ఆక్వా సాగు కనీసం సర్వే కూడా చేయలేదు ఖండ్రిక కోడు ఆక్రమణలు తొలగించాలని గతేడాది అక్టోబర్లో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు ఫిర్యాదు చేశాను. ఎగువనున్న రైతులు వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని, సర్వే చేసి కబ్జాదారుల నుంచి ఖండ్రిక కోడును ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నా. దీనికి ప్రభుత్వ అనుమతి కావాలని ఫిర్యాదుకు వివరణ ఇచ్చారే తప్ప ఇప్పటివరకూ కనీసం సర్వే కూడా చేయలేదు. – తుమ్మూరి శ్రీనివాసు, దేవరగోపవరం -
హ్యాండ్బాల్ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–19 జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20న విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు. -
విద్యార్థుల బహుముఖ ప్రతిభ అభినందనీయం
తాడేపల్లిగూడెం: చదువుతో పాటు, ఇతర రంగాల్లో విద్యార్థులు బహుముఖ ప్రతిభ ప్రదర్శించడం అభినందనీయమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. శుక్రవారం నిట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నిట్కు చెందిన విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, దీంతో అనేక పురస్కారాలను అందుకుంటున్నందుకు అభినందనీయమన్నారు. సీనియర్ విద్యార్థుల స్ఫూర్తితో జూనియర్లు ప్రేరణ పొంది అన్ని విషయాలలో అన్ని రంగాలల్లో అగ్రగామిగా ఉండాలన్నారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులను అందించారు. బీటెక్ 2021–25కు చెందిన బీటెక్ ఆఖరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలిదిండి పవన్తేజ సత్యవర్మను , తుమ్మూరి మంజునాథ్లను అభినందించారు. ఆలిండియా నిట్ పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన ఎస్.హర్షిత్ను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్రెడ్డి, బ్యాంక్ ఆప్ బరోడా పెదతాడేపల్లి బ్రాంచ్మేనేజర్ ఎం.కేదారి తదితరులు పాల్గొన్నారు. -
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే
20 వేల కిలోమీటర్లు వచ్చి.. గుడ్లు పెట్టి.. తాము జన్మించిన చోటే మళ్లీ గుడ్లు పెట్టే జీవి సముద్ర తాబేలు మాత్రమే. వీటిలో ఎన్ని రకాలున్నా సముద్ర పర్యావరణాన్ని కాపాడటంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ముఖ్యమైనవి. ఇవి రెండడుగుల వరకు పొడవు, సుమారు 500 కేజీల వర కు బరువు ఉంటాయి. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ తాబేళ్లు ఎక్కువగా జపాన్, ఆస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. జీవితాంతం సముద్రంలో గడిపే ఈ జీవులకు స్థిర నివాసం ఉండదు. కేవలం గుడ్లు పెట్టేందుకు మాత్రమే భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఒడిసా, ఆంధ్రప్రదేశ్లోని ఒడ్డుకు చేరుకుని ఒక్కో తాబేలు 60 నుంచి 150 గుడ్లు పెట్టి ఎవరూ గుర్తుపట్టకుండా ఇసుకతో కప్పేసి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. రాష్ట్రంలోని సూర్యలంక, పలుచోట్ల వీటి సంరక్షణకు గతంలోనే కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి మాంసానికి ఎక్కువగా డిమాండ్ ఉండటంతో కొందరు వీటిని వేటాడి మాంసాన్ని అమ్ముతుంటారు. ఇవి అంతరించిపోకుండా సముద్ర తాబేళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాబితాలో చేర్చి సంరక్షిస్తోంది. సాక్షి, భీమవరం/ నరసాపురం రూరల్: ఉభయ చరజీవుల్లో తాబేళ్లు ఒకటి. తాబేళ్లలో పలురకాలు ఉన్నా ఆలివ్ రిడ్లే రకం వెరీ స్పెషల్. తాబేళ్ల జాతుల్లో ప్రత్యేకమైనవిగా చెప్పుకునే ఆలివ్ రెడ్లీ తమ సంతానోత్పత్తికి పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుంటున్నాయి. ఇటీవల దీనిని గుర్తించిన జిల్లా అటవీ శాఖ వాటి గుడ్ల కోసం చినమైనివాలంకలో తొలిసారిగా సంరక్షణ కేంద్రం ఏర్పాటుచేసింది. ఇప్పటివరకూ 116 తాబేళ్లకు చెందిన 12,341 గుడ్లను సేకరించి వాటి నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు వీలుగా ఇక్కడ భద్రపరిచారు. 19 కిలోమీటర్ల తీరం జిల్లాలోని నరసాపురం మండలం మర్రితిప్ప నుంచి మొగల్తూరు మండలం మోళ్లపర్రు వరకు 19 కి లోమీటర్లు మేర సముద్ర తీరం ఉంది. ఈ ఏడాది జనవరిలో పదుల సంఖ్యలో మృత ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెదమైనివానిలంక, చినమైనివానిలంక గ్రామాల్లోని తీరానికి కొట్టుకురావడాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో చినమైనివానిలంక తీరంలోని ఓ చోట తాబేలు గుడ్లు ఉండటాన్ని గుర్తించిన అధికారులు సంతానోత్పత్తికి తాబేళ్లు ఇక్కడికి వస్తున్నాయని నిర్ధారించారు. కుక్కలు, ఇతర జంతువులు, ఆకతాయిలు నుంచి గుడ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ముందుగా గుర్తించిన గుడ్లను తరలించే వీలులేక వాటి రక్షణ కోసం చుట్టూ పొదలను ఏర్పాటుచేశారు. జిల్లాలో తొలిసారిగా.. తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని తొలిసారిగా జిల్లాలోని చినమైనివానిలంక తీరం వద్ద జనవరిలో అటవీశాఖ ఏర్పాటు చేసింది. రోజూ సంరక్షణ కేంద్రం సిబ్బంది తీరం వెంబడి తిరుగుతూ తాబేలు అడుగుల ఆనవాళ్లను బట్టి గుడ్లు పెట్టిన చోటును గుర్తిస్తున్నారు. తాబేలు గుడ్లు పెట్టిన తర్వాత అవి దెబ్బతినకుండా రక్షణ కోసం పైపొరగా వాటిపై రసాయనాలు విడుదల చేస్తుంది. ఈ రక్షణ పొర దెబ్బతినకుండా జాగ్రత్తగా గుడ్ల ను సేకరిస్తున్నారు. సంరక్షణ కేంద్రంలో 10 అంగుళాల లోతులో గుండ్రపు గొయ్యి తీసి వాటిలో 100 నుంచి 150 వరకు గుడ్లను పెట్టి ఇసుకతో కప్పుతున్నారు. గత రెండు నెలల్లో 12,341 గుడ్లు సేకరించి హేచరీలో భద్రపరిచారు. గొయ్యిలోని గుడ్లను ఎప్పుడు సేకరించింది?, ఎన్ని భద్రపరచిందనే వివరాలను గొయ్యి వద్ద స్లిప్పులపై నమోదుచేస్తున్నారు. సహజసిద్ధంగా రెండు నెలల వ్యవధిలో గుడ్ల నుంచి తాబేలు పిల్లలు బయటకు వస్తాయని అటవీ అధికారులు తెలిపారు. సముద్ర జీవులపై స్థానికులకు అవగాహన కలిగేలా తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టే కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు. కడలి తీరం.. కూర్మాల ఆవాసం సంతానోత్పత్తి కోసం సముద్ర తాబేళ్ల రాక గుర్తించిన అటవీ శాఖ గుడ్ల సంరక్షణకు హేచరీ చినమైనివానిలంక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటివరకూ 12,341 గుడ్ల సేకరణ తాబేళ్ల సంరక్షణకు చర్యలు పర్యావరణ సమతుల్యతకు సముద్ర జీవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చినమైనివానిలంక వద్ద తాబేళ్ల గుడ్ల సంరక్షణకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో వాటి రాకకు ఆటంకం కలగకుండా స్థానికులు సహకరించాలి. – చదలవాడ నాగరాణి, కలెక్టర్ రూ.10 లక్షలతో బడ్జెట్ జిల్లాలోని తీర ప్రాంతంలో గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు రావడం గుర్తించి తొలిసారిగా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. రానున్న సీజన్లో లక్షకు పైగా గుడ్లను సంరక్షించే లక్ష్యంతో శాశ్వత సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – కిరణ్, జిల్లా అటవీశాఖ అధికారి. -
5 వేల నీటి కుంటల నిర్మాణం లక్ష్యం
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): జిల్లాలో 5 వేల నీటి కుంటల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటివరకూ 2,389 పనులు మంజూరు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రపంచ జల దినోత్సవం, పల్లె పండుగ కార్యక్రమంపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి హాజరయ్యారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన నీటి కుంటల నిర్మాణాలను జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంట నీటి కుంటల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. జిల్లావ్యాప్తంగా 850 గోకులం షెడ్డులు మంజూరు కాగా ఇప్పటికే 623 పూర్తయి మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. పల్లె పండుగ కింద జిల్లాలో 162.33 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. పంచాయితీరాజ్ ద్వారా ఇప్పటివరకూ 155.29 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. డ్వామా పీడీ కె.వెంకట సుబ్బారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి షేక్ హబీబ్ బాషా, జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, డీపీఓ కె.అనురాధ, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎంవీ రమణమూర్తి పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో దోహాదపడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యా యమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్ కుమార్ అ న్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు, సోష ల్ వర్కర్ల జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎం.సునీల్కుమార్ మాట్లాడుతూ ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో తెలుసుకున్న మెలకువలతో మరింత నైపుణ్యంతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన, చట్టపరమైన షరతులతో రాజీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, బార్ అసో సియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. టెన్త్ పరీక్షలకు 22,356 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 22,356 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22,735 మంది రెగ్యులర్ విద్యార్థులకు 22,288 మంది హాజరయ్యారు. ఒకసారి ఫెయిలైన వారిలో 133 మందికి 68 మంది హాజరయ్యారు. జిల్లాలోని 64 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్య పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న టెన్త్ తెలుగు పరీక్షకు 460 మంది విద్యార్థులకు 402 మంది హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు ఆరుగురికి ఆరుగురు హాజరయ్యారు. తొమ్మిది కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో.. భీమవరం: జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 21,867 మంది విద్యార్థులకు 398 మంది గైర్హాజరయ్యారన్నారు. ఏపీఓఎస్ఎస్ తెలుగు పరీక్షకు 461 మందికి 368 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. నైపుణ్యంతో అపార అవకాశాలు భీమడోలు: నైపుణ్యాలు గల యువతకు ఉద్యో గ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా ప్లేస్మెంట్ అధికారి రవి శ్యామ్ అన్నారు. భీమడోలు వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కల్పనా శాఖల సంయుక్త ఆ ధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 10వ తరగతి ఆపై చదివిని పలువురు నిరుద్యోగులు హాజరయ్యారు. డైకిన్, ముత్తూట్ ఫైనాన్స్, అరిజియో ఫైనాన్స్ కంపెనీల్లో 25 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కళాశాల ప్రి న్సిపల్ బొమ్ము రవికుమార్, నైపుణ్యాభివృద్ది సంస్థ ప్రతినిధులు జే.రాము. ప్రవీణ్, కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీ అరెస్ట్ భీమవరం: భీమవరం మండలం చినఅమిరంలో నిధుల దుర్వినియోగం కేసులో పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన సాగిరాజు కిషోర్గోపాల్ కృష్ణంరాజును శుక్రవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఆర్జే జయసూర్య తెలిపారు. చినఅమిరం పంచాయతీలో సుమారు రూ.3.63 కోట్లు నిధులు దుర్వినియోగం కాగా అధికారుల ఫిర్యాదు మేరకు కృష్ణంరాజును అరెస్ట్ చేశామన్నారు. అతడిని భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. నిధుల గోల్మాల్పై విచారణ పెనుగొండ: మండలంలోని ములపర్రు ప్రాథమిక సహకార సంఘంలో 2018లో రూ.90 లక్షలు గోల్మాల్ కాగా దీనిపై శుక్రవారం విచారణ చేపట్టారు. అప్పటి పాలకవర్గ సభ్యులను అప్పట్లో ప్రజలు, డిపాజిటర్లు, పాలకవర్గ సభ్యులు నిలదీయడంతో రూ.50 లక్షలు చెల్లించారు. మిగతా రూ.40 లక్షలు అప్పటినుంచి రికవరీ కాలేదు. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎంఎం రెహమాన్ ములపర్రు సొసైటీలో విచారణ చేపట్టారు. విచారణలో వచ్చిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు ఆయన చెప్పారు. -
మోటార్ సైకిల్కు నిప్పు పెట్టిన దొంగలు
కామవరపుకోట: ఒక మోటార్ సైకిల్ నిప్పంటించి కాల్చి వేసి, వేరొక మోటార్ సైకిల్ దొంగిలించిన ఘటన ఈస్ట్ యడవెల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కొణతం స్వామి ఇంటి ఆవరణలో గురువారం రాత్రి పెట్టిన హోండా షైన్ మోటార్ సైకిల్ శుక్రవారం ఉదయానికి పూర్తిగా కాలిపోయి కనిపించింది. అదే రోజు రాత్రి ముక్కు కృపారాజు ఇంటి ఆవరణలో ఉన్న హోండా షైన్ మోటార్ సైకిల్ దొంగలు దొంగలించిపోయారు. ఈ ఘటనపై బాధితులు తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలువలో స్నానానికి దిగి విద్యార్థి గల్లంతు పెంటపాడు: మండలంలోని పరిమెళ్ల చినకాపవరం కాలువలో డ్యాం వద్ద స్నానానికి దిగి ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 8 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరిమెళ్ల గ్రామ శివారు చినకాపవరం కాలువలోకి స్నానాలు చేసేందుకు వెళ్లారు. కొంతసేపు వారంతా కాలువలో ఆటలాడారు. ఉన్నట్టుండి ఒక విద్యార్థి అయిన గుంటూరు జిల్లా మండేపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు వరప్రసాద్ (20) ప్రమాదవశాత్తూ కాలువ లోతు తెలియక కొట్టుకుని పోయాడు. వెంటనే సహచర విద్యార్థులు, స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా రెస్క్యూ సిబ్బంది సాయంతో పరిసర ప్రాంతమంతా రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా ప్రసాద్ ఆచూకీ లభించలేదు. ఫైర్ అధికారి జీవీ సుబ్బారావు, ఎస్సై స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పరిశీలించారు. కాపర్ వైరు చోరీ కేసులో 8 మంది అరెస్ట్ ఎంవీపీకాలనీ: విశాఖపట్నంలోని ఎంవీపీకాలనీలో పలు చోట్ల డ్రిల్లింగ్ చేసి కాపర్ దొంగతనానికి పాల్పడిన కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు ద్వారకా క్రైమ్ సీఐ చక్రధరరావు తెలిపారు. నగరంలో ఎనిమిదేళ్ల క్రితం కాపర్వైరుతో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ పనులు చేశారు. ప్రస్తుతం ల్యాండ్ లైన్ సేవలు నిలిచిపోవడంతో ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో కాపర్ వైర్ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎంవీపీకాలనీలో రాత్రి పూట అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్ చేసి 800 మీటర్ల కాపర్ వైరు చోరీ చేశారు. దీనిపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి చుట్టురి మురళీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై బయటపడింది. ఈ కేసులో పెందుర్తికి చెందిన ఆసనాల పిట్టోడు(ఏ1), ఏలూరుకు చెందిన బి.శ్రీను, జి.గోవర్ధన్, బి.ఏడుకొండలు, బి.రాజు, సీహెచ్ దుర్గాప్రసాద్, డి.రాజేష్, బి.ప్రసాద్ అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. నిందుతుల నుంచి 300 కిలోల కాపర్ వైరుతో పాటు టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
ముగిసిన ఆలిండియా టెన్నిస్ టోర్నమెంట్
భీమవరం: స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నీస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. 35,45, 55, 65, 75 ఏళ్ల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీలు నిర్వహించారు. 45 ప్లస్ సింగిల్స్లో ఎంవీఎల్ఎన్ రాజు, 55 ప్లస్ సింగిల్స్లో మణిందన్, 65 ప్లస్ డబుల్స్లో ఆనందస్వరూప్, శ్రీనివాస్, 65 ప్లస్ సింగిల్స్లో వి.శ్రీనివాసరెడ్డి, 70 ప్లస్ సింగిల్స్లో సేతు, 70 ప్లస్ డబుల్స్లో సన్యాసిరాజు, గజపతి, 75 ప్లస్ డబుల్స్లో అశోక్రెడ్డి, సాయి రాంబాబు విజేతలుగా నిలిచారు. టోర్నమెంట్ విజేతలకు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లూరి పద్మరాజు, పెన్మెత్స వెంకటరామరాజు, టోర్నమెంట్ సెక్రటరీ వీవీఎస్ సుబ్రహ్మణ్యంరాజు, ఎ.రాంబాబు బహుమతులు అందజేశారు. ల్యాప్టాప్లు, టచ్ ఫోన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ట్యాప్లు, బదిరులకు టచ్ ఫోన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా మేనేజరు బి.రామ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 08812–234146 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. పంచాయతీ కార్యాలయంలో రూ.91 వేలు చోరీ ఉంగుటూరు: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.91 వేలు చోరీకు గురైంది. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు వసూలు చేసిన బీరువాలో పెట్టి తాళం వేశారు. అయితే గురువారం ఉదయం ఆఫీసు తీసేసరికి బీరువా తాళం పగలగొట్టి ఉండడంతో పంచాయతీ కార్యదర్శి పరిశీలించి చోరీ జరిగిందని నిర్ధారించారు. ఈ మేరకు ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా ఏలూరు (టూటౌన్): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో తలపెట్టిన ఉద్యోగుల సమ్మె వాయిదా పడినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షులు డి.శ్రీనివాస్ మోహాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఢిల్లీలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, డిపార్ట్మ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెంట్రల్ లేబర్ కమిషన్ మధ్యన శుక్రవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేశారని పేర్కొన్నారు. -
బాలిక హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా తడికలపూడి మండలం జీలకర్రగూడెంలో గుంటుపల్లి గుహల వద్ద బాలికపై నలుగురు అగంతకులు లైంగికదాడికి పాల్పడి ఆపై హతమార్చిన ఘటనలో నిందితులకు జీవిత ఖైదును విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. శుక్రవారం రాత్రి ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు గుంటుపల్లి గుహల వద్దకు సరదాగా గడిపేందుకు వచ్చిన ప్రేమ జంటపై నలుగురు అగంతుకులు దాడి చేశారు. బాలికపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ప్రియుడిని సైతం దుంగకర్రతో కొట్టి గాయపర్చారు. దీనిపై గుహల ప్రాంతంలో ఆర్కియోలాజికల్ సర్వే సిబ్బంది వడమాల మునిరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోచుకునేందుకు వెళ్లి.. హతమార్చి.. నిందితులను కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రారం గ్రామానికి చెందిన పొట్నూరి రాజు, ద్వార కాతిరుమల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య, తుపాకుల గంగయ్య, కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిసిలాల గ్రామానికి చెందిన కొమరగిరి నాగరాజుగా గుర్తించారు. వీరు ఒంటరిగా ఉన్న ప్రేమ జంటను గమనించి వారిని దోచుకునేందుకు వెళ్లారు. కత్తి, దుంగకర్రతో ప్రేమ జంట వద్దకు వెళ్లిన వీరు డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో పొట్నూరి రాజు దుంగకర్రతో తీవ్రస్థాయిలో తలపై కొట్టడంతో ప్రియుడు అక్కడే పడిపోయాడు. అనంతరం బాలిక వద్దకు వెళ్లి ఆమె దుస్తులను చించివేసి కర్రతో తలపై బలంగా కొట్టి లైంగికదాడికి పా ల్పడ్డారు. తీవ్ర గాయాలైన ప్రియుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఆరేళ్ల పాటు ఏలూరు పోక్సో కోర్టులో విచారణ కొనసాగింది. జీవిత ఖైదు.. రూ.10 వేల జరిమానా పోక్సో కోర్టు న్యాయమూర్తి సునంద శుక్రవారం తుది తీర్పును వెల్లడించారు. నలుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐపీసీ 397, 376 (ఎ), సెక్షన్ 4 పోక్సో, 302 ఐపీసీ, 25 (1ఎ) భారతీయ ఆయుధాల చట్టం, 27 భారతీయ ఆయుధ చట్టం మేరకు కఠిన శిక్షలు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మృతురాలు తల్లిదండ్రులకు రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రియుడు నవీన్కుమార్కు తగిన పరిహారం అందజేయాలని డీఎల్ఎస్ఏ ఏలూరుకు లేఖ రాశారు. పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోనే సీతారామ్ బాధితుల తరఫున వాదించగా అప్పటి చింతలపూడి సీఐ యూజే విల్సన్, మరో సీఐ పి.రాజేష్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసుపై రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. విలేకరుల సమావేశంలో ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ హబీబ్బాషా, మహిళా పోలీస్స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, డీసీఆర్బీ ఎస్సై రాజారెడ్డి, తడికలపూడి ఎస్సై చెన్నారావు, ఏపీపీ డీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. లైంగికదాడి ఆపై హత్య శిక్ష ఖరారు చేసిన పోక్సో కోర్టు 2019లో గుంటుపల్లి గుహల వద్ద ఘటన -
గంగానమ్మ విగ్రహ తొలగింపుతో ఉద్రిక్తత
నూజివీడు : పట్టణంలోని కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్లో రావి చె ట్టు వద్ద ఉన్న గంగానమ్మ విగ్రహాలను శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో యడవల్లి రవిచంద్ర(32) అనే అతను గునపంతో తవ్వి ధ్వంసం చేసి పక్కన పడేశాడు. అంతేకాకుండా అక్కడే ఉన్న దేవుడి ఫొటోలను సైతం పక్కన పడేశాడు. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే స్పందించి యడవల్లి రవిచంద్రను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇది తమ సొంత స్థలమని, అందులో ఎవరెవరో వచ్చి విగ్రహాలు పెట్టి తాము ఏర్పాటు చేసిన గుడి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, అసలు తమ పట్టా భూమిని తాము స్వాధీనం చేసుకోవడానికి తవ్వినట్లు రవిచంద్ర విచారణలో తెలిపాడని సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణతో పాటు పట్టణానికి చెందిన పలువురు పెద్దలు ఇప్పటివరకు ఎక్కడైతే గంగానమ్మ విగ్రహం ఉందో మళ్లీ అక్కడే విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి
పెనుమంట్ర: మండలంలోని నెగ్గిపూడి గ్రామ పంచాయతీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టిప్పర్ లారీ స్కూటర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్టేరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సిర్ల సుజాత (55) అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహం తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. భోజన విరామ సమయంలో తన యాక్టివా మోటార్ సైకిల్పై పాఠశాల నుంచి నెగ్గిపూడిలోని ఇంటికి వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె భర్త సిర్ల చిన్న సూర్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి ఏలూరు(మెట్రో): సరెండర్ లీవ్లు, ఆర్జిత సెలవుల బకాయిలు వెంటనే చెల్లించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6200 కోట్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఉద్యోగ వర్గానికి రెండు విడతల సరెండర్ లీవులు సీపీఎస్ ఉద్యోగులకు ప్రాన్ అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశౠరు. రిటైలర్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్, ఆర్జిత సెలవుకు సంబంధించిన బకాయిలు, పోలీసులకు సరెండర్ లీవ్ నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు కనకదుర్గమ్మ గుడి వద్ద శుక్రవారం ఓ మోటార్ బైక్ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం వేగివాడకు చెందిన గంటా భరత్(21), గోపాలపురానికి చెందిన చల్లా సుబ్రహ్మణ్యం ఇద్దరూ స్నేహితులు. వారు శుక్రవారం వ్యక్తిగత పనుల నిమిత్తం ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం బైక్పై వెళ్లి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు భీమడోలు వైపుగా వస్తున్నారు. కనకదుర్గ గుడి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయాయ్యి. వారిని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి ఏలూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంటా భరత్(21) మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ తరలించారు. ఈ మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు మార్చి నెలాఖరులోగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. యూనియన్ పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం స్థానిక సూర్యవంశీ ఎన్క్లేవ్లో రీజినల్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆరేళ్లు గడిచినా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. మూడు వేల మంది సిబ్బంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పదోన్నతులతో పాటు 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరండర్ లీవ్ సొమ్ములు దశలవారీగా చెల్లించాలని కోరారు. తొలుత పట్టణంలో ఈయూ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.డీ ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్,సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల బీమారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
పెదవేగి: మండలంలోని విజయరాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం కోకో రైతుల రాష్ట్ర కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గా కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోళ్ల సుబ్బారావు (పశ్చిమగోదావరి), పానుగంటి అచ్యుతరామయ్య (ఏలూరు), ఉప్పుగంటి భాస్కరరావు (కోనసీమ), గుదిబండి బండి వీరారెడ్డి (ఏలూరు), మార్ని శ్రీనివాసరావు (తూర్పుగోదావరి) సహాయ కార్యదర్శులుగా ఉప్పల కాశీ (తూర్పుగోదావరి), కొసరాజు రాధాకష్ణ (ఏలూరు), కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ (కోనసీమ), కోశాధికారిగా జాస్తి కాశీ బాబు (ఏలూరు) మరో 35 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలని 24, 25 తేదీల్లో కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: మండలంలోని పెనుమల్లి వద్ద శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామతులు ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వివరాల ప్రకారం మండలంలోని సంఖర్షణపురానికిచెందిన ముత్యాల చక్రవర్తి(32), మరో ఐదుగురు కూలీలతో మినుము నూర్పిడి చేసేందుకు ట్రాక్టర్పై కూలి పనికి వెళ్తున్నారు. పెనుమల్లి సమీపానికి వెళ్లగానే మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదం నుంచి ఐదుగురు కూలీలు తప్పించుకోగా ట్రాక్టర్పై ఉన్న మినుము నూర్పిడి యంత్రం చక్రవర్తిపై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాద సమయంలో స్థానికులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర గాయాలతో అరగంట సేపు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడాడు. సమాచారం అందుకున్న బంధువులు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చక్రవర్తి మృతదేహంతో గుడివాడ నుంచి బయల్దేరిన గ్రామస్తులు చక్రవర్తి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేయాలని నిర్ణయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది గుడివాడ నుంచి వస్తున్న చక్రవర్తి మృతదేహాన్ని జాతీయ రహదారిపై కోడూరు వద్ద అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. మృతుడి తరఫు వ్యక్తులకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తరఫు వ్యక్తులకు మధ్య రాజీ చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు. -
కబడ్డీ పోటీల్లో తృతీయ స్థానం
పెదపాడు : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన 34వ సబ్జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల కబడ్డీ పోటీల్లో పెదపాడు మండలం వీరమ్మకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తృతీయ స్థానం సాధించినట్లు హెచ్ఎం రాంప్రసాద్ తెలిపారు. కబడ్డీ పోటీల్లో విద్యార్థులు హర్ష, శాంతరాజు ప్రతిభ చాటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. తుది దశకు టెన్నిస్ పోటీలు భీమవరం: భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వెర్టెక్స్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. గురువారం నిర్వహించిన పోటీల్లో ఫలితాలివి. 75+ డబుల్స్ విభాగంలో అశోక్రెడ్డి–సాయి రాంబాబు, 70+ డబుల్స్ విభాగంలో సన్యాసిరాజు–గజపతి, 65+ డబుల్స్ విభాగంలో ఆనంద స్వరూప్– శ్రీనివాస్ జోడి విజయం సాధించారు. 65+ సింగిల్స్ విభాగంలో వి.శ్రీనివాసరెడ్డి, 70+ సింగిల్స్ విభాగంలో సేతు విజేతలుగా నిలిచారు. -
నకిలీ బంగారం అంటగడుతున్న ముఠా అరెస్టు
కై కలూరు: బంగారపు దుకాణాల వద్దకు కారులో దర్జాగా వెళతారు.. అత్యవసరం అంటూ రూ.3 లక్షల విలువ చేసే బ్రాస్లెట్ తాకట్టు పెట్టుకుని కేవలం రూ.1.50 లక్షలు ఇవ్వండనీ అడుగుతారు. హాల్మార్క్ గుర్తుతో పాటు హైదరాబాద్లో కొనుగోలు చేసిన రశీదు ఇస్తారు. చివరికు అది ఒన్ గ్రామ్ బంగారంగా తేలుతోంది. ఈ విధంగా ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో మోసాలకు పాల్పడిన ముఠాను కై కలూరు టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టౌన్ సీఐ పి.కృష్ణ, ఎస్సైలు డి.వెంకట్కుమార్, డి.శ్రీనులతో కలసి కేసు వివరాలను స్టేషన్లో గురువారం వెల్లడించారు. నెల్లూరు జిల్లా రామవరప్పాడుకు చెందిన కడియాల వెంకటేశ్వరరావు(40) భార్యతో కలసి హైదరాబాదు ఎల్బీ నగర్లో ఒన్ గ్రామ్ బంగారం దుకాణం నడుపుతున్నాడు. పెద్ద తిరుపతిలో కొండపైకి భక్తులను జీపుల్లో తరలించే విజయనగం జిల్లా మెంటాడకు చెందిన చొక్కాపు మణికంఠ(32), నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఉన్నం చంద్రమోహన్(54)లను కలుపుకుని వెంకటేశ్వరరావు మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 13న కై కలూరు మహాలక్ష్మీ గోల్డ్ షాప్లో బ్రాస్లెట్ తాకట్టు పెట్టి రూ.90 వేలు యజమాని మెంట దీలిప్ నుంచి తీసుకున్నారు. తర్వాత సమీపంలోని కార్తీకేయ ఫైనాన్స్ యజమాని శివవరప్రసాద్కు చైన్ తాకట్టు పెట్టి రూ.1,50 లక్షలు తీసుకున్నాడు. ఆ సమయంలో అతనికి అనుమానం రావడంతో చాకుతో బెదిరించి పరారయ్యారు. తర్వాత భీమవరంలో రూ.1.50 లక్షలు, గుడివాడలో రూ.1.50 లక్షలు, గణపవరంలో రూ.1.30 లక్షలకు నకిలీ బంగారు వస్తువులు అంటగట్టి నగదుతో పరారయ్యారు. తిరిగి కై కలూరులో మోసాలకు పాల్పడడానికి గురువారం వచ్చిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.88 వేలు నగదు, 4 చైన్లు, 4 బ్రాస్లెట్లు, 3 సెల్ఫోన్లు, తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ పి.కృష్ణ, ఎస్సైలు డి.వెంకట్కుమార్, డి.శ్రీనులను ఎస్పీ అభినందించారు. గోల్డ్ షాపులే టార్గెట్గా మోసాలు కై కలూరు పోలీసులకు చిక్కిన ఘరానా కేటుగాళ్లు -
ఏకపక్షంగా గేదెల పాక తొలగింపు
నూజివీడు: తుక్కులూరులో పదేళ్లుగా రెవెన్యూ పోరంబోకు భూమిలో ఉన్న గేదెల పూరి పాకను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ పాక వైఎస్సార్సీపీ సానుభూతి పరుడైన కొలుసు భాస్కరరావుకు చెందినది కావడంతో ఈ నెల 18న అధికారులు ఆఘమేఘాలపై వచ్చి తొలగించడం గమనార్హం. అదే గ్రామంలో మచిలీపట్నం–కల్లూరు జాతీయ రహదారి మార్జిన్లను ఆక్రమించుకొని అనేక దుకాణాలున్నప్పటికీ వాటి వైపు మాత్రం రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కొలుసు భాస్కరరావు వైఎస్సార్సీపీ సానుభూతి పరుడుగా ఉండటమే కాకుండా అతని భార్య గ్రామంలో అమూల్ పాలకేంద్రాన్ని నడుపుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అమూల్ కేంద్రాన్ని వదిలేయమని ఆమైపె ఒత్తిడి తీసుకువస్తున్నారు. దానికి నిరాకరించడంతో తమ మాట వినడం లేదని చెప్పి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేయించి గేదెల పాకను తొలగించేలా చేశారు. దీంతో భాస్కరరావు తన గేదెలను కట్టేసుకోవడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుమతి లేకుండా వెంచర్.. పంచాయతీ అభ్యంతరం ఉంగుటూరు: కై కరం పంచాయతీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యక్తులు అనుమతి లేకుండా వేసిన ప్రైవేట్ వెంచర్ను గ్రామ పంచాయతీ అడ్డుకుంది. కై కరం పంచాయతీలో రియల్ ఎస్టేట్ వ్యక్తులు వెంచర్ వేసి స్థలాలు విడదీసి ప్లాట్లుగా విభజించి రహదార్లు నిర్మిస్తున్నారు. ప్లాట్లు అమ్మబడును అని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం గ్రామ పంచాయతీ వారు అనుమతులు లేకుండా ఇలా చేయకూడదని బోర్డు ఏర్పాటు చేశారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యక్తులు గురువారం ఆ బోర్డును తొలగించేసి స్థలాలను చదును చేశారు. దీంతో పంచాయతీ సెక్రటరీ రాజు గురువారం మరో బోర్డును ఏర్పాటుచేసి వారిని హెచ్చరించారు. వూడా పరిధిలో ఉండటంతో వాళ్లుకు కూడా పంచాయతీ కార్యదర్శి సమాచారాన్ని అందించారు. -
సునీతా విలియమ్స్కు శుభాకాంక్షలు
ఏలూరు (టూటౌన్): అగ్గిపుల్లపై వ్యోమగామి సునీతా విలియమ్స్ చిత్రాన్ని చిత్రీకరించి అబ్బుర పరుస్తున్నారు ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్బాబు. తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపి క్షేమంగా భూమిపైకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని తనదైన శైలిలో సునీతా విలియమ్స్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ బాబుకు పలువురు అభినందనలు తెలియజేశారు. చెల్లని చెక్కు కేసులో జైలు శిక్ష, జరిమానా నూజివీడు: చెక్కు చెల్లని కేసులో ఒక వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన ముసునూరు ప్రభుదాస్కు గోపవరంనకు చెందిన వల్లభనేని గోపాలకృష్ణ 2017 జూన్ 25న రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత బాకీ చెల్లించే నిమిత్తం ప్రభుదాస్ రూ.5 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును గోపాలకృష్ణ బ్యాంకులో వేయగా ప్రభుదాస్ బ్యాంకు ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు చెక్కును తిప్పి పంపారు. దీంతో గోపాలకృష్ణ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం స్పెషల్ మేజిస్ట్రేట్ ప్రభుదాస్కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్ ఉద్యోగి మృతి చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పాత చింతలపూడిలో రిటైర్డ్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. డి హేమప్రకాష్ (65) రిటైర్డ్ ఉద్యోగి. పాత చింతలపూడిలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అప్పటికే ప్రకాష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా హేమ ప్రకాష్ను ఆస్తి కోసం కుటుంబ సభ్యులే కొట్టి చంపారని మృతుని సోదరుడు మోహన్ ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ఎస్సై కుటుంబరావు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని కంకర అక్రమ తవ్వకాలు
ఉంగుటూరు: కంకర అక్రమ తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కూటమి నాయకులే ఈ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉంగుటూరు మండలం మెట్టప్రాంతంలో సుమారు 20 కిలోమీటర్లు పోలవరం కుడి కాలువ ఉంది. ఈ కాలువ గట్టుపై రాత్రినక పగలనక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారు. దీంతో కాలువగట్లు స్వరూపాలు మారిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ గట్టు మీద తవ్వకాలు పూర్తికాగా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి సరిహద్దు ప్రాంతంనుంచి భీమడోలు మండలం సరిహద్దు ప్రాంతాల నుంచి కంకర తవ్వి తరలిస్తున్నారు. ఉంగటూరు మండలం కంసాలిగుంట రోడ్డునుంచి గొల్లగూడెం మీదుగా ఈ దందా సాగుతోంది. మట్టి దందాలో వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు సైతం పాలు పంచుకున్నట్లు ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరైనా పలానాచోట కంకర తవ్వి పట్టుకుపోతున్నారని అధికారులకే చెబుతుంటే వెంటనే ఆ విషయాన్ని కంకర మాఫీయా వ్యక్తులకు నిమిషాల వ్యవధిలో చేరవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్ను వివరణ కోరగా తమకు ఎక్కడైనా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు వస్తే వెంటనే కేసులు పెట్టడం జరగుతుందన్నారు. మట్టి అక్రమ తవ్వకాలు జరగకుండా ఇరిగేషన్, రెవెన్యూ ఉద్యోగులను గస్తీ పెడుతున్నట్లు చెప్పారు. మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. -
ఆర్టీసీ రక్షణకు 24న చలో ఢిల్లీ
ఏలూరు (ఆర్ఆర్పేట): దేశంలోని రవాణా రంగ కార్మికులకు ఒక సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న చలో పార్లమెంట్ కార్యక్రమానికి ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల స్థానంలో దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులను తీసుకొని భవిష్యత్తులో ఆర్టీసీలను కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకం వేసిందనీ, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం– ఈ బస్సు స్కీము కూడా ఇందులో భాగమే అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీలను కాపాడుకోవాలనీ, ఈనెల 24న ఢిల్లీలో భారీ ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, ఎస్బీ అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్, డిపో అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ ప్రసాద్, టీకే రావు తదితరులు పాల్గొన్నారు. -
27 నుంచి గుంటూరులో వ్యవసాయ ప్రదర్శన
ఏలూరు(మెట్రో): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈనెల 27 నుంచి 29 వరకు లాంఫామ్ గుంటూరులో దక్షిణ భారత ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఏరువాక కేంద్రం ఏలూరు సమన్వయకర్త డాక్టర్ కె. ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల వ్యవసాయ పద్ధతులు, కూరగాయలు, పండ్ల సాగులో అధునాతన సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం తదితర అంశాల ప్రదర్శనతోపాటు రైతుల–శాస్త్రవేత్తల చర్చా కార్యక్రమాలు ఉంటాయన్నారు. దక్షిణ భారత వ్యవసాయ నిపుణులు రైతులతో సంభాషించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రదర్శనకు రైతులను ఉచితంగా తీసుకెళ్తామని, ఔత్సాహిక రైతులు ఏరువాక కేంద్రం, ఏలూరు వారి ఆఫీసు నెంబర్ (99896 23804)కు సంప్రదించాలని కోరారు. ఏలూరులో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీసిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్ర రూపకల్పనకు గురువారం ప్రారంభ పూజ చేశారు. సెంటిమెంట్, హర్రర్, కామెడీ మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు వెంకట్ జుత్తిగ తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ నిరంతరాయంగా కొనసాగిస్తామని, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే లొకేషన్లు పరిశీలించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో ఇరువురు ప్రముఖ సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తారని, వారి వివరాలు, హీరోయిన్ల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. సినీ నిర్మాత వట్టి శ్యామ్బాబు మాట్లాడుతూ అనన్య చిత్రంలో విలన్ క్యారెక్టర్లో నటించిన అరవింద్ జాలా తమ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. తొలుత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించి నిర్మాత, దర్శకుడు ఇతర తారాగణం సక్సెస్ కావాలని, చిత్రం ప్రజాదరణ పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి ఏలూరు (టూటౌన్): రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్సై పి.సైమన్ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ నందు రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు కృష్ణా జిల్లా వేల్పూరుకు చెందిన నంబూరి రవికుమార్(57)గా గుర్తించినట్లు చెప్పారు. రవికుమార్ మృత దేహాన్ని ఏలూరు సర్వజన ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచామని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలి
ఏలూరు (మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు గురువారం కలెక్టర్ను వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే గ్రేడ్–2 వారికి గ్రేడ్–1 వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. రెవెన్యూ విలేజ్లకు సంబంధం లేకుండా రెండు సచివాలయలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఒక వీఆర్ఓ ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం వల్ల పని భారం పెరుగుతుందని, రెవెన్యూ సేవలు కూడా ఆలస్యం అవుతాయని అన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రితో జరిగే సదస్సులో క్లస్టర్ విధానం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ను కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీనారాయణ, ఏలూరు జిల్లా అధ్యక్షుడు రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అక్బర్, జిల్లా కోశాధికారి రవికుమార్, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, ఏలూరు, పెదవేగి, దెందులూరు, పెదపాడు మండల వీఆరోఓలు పాల్గొన్నారు. -
ఆదుకోకోంటే ఉద్యమమే
సదస్సు తీర్మానాలివీ.. ● అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలి. ● కంపెనీలు రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి. ● కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ● ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి. ● విదేశీ కోకో గింజలు, పొడి, బట్టర్ వంటి దిగుమతులు నిలుపుదల చేయాలి. మన రైతులను నష్టపరిచే పద్ధతుల్లో దిగుమతులు ఉండరాదు. ● కోకో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేయాలి. ● కోకో తోటలు సాగు చేస్తున్న రైతులకు ఉద్యాన శాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ బకాయిలు చెల్లించాలి. పెదవేగి : కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కంపెనీల సిండికేట్తో దోపిడీ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోని 20 దేశాల్లో 20వ స్థానంలో ఉందని, మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేదని చెప్పారు. 80 శాతం కోకోను ఇతర దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత సంవత్సరం కంపెనీలు పోటీపడి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలో గింజలను రూ.1,040 వరకు ధర చెల్లించి కొనుగోలు చేశాయని గుర్తుచేశారు. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్గా మారి అంతర్జాతీయ ధర ఇవ్వడం లేదని చెప్పారు. పైగా అన్ సీజన్ గింజలు కొనుగోలు చేయడం లేదని, సీజన్ కోకో గింజల ధర రోజురోజుకీ తగ్గించి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోకో రైతులు సంఘటితం కావాలి కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్గా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. నిల్వ ఉంచిన గింజలను పచ్చళ్లు పట్టుకోండి అంటూ రైతులను ఎగతాళి చేస్తూ కంపెనీలు మాట్లాడుతుండటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సదస్సులో విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మాధవీలత, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ పామ్ రైతుల సంఘం అధ్యక్షుడు ఉండవల్లి వెంకటరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతులు పాల్గొన్నారు. 24న ధర్నాలు, రాస్తారోకోలు కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గోడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. రాష్ట్రస్థాయి సదస్సులో తేల్చిచెప్పిన కోకో రైతులు కోకో గింజల కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ విజయరాయిలోని సదస్సుకు పెద్ద సంఖ్యలో కోకో రైతుల హాజరు -
అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్తత
బుట్టాయగూడెం: జీలుగుమిల్లిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతిచెందిన విష యం తెలిసిందే. మృతదేహాన్ని గురువారం ఖమ్మం నుంచి బోసు స్వగ్రామానికి తీసుకువస్తుండగా తె లంగాణ, ఆంధ్ర సరిహద్దు వద్ద కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బోసు మృతికి కారణాలు తేల్చాలంటూ భీష్మించారు. సీఐ బి.వెంకటేశ్వరరావు, ఎ స్సైలు నవీన్కుమార్, చంద్రశేఖర్ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, కుటుంబ సభ్యులకు వాదోపవా దం జరిగింది. రాత్రి సమయానికి కూడా ఆందోళన కొనసాగడంతో సరిహద్దు వద్ద కిలోమీటరుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని శుక్రవారం నాటికి నిందితులెవరో తేలుస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. బోసు మృతదేహాన్ని స్వగ్రామం తరలిస్తున్న సమయంలో కూడా పోలీసులు వెంటే ఉన్నారు. మృతదేహానికి శుక్రవారం అంత్యక్రియలు చేస్తామని బంధువులు తెలిపారు. ఇదిలా ఉండా బోసుపై దాడి కేసులో అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. దోషులను ప్రభుత్వం వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు డిమాండ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తి దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా కుటుంబసభ్యుల ఆందోళన -
తాగునీటి సమస్య తలెత్తితే ఊరుకోం
ఏలూరు(మెట్రో): రానున్న వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య తలెత్తితే ఊ రుకోబోమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై అధికారులతో ఆ మె సమీక్షించారు. జిల్లాలో తాగునీటికి సంబంధించి సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారంలోపు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. కాలువలకు నీటిని నిలిపివేసే లోపు గ్రామాల్లో తాగునీటి వనరులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, బోర్వెల్స్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని, రక్షిత తాగునీటి పథకాల్లో ఫిల్టర్బెడ్స్కు మరమ్మతులు చేయించాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పురోగతిలో ఉన్న 325 పనులతో పాటు, ఇంకా ప్రారంభం కాని 108 పనులను జూన్ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, ఐటీ డీఏ పీఓ కె.రాములునాయక్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ ఎస్ఈలు జి.త్రినాథబాబు, పి.నాగార్జునరావు, డీపీఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ నమోదు వేగిరపర్చాలి జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ వివరాలు నమోదును పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఆధార్ మోనటరింగ్ కమిటీ సమావేశాన్ని నర్విహించారు. ఆధార్ ఎన్రోల్మెంట్, ఆధార్ బయోమెట్రిక్, అప్డేట్ అంశాలపై సమీక్షించారు. సారారహిత జిల్లాగా మార్చాలి సారారహిత జిల్లాగా ఏలూరును మార్చేందుకు అ ధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సారా నిర్మూలనా కార్య క్రమం నవోదయం 2.0పై సమావేశం నిర్వహించా రు. ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్తో కలిసి సమీక్షించారు. నవోదయం 2.0పై కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు. మత్తుపదార్థాల నివారణే లక్ష్యం మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నార్కోటిక్ కో–ఆర్డినేషన్ సమావేశాన్ని ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి కె.రత్నప్రసాద్తో కలిసి నిర్వహించారు. డ్రగ్స్ నివారణ, సహాయం కోసం టోల్ ఫ్రీ నం.1972పై విస్తృత ప్రచారానికి స్టిక్కర్లను, కరపత్రాలను, ఆవిష్కరించారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
గళమెత్తిన విద్యుత్ మీటర్ రీడర్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏలూరు విద్యుత్ సంస్థ ఎస్ఈ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం నాయకులు ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరిలో విద్యుత్ సంస్థ సీఎండీతో చేసుకున్న ఒప్పందంలో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న నేపథ్యంలో రా ష్ట్రంలోని 4,500 మంది మీటర్ రీడర్లు ఉపాధి కో ల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ అర్హతను బట్టి విద్యుత్ శాఖలో ఉపాధి కల్పించాలని కో రారు. ప్రతి నెలా వేతనాలు చెల్లించడానికి ఎస్క్రో ఖాతాను తక్షణమే ప్రారంభించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వర రావు, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కోశాధికారి కె.మల్లేశ్వరరావు మాట్లాడారు. -
మన్యంలో మట్టి దందా
బుట్టాయగూడెం: అధికారం మాది.. మేం చెప్పిందే వినాలి.. మేం చేసిందే చూడాలి.. మమ్మల్ని ఆపేదెవడ్రా.. అన్నట్టు సాగుతోంది గిరిజన ప్రాంతంలో మట్టి దందా. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో రాత్రీపగలు తేడాలేకుండా పొక్లయిన్లతో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. కొండలు, గుట్టలను తవ్వుతూ జేబులు నింపుకుంటున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ తతంగమంతా జరుగుతోందని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. తవ్వుకో.. తరలించుకో.. సామాన్యులు ఎవరైనా చెరువులో గుప్పెడు మట్టి తీసుకువెళ్తే వాహనం సీజ్ చేసి అపరాధ రుసుం విధించే అధికారులు మన్యం ప్రాంతంలో నెలల తరబడి మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా నిమ్మను నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి వ్యాపారులు మరింత చెలరేగిపోతున్నారు. చెరువులు, కొండల్లో మట్టి, గ్రావెల్ను తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారు. బుట్టాయగూడెం మండలంలోని దండిపూడి చెరువులో, మర్రిగూడెం చెరువులో, కోయరాజమండ్రి సమీపంలోని దొర మామిడి, గాడిదబోరు సమీపంలో కొండలను తవ్వి గ్రావెల్, మట్టి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జీలుగుమిల్లి మండలంలో కూడా గ్రావెల్, మట్టి అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇటీవల జీలుగుమిల్లి మండలం చీమలవారిగూడెం సమీపంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గట్టును ఆనుకుని ఉన్న ఆర్అండ్ఆర్ భూమిలో పొక్లయిన్లతో మట్టిని తవ్వి తరలించారు. అలాగే బుట్టాయగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతం సమీపంలో కూడా యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ తరలింపులు జరిగాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి : ప్రభుత్వం చేపట్టిన పనులు, రహదారి నిర్మాణాలకు మట్టి, గ్రావెల్ కావాల్సి వస్తే సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. క్యూబిక్ మీటర్కు రూ.50 నుంచి రూ.60 వరకు చెల్లించాలి. వాణిజ్య అవసరాలకు అయితే రూ.135 నుంచి రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ట్రాక్టర్కు రూ.750 నుంచి రూ.800 వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయి తే ఏజెన్సీ ప్రాంతంలో ఇవేమీ అమలుకావడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. చెరువు మట్టి.. కొల్లగొట్టి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు రాత్రీపగలూ తోలకాలు నిబంధనలు మీరినా పట్టని అధికారులు కూటమి నేతల అక్రమాలు ఎలాంటి అనుమతులూ లేవు బుట్టాయగూడెం మండలంలో మట్టి, గ్రావెల్ తోలకాలకు ఎటువంటి అనుమతులు లేవు. ఎవరైనా అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటాం. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. – పీవీ చలపతిరావు, తహసీల్దార్, బుట్టాయగూడెం అడ్డుకట్ట వేయాలి కూటవి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏజెన్సీ ప్రాంతంలో యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. కొందరు చెరు వులు, కొండలను కొల్లగొడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణాకు అధికారులు అడ్డు కట్టవేయాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం -
నీటి ఎద్దడి ఆవరించేను
ఆరుగాలం కష్టించినా అన్నదాతకు సాగులో ఇబ్బందులు తప్పట్లేదు. చివరి దశలోనూ నీటి సమస్యలు వెంటాడుతుండటంతో చేతికందిన పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నాడు. పొలాలకు నీరందించే విషయంలో అధికారుల సమన్వయ లోపం వీరికి శాపంలా మారింది. దెందులూరు మండలం పాలగూడెం శివారు పొలాలు నీటి ఎద్దడితో నెర్రలు తీశాయి. దీంతో కొవ్వలి డ్రెయిన్లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్లతో తోడుకుంటూ చేలకు అందిస్తున్నారు. ఎకరాకు అదనంగా రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని, మునుపెన్నడూ లేనివిధంగా నీటి కోసం అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
‘గేట్’లో విద్యార్థుల ప్రతిభ
ఆర్జీయూకేటీ విద్యార్థులకు 1,000లోపు 30 ర్యాంకులు నూజివీడు: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)లో ఆర్జీయూకేటీ పరిధి లోని నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపు ల్ ఐటీల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని రిజిస్ట్రా ర్ సండ్ర అమరేంద్రకుమార్ గురువారం తెలిపారు. 400 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి అమిరెడ్డి అశోక్ జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించాడన్నారు. ఈసీఈ విద్యార్థులు 125, 201, 655, 679, 875, 907 ర్యాంకులు, సీఎస్ఈ విద్యార్థులు 182, 241, 298, 308, 342, 475, 663, 680, 724, 783, 844, 915, 983, మెకానికల్ విద్యార్థులు 174, 240, 242, 484, 491, 585, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 12, 666 ర్యాంకులతో సత్తాచాటారన్నారు. తాము చేపట్టిన గేట్–25 సపోర్ట్ కార్యక్రమమే విజయానికి కారణమని సెంట్రల్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటీటివ్ ఎ గ్జామ్ సెల్ కో–ఆర్డినేటర్ ఎం.రామకృష్ణ తెలిపారు. సాయిచరణ్కు 9వ ర్యాంక్ కై కలూరు: గేట్ పరీక్షలో కలిదిండి మండలం ఆరుతెగలపాడుకి చెందిన చిలుకూరి సాయి చరణ్ 9వ ర్యాంకు సాధించాడు. చిలుకూరి కిషోర్బాబు కుమారుడు చరణ్ కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్లో గేట్ కోచింగ్ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 77.67 శాతం మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. -
దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్న మాజీ ఎమ్మెల్యే బాలరాజు బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త గంధం బోసు(31) బుధవారం సాయంత్రం మృతి చెందాడు. బోసును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు. బోసుపై దాడి జరిగి 48 గంటలు గడిచినా కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడం పట్ల నియోజకవర్గంలో భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. బోసుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయ కర్త కారుమూరి సునీల్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు డిమాండ్ చేశారు. దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా నిందితులను కనిపెట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో బోసు హత్యతో గంధరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రకమైన హత్యలు జరగడం దారుణమన్నారు. జీలుగుమిల్లి జాతరలో జరిగిన అవకతవకలపై పత్రికల్లో వచ్చిన వార్తలను బోసు ఫార్వార్డ్ చేయడంతో ఆలయ చైర్మన్, టీడీపీ నాయకుడు వెంకటేశ్వరరావు ఫోన్లోనే బోసును బెదిరించిన కొద్దిరోజుల్లోనే బోసుపై దాడి జరగడం, బోసు మృతి చెందడం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని అన్నారు. బోసు మరణం పార్టీకి తీరనిలోటన్నారు. బోసు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. -
కృష్ణా వర్సిటీకి రూ.20 కోట్ల కేటాయింపు
నూజివీడు: కృష్ణా యూనివర్సిటీకి పీఎం ఉష పోగ్రామ్లో భాగంగా రూ.20 కోట్ల నిధులు వచ్చాయని, వీటిలో రూ.2 కోట్లను నూజివీడులోని ఎమ్మార్ అప్పారావు కాలేజీ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు(పీజీ సెంటర్) విడుదల చేసినట్లు కృష్ణా యూని వర్శిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కూన రాంజీ పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ని స్థానిక పీజీ సెంటర్ను బుధవారం ఆయన సందర్శించారు. దీనిలో భాగంగా క్యాంపస్లోని క్యాంటీన్, బాలికల హాస్టల్, నూతనంగా నిర్మించిన అకడమిక్ భవనాన్ని, తరగతి గదులను, లేబొరేటరీలను, బాత్రూమ్లు పరిశీలించారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపాల్ జే.నవీన లావణ్యలతకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా నూతన కోర్సులను యూనివర్శిటీలో ప్రవేశపెడతామన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో యూనివర్శిటీ ఉద్యోగుల జీతాల కోసం రూ.10.50 కోట్లను బడ్జెట్లో కేటాయించిందన్నారు. బాలికల హాస్టల్ వద్ద కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున హాస్టల్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్శిటీ రెక్టార్ ఆచార్య మండవ వెంకట బసవేశ్వరరావు, ప్రిన్సిపాల్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. తరగతి గదుల్లో, కారిడార్లో మంచినీటి సదుపాయాన్ని కల్పించడం లేదని, మంచినీటి కోసం క్యాంటీన్ వరకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువచ్చారు. -
కొల్లేరుపై సుప్రీంలో వాదనలు
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంపై సుప్రీంకోర్టులో బుధవారం వాడివేడిగా వాదనలు సాగాయి. కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదని, కొల్లేరు సరస్సులో అక్రమంగా చేపల చెరువుల సాగు జరుగుతోందని కాకినాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి మృత్యుంజయరావు 2004 సెప్టెంబరులో పిటిషన్ వేశారు. దీనిపై ఈ ఏడాది జనవరి 16న సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ ఆగస్టీ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్చంద్రన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులు గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేసి, కొల్లేరు ప్రజలకు అవగాహన కల్పించాలని, అక్రమ చేపల చెరువులను తొలగించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసు మార్చి 14న విచారిస్తామని పేర్కొంది. దీంతో ఈ నెల 19 వరకు ప్రభుత్వం గడువు కోరింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ నివేదిక అందించింది. సీఈసీ నివేదిక సమర్పించాలని ఆదేశం సుప్రీంకోర్టులో బుధవారం కొల్లేరు అంశంపై విచారణ కొనసాగింది. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు కుదించి మిగులు భూములు పంపినీ చేయాలని కొల్లేరు పరివాహక గ్రామాల ప్రజలు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు నివేదికలు పంపింది. వైల్డ్ లైఫ్ బోర్డు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)ని నియమించింది. సుకుమార్, అజీజ్ అనే రెండు కమిటీలు అభయారణ్య కుదింపు అంశంపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నివేదికలు సీఈసీకి అందించాయి. ఈ కమిటీల పూర్తి సారాంశాన్ని, కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యసాధ్యాలకు చేసిన సిఫార్సులను ఏప్రిల్ 2న సుప్రీంకోర్టుకు నివేదించాలని సీఈసీని కోర్టు ఆదేశించింది. 9,500 ఎకరాల్లో చెరువులకు గండ్లు కొల్లేరులో అక్రమ చేపల చెరువులు ఉన్నాయని అటవీశాఖ గతంలో సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. కొల్లేరులో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించమని, ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చెరువుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలని సుప్రీం సూచించింది. రెండు జిల్లాల్లో 18 వేల ఎకరాల చెరువులకు గండ్లు కొట్టాల్సి ఉండగా కోర్టుకు నివేదిక పంపించే సమయానికి 9,500 ఎకరాల చెరువులకు అటవీశాఖ గండ్లు కొట్టింది. దీంతో అనేక గ్రామాల్లో గ్రామస్తులు నిరసన తెలిపారు. ఏప్రిల్ 2న మరోసారి విచారణ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని పూర్తి నివేదిక కోరిన సుప్రీం అక్రమ చెరువుల ధ్వంసం వివరాలు అందించిన అటవీశాఖ -
బ్యాంకర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున రుణాలు అందించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు. జిల్లాలో 23,314 మంది సీసీఆర్సీ కౌలు రైతులకు ఇంతవరకు రూ. 142.85 కోట్లు అందించారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిసెంబరు వరకు రూ.6,639 కోట్ల స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు అందించారన్నారు. మార్చి చివరి నాటికి నూరుశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం సీడీ రేషియో ప్రమాణం కనీసం 60 శాతం ఉండాల్సి ఉండగా ఏలూరు జిల్లాలో ఇది 199 శాతంగా ఉండటం మంచి పరిణామమన్నారు. జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 90.63 కోట్లు విద్యా రుణాలుగా, రూ.618.63 కోట్లు హౌసింగ్ రుణాలుగా అందించారని వీటిని మరింత విస్తృతం చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ పి.పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎన్.శ్రీనివాస్, ఎల్డీఎం డి.నీలాద్రి, నాబార్డ్ డీడీఎం అనిల్ కాంత్, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, ఉధ్యానశాఖ డీడీ ఎస్.రామ్మోహన్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఇ పి.సాల్మన్ రాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు
ఏలూరు ఆర్అండ్బీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు(టూటౌన్) : కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు.. సుమారు రూ.300 కోట్ల బకాయిలు నిలిచిపోవడంతో జిల్లాలో వందల మంది కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఏలూరు నగరంలోని ఆర్అండ్బీ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని ఆగమేఘాల మీద రోడ్లపై గుంతలు పూడ్చితే.. నెలలు గడిచినా పట్టించుకోవడం లేదంటూ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. 700 మంది కాంట్రాక్టర్లకు బకాయిలు జిల్లాలో కాంట్రాక్టర్లు బకాయిల కోసం నిరసన గళం విప్పారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, బీఏఐ, ఎస్ఏబీఐ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారు రూ.300 కోట్ల బకాయిలున్నాయని, మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో నామినేషన్ ప్రాతిపదికన, ఇతర పనులు నిర్వహించినా బిల్లులు మంజూరు కాలేదు. జిల్లాలో ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల్లోని రూ.130 నుంచి రూ.150 కోట్ల పైచిలుకు, సోషల్ వెల్ఫేర్లో రూ.30 కోట్లు, జనరల్ ఫండ్ కింద పనులకు మరో రూ.30 కోట్లు, పంచాయితీరాజ్లో రూ.10 కోట్లు, విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అన్న క్యాంటీన్లు అన్ని కలిపి మరో రూ.20 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ఏలూరు నగరంలో జనరల్ ఫండ్ కింద నిర్వహించిన పనులకు రూ.12 కోట్లు, ఇరిగేషన్ రూ.25 కోట్లు, పంచాయతీరాజ్ బకాయిలు, ఏలూరు డివిజన్లో రూ.8 కోట్లు, ఆర్అండ్బీ పనులకు సంబంధించి రూ.40 కోట్లు, సోషల్ వెల్ఫేర్కు సంబంధించి రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 200 మంది కాంట్రాక్టర్లు, ఉభయగోదావరి జిల్లాలో 700 మంది కాంట్రాక్టర్లకు బకా యిలు రావాల్సి ఉంది. ఇలా అయితే కాంట్రాక్టర్లు పూర్తిగా అప్పులుపాలై రోడ్డునపడే పరిస్థితులుంటాయని, నిరర్ధక ఆస్తులు (ఎంపీఏ) చెక్కు బౌన్సులతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ చైర్మన్ సతీష్ చౌదరి తెలిపారు. తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వాపోయారు. నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించకపోతే భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పనికి టెండర్లు వేయబోమని స్పష్టం చేశారు. పది నెలలుగా బిల్లుల కోసం తిప్పలు ఏలూరు జిల్లాలో సుమారు రూ.300 కోట్ల బకాయిలు 20 ప్రభుత్వ శాఖల్లో నిలిచిన బిల్లులు